Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

“ ఆకలి ఒక తల్లి విపరీత చర్యకు పాల్పడేట్లు చేసింది, ఇది సామÖహిక వైఫల్యం ” ఈ వ్యాఖ్య చేసింది గుజరాత్ హైకోర్టు న్యాయమÖర్తి హెచ్‌డి సుతార్. ఆ తల్లిది పన్నెండు సంవత్సరాల క్రితం ఒక ఆదర్శంగా వర్ణించి, దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని అదే విధంగా మారుస్తానని వాగ్దానం చేసిన ప్రధాని నరేంద్రమోడీ స్వంతగడ్డ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2001 అక్టోబరు 15 నుంచి 2014 మే 22వ తేదీ వరకు పని చేశారు. ఆ కాలాన్ని గుజరాత్ స్వర్ణయుగంగా కొందరు పరిగణిస్తారు. భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో మోడీ రాకతో వచ్చిందన్న బిజెపి ఎంపీ కంగన రనౌత్ చెప్పిందాని ప్రకారం గుజరాత్‌కు 2001లోనే వచ్చింది. మోడీ తరువాత అదే బిజెపి నేతల ఏలుబడిలో ఉంది. మోడీ కేంద్రంలో ప్రధానిగా రెండింజన్ల పాలన సాగిస్తున్నారు. అలాంటి చోట ఒక తల్లి తన రెండు సంవత్సరాల కుమార్తె (బేటీ పడావో, బేటీ బచావో నినాదం ఇచ్చిన తరువాత) ఆకలి తీర్చలేక పోయింది. అసహాయతకు లోనై ఏడుస్తున్న పసికందు నోరు మÖయించేందుకు ఒక దెబ్బవేసింది. అపస్మారకంలోకి పోవటంతో స్వయంగా ఆసుపత్రికి తీసుకుపోయింది.ఫలితం లేక ఆ బేటీ మరణించింది. కూతుర్ని చంపిన నేరానికి ఏడు నెలల గర్భిణిగా ఉన్న తల్లిని జైల్లో పెట్టారు. బెయిలు కోసం దరఖాస్తు చేస్తే గుజరాత్ పోలీసులు వ్యతిరేకించారు. ఆ కేసులో హైకోర్టు విచారణలో న్యాయమÖర్తి ఆ తల్లికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు మీడియాలో పెద్దగా ప్రచారంలోకి రాలేదు, ఎందుకంటే అవి మోడీకే తగులుతాయి గనుక మÖసిపెట్టారు.

తనను దూషించిన జెన్ జి తరం యువతీ యువకులను క్షమిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. మోడీ గనుక అంత ఉదారత ప్రదర్శించారని దాన్ని కూడా ఆయన ప్రతిష్ట పెంచేందుకు ఉపయోగించిన వారిని దేశం చూసింది. అసలు క్షమాపణ చెప్పాల్సిన ప్రధానే క్షమించటం అనే విడ్డూరపు చర్యకు పాల్పడటం ఏమిటని కొందరు విమర్శించారు.కాసేపు దాని మంచి చెడ్డలను పక్కన పెడదాం. తన రాష్ట్రంలో ఒక తల్లి విపరీత చర్యకు పాల్పడిన పరిస్థితులను కల్పించిన తన పాలనతీరు తెన్నులకు ఆ తల్లి ఉదంతం మీద మోడీ ఎందుకు స్పందించలేదు అన్నది అసలు సమస్య. సామÖహిక వైఫల్యం అన్న న్యాయమÖర్తి వ్యాఖ్య ప్రకారం దానిలో నరేంద్రమోడీ భాగం లేదా ? ఫ్రధాని లేదా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర బిజెపి నేతలెవరూ ఏ మాత్రం స్పందించలేదు. జూలై 20న ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేసిన వారు నరేంద్రమోడీని వ్యక్తిగా దూషించటం తనను ఎంతో కలచివేసిందని చెప్పిన జనసేనాని పవన్ కల్యాణ్‌లో సైతం ఎలాంటి స్పందన లేదు. అవునులే మోడీ వేరు, సామాన్యులు వేరు. అసలు ఆ తల్లి అలాంటి చర్యకు ఎందుకు పాల్పడినట్లు ? మన సమాజంలో భార్య, తలిదండ్రులను గాలికి వదిలేసే పెద్ద మనుషులను, అసలు తమకు వివాహమైనట్లే తెలియకుండా దాచేవారిని చూస్తున్నాము. సూరత్ ప్రాంతానికి చెందిన లఖీ సోలంకి ఇద్దరు బిడ్డల తల్లి, ఏడు నెలల గర్భంతో ఉంది. భర్త సముద్రం మీద పని చేసేందుకంటూ ఆరునెలల క్రితం ఆమెకు ఎలాంటి ఆదరువు చూపకుండా వెళ్లిపోయాడు. అతడు తిరిగి వస్తాడో రాడో తెలియదు,కడుపుతో ఉన్న ఆమెకు అవసరమైన ఆర్థిక ఏర్పాట్లు కూడా లేవు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఇలాంటి స్థితిలో వివాహ బంధం లేకుండా మైత్రీ ఖరారు ఒప్పందంతో ఆమె ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఈ క్రమంలో ఆకలికి తాళలేక బిడ్డ ఈషా ఏడ్పులను తట్టుకోలేక 2026, మార్చినెల 19 తేదీన చేయిచేసుకుంది. ఈ ఉదంతం న్యాయమÖర్తి వ్యాఖ్యానించినట్లుగా దిక్కులేని కుటుంబాలు, వ్యక్తులు, వారి దారిద్య్రం, ఆకలి పట్ల సమాజ, ప్రభుత్వ చేతలు ఏమిటనే ప్రశ్నలను ముందుకు తెచ్చింది. ఏ ఇథియోపియానో, మరో ఆఫ్రికన్ దేశంలో ఈ ఉదంతం జరిగిందంటే అర్ధం చేసుకోవచ్చు.దేశం మొత్తం మీద సంపదలు కలిగిన ధనికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం గుజరాత్. విలువలు, వలువలు ఉన్నాయని చెప్పుకొనే సంఘపరివార్‌కు ఎంతో పట్టున్న ప్రాంతం.

లఖీ సోలంకి ఉదంతాన్ని ఒక వ్యక్తి విషాదంగా చూడటానికి లేదు. దుర్భరదారిద్య్రంలో నివసిస్తున్న వారి రక్షణకు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాల వ్యవస్థ వైఫల్యానికి ప్రతిబింబం అని కోర్టు వ్యాఖ్యానించింది. బిజెపి చెప్పే రెండింజన్ల పాలనలో ఉన్న గుజరాత్ ప్రభుత్వానికి ఈ వ్యాఖ్య చెంపపెట్టు. తల్లి కొట్టిన దెబ్బలకే రెండేండ్ల కూతురు మరణించినట్లు పోస్టు మార్టం నివేదికలో చెప్పినందున ఇది చాలా తీవ్రమైన నేరం అంటూ పోలీసులు లఖీకి బెయిలు ఇవ్వరాదని వాదించారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. ఆమే స్వయంగా అపస్మారకంతో ఉన్న తన కుమార్తెను ఆసుపత్రికి తీసుకువెళ్లిందని, చంపాలనే ఉద్దేశ్యం ఆమెకు లేదని కోర్టు చెప్పింది. తన కుమార్తె ఆకలిని తీర్చలేక వత్తిడికిలోనై బాధ్యతారహితంగా వ్యవహరించిందని కూడా వ్యాఖ్యానించింది. ఆ కుటుంబం దీర్ఘకాలం పాటు దారిద్య్రం, ఆకలికి లోనైందని పేర్కొన్నది. ఇంకా ఇలా చెప్పింది. ఈ కేసును కేవలం ఒక నేర అంశంగా చూడకూడదు. పేదల పట్ల సమాజ బాధ్యతను గుర్తు చేసింది. పుట్టుకతోనే ఎవరూ నేరగాండ్లు కాదు.దారిద్య్రం, ఆకలి అలాంటి తీవ్ర పరిస్థితులవైపు నెట్టేధంగా పరిస్థితిని కల్పిస్తాయి.ఇది కేవలం ఒక వ్యక్తిది మాత్రమే కాదు సమాజ వైఫల్యం. సంక్షేమ పథకాల యంత్రాంగాల లోపాలు మరియు తీవ్ర కష్టాల్లో ఉన్న మహిళలు, పిల్లలను ఆదుకోవాల్సిన రాజ్యం యొక్క రాజ్యాంగ బాధ్యతలను కూడా ఎత్తి చూపింది.

ఈ సందర్భంగా న్యాయమÖర్తి సుతార్ ఆకలి, దారిద్య్రం, న్యాయం మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేందుకు అనేక సాహిత్య, తత్వశాస్త్రాలు,మత గ్రంధాలు చెప్పిన అంశాలను ప్రస్తావించారు. ఆకలి తప్ప మానవుడు దుర్మార్గుడు కాదు అని సందేశమిచ్చిన గ్పుురాతీ రచయిత పన్నాలాల్ పటేల్ నవల, తన కుటుంబ ఆకలి తీర్చేందుకు ఒక వ్యక్తి రొట్టెను అపహరించిన ఇతివృత్తంతో రచన చేసిన విక్టర్ హ్యూగో, దుర్భర దారిద్య్రం జనాలను నేరాలవైపు ఎలా నెడుతుందో చెప్పిన చార్లెస్ డికెన్స్ రచనలను ప్రస్తావించారు. విప్లవాలు, నేరాలకు జన్మనిచ్చేది దారిద్య్రం అన్న గ్రీకు తత్వవేత్త అరిస్టోటిల్ చెప్పిన అంశాన్ని ఉటంకించారు.వివిధ మత గ్రంధాలు ఆకలిగొన్నవారికి అన్నం పెట్టాలనే నీతి బోధనలను కూడా ప్రస్తావించారు. తినే ముందు ఆహారాన్ని ఇతరులతో పంచుకుంటే పాపాల నుంచి విముక్తి అవుతారని భగవద్ గీత, ఆకలితో ఉన్న నాకు ఆహారాన్ని ఇవ్వు అన్న బైబిల్‌లోని ఏసుక్రీస్తు మాటలు, పొరుగువారు ఆకలితో ఉండగా కడుపునిండా తిని పడుకుంటే అలాంటి వారు నిజమైన విశ్వాసులు కాదన్న ఇస్లామిక్ బోధనలను ఉటంకించారు. కొంత మంది ఆకలితో ఇబ్బంది పడుతుంటే అది కేవలం సామాజిక వైఫల్యం మాత్రమే కాదు నైతిక, ఆధ్యాత్మిక వైఫల్యం కూడా అవుతుందని జస్టిస్ సుతార్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 45లో పేర్కొన్నట్లుగా పసితనంలో పిల్లల సంరక్షణ, విద్య రాజ్యం బాధ్యత అని కూడా న్యాయమÖర్తి చెప్పారు. అవి పిల్లల ప్రాధమిక హక్కులన్నారు. పౌష్టికాహారం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచటం రాజ్యాంగ బాధ్యత అని వాటిని నెరవేర్చటంలో వైఫల్యం చెందినట్లు లఖీ సోలంకి కేసు వెల్లడించిందన్నారు. ఆకలిగొన్న వ్యక్తి ముందు రొట్టెను కోరతారు తప్ప వేదాంతాన్ని కాదనే మాటతో న్యాయమÖర్తి బెయిల్ ఉత్తరువును ముగించారు.

ఈ కేసు రెండింజన్ల పాలన, గుజరాత్ ఆదర్శ రాష్ట్రం అనే ప్రచార బండారాన్ని బట్టబయలు చేసింది.బిజెపి ఏలుబడిలో నెలకొన్న పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం అవసరం.ప్రతి ఏటా దేశాల ఆకలి సూచికలను ప్రకటిస్తున్నారు.మన దేశానికి ఇస్తున్న సూచికలను మేం అంగీకరించం అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది, పోనీ స్వంత సూచికలను వెల్లడిస్తున్నదా అదీ లేదు. ప్రపంచ ఆకలి సూచిక 2022లో మనదేశం 121 దేశాలలో 107వదిగా ఉంది. మనకంటే ఎగువన నైజీరియా 103, పాకిస్తాన్ 99వ స్థానంలో ఉంది. ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్న నరేంద్రమోడీ సర్కార్ అంటూ డబ్బా కొట్టుకుంటున్న తరుణలో ఈ సూచిక వెలువడింది. తరువాత 2025లో 123 దేశాల్లో 102వదిగా ఉంది. అతల్ బిహారీ వాజ్‌పేయి ఏలుబడి 2000 సంవత్సరంలో నూటికి మన మార్కులు 38.1, తరువాత 2008లో 34.6, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2016లో 29.3, పదకొండు సంవత్సరాల పాలన తరువాత 2025లో 25.8 పాయింట్లు వచ్చాయి. ప్రపంచ సూచికల ప్రకారం 10 పాయింట్లలోపు ఉన్న దేశాల్లో తక్కువ ఆకలి, పది నుంచి ఇరవై పాయింట్ల మధ్య ఉంటే కాస్త మెరుగు, ఇరవై నుంచి 35 పాయింట్ల మధ్య ఉంటే తీవ్రం, 3550 మధ్య ఉంటే ఆందోళనకరం, అంతకు మించి ఉంటే మరింత ఆందోళనకర జాబితాలుగా దేశాలను వర్గీకరించారు. పన్నేండ్ల స్వర్ణయుగ పాలన తరువాత మనదేశం మÖడవ తరగతిలో అంటే తీవ్ర ఆకలి ఉన్న దేశంగా ఉంది.


హరిత విప్లవం తరువాత విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొనే స్థితి నుంచి ఎగుమతి చేస్తున్నాం. అయితే జనం కడుపునిండా మÖడుపూటలా తింటే ఎగుమతికి అవకాశం ఉండదు. అలాంటి స్థితి లేని కారణంగానే మన దేశంలో “ కనిపించని ఆకలి ” ఉందని అనేక మంది వర్ణిస్తున్నారు. ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నట్లు గొప్పగా చెప్పుకున్నప్పటికీ, పోషకాహార లేమిని అంగీకరిస్తూ పోషణ్ అభియాన్ పేరుతో కేంద్రం ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. అయినప్పటికీ మన దేశం 2025 ప్రపంచ ఆకలి సూచికలో 123 దేశాలకు గాను 102వదిగా ఉంది, మనకంటే మరో 21 ఇంకా దరిద్రంలో ఉన్నాయి. దున్నబోతే దూడల్లో మెయ్యటానికి వచ్చేసరికి ఎద్దుల్లో అన్నట్లుగా బిజెపి వ్యవహారం ఉంది. రాజకీయంగా మాకు తిరుగులేదు అని చెప్పుకొనేందుకు మెజారిటీ రాష్ట్రాలలో తాము లేదా మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నాయని, తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమదే ఆధిపత్యం అని బిజెపి చెప్పుకుంటుంది.మరి దాని పాలిత రాష్ట్రాలు మానవాభివృద్ధి సూచికల్లో అధోగతిలో ఎందుకు ఉన్నట్లు ? పన్నేండేండ్ల మోడీ స్వర్ణయుగ పాలన తరువాత దేశంలో ఉన్న పరిస్థితుల గురించి చూద్దాం.


జనాభాయే మనకు పెద్ద పెట్టుబడి అని నేతలు కబుర్లు చెబుతారు.దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ ఎప్పుడో చెప్పారు. మన మనుషులు ఎలా ఉన్నారు ? ఉన్న సమాచారం, అంచనాల ప్రకారం పైన చెప్పిన ఉచిత ధాన్యం, పోషణ్ కార్యక్రమం అమలు తరువాత కూడా దేశంలో 12శాతం మంది అంటే 17.2 కోట్ల మందికి పోషకాహారం లేదు. భావి భారత పౌరులుగా ఉండాల్సిన పిల్లల్లో ఐదేండ్ల లోపువారిలో 35శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు పెరగటం లేదు, అంటే వారికి పోషకాహారం లేదు. ఎత్తుకు తగ్గ బరువులేని వారు 18.7శాతం మంది ఉన్నారు, ఇలాంటి వారు ఎక్కువగా ఉన్న దేశాలలో మనది ఒకటి. ఒకవైపు పరిస్థితి ఇలా ఉండగా మరోవైపు అధిక బరువు, ఊబకాయం సమస్య కూడా పెరుగుతున్నది. ఆకలి జబ్బు కొందరికైతే అధిక తిండి మరో జబ్బు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే5 ప్రకారం పిల్లలు 67.1శాతం, 59.1శాతం మంది తరుణ వయస్సులో ఉన్న బాలికలు రక్తహీనతతో ఉన్నారు. పిల్లలను కనే వయస్సులో ఉన్న మహిళల్లో సగం మంది రక్తహీనతతో ఉన్నారు.ఇది కనిపించని ఆకలికి ఒక సూచిక అని చెప్పవచ్చు. ప్రపంచ ఆహార మరియు పోషకాహార ప్రపంచ స్థితి నివేదిక 2025లో చెప్పినదాని ప్రకారం మన దేశంలో 40.4శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేసే శక్తి లేదు.అరవై శాతం మంది పట్టణ జనాభాకు ప్రొటీన్ల లోపం ఉంది. రెండు భారతాల దృశ్యం కనిపిస్తున్నది. ఒకటి పోషకాహారం లేని వారు, ఊబకాయం, అవసరానికి మించి బరువు పెరుగుల ఒక విచిత్రమైన స్థితి. మొత్తం మరణాల్లో అంటు వ్యాధులు కాని గుండె,మధుమేహం, కాన్సర్, శ్వాసకోశ సమస్యలతో మరణిస్తున్నవారు 6365శాతం మంది ఉన్నట్లు అంచనా.


నరేంద్రమోడీ ప్రత్యక్ష పాలనలో, ప్రధానిగా పని చేస్తున్న కాలంలోనే పైన చెప్పుకున్న లఖీ సోలంకి ఉదంతం జరిగింది. ఆమెకు సంక్షేమ పథకాలు అంది ఉంటే ఇంట్లో ఆహార సమస్య వచ్చి ఉండేది కాదు, బిడ్డను చేతులారా పొగొట్టుకొనేది కాదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఇతర వనరుల నుంచి సేకరించిన సమాచారం మేరకు రాష్ట్రాల ఆకలి సూచికలను కూడా తయారు చేశారు. దేశాల సూచికల మాదిరే వంద మార్కులకు వచ్చిన వాటిని బట్టి వర్గీకరణ అదే మాదిరి చేశారు. దేశ జాతీయ సగటు మార్కులు 29 తీవ్ర ఆందోళనకరంగా ఆకలి ఉన్న రాష్ట్రాలు అంటే 35 కంటే ఎక్కువగా ఉన్నవాటిలో బీహార్,ఝార్కండ్, చత్తీస్‌ఘర్ ఉన్నాయి. ఇవి బిజెపి లేదా వారి మిత్రుడైన నితీష్ కుమార్ ఏలుబడిలో ఉన్నవే అని వేరే చెప్పనవసరం లేదు. దేశ సగటు 29 కంటే ఎక్కువ ఆకలి ఉన్నవాటిని ఆందోళనకర వర్గీకరణలో చేర్చారు, అవి గుజరాత్, ఉత్తర ప్రదేశ్, అసోం, ఒడిషా, మధ్య ప్రదేశ్, త్రిపుర, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్. ఒక మాదిరి అంటే 16 కంటే తక్కువ మార్కులు వచ్చిన సిక్కిం, పుదుచ్చేరి, కేరళ వంటివి ఉన్నాయి. తక్కువ ఆకలి ఉన్నది పన్నెండు కంటే తక్కువ వచ్చింది ఒక చండీఘర్ కేంద్ర పాలిత ప్రాంతమే. ఇలాంటి పరిస్థితి ఉన్నపుడు బిజెపి లేదా మోడీ దేశాన్ని పరుగులు పెట్టిస్తామంటే నమ్మేదెలా !