• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: History

అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!

22 Wednesday Jul 2026

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

2026 US Elections, Amazon Labor Union (ALU)., anti china, Anti communist, China, Democratic party, Democratic Socialist Party, Donald trump, Leftist Zohran Mamdani, Republican party, Trump’s election meddling

ఎం కోటేశ్వరరావు


“ వీరు సోషల్ డెమోక్రాట్లు (సామాజిక ప్రజాస్వామిక వాదులు) కాదు, కరుడు గట్టిన దేవుడులేని కమÖ్యనిస్టులు, వారు అన్ని మతాల మీద దాడులు చేస్తారు, ప్రత్యేకించి క్రైస్తవం మీద, వారెప్పుడూ అదే చేస్తారు,అదొక పిచ్చి వంటిది, ఈ దేశంలో మీ చర్చీలన్నింటినీ మÖసివేస్తారు. మీ వారిని చంపివేస్తారు, ఏదనుకుంటే అది చేస్తారు. వారు మతాన్ని అంతం చేయాలనుకుంటున్నారు.మీకు బలమైన మతం ఉంటే వారి సిద్దాంతం పనిచేయదు గనుక వారు మతాన్ని అంతం చేయాలనుకుంటారు.రెండువందల యాభై సంవత్సరాల క్రితం మన దేశ స్థాపన జరిగిన తరువాత నా అభిప్రాయం ప్రకారం మనదేశానికి వచ్చిన ముప్పు ఇది.” ఈ మాటలు మాట్లాడింది అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్‌ట్రంప్ అనే ఒక కమÖ్యనిస్టు వ్యతిరేక ఉన్మాది. గతవారంలో దేశ ప్రజల నుద్దేశించి ఇరవై నిమిషాలపాటు టీవీలో చేసిన ప్రసంగంలో ఇలాంటి పాటు అనేక చెత్త మాటలు అతని నోటి నుంచి వచ్చాయి. ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా కమÖ్యనిస్టులు గతంలో జోక్యం చేసుకున్నారని ఇప్పుడు మధ్యంతర ఎన్నికల్లో అదే పని చేస్తున్నారని ఆరోపించాడు. ఐతే ఐదు రోజుల తరువాత మంగళవారం నాడు మాట మార్చాడు. చైనా జోక్యం ఎంతో కాలం క్రితం జరిగింది, అప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది. అయినా చైనా వారు ఏది చేస్తే మేమÖ అదే చేస్తున్నాం, ఇదేదో ఏకపక్షంగా జరుగుతున్నది కాదు అని ట్రంప్ అన్నాడు. ఆధారాలు లేని తీవ్ర ఆరోపణలు చేసినందున చైనా నుంచి వచ్చే ప్రతిస్పందనకు భయపడి ఈ పెద్దమనిషి వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. నోటికి ఏది వస్తే అది వాగటం తరువాత మరోవిధంగా మాట్లాడటంలో ప్రపంచ నేతల్లో ట్రంప్‌కు మరొకరు సాటి రారని ఇప్పటికే నిరూపించుకున్నాడు. నవంబరు మÖడవ తేదీన జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో జనం ఏ తీర్పు ఇస్తారో తెలియదుగానీ, అధికార రిపబ్లిన్లకు ఎదురుదెబ్బ తగిలి ఉభయ సభల్లో మెజారిటీ కోల్పోతే దానికి కారణం చైనీయులే అని చెప్పేందుకు ముందుగానే ఒక సాకు సిద్దం చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ ఎప్పటికైనా చైనాలో విలీనం కావాల్సిందే. అక్కడ ప్రత్యేక దేశమా, విలీనానికి అనుకూలమా అనే ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయి. ఒకే భాష, ఒకే జాతి అయిన అక్కడే అలాంటి పని చేయని చైనా ఎక్కడో సుదూరంగా ఉండి, తమ భాష అర్ధంగానీ అమెరికాలో డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఏ భాషలో ప్రచారం చేస్తుంది ? అయినా చైనా చెప్పగానే అమెరికన్లు మారేట్లయితే ఏకంగా కమÖ్యనిస్టులనే ఎన్నుకోవాలని ప్రచారం చేయవచ్చు కదా ! చరిత్రలో మతోన్మాదులు తమ వ్యతిరేక మత కేంద్రాల మీద దాడులు చేశారు, కూలగొట్టిన చరిత్రను మÖటగట్టుకున్నారు.మన కళ్ల ముందే బాబరీ మసీదును కూల్చి అక్కడే రామాలయాన్ని నిర్మించారు. కమÖ్యనిస్టులు వస్తే ప్రార్ధనా మందిరాలను కూల్చివేస్తారన్నది తప్పుడు ప్రచారం. రష్యా, చైనా, తూర్పు ఐరోపా దేశాలలో ఒక్క చర్చీని కూడా కూల్చివేయలేదు. గతంలో, వర్తమానంలో చైనా అలాంటి జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. భవిష్యత్‌లో జరిగేందుకు ఆస్కారమÖ లేదు. అయినప్పటికీ ట్రంప్ అలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు !


అమెరికా ఎన్నికల్లో కమÖ్యనిస్టులు లేదా ఇతర పురోగామివాదులు ఒక పార్టీగా అక్కడ పాతుకుపోయిన రెండు ప్రధాన పార్టీలను దెబ్బకొట్టగలిగిన స్థితిలో లేరు అన్నది ఒక వాస్తవం.రెండవది, గత కొన్ని దశాబ్దాలుగా కమÖ్యనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టి జనాల బుర్రలను ఖరాబు చేసిన సంగతి కూడా తెలిసిందే. గతంతో పోలిస్తే కొంత మార్పు వచ్చిన్పటికీ అది చాలదు.మన దేశ స్వాతంత్య్ర ఉద్యమ దశ, దిశను మార్చేందుకు పురోగామి వాదులు అనేక మంది కాంగ్రెస్ సోషలిస్టులుగా ప్రత్యేకతను ప్రదర్శిస్తూ కాంగ్రెస్‌లో అంతర్బాగంగానే పని చేసిన చరిత్ర తెలిసిందే.అమెరికాలో కూడా అదే జరుగుతున్నట్లు చెప్పవచ్చు. అయితే అక్కడి డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీలో ఉన్నవారందరూ సోషలిజానికి, కమÖ్యనిజానికి అనుకూలురని చెప్పలేము. ఆ భావజాలానికి కట్టుబడి పని చేయాలని కోరుకొనే వారు కూడా గణనీయంగా ఉన్నారు. చివరి వరకు ఎంత మంది నిఖరంగా నిలుస్తారు, నిలవరు అనేది చరిత్ర చెప్పాల్సిందే.సోషలిస్టు భావాలను కలిగిన రెండు సంస్థలు, కొందరు వ్యక్తులు 1982లో డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీగా(డిఎస్‌పి) ఏర్పడి డెమోక్రటిక్ పార్టీలోనే పని చేయటం ప్రారంభించారు.నాడు కొన్ని వందల మంది మాత్రమే సభ్యులుగా ఉండగా నేడు లక్షా పదివేల మంది వరకు ఉన్నట్లు అంచనా. సోషలిస్టులమని చెప్పుకొనేందుకే భయపడిన రోజుల నుంచి నేడు లక్షలాది మంది తామÖ అదే ఇస్టులమని గర్వంగా చెప్పుకొనేంతంగా ఆ ఉద్యమం ఎదిగింది. బెర్నీ శాండర్స్ సెనెటర్‌గా ఎన్నికతో ప్రారంభమైన ఆ పురోగమనం 2028ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో గవర్నర్ పదవుల కోసం, మరో రెండు చోట్ల గట్టి పోటీ ఇచ్చేందుకు, అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున తమ భావజాలం ఉన్న వ్యక్తిని నిలిపేందుకు అడుగులు వేయటమే ట్రంప్ ఆందోళనకు అసలు కారణంగా చెప్పవచ్చు. అమెరికా కార్పొరేట్ల రాజధాని న్యూయార్క్ పీఠంపై ఇప్పటికే ట్రంప్ దృష్టిలో కమÖ్యనిస్టుగా ముద్రపడిన డిఎస్‌పి నేత జోహ్రాన్ మందానీ మేయర్‌గా ఉండగా, రాజకీయ అధికార కేంద్రం ఉన్న వాషింగ్టన్ డిసిలో అదే భావజాలం కలిగిన మహిళ మేయర్ కాబోతున్నారనే వార్తలు వచ్చాయి. న్యూయార్క్ నగరంలో మÖడు ఎంపీ స్థానాలుండగా వాటికి డెమోక్రాట్లలో డిఎస్‌పి అభ్యర్ధులే ముందువరుసలో ఉన్నారు. రాజకీయ సర్వే జరపాలని, సెప్టెంబరు 15 నాటికి నివేదిక సమర్పించాలని డిఎస్‌పి తన 250శాఖలకు పత్రాలను పంపింది. ఇదంతా అధ్యక్ష ఎన్నికలకు సన్నాహమే. ఆ పార్టీ సెనెటర్ బెర్నీ శాండర్స్ వయస్సు 84 సంవత్సరాలు కావటంతో వేరే వారిని రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. కార్మిక నాయకురాలు, ప్రజాప్రతినిధుల సభ సభ్యురాలిగా ఉన్న అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వంకోసం పోటీపడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున తానే పోటీ చేయాలని డోనాల్డ్ ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.


జూలై 16న టీవీ ప్రసంగం తీరు చూసిన తరువాత తన పదవికోసం ట్రంప్ ఎంతకైనా తెగిస్తాడని అనేక మంది భావిస్తున్నారు.నవంబరు మÖడు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లను బెదిరించేందుకు మిలిటరీని దించటంతో పాటు(ఇప్పటికే చికాగో, లాస్ ఏంజల్స్, వాషింగ్టన్ డిసి, తదితర నగరాల్లో ఉన్నాయి), ఓట్ల పెట్టెలను అపహరించటంతో సహా ఏ అక్రమానికైనా పాల్పడవచ్చని చెబుతున్నారు.రిపబ్లికన్లు ఓడిపోతే ఫలితాలను తిరస్కరించే అవకాశం కూడా ఉంది.2020 అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోతున్నట్లు గ్రహించి బ్యాలట్ బాక్సులను తారుమారు చేయాలని చూస్తే అతగాడి అధికార యంత్రాంగంలోని వారే అడ్డుపడటంతో వెనక్కు తగ్గాడు. తరువాత జోబైడెన్ ఎన్నికను గుర్తించకుండా తన అనుచరులతో అమెరికా అధ్యక్ష కేంద్రం మీద దాడి చేయించిన సంగతి తెలిసిందే.తన ప్రసంగంలో రహస్య పత్రాలంటూ కొన్నింటిని పేర్కొంటూ రష్యా, చైనా,ఇరాన్, ఉత్తర కొరియా దేశాల నుంచి, కొన్ని సంస్థలు ఎన్నికల్లో జోక్యం చేసుకొనేందుకు చూస్తున్నాయని ట్రంప్ ఆరోపించాడు.అయితే ఎలా అన్నది మాత్రం చెప్పలేదు.తెలుగునాట ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ల పట్ల వ్యవహరించిన తీరును చూశాము.ప్రజాస్వామ్యానికి, భావప్రకటనా స్వేచ్చకు నిలయమని ఊదరగొట్టే అమెరికాలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఎవరి అజెండా వారికి వుంది.తనకు వ్యతిరేకంగా ఎబిసి మరియు ఎన్‌బిసి మీడియా సంస్థలు కుట్రలో భాగస్వాములని,తన ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేయటం లేదని ట్రంప్ ఆరోపించాడు.వాటి లైసన్సు రద్దు చేస్తామని బెదిరించాడు. మధ్యంతర ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్ ఇరాన్ను ఒక అంశంగా ఎంచుకున్నాడు. సోవియట్‌తో జరిగిన ప్రచ్చన్న యుద్దంలో అణుబూచిని చూపి ఓటర్లను ఆకట్టుకోవటం నాటి అజెండాలలో ఒకటి. టెహరాన్ విషయంలో అది తిరగబడింది.దాని బదుదలు అనూహ్యంగా హార్ముజ్ జలసంధిపై అదుపు ప్రతిష్టాత్మకంగా మార్చుకొని ఇరుక్కు పోయాడు.రెండవది పాతబడిన రోత ప్రచారం కమÖ్యనిస్టు వ్యతిరేకత, సోవియట్ లేదు గనుక దాని స్థానంలో చైనా కుట్ర అంటూ రెచ్చగొట్టటం.చిత్రం ఏమిటంటే అమెరికాలో కమÖ్యనిస్టు పార్టీ ఉన్నప్పటికీ అది అక్కడి పాలకపార్టీలను సవాలు చేసే స్థితిలో లేదు. అందుకే డెమోక్రటిక్ సోషలిస్టులను కమÖ్యనిస్టులుగా చిత్రించి ట్రంప్ దాడి చేస్తున్నాడు.అయితే వారంతా తమ కళ్ల ముందు కనిపించేవారు గనుక వారి నుంచి ముప్పు ఎలా వస్తుందో నమ్మించలేకపోతున్నాడు. నిజానికి సాధారణ అమెరికన్లకు ముప్పుగా మారింది “ దేవుడు లేని కమÖ్యనిస్టులు ” కాదు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ దళం(ఐసివి). వారిని చూస్తే జనాలు వణికిపోతారు.ఎవరిని అరెస్టు చేస్తారో, ఎవరిని చంపుతారో తెలియదు. హిట్లర్ నాటి రహస్య హంతక దళాలను అవి గుర్తుకు తెస్తాయి.రెండవసారి ట్రంప్ అధికారానికి వచ్చిన తరువాత ఐసిఇ లేదా సరిహద్దు నిఘా దళానికి చెందిన వారు బూటకపు ఎన్‌కౌంటర్లు చేసి పదకొండు మందిని చంపారు.వీరుగాక వలస వచ్చిన వారిని బంధించిన శిబిరాల్లో మరో 21మంది మరణించారు.


అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నట్లు చేసిన ఆరోపణలను చైనా గట్టిగా తిరస్కరించింది. ప్రతిపక్ష డెమోక్రాట్ల చేతిలో ఓటమిని ఎదుర్కోలేక గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు తిప్పి కొట్టింది.ఇరవై రెండు కోట్ల మంది ఓటర్ల వివరాలను చైనా సంపాదించిందని, గతంలో అధికారానికి వచ్చినప్పటి నుంచీ అమెరికా మీడియాలో తనకు వ్యతిరేకంగా రాసేందుకు జర్నలిస్టులకు డబ్బు ఇస్తున్నదని, వాణిజ్యవేత్తలను తనకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నదని ట్రంప్ తాజా ప్రసంగంలో ఆరోపించాడు.చైనా వాణిజ్యాన్ని సవాలు చేసిన తొలి అధ్యక్షుడిగా తాను ఉన్నందుకు గాను 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూడా చైనా జోక్యం చేసుకున్నదని అదే ఏడాది భద్రతా మండలికి ట్రంప్ ఫిర్యాదు చేశాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న చైనా ప్రతినిధి రుజువులు చూపాలంటూ సవాలు చేశాడు, ఎలాంటి ఆధారాలను అమెరికా చూపలేకపోయింది. మే నెలలో బీజింగ్ పర్యటనకు వెళ్లిన ట్రంప్ ఆహ్వానం మేరకు సెప్టెంబరులో చైనా నేత షీ జింపింగ్ అమెరికా పర్యటనకు వస్తారని చెబుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు ట్రంప్ నోటి నుంచి వెలువడటం అతగాడి సంస్కారాన్ని వెల్లడిస్తున్నది.


వామపక్షవాదాన్ని, దాన్ని అనుసరించేవారిని అణచివేసేందుకు అమెరికా పాలకులు ఎన్ని పద్దతులను అనుసరించారో దానికి ప్రతిగా వామపక్ష వాదులు కూడా పద్దతులను మార్చుకొని తమ భావజాలాన్ని విస్తరింప చేస్తున్నారు.దాన్ని అడ్డుకోవటం సాధ్యం కావటం లేదు. దేనికైనా పరిస్థితులు అనుకూలించాలి. సైద్దాంతిక విబేధాలు, భిన్నమైన భాష్యాలు చెప్పి ఉండవచ్చు తప్ప కమÖ్యనిజం విఫలమైందని గతంలో ఏ కమÖ్యనిస్టూ పార్టీ కూడా చెప్పలేదు. ఆ ఉద్యమం నుంచి దూరమైనవారు చెప్పేదాన్ని పట్టించుకోవనవసరం లేదు. దానికి భిన్నంగా పెట్టుబడిదారీ విధానం విఫలమైందని ఆ విధానాన్ని సమర్ధించేవారే చెప్పటం ఇటీవలి కాలంలో వచ్చిన మార్పు. ఇది మరోచర్చకు నాంది పలికింది. అనేక మంది కారల్ మార్క్స్`ఫ్రెడరిక్ ఎంగెల్స్ చేసిన కమÖ్యనిస్టు రచనలు, భాష్యాల గురించి అధ్యయనం చేసేందుకు పూనుకున్నారు. అమెరికాలో గతం మాదిరి కరడు గట్టిన సోషలిస్టు వ్యతిరేక భావనలు ఇప్పుడు లేవు. సోషలిజం, కమÖ్యనిజాలను సానుకూలంగా చూసే ఏ వాదమైనా వామపక్షభావజాలమే అవుతుంది.దాన్నే కమÖ్యనిజం అని ట్రంప్ వంటి వారు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. పుంఖాను పుంఖాలుగా రచనలు చేస్తూ భావజాల దాడులు చేస్తున్నారు.ఇటీవల ఒక అమెరికా పత్రిక “ సోషలిస్టులను చూసి భయపడవద్దు.వారిని తయారు చేసే పరిస్థితులను చూసి భయపడాలి ” అంటూ ఒక విశ్లేషణకు శీర్షిక పెట్టింది.చరిత్ర చెప్పిన సారం, కమÖ్యనిస్టులు చెప్పేది కూడా అదే.కమÖ్యనిస్టు వ్యతిరేకులు రకరకాల ముసుగులు వేసుకువస్తున్నారు.అమెరికాలో జరుగుతున్న పరిణామాల గురించి ఆంధ్రా అల్లుడు, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ రెండు సంవత్సరాల క్రితం ఒక వ్యాఖ్య చేశాడు.“ గతంలో కమÖ్యనిస్టులు వీధుల్లో ఎర్రజెండాలు పట్టుకొని ప్రదర్శనలు చేశారు.ఈ రోజు వారు హెచ్ ఆర్, కళాశాలల ప్రాంగణాలలో ప్రదర్శనలు చేస్తున్నారు, మంచివారు, నిజాయితీపరులకు వ్యతిరేకంగా కోర్టు హాళ్లలో న్యాయపోరాటం చేస్తున్నారు.” అన్నాడు.తెలివితేటలు ఎవడబ్బ సొమ్ము కాదు, కమÖ్యనిస్టులు కూడా నూతన పద్దతులను నేర్చుకోవాల్సిన పరిస్థితులను దోపిడీ వర్గమే కల్పించింది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !

15 Wednesday Jul 2026

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

#US Lies, 2026 US Attack Iran, 2026 US Elections, Donald trump, Hormuz mission

ఎం కోటేశ్వరరావు

ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తోంది గనుక నిరోధించేందుకు తాము దాడులకు దిగినట్లు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మార్చినెల ప్రారంభంలో ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశాడు. అంతకు ముందు 2025లో కూడా దాడులు చేసి అణు స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మరోసారి ఎనిమిది నెలలకే దాడులకు దిగాడు. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ఇరాన్‌పై దాడులతో ట్రంప్ రేపిన చిచ్చును ఆరనివ్వకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు.జూలై 11న మరోసారి ప్రారంభమైన దాడులుప్రతిదాడులు గురువారం నాడు కూడా కొనసాగుతూనే ఉన్నట్లు వార్తలు. బుధవారం నాడు పరిస్థితిని సమీక్షించిన ట్రంప్, మంత్రులు, ఉన్నతాధికారులు దాడులను మరింత పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించారు. మిత్రదేశాల వినతి మేరకు హార్ముజ్ జలసంధిలో రాకపోకలు జరిపే నౌకల్లోని వస్తువుల విలువలో 20శాతం పన్ను వసూలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు ట్రంప్ చెప్పాడని వార్తలు వచ్చాయి.అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి కుట్రలకు వ్యతిరేకంగా 2022 ఫిబ్రవరిలో రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఇంకా ముగియలేదు. ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చి పశ్చిమదేశాలు ఇంకా ఎగదోస్తూనే ఉన్నాయి.గత శతాబ్దిలో ఎనిమిది సంవత్సరాల పాటు ఇరాన్ఇరాక్ యుద్దం జరిగింది.అమెరికా తీరుతెన్నులు చూస్తుంటే ప్రస్తుత సంక్షోభం కూడా వాటి సరసన చేరుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కనీసంగా అమెరికా పార్లమెంటుకు నవంబరు మÖడవ తేదీన జరిగే ఎన్నికలు ముగిసేవరకైనా రిపబ్లికన్ పార్టీ ఓట్ల కోసం ట్రంప్, అక్టోబరు నెలలో ఇజ్రాయెల్‌లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తన పార్టీని గెలిపించేందుకు నెతన్యాహు లెబనాన్ మీద దాడులను కొనసాగించే వైఖరి కనిపిస్తోంది. ఈ ఇద్దరు నేతల దుర్మార్గాలకు ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు పడుతూ లేస్తూ మనవంటి దేశాలలో సామాన్యులను నానా ఇబ్బందులు పెడుతున్నాయి. ఎప్పుడు స్టాక్‌మార్కెట్ కుప్పకూలుతుందో ఎందరు ఎంత సొమ్ము పోగొట్టుకుంటారో తెలియని అయోమయం నెలకొన్నది. సంక్షోభాలు, యుద్దాలు కొనసాగితే అమెరికా కార్పొరేట్లకు కాసుల పంట పండుతుంది. అందుకే అవి నిత్యం ఎక్కడో ఒక చోట చిచ్చు పెట్టేందుకు చూస్తుంటాయి.

అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకా ప్రయాణానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇరాన్‌కు అప్పగించారు. జూన్ 17న కుదిరిన ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు వాణిజ్య నౌకల రవాణా మీద ఎలాంటి సుంకాలు విధించకూడదు.దాన్లో భాగంగా ఏ నౌక అయినా తమకు వివరాలు తెలిపి, తాము సూచించిన మార్గంలో ప్రయాణించాలని ఇరాన్ ప్రకటించింది. అయితే కొన్ని నౌకలు దీనికి భిన్నంగా ఎటువైపు వెళ్లేదీ తెలియనివ్వకుండా సంకేతాలను పంపే వ్యవస్థలను కట్టివేసి ప్రయాణిస్తుండటంతో అలాంటి నౌకలు హెచ్చరికలను ఖాతరు చేయకపోవటంతో ఇప్పటికి మÖడు సార్లు కొన్ని నౌకల మీద ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. వాటిని సాకుగా చూపి అమెరికా పెద్ద ఎత్తున ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నది. దానికి ప్రతిగా గల్ఫ్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ కూడా ధీటుగా ప్రతిదాడులు చేస్తున్నది. ఈ క్రమంలో ఇరాన్‌తో ఇంక చర్చలేవీ లేవన్న ట్రంప్ వెంటనే మాట మార్చి సాంకేతిక అంశాలపై ఉంటాయని చెప్పాడు, పాకిస్తాన్, కతార్, ఈజిప్టు రంగంలోకి దిగి మరోసారి చర్చల కోసం రావాలని ఇరు పక్షాలనూ కోరుతున్నాయి. అదేమీ తేలకుండానే అమెరికా రెచ్చగొట్టుడు కారణంగా హార్ముజ్ జలసంధిని మరోసారి మÖసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.తాము కూడా దిగ్బంధనాన్ని తిరిగి కానసాగించి ఇరాన్‌కు నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించాడు. అంతే కాదు హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల మీద వాటిలోని సరకు విలువలో 20శాతం పన్ను విధిస్తానని ప్రకటించాడు. అంతకు ఇరాన్ పన్ను వసూలు చేస్తానని చెబితే వ్యతిరేకించిన పెద్ద మనిషి ఇప్పుడు తానే ఆపని చేస్తానని చెప్పాడు. దాన్ని అమలు చేస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందని భయపడి వెనక్కు తగ్గాడు తప్ప మరొకటి కాదు. న్పుింగా అమలు జరిగితే పరిస్థితి ఏమిటి ?ఉదాహరణకు ముడి చమురు ధర పీపా సగటున 80 డాలర్లకు కొనుగోలు చేశారనుకుందాం. ఒక టాంకరులో పట్టే చమురు విలువ 16 కోట్ల డాలర్లు. దీనిలో ఇరవై శాతం పన్ను అంటే 3.2 కోట్ల డాలర్లు చెల్లించాలి. అదే అంతకు ముందు ఇరాన్ చెప్పినదాని ప్రకారం పన్ను మొత్తం 20లక్షల డాలర్లు మాత్రమే.హార్ముజ్ జలసంధి అమెరికా చేతుల్లోకి పోతే మనం దిగుమతి చేసుకొనే చమురుకు 20శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఎంత ఖర్చు పెరిగినా జనం మీద మోపేదే గనుక మన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులెవరూ ట్రంప్ ప్రకటన మీద నోరెత్తలేదు.

తమ దుష్ట చర్యలను సమర్ధించుకొనేందుకు అమెరికాఇజ్రాయెల్ కట్టుకథలను ప్రచారం చేస్తున్నాయి.వాటిలో తాజాగా చెప్పిందేమిటంటే డోనాల్డ్ ట్రంప్‌ను అంతం చేసేందుకు ఇరాన్ కుట్ర చేసింది.తనను చంపేందుకు చూస్తున్నట్లు అంకారాలో జరిగిన నాటో సమావేశాల్లో డోనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పాడు.ఆ కుట్రను ఇజ్రాయెల్ నిఘావర్గాలు కనిపెట్టి ట్రంప్‌కు తెలియచేశాయట, మరి అమెరికా సిఐఏ ఏం చేస్తున్నట్లు ? జనం చేత ఇలాంటి పిట్టకతలను నమ్మించటం కూడా సులభమే, ఎందుకంటే తమ సుప్రీమ్ నేత, ఇతర ఉన్నత సైనికాధికారులను అకారణంగా చంపి, దాడులు చేస్తున్న తరువాత ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా ! బదులు తీర్చుకుంటామని నేతలు ప్రకటించిన నేపధ్యంలో అలాంటిదేదో జరిగి ఉంటుంది లెమ్మని సామాన్యులు అనుకోవటం సహజం. ఇరాన్ మీద అమెరికా దాడులు,దాని అధినేతలను లేపేస్తామని పదే పదే చెప్పటం, ఆంక్షలతో ఆర్థికంగా ఇబ్బుందులు పెట్టటం ఈ రోజు కొత్తగా ప్రారంభించినవి కాదు, 1979 నుంచి కొనసాగుతున్నాయి. అందువలన రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు గనుక, జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణాలు తీసేందుకు ఇరాన్ ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘావర్గాలు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా ఇంతవరకు ఇరాన్ అలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.


రోజువారీ దాడులు, ప్రతిదాడులు ఎదుటి పక్షాన్ని ఏ విధంగా దెబ్బతీసిందీ ఆయా దేశాలు చేస్తున్న ప్రకటనల వార్తలు తెలిసిందే. ఇరాన్ అణు, మిలిటరీ సామర్ధ్యాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు ట్రంప్ ఇప్పటి వరకు నలభై నుంచి యాభైసార్ల వరకు చెప్పి ఉంటాడు. అయినా అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడులు ఎలా చేయగలుకుతున్నదన్న అంశం అనేక మందికి అంతుబట్టటం లేదు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు పుట్టుకు వస్తాడన్న లోకోక్తి తెలిసిందే. తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తూ కాదు.మానవుడి పరిణామ క్రమంలో అవసరాలే అనేక నూతన ఆవిష్కరణలకు దోహదం చేశాయి. ఇది ఇరాన్‌కూ వర్తిస్తుంది. వియత్నాంపై రెండున్నర దశాబ్దాల పాటు జపాన్, ఫ్రాన్సు, అమెరికా సామ్రాజ్యవాదులు భీకరదాడులు చేశారు. వారి మిలిటరీ, ఆయుధ సామర్థ్యాన్ని గెరిల్లా పోరాటపద్దతులను అనుసరించి కమÖ్యనిస్టులు ఎదిరించి నిలవటమే కాదు, 1975లో అమెరికన్లు దొరికిన విమానాలు, హెలికాప్టర్లను పట్టుకొని పారిపోయేట్లు చేశారు.ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల చేతిలోనూ అమెరికాకు అదే పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఇరాన్‌లో కూడా అమెరికాకు అదే జరుగుతోంది. అడవులు, కొండలు గుట్టల్లో గెరిల్లా పద్దతివేరు. సముద్రంలో కూడా ఇరాన్ ఆ విధానాన్ని అనుసరిస్తున్నది. ఆత్మరక్షణ`ప్రతిఘటన దాడి పద్దతులను అభివృద్ది చేసుకొన్నది.దీనికి ఇతర దేశాల అనుభవాలు నేర్పిన పాఠాలతో పాటు చైనా, రష్యా అందచేస్తున్న సహకారం కూడా తోడు కావటం, ఈ పరిణామాలను అమెరికా, ఇజ్రాయెల్ పసికట్టలేకపోవటం కనిపిస్తున్నది. గూఢచర్యంలో ఈ రెండు దేశాల తరువాతే మిగతావి అన్నట్లు అనేక మంది కీర్తించటం తెలిసిందే. అలాంటి తోపులనే ఇరాన్ తప్పుదారి పట్టించి తనను తాను కాపాడుకుంటున్నది, ప్రతిదాడులు చేయగలుకుతున్నది.తన డ్రోన్లు, క్షిపణులు ఎక్కడ ఉన్నదీ తెలియకుండా కాపాడుకోవటమే కాదు, ప్రయోగ కేంద్రాలను కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ శత్రుల నిఘాను ఏమారుస్తున్నది.


ఇరాన్ నౌకా దళాన్ని రెండవ ప్రపంచ యుద్దానికి ముందు ఒకసారి నాశనం చేశారు, తరువాత మరోసారి విధ్వంసం కావించారు.తాజాగా మÖడవసారి అమెరికా మరికొంత నష్టం కలిగించింది. అయినా స్వల్ప ఖర్చుతో చిన్న పడవలతో హార్ముజ్ జలసంధిలో అమెరికాను ముప్పుతిప్పలు పెట్టటంలో ఇప్పటి వరకు ఇరాన్ జయప్రదమైంది. ఇరాక్‌తో ఎనిమిది సంవత్సరాలు జరిగిన యుద్ద సమయంలో చమురు టాంకర్లపై జరిగిన దాడులు ఒక పాఠాన్ని నేర్పాయి. శ్రీలంక మిలిటరీపై ఎల్‌టిటి తీవ్రవాదులు పడవలతో సాగించిన పోరు నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు రష్యా దాడులను ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్, పీపుల్స్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మారిటైమ్ మిలీషియా పేరుతో ఒక దళాన్ని ,చైనా నిర్వహిస్తున్నది.ఈ దళ సభ్యులు దక్షిణ చైనా సముద్రంలో రోజువారీ చేపలు పట్టేవారిగా, శత్రుదేశాల ఓడల కదలికల మీద నిఘావేసేవారిగా, అవసరమైతే చిన్న చిన్నదాడులు చేసేందుకు చైనా మిలిటరీ సహకారంతో నడిపిస్తున్న చిన్న చిన్న పడవల అనుభవమÖ ఇరాన్‌కు పనికి వచ్చింది. ఈ దళంలోని పడవలు చైనా తనవిగా చెబుతున్న సముద్ర జలాల్లో ప్రవేశించి చేపలు పడుతూ చైనా సార్వభౌమత్వాన్ని పదే పదే ఇతర దేశాలకు గుర్తు చేస్తుంటాయి,విదేశీ నౌకలకు చికాకులు కలిగిస్తుంటాయి. చైనా నౌకాదళం, తీరరక్షణ దళంతో పాటు దీన్ని చైనా మÖడవ సముద్ర శక్తిగా ఇతర దేశాలు వర్ణిస్తాయి.
1979లో తమ తొత్తు షాను గద్దె దించి అధికారానికి వచ్చిన ఇస్లామిక్ శక్తులను దెబ్బతీసేందుకు 1980లో ఇరాక్‌ను రెచ్చగొట్టిన అమెరికన్లు ఇరాన్ మీద దాడులు చేయించారు. అవి 1988 వరకు కొనసాగాయి. ఇరాన్ చమురు ఎగుమతులను దెబ్బతీయటం ఆ పోరు లక్ష్యాలలో ఒకటి. దానిలో భాగంగా టాంకర్ల మీద దాడులు,ప్రతిదాడులు జరగటంతో టాంకర్ల పోరుగా దాన్ని పిలిచారు. నాలుగు వందల చమురు టాంకర్ల మీద దాడులు జరగ్గా కొందరు సాధారణ పౌరులతో సహా రెండు వందల మందికి పైగా నావికులు మరణించారు. అప్పుడు కూడా హార్ముజ్ జలసంధిని దిగ్భంధనం చేసేట్లు ఇరాన్ను రెచ్చగొట్టినా ఆ నాడున్న పరిస్థితిలో అది జరగలేదు.ఇలా ఎన్నింటినో అధ్యయనం చేసిన ఇరాన్ హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారైంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డులకు ఒక అధినాయకత్వం ఉన్నప్పటికీ ప్రాంతీయ విభాగాలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసి శత్రువులను దెబ్బతీసేందుకు ఏ పద్దతి వీలైతే దాన్ని అమలు చేస్తే స్వేచ్చ ఇచ్చారు.శత్రువును దెబ్బతీయటమే అంతిమ లక్ష్యం. ప్రపంచ రవాణాలో పర్షియన్ గల్ఫ్ లేదా హార్ముజ్ జలసంధితో పాటు సూయజ్ కాలువ ద్వారా తూర్పు మధ్యధరా సముద్రంతో హిందూమహాసముద్రాన్ని కలిపే ఎర్ర సముద్రం కీలక పాత్ర పోషిస్తున్నది.హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం కావించేందుకు గతంలో ఇరాక్ ఎంతగానో రెచ్చగొట్టింది.అలా జరిగితే పశ్చిమ దేశాలన్నింటినీ రంగంలోకి దించాలన్నది అసలైన ఎత్తుగడ. అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితులు, మిత్రదేశాలు అమెరికా కోసం చేతులు కాల్పుకొనేందుకు సిద్దంగా లేవని ఉక్రెయిన్ నేర్పిన అనుభవం, అదే హార్ముజ్ విషయంలో పునరావృతం అవుతుందని వేసిన అంచనా ఇలా ఎన్నో పరిణామాల పూర్వరంగంలో ఇరాన్ ముందుకు వచ్చి జలసంధిని దిగ్బంధనం కావించింది, అది టెహరాన్ ముందు చూపుకు నిదర్శనమైతే వాస్తవాలను గ్రహించలేక అహంకారానికి లోను కావటానికి అమెరికా తార్కాణంగా నిలిచింది. పశ్చిమాసియా సంక్షోభం ముగియటం అనివార్యం, అయితే ఎలా అన్నది ఊహించలేము !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !

11 Saturday Jul 2026

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

2027 UP poll, Ayodhya Ramalayam, BJP, Champat Rai, Hindu nationalism, Hindu Rashtra, Narendra Modi Failures, Ram Mandir, Ram mandir Theft, RSS, VHP, Yogi Adityanath

ఎం కోటేశ్వరరావు

తన సొమ్మును తన భక్తులే కాజేస్తుంటే దేవుడు, దేవతలు, దేవదూతలు ఎందుకు నిరోధించటం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే.....అది కూడా దైవలీý తప్ప మరొకటి కాదు, ఏ లడ్డులో ఏ కల్తీ జరపాలో, దేవుడి పేరుతో ఎలా మోసం చేయాలో, ఏ సొమ్ము ఎలా కొల్లగొట్టాలో ముందేరాసి పెట్టి ఉంటుంది, దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి, ఇది ఈ నాటిదా ! నిజాయితీపరులు వారి పని వారు చేయాలి, దొంగలు దొంగతనాలు చేయాలి, బ్రహ్మరాతను ఎవరూ మార్చలేరు. గుడినీ గుడిలో లింగాన్ని మింగేవారు వస్తారని పోతులూరి వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు.పాపం చేసిన వారు ఫలితాన్ని అనుభవించకతప్పదు. ఇదీ కర్మసిద్దాంతాన్ని నమ్ముతున్న భక్తుల స్పందన. అందరి తలరాత రాసిన పెద్దమనిషి కొందరికి దొంగతనం చేయాలని రాసిపెట్టిన వివక్ష ఎందుకు అన్నది హేతువాదుల ప్రశ్న. గుర్రాన్ని తొట్టి దగ్గరకు తీసుకువెళ్లగలం తప్ప దానిలో నీరు తాగించగలమా ! రాముడి సొమ్ము కొట్టేసిన ఉదంతం అనేక మందితో మాట్లాడిస్తున్నప్పటికీ దేవుడి అంశగా జన్మించినట్లు చెప్పుకున్న కారణంగానే నరేంద్రమోడీ నోరు తెరిపించటంలో సాక్షాత్తూ ఆ రాముడే ఏం చేయలేక కళ్లప్పగించి “మౌనం ”గా ఉండిపోయాడు. దేవుళ్ల మధ్య కూడా శాఖల వారీ విభజన జరిగి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం లేదేమో ! ఓట్ల కోసం రాముడు కావాల్సి వచ్చింది,ఎన్నికల ప్రచారం కోసం సాష్టాంగ ప్రమాణం చేస్తున్న ఫొటోల నిమిత్తం అయోధ్య రామాలయం అవసరమైంది.కానీ దానిలో జరిగిన కుంభకోణం గురించి స్పందించటానికి నోరు రావటం లేదు. ఇలాంటి వారిని ఏం చేయాలో రాముడే ఆలోచించుకోవాలి. అక్రమాలపై ఎందుకు దేవుళ్లు, దేవతలు స్పందించటం లేదన్నది తరతరాలుగా నాస్తికులు, హేతువాదులు, భౌతికవాదులు వేస్తున్న సమాధానం లేని ప్రశ్న. దేవతల లీలలు, మహిమల గురించి కథకథలుగా చెప్పుకుంటాం.దరిద్రం ఏమంటే ఇప్పుడు వారికి వచ్చిన కానుకల చోరీ గురించి అయోధ్య దర్యాప్తులో వెలువడుతున్న కథలుకతలు ఎన్నో వెలువడుతున్నాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే మతం, దేవుళ్ల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే తమ మనోభావాలను గాయపరిచారంటూ వీధుల్లో వీరంగానికి దిగే బాపతు తిరుపతి లడ్డు కేసు, రామాలయ కానుకల చోరీ గురించి ఎక్కడా కనిపించరేం. ఇది కూడా బ్రహ్మరాసిన రాతల పర్యవసానమే అని చెప్పేవారు ఉండవచ్చు. వారు రెండు రకాలు. ఒకటి దొంగలను సమర్ధించే మోసగాళ్లు, రెండవ రకం అమాయకులు.


ఇంకా గూగులమ్మ తల్లికి ఏ మతం, కులాన్ని అంటగట్టలేదు.అఫ్ కోర్సు తమ కంపెనీ ప్రయోజనాలు, వాటిని పరిరక్షించే నేతలు, పార్టీల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఆ తల్లికూడా అలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా నిరోధిస్తున్నదని చెబుతున్నారు.అయినా తనకు ఇబ్బందిలేని వాటిని అందిస్తున్నది.ప్రార్ధనా స్థలాల్లో భక్తులు, విశ్వాసులు ఇచ్చే కానుకలను కొట్టి వేయటం అన్ని చోట్లా జరుగుతున్నదని ఎవరు అడిగినా చెబుతుంది, కావాలంటే తెలుసుకోవచ్చు. మందిరాలు, మసీదులు, చర్చ్‌లు ఏవీ ఇలాంటి అక్రమాలకు దూరంగా లేవు.పేరు భిన్నంగా ఉండవచ్చు తప్ప ప్రతి చోటా కానుకల స్వీకరణ, వాటి అపహరణ జరుగుతూనే ఉంది. కనిపించని సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడ్డాయన్నది ఒక సామెత.అయోధ్య ఉదంతంతో ఇప్పుడు జనాలకు పాత దొంగతనాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ మతం, దేవుళ్లను రాజకీయ అవసరాలకోసం వినియోగించుకొనే సంఘపరివార్ సంస్థలన్నింటినీ జనం అనుమానంతో చూసేందుకు దోహదం చేస్తున్నాయి. భక్తులందరూ దొంగలు కాదు గానీ దొంగలందరూ భక్తులే కావటం గమనించాల్సిన అంశం.ప్రతి మత ప్రార్ధనా మందిరంలో జరుగుతున్నది ఇదే.ఎందుకంటే విశ్వాసులు కానివారిని నియమించరు కదా ! దేవాలయాలను ప్రభుత్వ అదుపు నుంచి తొలగించాలని కోరుతున్న వారికి ఇప్పుడు నోట్లో పచ్చివెలక్కాయపడింది.ట్రస్టుల పేరుతో వాటిని నడిపే తమవారి నిర్వాకాలు వెలుగులోకి రావటంతో మింగా కక్కలేకుండా ఉన్నారు. ఇప్పుడు సంఘపరివార్ పెద్దల ఆందోళన దేవుడి సొమ్ము, నగలను కొట్టేయటం కాదు,కోట్లాది మంది భక్తుల్లో బిజెపి, విశ్వహిందూపరిషత్ వంటి తమ సంస్థల పట్ల ఉన్న విశ్వాసం, నమ్మకాలు సడలిపోతే తమ హిందూత్వ అజెండాకే ముప్పు అన్నదే అసలు భయం. కొందరిని కొంతకాలం మోసం చేయగలం, అందరినీ ఎల్లాకాలం మభ్యపెట్టలేము కదా !


కానుకల చోరీ పూర్వరంగంలో అయోధ్య రామాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోరాదని విశ్వహిందూపరిషత్ చెబుతోంది. ఎందుకంటే అది తమ చేతుల్లోంచి పోతుందనే భయం. మా హిందూ దేవాలయం, కానుకలు ఇచ్చిందీ, దొంగతనం చేసిందీ మా హిందువులే కదా, మేం మేం చూసుకుంటాం అన్నట్లుగా దాని వైఖరి ఉంది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి రామాలయ ట్రస్టును తీసుకురాకూడదని చెబుతున్నారు.దీని అర్ధం ఏమిటి ? భవిష్యత్‌లో కూడా ఏం జరిగినా ఎవరూ ప్రశ్నించకూడదు, ఎంత పారదర్శకత ! తప్పనిసరై రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామా చేయగా ఆహ్వానితుడు ఉడిపి ీVAటల్స్ గోపాలరావును ఆ జాబితా నుంచి తొలగించారు.వీరు ముగ్గరూ సంఘపరివార్ గుంపులోని వారే. నరేంద్రమోడీ ప్రవచించిన జవాబుదారీతనం,నేను తినను ఇతరులను తిననివ్వను అన్న చౌకీదార్ సంగతేమిటి ? యావత్ దేశాన్నీ కదలించిన ఈ ఉదంతం అసలు పట్టించుకోవాల్సింది కాదన్నట్లుగా ఇంతవరకు ఒక్క మాటా మాట్లాడలేదు. సాగినంత కాలం సాగుతుంది తప్పదు. రామాలయంలో జరిగింది కుంభకోణం కాదు, చిన్న చోరీ మాత్రమే, అలాంటివి ప్రతిచోటా జరుగుతూనే ఉన్నాయి గనుక పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.గోడీ మీడియా తప్పనిసరై ఈ కేసు గురించి వార్తలను ఇవ్వకతప్పటం లేదు. గతంలో ఆరోపణలు వచ్చినపుడు వాటన్నింటినీ మÖసిపెట్టింది, ఇప్పుడు సాధ్యం కావటం లేదు. నిజమే ప్రతి చిన్న చోరీ విచారణకు పోలీసులు కేసులు పెడతారు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయవు కదా ! అయోధ్యలో జరిగింది చిన్న దొంగతనమే అయితే యోగి సర్కార్ సిట్‌ను ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? అనేక మంది సంఘపరివార్ ప్రముఖులు తీవ్ర ఆరోపణలు ఎందుకు చేస్తున్నట్లు ? చిన్న చోరీ అయితే అయోధ్య బార్ అసోసియేషన్ నిందితుల తరఫున వాదించకూడదనే నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు ? ఆరోపణలకు గురైన ట్రస్టు సభ్యులు పట్టణం విడిచి వెళ్లాలని ఎందుకు డిమాండ్ చేసినట్లు ? కొందరు చెబుతున్న ఈ “ చిన్న ” ఉదంతం గురించి సమాధానం లేని “ పెద్ద ” ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి.


దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తే అక్రమాలకు తావుండదని అర్ధం కాదు.పాలక మండళ్లు,అధికారులను ప్రశ్నించటానికి అవకాశం ఉంటుంది. సరైన సమాధానం చెబుతారా లేదా అన్నది పక్కన పెడితే కనీసం సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. అదే ప్రైవేటు ట్రస్టులైతే రామాలయం గతే ! కాశీ విశ్వనాధుడి ఆలయంలోని శివలింగం వద్ద 1983 జనవరి ఐదున 2.55కిలోల బంగారం మాయమైంది.దాని దర్యాప్తులో బయటపడిన లోపాల తరువాత మహంతుల(పూజారుల) అదుపు నుంచి తప్పించేందుకు కాశీ విశ్వనాధ ఆలయ చట్టం 1983చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ట్రస్టుకు అప్పగించారు. ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆలయంలో చోరీ వార్తలు వెలువడగానే వారణాసిలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఆయోధ్యలో అలాంటిదేమీ కనిపించటం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది బిజెపి గనుక, వీధుల్లోకి వచ్చేవారెవరుంటారు. కాశీ ఆలయచోరీ కేసులో నిందితులకు పదిహేడేళ్ల తరువాత 2000 సెప్టెంబరు ఏడున కోర్టు శిక్షలు విధించింది. గట్టి ఇనుప ఊచల కవచం మధ్య గర్భగుడిలో ఉన్న ఆ బంగారం చోరీ జరిగిన తీరు చూస్తే ఇంటి దొంగలపనే అని విచారణలో తేలింది. కవచ ద్వారాలను తెరిచినట్లు తప్ప పగలగొట్టిన ఆనవాళ్లు లేవు. ఆ సమయంలో గుడిలో ఉన్న ఇద్దరు పూజారులు తాము నిద్రించి ఉన్నట్లు చెప్పారు. పూజారుల ఏలుబడిలో గుడిలో నగదు,ఆస్తుల వివరాలు సక్రమంగా లేవని తేలింది.అంతా అడ్డగోలు వ్యవహారాలు నడిచాయి.ఆలయంపై వారసత్వ అధికారం ఎవరిదన్న కీచులాటలు కోర్టుకు ఎక్కగా వివాదం తేలేంతవరకు రోజువారీ రాబడిని కేసుల్లో ఉన్న పూజారులకు సమంగా పంచాలని 1950 దశకంలో సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది.1983 చోరీతో పూజారుల హక్కులకు తెరపడింది.నాలుగు వందల సంవత్సరాల పాటు ఒక పూజారి కుటుంబం ఆలయాన్ని ఏలింది.వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజాచార్యుడు ప్రారంభించినట్లు చెబుతున్న వారసత్వ అర్చకత్వానికి లేదా మిరాసీదార్ల వ్యవస్థకు 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్థిపలికింది. లడ్డూ కల్తీ అంశం వెలుగులోకి వచ్చిన తరువాత కొందరు దేవాలయాలను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అయోధ్యలో జరిగిందాన్ని సమర్ధించుకొనేందుకు కాషాయ గుంపు నానా పాట్లు పడుతోంది.


నాలుగుదశాబ్దాలకు పైగా రామాలయం చుట్టూ రాజకీయాలను తిప్పి లబ్దిపొందిన కాషాయ దళాలకు తొలిసారిగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరచిన ఉదంతం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియని స్థితి. రాముడిని, రామాలయాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలు కానుకల కుంభకోణం నుంచి పెద్దగా లబ్దిపొందలేవని కొందరు వెంటనే ముక్తాయింపులు ఇవ్వటం ప్రారంభించారు.రామాలయ ఆందోళన ప్రారంభించిన వెంటనే బిజెపికి లబ్ది చేకూరలేదు. అదే విధంగా తమ మనోభావాలను బిజెపి పెద్దలు ఎలా దెబ్బతీశారో గ్రహించటానికి కూడా జనానికి సమయం పడుతుంది. దానికి నాంది పడింది.రాముడిని వీధుల్లోకి లాగింది మతవాదులు. వారి ప్రభావానికి లోనైన జనాన్ని దాన్నుంచి బయటపడవేసేందుకు ఎవరు ప్రయత్నించాలి ? మరింత మÖఢత్వంవైపు నెట్టేందుకు కాషాయ దళాలు చూస్తాయి.మతోన్మాద శక్తులు పెరగటానికి లౌకిక శక్తులే అవకాశం ఇచ్చాయంటూ కొందరు విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నారు.కొందరు నిజమే అనుకుంటున్నారు, ఇది ఆత్మన్యూనత తప్ప మరొకటి కాదు. దాని వలన ఉపయోగం లేదు. ప్రపంచంలో మత,వేర్పాటువాద, జాత్యహంకార, మితవాద శక్తులు పెరగటానికి అనువైన పరిస్థితులు ఉన్న కారణంగానే అవి రెచ్చిపోతున్నాయని గ్రహించటం అవసరం. రాముడు(అయోధ్య), కృష్ణుడు(మధుర),శివుడి(వారణాసి) ఆలయాల పేరుతో ప్రారంభించిన క్రీడను దాన్ని వ్యతిరేకించే శక్తులందరూ ముల్లును ముల్లుతోనే తీసినట్లు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కేరళ, తమిళనాడు వంటి చోట్ల కులవివక్షకు వ్యతిరేకంగా దేవాలయ ప్రవేశ ఉద్యమం ముందుకు వచ్చింది.దాని అర్ధం దానిలో పొల్గ్గొన్నవారు మతవాదులు కాదు, వివక్షను వ్యతిరేకించటం అసలు విషయం. ఆ ఉద్యమంలో ఉన్న ఏకె గోపాలన్ వంటి వారు ఎందరో తరువాత కమÖ్యనిస్టునేతలుగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో కులవివక్ష వ్యతిరేకపోరాట సంఘం నాయకత్వంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని సాగించిన యాంత్రల్లో సిపిఐ(ఎం) నేతలు పాల్గ్గొన్నారు. దీని అర్ధం మతపరమైన భావాలను ప్రోత్సహిస్తున్నట్లు కాదు. బిజెపి దేవుళ్లతో రాజకీయం చేసి లబ్ది పొందినట్లు భావించిన పవన్ కల్యాణ్ సనాతనవాది అవతారమెత్తి లబ్దిపొందేందుకు చూస్తున్నారు.తిరుమల లడ్డూ కల్తీ గురించి వెల్లడించటం ద్వారా తానే పెద్ద హిందూత్వవాదినని జనం ముందుకు వచ్చేందుకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం ఏమిటో తెలిసిందే.సున్నిత మనోభావాలతో కూడు కున్న అంశాల పట్ల మొరటుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు.అలా ప్రయత్నించిన కొందరు నాస్తికులు, హేతువాదులు, ఇతరులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో చూస్తున్నాము. ఏ ఇతిహాసాలు, పురాణాల నుంచి తిరోగమన భావాలను ముందుకు తెస్తున్నారో, వాటి నుంచే ఎదుర్కొనే ఆయుధాలను వెలికి తీయాల్సిన తరుణమిది.హిందూత్వ భావజాలం ఒక్క రోజులో ఎలా పెరగలేదో దాన్ని ఎదుర్కొనే భావాలు జనంలోకి వెళ్లటానికి సమయం పడుతుంది.మొక్కనాటగానే కాయలు కాయవు.


సుప్రీం కోర్టు వెలువరించిన వివాదాస్పద తీర్పుతో బాబరీ మసీదు భూమి రామాలయానికి వచ్చింది.రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. అప్పటి నుంచి నరేంద్రమోడీ పురాతన “ పూజారి మహరాజు ” అవతారమెత్తి గత లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించుకొనేందుకు చూసినా భంగపడ్డారు. సంపూర్ణ మెజారిటీకి అవసరమైన సీట్లను బిజెపికి సంపాదించలేకపోయారు. చివరకు సదరు అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బిజెపి ఓడింది. వారణాసిలో మోడీ మెజారిటీ గణనీయంగా తగ్గింది.ఎవరెన్ని చెప్పినా అయోధ్య ఆలయ నిధులు, ఆభరణాల కుంభకోణం గురించి నోరు విప్పాల్సిన బాధ్యత మోడీ మీద ఉంది.తాను తినను ఇతరులను తిననివ్వను, చౌకీదారునని చెప్పిన పెద్ద మనిషి నోరు విప్పకపోతే ఎలా ! తిరుమల తిరుపతి అనుభవాన్ని చూసిన తరువాత ప్రముఖ దేవాలయాలన్నింటినీ లాభార్జనకోసం మతపరమైన విహార యాత్రల కేంద్రాలుగా(అఫ్ కోర్సు హిందూత్వశక్తులు తాము వ్యతిరేకించే మక్కా, మదీనా, జెరూసలెంలను చూసి కూడా స్ఫూర్తి పొందారు) మార్చాలని చూస్తున్నారు.అయోధ్యలో అవినీతి గురించి ఆరోపణలు రావటం ఇదే ప్రధమం కాదు, గతంలో అయోధ్య వివాదంలో అసలు పిటీషన్‌దార్లలో ఒకటైన నిర్మోహి అఖారా అనేక ఆరోపణలు చేసింది. రామాలయం పేరుతో దేశంలో, విదేశాల నుంచి విశ్వహిందూపరిషత్ వసూలు చేసిన నిధుల్లో పద్నాలుగు వందల కోట్లకు పైగా దుర్వినియోగం, స్వాహా చేసిందని మహంత్ సీతారామ్ ఆరోపించారు. తాజాగా రామాలయం కోసం రెండు కోట్లతో భూమి కొని దానికి రు.18.5 కోట్లు బదలాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిని మÖసిపెట్టిన ఆరఎసఎస్`బిజెపికి ఇప్పుడు అది సాధ్యం కాదు. ఇంతకాలం కాషాయ దళాలు తప్పుడు ప్రచారం, అవాస్తవాలను ప్రచారం చేశాయి. ఇప్పుడు వాటిని వ్యతిరేకించే వారు అసలు విషయాలను జనంలోకి తీసుకుపోవాలి.నిజాలు నిలకడ మీద బుర్రల్లోకి ఎక్కుతాయి ! తొందరేమీ లేదు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !

11 Saturday Jul 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

China, China credibility, Chinese navy strategic missile, Donald trump, Narendra Modi Failures, US and China, US attack Iran, World Military Power, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో ఏం జరుగుతోంది ? రోజువారీ పరిణామాలను చూస్తే సామాన్యులకు అనేక విషయాలు అంతుపట్టటం లేదంటే అతిశయోక్తి కాదు.ఫిబ్రవరి 28న అమెరికా‘ఇజ్రాయెల్ జరిపిన ఏకపక్ష దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా ఖమేని మరణించారు. తరువాత దాడులు కొనసాగిన కారణంగా అంత్యక్రియలను వాయిదా వేసి జూలై నాలుగు నుంచి తొమ్మిదవ తేదీ మధ్య పూర్తి చేశారు. రెండు కోట్ల మంది పౌరులు ఈ క్రతువులో పాల్గొన్నారు. ఇరాన్ బలప్రదర్శనగా దీన్ని టైమ్ పత్రిక వర్ణించింది. అంత్యక్రియల్లో వందకుపైగా దేశాల నేతలు, ఉన్నతస్థాయి ప్రతినిధి వర్గాలు పాల్గ్గొంటున్నట్లు వార్తలు.ఖమేని అంత్యక్రియల్లో పాల్గ్గొనేదేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా బెదిరించటంతో 13దేశాలు వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు.తొలుత సంతాపం కూడా ప్రకటించటానికి తటపటాయించిన మనదేశం తరఫున విదేశాంగశాఖ ఉపమంత్రి పవిత్ర మార్గరిటా నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం హాజరైంది. ఖమేనీ మరణానికి అధికారికంగా సంతాపం తెలిపితే ఎక్కడ అమెరికాకు కోపం వస్తుందో అని తటపటాయించిన మన కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల తరువాత సంతాప ప్రకటన చేసింది తప్ప అమెరికా చేసిన హత్యను ఇంతవరకు ఖండించలేదు. ఇరాన్ నేతలు, మిలిటరీ అధికారులు అందరూ ఒకేచోట దొరికినా తాము వారిని మట్టుబెట్టేందుకు పూనుకోలేదంటూ డోనాల్డ్ ట్రంప్ పిచ్చివాగుడుతో మరోసారి అమెరికా పరువు తీశాడు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మాట్లాడిన ట్రంప్ దేశానికి అతిపెద్ద ముప్పు కమÖ్యనిజం అని చెప్పాడు. ఇలాంటి వారందరినీ చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టింది. ఇండో‘పసిఫిక్ ప్రాంతం నిబంధనల ప్రాతిపదికన స్వేచ్చగా ఉండాలంటూ జపాన్ ప్రధాని సానే తకాచీతో కలసి ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.తన మిలిటరీ వ్యూహంలో భాగంగా మన భుజం మీద తుపాకిపెట్టి చైనాను కాల్చాలనుకున్నది అమెరికా .1947లో ప్రారంభించిన అమెరికా పసిఫిక్ కమండ్ పేరును 2018లో ట్రంప్ నాయకత్వంలో యంత్రాంగం అమెరికన్ ఇండోపసిఫిక్ కమాండ్‌గా మార్చింది. ఇపుడు అదే ట్రంప్ జూన్ నెలలో మనదేశం పేరును తొలగించి పాతపేరును పునరుద్దరించాడు.మన చిత్రపటాన్ని మార్చి ఆక్రమిత్ కాశ్మీరును పాక్ ప్రాంతంగా దానిలో ముద్రించాడు.ఏ రెండు దేశాలైనా జతకట్టవచ్చని అది మÖడో దేశానికి వ్యతిరేకంగా ఉండకూడదని మోడీతకాచీ భేటీ గురించి చైనా ప్రకటించింది. ఆ తరువాత తమకు వ్యతిరేకంగా ఎవరైనా పిచ్చివేషాలు వేస్తే సంగతి తేలుస్తామనే హెచ్చరికగా జూలై ఆరవ తేదీన చైనా జలాంతర్గామి నుంచి అణుక్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా జరిపింది.మార్చి నెల ఒకటవ తేదీ నుంచి మీడియాలో పశ్చిమాసియా సంక్షోభానికి పెద్ద పీటవేసి ఉక్రెయిన్ పరిణామాలను దాదాపుగా విస్మరించారు. తిరిగి ఈ వారంలో ఆ వార్తలు చోటు చేసుకున్నాయి. తాము నిర్దేశించిన మార్గానికి బదులు వేరుగా ప్రయాణించిన మÖడు నౌకలపై హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేయటంతో బుధవారం నుంచి తిరిగి అమెరికాఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ఒప్పందం రద్దయిందని చెప్పిన ట్రంప్ సాంకేతిక చర్చలు కొనసాగుతాయంటూ మరోముక్తాయింపు ఇచ్చాడు. తిరిగి చర్చలంటూ వార్తలు. నవంబరు మÖడున జరిగే అమెరికా మధ్యంతర పార్లమెంటరీ ఎన్నికల వరకు ఇలాగే అమెరికా ఉల్లంఘనలు, ఇరాన్ ప్రతిస్పందనలతో గడిచే అవకాశం కనిపిస్తోంది.టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో వార్షిక సమావేశం వచ్చే ఏడాది సమావేశం గురించి ఎటూ తేల్చుకోకుండానే ముగిసింది. ఇది ఒక పెద్ద వైఫల్యం. ఇలా అనేక పరిణామాలు జరిగినప్పటికీ స్థలాభావం రీత్యా కొన్నింటిని మాత్రమే ఈ సందర్భంగా చూద్దాం.


గ్లోబల్ ఫైర్ పవర్ 2026 సూచిక ప్రకారం పది అగ్రశ్రేణి దేశాల్లో 0. 0741 (897)పాయింట్లతో అమెరికా ముందుండగా రష్యా 0.0791(964), చైనా 0.919(988), భారత్ 0.1346(1461), ఐదవ స్థానంలో 0.1642(2198)లో దక్షిణ కొరియా ఉంది. బ్రాకెట్లలో ఉన్న అంకెలు 2016నాటివి, ఆ ఏడాది పదవ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా తాజాగా ఐదుకు ఎగబాకింది గత విశ్లేషణల్లో చెప్పినట్లుగా ఇరాన్‌పై అమెరికా దాడి ప్రపంచంలో నూతన పరిణామాలకు నాంది పలికింది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్నుంచి చమురు కొనుగోలును చైనా నిలిపివేయలేదు. అనేక విధాలుగా ఆదుకుంది. ఈ పూర్వరంగంలోనే అనేక దేశాలు ఇప్పుడు విశ్వసనీయమైన దేశం ఏది అంటే అమెరికా బదులు చైనాను ఎంచుకుంటున్నాయి. కమÖ్యనిస్టు, బీజింగ్ వ్యతిరేకులకు ఇది మింగుడుపడని వ్యవహారం గనుక ఈ పరిణామాన్ని గుర్తించనట్లే వ్యవహరిస్తారు. గల్ఫ్‌లోని తన స్థావరాలనే దాడుల నుంచి కాపాడుకోలేని అమెరికా ఎంతో శక్తివంతమైన చైనా ఒక వేళ బలవంతంగా తైవాన్ విలీనానికి పాల్పడితే పరిస్థితి ఏమిటని అక్కడి వేర్పాటు వాదుల్లో ఆందోళన మొదలైంది.పెంటగాన్ తిరుగులేనిదని ఇప్పటి వరకు కన్న కలలు అమెరికా పరిమితులను వాస్తవంలోకి తెచ్చాయి.ఇప్పటికిప్పుడు ఏదో జరుగుతుందని కాదు గానీ ఒకవేళ జరిగితే చైనాను నివారించే సత్తా ఉందా అన్న ఆలోచనలో పడ్డారు. అమెరికా రక్షణపై ఆధారపడిన గల్ఫ్ దేశాలు ఇటీవలి పరిణామాల తరువాత దానితో సంబంధాల గురించి వెంటనే బహిరంగంగా వెల్లడించకపోయినప్పటికీ పునరాలోచనలో పడ్డాయి. గల్ఫ్, మధ్య ప్రాచ్యంలోని అమెరికా మిలిటరీ స్థావరాల గురించి చైనా, రష్యాలు అందించిన నిర్దిష్ట సమాచారం కారణంగానే ఇరాన్ వాటి మీద చావుదెబ్బతీసిందన్నది అనేక మంది చెబుతున్న అంశం. ఈ పరిణామాన్ని అమెరికా ఊహించలేదు. ఇదే విధంగా అమెరికా కనుసన్నలలో నడిచే నాటో కూటమిలోని ఐరోపా దేశాల పరిస్థితీ అదే. తమ రక్షణకు తామే ఆయుధాలు కొనుగోలు చేసి ఏర్పాట్లు చేసుకుంటున్నపుడు అమెరికా పెత్తనం ఏమిటన్నది గతంలోనే కొందరు నేతలు ప్రశ్నించారు. ఇప్పుడు మరింతగా మధనం జరగనుంది.

పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో అనే పదాన్ని చేర్చటంతొలగించటం ఒక సాధారణ వ్యవహారం కాదు. పేరు మార్పు చారిత్రాత్మక గుర్తింపును పునరుద్దరించటం తప్ప వేరు కాదని అమెరికా బుకాయిస్తున్నది.అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దీని గురించి మరీ ఎక్కువగా ఆలోచించనవసరం లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పియÖష్ గోయల్ వ్యాఖ్యానించారు.అసలు విషయం ఏమంటే చైనాకు వ్యతిరేకంగా మనదేశాన్ని నిలిపేందుకు 2018లో అమెరికా వేసిన బిస్కెట్ ఇండో అనే పదాన్ని చేర్చటం. గత ఎనిమిది సంవత్సరాలుగా జరిగిన పరిణామాల్లో ఎలాంటి ప్రయోజనం లేదని గుర్తించిన అమెరికా కుంటిసాకుతో ఆ పేరును తొలగించింది.ఒక విధంగా ఇది మనలను బెదిరించటమే. మనదేశ పాలకవర్గానికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సీతగీత దాటితే ఏమైందో తెలుసుగనుక చైనా వ్యవహారంలో కూడా అదే మాదిరి ప్రస్తుతం పరిధి దాటేందుకు సిద్దం కాదు. తరువాత ఎలా మారేదీ ఊహాజనితమే. అమెరికన్ ఏజన్సీల తప్పుడు సమాచారం, ప్రోత్సాహంతో గాల్వన్ లోయ ఉదంతం జరిగిందన్నది ఒక అభిప్రాయం. ఐదు సంవత్సరాల తరువాత అదే చైనాతో సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవటం వెనుక పాలకవర్గ ప్రయోజనాలు దాగున్నాయి.సైద్దాంతికంగా ఆరఎసఎస్ వైఖరి చైనా, కమÖ్యనిస్టు వ్యతిరేకం అయినప్పటికీ అది కూడా తెగేదాకా లాగకూడదని గ్రహించి పాలకవర్గ వాంఛలను ఆమోదించకతప్పలేదు.ఒక వైపు చైనాను వ్యతిరేకిస్తున్న జపాన్‌తో జట్టుకడుతూనే బీజింగ్ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఇది దేశంలో డ్రాగన్ దేశ వ్యతిరేక శక్తులకు చెంపదెబ్బవంటిది. గతంలో మాదిరి భారత పాలకవర్గం సోషలిస్టువ్యతిరేక శిబిరాల నుంచి లబ్ది పొందేందుకు ప్రయత్నించినట్లే ఇప్పుడు కూడా అదే గేమ్ ఆడుతున్నది.విద్యుత్ రంగంలో చైనాతో సంబంధం ఉన్న నాలుగు కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే శాశ్వతంగా అనుమతి ఇచ్చినట్లు కాదని పైకి బింకాలు పోతున్నప్పటికీ చైనా పెట్టుబడుల కోసం మనదేశం ఎంతగా తహతహలాడుతున్నది తెలుస్తోంది. గాల్వన్‌లోయ ఉదంతాల సమయంలో చైనా వ్యతిరేక మనోభావాలను రెచ్చగొట్టిన వారు ఇప్పుడు అన్నీ మÖసుకు కూర్చున్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలేవీ కూడా సైద్దాంతికంగా కమÖ్యనిస్టు అనుకూలమైనవి కాదు. కానీ వాటికి చైనా వస్తువులు కావాలి.కార్పొరేట్లకు లాభాలు సంపాదించి పెట్టాలనటంలో ఏకాభిప్రాయం ఉంది.ఈ కారణంగానే చైనా దిగుమతుల్లో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం మనదేశం చెబుతున్న లెక్కల ప్రకారం ఇరుదేశాల వాణిజ్యలావాదేవీల విలువ 151 బిలియన్ డాలర్లు కాగా చైనా లెక్కలు 156బి.డాలర్లు అంటున్నాయి. ఇది పెద్ద సమస్య కాదు గానీ చైనాతో మన వాణిజ్యలోటు 112 బిలియన్ డాలర్లు దాటింది, ఇదొక రికార్డు. మన మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా, ఆత్మనిర్భరత నినాదాలు, ఆచరణ వైఫల్యానికి ఇది నిదర్శనం.


కమÖ్యనిస్టు చైనా విషయంలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పు కారణంగానే పసిఫిక్ కమాండ్ పేరు మార్చారన్నది స్పష్టం. రెండవ ప్రపంచ యుద్దం తరువాత పసిఫిక్ ప్రాంతంపై అదుపుకోసం కమÖ్యనిస్టు చైనా ఆవిర్భవించక ముందే 1947 జనవరి ఒకటిన అమెరికా కమాండ్ ఏర్పడింది. అమెరికా పశ్చిమ తీరం నుంచి మనదేశ పశ్చిమ(అరేబియా) తీరం వరకు మిలిటరీతో సహా అనేక కార్యకలాపాల నిర్వహణ దాని లక్ష్యం.కొరియా, వియత్నాంపై దాడులు, ఇతర అనేక దేశాల్లో జోక్యం ఈ కమాండ్ పుణ్యమే. ఎనిమిది సంవత్సరాల క్రితం పేరు మార్చేందుకు సందర్భమేమీ లేనట్లే ఇప్పుడు పూర్వపు నామాన్ని తెరమీదకు తెచ్చేందుకూ సరైన కారణమేమీ లేదు. అమెరికా తన ప్రయోజనానికి ఏది మంచిదనుకుంటే అదే చేస్తుంది.మన దేశ పటాన్ని పాకిస్తాన్‌కు అనుకూలంగా మార్చినా అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే మన పాలకులకు చీమకుట్టినట్లు లేదు. జై భజరంగభళీ అంటూ చైనా, పాకిస్తాన్‌ల మీద వీధుల్లో వీరంగం వేసేవారెవరూ కిక్కురు మనలేదు. లెటర్‌హెడ్ మీద పేరు మార్చినంత మాత్రాన అంతా మారిపోయినట్లు కాదని అమెరికా రాయబారి వ్యాఖ్యానించాడు. అమెరికా మిలిటరీతో మన బంధం పూర్తి అయింది గనుక దాన్నుంచి బయటపడలేని స్థితి ఏర్పడిందని భావించిన తరువాత అమెరికా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది.చిత్రం ఏమిటంటే ఇప్పుడు లేని ఇండో`పసిఫిక్ కమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నట్లు మనదేశం, జపాన్ చెబుతున్నాయి.జపాన్ అంటే అమెరికా తొత్తు గనుక అదేమైనా చెప్పుకోవచ్చు, మనం కూడా అంతేనా !


రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ చేతులెత్తేసిన తరువాత అమెరికా అణుబాంబులు వేసి ప్రపంచాన్ని భయపెట్టింది. దాంతో నాటి సోవియట్ యÖనియన్,బ్రిటన్,ఫ్రాన్సు,చైనా, పాకిస్తాన్,మనదేశం కూడా అణ్వాయుధాలను తయారు చేయాల్సి వచ్చింది.ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నట్లు చెబుతున్నారు.అణ్వాయుధాలేగాక ఆధునిక క్షిపణులతో అమెరికా ప్రపంచాన్ని భయపెడుతోంది. తద్వారా ఆయుధపోటీకి తెరలేపింది. ఆ క్రమంలో ప్రతిదేశం తన రక్షణ కోసం ఆయుధాలను తయారు చేసుకోక తప్పటం లేదు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తాను అణ్వాయుధ క్షిపణి ప్రయోగం జరపనున్నట్లు అనేక దేశాలకు ముందుగానే సమయం, నిర్దేశిత లక్ష్యం గురించి చైనా తెలియచేసింది.సోమవారం నాడు మధ్యాహ్నం 12.01నిమిషాలకు అణునియంత్రిత జలాంతర్గామి నుంచి క్షిపణి ప్రయోగం జరపగా 59 నిమిషాల్లో జయప్రదంగా ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది. పసిఫిక్ సముద్రంలో నిజమైన బాంబులకు బదులు డమ్మీలతో ఆ ప్రయోగం జరిగింది. ఇలాంటి ప్రయోగాలు జరిపిన దేశాలలో అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు మనది కూడా ఒకటి.వార్షిక మిలిటరీ శిక్షణలో భాగంగా తామీ పరీక్ష జరిపినట్లు చైనా చెప్పినప్పటికీ జపాన్ వంటి దేశాలు భిన్నంగా స్పందించాయి. జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనా ప్రజాయుద్ధ ప్రతిఘటన 80వ వార్షికోత్సవం సందర్భంగా జులాంగ్(జెఎల్) జలాంతర్గామి ప్రయోగించిన క్షిపణిని చైనా తొలిసారిగా 2025 సెప్టెంబరు 3న ప్రదర్శించింది. ఎనిమిది నుంచి పదివేల కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత ýక్ష్యాన్ని ఛేదించగల ఈ ఖండాంతర క్షిపణిని ఇప్పుడు పరీక్షించింది. గత రెండు సంవత్సరాలలో ఇలాంటి ప్రయోగాలు చేయటం రెండవసారి. సోవియట్, తరువాత రష్యా వద్ద కూడా ఇలాంటి అధునాతన వ్యూహాత్మక క్షిపణులు ఉన్న కారణంగానే అమెరికా అదుపులో ఉంది.ఇప్పుడు రష్యాకు చైనా కూడా తోడైంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం క్షిపణులను ప్రయోగించే జలాంతర్గాములు అమెరికా 14, రష్యా 13, చైనా 6, ఫ్రాన్సు 4, బ్రిటన్ 4, మనదేశం వద్ద మÖడు ఉన్నాయి. అన్ని దేశాలూ కొత్తగా మరికొన్నింటిని నిర్మించేక్రమంలో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆత్మరక్షణకు తప్ప ఎదుటి దేశాలపై దాడులు చేసేందుకు అవసరమైన మిలిటరీని కలిగి ఉండకూడదని ఆమోదించిన రాజ్యాంగాన్ని ఇప్పుడు జపాన్ మార్చుకొని తిరిగి ఆసియాలో ఒక సైనిక శక్తిగా మారేందుకు చూస్తున్నది. అలాంటి దేశంతో మనం చేతులు కలిపి చైనాకు వ్యతిరేకంగా జట్టుకట్టటాన్ని గమనించాలి.ఈ పరిణామాలను చూస్తున్నపుడు అటు చైనా, ఇటు దాని వ్యతిరేక కూటమి దేశాలనూ సంతుష్టీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్లు కనిపిస్తున్నది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ట్రంప్‌ను భయపెడుతున్న‘‘కమ్యూనిస్టు భూతం’

02 Thursday Jul 2026

Posted by raomk in Communalism, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RELIGION, USA

≈ Leave a comment

Tags

Anti communist, Donald trump, Janeese Lewis George, Leftist Zohran Mamdani, Spectre of Communism, US midterm Elections

ఎం.కోటేశ్వరరావు

ఒక భూతం ఇప్పుడు వెంటాడుతున్నది, అదే కమ్యూనిస్టు భూతం అనే వాక్యంతో కారల్ మార్క్స్-ఎంగెల్స్ 1848లో రూపొందించిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రారంభం అవుతుంది. ఇన్నేండ్ల తరువాత ఇప్పుడు అదే భూతం సామ్రాజ్యవాదం, దాని కుంభస్థలంగా ఉన్న అమెరికాను మరోసారి “కమ్యూనిస్టు భూతం” ఊపివేస్తోంది. గతంలో అక్కడి కార్మికవర్గంపై సోషలిస్టు శిబిర సమాజాల ప్రభావం పడకుండా చూసేందుకు పాలకవర్గం అనుసరించని దుష్టవిధానాలు లేవు. ఇప్పుడు చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా వంటి సోషలిస్టు దేశాలు ఉన్నప్పటికీ గతం మాదిరి శిబిరంగా లేవు. అయినప్పటికీ గతం కంటే ఇప్పుడు ఎక్కువగా భయపడుతున్నారు. నాడు సోషలిజం విఫలమైందని అమెరికా, ఐరోపా దేశాల పాలకవర్గం ప్రచారం చేస్తే పెట్టుబడిదారీ విధానం విఫలమైందని యువతీయువకులు అనుభవపూర్వకంగా రోజురోజుకూ ఎక్కువగా గుర్తించటమే దీనికి కారణం. ఎరక్కపోయి ఇరుక్కున్నట్లుగా ఇరాన్ శక్తి యుక్తులను తక్కువగా అంచనా వేసిన డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నవంబరు మూడవ తేదీన జరిగే మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీని గెలిపించేందుకు నానా గడ్డీ కరుస్తున్నాడు. తెల్లవారితే ఇరాన్ మీద కొత్త అబద్దం, ప్రచారాన్ని ముందుకు తెస్తున్నాడు. దీంతో పాటు ఓటర్లను భయపెట్టేందుకు కూడా పూనుకున్నాడు. అమెరికాకు ఇప్పుడు “కమ్యూ నిజం పెద్ద ముప్పు” అంటూ ఊగిపోతున్నాడు. సోషలిజం, కమ్యూనిజాలను ఏడు నిలువుల లోతున తిరిగి లేవకుండా పాతిపెట్టామని చెప్పిన నోటితోనే ఇప్పుడు ముప్పు వచ్చిందని చెబుతున్నాడు. నిజంగా అలాంటి ముప్పు తలెత్తిందా? నిజానిజాలేమిటి?


ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ కమ్యూనిజాన్ని ఆలింగనం చేసుకొంటోదని డోనాల్డ్ ట్రంప్ గతవారంలో వ్యాఖ్యా నించాడు. పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్ధులుగా పురోగామివాదులు, అదే పార్టీలో డెమోక్రటిక్ సోషలిస్టులుగా ప్రకటించుకున్నవారు అనేక చోట్ల ముందంజలో ఉండటమే దీనికి కారణం. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో ట్రంప్, ఇతర కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎంత రెచ్చగొట్టినా ఓటర్లు డెమోక్రటిక్ సోషలిస్టు జోహ్రాన్ మందానీని మేయర్‌గా ఎన్నుకున్నారు.అనేక చోట్ల అదే పునరావృతం అయ్యేట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి. పురోగామివాదులకు పెద్దపీట వేయటం అమెరికా విలువలకు ముప్పు అంటూ మిత వాద శక్తులు గగ్గోలు పెడుతున్నాయి, వాటితో డెమోక్రటిక్ పార్టీలోని వారు కూడా చేతులు కలుపుతున్నారు. గత మంగళవారం నాడు న్యూయార్క్ నగరం నుంచి మూడు పార్లమెంటు స్థానాలకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన ప్రైమరీలలో మందానీ బలపరిచిన అభ్యర్ధులు నెగ్గారు, శుక్రవారం నాడు క్రైస్తవ మితవాదుల సభలో మాడ్లాడిన ట్రంప్ వారంతా కమ్యూనిస్టులని, దేశానికి కమ్యూనిజం ముప్పు వచ్చిందని ఆరోపించాడు, ఆదివారం నాడు వాషింగ్టన్ నగర మేయర్ కమ్యూనిస్టు కాబోతున్నట్లు ట్రంప్ వాపోయాడు.


దీంతో పాటు ఏకంగా దేశ రాజధాని వాషింగ్టన్ డిసి నగరంలోనే అలాంటి అభ్యర్ధి ముందుండటం ట్రంప్‌కు కలవరం కలిగించింది.ఫెయిత్ అండ్ ఫ్రీడమ్ కోయలిషన్ అనే మతపరమైన మితవాదుల వార్షిక సమావేశంలో ఆధిక్యతకోసం మార్గం అనే ఇతివృత్తంపై ట్రంప్ మాట్లాడుతూ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. ఆ అంశాలనే తరువాత తన సామాజిక మాధ్యమంలో కూడా పోస్టు చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం తరు వాత రెండవ ప్రపంచ యుద్ధం, పెరల్‌హార్బర్,లేదా 2011 సెప్టెంబరులో న్యూయార్క్ నగర ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడి కంటే 250 ఏండ్ల నాడు ఏర్పడిన అమెరికాకు తొలిసారిగా కమ్యూనిజం ముప్పుగా మారిందని పేర్కొన్నాడు. ఉచితంగా ఇండ్లు, ఆహారం వంటి నినాదాలతో ముందుగా కమ్యూనిజం ఆకర్షిస్తుంది తరువాత అది కూలిపోతుందని ట్రంప్ తన ఉపన్యాసంలో సెలవిచ్చాడు.డెమోక్రటిక్ పార్టీ పెద్ద ప్రమాదంలో ఉంది, మౌలిక మైన సామాజిక కార్యక్రమాలతో అది సాంప్రదాయ అమెరికా విలువలను ధ్వంసం చేస్తున్నది, ఇది ఒక్క న్యూయార్క్ నగరంతోనే ఆగరు, వామపక్ష తీవ్రవాదులు పిల్లలను నపుంసకులుగా మారుస్తారు, వారు క్రైస్తవులు, చర్చ్‌ల మీద యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలని చూస్తున్నారు. న్యూయార్క్ నగరంలో ఎన్నికైన కమ్యూనిస్టులను చూశారు, సాంప్రదాయ అమెరికా జీవన విధానాన్నే పూర్తిగా నాశనం చేయాలని చూస్తు న్నారని ట్రంప్ ఆరోపించాడు.

కమ్యూనిజం మతానికి వ్యతిరేకం, హింసదానిలో అంతర్భాగం, హత్యలు వారికి పెద్ద అంశం, వారు పశువులు అన్నాడు. గాజాలో ఇజ్రాయెల్ యూదు దురహంకారులు పిల్లలను ఎలా పథకం ప్రకారం వధించారో చూసి కూడా ఆ దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా సమర్ధించి చంపండి, నరకండి అంటూ ప్రోత్స హించిన ట్రంప్ కమ్యూనిస్టుల గురించి ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించటం లేదు. క్రైస్తవ మతవాదుల సమావేశంలో ప్రసంగించిన ప్రజాప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా అదే కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదంతో ఊగిపోయాడు. కమ్యూనిజం విదేశీ సమస్య కంటే అంతర్గత ముప్పు అన్నాడు.“దేశంలో ఇప్పుడు ఒక ప్రమాదకర ధోరణి నడుస్తోంది, సరిగా చెప్పాలంటే దేశమంతటా పార్లమెంటుకు పోటీ చేసేందుకు చిన్న మందానీలు ఎదుగుతున్నారు” అన్నాడు. ఇవాంజ లిస్టులంటే క్రైస్తవ మతమార్పిడిని బహిరంగంగా ప్రోత్సహించే మిషనరీ సంస్థలకు చెందిన వారు. అమెరికా చరిత్రలో కమ్యూనిస్టు వ్యతిరేకతను నూరిపోసినవారిలో వీరి పాత్ర కూడా తక్కువేమీ కాదు. ఇలాంటి వారంతా పాల్గొన్న సభ కనుకనే ట్రంప్ కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి మాట్లాడాడు.
ఎనిమిది పదుల ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియటం లేదు.

కమ్యూనిస్టులు చర్చీలను కూల్చి వేస్తారు, క్రైస్తవులను చంపుతారు, మతాన్ని నాశనం చేస్తారని మాట్లాడిన నోటితోనే అంతకు ముందు అసలు తానే పెద్ద కమ్యూనిస్టు దేశానికి నాయకుడినని , షీ జిన్‌పింగ్ ఎంతో మంచి వ్యక్తి అన్నాడు. శుక్రవారం నాడు కమ్యూనిజంపై ప్రారంభించిన దాడిని ఆదివారం నాడు కూడా కొనసాగించాడు. వాషింగ్టన్ డిసి నగర మేయర్ పదవికి డెమోక్రటిక్ పార్టీ మహిళా నాయకురాలు జానీస్ లెవిస్ జార్జి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆమె దాదాపు ఎన్నికయి నట్లే అని స్వయంగా ట్రంప్ తన సామాజికమాధ్యమంలో పోస్టు పెట్టాడు. ఆమె ఒక కమ్యూనిస్టు అని, రాజధాని నగరానికి ఆమె విధానాలు హాని కలిగిస్తాయని వాపోయాడు. నగరంలోని జైళ్లను ఖాళీ చేస్తారని, వలసదార్లకు రక్షిత నగరంగా మారుస్తారని, నేరగాండ్లను నగరానికి తిరిగి తీసుకువస్తారని ఆరోపించాడు. లెవిస్ జార్జి ప్రస్తుతం నగర కార్పొరేషన్ వార్డు సభ్యురాలిగా ఉన్నారు.ఇప్పుడున్న డెమోక్రటిక్ మేయర్ మరోసారి పోటీచేయటంలేదు, దాంతో ఆమె ముందుకు వచ్చారు, తాను డెమోక్రటిక్ సోషలిస్టునని స్వయంగా ప్రకటించు కున్నారు. అధికార రిపబ్లికన్ పార్టీకి కనీసం మేయర్ అభ్యర్ధికూడా లేని స్థితి.లెవిస్ కనుక అభ్యర్ధిగా ఎన్నికైతే నగరాన్ని ఫెడరల్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ట్రంప్ బెదిరించాడు. గతేడాది ఆగస్టు నుంచి నగరంలో నేరాలను అరికట్టే పేరుతో వివిధ రాష్ట్రాల నుంచి రప్పించిన నేషనల్ గార్డు దళాలను తిష్ట వేయించాడు.

అంతకు ముందు నగరాన్ని సుందరీకరించేందుకు అనేక పథకాలను రూపొందించినట్లు ప్రకటించిన ట్రంప్ లెవిస్ అభ్యర్ధిత్వం ఖరారు కాగానే ఆ పథకాలు ఎలా అమలు చేస్తారో చూస్తానంటూ మాట్లాడాడు.ట్రంప్ తనపై మోపిన అభాండాలు, ఆరోపణలను లెవిస్ ఖండించారు.ట్రంప్ అధికార యంత్రాం గంతో కలసిపని చేస్తానని అన్నారు. డెమోక్రటిక్ పార్టీ అధిష్టానవర్గ అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీలో బడా ప్రముఖులుగా ఉన్న వారిని ఓడించేం దుకు తనతో భావసారూప్యత కలిగిన ముగ్గురిని బలపరచి మందానీ తన సత్తా చాటుకున్నాడు. పాత రాజకీయాలే ప్రస్తుత సంక్షోభానికి కారణమని, ఆ రాజకీయాలు దాన్నుంచి బయటపడవేయలేవని, న్యూయార్క్ నగరవాసులు నూతన రాజకీయాలను కోరుకుంటు న్నారని మందానీ వ్యాఖ్యానించాడు. దీని అర్ధం ఇజ్రా‌యిల్‌తో అమెరికా సంబంధాలు, అసమానతలు చెల్లవని చెప్పటమే అని విశ్లేషకులు చెబుతున్నారు.డెమోక్రటిక్ పార్టీ అధిష్టానం అభ్యర్ధులుగా ధనికులు, అందునా ధనవంతుల మీద పన్నులు వేయాలనటాన్ని వ్యతిరేకించే వారిని ప్రతిపాదించింది. మందానీ వారికి వ్యతిరేకంగా తన మద్దతుదార్లను గెలిపించాడు. యూదు సామాజిక తరగతి గణనీయంగా ఉన్న న్యూయార్క్ నగరంలో ఈ ముగ్గురూ ఇజ్రాయిల్‌ వైఖరిని దానికి బేషరతుగా మద్ద‌తిచ్చే ట్రంప్ విధానాన్ని వ్యతిరేకించేవారు కావటం విశేషం. ఈ ఫలితాలు సోషలిస్టు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతుగా కూడా పరిగణిస్తున్నారు.

డెమోక్రటిక్ పార్టీలో డెమోక్రటిక్ సోషలిస్టులు పెరుగుతున్నారు. అమెరికాలో పెట్టుబడిదారీ వ్యవస్థ సామా జిక భద్రతా పథకాలను అమలు జరుపుతున్నప్పటికీ సమాజంలో అసమానతలు, అసంతృప్తి పెరుగుతున్నాయి. సామాన్యులు స్వంత ఇల్లు సమకూర్చుకోవటం పెద్ద సమస్యగా మారుతోంది, ఆరోగ్య సంరక్షణ కూడా అదే విధంగా ఉంది. ఒక పరిమితికి మించి జనాలను పెట్టుబడిదారీ వ్యవస్థ పట్టించుకోదని తేలిపోయింది. యువతరానికి విద్యారుణాలు తలకుమించిన భారంగా మారాయి. తమ ఆకాంక్షలను నెరవేర్చ టంలో పెట్టుబడిదారీ విధానం విఫలమైందని భావించే యువత సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు అనేక సర్వేలు వెల్లడించాయి. ధనికుల మీద పన్నులను అధికంగా విధించి ఆమేరకు సామాన్యులకు ఫలాలను అందించాలని డెమోక్రటిక్ సోషలిస్టులు కోరుతున్నారు, నిజమే కదా అని యువత ఆకర్షితులౌతున్నారు. అమెరికా ఆర్థిక పురోగమనం ఆశించిన విధంగా లేదు, నిజవేతనాలు పడిపోతున్నాయి.అనవసరమైన యుద్ధాలతో ఆయుధ కంపెనీల కోసం ఖజానా ఖాళీ చేయటం మీద ఉన్న శ్రద్ధ ఏ పార్టీ అధికారంలో ఉన్నా జనం మీద చూపటం లేదు. నిజానికి డెమోక్రటిక్ సోషలిస్టులు ఇప్పుడున్న పెట్టుబడిదారీ విధానాన్ని కూల్చివేసి సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం చేస్తామని చెప్పటం లేదు. ఇప్పుడున్న దానిలోనే కార్మికవర్గానికి అనుకూలంగా మరిన్ని సంక్షేమ చర్యలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దాన్నే ట్రంప్ వంటి వారు కమ్యూనిజంగా అభివర్ణిస్తున్నారు. సంస్కరణలకు ఒక పరిధి, పరిమితి ఉంటాయి, అది దాటి ముందుకు పోవాలంటే కమ్యూనిజమే శరణ్యమని యువత మరికొన్ని అడుగులు ముందుకు వేస్తారేమో అన్నది అమెరికా పెట్టుబడిదారుల అసలు భయం, దానికి ఎవరూ చేసేదేమీ లేదు, రానున్నది రాకమానదు, కానున్నది కాక మానదన్నది చరిత్ర చెప్పిన సత్యం!

Share this:

  • Tweet
  • More
Like Loading...

రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు – తిమింగలాలను వదలి పిత్తపరిగలను పట్టారు,కాషాయ దళాల తీరే వేరేబ్బా ! వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కదా అర్ధం చేసుకోరూ !!

28 Sunday Jun 2026

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ 1 Comment

Tags

2027 UP elections, BJP, Narendra Modi Failures, Ram Temple donation row, RSS, Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust, VHP, Yogi Adityanath

ఎం కోటేశ్వరరావు

ఆరఎసఎస్‌లో ఉన్నవారందరినీ దొంగలనటం లేదుగానీ దానిలో కూడా దొంగలు, నేరగాండ్లను కాపాడేవారు ఉన్నారని అయోధ్య రామాలయంలో హుండీ సొమ్ము, బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల దొంగతనం కేసులో వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.దేశం కోసంధర్మం కోసం కట్టుకున్న భార్యలను వదలివేయమని కూడా ఆరఎసఎస్ ఎక్కడా చెప్పలేదు, కానీ వివాహాన్ని దాచి, భార్యలను గాలికివదలివేసిన వారిని మాత్రం అది సమర్ధిస్తోంది, అందలాలెక్కిస్తోంది. ఆ సంస్థలో పనిచేసే వారి uండారం బయటపడుతుంటే గుడ్డిగా దాన్ని నమ్మినవారు గుండెలు బాదుకుంటున్నారు.ఎవరి లోగుట్టు అయినా ఇంతే, బయటపడటానికి సమయం రావాలి. అయోధ్య ఆలయకానుకల కుంభకోణం ఆ గుంపులో తలెత్తిన కుమ్ములాటల కారణంగానే బయటపడుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల నేపధ్యంలోఈ కుంభకోణాన్ని సాధ్యమైన మేరకు మÖసిపెట్టేందుకు, మరిన్ని వివరాలు వెల్లడిగాకుండా చూసేందుకు “పెద్దలు ” రంగంలోకి దిగారు. ఉదాహరణకు అయోధ్య ఆందోళనలో పేరుమోసిన వారిలో ఒకరైన మాజీ ఎంపీ వినయ్ కతియార్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన తరువాత సదరు పెద్దమనిషి నోరు కట్టేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అసలు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్ రామాలయ ఉద్యమంలో భాగస్వామి కాదని కతియార్ చెప్పారు.సిట్ ప్రాధమిక నివేదిక వెల్లడి కాగానే చంపక్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా “ నైతిక ” కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రామాలయ నిధులపై విమర్శలు వచ్చినపుడు అలాంటిదేమీ లేదని దబాయించి మాట్లాడిన పెద్దలు తీరా అనివార్యమైన సిట్ దర్యాప్తు తరువాత నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారు. నిజానికి ఆ నిబద్దత, నైతిక విలువలే ఉంటే సిట్ ఏర్పాటుకు ముందే రాజీనామా చేస్తే అదోతీరు ! హవాలా కేసులో ఆరోపణలు రాగానే అద్వానీ రాజీనామా చేశారు కదా ! మరింత ముదిరి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రంగా మారకుండా చూసుకొనేందుకు తప్పనిసరై రాముడి కానుకల స్వాహా మీద యోగి ఆదిత్యనాధ్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. జూన్ 14న అది రంగంలోకి దిగి 25వ తేదీ నాటికి ఎనిమిది మందిపై అభియోగం మోపి అరెస్టులు కూడా చేసింది. ఎంత వేగంగా పని చేసిందో చంద్రబాబు నాయుడు అండ్‌కో అర్ధం చేసుకోవాలి.


నిందితులంతా ఎవరంటే అందరూ రకరకాల పేర్లతో ఉన్న కాషాయ గుంపులో వారే. క్లుప్తంగా ఎవరేమిటో చూద్దాం. రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, ఇతగాడు ఒక సాధారణ టెంపో డ్రైవర్, రామాలయ నిర్మాణ ప్రారంభంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్ కారు డ్రైవర్‌గా చేరాడు, తరువాత ట్రస్ట్ ఉద్యోగిగా, కీలకమైన బాధ్యతలో ఉన్నాడు. ఇతగాడి మేనల్లుడు మనీష్ యాదవ్, ఇతడి దగ్గర డబ్బు దొరికిందని పోలీసులు చెప్పారు. అనుకల్ప మిశ్రా, ట్రస్టు విరాళాల లెక్కలు, నిర్వహణలో కీలక పాత్రధారి, ఇతని బావమరిది లవకుశ్ మిశ్రా, కానుకలు, విలువైన వస్తురూప కానుకల పర్యవేక్షకుడు.అవినాష్ శుక్లా హుండీ లెక్కింపులో భాగస్వామి, మరోముగ్గురు హుండీ లెక్కింపులో భాగస్వాములు.కానుకల అపహరణ ఆరోపణలు వచ్చినపుడు అబ్బే అలాంటిదేమీ లేదంటూ అనేక మంది మÖసిపెట్టేందుకు చూశారు.ఇప్పుడు అరెస్టయిన నిందితుల వెనుక ఉన్న అసలైన పెద్దలు బయటకు వచ్చే అవకాశం లేదని సిట్ దర్యాప్తుకు ముందే అనుమానాలు వ్యక్తం చేశారు. అదే జరిగింది.


అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణ అంశంలో బిజెపిని లక్ష్యంగా చేసుకొని సమాజవాది పార్టీ, కాంగ్రెస్ 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ప్రయోజనాలకోసం వినియోగించుకొనేందుకు చూస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) అంతర్జాతీయ అధ్యక్షుడు, బిజెపి నేత, ఢిల్లీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అలోక్ కుమార్ ఆరోపించారు. ఆరఎసఎస్ ఏర్పాటు చేసిన అనేక సంస్థలలో విహెచ్‌పి ఒకటి.నిజానికి జూన్ ఏడవ తేదీన సమాజవాది పార్టీకి చెందిన మాజీ మంత్రి పవన్ పాండే ఐదు నుంచి ఏడున్నర కోట్ల రూపాయల మేర రామాలయ నిధులను అపహరించినట్లు ఆరోపించారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉందని, న్యాయ విచారణ జరిపించాలని సమాజవాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ స్పందించారు.రామ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అక్రమాలకు పాల్పడలేదని, దొంగతనం జరిగినట్లు ఎలాంటి అధారాలు లేవని అలోక్ కుమార్‌తోసిపుచ్చారు. చంపత్ రాయ్ విహెచ్‌పి ఉపాధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నందున ఇంతకు మించి ఆ సంస్థ నేతల నుంచి వేరుగా ఊహించలేము. ఈ అంశంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ బిజెపి నేత డాక్టర్ రజనీష్ సింగ్ జూన్ 9న ప్రధాన మంత్రికి ఒక లేఖ రాశారు. ఒక నివేదిక సమర్పించాలని ప్రధాని కార్యాలయం సదరు ట్రస్ట్‌ను కోరింది.తప్పనిసరి పరిస్థితిలో జూన14న యోగి ఆదిత్యనాధ్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఆరు రోజుల విచారణ తరువాత దాదాపు 150 మంది అనుమానితులను గుర్తించినట్లు , వారిలో 25 మంది మీద చర్యలుంటాయని మీడియాకు సమాచారం అందింది.అనుమానితులుగా ఉన్నవారెవరూ అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని సిట్ ఆదేశాలు జారీ చేసింది.కొందరు కనిపించకుండా తప్పుకున్నారని వార్తలు. భక్తులు ఇచ్చిన కానుకలు, భూమికొనుగోలు లావాదేవీలు, బ్యాంకు ఖాతాలలో కనుగొన్న అంశాల గురించి ముఖ్యమంత్రికి ప్రాధమిక నివేదికను అందచేశారు. హుండీ విరాళాలను లెక్కించే ఐదుగురు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు రెండు కోట్ల రూపాయలను, కొంత బంగారాన్ని సిట్ స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.ఒక సారి కాదు హుండీల నుంచి పదే పదే సొమ్ముకొట్టేసినట్లు విచారణలో తేలింది. అయినా ట్రస్ట్ పెద్దలు మౌనంగా ఉన్నారంటే వారి పాత్ర లేకపోతే అలా జరుగుతుందా !


సిట్ ఏర్పాటకు ముందు జరిగిన పరిణామాలను చూద్దాం. రాముడి నిధులను అపహరించటమేగాక ఆ విషయాన్ని మÖసిపెట్టేందుకు చూశారని కర్నీ సేన జాతీయ అధ్యక్షుడు సూరజ్ పాల్ అమ్ము చెప్పారు. ట్రస్ట్ ప్రముఖులు గోపాల్ రాయ్,అనిల్ మిశ్రా, టిను యాదవ్, లవకుష్ మిశ్రా పేర్లు బయటకు వచ్చినప్పటికీ ఎవరి మీద కేసు దాఖలు చేయలేదన్నారు.ఒక సాధారణ వ్యక్తి పర్సును దొంగిలిస్తే పోలీసులు వెంటనే పేదలను నిర్బంధించి ప్రశ్నిస్తారని, అంతర్జాతీయంగా ఖ్యాతి ఉన్న రామాలయం విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోకపోవటం కొత్త ప్రశ్నలను ముందుకు తెస్తోందన్నారు. ఎవరి మీదా కేసు దాఖలు చేయకుండా దర్యాప్తు ఎలా చేస్తారని జ్యోతిష్ పీఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. ఆ చర్యకు చట్టబద్దత ఎలా ఉంటుందన్నారు.నిజాలను వెలికి తీసేందుకు గాక మÖసిపెట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. రామాలయ ట్రస్ట్ ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఇంతవరకు ఏ ఒక్కటి రుజువు కాలేదని కొందరు విహెచ్‌పినేతలు వాదిస్తున్నారు. తొలిసారిగా ప్రధాని కార్యాలయం ఎందుకు స్పందించాల్సి వచ్చిందో వారు మాట్లడరు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నిజానిజాలను బయటపెడుతుందా ? తిమింగలాలను వదలి పిత్తపరిగలను పట్టుకొని గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా మÖసివేస్తుందా ? నిజాయితీతో నిజానిజాలు బయటపెట్టినా, పెట్టకున్నా వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం ఒక ప్రచార అస్త్రంగా మారటం ఖాయం. రామజన్మ భూమి తీర్దక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఆరఎసఎస్ ప్రచారక్, విశ్వహిందూపరిషత్‌తో సంబంధాలు కలిగిన చంపత్ రాయ్ ఉన్నారు. అతగాడి వ్యవహారశైలి గురించి ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. రామాలయం కోసం ఆందోళన చేసిన వారిలో అనేక మందిని ఆలయ నిర్మాణం, ట్రస్ట్ వ్యవహారాల్లో పక్కన పెట్టారన్నది ప్రధాన విమర్శ. ట్రస్ట్ అధ్యక్షుడిగా మహంత్ నిత్యగోపాల్ దాస్ ఉన్నప్పటికీ వృద్దాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నందున రాయ్ పెత్తనమే నడుస్తున్నదని చెబుతారు. మిగిలిన సభ్యులు రాయ్ పలుకుబడి కారణంగా నామమాత్రంగా ఉండిపోతున్నారన్నది విమర్శకుల మాట.


రామాలయ ఆందోళన ప్రముఖుల్లో వినయ్ కతియార్ ఒకరు.సంతోష్ దూబే, మహంత్ కమల్ నయన్ దాస్ వంటి వారు ఇప్పుడు ట్రస్ట్ వ్యవహారాలను ప్రశ్నిస్తున్నారు.అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తరువాత గొంతు విప్పారు. అయితే పెద్దలు జోక్యం చేసుకొని వినయ్ కతియార్ నోరు మÖయించారు.పరువు కాపాడుకొనేందుకు సిట్ విచారణ తతంగంలో ఎలాంటి పొరపాట్లు లేవని లేదా ఏవైనా దొరికితే ఇతరులను ఇరికించి నేతలుగా ఉన్నవారికి సంబంధం లేదని నివేదికలు వెలువడవచ్చని, తరువాత వారిని ట్రస్ట్ నుంచి తొలగిస్తారని వార్తలు వచ్చాయి. కేవలం నీళ్ల నుంచి పాలను వేరు చేయాలని కాదు, బంగారాన్నుంచి పసిడిని, వెండి నుంచి వెండిని ఎలా వేరు చేశారో తేల్చాలని జనం కోరుతున్నారని సమాజవాదీ నేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.కానుకల చోరీ ఆరోపణలు హిందువుల విశ్వాసలకే దెబ్బ అని అయోధ్యలోని రాసిక్ పీఠాధీశ్వర్ మహంత్ జనమేజయ శరణ్ మహరాజ్ వర్ణించారు. ఊహించటానికే సాధ్యం కావటం లేదన్నారు. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా సందర్భంగా 66 రోజుల పాటు ఐదు కోట్ల మంది భక్తులు అయోధ్య రామాýయాన్ని సందర్శించారని ఆ సందర్భంగా వచ్చిన విరాళాల మొత్తం కేవలం వంద కోట్ల రూపాయýకు లోపే హుండీల్లో ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదని భావిస్తున్నారు.దేవాలయాల నిర్వహణ ప్రభుత్వం నుంచి వేరు చేసి మత సంస్థలకు అప్పగించాలని హిందూత్వశక్తులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయోధ్య రామాలయ నిర్వహణలో అధికారులకు ప్రమేయం లేదు, కేవలం ట్రస్టు మాత్రమే అన్ని వ్యహరారాలను చూస్తున్నది. కానుకల అపహరణ అంశం వెలుగులోకి వచ్చిన తరువాత ఈ ఆలయానికి ఒక అధికారిని సిఇఓగా నియమించాలని యోగి సర్కార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దేవాలయాల నిర్వహణలో ట్రస్టులు, మత సంస్థలకు తప్ప అధికారగణం, ప్రభుత్వ ప్రమేయం ఉండరాదని సనాతన, హిందూత్వశక్తులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ పాలనలో అధికార యంత్రాంగానికి అప్పగిస్తే పాపం వారేం అవుతారో తెలియదు.


రామాలయానికి బంగారం, వెండి, రత్నాలు,ఇతర విలువైన రాళ్లతో తయారు చేసి భక్తులు బహుకరించిన 1,250 పవిత్ర ఇటుకలు కనిపించటం లేదని ధర్మసేన సంస్థ స్థాపకుడు సంతోష్ దూబే చెప్పారు. పట్టణాలు, గ్రామాలలో వాటిని పూజించి 1989లో అయోధ్యకు చేర్చారని అన్నారు.అవి 2002వరకు కరసేవ పురంలో ఉన్నాయని, ఇప్పుడు కనిపించటం లేదని, వాటిని రక్షించాల్సిన బాధ్యత రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్‌దేనని దూబే చెప్పారు. చిత్రం ఏమిటంటే ఒకవైపు చంపత్ రాయ్‌ను సమర్ధిస్తూనే రామాలయం పేరుతో విరాళాలు వసూలు చేసిన రామాలయ ట్రస్ట్, రామజన్మభూమి మందిర్ పునర్‌నిర్మాణ ట్రస్టులు చేసిన విరాళాలు, బంగారం సేకరణ వ్యవహారాలపై కూడా దర్యాప్తు జరపాలని హరిద్వార్‌లో రెండు రోజుల పాటు సమావేశమైన విశ్వహిందూపరిషత్ కేంద్ర సలహామండలి సమావేశం డిమాండ్ చేdంది.నాటి ప్రధాని పివి నరసింహారావు మార్గదర్శనలో 1995లో రామాలయ ట్రస్ట్ ఏర్పాటైంది. తరువాత బిజెపి నేతలతో మరో ట్రస్ట్ ఏర్పడింది.బాబరీ మసీదు వివాదాస్పదం కావటానికి కారకుడు ధరమ్‌దాస్, 1949లో రాముడి విగ్రహాన్ని మసీదులో పెట్టి వివాదాన్ని కొత్త మలుపు తిప్పాడని చెబుతారు. ఇప్పుడు ఆ పెద్దమనిషి రామాలయంలో జరిగిన చోరీతో సాధువులందరూ దిగ్భ్రాంతి చెందారని అన్నారు.దాస్ లక్ష్యం నరేంద్రమోడీ సర్కార్ 2020లో ఏర్పాటు చేసిన ట్రస్ట్ పాలకవర్గం మీదనే. ట్రస్ట్ అంటే విశ్వాసం, ఇప్పుడు అది లేదు, అక్కడ ఉన్నవారందరూ దొంగతనంలో భాగస్వాములే కనుక ట్రస్ట్‌ను రద్దు చేయాలన్నారు. అన్ని దేవాలయాలను కబ్జా చేసేందుకు విశ్వహిందూపరిషత్ చూస్తోందని కూడా అన్నారు. ట్రస్ట్ సభ్యుడైన గోపాల్‌రావు ఆరఎసఎస్ నేత, అతగాడిని ఉద్దేశించి దొంగలు ట్రస్ట్ వ్యవహారాలను తమ చేతుల్లోకి తీసుకున్నారని విమర్శించిన వినయ్ కతియార్‌తో మోడీ మాట్లాడిన తరువాత స్వరాన్ని తగ్గించి ట్రస్ట్‌లో ఉన్నవారు పర్యవసానాలను భరిస్తారంటూ మాట్లాడారు. ఫైజాబాద్ జిల్లా(అయోధ్య అక్కడే ఉంది) విహెచ్‌పి మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ చంపత్ రాయ్ మోసగాడు కాదు గానీ తన అనుచరులుగా పెద్ద మోసగాండ్లనే ఎల్లవేళలా ఎంచుకుంటారని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.కాషాయ గుంపు కుమ్ములాటలకు అతీతం కాదు. ఒక నాడు విశ్వహిందూపరిషత్ అగ్రనేతగా ఉన్న ప్రవీణ్ తొగాడియా ప్రధాని నరేంద్రమోడీ విమర్శకులలో ప్రముఖుడు,ఆ కారణంగానే ఏకంగా 2018లో ఆ సంస్థ నుంచి పంపివేశారు. రామాలయ ఆందోళనలో భాగస్వాములైన అనేక మందిని మసీదు కూల్చివేసిన తరువాత పక్కకు పెట్టి ఆరఎసఎస్ ప్రముఖులు రంగంలోకి వచ్చినట్లు అనేక విమర్శలు ఉన్నాయి. నరేంద్రమోడీ జీవిత చరిత్రను రాసిన మధు పూర్ణిమా కిష్వర్, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మోడీ ఏలుబడిలో కొందరు మహిళలకు మంత్రిపదవులు, ఎంపీలు ఎలా అయ్యారో వెల్లడిస్తున్నారు. వారికి పదవులు రాని కారణంగా ఆరోపణలు చేస్తున్నట్లు బిజెపి నేతలు కొట్టి పారవేస్తారు.ఏ పార్టీలో జరిగేదైనా అదే, అధికార పంపకాల్లో తేడాలు వస్తేనే కదా నిజాలు వెల్లడయ్యేది,గతంలో కాంగ్రెస్‌లో, ఇతర కొన్ని ప్రాంతీయ పార్టీల్లో జరిగిందే ఇప్పుడు బిజెపిలో, దాని మాతృసంస్థ సంఘపరివార్‌లో మొదలైంది, కాదంటారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బ్రెక్సిట్ సంక్షోభం ` పదేండ్లలో బ్రిటన్‌లో ఏడో ప్రధాని !

24 Wednesday Jun 2026

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

Andy Burnham, brexit, Labour Party Turmoil, UK political crisis


ఎం కోటేశ్వరరావు


మునిగిపోయే నావ నుంచి బయటకు దూకినట్లుగా బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే అక్కడి పాలకవర్గమే బయటకు నెట్టిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.అలాంటి పడవ సరంగుగా బ్రిటన్‌లో 1902 తరువాత తొలిసారిగా మంత్రి పదవిలో తప్ప ప్రతిపక్ష నేతగా అనుభవం లేని లేబర్ పార్టీ నేత, మాంచెస్టర్ మేయర్‌గా పనిచేసిన అండీ బర్న్‌హామ్ ప్రధాని పగ్గాలు చేపట్టనున్నాడు.బ్రిటన్ ప్రధానికి ఎన్నికయ్యేవారికి ప్రధానితో సమానంగా పరిగణించే విదేశాంగ, ీVAంమంత్రిత్వశాఖల్లో పని చేసిన అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకొనేవారు. ఆండీ ఆ పదవులను నిర్వహించలేదు.నాయకత్వానికి ఎలాంటి పోటీ లేకపోతే జూలై 16 నాటికి దేశ ప్రధానిగా బాధ్యతలను చేపడతాడు.ఒక వేళ పోటీ జరిగితే సెప్టెంబరు వరకు ఫలితం కోసం ఆగాల్సి ఉంటుంది.గతంలో ఆర్థర్ బాల్‌ఫోర్ 1902లో ఎలాంటి పదవులు నిర్వహించకుండా కన్సర్వేటివ్ పార్టీ తరఫున ప్రధానిగా ఎన్నికయ్యాడు. పార్టీ కార్యకర్తల చెప్పింది తాను విన్నానని, వచ్చే ఎన్నికలకు నాయకత్వం వహించలేనని, ప్రధాని పదవిలో కొనసాగలేనని రాజీనామా చేస్తున్నట్లు కెయిర్ స్టార్మర్ సోమవారం నాడు ప్రకటించారు. నూతన నేతను ఎన్నుకొనేంతవరకు పదవిలో కొనసాగుతానని బ్రిటన్ రాజుకు నివేదించాడు. ఐరోపా యÖనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన గత పదేండ్లలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రధానులు మారారు. స్టార్మర్ రాజీనామా గురించి ముందే డోనాల్డ్ ట్రంప్ ప్రకటించటం విశేషం.ఒక నాడు రవి అస్తమించని సామ్రాజ్యవాదిగా ఉన్న బ్రిటన్‌లో ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి అది ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలే కారణం.తమ ప్రయ్పుోనాలను కాపాడే సమర్ధుడికోసం అక్కడి పాలకవర్గం చేస్తున్న ప్రయోగాలకు నేతలు బలి అవుతున్నారు.పదేండ్లలో ప్రతి ఒక్కరూ అంతన్నాడింతన్నాడే గంగరాజు అన్నట్లుగా మాట్లాడి తీరా అధికారానికి వచ్చిన తరువాత అటు జనానికి ఇటు కార్పొరేట్లకు ఎటూ కాకుండా పోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.


గత పదేండ్లలో లేబర్,కన్సర్వేటివ్ పార్టీలకు చెందిన ప్రధానులందరూ విఫలమైన చరిత్రను మÖటగట్టుకున్నవారే. మే నెలలో మేకర్‌ఫీల్డ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బరన్‌హామ్ లేబర్ పార్టీ తరఫున ఘనవిజయం సాధించాడు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార లేబర్ పార్టీ చావు దెబ్బతిన్నది, పచ్చిమితవాద రిఫార్మ్ పార్టీ ఆ ప్రాంతంలో కూడా విజయాలు సాధించినప్పటికీ బరన్‌హామ్ గెలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో కూడా లేబర్ పార్టీ అక్కడ గెలిచినప్పటికీ 45శాతం మాత్రమే ఓట్లు రాగా ఉప ఎన్నికలో 54.8శాతం వచ్చాయి. మితవాదులను ఓడించేందుకు లిబరల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ అభిమానులు లేబర్ పార్టీ వైపు మొగ్గగా కన్సర్వేటివ్‌లు రిఫార్మ్ వైపు నిలవటంతో ఆ పార్టీకి కూడా మÖడు శాతం వరకు ఓట్లు పెరిగాయి. ఇంకా నూతన ప్రధాని అధికారానికి రాకముందే ఆండీ విధానాలు ఎలా ఉంటాయనే చర్చ ప్రారంభమైంది. స్థానికుల ఉపాధిని హరిస్తున్న వలస కార్మికులను వెంటనే స్వదేశాలకు పంపాలన్నది రిఫార్మ్ పార్టీ వాగ్దానం. ఇతర రాజకీయ పార్టీల నేతలు అవకాశవాదంతో రిఫార్మ్‌పార్టీ చెబుతున్నది న్యాయబద్దమే అంటూనే దాన్ని ఓడించేందుకు ప్రయత్నించారు. లేబర్ పార్టీ నేత పదిహేనేళ్ల పాటు సంపాదించుకున్న విదేశీయులను బయటకు పంపవచ్చంటూ కెయిర్ స్టార్మర్ ఆచరణలో పచ్చిమితవాదులను బలపరిచే విధంగా మాట్లాడాడు. బరన్‌హామ్ విషయానికి వస్తే సోషలిస్టు మాదిరి జనాన్ని ఆకట్టుకుంటాడు. అధికారానికి వచ్చిన తరువాత ఆ మాటలకు కట్టుబడి ఉంటాడా అన్నది సమస్య. ఒక పార్లమెంటు సభ్యుడిగా 2001లో ఇరాక్‌పై దాడిని సమర్ధిస్తూ ఓటు వేశాడు.2009లో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నపుడు ప్రభుత్వ రంగంలోనే వైద్య సేవలు ఉండాలని తరువాతే ప్రైవేటు సంస్థలు ఉండాలన్న వైఖరి తీసుకోవటంతో కార్పొరేట్ శక్తులు ఆగ్రహించాయి.ఉప ఎన్నికల ప్రచారంలో నీటి సరఫరాను జాతీయం చేయాలంటూ గట్టిగా మాట్లాడి తరువాత స్థానికుల ఆధీనంలో ఉండాలంటూ మాట మార్చాడు. బ్రిటన్‌లో ఇండ్ల సమస్య తీవ్రంగా ఉంది. ధనికదేశాల్లో 2008లో తలెత్తిన సంక్షోభం తరువాత తొలిసారిగా ప్రస్తుతం ఇల్లు కొనుగోలు చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది.ధరలు పెరగటంతో పాటు కార్మికులకు వేతనాలు పెరగలేదు, మరోవైపు వడ్డీ రేట్లు పెరిగాయి.అయితే నిర్మాణ కంపెనీలు తక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మించినా లాభాలు తగ్గలేదు. అల్పాదాయ వర్గాలు కొనుగోలు చేయగలిగిన ఇండ్ల నిర్మాణాలను చేపట్టటం లేదు.


స్టార్మర్ రాజీనామా చేసినంత మాత్రాన రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశాలు లేవన్నది అభిప్రాయం.మంత్రులెవరూ రాజీనామా యోచనలో లేనందున వారంతా కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుత పార్లమెంటుకు 2024జూలైలో ఎన్నికలు జరిగాయి, తిరిగి 2029లో కొత్త పార్లమెంటు ఏర్పాటు కావాల్సి ఉంది.తప్పుడు విధానాల కారణంగా స్టార్మర్మ్ పలుకుబడి దిగజారటం, స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్ద ఎదురుదెబ్బ వంటి పరిణామాలు కొత్త ప్రధాని ఎన్నికకు దారితీశాయి. నిజానికి అంతకు ముందే పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్ ఉంది. ఉప ఎన్నికకు ముందే నాయకత్వ మార్పు జరగాలని ఆండీ బహిరంగంగానే చెప్పాడు. అతను పార్లమెంటులో ప్రవేశించేందుకు అధికారపార్టీ సభ్యుడొకరి చేత రాజీనామా చేయించటం కూడా స్టార్మర్‌కు వ్యతిరేకంగా సమీకరణ అవుతున్నట్లు సూచన ఉంది.. పార్టీ నూతన నేతను ఎన్నుకొనేందుకు లేబర్ పార్టీ జాతీయ కార్యవర్గం విధాన ప్రక్రియను ప్రారంభించనుంది. జూలై తొమ్మిదిన పోటీ పడేవారి నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది.ఒక్కరే ఉంటే 16వ తేదీన నాయకత్వ మార్పిడి జరుగుతుంది లేకుంటే తిరిగి పార్లమెంటు సమావేశం జరిగే సెప్టెంబరు వరకు ఆగాల్సిందే. ఒక వైపు పశ్చిమాసియా సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు, ఇతర ప్రాంతాల్లో తలెత్తిన ఉద్రిక్తతల పూర్వరంగం, మరోవైపు పెరుగుతున్న చైనా, దశాబ్దాల తరబడి నాటో, ఐరోపాకు ఇచ్చిన మద్దతు నుంచి వెనక్కు తగ్గుతున్న అమెరికా చర్యల నేపధ్యంలో అనుభవజ్ఞుడైన విదేశాంగ విధానంపై అనుభవం లేని ఆండీ ఎలా నెగ్గుకు రాగలరని అనేక మంది ప్రశిస్తున్నారు.


కార్పొరేట్లకు విశ్వాసం కలిగించేందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాజీ ప్రధాన ఆర్థికవేత్త ఆండీ హల్డేన్, మరో ఇద్దరు ప్రముఖులను ఒక బృందంగా ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. మంచినీటి వ్యాపారాన్ని జాతీయం చేస్తారా , ఇంథన రంగంలో తెచ్చే మార్పులు వీరి ముందున్న ప్రధాన సవాళ్లు.మార్గరెట్ థాచర్ హయాంలో పెద్ద ఎత్తున ముందుకు తెచ్చిన ఎగువ నుంచి దిగువకు సంపదలు దిగుతాయనే ఊట సిద్దాంతాన్ని ప్రశ్సిస్తూ నయా ఉదారవాద విధానాలకు స్వస్తి చెబుతామని ఆండీ గతంలో చెప్పాడు.దీంతో నూతన లేబర్ పార్టీ పురుడు పోసుకుంటుందని అనేక మంది ఆశిస్తున్నారు. నయా ఉదారవాద విధానాలంటేనే కార్పొరేట్లకు అనుకూలం, కార్మికవర్గానికి వ్యతిరేకమైనవని వేరే చెప్పనవసరం లేదు. ఐరోపాలో ప్రతిపక్షంలో ఉన్నపుడు సోషలిస్టు, సామాజిక న్యాయం గురించి మాట్లాడిన వారందరూ అధికారంలోకి రాగానే కార్పొరేట్ల సేవలో తరించటాన్ని చూశాము, మనదేశంలో కూడా అదే జరుగుతున్నదనుకోండి.నయా ఉదారవాద విధానాలకు తెరతీసింది కాంగ్రెస్, మన్మోహన్ సింగ్ అన్నది వేరే చెప్పనవసరం లేదు.ప్రారంభంలో మద్దతు ఇచ్చిన బడా కార్పొరేట్ శక్తులు తాము ఆశించిన రీతిలో, వేగంగా సంస్కరణలు అమలు జరపకపోవటంతో ఆపని తాను చేస్తానన్న నరేంద్రమోడీని సరైన నేతగా బావించి అధికారానికి తీసుకువచ్చారన్నది బహిరంగ రహస్యం. ద్రవ్య పెట్టుబడికి కావాల్సింది లాభాలు తప్ప వ్యక్తులు కాదు, అవసరమైతే మోడీని సైతం మార్చి మరొకరిని తీసుకువస్తారు. బ్రిటన్‌లో కూడా జరుగుతున్నది అదే. ఐరోపా యÖనియన్ నుంచి బయటకు వచ్చి చక్రం తిప్పాలని చూసిన బ్రిటన్ కార్పొరేట్లు సాధ్యం గాకపోవటంతో పదేండ్లలో ఆరుగురు ప్రధానులను మార్చారు.వారిలో భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ఒకరన్నది తెలిసిందే.తమ బాటలో నడవకపోతే ఒక శాతంగా ఉన్న ధనికులు ఆండీ బరన్‌హామ్‌కు అదే బాట చూపుతారు.


లేబర్ పార్టీ నాయకత్వ మార్పు తప్ప పార్టీనే మార్చాలని కార్పొరేట్‌లు కోరుకోలేదని చెప్పవచ్చు. స్టార్మర్ మీద ఎక్కువ కాలం ఆధారపడలేమని పాలకవర్గం నిర్దారణకు వచ్చి ఇంటికి పంపింది. ఇప్పుడున్న విధానాలను అమలు జరపాలంటే లేబర్ పార్టీ పేరుతో తమకు అనుకూల విధానాలను కొనసాగించటం మేలు తప్ప పచ్చి మితవాదులను రంగంలోకి తెస్తే తక్షణ ప్రయోజనాలు పొందవచ్చు తప్ప వాటికి ఎదురయ్యే ప్రతిఘటనతో కొత్త సమస్యలు వస్తాయని వారికి తెలుసు. నిజానికి ఐరోపాలో పెద్దన్నగా ఉన్న జర్మనీ, ఫ్రాన్సులో కూడా నయా ఉదారవాద విధానాలే అమలు చేస్తున్నప్పటికీ బ్రిటన్ ప్రధాని అంతగా జనం నుంచి దూరంకావటానికి కారణాలను మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంది. మొత్తం మీద చూసినపుడు 2016లో ఐరోపా యÖనియన్ నుంచి(బ్రెక్సిట్) బయటకు వచ్చిన తరువాత అక్కడి పాలకవర్గానికి తత్వం తలకెక్కింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు గనుక చొక్కాలు మార్చినట్లుగా ఇప్పటికి ఆరుగురు ప్రధానులను మార్చింది.బ్రెక్సిట్ ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజీనామాతో కన్సర్వేటివ్ పార్టీ దాదాపు కనుమరుగైంది. తరువాత అదే పార్టీ నేతలు థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్(బ్రిటన్ చరిత్రలో అతి తక్కువకాలం పదవిలో ఉన్న ప్రధాని), రిషి సునాక్ ప్రధానులుగా కాగా 2024 అధికారానికి వచ్చిన లేబర్ ప్రధాని స్టార్మర్ ఇప్పుడు రాజీనామా చేశారు. బ్రిటన్ చరిత్రలో 1721 నుంచి 2026వరకు 305 సంవత్సరాల్లో 58 మంది 79 సార్లు ప్రధానులుగా పని చేశారు.వారి సగటు పదవీ కాలం ఐదు సంవత్సరాల రెండు నెలలు కాగా గత పది సంవత్సరాల్లో పనిచేసిన వారు ఆరుగురు అంటే అక్కడి రాజకీయ అనిశ్చితికి అద్దం పడుతున్నది.పార్లమెంటు దిగువ సభ(కామన్స్) 2024 ఎన్నికల్లో 650 స్థానాలకు గాను లేబర్ పార్టీ 411 తెచ్చుకొని ఘనవిజయం సాధించింది.ఆ పార్టీ చరిత్రలో ఇంతటి ఘనవిజయం మÖడవది కాగా 2001 తరువాత మొదటిది. ఇప్పటి వరకు అధికారానికి వచ్చిన పార్టీలలో గత ఎన్నికల్లో కేవలం 33.7శాతం ఓట్లతో తక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీగా కూడా చరిత్రకెక్కింది. అధికారానికి వచ్చిన పార్టీలు ఎంత మెజారిటీ సాధించారని కాదు, ఏ విధానాలను అనుసరించారన్నది గీటురాయిగా తీసుకోవాలి.ఆ రీత్యా ఘనవిజయం సాధించినా జనానికి వ్యతిరేకమైన విధానాలకు పాల్పడితే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నది బ్రిటన్ లేబర్ పార్టీ నేర్పుతున్న పాఠం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !

17 Wednesday Jun 2026

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

2026 US Attack Iran, Donald trump, Netanyahu, war compensation, West Asia Peace Talks

ఎం కోటేశ్వరరావు

ఇరాన్‌ – అమెరికా మధ్య కుదిరినట్లు చెబుతున్న మరో 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై డిజిటల్‌ సంతకాలు జరిగాయని, శుక్రవారం నాడు జెనీవాలో ఇరు దేశాల నేతలు భౌతికంగా సంతకాలు చేస్తారని చెబుతున్నారు. నిశ్చితార్దం జరిగిన తరువాత ఆగిపోయిన వివాహాలను ఎన్నింటినో చూశాం.ఈ ఒప్పందం కూడా అలా కాకూడదని అందరం కోరుకుందాం.అయితే ఎనభై ఏండ్ల డోనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పుడేం చేస్తాడో తెలియదు గనుక సంతకాలు జరిగేంతవరకూ అనుమానమే. ఒప్పంద అంశాలపై పరస్పర విరుద్దమైన భాష్యాలు వెలువడుతుండటమే దీనికి కారణం. ఒప్పందం కుదిరిందని ప్రకటించిన ట్రంప్‌ మరోసారి ఇరాన్‌ మీద ఆరోపణలకు పూనుకున్నాడు. ఇరాన్‌ గనుక అణ్వాయుధాలను సమకూర్చుకుంటే నరకం చూపుతామని అన్నాడు. దాడులతో తమకు జరిగిన నష్టానికి 400 బిలియన్‌ డాలర్లు పరిహారం చెల్లించాలని ఇరాన్‌ కోరుతున్నది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఒప్పందం ఇరాన్‌కు అనుకూలంగా ఉంది, గతంలో అది అంగీకరించిన అంశాలే దీనిలో ఉంటాయని చెబుతున్నారు. ఇరాన్‌ కంటే తన మీద పెరుగుతున్న వత్తిడితో డోనాల్డ్‌ ట్రంప్‌ సతమతం అవుతున్నాడు. ఈ పూర్వరంగంలో రానున్న రోజుల్లో పరిణామాలు, పర్యవసానాల గురించి చర్చలు మొదలయ్యాయి. బహుశా ఇప్పటి వరకు అనేక దేశాలు, కూటముల మధ్య ఒప్పందాలు జరిగాయి, అయితే ఇంతగా అనుమానాలు, సందేహాలు తలెత్తింది మరొకటి లేదు. యుద్దం అనగానే విపరీతమైన ఖర్చు, జనం మీద భారం పడుతుంది. ఇరాన్‌పై అమెరికా దాడి, అది ఎదుర్కొన్న ప్రతిఘటన, ఇతర ఖర్చుల గురించి ఇంతవరకు నిర్దిష్టమైన అంచనాలేవీ లేవు. అమెరికాకు రోజుకు 90 నుంచి 200 కోట్ల డాలర్లు అయినట్లు ఒక అంచనా కాగా అమెరికా రక్షణశాఖ 2,500 కోట్ల డాలర్లని చెప్పింది.ఈ సంఖ్యను ఎవరూ నమ్మటం లేదు. ఇది తాత్కాలిక ఖర్చు మాత్రమే అని దీర్ఘకాలంలో లక్ష కోట్ల డాలర్లు అవతుందని హార్వర్డు విశ్వవిద్యాలయ నిపుణులు చెప్పారు.అమెరికాలో ప్రతి కుటుంబానికి ఒక్క చమురు ఖర్చే అదనంగా 450 డాలర్ల వంతున అయిందని ఒక అంచనా కాగా ఇతరాలను కూడా కలుపుకుంటే 63వేల నుంచి లక్ష కోట్ల వరకు జనాలకు చేతి చమురు వదులుతుందని మరొక అంచనా.ఈ లెక్కన డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చిపనితో ప్రపంచం ఎంత నష్టపోయిందో ప్రస్తుతానికి ఊహించుకోవాలే తప్ప లెక్కలు చెప్పలేము.

ఇక ఒప్పందం కుదిరింది అని చెప్పిన తరువాత వీటి సంగతేమిటి అంటూ అనేక మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.వాటిలో కొన్నింటిని చూద్దాం. ఒప్పందంపై సంతకాలు జరిగాయా అంటే సమాధానం లేదు, అయితే ఒప్పందం ఎలా ఉండాలో అంటే ఒక విధంగా ఇంటిని ఎలా నిర్మించాలో ముందుగా ఇంజనీరు రూపొందించే ప్లాన్‌ మాదిరి అవగాహన మీద సంతకాలు చేసినట్లు ట్రంప్‌, జెడివాన్స్‌ చెప్పాడు. ఒప్పంద ముసాయిదా పత్రాలను పరస్పరం మార్చుకున్నారు, వాటిలో కొన్నింటి అమలు ప్రారంభించి 60 రోజుల్లో అంతిమ ఒప్పందం ఖరారు చేసుకుంటారు.అయితే ఒప్పందం గురించి అనుకున్నాం గనుక భౌతికంగా సంతకాలు జరగక ముందే వెంటనే హార్ముజ్‌ జలసంధిని తెరుస్తారని ట్రంప్‌ చెప్పాడు, అయితే శుక్రవారం తరువాతే అని కూడా అదే పెద్దమనిషి చెప్పాడు. అయితే ఒకటి రెండు నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జలసంధి నుంచి వచ్చాయని వార్తలు వెలువడ్డాయి. దాన్ని ఎలా తెరుస్తారన్నదాని మీద సందేహాలు.ఎలాంటి దారి సుంకం చెల్లించకుండా ప్రయాణించవచ్చని ట్రంప్‌ చెప్పాడు. అరవై రోజుల సంధి కాలంలో మాత్రమే ఎలాంటి రుసుమూ ఉండదని తరువాత తాము చేసిన ఏర్పాట్ల మేరకు రక్షణ, పర్యావరణ సుంకం వసూలు చేస్తామని ఇరాన్‌ చెప్పింది. అంటే జలసంధి మీద అదుపు తమదే అని చెప్పినట్లే.

ఒప్పందంతో ఇరాన్‌ సాధించేదేమిటి ? కుదిరినట్లు చెబుతున్న అవగాహనకు వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నట్లు పశ్చిమదేశాల వార్తా సంస్థలు పేర్కొన్నాయి.ఇరాన్‌ మీద ఆంక్షలు తొలుగుతాయి, విదేశాల్లో స్థంభింప చేసిన దాని నిధులను విడుదల చేస్తారు. అరవై రోజుల్లో తాము 24 బిలియన్‌ డాలర్లను పొందుతామని టెహరాన్‌ చెబితే కాదు పన్నెండు బిలియన్‌ డాలర్లు మాత్రమే అందుబాటులోకి వస్తాయని, ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసేది లేదని ట్రంప్‌ చెప్పాడు.దీర్ఘకాలం పాటు యురేనియం శుద్ధి ఉండదని, నిల్వల తనిఖీకి అనుమతి, అణ్వాయుధాలను తయారు చేయబోమని అంగీకరిస్తేనే ఆర్థిక ఆంక్షలు తొలుగుతాయని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ చెప్పాడు.షరతులు ఉండవని ఇరాన్‌, కాదు ఉంటాయని అమెరికా చెబుతోంది.ఇరాన్‌ విడుదల చేసినట్లు చెబుతున్న 14 అంశాలను ఒక పత్రిక ప్రచురించగా అది తప్పుడు వార్త అని ట్రంప్‌ తోసిపుచ్చాడు. రెండు రోజుల్లోగా విడుదల చేస్తామని అమెరికా అధికారులు సోమవారం నాడు చెప్పగా సంతకాలు చేసేంతవరకు బహిర్గతం కాదని ట్రంప్‌ ప్రకటించాడు.అప్పటి వరకు అది రహస్యమే అన్నాడు. ఒప్పందంలో లెబనాన్‌ కూడా భాగమే అని ఇరాన్‌, మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌ చెబుతున్నది.అయితే ఒప్పందం కుదిరింది అన్న తరువాత కూడా లెబనాన్‌ మీద ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నది, అక్కడి నుంచి తమ సేనలు వెనక్కు రావని నెతన్యాహు చెప్పాడు.తమ దేశ రక్షణకు గాను గాజా, లెబనాన్‌, సిరియాలో భద్రతా ప్రాంతాలను ఏర్పాటు చేసుకున్నామని అక్కడి నుంచి వైదొలిగేది లేదన్నాడు.లెబనాన్‌లో ఆరులక్షల మంది పౌరులను నివాస ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ తరిమివేసింది. గాజాలో మాదిరి అక్కడి నివాసాలన్నింటినీ ధ్వంసం చేస్తామని చెబుతున్నది. నెతన్యాహు జవాబుదారీతనంతో ఉండాలని, అమెరికా లేకపోతే ఇజ్రాయెల్‌ లేదని గుర్తించాలని ట్రంప్‌ మంగళవారం నాడు వ్యాఖ్యానించాడు.అయితే ఇదంతా ఉత్తుత్తి బెదరింపే అని వేరే చెప్పనవసరం లేదు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరినా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ చిచ్చును ఆర్పేందుకు అమెరికా సిద్దంగా లేదు.

అణుకార్యక్రమం మీద ఒప్పందం ఉంటుందా అంటే అవునని, కాదని భిన్న కథనాలు వెలువడుతున్నాయి. అవగాహన ఒప్పందం ప్రకారం అరవై రోజుల పాటు కాల్పుల విరమణ మాత్రమే అమల్లో ఉంటుంది.ఈ వ్యవధిలో అణు కార్యక్రమంపై ఒప్పందానికి మార్గాన్ని సుగమం చేస్తారు. 2015లో ఇరాన్‌తో నాటు అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసుకున్న మాదిరి ఒప్పంద అంశాలతోనే మరోసారి జరగవచ్చని భావిస్తుండగా, దాన్నుంచి ఏకపక్షంగా వైదొలిగిన ట్రంప్‌ అంతకంటే మెరుగ్గా ఏం సాధిస్తాడనేది అసలు ప్రశ్న.అణు ఒప్పందం కుదరకపోతే తిరిగి దాడులను జరుపుతామని ట్రంప్‌ ప్రకటించాడు.అంతే కాదు తమ దళాలు జలసంధిలోనే ఉంటాయని, అందుకయ్యే ఖర్చులకు పశ్చిమాసియా దేశాల ఆదాయం నుంచి ఇరవై శాతం వసూలు చేస్తామని కూడా చెప్పాడు, అంటే తమ సేనలను కిరాయికి ఇస్తున్నట్లే సంకేతమిచ్చాడు.ఈ అంశాలన్నీ శుక్రవారం నాటికి ఒక స్పష్టతకు వస్తాయా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఒప్పందం కోసం తొందరపడుతున్న ట్రంప్‌ అసలు తొలుత చెప్పిందేమిటి ? సాధించిందేమిటి ? ఇరాన్‌లో పాలకులను మారుస్తా అన్నాడు. ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని, మిలిటరీని, క్షిపణుల తయారీ కార్యక్రమాన్ని నాశనం చేస్తానని చెప్పాడు.వీటిలో ఏ ఒక్కటీ సాధించలేకపోయాడు. తన పౌరులతో సహా అనేక దేశాల జనాలను అనేక ఇబ్బందులకు గురిచేశాడు. అమెరికా బలహీనతలు ఏమిటో ప్రపంచానికి తేటతెల్లం అయ్యేందుకు దోహదం చేశాడు.ప్రపంచ వ్యవస్థలో అనేక నూతన పరిణామాలు, పర్యవసానాలకు నాంది వేసిన అమెరికా అధ్యక్షుడిగా చరిత్రకెక్కాడు. వ్యూహాత్మకంగా అమెరికా ఎంత దివాలాకోరుగా ఉందో వెల్లడి చేశాడు. దీని అర్ధం అది మిలిటరీ శక్తిని కోల్పోయిందని కాదు.వేలాది మందిని చంపి, అనేక దేశాల నానా ఇబ్బందులకు గురి చేసి, అనివార్య స్థితిలో స్వయంగా సృష్టించుకున్న ఇరాన్‌ ఊబి నుంచి బయటపడేందుకు పడిన అతగాడి తపనను ప్రపంచం చూసింది.అమెరికా ఏం చేసినా గుడ్డిగా అనుసరించేందుకు, సమర్ధించేందుకు కూడా మిత్రదేశాలుగా చెప్పుకున్నవేవీ సిద్దంగా లేవని రెండవ ప్రపంచ యుద్దం తరువాత తొలిసారిగా వెల్లడైంది. వారితో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఇరాన్‌పై దాడులకు పూనుకున్నాడు. ఆ పోరుతో తమకు సంబంధం లేదని, తమది కాదని పశ్చిమదేశాలు ప్రకటించాయి. కిందపడినా తనదే గెలుపన్నట్లుగా ఇరాన్‌ మీద విజయం సాధించానని పదే పదే ప్రకటించి వ్యక్తిగతంగా అభాసు పాలయ్యాడు.దేశీయంగా చూస్తే స్వంత జనాన్నే మోసం చేశాడు. రెండవసారి తనను గెలిపిస్తే విదేశాల్లో జోక్యం చేసుకోనని, దేశ ఆర్థిక సమస్యల మీదనే కేంద్రీకరిస్తానని చెప్పాడు, మరోసారి అమెరికాను అగ్రగామిగా చేస్తానన్నాడు.దానికి భిన్నంగా వ్యవహరించాడు.

ఇప్పుడు కుదిరిందని చెబుతున్న ఒప్పందంలోని అంశాలని దాడులతో నిమిత్తం లేకుండానే దౌత్య పద్దతుల్లో సాధించి ఉండే అవకాశం ఉందన్నది స్పష్టం. ఒప్పందం కుదుర్చుకొని ఒబామా ఇరాన్‌కు జీవితాన్ని ఇచ్చాడని ఆరోపించిన ట్రంప్‌ ఇప్పుడు కొత్తగా సాధించిన అంశాలేమిటని రానున్న రోజుల్లో అమెరికన్లు ప్రశ్నిస్తారనటం నిస్పందేహం.తాముగా అణుబాంబులను తయారు చేయబోమని తమ దివంగత నేత అయాతుల్లా ఖమేనీ సంవత్సరాల క్రితమే చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామని ఇరాన్‌ ఎప్పటి నుంచో చెబుతున్నది. పార్లమెంటు అనుమతి లేకుండా ట్రంప్‌ బాధ్యతారహితంగా ఇరాన్‌ మీద దాడులు ప్రారంభించి సమర్ధించుకొనేందుకు నానాపాట్లు పడ్డాడు. ఇతగాడి అతి తెలివితో అనివార్యమైన స్థితిలో ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిని ఆయుధంగా మార్చుకొని అమెరికా ఆధిపత్యానికి గండికొట్టింది.ఇంతే కాదు, పశ్చిమాసియా, గల్ఫ్‌దేశాల్లో ఉన్న అమెరికా వైమానిక, సైనిక స్థావరాలను కూడా తొలిసారిగా తన లక్ష్యంగా చేసుకుంది, గురిచూసి కొట్టింది. ఈ క్రమంలో అమెరికాకు స్థానం కల్పిస్తే తమకు వచ్చే ముప్పు ఏమిటో కూడా ఆయా దేశాలకు స్పష్టం చేసింది. ఇరాన్‌పై దాడులను ఆపేందుకు గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వత్తిడి తక్కువేమీ కాదు. గతంలో ఎన్నిసార్లు దాడులు చేసినా, పదేండ్లపాటు ఇరాక్‌తో యుద్దం చేసినా అలాంటి ఆలోచన చేయలేదు. పిల్లిని గదిలో బంధిస్తే పులిగా మారుతుందున్న లోకోక్తిని ఇరాన్‌ రుజువు చేసింది.అయితే అమెరికా బాధిత దేశాలన్నింటికీ ఇలాంటి అవకాశాలు రావు గానీ, ఇతర పద్దతులను తప్పకుండా అన్వేషిస్తాయి. నిజానికి తొలుత జలసంధిని దిగ్బంధిస్తే వచ్చే పరిణామాల గురించి ఇరాన్‌ నాయకత్వం భయపడింది.చివరకు జరిగేదేదో జరుగుతుంది చూద్దాం అని తెగించింది. బలవంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కిచచ్చినట్లు చాలా తక్కువ ఖర్చుతో డ్రోన్లు, స్వల్పశ్రేణి క్షిపణులు, మందుగుండుతో నింపిన చిన్న పడవలు, మందుపాతరలతో నౌకలను స్థంభింప చేయవచ్చన్న ఆలోచన పని చేసింది.ఈ చర్య దౌత్యపరంగా కూడా ఇరాన్‌ పైచేయి సాధించటానికి తోడ్పడింది.అమెరికన్లు ఈ చిన్న అంశాన్ని పసిగట్టలేకపోయారు.తమ ఆంక్షలను ఉల్లంఘించిందనే పేరుతో ఏ ఒక్క నౌక మీద కూడా ఇరాన్‌ దాడులు చేయలేదు, అదే అమెరికన్లు ధిక్కారమును సైతుమా అన్నట్లు మన దేశం కోసం ప్రయాణించిన మూడు నౌకల మీద దాడులు చేసి ముగ్గుర మన పౌరుల ప్రాణాలు తీశారు.

ఇరాన్ను దెబ్బతీసేందుకు అమెరికన్లు భారీ మొత్తాల్లో ఆయుధాలను ఉపయోగించారు.దాని దగ్గర ఉన్న నిల్వలు కరిగిపోవటంతో ఉక్రెయిన్‌కు ఉద్దేశించిన వాటిని ఇటువైపు మళ్లించారు. దక్షిణ కొరియాలో ఉన్నవాటిని కూడా తరలించారు. తిరిగి ఆయుధాలను సమకూర్చుకోవాలంటే సంవత్సరాలు పడుతుందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించిందంటే ట్రంప్‌ ఎంతకు తెగించాడో అర్ధం చేసుకోవచ్చు.అత్యాధునిక ఆయుధాలు ఉన్నా ఇరాన్ను దెబ్బతీయలేకపోయాయి. అమెరికా మిలిటరీ బడ్జెట్‌తో పోలిస్తే కేవలం వందోవంతు మాత్రమే ఇరాన్‌ ఖర్చు చేస్తున్నది, దానికి వైమానిక దళం లేదు, ఉన్న నౌకా దళాన్ని అమెరికా దెబ్బతీసింది, అయినా ఇరాన్‌ ప్రతిఘటన యావత్‌ దేశాల మిలిటరీకి అనేక పాఠాలు నేర్పుతున్నది. ముందే చెప్పుకున్నట్లుగా అమెరికా మిత్రదేశాల నుంచి వేరు పడింది, మద్దతు ఇవ్వనందుకు ట్రంప్‌ ఐరోపా నేతలను ఎలా తూలనాడిందీ తెలిసిందే.ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి చెప్పే అమెరికాకు ఇరాన్‌ మీద దాడితో వాటిని ప్రస్తావించే నైతిక హక్కును దెబ్బతీసింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?

13 Saturday Jun 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Pensioners, Political Parties, Prices, Women

≈ Leave a comment

Tags

12 Years Narendra Modi, Narendra Modi Failures, NSAP, old age pension

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ పుష్కర ప్రధానిగా, ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను మించి పదవిలో కొనసాగుతున్న నేతగా భక్తులు, అభిమానుల నుంచి నీరాజనాలు, ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.ప్రధానంగా ప్రభుత్వ పథకాల గురించి విజయగానాలు చేస్తుంటే వాటి తీరు గురించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ అన్నింటి గురించి వివరించేందుకు అవకాశం లేదు.కనుక మోడీ మానవత్వం గురించి వెల్లడించే సామాజిక పెన్షన్ల గురించి చూద్దాం.మోడీ పదవిని అధిష్టించేనాటికి అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి జాతీయ సామాజిక సహాయక పథకం(ఎన్‌ఎస్‌ఏపి) అమల్లో ఉంది.దీనిలో ఆరుపదులు దాటిన వృద్దులు, వితంతువులు,వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేశారు. ఈ పథకాన్ని రాష్ట్రాలు అమలు జరపాలి.కేంద్ర ఇచ్చే నగదుకు అదనపు మొత్తాలను జత చేయాలనే షరతేమీ లేదు. అయితే కొన్ని రాష్ట్రాలు అదనంగా ఇస్తున్నాయి. అందువల్లనే వివిధ రాష్ట్రాలలో చెల్లించే మొత్తాల్లో ఎంతో తేడా ఉంది. 2023లో కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం సగటున రు.1,100 అందుకుంటున్నట్లు తేలింది. ఉదాహరణకు రెండింజన్ల పాలనలో అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెబుతున్న మధ్య ప్రదేశ్‌లో 60 ఏండ్ల వారికి రు.600, ఎనభై దాటిన వారికి రు.1,000 ఇస్తున్నారు. చత్తీస్‌ఘర్‌లో రు.350, ఇక దేశానికే ఆదర్శం అని చెబుతున్న గుజరాత్‌లో వరుసగా రు.750, రు.1,250 చెల్లిస్తున్నారు. మోడీ తరువాత ఆదర్శవంతమైన పాలన అందించారని కీర్తిస్తున్న నితీష్‌ కుమార్‌పాలనలో బీహార్‌లో ఇస్తున్నది రు.1,100, ఆంధ్రప్రదేశ్‌లో రు.4,000 చెల్లిస్తున్నారు.దేశంలో ఇదే గరిష్టం. ఏ రాష్ట్రం ఎంత చెల్లించినా దీనిలో కేంద్ర ఇస్తున్న మొత్తాలు 60 ఏండ్లు దాటిన వారికి రు.200, ఎనిమిది పదులు దాటితే రు.500 మాత్రమే. అంతకు మించి ఇచ్చేదంతా రాష్ట్రాల బడ్జెట్ల నుంచే కేటాయిస్తున్నారు. అభాగ్యులను ఆదుకొనేందుకు ముందుకు రాకుండా వారి ఉసురుపోసుకుంటున్న పాలనలో రెండింజన్లు ఉంటేనేం ఇరవై ఉన్నా ప్రయోజనం ఏముంది ! ప్రతిపక్షంలో ఉండగా ఇంత స్వల్పమొత్తాలా అంటూ ఇదే బిజెపి విమర్శించింది. అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఆ పార్టీ వ్యవహరిస్తున్నది.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే తనకు అధికారమిస్తే అచ్చేదిన్‌ అంటే మంచి రోజులను తెస్తానని 2014లో వాగ్దానం చేసిన నరేంద్రమోడీ ఇప్పుడవయస్సు ఇప్పుడు 75 దాటింది. ఇది కూడా వివాదమే, ఒక సర్టిఫికెట్‌ ప్రకారం 75దాటితే ఆయన చెప్పుకుంటున్నదాని ప్రకారం త్వరంలో అధిగమిస్తారు. అరవై దాటిన వారెవరికైనా వృద్దుల బాధలేమిటో తెలిసి ఉండాలి. అయినా ఏమీ తెలియనట్లు, పెన్షన్‌ మొత్తాలను పెంచుతూ సవరించేందుకు మొరాయిస్తున్నారు, ససేమిరా కుదరదని మాట్లాడకపోయినా ఆచరణలో చూపుతున్నారు.పెన్షన్ల సవరణకు ఏమైనా కాలవ్యవధి ఉందా అని లోక్‌సభలో వచ్చిన ఒక ప్రశ్నకు మంత్రి కమలేష్‌ పాశ్వాన్‌ 2025 ఫిబ్రవరి 11న ఇచ్చిన సమాధానం ఇలా ఉంది. ” పథకపు మార్గదర్శక సూత్రాల ప్రకారం ప్రత్యేకించి సవరణకు నిర్ణీత వ్యవధి అంటూ లేదు.అయినప్పటికీ అంతకు ముందు ఉన్న రు.75ను 2007లో రు.200కు పెంచారు. ఎనభై అంతకు మించిన వయస్సున్నవారికి 2011లో రు.500కు పెంచారు. ఇదిగాక వితంతు, వికలాంగులకు ఇచ్చే మొత్తాన్ని 2012లో రు.200 నుంచి రు.300కు పెంచారు.” అప్పటి నుంచి ఇంతవరకు కేంద్రం ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వటం లేదు. మోడీ సర్కార్‌ మానవత్వం లేదా మానవ ముఖానికి ఇది అద్దం పడుతున్నది. ఈ ప్రభుత్వ హయాంలోనే పార్లమెంటు సభ్యులకు నెలవారీ వేతనాలు, ఇతర అలవెన్సులు రు.లలో ఎలా పెంచారో చూద్దాం.

అంశం ×××××××××××××× 2014 ×××× 2026

మూలవేతనం ××××××××× 50,000 ×××× 1,24,000

నియోజకవర్గ అలవెన్సు ×× 45,000 ×××× 90,000

ఆఫీసు ఖర్చులు ×××××××× 45,000 ×××× 75,000

సమావేశాల హాజరు భత్యం× 2,000 ×××× 2,500

కనీస పెన్షన్‌: నెలకు ××××× 20,000 ×××× 31,000

పెన్షన్‌ ప్రతి ఏటికి అదననం× 1,500 ×××× 2,500

2014లో ఉన్న ఇతర సౌకర్యాల్లో ఇంటి వసతి, వైద్యం, మూడు టెలిఫోన్లు ఉచితం, ఏడాదికి 50వేల యూనిట్లు విద్యుత్‌,నీరు ఉచితం, ఎంపీతో పాటు కుటుంబ సభ్యులు లేదా తోటి ప్రయాణం చేసేవారికి ఏటా 34 విమాన ప్రయాణాలు, అపరిమితంగా రైలు, బస్సు ప్రయాణాలు ఉచితం.2026 నాటికి పైన పేర్కొన్న సౌకర్యాలతో పాటు ఏడాదికి లక్షన్నర రూపాయలు ఫోన్లు, ఇంటర్నెట్‌ సౌకర్యాలకోసం ఇస్తున్నారు. పన్నెండు సంవత్సరాల్లో ఇంతగా ఎంపీల వేతనాలు, అలవెన్సులు పెంచిన ప్రభుత్వం వృద్దులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్‌ మొత్తాలను పెంచేందుకు ఎలాంటి మార్గదర్శక సూత్రాలు లేవని చెబుతోంది. ఆర్టికల్‌ 370, ఇతర అనేక చట్టాలను సవరించిన మానవతావాదులు దీనికి అవసరమైన సవరణలు చేపట్టేందుకు ఎవరు అడ్డుపడ్డారు. ధరల పెరుగుదలకు అనుగుణ్యంగా ఎంపీలు, ఉద్యోగుల వేతనాలు పెంచుతున్న కేంద్రం అభాగ్యులకు అది వర్తించదా ?2013 నుంచి 2026 నాటికి రూపాయి విలువ పతనమై పెన్షన్‌ నిజమొత్తం విలువ రు.99 మాత్రమే,(ఈ మొత్తానికి గ్రామాల్లో అరకిలో వేరుశనగ నూనె మాత్రమే వస్తుంది, మిగతా అవసరాల సంగతేమిటి ) అందుకే కొందరు దీన్ని క్రూర పరిహాసం అని వర్ణిస్తున్నారు, ఇతర వస్తువుల ధరలు, ఇతర అవసరాల పెరుగుదల సంగతేమిటి ? పెన్షన్‌ మొత్తాలు చాలటం లేదని 95శాతం మంది చెప్పినట్లు ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే తేలింది, వారంతా బిజెపి పాలిత రాష్ట్రాలే వారే అని వేరే చెప్పనవసరం లేదు. ఒక వైపు అవసరమైన తిండిగింజల కొనుగోలుకు తగిన ఉపాధి లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ప్రతినెలా ఐదేసి కిలోల వంతున అందిస్తున్నది. దేశంలో వృద్దుల సంఖ్య పెరుగుతున్నదని అందరూ అంగీకరిస్తున్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, లేదా బతుకుతెరువు కోసం వలసలు పోతున్న స్థితిలో ఇండ్లకే పరిమితం అవుతున్న వృద్ధులను ఆదుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దేశంలో వృద్దుల సంఖ్య ప్రస్తుతం 17 కోట్లని, 2030 నాటికి 20కోట్లకు పెరుగుతుందని అంచనా, కానీ పెన్షన్‌ మొత్తాలు అందుకుంటున్నవారి సంఖ్య మోడీ పుష్కరకాలంలో 2.2కోట్లుగా ఉంది తప్ప పెరగలేదు.కేంద్ర తన పథకంలో భాగంగా పెన్షన్లు ఎందుకు పెంచటం లేదని బిజెపి నేతలను ప్రశ్నిస్తే రాష్ట్రాలకు ఆ బాధ్యత లేదా అని ఎదురుదాడికి దిగుతారు. ఆంధ్రప్రదేశ్‌ మాదిరి బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వటం లేదంటే మెమ్మెమ్మె బెబ్బెబ్బె అంటారు. రాష్ట్రాలకూ బాధ్యత ఉంది గనుకనే అవి పెంచుతున్నాయి, కేంద్రం ఎందుకు పెంచటం లేదన్నదే ప్రశ్న. పెన్షన్ల మొత్తాన్ని పెంచేందుకు రాష్ట్రాలకు స్వేచ్చ ఉందని అతితెలివి సమాధానం కేంద్ర మంత్రి నోటి నుంచి వెలువడింది.

తమ ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను 32 నుంచి 42శాతానికి పెంచిందని బిజెపి నేతల గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆ ముసుగులో పథకాలలో కేంద్రం తన వాటాను గణనీయంగా తగ్గించిన సంగతి మాత్రం చెప్పరు. తాజాగా గ్రామీణ ఉపాధి పథకంలో 90ని 60శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. అనేక పథకాలు ఇలానే ఉన్నాయి, అందుకే ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో లాక్కున్నట్లు విమర్శలు వచ్చాయి. పెన్షన్ల విషయంలో కూడా అదే జరుగుతోంది.వివిధ రాష్ట్రాలు ఇస్తున్న మొత్తాలతో పాటు సంఖ్య కూడా పెరిగింది, కనీసం వారికైనా కేంద్రం నిధులు మంజూరు చేయటం లేదు.అయినా ఏ బిజెపి నేతా లేదా చంద్రబాబు వంటి వారు గానీ కుక్కిన పేనుల్లా ఉంటారు తప్ప దాన్ని గురించి అడగరు. మోడీ ఏమైనా తన జేబులోంచి ఇస్తున్నారా ? కార్పొరేట్లకు ఎంతో ఉదారంగా పన్ను తగ్గించి ఖజానాకు రావాల్సిన మొత్తాన్నే రద్దు చేశారు, రాయితీలు జనం చెల్లిస్తున్న పన్నుల నుంచే ఇస్తున్నారు. మరొక దుర్మార్గం ఏమంటే తాము ఇచ్చే ముష్టి రెండువందల రూపాయలను కూడా ఏ రాష్ట్రంలో ఎంతమందికి ఇవ్వాలో కేంద్రం కోటాలను నిర్ణయిస్తుంది. ఆ మేరకు ప్రస్తుతం 3.09కోట్ల మందికి మాత్రమే ఇస్తున్నది, అదనంగా సంఖ్యను పెంచుకోవాలంటే రాష్ట్రాలే భరించాలని చెప్పింది. అలా రాష్ట్రాలు అదనంగా ఇస్తున్న సంఖ్యతో కలుపుకుంటే మొత్తం లబ్దిదారులు 5.86 కోట్ల మంది ఉన్నారు. నిజానికి ఇప్పటికే ఆరు కోట్ల మంది వృద్దులు నిరుపేద కుటుంబాల్లో ఉన్నారని అంచనా, వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వటం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాలు వృద్దులు ఉసురు తీస్తున్నాయని వ్యాఖ్యానించాల్సి వస్తోంది.గతంలో 58 ఏండ్లు దాటిన మహిళలు, 60 ఏండ్ల వృద్దులకు రైళ్లలో ఛార్జీల రాయితీ ఉండేది. మోడీ సర్కార్‌ దీన్ని కూడా రద్దు చేసింది. తన ఏలుబడిలో దేశ సంపద(జిడిపి)ని గణనీయంగా పెంచానని మోడీ సర్కార్‌ చెప్పుకుంటుంది.సమాజానికి ఉపయోగపడని సంపద తాడి చెట్టు మాదిరి ఎంత పెరిగితేనేం ! మోడీ అధికారానికి వచ్చినపుడు సామాజిక పెన్షన్లకు కేటాయించిన మొత్తం జిడిపిలో 0.58శాతం ఉండేది, పదేండ్ల తరువాత అది 0.2కు పడిపోయింది.ఏటా బడ్జెట్‌ కేటాయింపులు తొమ్మిదిన్నరవేల కోట్లకు అటూ ఇటూగానే ఉన్నాయి. రెండు సంవత్సరాల క్రితం నీతి అయోగ్‌ నివేదిక దేశంలో 78శాతం మంది వృద్దులు పెన్షన్లు లేకుండా బతుకుతున్నారని, వారిలో 70శాతం తమ కుటుంబాల మీద ఆధారపడుతున్నట్లు పేర్కొన్నది. ఎన్నికల బాండ్ల జారీ చెల్లవు అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన తరువాత కూడా పదివేల కోట్ల రూపాయలు వెచ్చించి వాటిని ముద్రించి చెత్తబుట్టలో వేసిన జవాబుదారీతనం నరేంద్రమోడీది.కేవలం పన్నెండు కార్పొరేట్‌ సంస్థలు దివాలా ప్రకటిస్తే వాటికి రద్దు చేసిన మొత్తం రు.2.84లక్షల కోట్లు.నేను పైసా తినను ఇతరులను తిననివ్వను అని ఎన్ని సొల్లుకబుర్లు చెబితే ఏమిటి ! సామాజిక పెన్షన్‌ మొత్తాలను పెంచే ప్రతిపాదనలేవీ తమ వద్ద లేవని 2025 ఆగస్టు మొదటి వారంలో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. అందువలన నరేంద్రమోడీ పుష్కరకాలం పదవిలో ఉంటేనేం మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !

06 Saturday Jun 2026

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Women

≈ Leave a comment

Tags

#Anemia Capital India, Anemia, India Health Matters, Narendra Modi Failures, NFHS -6, Poshan failure, Public Health

ఎం కోటేశ్వరరావు

అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాలలో సూచికల్లో మనదేశ స్థానాలను వెల్లడించినపుడు అవి సమగ్రమైనవి కాదని,తాజా వివరాలను పరిగణనలోకి తీసుకోకుండా మోడీ సర్కార్‌ను బదనాం చేసేందుకు చేస్తున్న ప్రచారమని బిజెపి నేతలు చెబుతుంటారు. ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకోవటం కొంతకాలమే సాగుతుంది. నిజానికి ఏ సూచికలనైనా మనదేశం వెల్లడించే సమాచారాన్నుంచే విశ్లేషణలు చేసి రూపొందిస్తారు. ఏ సంస్థాకూడా తానుగా సర్వే చేయదు. అసలు అలాంటి వివరాలను మన సర్కారే సేకరించకపోతే ! మన సర్వేను మనమే నమ్మకపోతే !! అసలు సూచికలే ఉండవు – వైఫల్యాల గురించి చర్చా ఉండదు.కాషాయ దళాల చావు తెలివితేటలు.తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో దేశంలో రక్తహీనత సమస్య గురించి వివరాలనే సేకరించకుండా ప్రశ ్నల జాబితా నుంచి మోడీ సర్కార్‌ ఎత్తివేసింది.అంతకు ముందున్న వివరాలను ఎవరైనా చెబితే అవి పాతవంటూ బుకాయించటానికి వేసిన ఎత్తుగడ ఇది.గుండెలు తీసిన బంట్లు అంటూ కథలు చదువుకున్నాం గానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.అసలు విషయానికి వస్తే 2023-24 సంవత్సరాలలో జాతీయ సర్వే జరిపారు. అంతకు ముందు సర్వేల్లో రక్తహీనతను గుర్తించేందుకు అనుసరించిన పద్దతివలన తప్పులు దొర్లాయనీ, ఎక్కువగా ఉన్నట్లు చూపాయంటూ తాజా సర్వేలో ప్రశ్నావళి నుంచి గుట్టుచప్పుడు కాకుండా కేంద్రం తొలగించింది. గతంలో వేళ్ల నుంచి రక్తం సేకరించేవారు, దానికి బదులు రక్త నాళాల నుంచి సేకరించి పరీక్షిస్తే సరైన వివరాలు వస్తాయని చెప్పారు, పోనీ ఆ పని కూడా చేయకుండా అసలు పరీక్షలనే ఎత్తివేయాల్సిన అవసరం ఏముంది ? కొత్త పద్దతికి ఏమైనా లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతాయా ! అడిగేవారు కొందరు ఉన్నా సమాధానం చెప్పే జవాబుదారీ తనం లేదు. కేంద్రం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు పొందటం కోసం పోషణ యాప్‌లో పోషకాహార లోపం సమచారాన్ని తక్కువ చేసి నమోదు చేయాలని మహారాష్ట్ర బిజెపి సర్కార్‌ అక్కడి స్కీము వర్కర్లను వత్తిడి చేసిందంటే అసలు ప్రభుత్వం సేకరించే, ప్రకటించే సమాచారం మీదనే అనుమానం వస్తున్నది.బహిరంగ మలవిసర్జన పూర్తిగా నివారించటంలో విజయం సాధించామని చెప్పుకున్న నరేంద్రమోడీ సర్కార్‌ విజయగానం వాస్తవం కాదని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. ఇంకా మరికొన్ని పథకాల బండారం కూడా బయటపడింది. ఆ సమాచారాన్ని సవరించాలన్న ప్రభుత్వ వత్తిడికి తలొగ్గని సర్వే నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ కెఎస్‌ జేమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంటిదారి పట్టించింది, అందుకు కుంటిసాకులు చెప్పింది.

రక్తహీనతకు మనదేశాన్ని ప్రపంచ రాజధాని అని పిలుస్తుంటారు.నరేంద్రమోడీ గొప్పగా దేశానికే ఆదర్శం గుజరాత్‌ నమూనా అని చెప్పిన దాని తరువాతే ఈ విషయంలో మరో రాష్ట్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది.నరేంద్రమోడీ 2001 నుంచి 2014వరకు ఒక ఆదర్శరాష్ట్రంగా అభివృద్ధి చేశానని చెప్పుకొని అదే విధంగా యావత్‌ దేశాన్ని గుజరాత్‌ తరహలో తీర్చిదిద్దుతానని 2014 ఎన్నికల్లో వాగ్దానం చేశారు. తరువాత ఎప్పుడైనా దాని గురించి ప్రస్తావించారా ? అలాంటి రాష్ట్రంలో రక్తహీనత గురించి మాట్లాడుకున్న తరువాతే తాజా కుటుంబ ఆరోగ్య సర్వే అంశాలను చెప్పుకుందాం. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం సర్వే-5(2019-21) ప్రకారం దేశంలో, గుజరాత్‌ రక్తహీనత వివరాలు శాతాలలో ఇలా ఉన్నాయి.

వయస్సు ××××××××× దేశం×××× గుజరాత్‌×× ప్రపంచ సగటు

6-59 నెలల పిల్లలు××× 67.1 ××× 79.7 ××× 39.8

15-19 ఏండ్ల బాలికలు× 59.1 ××× 69.0 ×××××××

15-49 గర్భిణులు ××× 52.2 ××× 62.6 ××× 35.5

బిజెపి గొప్పగా చెప్పుకున్న మోడీ, తదనంతర పాలనలో గుజరాత్‌లో సమస్య పెరిగినట్లు మిగిలిన సర్వేలన్నీ చెప్పాయి తప్ప కనీసం, స్థిరంగా కూడా లేదు.దేశంలో కూడా అదే స్థితి. పిల్లలు, తరుణవయస్సువారిలో చైనాలో కేవలం 6.6శాతమే ఈ సమస్యతో ఉన్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌ ముక్త భారత్‌ మీద ఉన్న శ్రద్ద బిజెపికి ప్రజారోగ్యం మీద లేదు. 2025నాటికి రక్తహీనత ముక్త భారత్‌ అని ప్రకటించారు.అది కూడా మోడీ అధికారానికి వచ్చిన నాలుగేండ్ల తరువాత గానీ గుర్తుకు రాలేదు. తగ్గింపు లక్ష్యం ఎప్పటికి నెరవేరుతుందో తెలియదు. నిజానికి ఈ సమస్య మీద గతంలో పాలన వెలగబెట్టిన కాంగ్రెస్‌ పార్టీ కూడా పట్టించుకోలేదు.1970లోనే ఎన్‌ఏపిపి కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదున్నర దశాబ్దాలు గడచినా పరిస్థితి తీవ్రంగానే ఉంది.ఇప్పుడసలు తాజా సమాచారమే లేకుండా చేశారు.రక్తహీనత ఆడపిల్లలు,మహిళ్లలోనే ఎక్కువ. మోడీ బేటీ బచావో నినాదం తీరు ఇది. రక్తహీనత ముక్త భారత్‌ను 2025నాటికే సాధిస్తామన్న పెద్దలు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న 2030కైనా నెరవేరుస్తారా అంటే 2029 ఎన్నికల్లో తిరిగి ఎలా గెలవాలా అనే యావతప్ప మిగతా అంశాలు పట్టించుకోలేదు గనుక ఎన్ని దశబ్దాలు పడుతుందో ఎవరు పుణ్యం కట్టుకుంటారో తెలియదు.

తాజా జాతీయ కుటుంబ,ఆరోగ్య సర్వేను దేశమంతటా 715జిల్లాలలో, 6.79లక్షల కుటుంబాల్లో నిర్వహించారు.ఆసుపత్రుల్లో ప్రసవాలు అంతకు ముందు సర్వేతో పోలిస్తే 88.6 నుంచి 90.6శాతానికి పెరిగాయి.మొత్తం జననాల రేటు అంతర్జాతీయంగా ఆమోదించిన 2.1కంటే తక్కువగా 2.0 ఉంది.పిల్లల్లో 95.6శాతం మందికి టీకాలు వేశారు.సిజేరియన్‌ ఆపరేషన్లతో జరిగే జననాల రేటు 21.5 నుంచి 27.2శాతానికి పెరిగింది. తల్లిపాలు ఇచ్చే శాతం ఇప్పటికీ ఎక్కువగా ఉన్నప్పటికీ మూడోవంతు మంది పిల్లలకు వారు పెరగాల్సిన వయస్సులో అవసరమైన ఘన ఆహారం అందటం లేదు.ఆరు-ఎనిమిది నెలల వయస్సు ఉన్న వారికి తల్లిపాలతో సహా 40.5శాతం మందికి ఘన ఆహారం అందటం లేదు.గర్భిణులకు 180రోజుల పాటు ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ పోషకాలు అందాల్సి ఉండగా కేవలం 37.8శాతం మందికి మాత్రమే అందుతున్నాయి. అంగన్‌వాడీ, పోషన్‌ పథకాలు ఎన్నో అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ పరిస్థితి ఇది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఎన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ 12.9శాతం మందికి పూర్తి స్థాయిలో టీకాలు అందటం లేదు.ఆయుష్మాన్‌ భారత్‌ బీమా 39.8శాతం మందికి అందుబాటులో లేదు. ఇదే విధంగా 40శాతం మందికి వంటగ్యాస్‌ అందుబాటులో లేదు, కాలుష్యకారక వంట చెరకుతోనే వారు గడుపుతున్నారు. (రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో ఇటీవల బీహార్‌ వలస కూలీల కుటుంబాలకు చెందిన ఇద్దరు యువతులు సమీపంలోని వంట చెరకు తెస్తూ రైలు ఢకొీని మరణించిన ఉదంతం సమస్యకు అద్దంపడుతున్నది.) ఒక వైపు పోషకాహారం అందక అనేక మందికి జబ్బులు వస్తుండగా కొంత మందికి ఊబకాయంతో వచ్చే సమస్యలు పెరగటంతో రెండు భారతాలు దర్శనమిస్తున్నాయి. స్త్రీ, పురుషులిద్దరిలో ఊబకాయాలు పెరుగుతున్నట్లు మహిళల్లో ఈ సంఖ్య 21.6, పురుషుల్లో 20.4కోట్లుగా ఉన్నట్లు సర్వే సర్వే వెల్లడించింది. గర్భిణులైన వారిలో కూడా ఊబకాయం పెరగటానికి పోషకాహారం తగినంతగా లేకపోవటమే. ఇది ఆందోళనకర పరిణామం.దీనితో పాటు రక్తపోటు ఎక్కువగా ఉండటం,మధుమేహం పెరగటం కూడా వెల్లడైంది. ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న అంటు వ్యాధులు కాని ఈ జబ్బులతో జనాల జేబులకు చిల్లుపడుతున్నది, ఆర్థికంగా దేశ ఆర్థిక వ్యవస్థకూ నష్టమే అయినప్పటికీ నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.చిత్రం ఏమిటంటే ఊబకాయాలతో పాటు స్త్రీ పురుషులలో 20శాతం మంది ఉండాల్సినదానికంటే తక్కువ బరువు ఉన్నట్లు తేలింది. ఒకవైపు ఈ సమస్య పరిష్కారం కాకుండానే అధిక బరువు సంక్షోభం ముంచుకువస్తోంది.దేశ ఆర్థిక వ్యవస్థకు రెండూ నష్టమే. పన్నేండ్ల మోడీ పాలనలో తగినంత ఆహారం లేకపోవటంతో పాటు అది పుష్టికరంగా లేదని ఈ సర్వే వెల్లడించింది.దీనికి కూడా మహాత్మా గాంధీ, నెహ్రూలే కారణం అని తప్పించుకోవటం కుదరదు.

బిడ్డ పుట్టిన ఆరునెలల వరకు విధిగా తల్లిపాలు ఇవ్వాలని చెబుతున్నారు, అప్పటి నుంచి పరిమిత ఘన ఆహారం అందచేస్తే 6-23నెలల పిల్లలు పుష్టిగా ఎదుగుతారు. రోజుకు మూడు సార్లు అలాంటి ఆహారం అందుతున్న పిల్లలు కేవలం 15.3శాతమే ఉన్నారని జాతీయ ఆరోగ్య ఆరవ సర్వే తేల్చింది.అంతకు ముందుతో పోలిస్తే ఈ సంఖ్య మెరుగని సంతృప్తిపడితే అంతే సంగతులు. ఇలాంటి పిల్లలు తరువాత కాలంలోనే అనేక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పురుషుల కంటే మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎక్కువ జరుగుతున్నట్లు తేలటం కూడా ఆందోళన కలిగించే అంశమే. గతంతో పోలిస్తే ఆరోగ్య బీమా చేయించుకున్నవారు పెరిగినప్పటికీ వైద్యం కోసం జేబుల నుంచి చేస్తున్న ఖర్చు ఈ సర్వే కాలంలో 43.4శాతం పెరిగింది, అంతకు ముందు 39.4శాతమే ఉంది. అందుకే ఆసుపత్రుల కోసం కూడా అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్‌ ఆపరేషన్లు 54.1శాతం ఉండగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16.9శాతమే, అంటే డబ్బుకోసమే ప్రైవేటు ఆసుపత్రులు లబ్ది పొందేందుకు ఈ పని చేస్తున్నాయని వేరే చెప్పనవసరం లేదు.శుభ ముహార్తాల్లో పిల్లలను కనాలనే ఒక మూఢనమ్మకం పెరగటం కూడా దీనికి ఒక కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నదాని ప్రకారం మొత్తం కాన్పుల్లో సిజేరియన్లు 10-15శాతం మధ్య ఉండాలి.ప్రైవేటు ఆసుపత్రుల్లో అసోంలో అత్యధికంగా 81.4శాతం జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 39శాతం, ప్రైవేటులో 42.5శాతం మాత్రమే ఉన్నాయి. ఆదర్శపాలన అందించారని చెబుతున్న నితీష్‌ కుమార్‌ పాలనలో బీహార్‌లో పదేండ్లుగా సారా నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ గత సర్వేతో పోలిస్తే ఈసారి పెరిగి తాగుబోతుల సంఖ్య 18.9శాతంగా ఉంది. ఆరు-23నెలల మధ్య ఉన్న పిల్లలకు పోషకాహారం అందటంలో జాతీయ సగటు కంటే తక్కువగా బీహార్‌లో 11.9శాతమే ఉన్నారు. ఇదీ ఆదర్శవంతమైన పాలన అందించిన నితీష్‌ కుమార్‌ ఏలుబడి తీరు, అందువలన అభివృద్ధి అంటే ఏమిటి, ఏం ఒరగబెట్టారని ప్రశ్నించుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d