Tags

, , , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

తన సొమ్మును తన భక్తులే కాజేస్తుంటే దేవుడు, దేవతలు, దేవదూతలు ఎందుకు నిరోధించటం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే.....అది కూడా దైవలీý తప్ప మరొకటి కాదు, ఏ లడ్డులో ఏ కల్తీ జరపాలో, దేవుడి పేరుతో ఎలా మోసం చేయాలో, ఏ సొమ్ము ఎలా కొల్లగొట్టాలో ముందేరాసి పెట్టి ఉంటుంది, దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి, ఇది ఈ నాటిదా ! నిజాయితీపరులు వారి పని వారు చేయాలి, దొంగలు దొంగతనాలు చేయాలి, బ్రహ్మరాతను ఎవరూ మార్చలేరు. గుడినీ గుడిలో లింగాన్ని మింగేవారు వస్తారని పోతులూరి వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు.పాపం చేసిన వారు ఫలితాన్ని అనుభవించకతప్పదు. ఇదీ కర్మసిద్దాంతాన్ని నమ్ముతున్న భక్తుల స్పందన. అందరి తలరాత రాసిన పెద్దమనిషి కొందరికి దొంగతనం చేయాలని రాసిపెట్టిన వివక్ష ఎందుకు అన్నది హేతువాదుల ప్రశ్న. గుర్రాన్ని తొట్టి దగ్గరకు తీసుకువెళ్లగలం తప్ప దానిలో నీరు తాగించగలమా ! రాముడి సొమ్ము కొట్టేసిన ఉదంతం అనేక మందితో మాట్లాడిస్తున్నప్పటికీ దేవుడి అంశగా జన్మించినట్లు చెప్పుకున్న కారణంగానే నరేంద్రమోడీ నోరు తెరిపించటంలో సాక్షాత్తూ ఆ రాముడే ఏం చేయలేక కళ్లప్పగించి “మౌనం ”గా ఉండిపోయాడు. దేవుళ్ల మధ్య కూడా శాఖల వారీ విభజన జరిగి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం లేదేమో ! ఓట్ల కోసం రాముడు కావాల్సి వచ్చింది,ఎన్నికల ప్రచారం కోసం సాష్టాంగ ప్రమాణం చేస్తున్న ఫొటోల నిమిత్తం అయోధ్య రామాలయం అవసరమైంది.కానీ దానిలో జరిగిన కుంభకోణం గురించి స్పందించటానికి నోరు రావటం లేదు. ఇలాంటి వారిని ఏం చేయాలో రాముడే ఆలోచించుకోవాలి. అక్రమాలపై ఎందుకు దేవుళ్లు, దేవతలు స్పందించటం లేదన్నది తరతరాలుగా నాస్తికులు, హేతువాదులు, భౌతికవాదులు వేస్తున్న సమాధానం లేని ప్రశ్న. దేవతల లీలలు, మహిమల గురించి కథకథలుగా చెప్పుకుంటాం.దరిద్రం ఏమంటే ఇప్పుడు వారికి వచ్చిన కానుకల చోరీ గురించి అయోధ్య దర్యాప్తులో వెలువడుతున్న కథలుకతలు ఎన్నో వెలువడుతున్నాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే మతం, దేవుళ్ల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే తమ మనోభావాలను గాయపరిచారంటూ వీధుల్లో వీరంగానికి దిగే బాపతు తిరుపతి లడ్డు కేసు, రామాలయ కానుకల చోరీ గురించి ఎక్కడా కనిపించరేం. ఇది కూడా బ్రహ్మరాసిన రాతల పర్యవసానమే అని చెప్పేవారు ఉండవచ్చు. వారు రెండు రకాలు. ఒకటి దొంగలను సమర్ధించే మోసగాళ్లు, రెండవ రకం అమాయకులు.


ఇంకా గూగులమ్మ తల్లికి ఏ మతం, కులాన్ని అంటగట్టలేదు.అఫ్ కోర్సు తమ కంపెనీ ప్రయోజనాలు, వాటిని పరిరక్షించే నేతలు, పార్టీల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఆ తల్లికూడా అలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా నిరోధిస్తున్నదని చెబుతున్నారు.అయినా తనకు ఇబ్బందిలేని వాటిని అందిస్తున్నది.ప్రార్ధనా స్థలాల్లో భక్తులు, విశ్వాసులు ఇచ్చే కానుకలను కొట్టి వేయటం అన్ని చోట్లా జరుగుతున్నదని ఎవరు అడిగినా చెబుతుంది, కావాలంటే తెలుసుకోవచ్చు. మందిరాలు, మసీదులు, చర్చ్‌లు ఏవీ ఇలాంటి అక్రమాలకు దూరంగా లేవు.పేరు భిన్నంగా ఉండవచ్చు తప్ప ప్రతి చోటా కానుకల స్వీకరణ, వాటి అపహరణ జరుగుతూనే ఉంది. కనిపించని సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడ్డాయన్నది ఒక సామెత.అయోధ్య ఉదంతంతో ఇప్పుడు జనాలకు పాత దొంగతనాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ మతం, దేవుళ్లను రాజకీయ అవసరాలకోసం వినియోగించుకొనే సంఘపరివార్ సంస్థలన్నింటినీ జనం అనుమానంతో చూసేందుకు దోహదం చేస్తున్నాయి. భక్తులందరూ దొంగలు కాదు గానీ దొంగలందరూ భక్తులే కావటం గమనించాల్సిన అంశం.ప్రతి మత ప్రార్ధనా మందిరంలో జరుగుతున్నది ఇదే.ఎందుకంటే విశ్వాసులు కానివారిని నియమించరు కదా ! దేవాలయాలను ప్రభుత్వ అదుపు నుంచి తొలగించాలని కోరుతున్న వారికి ఇప్పుడు నోట్లో పచ్చివెలక్కాయపడింది.ట్రస్టుల పేరుతో వాటిని నడిపే తమవారి నిర్వాకాలు వెలుగులోకి రావటంతో మింగా కక్కలేకుండా ఉన్నారు. ఇప్పుడు సంఘపరివార్ పెద్దల ఆందోళన దేవుడి సొమ్ము, నగలను కొట్టేయటం కాదు,కోట్లాది మంది భక్తుల్లో బిజెపి, విశ్వహిందూపరిషత్ వంటి తమ సంస్థల పట్ల ఉన్న విశ్వాసం, నమ్మకాలు సడలిపోతే తమ హిందూత్వ అజెండాకే ముప్పు అన్నదే అసలు భయం. కొందరిని కొంతకాలం మోసం చేయగలం, అందరినీ ఎల్లాకాలం మభ్యపెట్టలేము కదా !


కానుకల చోరీ పూర్వరంగంలో అయోధ్య రామాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోరాదని విశ్వహిందూపరిషత్ చెబుతోంది. ఎందుకంటే అది తమ చేతుల్లోంచి పోతుందనే భయం. మా హిందూ దేవాలయం, కానుకలు ఇచ్చిందీ, దొంగతనం చేసిందీ మా హిందువులే కదా, మేం మేం చూసుకుంటాం అన్నట్లుగా దాని వైఖరి ఉంది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి రామాలయ ట్రస్టును తీసుకురాకూడదని చెబుతున్నారు.దీని అర్ధం ఏమిటి ? భవిష్యత్‌లో కూడా ఏం జరిగినా ఎవరూ ప్రశ్నించకూడదు, ఎంత పారదర్శకత ! తప్పనిసరై రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామా చేయగా ఆహ్వానితుడు ఉడిపి ీVAటల్స్ గోపాలరావును ఆ జాబితా నుంచి తొలగించారు.వీరు ముగ్గరూ సంఘపరివార్ గుంపులోని వారే. నరేంద్రమోడీ ప్రవచించిన జవాబుదారీతనం,నేను తినను ఇతరులను తిననివ్వను అన్న చౌకీదార్ సంగతేమిటి ? యావత్ దేశాన్నీ కదలించిన ఈ ఉదంతం అసలు పట్టించుకోవాల్సింది కాదన్నట్లుగా ఇంతవరకు ఒక్క మాటా మాట్లాడలేదు. సాగినంత కాలం సాగుతుంది తప్పదు. రామాలయంలో జరిగింది కుంభకోణం కాదు, చిన్న చోరీ మాత్రమే, అలాంటివి ప్రతిచోటా జరుగుతూనే ఉన్నాయి గనుక పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.గోడీ మీడియా తప్పనిసరై ఈ కేసు గురించి వార్తలను ఇవ్వకతప్పటం లేదు. గతంలో ఆరోపణలు వచ్చినపుడు వాటన్నింటినీ మÖసిపెట్టింది, ఇప్పుడు సాధ్యం కావటం లేదు. నిజమే ప్రతి చిన్న చోరీ విచారణకు పోలీసులు కేసులు పెడతారు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయవు కదా ! అయోధ్యలో జరిగింది చిన్న దొంగతనమే అయితే యోగి సర్కార్ సిట్‌ను ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? అనేక మంది సంఘపరివార్ ప్రముఖులు తీవ్ర ఆరోపణలు ఎందుకు చేస్తున్నట్లు ? చిన్న చోరీ అయితే అయోధ్య బార్ అసోసియేషన్ నిందితుల తరఫున వాదించకూడదనే నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు ? ఆరోపణలకు గురైన ట్రస్టు సభ్యులు పట్టణం విడిచి వెళ్లాలని ఎందుకు డిమాండ్ చేసినట్లు ? కొందరు చెబుతున్న ఈ “ చిన్న ” ఉదంతం గురించి సమాధానం లేని “ పెద్ద ” ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి.


దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తే అక్రమాలకు తావుండదని అర్ధం కాదు.పాలక మండళ్లు,అధికారులను ప్రశ్నించటానికి అవకాశం ఉంటుంది. సరైన సమాధానం చెబుతారా లేదా అన్నది పక్కన పెడితే కనీసం సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. అదే ప్రైవేటు ట్రస్టులైతే రామాలయం గతే ! కాశీ విశ్వనాధుడి ఆలయంలోని శివలింగం వద్ద 1983 జనవరి ఐదున 2.55కిలోల బంగారం మాయమైంది.దాని దర్యాప్తులో బయటపడిన లోపాల తరువాత మహంతుల(పూజారుల) అదుపు నుంచి తప్పించేందుకు కాశీ విశ్వనాధ ఆలయ చట్టం 1983చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ట్రస్టుకు అప్పగించారు. ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆలయంలో చోరీ వార్తలు వెలువడగానే వారణాసిలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఆయోధ్యలో అలాంటిదేమీ కనిపించటం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది బిజెపి గనుక, వీధుల్లోకి వచ్చేవారెవరుంటారు. కాశీ ఆలయచోరీ కేసులో నిందితులకు పదిహేడేళ్ల తరువాత 2000 సెప్టెంబరు ఏడున కోర్టు శిక్షలు విధించింది. గట్టి ఇనుప ఊచల కవచం మధ్య గర్భగుడిలో ఉన్న ఆ బంగారం చోరీ జరిగిన తీరు చూస్తే ఇంటి దొంగలపనే అని విచారణలో తేలింది. కవచ ద్వారాలను తెరిచినట్లు తప్ప పగలగొట్టిన ఆనవాళ్లు లేవు. ఆ సమయంలో గుడిలో ఉన్న ఇద్దరు పూజారులు తాము నిద్రించి ఉన్నట్లు చెప్పారు. పూజారుల ఏలుబడిలో గుడిలో నగదు,ఆస్తుల వివరాలు సక్రమంగా లేవని తేలింది.అంతా అడ్డగోలు వ్యవహారాలు నడిచాయి.ఆలయంపై వారసత్వ అధికారం ఎవరిదన్న కీచులాటలు కోర్టుకు ఎక్కగా వివాదం తేలేంతవరకు రోజువారీ రాబడిని కేసుల్లో ఉన్న పూజారులకు సమంగా పంచాలని 1950 దశకంలో సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది.1983 చోరీతో పూజారుల హక్కులకు తెరపడింది.నాలుగు వందల సంవత్సరాల పాటు ఒక పూజారి కుటుంబం ఆలయాన్ని ఏలింది.వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజాచార్యుడు ప్రారంభించినట్లు చెబుతున్న వారసత్వ అర్చకత్వానికి లేదా మిరాసీదార్ల వ్యవస్థకు 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్థిపలికింది. లడ్డూ కల్తీ అంశం వెలుగులోకి వచ్చిన తరువాత కొందరు దేవాలయాలను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అయోధ్యలో జరిగిందాన్ని సమర్ధించుకొనేందుకు కాషాయ గుంపు నానా పాట్లు పడుతోంది.


నాలుగుదశాబ్దాలకు పైగా రామాలయం చుట్టూ రాజకీయాలను తిప్పి లబ్దిపొందిన కాషాయ దళాలకు తొలిసారిగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరచిన ఉదంతం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియని స్థితి. రాముడిని, రామాలయాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలు కానుకల కుంభకోణం నుంచి పెద్దగా లబ్దిపొందలేవని కొందరు వెంటనే ముక్తాయింపులు ఇవ్వటం ప్రారంభించారు.రామాలయ ఆందోళన ప్రారంభించిన వెంటనే బిజెపికి లబ్ది చేకూరలేదు. అదే విధంగా తమ మనోభావాలను బిజెపి పెద్దలు ఎలా దెబ్బతీశారో గ్రహించటానికి కూడా జనానికి సమయం పడుతుంది. దానికి నాంది పడింది.రాముడిని వీధుల్లోకి లాగింది మతవాదులు. వారి ప్రభావానికి లోనైన జనాన్ని దాన్నుంచి బయటపడవేసేందుకు ఎవరు ప్రయత్నించాలి ? మరింత మÖఢత్వంవైపు నెట్టేందుకు కాషాయ దళాలు చూస్తాయి.మతోన్మాద శక్తులు పెరగటానికి లౌకిక శక్తులే అవకాశం ఇచ్చాయంటూ కొందరు విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నారు.కొందరు నిజమే అనుకుంటున్నారు, ఇది ఆత్మన్యూనత తప్ప మరొకటి కాదు. దాని వలన ఉపయోగం లేదు. ప్రపంచంలో మత,వేర్పాటువాద, జాత్యహంకార, మితవాద శక్తులు పెరగటానికి అనువైన పరిస్థితులు ఉన్న కారణంగానే అవి రెచ్చిపోతున్నాయని గ్రహించటం అవసరం. రాముడు(అయోధ్య), కృష్ణుడు(మధుర),శివుడి(వారణాసి) ఆలయాల పేరుతో ప్రారంభించిన క్రీడను దాన్ని వ్యతిరేకించే శక్తులందరూ ముల్లును ముల్లుతోనే తీసినట్లు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కేరళ, తమిళనాడు వంటి చోట్ల కులవివక్షకు వ్యతిరేకంగా దేవాలయ ప్రవేశ ఉద్యమం ముందుకు వచ్చింది.దాని అర్ధం దానిలో పొల్గ్గొన్నవారు మతవాదులు కాదు, వివక్షను వ్యతిరేకించటం అసలు విషయం. ఆ ఉద్యమంలో ఉన్న ఏకె గోపాలన్ వంటి వారు ఎందరో తరువాత కమÖ్యనిస్టునేతలుగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో కులవివక్ష వ్యతిరేకపోరాట సంఘం నాయకత్వంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని సాగించిన యాంత్రల్లో సిపిఐ(ఎం) నేతలు పాల్గ్గొన్నారు. దీని అర్ధం మతపరమైన భావాలను ప్రోత్సహిస్తున్నట్లు కాదు. బిజెపి దేవుళ్లతో రాజకీయం చేసి లబ్ది పొందినట్లు భావించిన పవన్ కల్యాణ్ సనాతనవాది అవతారమెత్తి లబ్దిపొందేందుకు చూస్తున్నారు.తిరుమల లడ్డూ కల్తీ గురించి వెల్లడించటం ద్వారా తానే పెద్ద హిందూత్వవాదినని జనం ముందుకు వచ్చేందుకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం ఏమిటో తెలిసిందే.సున్నిత మనోభావాలతో కూడు కున్న అంశాల పట్ల మొరటుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు.అలా ప్రయత్నించిన కొందరు నాస్తికులు, హేతువాదులు, ఇతరులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో చూస్తున్నాము. ఏ ఇతిహాసాలు, పురాణాల నుంచి తిరోగమన భావాలను ముందుకు తెస్తున్నారో, వాటి నుంచే ఎదుర్కొనే ఆయుధాలను వెలికి తీయాల్సిన తరుణమిది.హిందూత్వ భావజాలం ఒక్క రోజులో ఎలా పెరగలేదో దాన్ని ఎదుర్కొనే భావాలు జనంలోకి వెళ్లటానికి సమయం పడుతుంది.మొక్కనాటగానే కాయలు కాయవు.


సుప్రీం కోర్టు వెలువరించిన వివాదాస్పద తీర్పుతో బాబరీ మసీదు భూమి రామాలయానికి వచ్చింది.రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. అప్పటి నుంచి నరేంద్రమోడీ పురాతన “ పూజారి మహరాజు ” అవతారమెత్తి గత లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించుకొనేందుకు చూసినా భంగపడ్డారు. సంపూర్ణ మెజారిటీకి అవసరమైన సీట్లను బిజెపికి సంపాదించలేకపోయారు. చివరకు సదరు అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బిజెపి ఓడింది. వారణాసిలో మోడీ మెజారిటీ గణనీయంగా తగ్గింది.ఎవరెన్ని చెప్పినా అయోధ్య ఆలయ నిధులు, ఆభరణాల కుంభకోణం గురించి నోరు విప్పాల్సిన బాధ్యత మోడీ మీద ఉంది.తాను తినను ఇతరులను తిననివ్వను, చౌకీదారునని చెప్పిన పెద్ద మనిషి నోరు విప్పకపోతే ఎలా ! తిరుమల తిరుపతి అనుభవాన్ని చూసిన తరువాత ప్రముఖ దేవాలయాలన్నింటినీ లాభార్జనకోసం మతపరమైన విహార యాత్రల కేంద్రాలుగా(అఫ్ కోర్సు హిందూత్వశక్తులు తాము వ్యతిరేకించే మక్కా, మదీనా, జెరూసలెంలను చూసి కూడా స్ఫూర్తి పొందారు) మార్చాలని చూస్తున్నారు.అయోధ్యలో అవినీతి గురించి ఆరోపణలు రావటం ఇదే ప్రధమం కాదు, గతంలో అయోధ్య వివాదంలో అసలు పిటీషన్‌దార్లలో ఒకటైన నిర్మోహి అఖారా అనేక ఆరోపణలు చేసింది. రామాలయం పేరుతో దేశంలో, విదేశాల నుంచి విశ్వహిందూపరిషత్ వసూలు చేసిన నిధుల్లో పద్నాలుగు వందల కోట్లకు పైగా దుర్వినియోగం, స్వాహా చేసిందని మహంత్ సీతారామ్ ఆరోపించారు. తాజాగా రామాలయం కోసం రెండు కోట్లతో భూమి కొని దానికి రు.18.5 కోట్లు బదలాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిని మÖసిపెట్టిన ఆరఎసఎస్`బిజెపికి ఇప్పుడు అది సాధ్యం కాదు. ఇంతకాలం కాషాయ దళాలు తప్పుడు ప్రచారం, అవాస్తవాలను ప్రచారం చేశాయి. ఇప్పుడు వాటిని వ్యతిరేకించే వారు అసలు విషయాలను జనంలోకి తీసుకుపోవాలి.నిజాలు నిలకడ మీద బుర్రల్లోకి ఎక్కుతాయి ! తొందరేమీ లేదు !!