• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: AP NEWS

సామాజిక , వర్గ సమస్యలపై జమిలిగా కార్యరంగంలోకి దిగాలి

21 Thursday Jan 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

caste system, class exploitation, Rohith Vemula, social oppression, Vemula Rohit

ఎం కోటేశ్వరరావు

      చచ్చినా చలించని లోకం అని తెలియని పసివాని స్ధితిలో హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయ రోహిత్‌ బలవన్మరణం పాలయ్యాడు. దేశమంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి. సమాజ చరిత్రలో ఎందరో వీరులు సమాజం కోసం, జన హితం కోసం వురికొయ్యలతో వూయలులూగారు, ప్రత్యక్ష పోరులో వీరమరణం పొందారు. ముందుగా ప్రకటించి మరీ ప్రాణత్యాగాలు చేశారు. అయినా చలించలా. అందుకు లోకాన్ని నిందిస్తామా ? ఎవరైనా అలాచేస్తే వచ్చే వుపయోగం వుండదు, తాము చెయ్యాల్సిన కర్తవ్యాన్ని కూడా నీరసంతో నిర్వర్తించలేరు. ఇలాంటి వుదంతాలు జరిగినపుడు అందరూ ఒకే విధంగా స్పందిస్తారని ఆశించకూడదని ఇప్పుడు మరోసారి రుజువైంది.ఈ సందర్బంగా సహజంగానే దళిత వుద్యమాలు, భవిష్యత్‌ గురించి అనేక మందిలో చర్చ, అంతర్మధనం మొదలైంది.

    వినదగునెవ్వరు చెప్పిన వినిన0తనే వేగ పడక అన్నట్లు చర్చలో ముందుకు వచ్చే అన్ని అంశాలను ప్రతి వుద్యమకారుడూ వుద్రేక పడకుండా సహనంతో మంచిచెడుల గురించి ఆలోచించాలి. గతంలో జరిగిన దాని గురించి గుణపాఠాలు తీసుకోవాలే తప్ప దెప్పి పొడుపులు, ఎవరి బాధ్యత ఎంత అన్నది ముందుకు రాకూడదు. ఇది వ్యక్తిగతమైనదో లేక కొందరు వ్యక్తులకు సంబంధించినదో కాదు. ఆర్ధిక వ్యవస్ధతో ముడిపడిన ఒక పెద్ద సంక్లిష్ట సామాజిక సమస్య. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ సమస్యను మనదైన పరిష్కారంతోనే స్వస్థి పలకాల్సి వుంది. ఒక విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలు అటువంటి పరిస్ధితి ఎందుకు వచ్చింది, భవిష్యత్‌లో పునరావృతం కాకుండా ఎలా చూడాలి అన్నది సభ్య సమాజ వైఖరిగా వుండాలి పోయి, అతడు దళితుడు కాదు బీసి అని, బీసి బంధువు దత్తాత్రేయ మీద విమర్శలా అని సమస్యను పక్కదారి పట్టించటానికి బిజెపి పార్టీకి చెందిన రెండు విభాగాలే పూనుకోవటాన్ని చూశాము. అలాగే ‘ విశ్వవిద్యాలయ అవమానత్వం, పెత్తందారీతనం, క్రూరత్వం, కుల,మత రాజకీయం ఎంత కారణమో -వాటి మీద పోరాడుతున్న దళిత, బహుజన వుద్యమాలూ, ప్రగతిశీల శక్తులూ కూడా రోహిత్‌ మరణానికి అంతే కారణం’ అని ఒక వ్యాఖ్యాత చెప్పటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? నిరాశా, నిస్పృహలు వుండవచ్చు గానీ ఇలాంటి వ్యాఖ్యలు, నిర్ధారణలకు రావటం వలన పైన పేర్కొన్న శక్తులకే ప్రయోజనం తప్ప వాటిని వ్యతిరేకించే వారికి కాదు. నిజానికి రోహిత్‌ మరణం చుట్టూ తిరుగుతున్న అంశాలను చూస్తే అవి కేవలం తక్షణ దళిత సమస్యలు కావు. దేశం మొత్తానికి సవాలు విసిరిన హిందూత్వను వ్యతిరేకించే , ఒక వుదంతంపై తమ అభిప్రాయం చెప్పుకొనే ప్రజాస్వామిక స్వేచ్ఛ హక్కు ఇమిడి అంశం. రోహిత్‌ చెప్పిన అంశాలంటూ సామాజిక మీడియాలో తిరుగుతున్న వీడియోలో అదే వుంది. ఎంతో స్పష్టంగా తన భావాలను రోహిత్‌ వెల్లడించాడు.

     నిజమే మూకుమ్మడి వుద్యమం చేసి వుంటే రోహిత్‌ బతికి వుండేవాడే. జరగకపోవటానికి కారకులు ఎవరు ? అటువంటి వుద్యమాలు చేసే వాతావరణం వున్నదా ? ఆ వ్యాఖ్యాతే చెప్పినట్లు ‘ సస్పెన్షన్‌కు గురైన దళిత విద్యార్ధులు అంబేద్కరిస్టు స్టూడెంట్‌ అసోసియేషన్‌కు సంబంధించిన వాళ్లు,యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించుకోవటం మీదే వారి ప్రధాన దృష్టి. బయటి సంస్ధలతో వారికి పెద్ద సంబంధ బాంధవ్యాలు లేవు. కనీసం దళిత సంఘాలతో కూడా వారికున్నది అరకొర మైత్రి మాత్రమే’ అంటూనే ప్రగతిశీల వుద్యమాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం విచారకరం.

    ఈ రోజు అస్థిత్వ ధోరణులు సమాజాన్ని వూపివేస్తున్నాయి. వాటికి గురికాని వారు దాదాపుగా లేరంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా అక్కడి వారు పిలిచినా పిలవక పోయినా తెలియచేయకపోయినా తెలిస్తే చాలు వుద్యమకారులు వాలిపోయి వారితో మమేకమైన వుదంతాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. ఇప్పుడా పరిస్ధితి వుందా?

      అవినీతి వ్యతిరేక ఆందోళనలో భాగంగా న్యూఢిల్లీలో అన్నా హజారే నాయకత్వంలో జరిగిన దీక్షలు, నిరసనల గురించి తెలిసినదే. మొత్తం రాజకీయ పార్టీలన్నీ ఒకటే అనే పేరుతో అవినీతికి దూరంగా వున్న వామపక్షాలతో సహా అన్నింటినీ దూరంగా పెట్టి రాజకీయ రహితం పేరుతో నడిపించిన విషయం తెలిసిందే. తరువాత దానిలో ఒకరైన కేజ్రీవాల్‌ స్వంత రాజకీయ పార్టీని పెట్టుకున్నాడు. కిరణ్‌బేడీ బిజెపిలో చేరిపోయారు.జనరల్‌ వీకె సింగ్‌ ఇపుడు మోడీ మంత్రివర్గంలో సభ్యుడు. అన్నా హజారేను అరెస్టు చేసినపుడు వామపక్షాలు ఖండించాయి తప్ప అంతకు మించి ముందుకు పోతాయని ఎవరైనా ఎలా ఆశిస్తారు. ప్రతి వుద్యమం వెనుక ఏదో ఒక లక్ష్మం వుంటుంది. బయటకు చెప్పనిదేదో వుంది కదా అని అవినీతి వ్యతిరేక వుద్యమానికి మద్దతు పలకకుండా ఎలా వుంటారు? ఈ వుద్యమం పట్ల దళితనేతల లేదా మేధావుల వైఖరి ఏమిటి ? అది అగ్రవర్ణాల వుద్యమం అని చంద్రభాను ప్రసాద్‌ వ్యాఖ్యానిస్తే, మనువాది వుద్యమం, సామాజిక న్యాయ వ్యతిరేకం, దళితులు, గిరిజనులు, ఓబిసీలకు దానితో సంబంధం లేదు, వ్యతిరేకిస్తామని కంచె ఐలయ్య పేర్కొన్నారు.

     కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్య ఆంధ్రప్రదేశ్‌లో కుల వివక్ష వ్యతిరేక సంఘం ఏర్పడి ఆందోళనలు చేస్తుంటే దళిత సంఘాలు దూరంగా ప్రేక్షక పాత్ర వహించాయి. దానిలో సిపిఎంలో పని చేసే కార్యకర్తలు చురుకుగా పనిచేస్తుండవచ్చు, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వున్న బివి రాఘవులు రంగారెడ్డి జిల్లాలో యాత్ర చేస్తే దాన్నొక రాజకీయ ప్రయోజన చర్యగా చూశారు. అంతెందుకు అస్ధిత్త ధోరణులు ఎంతగా పెరిగి పోయాయంటే స్త్రీల సమస్యలను స్త్రీలే పరిష్కరించుకోవాలి, దళితులు సమస్యలను దళితులే పరిష్కరించుకోవాలి , బీసిల సమస్యలను బీసీలే పరిష్కరించుకోవాలి. ఇతరులకు వాటిలో స్ధానం లేదు, వారికి అసలు ఆ సమస్యలు తెలియవు అన్న ధోరణి ప్రబలిందా లేదా ? చివరికి అది ఇంకా ముదిరి పోయింది. లేకుంటే ‘వివిధ రంగాలలో వివిధ కోణాల నుంచి దళిత బహుజన జీవితాన్ని, అనుభవాల్ని విశ్లేషించుకుంటూ కొత్త కొత్త పోరాట రూపాల్ని ఆవిష్కరించటం ఇక్కడ మృగ్యం.ఎవరి కుల సంక్షేమం కోసం వారు కట్టుబడి వుండటం తప్ప వుమ్మడి పోరాటాల్ని చేపట్టటానికి ఇరుకు విబేధాల్ని పక్కన పెట్టే సమన్వయం లేదు.’ అని పైన నేను పేర్కొన్న వ్యాఖ్యాత వాపోవటం నూటికి నూరు పాళ్లు నిజం. ‘ సరైన అంబేద్కరిస్టు దృష్టితో కుల నిర్మూలనోద్యమాన్ని బలోపేతం చేయగలిగే వుద్యమాలు రూపొందక పోవటం దళిత బహుజన ప్రపంచానికి చెందిన తక్షణ ప్రశ్న. మన కోసం మనం నిలబడుతూ అందరి కోసం పోరాడాలనే పూలే స్ఫూర్తిని విస్మరించిన దళిత బహుజన సంఘాలు రోహిత్‌ లాంటి ఎంతో మంది విలువైన వ్యక్తుల్ని నిలుపుకోలేకపోతున్నాయి. కనుక ఈ కోణంలో రోహిత్‌ మరణానికి వర్తమాన దళిత బహుజన వుద్యమాలే ఎక్కువ బాధ్యత వహించాల్సి వుంది’ అని కూడా పేర్కొన్నారు. చివరకు రోజువారీ కుల నిర్మూలనా పోరాటాలతో మమేకమవ్వటమే మన ముందున్న కర్తవ్యం అని సూత్రీకరించారు.

    అంబేద్కర్‌ ప్రారంభించిన కుల నిర్మూలన ఒక ఆదర్శం. అది సాధ్యమా, సాధ్యం కావటానికి ఎంత సమయం పడుతుంది అనేవి వూహాజనిత ప్రశ్నలు. పై రచయితే చెబుతున్నట్లు ఎవరి కుల సంక్షేమం కోసం వారు కట్టుబడి వుంటున్నపుడు కుల నిర్మూలన ఎలా సాధ్య పడుతుంది? సమరశీల కుల నిర్మూలనా పోరాటాలు ఎలా జరుగుతాయి? అసలు ఐక్యత ఎలా కుదురుతుంది? అందువలన కుల గిరి ఆలోచనా పరిధి నుంచి బయట పడాలి. కమ్యూనిస్టులు తమ అంతిమ లక్ష్యం సోషలిజం, కమ్యూనిజం అని చెబుతారు. దాన్ని చేరుకోవటానికి ఎన్నో మెట్లు ఎక్కాలి. మెట్టు ఎక్కకుండా మేడమీదకు ఎగిరితే నడుములు విరుగుతాయి తప్ప పైకి ఎక్కలేరు. అందుకే అలాంటి మెట్టుగా మన దేశంలో సిపిఎం జనతా ప్రజాస్వామిక విప్లవ దశ గురించి తన కార్యక్రమాన్ని రూపొందించుకున్నట్లుగానే ప్రపంచంలో ప్రతి కమ్యూనిస్టు పార్టీ తన కార్యక్రమాన్ని రూపొందించుకుంటుంది. దాన్ని సాధించటానికి అనుసరించే ఎత్తుగడలు, మార్గాల గురించి విబేధాలు వేరే విషయం.

     పెట్టుబడిదారీ విధాన వయస్సుతో పోల్చితే మన దేశంలో ఘనీభవించి పోయిన కుల, మనువాద వ్యవస్ధ ఎన్నో రెట్లు ఎక్కువ. పెట్టుబడిదారీ విధానంలో 99శాతం కార్మిక వర్గానికి కనిపించే ప్రత్యక్ష శతృవు ఒక శాతం యజమాని మాత్రమే. నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధలో అలా కాదు. ప్రతి మెట్టుకూ ప్రతి కులమూ ఒక యజమాని. అందువలన ఎదుర్కోవటం అంత తేలిక కాదు. అందువలన దళిత బహజన సంఘాలు కూడా అంతిమ లక్ష్యంగా కుల నిర్మూలన లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు.  సాధనకు మిత్రులను కలుపుకో తప్పదు. అనేక అవలక్షణాలున్న ఈ సమాజం నుంచి ఆదర్శవంతమైన కొత్త సమాజం రావాలి రావాలి తప్ప వేరే ఎక్కడి నుంచో ఊడి పడదు. అందుకే సామాజికోద్యమాలతో పాటు వర్గ వుద్యమాలనూ జమిలిగా సాగిస్తేనే ప్రయోజనం. ఏది ముందు, ఏది వెనుక,దేనికి మొదటి ప్రాధాన్యత, దేెనికి రెండవ ప్రాధాన్యత అన్న వృధా చర్చలోకి పోకుండా అంతిమ లక్ష్యానికి అనుగుణంగా ఏది ముందుకు వస్తే దానిపై కేంద్రీకరించి సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి. ఒకదాని కోసం మరొక దానిని వాయిదా వేయాల్సిన పనిలేదు. పక్కదారి పట్టాల్సిన అవసరం లేదు. కుల వ్యవస్ధలో సామాజిక అణచివేతతో పాటు వర్గ దోపిడీ కూడా మిళితమై వుంది. అందువలన కుల వ్యవస్ధపై పోరాటానికి వర్గదోపిడీని వ్యతిరేకించే శక్తులన్నీ కలసి వస్తాయి. ఒక సంస్ధలో వుండి పనిచేయలేమనుకుంటారా విడివిడిగా వుండొచ్చు, సమన్వయం చేసుకోవచ్చు, కలసి పనిచేయవచ్చు. ఈ దిశగా దళిత వుద్యమం, వామపక్షాలూ, ఇతర భావ సారూప్యత గల శక్తులు, వ్యక్తులూ అందరూ కలసి పనిచేయటమే రోహిత్‌కు సరైన నివాళి అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అడ్డు సవాళ్లు తరువాత, ముందు మతాలలోని వివక్ష, వైరుధ్యాలను అంగీకరిస్తారా లేదా ?

16 Saturday Jan 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Counter Challenges, Hinduism, Hinduthwa, Riddles in Reigions

ఇక హిందూమతాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు అనే వాదన ప్రతి కొత్త తరానికి అది అబ్బ ఏం చెప్పిండు అన్నట్లు కొత్తగా వినసొంపుగా వుండవచ్చుగాని నిజానికి పాతచింతకాయ పచ్చడి.

ఎం కోటేశ్వరరావు

      జల్లి కట్టు లేకపోతే ఎద్దులు అంతరిస్తాయా ? మహిళలను అనుమతిస్తే అయ్యప్ప బ్రహ్మ చర్యం పోతుందా అనే శీర్షికతో నేను రాసిన అంశాలపై పెద్ద సంఖ్యలో ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు నాకు మద్దతు పలికిన వారు కూడా వున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వారు అనేక ప్రశ్నలు సంధించారు. అందువలన వారికి మాయాబజార్‌ సినిమాలో చెప్పినట్లు వీరతాళ్లు వేద్దాం. అయితే వాణిజ్య ప్రకటనలలో చిన్న నక్షత్రం వేసి దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగానే గానే వీరూ ఆ షరతులకు లోబడే వీరతాళ్లు  వేసుకొనేందుకు అర్హులు. నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు చేసిన ఆరోపణ లేదా విమర్శలు ఏమిటి ? హిందూయిజాన్ని సులభంగా విమర్శిస్తారు, ఇతర మతాలు ముఖ్యంగా ఇస్లామును ఏమీ అనలేరు, వారిని విమర్శించటానికి లేదా వారి పేరు ఎత్తటానికి దమ్ము, ధైర్యాలు లేవు, హిందూయిజాన్ని విమర్శించటం ఒక ఫ్యాషన్‌గా మారింది. హిందువులు సహనశీలురు కాబట్టే ఇలాంటి వారి ఆటలు సాగుతున్నాయి, ఇస్లామిక్‌ దేశంలో ఇలా అని బతగ్గలరా ? ఇలా సాగాయి.విమర్శించిన వారందరూ సంఘపరివార్‌ తాలిబాన్‌ హిందూత్వ వాదులు కాదు, వారి వాదనల ప్రభావానికిలోనై ప్రశ్నించినంత మాత్రాన వారిని, కరడు గట్టిన వారినీ ఒకే గాటన కట్టటం లేదు.

       మన దేశంలో అభివృద్ధి చెందిన వాటిలో తర్కశాస్త్రం ఒకటి. ఇది శాస్త్రీయమైనది, దీనిలో గతి తార్కిక విధానం అంటే తర్కము, హేతువు వుండాలి. గతి తార్కిక విధానము అనగానే ఇదేదో కమ్యూనిస్టుల పదజాలం అని కొందరికి తేళ్లు జెర్రులు పాకినట్లు వుండవచ్చు. వారు పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల నాడే భారత సమాజంలో వుంది. అసలు తర్కము, హేతువు నుంచే సమాజం ఇంతగా పురోగమించింది. అవేమీ లేకపోతే మనం ఇంకా ఆకులు చుట్టుకొనే దశలోనో అంతకు పూర్వ దశలోనో వుండే వాళ్లం. తర్కాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు లోకాయతులు. వేదాలను, వైదిక క్రతువులను రెండున్నర-మూడువేల సంవత్సరాల నాడే వ్యతిరేకించి వాటి ప్రామాణికతను సవాలు చేసిన హేతువాదులు వారు . వారిని చార్వాకులు అని కూడా పిలిచారు. వేదాలను సమర్ధించే శక్తులు వారిని భౌతికంగా అంతం చేసి వారి తర్కశాస్త్రాన్ని నాశనం చేసి తరువాతి తరాలకు అందకుండా చేశారు. వారిని తిడుతూ లేక విమర్శిస్తూ రాసిన అంశాలను బట్టి లోకాయతుల గురించి మనకు ఇప్పుడు తెలుస్తున్నది. అందువలన నేను రాసిన దానిని తప్పుపట్టిన వారు ముందు వుద్రేకాన్ని తగ్గించుకొని మన పురాతన గతి తార్కిక పద్దతిలో ఆలోచించాలి. తర్కశాస్త్రంలో ఒకరు ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తితే దాన్ని వుత్తర పక్షం అంటారు. రెండవవారు దానికి సమాధానం చెబితే దానిని పూర్వపక్షం అంటారు. రెండు వాదనలు విని ఏది సరైనదో తేలుస్తారు. అంటే సరైన వాదన చేసిన వారిని రెండోవారు అంగీకరించాలి. ఇటీవలి కాలంలో కొందరు అతి తెలివి ప్రదర్శిస్తూ వాదనలకు దిగి ఓడిపోయి రెండోవారిని అంగీకరించకుండా మీరు ఎన్నయినా చెప్పండి ఇది నా విశ్వాసం, నమ్మకం , మనోభావం దీనిని నేను అంగీకరించను అని అడ్డం తిరుగుతున్నారు లేదా అసలు తర్కానికే సిద్ధం కారు .ఇలాంటి వారు వీరతాళ్లు వేసుకొనేందుకు అనర్హులు. అలాంటి వారితో తర్కించటం కంఠశోష తప్ప శుద్ద దండగ. గాంధీలు పుట్టినపుడు గాడ్సేలు లేకుండా ఎలా వుంటారు అన్నట్లుగా సమాజంలో హేతుబద్దంగా ఆలోచించే వారే మెజారిటీగా వున్నందున వారి కోసమైనా కొన్ని విషయాలను చర్చించుకోవటం అవసరం. వారు వున్నారు కాబట్టే సమాజం ముందుకు పోతోంది.

      ముంబై హైకోర్టు 2010 జనవరి మొదటివారంలో ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఇస్లాం, హిందూ, క్రిస్టియన్‌ ఏ మతాన్ని అయినా భావప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాధమిక హక్కు కింద విమర్శించటం భారత దేశంలో అనుమతించదగినదే అయితే అ విమర్శ చిత్తశుద్దితో లేదా సైద్ధాంతికమైనదిగా వుండాలి తప్ప విద్వేషాన్ని రెచ్చగొట్ట కూదదు అని ఒక పుస్తకంపై తలెత్తిన వివాదం సందర్భంగా కోర్టు చెప్పింది. ఇస్లాం గురించి ముంబై న్యాయవాది ఒకరు రాసిన పుస్తకంలోని అంశాలు అభ్యంతరకరంగా వున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ పుస్తకంపై నిషేధం విధించింది. అది తన భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతమంటూ రచయిత కోర్టులో సవాలు చేశారు. కోర్టు ఆ నిషేధం సరైనదే అని సమర్ధించింది. న్యాయమూర్తులు రంజనా దేశాయ్‌, డివై చంద్రచూడ్‌, ఆర్‌ఎస్‌ మోహిత్‌లతో కూడిన బెంచ్‌ దీనిని విచారించింది. ఆరోగ్యకరమైన విమర్శ ఆలోచనలను రేకెత్తించేదిగా వుండాలి, చర్చను ప్రోత్సహించాలి ఒక నిర్ధారణకు వచ్చేందుకు తోడ్పడాలి, కానీ విమర్శ నిందలు వేసేదిగా వివిధ సామాజిక తరగతుల మధ్య విద్వేషాన్ని సృష్టించేదిగా వుండకూడదు, అది వివేకవంతమైన సంప్రదింపులకు దారితీయాలి అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. రచయిత తాను అనుకుంట్నుది సరైనదని చెప్పవచ్చు, ఒక వేళ అది తప్పయితే దానికి అతనిని శిక్షించకూడదు, కానీ చూడాల్సిందేమంటే ఇస్లాం ఏం చెప్పిందో తెలుసుకోవటానికి, దానిని బయటకు వెల్లడించటానికి రచయిత చిత్తశుద్దితో వ్యవహరించాడా లేదా అనేది చూడాలి. ఈ కేసులో ఇస్లాంపై విమర్శలు మరియు భారతీయ ముస్లింలపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు సైద్దాంతికమైనవి కాదు అని కోర్టు స్పష్టం చేసింది. అభ్యంతరకరంగా వున్న భాగాలను తొలగించాలన్న సూచనలను రచయిత నిరాకరించారు. ఇంటర్నెట్‌ యుగంలో పుస్తకాన్ని నిషేధించటం కాలం చెల్లింది, అర్ధం లేనిది అని రచయిత వాదించటం పూర్తిగా అభ్యంతరకరమని కోర్టు పేర్కొన్నది. భారతీయ ముస్లింలు హిందువులందరినీ మతమార్పిడి చేయాలని చూస్తున్నారని, హిందూ దేవాలయాలు, మహిళలపై దాడులు చేస్తున్నారంటూ రచయిత చేసిన వ్యాఖ్యలు జనాన్ని హింసాకాండకు రెచ్చగొట్టవచ్చు లేదా హింస, శతృత్వాన్ని లేదా ద్వేషాన్ని పెంచవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.

       అందువలన ఎవరైనా ఏమతం గురించైనా చేసే వ్యాఖ్యల వెనుక వున్న వుద్ధేశ్యాలు, లక్ష్యాలు ఏమిటో తెలియనంతటి స్థితిలో సమాజం లేదు. అయితే కొందరు ఒక లక్ష్యంతో చేసే వ్యాఖ్యలను మరికొందరు పర్యవసానాల గురించి ఆలోచించకుండా వాటిని తమ అభిప్రాయాలుగా స్వంతం చేసుకొని మాట్లాడుతున్నారు. విమర్శ చేస్తే వారు సహించరు. అందువలన వారిని కూడా ఎదుటి వారు ఏదో ఒక పక్షంగా భావించాల్సిన పరిస్థితులు నేడు దాపురించాయి. ముందే చెప్పుకున్నట్లు ఇస్లాంను విమర్శించటానికి దమ్ము, ధైర్యం లేదని చేసే వ్యాఖ్యలు, సవాళ్లు ఈ కోవకు చెందినవే. వీరు ముందు ఒకటి స్పష్టం చేయాలి. రాజ్యాంగాన్ని అంగీకరించి దానికి అనుగుణుంగా నడుచుకుంటారా లేదా ? మనది మతరాజ్యం కాదని అంగీకరిస్తారా లేదా ? భిన్నాభి ప్రాయాన్ని సహిస్తారా కుదరదంటారా ? మతరాజ్యాలతో పోల్చుకోవటం అంటే మనం కూడా ఆ బాట పట్టాలని చెబుతున్నారా ? ఏమతానికి చెందిన వారైనా అసలు మతాలలోని చెడు లేదా అవాంఛనీయ పోకడల మీద చేసే విమర్శలను సహిస్తారా లేదా అంగీకరిస్తారా లేదా ? మతాలలోనే అంతర్గతంగా వైరుధ్యాలు, మారాల్సిన అంశాలు వున్నాయని ఒప్పుకుంటారా లేదా ?

      వుదాహరణకు హిందూ మతంలో మహిళల పట్ల వివక్ష వుంది అనే విమర్శ చేస్తే వెంటనే వస్తున్న ప్రతివాదన ఏమిటి ? హిందూ మతం గురించి చెప్పేవారు మహిళలకు మసీదులలో ప్రవేశంపై ఆంక్షల గురించి, క్రైస్తవంలోని అంశాలపై మాట్లాడరెందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఆ మతాల గురించి విమర్శిస్తే మావి మైనారిటీ అసలు నూటికి 80 మందిగా , మా మతాల కంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి వునికిలో వున్న హిందూ మతం గురించి ఆలోచించండి అని వారు అంటారు. వీటన్నింటినీ చూసినపుడు ఏ ఒక్కమతావలంబలకులూ తమ మతంలో వివక్ష వుందని అంగీకరించటం లేదు, వున్న దానిని సమర్ధించటానికి పూనుకుంటున్నారు, తప్పించుకోవటానికి ఇతర మతాల గురించి అడ్డు సవాళ్లు విసురుతున్నారు. ఓట్లకు మతాలను వాడుకోవటం, అందుకోసం చివరికి కొట్లాటలను కూడా సృష్టిస్తున్న ఈ రోజుల్లో ఒక మతానికి చెందిన వారు ఇతర మతాల మంచి చెడ్డల గురించి చెబితే వాటిని సహృదయంతో స్వీకరించే పరిస్థితులు లేవు. అవసరమైతే వివక్ష, మూఢనమ్మకాలు, సంస్కరణల వంటి విషయాల గురించి మనం వాదులాడు కోవద్దు, విమర్శించేవారిపై వుమ్మడిగా దాడి చేద్దాం అని జెఎసి గా ఏర్పడినా ఆశ్చర్యం లేదు. మతం జనం పాలిట మత్తుమందు అని కమ్యూనిస్టులు చెబుతున్నారు. అలా అన్నందుకే కమ్యూనిజం క్రైస్తవానికి, ఇస్లాంకు వ్యతిరేకం అని ఆ మతాలు జనం మెదళ్లలో నూరిపోస్తున్నాయి. మన దేశంలో కూడా మెజారిటీ మతశక్తులూ అదే చేస్తున్నాయి. అందువలన ఇప్పుడున్న స్థితిలో ముందు ఏ మతానికి చెందిన వారు ఆ మతంలోని అవాంఛనీయ పోకడలను ప్రశ్నించాలి. ఏ మతం వారైనా ఇతర మతాలకు చెందిన వారు కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రెచ్చిపోవద్దు. వాటిని కొన్ని శక్తులు దురుద్ధేశ్యాలు, జనం మధ్య సామరస్యతను చెడగొట్టేందుకు , రోజువారీ సమస్యలపై ఐక్యం కాకుండా అడ్డుకొనేందుకు విభజించి పాలించే ఎత్తుగడలలో భాగంగా అనేక అంశాలను ముందుకు తెస్తున్నాయి. అనేక మంది వాటికి ప్రభావితులౌతున్నారు, సామాజిక మీడియాలో అవాంఛనీయ పోకడలు, వ్యాఖ్యలతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు.

      ఇక హిందూమతాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు అనే వాదన ప్రతి కొత్త తరానికి అది అబ్బ ఏం చెప్పిండు అన్నట్లు కొత్తగా వినసొంపుగా వుండవచ్చుగాని నిజానికి పాతచింతకాయ పచ్చడి. అరిగిపోయిన గ్రామఫోను రికార్డు వంటిదే. దాన్ని గురించి తరువాత పరిశీలించుదాం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అడకత్తెరలో పోక చెక్కలుగా పత్తి రైతులు

14 Thursday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

cotton, cotton farmers, cotton market, cotton prices

ఎంకెఆర్‌

మీ వూర్లోనో, ప్రాంతంలోనో పత్తి ధరలలో స్ధానిక పరిస్థితులు, పత్తి నాణ్యత తదితర కారణాలతో స్వల్ప హెచ్చు తగ్గులు వుండవచ్చు. ప్రపంచ మార్కెట్లో మొత్తం మీద పత్తి ధరలు తగ్గుముఖంలో వున్నాయి. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు పత్తి రైతుల పరిస్ధితి వుంది.ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ పరిణామం ప్రతికూల పర్యవసానాలను ముందుకు తెస్తుందో తెలియటం లేదు.

ఇటీవల చైనా ఆర్ధిక వ్యవస్ధలో సంభవించిన పరిణామాలలో స్టాక్‌ మార్కెట్‌ కుదేలు కావటంతో పాటు కరెన్సీ యువాన్‌ విలువ కూడా పడిపోయింది.అది అలాగే కొనసాగితే అ ప్రభావం చైనాతో పాటు మనవంటి అనేక దేశాలపై పడుతోంది. మన ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. రెండు దేశాలకూ అమెరికా, ఐరోపా దేశాల మార్కెట్లు వుమ్మడిగా వున్నాయి. కరెన్సీ విలువలు తగ్గిన దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటే వారికి లాభం. ఆ రీత్యా చైనా కరెన్సీ విలువ పడిపోతే అక్కడి నుంచి అంతకంటే మన కరెన్సీ విలువ పడిపోతే ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు తప్ప వ్యాపారులకు మరొక ప్రాతిపదిక వుండదు. మన దేశం నుంచి ఈ ఏడు 13-15శాతం పెరుగుదల రేటుతో దుస్తులు, వస్త్రాల ఎగుమతులు వుంటాయని ఆశించగా డిసెంబరు నాటికి 7-8శాతానికి మించలేదు. ధనిక దేశాలలో ఆర్ధిక పరిస్థితి మందగించటమే దీనికి కారణం. ఇప్పుడు చైనా యువాన్‌ విలువ పతనం కావటంతో గతం కంటే తక్కువ విలువకే (డాలర్లకే) చైనా సరకులను ధనిక దేశాలు దిగుమతి చేసుకోవచ్చు. గత దశాబ్ది కాలంలో సగటున మన వస్త్ర వుత్పత్తుల ఎగుమతుల పెరుగుదల రేటు 3-4శాతం మాత్రమే వుందని రేటింగ్‌ సంస్ధ మూడీస్‌ విభాగమైన ‘ఇక్రా’ తాజాగా తెలిపింది. ఈ స్థితిలో మన రూపాయి విలువను తగ్గించుకుంటే మన ఎగుమతులు పెరుగుతాయి. అదే చేస్తే మన దిగుమతులకు అయ్యేఖర్చు అంతకంటే ఎక్కువ పెరుగుతుంది. ఇప్పటికే విదేశీ వాణిజ్యలోటుతో వున్న మన దేశం డాలర్ల కోసం మరిన్ని ప్రజావ్యతిరేక చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.మన వస్త్ర వుత్పత్తుల ఎగుమతులు తగినంతగా లేకపోతే అంతర్గతంగా డిమాండ్‌ తగ్గిపోయి పత్తి ధరలు మరింత పతనం లేదా ఇప్పుడున్న స్ధితిలో ఎదుగూ బొదుగూ లేకుండా వుంటాయి.

కాటన్‌ ఇన్‌కార్పొరేట్‌ సంస్ధ తాజా సమాచారం ప్రకారం డిసెంబరు 29నుంచి జనవరి పది వరకు అంతర్జాతీయ పత్తి ధరల సూచిక తగ్గుదల చూపింది. ప్రపంచంలో అగ్రస్ధానం కోసం పడుతూ ఒకటి రెండు స్ధానాలలో దేశాలలో సూచీలు ఇలా వున్నాయి.(లింట్‌ బేల్‌ ధర సెంట్లలో)

సూచీ జనవరి 12న డిసెంబరు ఏడాది క్రితం

న్యూయార్క్‌ 61.6 63.7 63.3

అమెరికా 68.5 70.4 70.4

చైనా 88.3 91.1 95.8

భారత్‌ 63.8 63.8 65.8

పాకిస్ధాన్‌ 62.1 60.8 59.9

డాలర్‌ విలువతో పోల్చితే చైనా యువాన్‌ ధర తాజాగా పడిపోయిన కారణంగా జనవరి 12న చైనాలో పత్తి ధర 92 నుంచి 88 సెంట్లకు పడిపోయినట్లు కనిపించినప్పటికీ చైనా మార్కెట్‌లో క్వింటాలు ధర 1280 వద్ద స్ధిరంగా వుంది. ఒక్క పాకిస్తాన్‌లో గత నెల రోజుల్లో ధరలు పెరిగాయి. మన దేశంలో పెద్ద మార్పులేదు. పాకిస్తాన్‌లో వుత్పత్తి 17 సంవత్సరాల కనిష్టం 7.2 మిలియన్‌ బేళ్లకు పడిపోవటం అక్కడి మార్కెట్‌లో కొద్ది పాటి పెరుగుదలకు కారణమైందని చెప్పవచ్చు. తెల్లదోమ, ఇతర తెగుళ్లే దీనికి కారణం.ఈ ఏడాది ప్రపంచంలో వుత్పత్తి తగ్గిన కారణంగా వచ్చే ఏడాది విస్తీర్ణం పెరగవచ్చని మార్కెట్‌ వర్గాలు అప్పుడే అంచనాలు వేస్తున్నాయి. 2011-14 మధ్య ఏటా 19.7 మిలియన్ల బేళ్ల చొప్పున దిగుమతి చేసుకున్న చైనా తన విధాన మార్పుల కారణంగా 2015-16లో కేవలం 5.5 మిలియన్‌ బేళ్లకే పరిమితం చేసుకుంది. అంతర్గతంగా తన రైతాంగానికి ధర పడిపోకుండా హామీ ఇచ్చి మద్దతు ధర పెంచుతోంది. ఈ కాలంలో చైనా వెలుపల మిల్లుల వినియోగం పెరిగినప్పటికీ అది చైనా దిగుముతు తగ్గిన స్ధాయిలో లేకపోవటంతో ప్రపంచ మార్కెట్‌ ధరలు స్ధబ్దుగా వుంటున్నాయి. దీనికి తోడు చమురు మార్కెట్‌లో ధరలు గణనీయంగా తగ్గిన కారణంగా దాని వుపవుత్పత్తులైన నైలాన్‌, ఇతర కృత్రిమ నూలు ధరలు తగ్గటం కూడా పత్తి డిమాండ్‌ను పరిమితం చేశాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమో ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో ?

14 Thursday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, Health, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, pharma parks, Visakha Partnership Summit, visakha pharma park

కేంద్రం వరాల జల్లు – భ్రమలు, వాస్తవాలు

సత్య

కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతేనే అంతకంటే ఎక్కువే ఇస్తోంది అని ఆంధ్రప్రదేశ్‌ పౌరులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారా ? ఏమో ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో ? ‘ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అనూహ్యమైన వరాలు ప్రకటించింది. విభజన చట్టంలో హామీలకు అతీతంగా చేసిన ఈ పెట్టుబడి ప్రతిపాదనలతో మూడు రోజుల భాగస్వామ్య సదస్సులో సీన్‌ మొత్తం మారిపోయింది.’ ఈ వ్యాఖ్యలు విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి అనంత కుమార్‌ చేసిన ప్రకటన గురించి ఒక పత్రికలో వచ్చిన వార్తలోనివి. దాని ప్రకారం 75వేల కోట్ల రూపాయల పెట్టుబడులు లభించే ఎంతో కీలకమైన ప్రభుత్వ ప్రాజెక్టులను మంజూరు చేశారు అని మరొక పత్రిక రాసింది. అవగాహనా ఒప్పందాలు కుదిరిన 4.78లక్షల కోట్లకు ఇవి అదనం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

అనంతకుమార్‌ విశాఖ పట్టణంలో మంగళవారం ఈ ప్రకటన చేసి ఢిల్లీ వెళ్లిన 24 గంటలలోపే అంటే బుధవారం నాడు అక్కడ మరొక ప్రకటన చేశారు. అదేమంటే ఔషధాల వుత్పత్తిని పెంచేందుకు కేంద్రం రూపొందించిన పధకంలో భాగంగా ఆరు ఫార్మా పార్కులు, రెండు వైద్య పరికరాల తయారీ సంస్ధలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఈ పధకాలకు మొత్తం 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఏపీ ఒక్కదానిలోనే 20వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నట్లుగా భ్రమ కల్పించారు.

నిజానికి ఇప్పటికే విశాఖలో ఫార్మా పరిశ్రమ ప్రారంభమైంది, పరవాడలో జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీ (జెఎన్‌పిసి)లో 2000 సంవత్సరం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రాయితీలను పొందేందుకు హైదరాబాదులో వున్న అనేక కంపెనీలు అక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇప్పటికి అక్కడ 103 యూనిట్లకు అనుమతి ఇవ్వగా 68 పని చేస్తున్నాయి, మరో పదిహేను వివిధ దశలలో వున్నాయని గతేడాది సెప్టెంబరు ఎనిమిదిన హిందూ వార్త వెల్లడించింది.ఫార్మస్యూటికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంగణాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం ఆ సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ పివి అప్పాజీ, సలహాదారు లంకా శ్రీనివాస్‌ తదితరులు ఆప్రాంతాన్ని సందర్శించారు. అందుకు అవసరమైన స్ధలాన్ని కూడా ఫార్మాసిటీ అధికారులు కేటాయించారు. అనంత కుమార్‌ ప్రకటించిన పార్కులో ప్రయివేటు వారికి అవకాశం కల్పిస్తారు తప్ప ప్రభుత్వం పెట్టుబడులు పెట్టదు. ఎందుకంటే మౌలిక సదుపాయాలు కల్పించటం తప్ప పరిశ్రమలు పెట్టరాదన్నది కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయం.అందుకే ఎక్కడైనా రక్షణ పరిశ్రమలను నెలకొల్పారేమో తప్ప 1991 తరువాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా పరిశ్రమలు స్ధాపించలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Six pharma parks and two medical devices parks will be set up

13 Wednesday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, Health, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

India Pharma Industry, pharma parks

The Union Minister of Chemicals and Fertilizers, Shri Ananth Kumar today released recommendations of the task force on development of manufacturing capabilities in each medical vertical in Pharmaceutical production. Speaking on the occasion, he complemented the task force for giving the report in a time bound manner, after extensive and in-depth consultations. Shri Ananth Kumar said that Pharma Industry in the country is a sunrise industry with 30 billion dollars output and the Government is supporting the industry in taking up this output to 55 billion dollars by 2020. The Minister said, the sector is growing at the rate of 14 percent per annum and it has to show additional 1-2% growth every year to reach the 2020 target. Shri Ananth Kumar said that Government is going to set up six pharma parks and two medical devices parks very soon which will involve an investment of about Rs. 30,000 crores.

The Minister said that due to the Central Government’s encouragement and focus, there is a transformation in the pharma industry. On the issue of recommendations by Katoch Committee on bulk drugs, he assured that these will be implemented soon. The Minister said that the Government has taken up human resource capacity building in this sector in a big way. He said in the last one and a half years, there have been more NIPERS( National Institutes for Pharmaceutical Education and research), more students, more infrastructure and more industry participation in them. He said that in the current budget, three new NIPERSs in Rajasthan, Chattisgarh and Maharashtra have been announced and the Department of Pharmaceutical will propose another three NIPERs in Madhya Pradesh, Andhra Pradesh and Karnataka for the next financial year. The Minister assured full support to the pharma industry through faster decisions, enabling environment, benign policy initiatives and incentives.

The Secretary, Department of Pharmaceuticals, Dr. V.K. Subbaraj said that India has a large population and a variety of diseases. There is a need to build capacity for improving manufacturing capacity and distribution of medicines and ancillary products. He said facilitating citizens to gain access to affordable medicines shall be in line with the ‘Make in India’ vision of the Hon’ble Prime Minister.

The major objective for constitution of the task force was to identify the gaps in production of drugs, vaccines etc in various therapeutic categories and to suggest remedial action. The task force chaired by Secretary, Pharmaceuticals has given recommendations with respect to policy support, infrastructure, skill development, duty structure, policy for pricing, regularity framework and promoting research and development for three different verticals – communicable diseases, non-communicable diseases, and Bio-Pharma, Prophylactics and Over The Counter products. The task force has recommended that taking steps to enhance access to safe and affordable medicines is crucial for addressing the burden of communicable and non-communicable diseases.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐటి ఆశావహులపై ఐస్‌ చల్లిన విశాఖ పెట్టుబడుల సభ

13 Wednesday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, investments, sunrise AP, Visakha Partnership Summit

Port Development To Propel Andhra's Growth: Chandrababu Naidu

సత్య

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ‘వుషోదయ ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ 2029’ పేరుతో భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ)తో కలసి ఈనెల 10-12 తేదీలలో పెట్టుబడుల ఆకర్షక సదస్సు నిర్వహించారు. దీనిలో ‘ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాలి’ అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా సదస్సుకు ముందు ఒక పత్రిక కధనం.’4.5లక్షల కోట్ల టార్గెట్‌ ‘ మరో పత్రిక శీర్షిక. ఈ రెండూ చంద్రబాబు దృష్టిలో వున్నవి వున్నట్లుగా రాసే పత్రికలే. ‘ భాగస్వామ్య సదస్సు బంపర్‌ హిట్‌ అయింది. ప్రభుత్వమే రూ.2 లక్షల కోట్ల ఒప్పందాలు కుదరగలవని భావించగా అనూహ్యంగా రు.4,76,878 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదరటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఆనందం వెల్లి విరుస్తోంది’ అని ఏడు కోట్ల లక్ష్యం అని రాసిన పత్రిక సదస్సు తరువాత రాసింది. చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని నిర్వహించిన ఈసదస్సు గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని రెండో పత్రిక రాసింది. ఇవి గాకుండా కేంద్ర మంత్రి అనంత కుమార్‌ ప్రతిపాదించిన (75వేల కోట్లు) అదనం అంటూ ఊహించినదానికన్నా ఎక్కువ స్పందన వచ్చింది, వచ్చే ఏడాది కూడా విశాఖలోనే భాగస్వామ్య సదస్సు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుదిరిన ఒప్పందాలతో పెట్టే పరిశ్రమలు, ఇతర సంస్ధలలో పదిలక్షల పదిహేను వేల వుద్యోగాలు వస్తాయని సదస్సు నిర్వాహకులు ప్రకటించారు. ఇవన్నీ త్వరలో ఆచరణకు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారటనటంలో సందేహం లేదు.

ఈ సదస్సుతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది సంక్రాంతి మరింత కాంతి వంతం అవుతుందని అనేక మంది భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలనే కర్మాగారాలలో ఏటా లక్షా 50వేల మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుఏట్లు వుత్పత్తి అవుతున్నారు. మన ఇంజనీర్లు వుత్పత్తి అవుతున్నంత వేగంగా మన ఆర్ధిక వ్యవస్ధ పెరగటం లేదు. దాంతో ఇంజనీరింగ్‌ నిరుద్యోగుల సైన్యం ఏడాది కేడాది గణనీయంగా పెరుగుతోంది. మన విద్యార్ధులు వుద్యోగాలు అడిగేవారు కాకుండా వుద్యోగాలు కల్పించేవారుగా తయారు కావాలని మన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ మధ్య సందేశమిచ్చారు.

2013లో ‘యాస్పిరింగ్‌ మైండ్స్‌ ‘ అనే ఒక పరిశోధనా సంస్ధ కొన్ని తట్టుకోలేని నిజాలను వెల్లడించింది. చెన్నయ్‌ పట్టణం అక్కడి అన్నా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలనుంచి డిగ్రీ చేతపట్టుకు వస్తున్న ఇంజనీర్లలలో ఒక శాతానికి మాత్రమే వుద్యోగాలు కల్పిస్తున్నదని, అత్యధిక వుద్యోగాల కల్పన రేటు వున్న ఢిల్లీలో 13శాతం, భారత సిలికాన్‌ వ్యాలీగా పేరుగాంచిన బెంగలూరులో 3.2శాతం కల్పిస్తున్నట్లు అది వెల్లడించింది. వాటితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్టణం, రాజధాని అమరావతి ఎంతశాతం కల్పిస్తుందో మనం చంద్రబాబు సిద్దం చేసిన విజన్‌ 2029, 2050 పత్రాలను చూడాల్సిందే.

విశాఖలో కుదిరిన అవగాహనా ఒప్పందాల ప్రకారం ఐటి రంగంలో వస్తాయని చెబుతున్న పెట్టుబడుల మొత్తం 3,368 కోట్ల రూపాయలు, దాని వలన వస్తాయని చెప్పిన వుద్యోగాలు 50వేలు. తనకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు కళ్లవంటివని దేన్నీ నిర్లక్ష్యం చేయనని హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికల సభలో జనవరి 12న చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందువలన ఒక కన్ను ఆంధ్రప్రదేశ్‌లో ఐటి కంపెనీల స్ధాపనకు ఆయన మరోసారి అధికారంలోకి వచ్చిన గత ఇరవై నెలల నుంచీ స్వయంగా, మధ్యలో రాష్ట్ర ఐటి మంత్రి పల్లె రఘనాధరెడ్డి, చంద్రబాబు తనయుడు లోకేష్‌ ఇబ్బడి ముబ్బడి విదేశీ పర్యటనల సందర్బంగా మొత్తం పెట్టుబడుల ఆకర్షణకే సమయాన్ని వెచ్చించినట్లు మనం మీడియాలో చదువుకున్నాం, టీవీలలో చూశాం. వాటి ఫలితమే 3,368 కోట్ల రూపాయలని అనుకోవాలి. ‘ ఇలాంటి సదస్సులలో కుదిరే ఒప్పందాలలో సహజంగా 15 నుంచి 25శాతం వాస్తవ రూపం దాల్చితే గొప్ప విజయం సాధించినట్లు పరిగణించాల్సి వుంటుందని పరిశ్రమల వర్గాల మాట. అయితే ఈ సారి 50 నుంచి 60శాతం వరకు ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నది చంద్రబాబు నిర్దేశం’ అని చంద్రబాబు చెప్పే బి పాజిటివ్‌ పత్రిక ఒకటి రాసింది. కాబట్టి ఐటి నిరుద్యోగులు, కాబోయే నిరుద్యోగులూ ఎవరో వస్తారని, ఏదో తెస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న శ్రీశ్రీ గీతాన్ని నిత్యం గుర్తుకు తెచ్చుకోవాల్సి వుంటుందేమో? ఒకవేళ వచ్చినా వస్తాయని చెబుతున్న 50వేల వుద్యోగాలకు గాను పదిహేను శాతం అంటే ఏడున్నర వేలు మాత్రమే. ఆపై ఎన్ని వచ్చినా అది బాబొస్తే జాబ్‌ అన్న పధకంలో బోనస్‌గా భావించాలి.

పోనీ ఐటి వుద్యోగాల బదులు ఇతర రంగాలలో వుద్యోగావకాశాల గురించి చూడాలంటే ఒక వూరి మునసబు మరోవూరికి వెట్టి కింద లెక్క అన్న సామెత తెలిసిందే. ఐటి ఇంజనీరు మిగతా రంగాలకు క్యాజువల్‌ కార్మికుడి కిందే లెక్క. ఇండ్ల నిర్మాణ రంగంలో 41వేల 500 కోట్లు పెట్టుబడులు వస్తాయని, వాటి ద్వారా రెండున్నరలక్షల వుద్యోగాలు వస్తాయని చెప్పారు. అవేమి వుద్యోగాలో ? ఎన్నిరోజులు పని ఇస్తాయో? ఈ రోజుల్లో రోడ్లు, ఇండ్ల నిర్మాణంలో యంత్రాలకే వుద్యోగాలు, శుభం పలకరా అంటే ఏదో అన్నట్లుగా సంతోష సమయంలో ఇదేమిటి అనుకుంటారేమో, ముగిద్దాం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Rashtrapati Nilayam gardens received over seventy five thousand visitors during annual opening

11 Monday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA

≈ Leave a comment

Tags

Rashtrapati Nilayam

The Gardens of Rashtrapati Nilayam, Bolarum, Secunderabad received more than 75000 visitors this year during its annual opening from January 3 to 10, 2016. This is the highest number of visitors since its opening for public viewing commenced in 2007.

The maximum numbers of visitors on a single day this year was 33730 on the last day of its opening i.e. January 10, 2016.

The Gardens, spread over 35 acres, include Landscaped Gardens, Herbal Gardens, NakshatraVatika, seasonal flowering plants and a display of potted plants around the main building. It also has ‘Jai Hind Ramp’ with cascading water and fruit gardens of Mango, Sapota, Pomegranate, Guava, Amla, Coconut and Cheeku.

The herbal Garden has 116 species of medicinal and aromatic plants like Sarpgandha, Kalabandha, Citronella, Lemon Grass, Khus, Geranium, Coriander, Sandalwood, Tuber rose, Jasmine, Kalmegh, Tulsi, etc. in an area of about 7000 sq. mtrs.

The NakshatraVatika includes 48 trees/plants representing 09 (nine) Navgrahas, 12 (twelve) Rashi and 27 (Twenty seven) Nakshatra(stars). Beside these, the Peepal tree, Banana tree and Bilva have been also placed in appropriate locations in the Vatika.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అవగాహన ఒప్పందాలలో మోడీని అధిగమించేందుకు చంద్రబాబు యత్నం !!

11 Monday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, Mou's

ఇలాంటి మాజిక్‌లను మోడీ గతంలోనే చేశారు కేవలం 24 గంటల్లో 2.1లక్షల కోట్ల పెట్టుబడులుండే 21వేల అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.అంటే ప్రతి నాలుగు సెకండ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే పిటి వుష, వుసేన్‌ బోల్ట్‌ రికార్డులను తిరగరాశారు.

సత్య

విశాఖ పట్టణంలో మూడు రోజుల పెట్టుబడుల ఆకర్షక సదస్సులో మొదటి రోజే రెండు లక్షల కోట్ల రూపాయల విలువగల అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నది వార్త. అతిధి సత్కార్యాలకు పెట్టింది పేరు ఆంధ్రావని. అరిసెలు, వెన్న వుండలు, పూతరేకులు, గారెలు, నాటు కోడి కూర, గుంటూరు గోంగూర, జగ్గయ్య పేట దోసకాయ పచ్చడి, భీమవరం టైగర్‌ రొయ్యలు, నెల్లూరు చేపల పులుసు, బొంగులో చికెన్‌ వంటి వంటకాలను భారీగా వడ్డిస్తామని ముందే ప్రభుత్వం చెప్పింది కనుక మొదటి రోజు అవి తిన్న వారు ఆ మత్తులో గమ్మత్తులో మరికొన్ని కొత్త ఒప్పందాలపై సంతకాలు పెడతారన్నా అతిశయోక్తి కాదు. మొత్తం ఏడు లక్షల కోట్ల మేరకు ఒప్పందాల జరగవచ్చని ముందే అంచనా వేశారు కనుక తొలి రోజు వూపును బట్టి మలి, మూడవ రోజు ఇంకా జోరుగా ఎడా పెడా ఒప్పందాలు జరుగుతాయన్నది స్పష్టం. ఇలాంటి మాజిక్‌ చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, చంద్రబాబు చేయగలరని నమ్ముతున్నారు గనుక అది వమ్ము కాకూడదని రాష్ట్ర భక్తులైన వారు కోరుకుంటారు. 1947 ఆగస్టు 16 నుంచి దేశభక్తి క్రమంగా తగ్గుతూ ఢిల్లీ నుంచి గల్లీ చివరికి ఇంటికి, అక్కడ కూడా నేను, నా కుటుంబ స్ధాయికి దిగజారిన పరిస్ధితుల్లో రాష్ట్ర భక్తి అనటం కొందరికి అతిశయోక్తిగా తోచవచ్చు, క్షంతవ్యుడను.

ఇటీవలి కాలంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టటాన్ని నిలిపివేసిన 1991 నూతన ఆర్ధిక సంస్కరణల అమలు నుంచి రాష్ట్రాలు పెట్టుబడుల కోసం తరచూ పెద్ద మేళాలను నిర్వహిస్తున్నాయి. వివాహాలకు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి విందులు ఆరగించి చందన తాంబూలాలు స్వీకరించి పోయినట్లుగా కొన్ని వేల మంది, లక్షల మంది విదేశీ కంపెనీల ప్రతినిధులు, వారి వంది మాగధులు మన రాష్ట్రాలను సందర్శించి వేలాది అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసి వెళ్లి వుంటారు. అవన్నీ వాస్తవ రూపం దాల్చి వున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు రెండు ఏర్పడి వుండేవి కాదు, మన దేశం మొత్తంగా ఎప్పుడో అమెరికా అంత గాకపోయినా కనీసం చైనాను వెనక్కు నెట్టి వుండివుండేది.

ఆంధ్రప్రదేశ్‌కు మూడు వైపుల తమిళనాడు(చెన్నయ్‌) కర్ణాటక(బెంగలూరు) తెలంగాణా(హైదరాబాదు) అనే మూడు మహానగరాలు వున్నాయి. నాలుగో వైపున వున్నది బంగాళాఖాతం కనుక పెట్టుబడుల ఆకర్షణ పోటీలో అది వుండదు, అయినా మూడు మహానగరాలను తట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు పెట్టేందుకు దేశం నలు మూలల నుంచి 1100 మంది 41 దేశాల నుంచి 315 మంది తొలిరోజు హాజరు కావటం చంద్రబాబు నాయుడి యాజమాన్య నిర్వహణకు నిదర్శనం. వివిధ కారణాలతో తొలి రోజు రాలేకపోయిన వారు చివరి రెండు రోజులలో రావచ్చు, వాటికీ రాలేని వారు తరువాత వచ్చి విజయవాడలో సంతకాలు చేసి వెళతారు. అన్నయ్యా ఎంత మంది వచ్చారు, ఏం తిన్నారు, ఎన్ని సంతకాలు చేశారని కాదు, ఎన్ని వాస్తవ రూపం దాల్చాయన్నది ముఖ్యం అన్నట్లుగా గతంలో జరిగిన ఆకర్షక సమావేశాల ఫలితాలేమిటో మచ్చుకు కొన్ని చూద్దాం.

ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే అందుకు అనువైన వాతావరణం అంటే దండిగా లాభాలు వచ్చే పరిస్ధితులు వున్నాయా లేవా అని చూస్తారు. లేకుంటే ప్రపంచం నలుమూలలు, పొరుగు రాష్ట్రాల నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంటుంది ? ఏ దేశంలో అయినా ఆర్ధిక వుత్పత్తి వనరులలో ఎంతశాతాన్ని వినియోగించుకుంటున్నారు? కొత్త పరిశ్రమలు పెడితే వాటి భవిష్యత్‌ ఎలా వుంటుంది అని ఎవరైనా వెనుకా ముందు ఆలోచిస్తారు. గత ఆగస్టు ఎనిమిదవ తేదీన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ప్రచురించిన క్రిసిల్‌ రేటింగ్‌ నివేదిక ఆధారంగా ఇచ్చిన ఒక వార్త ప్రకారం మన దేశంలో పెట్టుబడులు తగ్గుతున్నాయి, సామర్ధ్యవినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందన్నది దాని సారం. వర్తమాన ఆర్ధిక సంవత్సరం(2015-16)లో రెండుశాతం పెట్టుబడులు తగ్గుతాయని, ప్రయివేటు రంగ పెట్టుబడులు గత కొద్ది సంవత్సరాలుగా తగ్గటం ఆందోళన కలిగిస్తోందనిఈ ఏడాది మరో ఎనిమిదిశాతం తగ్గవచ్చని నివేదిక పేర్కొన్నది. పన్నెండు భారీ పరిశ్రమల రంగాలకు గాను పదింటిలో సామర్ధ్య వినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినందున కొత్త ప్రాజెక్టుల ఆశలు ఆవిరి అవుతున్నాయని, పర్యవసానంగా గతేడాది కాలంలో ప్రకటించిన లేదా అనుమతించిన పరిశ్రమలలో కేవలం 20శాతం మాత్రమే అమలులోకి రావచ్చని, మూల ధన పెట్టుబడులు 2017లోనే అర్ధవంతమైన విధంగా పెరగవచ్చని క్రిసిల్‌ వెల్లడించింది.

అల్యూమినియం, వుక్కు రంగాల సామర్ధ్యం పెంచిన కారణంగా వాటిని దిగుమతి చేసుకొనే భారత్‌ ఎగుమతి చేసే దేశంగా మారింది,ప్రపంచ మార్కెట్‌లో వస్తువుల ధరలు తగ్గిన కారణంగా చమురు శుద్ధి, మార్కెటింగ్‌, పెట్రోకెమికల్‌ రంగాలపై ప్రభావం పడింది.కాగితంతో సహా కొన్ని రంగాలలో సామర్ధ్య వినియోగం ఐదు సంవత్సరాల కనిష్టానికి తగ్గింది. కొద్ది కాలం తరువాత గాని తిరిగి పూర్వస్ధితికి చేరుకోలేవు. ఈ రంగాలలో కొత్త ప్రాజెక్టులకు అవకాశాలు పూర్తిగామృగ్యమయ్యాయి. ఆటోమొబైల్‌, ఎరువుల రంగంలోనే పెట్టుబడులు పెరిగే అవకాశాలు వున్నాయి. ఎరువుల రంగంలో కల్పించే రాయితీలు, చమురు ధరలు, వడ్డీలు తగ్గిన కారణంగా ఆటోమొబైల్‌ రంగంలో ముఖ్యంగా కార్ల రంగంలో అవకాశాలు వున్నాయి.

మౌలిక సదుపాయాల విషయానికి వస్తే పరిస్ధితి పూర్తి తిరోగమనంలో వుంది. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు తగ్గుతాయి.ధర్మల్‌ విద్యుత్‌ విభాగంలో జతచేయదలచిన సామర్ధ్యం గత రెండు సంవత్సరాలలో40వేల మెగావాట్లకు తగ్గగా మరో రెండు సంత్సరాలలో36వేలకు తగ్గిపోనుంది. ప్రయివేటు రంగంలో పెట్టుబడులు లేకపోవటం, పంపిణీ సంస్ధల ఆర్ధిక స్ధితి బలహీనంగా వున్న కారణంగా కొత్త కొనుగోలు ఒప్పందాలు లేని కారణంగా కొత్త ప్రాజక్టుల ప్రకటనలు రావటం లేదు అని క్రిసిల్‌ పేర్కొన్నది. ఇలాంటి నివేదికలను గమనంలోకి తీసుకొనే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు తప్ప మరొక ప్రాతిపదిక వుండదు. ఈ పూర్వరంగంలో కొన్ని రాష్ట్రాలు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు చిత్తుకాగితాలుగా మారాయి. పంజాబ్‌లో 2011-12 నుంచి ఖన్నా-మండి గోవింద ఘర్‌ పారిశ్రామిక ప్రాంతంలో 688 పరిశ్రమలు మూతపడ్డాయి. పంజాబ్‌లో భూముల ధరలు ఎక్కువగా వున్న కారణంగా పారిశ్రామిక సంస్ధలు విస్తరణకు మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, చత్తీస్‌ఘర్‌లను ఎంచుకుంటున్నాయి. అసోచెమ్‌ తన అధ్యయనంలో ఇలా పేర్కొన్నది. పంజాబ్‌లో 2015 మార్చి వరకు ఆకర్షించిన పెట్టుబడులు రెండులక్షల కోట్ల రూపాయలు. వాటిలో 1.6లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో ఎలాంటి పురోగతి లేదు. మిగిలినవి ఖర్చు పెరిగిందని, సమయం పడుతుందని పేర్కొన్నాయి. పరిశ్రమల రంగ అభివృద్ధి 2006-07లో 20శాతం వుండగా 2014-15లో రెండుశాతానికి పడిపోయింది. పురోగమన పంజాబ్‌ మదుపుదార్ల సదస్సు 2013 డిసెంబరులో జరిగింది. ఆ సదస్సును ఘన విజయంగా అకాలీదళ్‌, బిజెపి వర్ణించాయి. దానిలో 65వేల కోట్ల రూపాయల అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇప్పటికీ అవి అలాగే వున్నాయి. కొన్ని కంపెనీలు కనీసం తమ ప్రతిపాదనలేమిటో కూడా సమర్పించలేదు. కొత్తవి రాకపోగా 2013-14లో వచ్చిన 7,200 కోట్లకు గాను మరుసటి సంవత్సరంలో రు.2,600 కోట్లకు పడిపోయాయి.

కర్ణాటకలో మూడు సంవత్సరాల తరువాత గతేడాది పెట్టుబడిదారుల సదస్సు జరిగింది.దానికంటే కొద్ది వారాల ముందే గతేడాదే తమిళనాడులో కూడా జరిగింది. ఇప్పుడు విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ సదస్సు జరుగుతున్నది ఈ మూడు కూడా కేవలం నాలుగు నెలల వ్యవధిలో జరిగాయి. దేశ, విదేశాల ప్రతినిధులు ఈ సదస్సులన్నింటికీ హాజరయ్యారు. ఒప్పందాలపై సంతకాలు చేశారు, వాగ్దానాలు చేశారు. ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రం తాము ఇచ్చే రాయితీలను పెట్టుబడిదారుల ముందు ఏకరువు పెడుతున్నాయి,తమ ప్రత్యేకతలు ఏమిటో వివరిస్తున్నాయి. జోస్యం చెప్పే కోయరాజులు తాము ఎంత పెద్దవారికి జోస్యం చెప్పామో తెలిపేందుకు వారితో దిగిన ఫొటోలను ముందుగా తమవద్దకు వచ్చేవారికి చూపినట్లు ఏ ఏ కంపెనీలు ఇప్పటికే తమ రాష్ట్రాలలో వున్నాయో, ఎవరు ఆసక్తి చూపుతున్నారో చూడండంటూ హడావుడి చేస్తున్నాయి. పెట్టుబడుల సదస్సుల గురించి జనంలో ముఖ్యంగా నిరుద్యోగ యువకుల్లో ఎన్నో ఆశలు రేపుతున్నారు. గోరంతను కొండంతలు చేసి చూపుతున్నారు. దీనిలో ఏ ఒక్కరూ తక్కువ తినలేదు.

వుదాహరణకు కర్ణాటకలో 2012లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరిగింది. సదానందగౌడ రాష్ట్రముఖ్య మంత్రి. ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన సమాచారంలో ఇలా వుంది. ‘2010లో ఎడ్డియూరప్ప ముఖ్యమంత్రిగా వున్న సమయంలో 2010లో జరిగిన సదస్సులో 3.92లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 7.27లక్షల వుద్యోగాలు కల్పించబడతాయని ప్రభుత్వం ఆరోజు చెప్పింది, వాస్తవానికి వచ్చింది 32,957 కోట్లు, 93,102 వుద్యోగాలు మాత్రమే. సదానందగౌడ 2012లో 2.81లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నానని, 13.99లక్షల వుద్యోగాలు వస్తాయని చెప్పారు. దానికి గాను వచ్చింది 12,468 కోట్లు వుద్యోగాలు 21,794 మాత్రమే. ఈ రెండింటినీ కలుపుకుంటే పెట్టుబడుల వాగ్దానం 6.37లక్షల కోట్లు , వస్తాయన్న వుద్యోగాలు 21.26లక్షలు కాగా వచ్చిన పెట్టుబడి 45,425 కోట్లు ఇచ్చిన వుద్యోగాలు 1.14లక్షలు మాత్రమే.

రాజకీయ నాయకుల వాగ్దానాలు ఎలా వుంటాయంటే లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి నేత నరేంద్రమోడీ విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెలికితీస్తానని దానిని ఒక్క్కొరికి పంచితే 15లక్షలు వస్తుందని చెప్పారు. బహుశా దాన్ని తీసుకు వచ్చే క్రమంలోనే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి లక్షా నలభైవేల కోట్ల రూపాయల ప్రత్యేక పాకేజి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌ నిండు సభలో ప్రకటించిన ప్రత్యేక హోదా గురించి ఇంతవరకు కంటి చూపు తప్ప నోటమాటలేదు.

విశాఖ సభకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకొనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇలాంటి మాజిక్‌లను మోడీ గతంలోనే చేశారు కేవలం 24 గంటల్లో 2.1లక్షల కోట్ల పెట్టుబడులుండే 21వేల అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.అంటే ప్రతి నాలుగు సెకండ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే పిటి వుష, వుసేన్‌ బోల్ట్‌ రికార్డులను తిరగరాశారు. అలాగే నరేంద్రమోడీ గతేడాది ఎర్రకోట ప్రసంగంలో 17కోట్ల బ్యాంకు ఖాతాలను తెరుస్తామని ప్రకటించారు అంటే సెకనుకు ఆరు అన్నమాట. ఎప్పుడూ విదేశాల్లోనే తిరుగుతుంటారు మీకు భారత్‌లో చేసే పనేమీ లేదా అంటే దేశానికి కనీసం లక్ష కోట్ల డాలర్లు అంటే 66లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం తన లక్ష్యమని చెప్పుకున్నారు. అందువలన అలాంటి నరేంద్రమోడీని స్ఫూర్తిగా తీసుకున్న చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ప్రతినిధితో ఒక్కొక్క ఒప్పందం కుదుర్చుకోవటంలో అతిశయోక్తి ఏముంటుంది, గొప్ప ఏముంది?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి విరాళానికి ప్రచారఖర్చు పాతిక

08 Friday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Amaravathi, CHANDRABABU, Janmabhumi, students

చంద్రబాబు చేతిలో మంత్రదండం !

సత్య

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతిలో మంత్రదండటం వుందా ? భక్తులను కరుణించేందుకు గతంలో పుట్టపర్తి సత్యసాయి బాబా హాంఫట్‌ అంటూ విభూతి,బంగారు చైనులు తీసి ఇచ్చేవాడని,ఆయన వేలు ముంచటంతో బకెట్‌లోని నీరు పెట్రోలుగా మారిందని గతంలో చెప్పారు. తిరుపతి జన్మభూమి సభలో అక్కడికక్కడ ఒక విద్యార్ధికి ఒక టాబ్‌ను చంద్రబాబు బహుకరించారంటే ఆయన కూడా అదే పరంపరకు చెంది వుండాలి.

ఎవరైనా బడి ఎగ్గొడితే మందలించాలి.పిల్లలను బడి ఎగ్గొట్టించి పిల్లలను తీసుకువస్తే టీచర్లను మందలించాలి. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశారు ? వచ్చిన 23 మంది పిల్లల్లో వుపన్యాసం చేసిన విద్యార్ధినికి టాబ్‌ బహుకరించారు. ఆది ఆయన జేబులోంచి తీశారా, పక్కన వున్న అధికారి చేతిలోది లాక్కొని ఇచ్చారా లేక ముందే చెప్పుకున్నట్లు మంత్రదండంతో సృష్టించారా అన్నది గొర్రెల గోత్రాలు కాపర్లకు ఎరుక అన్నట్లు తెలుగు దేశం మాజీ నాయకురాలు ప్రస్తుతం ఆ జిల్లాకు చెందిన వైసిపి శాసనసభ్యురాలు రోజాను అడగాల్సిందే.

సినిమాల్లో, కధల్లో మాఫియా నాయకుడు ఫలానా రోజున ఫలానా చోట నాకు ఇంత సొమ్ము తెచ్చి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. అది కూడా స్వచ్ఛందంగానే అని తెలుసు కదా. అదే మాదిరి నా రాజధాని… నా అమరావతి…. నా ఇటుక పేరుతో ప్రతి విద్యార్ధి, టీచరు తలా పది రూపాయల చొప్పున విధిగా విరాళంగా వసూలు చేసి పంపాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయటంపై ప్రభుత్వం హైకోర్టులో మొట్టికాయలు తిన్నది. బలవంతపు వసూళ్లు చేయటం లేదని, గతంలో ఇచ్చిన వుత్తరువులను సవరిస్తూ ఒక మెమో జారీ చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పరువు పోవటంతో విరాళాల వసూలుకు ఆదేశాలు ఇచ్చిన అధికారులపై ఆగ్రహించి, చర్య తీసుకోవాలని ముఖ్య మంత్రి ఆదేశించారన్న వార్తలు కూడా పక్కపక్కనే వచ్చాయి. అంటే బాబుగారు మంచోరే మధ్యలో అధికారులే ఆయనకు మచ్చ తెస్తున్నారనే భజనలో భాగం కూడా ఇది కావచ్చు. ఎందుకంటే ఇలాంటి చర్యల వార్తల ప్రకారం నిజంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఈ పాటికి ఒక్క అధికారి కూడా మిగిలి వుండేవారు కాదు, అన్నింటికి మించి ఇలాంటి వుత్తరువులు వచ్చి వుండేవి కాదు. ఎందుకంటే వుత్తరువులు ఇవ్వనేల ఆపైన చర్యలకు గురికానేల అని ఏపనీ చేసే వారు కాదు. ఇంత జరిగాక కూడా స్కూలు ఎగ్గొట్టి పలమనేరు నుంచి తిరుపతికి 120 కిలోమీటర్ల దూరం మూడు గంటల పాటు ప్రయాణించి 23 మంది పిల్లలు స్వచ్ఛందంగా పోగుచేసిన 230 రూపాయల విరాళాన్ని జన్మభూమి సభలో అందచేశారు. అంతదూరం ప్రయాణించటానికి వారికి అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువ ఖర్చు అయి వుండాలి. వారికి రానుపోను ఛార్జీలు, ఎంతో సమయం వెచ్చించాలి గనుక పిల్లలకు భోజనాల ఖర్చు ఇవన్నీ కలుపుకుంటే రూపాయి విరాళానికి పాతిక రూపాయల ప్రచార ఖర్చు అన్నట్లు ఆ మొత్తాన్ని ఎవరు భరించారు?

పలమనేరులో జన్మభూమి సభ జరుగుతూ వుండి వుంటే పిల్లలు వుత్సాహపడి విరాళం అందచేశారంటే అర్ధం చేసుకోవచ్చు. కనీసం పక్క నియోజకవర్గం కూడా కాదు, జిల్లా కేంద్రమూ కాదు, చిత్తూరు దాటి ప్రయాణించి రావాలి. ఇది టీచర్లు లేదా అధికారపార్టీ కార్యకర్తలు గానీ ముఖ్యమంత్రి మెప్పుకోసం నిర్వహించిన కార్యక్రమం తప్ప మరొకటి కాదు. దీన్ని అవకాశంగా తీసుకొని తాము స్వచ్ఛందంగానే విరాళాలు కోరామని, వత్తిడి చేయలేదని సదుద్దేశ్యంతో ముందుకు పోతుంటే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కోర్టులకూ వెళ్లారని వాళ్లు ఏ పనీ చేయరనీ ముఖ్య మంత్రి ధ్వజమెత్తారు. ఇతరులు తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పిన సిఎం వుత్తరువును సవరించినట్లు కోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ ద్వారా విన్నపం చేయించటం ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కందకు లేని దురద కత్తిపీట కెందుకు !

07 Thursday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, NATIONAL NEWS, STATES NEWS

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, cast politics, YS jagan

సత్య

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత జగన్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి దాసరి నారాయణ రావును కలుసుకున్నారన్నది ఒక వార్త, కర్నూలు జిల్లా నుంచి ఐదుగురు వైసిపి ఎంఎల్‌ఏలు తెలుగుదేశంలోకి రానున్నారన్నది మరొక వార్త. హైదరాబాద్‌ గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా ఎవరెటు దూకుతారో తెలియని స్ధితి. అనేక మంది చెవులు కొరుక్కుంటూ చెప్పుకొనేదాని ప్రకారం పెద్ద అవసరం, ప్రయోజనం వుంటే తప్ప వైఎస్‌ జగన్‌ తానుగా వెళ్లి ఎవరినీ కలవరు అంటారు. అది ఆయన తండ్రి ఎల్లో మీడియాగా వర్ణించిన ఒక పత్రికాధినేత రామోజీరావు కావచ్చు, మరొకరు కావచ్చు. దాసరి నారాయణరావు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరతారా లేదా ఆయనకు అంటిన బొగ్గు మసి ఏమౌతుంది అని కొంత మంది జుట్టుపీక్కుంటున్నారు. దానికి అంత సీన్‌ అవసరం లేదు. ఏదో ఒక మసి కేసులు లేని నాయకుడూ ఒక నాయకుడేనా ఈ రోజుల్లో ! ఎవరెన్ని పార్టీలు మారితే, ఎక్కడ అధికారం వుంటే అక్కడ చేరితే అంత తెలివి గలవాడిగా జనం నీరాజనాలు పడుతున్నారు. అందువలన ఏ నాయకుడు ఏ పార్టీలో అయినా ఏ క్షణంలో అయినా చేరవచ్చు. ఎందుకంటే రేచుక్క పగటి చుక్కల వంటి పాలక పార్టీలకు ఈ రోజుల్లో అధికారం, నీకది-నాకిది ఫార్ములా తప్ప మరొకటి తెలియదు. సమాజం అలాంటి వాటికి అనుమతించిన బలహీనతకు లోనైంది. ఎవరికి వారు తమకూ అలాంటి లాటరీ ఒకటి తగలకపోతుందా వీలైతే ఒక లక్ష కోట్లు సంపాదించకపోతామా( ఆశలకు పిసినారితనం ఎందుకు) అప్పుడు సిద్ధాంతాలు,ఆదర్శాలు అంటే కుదురుతుందా అని అంతర్గతంగా ఆలోచిస్తూ వుండి వుండాలి.తమకు దారి సుగమం కావాలంటే ఆ బాటన పోయిన వారికి మద్దతు ఇవ్వాలి

ఇంతకూ దాసరితో జగన్‌కు అవసరం ఏమిటి? వచ్చే ఎన్నికలలో కాపు వర్గాన్ని తన మద్దతుదారులుగా మార్చుకోవాలంటే అలాంటి నేతలను దగ్గరకు తీసుకోవాలన్న వ్యూహంతోనే కలిశారన్నది జనవాక్యం. సమాజంలో విపరీతంగా పెరిగిపోయిన అస్తిత్వ భావనల పూర్వరంగంలో ఈ రోజు నాయకులు తాము కుల సామాజిక వర్గ ప్రతినిధులుగా చెప్పుకోవటానికి లేదా ఆ విధంగా జనం ముందుకు రావటానికి సిగ్గుపడక పోగా గర్వంగా చెప్పుకుంటున్నారు. దాన్ని తమ రాజకీయ, ఆర్ధిక బేరసారాలకు వుపయోగిస్తున్నారు. అలాంటి వారికి తెలిసో తెలియకో లేదా వారు కూడా అలాంటి భావనలకు లోనయిగానీ ఎలాంటి విమర్శనాత్మక దృష్టి లేకుండా జనం కూడా మద్దతు ఇస్తున్నారు.

పత్తి రైతులకు గిట్టుబాటు కాదు కదా మద్దతు ధర కూడా రావటం లేదు, ధాన్య రైతులకూ అంతకంటే ఒరిగేదేమీ కనిపించటం లేదు.ఫ్యాక్టరీలలో కనీస వేతనాలూ, పని గంటల వంటి వాటి గురించీ అడగనవసరం లేదు.ఒక్క వామపక్ష పార్టీలకు తప్ప వైఎస్‌ జగన్‌ లేదా ఆ పార్టీలోని ఇతర నాయకులకు ఇవేమీ పట్టటం లేదు.అంటే వారి వెన్నుదన్నుగా వున్న మద్దతుదారులు కూడా ఇదేం పని ఎప్పుడూ రాజకీయాలేనా ఒక్కసారన్నా జనం సమస్యలు పట్టించుకోరా ? ఆందోళనలు లేకపోయినా కనీసం ఓదార్పు యాత్రలు జరపరా అని అడిగి వత్తిడి తెస్తున్నట్లు లేదు.

జనం కుల రాజకీయాలను ఆదరిస్తున్నారు కనుక మేం కూడా అదే బాటలో నడుస్తున్నామని నేతలు, నేతలు కుల రాజకీయాలలో మునిగి తేలుతున్నారు గనుక మా కులపోడికి మేం మద్దతు ఇవ్వవద్దా అని జనం. ఈ మురికి కూపం నుంచి బయట పడనంత వరకూ రెడ్డి, కమ్మ, కాపు ఏ కులం వాడికీ గిట్టుబాటు ధరలు రావు, మార్కెట్లో దోపిడీ ఆగదు. వ్యాపారాలు చేసేది, ఈ బలహీనతలను సొమ్ము చేసుకొనేదీ ఆయా కులాల ధనికులే.ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు కొత్త కాదు. 1950 దశకంలో కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని దెబ్బతీసేందుకు ప్రవేశ పెట్టిన ఈ దుష్ట రాజకీయాలు ఈనాడు పెద్దపీట వేసుకున్నాయి. ఎంత కాలమీ దుస్ధితి కొనసాగుతుందో తెలియదు. ప్రతి తరంలో ఒక కుల నాయకుడు లేదా నాయకులు పుట్టుకు వస్తున్నారు. వారు తమ సామాజిక వర్గాన్ని వుద్ధరించివుంటే ఈ పాటికి సోషలిజం వచ్చి వుండేది. పోనీయండి ఎంత కాలం అలా మద్దతు ఇస్తారో అదీ చూద్దాం. కందకు లేని దురద కత్తి పీటకెందుకు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d