• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Current Affairs

పత్తి ధరపై చైనాకు తగ్గుతున్న ఎగుమతుల ప్రభావం వుంటుందా ?

26 Tuesday Jul 2016

Posted by raomk in AP NEWS, CHINA, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Telangana

≈ Leave a comment

Tags

cotton, cotton farmers, cotton imports, indian farmers, yarn

ఎం కోటేశ్వరరావు

    ఎగువన వున్న తుంగభద్ర జలాశయమే పూర్తిగా నిండలేదు, అనూహ్యమైన వాతావరణ మార్పులు సంభవిస్తే తప్ప ఈ ఏడాది కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలు నిండటం అనుమానమే. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం పడిన కొద్ది పాటి వర్షాలకే మరో మార్గం కానరాక ఎన్నో ఆశలతో ఈ ఏడాది కూడా పత్తి సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే సీజన్‌కు క్వింటాలుకు పొడవు పింజ పత్తిరకాల మద్దతు ధర మరో అరవై రూపాయలు పెంచి రు.4,160గా ప్రకటించి ఎంతో మేలు చేసినట్లుగా చెప్పుకుంటోంది. ఏవి మోడీ 2022 నాటికి వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేస్తామని మొన్న చేసిన చేసిన వాగ్దానాల అమలు ఎక్కడ అని ఎవరైనా అడిగితే దేశ భక్తులు కాదని ముద్ర వేసే ప్రమాదం లేకపోలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులను అడిగితే ఒకరు వైఎస్‌ఆర్‌సిపి మీద మరొకరు తెలుగుదేశం, కాంగ్రెస్‌ మీద విరుచుకుపడి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తారు. చంద్రబాబు నాయుడికి నరేంద్రమోడీతో రోజురోజుకూ మరింతగా బిగుస్తున్న స్నేహ ధర్మం అడ్డు వచ్చి, పత్తి వేసుకోవద్దని ముందే సలహా ఇచ్చాం కదా అని చంద్రశేఖరరావు కూడా దీని గురించి పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్‌లో అనధికారికంగా అన్నీ తానే అయినట్లు వ్యహరిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న(ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వం వాటిని ఖండించలేదు) లోకేష్‌, తెలంగాణాలో తానే ముఖ్యమంత్రిని అన్నట్లుగా హడావుడి చేస్తున్న మంత్రి కెటిఆర్‌కు గానీ తమ రాష్ట్రాలలో పత్తి ఒక ప్రధాన పంట అనిగానీ రైతాంగంపై దాని ధరలు, మార్కెటింగ్‌ తీవ్ర ప్రభావం చూపుతాయని గానీ అనుకుంటున్నారో లేదో తెలియదు.

   చైనా ప్రస్తావన తేవటం కొంత మందికి ఆగ్రహం తెప్పించవచ్చు. ఏం చేస్తాం, వాస్తవాల మీద ఆధారపడినపుడు ప్రపంచమే చైనాను విస్మరించజాలదు, మన మార్కెట్‌ను కూడా చైనా వస్తువులు ముంచేస్తున్నపుడు మనం దూరంగా ఎలా వుంటాం.నిత్యం చైనాను కట్టడి చేయాలని, దాని వస్తువులను నిషేధించాలని వీరంగం వేస్తున్నవారితో సహా మన పత్తి, నూలును చైనా కొనటం నిలిపివేస్తే ఎవరూ చేసేదేమీ లేదు,పరిస్ధితి మరింత దిగజారుతుంది. అందుకే నరేంద్రమోడీ సర్కార్‌ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఏప్రిల్‌ చివరి వారంలో జెంగ్‌జౌ వస్తు మార్కెట్‌లో ఒక్క రోజులోనే 4.1కోట్ల బేళ్ల పత్తి లావాదేవీలు జరిగాయి. ఒక బేలు పత్తితో 215 జతల జీన్స్‌ తయారు చేయవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఆ ఒక్క రోజు అమ్మిన పత్తితో భూమ్మీద ప్రతి ఒక్కరికీ కనీసం ఒక జీన్స్‌ పాంట్స్‌ తయారు చేయటానికి సరిపోతుందని అంచనా.

  వ్యవసాయం గురించి అనుచితంగా మాట్లాడిన చంద్రబాబు పర్యవసానాలతో పది సంవత్సరాలపాటు అధికారానికి దూరంగా వుండి, కంగుతిని తరువాత ఓట్ల కోసం సవరించుకున్నారు. ఆచరణలో ఏం చేస్తున్నారు? ప్రధాని నరేంద్రమోడీ, ఇద్దరు తెలుగు చంద్రులు, వారి వారసులు పోటీ పడి విదేశీ పర్యటనలు చేస్తున్నారు. లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు తెస్తున్నట్లు పుంఖాను పుంఖాలుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. వాటిలో పదిశాతం లేదా ప్రయాణ, ప్రచార ఖర్చులు ఏది ఎక్కువైతే ఆ మొత్తం వాస్తవ రూపం దాల్చినా మంచిదే. ఆ పెట్టుబడులు వందల కొలదీ చేసుకున్నామని చెబుతున్న ఒప్పందాలలో రైతాంగానికి పనికి వచ్చేవి ఎన్ని? పొగాకు అమ్ముడు పోక రైతాంగం దిక్కుతోచకుండా వుంటే కొనటానికి కేంద్రాన్ని ఒప్పించలేని పెద్దలు తల్లికి తిండి పెట్టని కొడుకులు పిన్నికి బంగారు తొడుగులు వేయిస్తామన్నట్లుగా వ్యవసాయం గురించి చెపితే రైతులు చెవులో పూలు పెట్టుకొని నమ్మాలా ? అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గిన కారణంగా దిగుమతి చేసుకున్న ఎరువుల ధరలు తగ్గితే వ్యాపారులు ఆమేరకు తగ్గించకుండా వసూలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, వాటిపై నియంత్రణ వుందా ?

    మన పత్తికి ఇప్పుడున్నదాని కంటే మంచి ధర రావాలంటే చైనాకు మరిన్ని ఎగుమతులు జరిగితే తప్ప రాదన్నది స్పష్టం. 2015లో మన దేశం నుంచి చైనాకు ఎగుమతి చేసిన నూలు, దానికి వచ్చిన రేటు 12,17శాతం చొప్పున తక్కువగా వున్నాయని తాజా సమాచారం. ముందే చెప్పుకున్నట్లు తన దగ్గర వున్న అపార పత్తి నిల్వలను చైనా మార్కెట్‌కు విడుదల చేస్తోంది. ఈ స్ధితిలో మన పత్తి రైతులకు ధర గతం కంటే ఎలా మెరుగుపడుతుందో తెలియని స్ధితి. మిలియన్ల మంది పత్తి రైతులు, వారి పొలాల్లో పని చేసే వ్యవసాయ కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా పారిశ్రామిక, వ్యాపారాలలో పెట్టుబడుల ఎండమావులు వెంట తిరిగితే ప్రయోజనం వుంటుందా ?

    గతేడాది చైనాకు ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. అయితే వియత్నాం, బంగ్లాదేశ్‌ కొంత మేరకు దిగుమతులు పెంచటంతో పత్తి ధర సీజన్లో మద్దతు ధరకు అటూఇటూగా అయినా వుంది.ఈ ఏడాది వారు కూడా తమకు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే మన రైతాంగ పరిస్ధితి ఏమిటి ? రైతులు పచ్చగా లేకుండా లోకేష్‌ బాబుతో కలసి చంద్రబాబు అంతర్జాతీయ స్ధాయిలో రాజధాని అమరావతిని నిర్మించినా, చంద్రశేఖరరావు అండ్‌ ఫ్యామిలీ భాగ్యనగరాన్ని మరింతగా అభివృద్ధి చేసినా ప్రయోజనం ఏమిటి ?

    తమకు నష్టాలు వస్తున్నాయనే పేరుతో నూలు మిల్లులు వారానికి కొన్ని గంటల పాటు వుత్పత్తిని తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఈ ఏడాది జూన్‌లో మన దేశం నుంచి పత్తి నూలు 8.2 కోట్ల కిలోలు 74 దేశాలకు ఎగుమతి అయింది. మేనెలతో పోల్చితే కిలోకు ఏడు సెంట్ల ధర పెరిగినా ఏడాది క్రితంతో పోల్చితే 24 సెంట్లు తక్కువ.ఈ స్ధితిలో ఈ ఏడాది నూలు ఎగమతిదారులు ఏ ధైర్యంతో పత్తిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు? గతం కంటే దిగుమతులు తగ్గినప్పటికీ మన పత్తి, నూలు ఎగుమతులు చైనాకే ఎక్కువగా జరుగుతున్నాయి.

     ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖకు కొత్తగా వచ్చిన కమిషనర్‌ తన ప్రత్యేకతను ముఖ్యమంత్రి ముందు ప్రదర్శించుకొనేందుకు లేదా తాము ఎన్ని విజయాలు సాధించినా వాటి సమాచారం జనంలోకి వెళ్లటం లేదన్న ముఖ్యమంత్రి ఆగ్రహం వల్లగానీ సమాచార శాఖ కొత్తగా పరిశోధన అవలోకన( రిసర్చ్‌ రిఫరెన్సు) విభాగాన్ని ఏర్పాటు చేసి పుంఖాను పుంఖాలుగా పొత సమాచారాన్ని కొత్తగా మీడియాకు అందచేస్తున్నది. వాటిలో కొన్ని ఇలా వున్నాయి. 2050 నాటికి అంటే మరో 34 సంవత్సరాల నాటికి అమరావతి నగరంలో 12లక్షల వుద్యోగాలు సేవల రంగంలో మూడు లక్షల వుద్యోగాలు పరిశ్రమల రంగంలోనూ కల్పించేందుకు చంద్రబాబు కృషి. ఇందుకు గాను మౌలిక వసతుల కల్పనలా భాగంగా 3,746 కిలోమీటర్ల జాతీయ రహదారులకు(ఇవి ఇతర ప్రాంతాలలో కూడా వుంటాయనుకోండి) గాను రు.34,732 కోట్లు, అమరావతి రింగురోడ్డు, ఇతర 720 కిలోమీటర్ల రోడ్డకు రు.30వేల కోట్లు,రేవులను కలిపే 419 కిలోమీటర్ల ప్రధాన రహదారులకు రు.4,306 కోట్లు ఇంకా మరికొన్ని రోడ్ల గురించి సమాచార శాఖ తెలిపింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అశోక్‌గజపతి రాజు అర్ధికశాఖ మంత్రిగా వుండగా కూడా ఇలాగే రోడ్ల నిర్మాణం, వాటికి విదేశీ అప్పుల గురించి వాటి ద్వారా జరిగే అభివృద్ధి గురించి వూదరగొట్టిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తిరిగి ఇప్పుడు అదే జరుగుతోంది. రోడ్లు వేస్తే కాంట్రాక్టర్లు వస్తారు, కాంట్రాక్టర్లు వస్తే కొంత మందికి జేబులు నిండుతాయి, జనానికి టోలు ఫీజు రూపంలో జేబులు ఖాళీ అవుతాయి. రోడ్లు వేయటానికి ముందు, తరువాత తమ వుత్పత్తులకు వస్తున్న రేట్లలో తేడా ఏముందో మదనపల్లి టమాటో రైతులు చెప్పాలి. వుల్లి ధరలు పెరిగి వినియోగదారులకు, తగ్గి రైతులకు కన్నీరు తెప్పించిన విషయం కర్నూలులో ఏ రైతును అడిగినా చెబుతారు.పత్తి, పొగాకు ధరల గురించి వేరే చెప్పనవసరం లేదు.

   కొన్ని రోడ్ల నిర్మాణానికే దాదాపు 70వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్‌ రైతులకు ఏం చేస్తోంది? పదిహేడు లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల వుత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న ఖర్చు 120 కోట్లు అని సమాచార శాఖ పేర్కొన్నది. పాతిక కిలోమీటర్ల రోడ్డు వేయటానికి అయ్యేఖర్చును కూడా వ్యవసాయంపై పెట్టటానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Gazette Notification relating to 7th Pay Commission Recommendations

26 Tuesday Jul 2016

Posted by raomk in Current Affairs, employees, INDIA, NATIONAL NEWS, Pensioners

≈ Leave a comment

Tags

7th Pay Commission Recommendations, Gazette Notification, Ministry of Finance

          The Ministry of Finance has issued Gazette Notification with regard to 7th Pay Commission Recommendations.

For more details, please see.

Resolution on Cabinet Decision

Revised Pay Rules 2016

Share this:

  • Tweet
  • More
Like Loading...

Increase in income limit for OBC non Creamy Layer

25 Monday Jul 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Creamy Layer, income limit, OBC

Government of India
Ministry of Social Justice and Empowerment
Rajya Sabha

Unstarred Question No-516
Answered on – 21.07.2016

516 . Dr. R. Lakshmanan

(a) whether any proposal is pending with Government to increase the income limit for OBC non-Creamy Layer (OBCNCL) from existing 6 lakhs per annum to 8 lakhs per annum; and
(b) if so, the details thereof and if not, the reasons therefor?

ANSWER

(a): A proposal to enhance the income ceiling for Other Backward Classes non-Creamy Layer, is presently under consideration of the Government.

(b): The income criterion among creamy layer for Other Backward Classes was first notified at Rs. 1.00 lakh per annum in September, 1993. This was enhanced to Rs. 2.5 lakh in March, 2004 and thereafter to Rs. 4.5 lakh in October, 2008 and Rs. 6.00 lakh in May, 2013. The National Commission for Backward Classes has recommended in 2015 modifications in the various factors for determining of Creamy Layer among OBCs, including enhancement of present limit. The matter has been examined in the Ministry of Social Justice & Empowerment in consultation with other Ministries/Departments concerned, for taking a view on the enhancement of income ceiling. The level of enhancement and the revised income ceiling will be notified by the Government in due course, after approval of the Cabinet.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

22 Friday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Narendra Modi, special status to Andhra pradesh, tdp

 నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన అనధికార బిల్లు అందరూ వూహించినట్లుగానే రెండవ సారి కూడా చర్చకు రాకుండా పోయింది. అలాంటి బిల్లులను చర్చకు రానివ్వరని ఎలాంటి ఆవేశ కావేషాలకు లోనుకాకుండా ఎంతో శాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్‌ పౌరులు గ్రహించటం మంచిది. రజనీకాంత్‌ ఒక సినిమాలో సినిమాలో చెప్పినట్లు అతిగా ఆశపడవద్దు. నరేంద్రమోడీ, చంద్రబాబు మంత్రదండాలు, అల్లావుద్దీన్‌ అద్బుతదీపాలు, లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య వంటి పవన్‌ కల్యాణ్‌ ప్రకటనల కోసం ఎదురు చూసే ఆనందం ఎంతైనా ప్రత్యేక హోదాతో రాదు కదా !

    ఆ బిల్లు చర్చకు వస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలుగు దేశం పార్టీ నేతలు చెప్పిన తీరును చూసినపుడే రాదన్న గట్టి ధీమా వారిలో వుందని తేలిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే కాంగ్రెస్‌ రెండు సంవత్సరాల తరువాత ఒక ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని అంగీకరిద్దాం. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు, అలాగే చంద్రబాబుకు తెలిసిన రాజకీయం కూడా అలాంటిదే. రాష్ట్ర విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా అన్యాయం చేశారనే శాశ్వత విమర్శను కొనసాగించాలన్నా , ఆ పేరుతో మరికొంత కాలం ఓట్లు దండుకోవాలన్నా దానిని ఇవ్వకుండా, అలాంటి బిల్లులను చర్చకు రాకుండా చేయటం బిజెపి, తెలుగుదేశం పార్టీలకు అవసరం అని శుక్రవారం నాటి పరిణామాలు నిరూపించాయని కూడా అనుకోకతప్పదు మరి. రాష్ట్రాన్ని విభజించి అసెంబ్లీ చరిత్రలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన కాంగ్రెస్‌కు జ్ఞానోదయం కలిగి కావచ్చు లేదా చేసిన తప్పును దిద్దుకోవాలంటే పోయిన చోటే వెతుక్కోవాలన్న లోకోక్తి ప్రకారం గానీ ఏదైనేం రెండు సంవత్సరాలకు ఒక బిల్లును ప్రవేశపెట్టింది.

   నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు బిజెపి నేత అవునో కాదో తెలియని మా గుంటూరు గొరిజవోలు చిన్న సినీ హీరో శివాజీ దానిని 14వ అంశంగా పెట్టారని శరభ శరభ దశ్శరభ శరభ అంటున్నాడు. బిల్లు చర్చకు రావాలని, ఆమోదం పొందాలని తెలుగుదేశం పార్టీ నిజంగా కోరుకుంటే , హోదా రాకపోతే ఆంధ్రప్రజలు ఆగ్రహిస్తారని అనుకొని వుంటే చర్చకు రాకుండా పోయిన తరువాత దాని మీద ఆ పార్టీ నేతలు, చివరికి నిన్నటి వరకు కాంగ్రెస్‌లో వుండి తెలుగుదేశంలో రాజ్యసభ సీటుకొనుక్కున్నారని విమర్శలు ఎదుర్కొన్న టిజి వెంకటేష్‌తో సహా అలాంటి వ్యాఖ్యలు చేసి వుండేవారు కాదు.

   ఆమ్‌ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎంపీ పార్లమెంట్‌ ప్రాంగణాన్ని వీడియో తీసి దానిని సామాజిక మీడియాలో పెట్టారని అది నిబంధనలకు వ్యతిరేకం కనుక అతగాడిపై చర్య తీసుకోవాలని బిజెపి అభ్యంతరం తెలిపింది. ఓకే, అదే వాస్తవమైతే నిబంధనల ప్రకారం స్పీకరుకు ఫిర్యాదు చేయవచ్చు, రుజువైతే చర్య తీసుకోవచ్చు, ఎవరు అడ్డుపడ్డారు. వుభయ సభలలో కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల సభ్యులు కూడా చర్య తీసుకోవాలనే కోరారు తప్ప వ్యతిరేకించలేదు. అన్నింటికీ మించి సదరు సభ్యుడు క్షమాపణ చెప్పాడు. అయినా సరే అతని ప్రవర్తన అభ్యంతరకరం అనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా మాదిరి బిజెపి వ్యూహకర్తల మేకిట్‌ ఎన్‌ ఇష్యూ (దాన్నొక సమస్యగా చేయండి ) కాకపోతే ఆ పేరుతో లోక్‌సభ, రాజ్యసభలను ఒక రోజంతా పనిచేయకుండా వాయిదా పడేట్లు అధికారపక్షమే అడ్డుకోవాల్సినంత తీవ్ర విషయమా అది.

   రాజ్యసభలో ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి పార్లమెంట్‌ భద్రతా విషయాన్ని చర్చించాలన్న అధికార పక్ష సభ్యురాలి డిమాండ్‌ను కాంగ్రెస్‌ సభ్యులు ఆమోదించలేదు. ప్రశ్నోత్తరాల తరువాత దాని గురించి చర్చించవచ్చని చెప్పారు.అయినా సరే బిజెపి దాని మిత్రపక్షాల సభ్యులు తమ పట్టువీడకుండా గొడవ చేయటంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సహా అనధికార బిల్లులు చర్చకు రాకుండా పోయాయి. కాంగ్రెస్‌ సభ్యులు ముందే చర్చకు అంగీకరించి వుంటే బిల్లు చర్చకు వచ్చేదని నెపాన్ని కాంగ్రెస్‌ మీద నెట్టేందుకు తెలుగుదేశం మంత్రులు, ఎంపీలు ప్రయత్నించటాన్ని చూస్తే జరిగిందేమిటో అర్ధం చేసుకోలేనంత అమాయకంగా ఆంధ్రప్రజానీకం వుందని భావిస్తున్నారా ? లేక తామేం చెప్పినా నిజమే నిజమే అని తలలూపుతారనుకుంటున్నారా ? అన్నీ వదులుకున్న వాళ్లం హైకోర్టు కోసం పట్టుబట్టి హైదరాబాదులోనే కూర్చుంటామా అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే అన్ని పార్టీలనీ గుడ్డిగా నమ్మి (సిపిఎం తప్ప) అన్నీ వదులుకున్న ఆంధ్రులు రాని ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టి కూర్చుంటారా ?

      తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారికి ఏమైందో తెలియదు. శుక్రవారం రాత్రి తన సిబ్బంది ద్వారా ఒక అధికారిక ప్రకటన పంపారు. దాని పూర్తి పాఠం ఇలా వుంది.’రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని భావించాము కాబట్టే రాష్ట్రానికి ద్రోహము చేసిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్  అని చూడకుండా మద్దతు ఇచ్చాము . సభలోకి వెళ్లకముందే AP ప్రయోజనాలు ముఖ్యము అని స్పష్టము గా చెప్పాను. టీడీపీ కృషి , ఒత్తిడి వలనే కేంద్రము క్రమము గా అన్ని పథకాలకు నిధులు కేటాయించటం జరిగింది . ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహ ధర్మాన్నే పాటిస్తాము కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయము లో రాజీ పడే పరిస్థితి లేదు . రాజకీయ ఎదుగుదల కోసము కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలని తెలివైన ఆంధ్రులు తేలికగా అర్థము చేసుకుంటారు . ‘.

ఇక్కడ సామాన్యులకు అర్ధం కాని విషయం ఏమంటే కాంగ్రెస్‌ మీద అంత సానుభూతి ఎందుకు? తెలుగు దేశం పార్టీ కృషి, వత్తిడి వల్లనే కేంద్రం అన్ని పధకాలకు నిధులు ఇచ్చిందన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఇలా చెప్పటం నిజంగా ఆశ్చర్యంలోనే ఆశ్చర్యం. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుస్తుందా లేక వత్తిడి ద్వారా పని చేస్తుందా ? మీరు చెప్పినట్లు స్నేహంగా వున్నంత కాలం నిధులు విడుదల చేయని కారణంగానే వత్తిడి తెచ్చారని అనుకోవాలా ? వత్తిడి కారణంగా అదనంగా వచ్చిన నిధులేమిటో జనానికి తెలియ చేస్తే సంతోషిస్తారు. బిజెపి-తెలుగు దేశం మధ్య వున్నది అనుభూతికి అందని అపూర్వ స్నేహంగా కనిపిస్తోంది. మీరు తెచ్చే వత్తిడికి నిజంగా అంత సత్తా వుంటే ప్రత్యేక హోదా సంగతి ఇంతకాలం ఎందుకు తేల్చలేకపోయారు అని జనం అడుగుతున్నారు. పార్లమెంట్‌లో మీరే ఎందుకు వత్తిడి తేలేదు. ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యులు సభలో గందర గోళం, వెల్‌లోకి దూసుకుపోవటం వంటివి చేస్తారు. కానీ మీ మిత్రపక్షం అధికారంలో వుండి ఆ పని చేస్తోంది. అంటే ప్రజాస్వామ్యాన్ని తలకిందులుగా అర్ధం చేసుకోవాలా ?

    కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు, బుద్ది రాదు అనుకుందాం . బిజెపి, తెలుగుదేశం పార్టీల వద్ద శుద్ది,బుద్ది టన్నుల కొద్దీ వున్నాయి కదా ! ఇప్పటికైనా ఎలాంటి రాజకీయాలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది కోసం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ ఏదో ఒకటి చేసి చూపండి, ఏమీ చేయకుండానే మూడో ఏడాదిలో ప్రవేశించారు. లేదా ఏదీ అవేమీ వుండవు అనైనా చెప్పండి ! సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇండోనేషియా కమ్యూనిస్టుల వూచకోతలో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా

20 Wednesday Jul 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

1965 anti-communist purge, Australia, civil tribunal, Indonesia, Indonesian Communist Party (PKI)., PKI, UK, US

A Chinese student (centre) is pummelled by Indonesian youths who stormed the dormitory of a communist Chinese University ...

ఎంకెఆర్‌

     ఇండోనేషియాలో 1965-66 సంవత్సరాలలో ఐదు లక్షల మంది కమ్యూనిస్టుల వూచకోతలో అమెరికాతో పాటు బ్రిటన్‌, ఆస్ట్రేలియా హస్తం కూడా వున్నట్లు నాటి ఘటనలపై విచారణ జరిపిన ప్రజాకోర్టు బుధవారం నాడు (జూలై 20న) విడుదల చేసిన తుది నివేదికలో పేర్కొన్నది.ఇరవయ్యవ శతాబ్దిలో పేరు మోసిన నియంతగా చరిత్ర కెక్కినఇందోనేషియా సుహార్తో 2008 మరణించిన తరువాత నాటి మారణ కాండ నుంచి తప్పించుకొని సజీవులుగా వున్నవారు, మానవహక్కుల కార్యకర్తలు, కవులు, కళాకారులు తమ గళం ఎత్తి నాటి వుదంతాలపై వాస్తవాలను వెల్లడించాలని, మారణకాండకు పాల్పడిన వారిని శిక్షించాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చిన విఫయం తెలిసిందే.నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో 2015 నవంబరులో ప్రజాకోర్టు విచారణ జరిగింది. దాని ముందు హాజరైన వారు, వుదంతానికి సంబంధించి 40 మందికిపైగా పరిశోధకులు అందించిన సమాచారాన్ని విశ్లేషించి అంతిమ నివేదికను విడుదల చేశారు. దీనిలో ఆస్ట్రేలియ, బ్రిటన్‌, అమెరికాకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

    ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీ నేతలు, సభ్యుల జాబితాలను అమెరికా అందించినట్లు, వాటి ఆధారంగా హత్య, జైళ్లపాలు చేసినట్లు ప్రజాకోర్టు ముందుకు వచ్చిన సమాచారం వెల్లడించింది.అమెరికా, ఇండోనేషియా మిలిటరీ సృష్టించిన కట్టుకధలను బ్రిటన్‌,ఆస్ట్రేలియా ప్రభుత్వాలు నిరంతరం ప్రచారంలో పెట్టాయి. విచక్షణారహితంగా మారణకాండ జరిగినట్లు స్పష్టంగా తెలిసిన తరువాత కూడా ఈ ప్రచారాన్ని కొనసాగించినట్లు తేలింది.తమ విచారణకు హాజరై వాదనలను వినిపించాలని చేసిన విజ్ఞప్తిని ఇండోనేషియా, అస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికా ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం విచారకరమని ప్రజాకోర్టు వ్యాఖ్యానించింది. జనరల్‌ సుహార్తో కమ్యూనిస్టుల వూచకోతలో నాయకత్వ పాత్ర వహించినట్లు తెలుపుతూ మరణించినవారు, బతికి బయట పడ్డవారికి, వారి కుటుంబాలకు ఇండోనేషియా సర్కార్‌ క్షమాపణ చెప్పాలని, మానవత్వంపైనే జరిపిన నేరాలకు పాల్పడిన వారిపై విచారణ జరపాలని కోర్టు పేర్కొన్నది. ఇరవయ్యవ శతాబ్దంలో జరిగిన అత్యంత దుర్మార్గ వూచకోతలలో ఒకదానిగా దీనిని పరిగణించాలని చెప్పింది.

    న్యాయమూర్తులలో ఒకరైన ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ హెలెన్‌ జార్విస్‌ మాట్లాడుతూ తమ నివేదిక ఇప్పటికే ఇండోనేషియాలో న్యాయం చేయాలని నినదిస్తున్నవారికి అదనపు గళం అవుతుందని, ఇప్పటికే తమ స్వంత మానవహక్కుల సంస్ధలు చేసిన సిఫార్సులు కూడా వున్నందున ఇండోనేషియా ప్రభుత్వం వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని బతికి వున్న బాధితులకు పునరావాసం కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు.ఈ నివేదిక గురించి ఇండోనేసియా న్యాయ, రాజకీయ, భద్రతా వ్యవహారాల సమస్వయ శాఖ మంత్రి లుహుత్‌ పాంజైటన్‌ మాట్లాడుతూ ఇండోనేసియాకు ఒక న్యాయ వ్యవస్ధ వుంది, ఏం చేయాలో ఈ దేశానికి మరొకరు నిర్దేశించాల్సిన అవసరం లేదు, విశ్వవ్యాప్త విలువలతో ఈ సమస్యను మేము పరిష్కరిస్తాం, దీని గురించి మేము చాలా ధృఢంగా వున్నాం’ అని వ్యాఖ్యానించారు.అయితే నివేదిక తయారీలో ప్రముఖ పాత్ర వహించిన మానవహక్కుల న్యాయవాది టోడంగ్‌ మౌల్య లుబిస్‌ మాట్లాడుతూ తమ అంతిమ నివేదిక క్షమాపణలు, పునరావాసం, నష్టపూర్తి చర్యలకు తలుపులను తెరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా అనేక మంది ప్రముఖులు ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. ‘ కమ్యూనిస్టుల నుంచి ముప్పు వచ్చిందని, వారిని చంపటం లేదా వారి చేతిలో చావటమో తేల్చుకోవాలని చెప్పారని’ ముస్లిం సంస్ధ నహదల్‌తుల్‌ వులమా చరిత్రకారుడు ఇమాన్‌ అజీజ్‌ ఇటీవల అన్నారు.అయితే అణచివేయాల్సినంత భయానక పరిస్ధితులు లేవని ప్రజాకోర్టు నివేదిక వెల్లడించిందని మోనాష్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ పుర్దే చెప్పారు. ఇది పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం ఆధారంగా జరిగిందని స్పష్టమైందని ఆమె అన్నారు. కౌసెన్‌దార్‌ అనే 83 ఏండ్ల వృద్ధుడు మాట్లాడుతూ ఎలాంటి విచారణ లేకుండా తనను 14 సంవత్సరాల పాటు బారు దీవిలోని జైలులో పెట్టారు. ఆయన నేరమల్లా ఒక కార్మిక సంఘంలో వున్న స్నేహితులను కలిగి వుండటమే.తన వంటి వారికి జరిగిన అన్యాయానికి క్షమాపణ చెప్పాలా లేదా అనేది ప్రభుత్వమే తేల్చుకోవాలన్నారు. స్వాధీనం చేసుకున్న మా ఆస్ధులు తిరిగి ఇవ్వాలి, రద్దు చేసిన మా పెన్షన్‌ హక్కులను పునరుద్దరించాలి, దేశం విడిచి పోయేట్లు చేసిన వారిని తిరిగి రప్పించాలి, మా డిమాండ్లేమే సంక్లిష్టమైనవి కాదు’ అన్నారు.

    ప్రజాకోర్టు నేపధ్యం విషయానికి వస్తే నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో నవంబరు 10-13 తేదీల మధ్య విచారణ జరిపింది. పలు వివరాలతో కూడిన ఆరువందల పేజీల నివేదికను తయారు చేసింది. బాధితులుగా వున్నవారు 20 మంది సాక్ష్యాలు చెప్పారు. హత్యలు,జైలు పాలు చేయటం, బానిసలుగా మార్చివేయటం, చిత్ర హింసలు, అత్యా చారాలు, మాయం చేయటం, విద్వేష ప్రచారం, ఇతర దేశాల జోక్యం వంటి అంశాలపై ఈ కోర్టు విచారించింది. నియంత సుహార్తో చచ్చేంత వరకు ఇండోనేషియాలో జరిగిన ఈ దురాగతం గురించి ప్రపంచానికి మిలిటరీ, దానికి మద్దతుగా వున్న అమెరికా తదితర దేశాలు ప్రచారంలో పెట్టిన కమ్యూనిస్టు వ్యతిరేక, ఏకపక్ష కధనాలు తప్ప వాస్తవాలను బయటకు రాకుండా తొక్కి పెట్టారు. ఎవరినీ నోరెత్తనివ్వలేదు, అయితే సుహార్తో చచ్చిన నాలుగు సంవత్సరాల తరువాత ‘హత్యాకాండ’ పేరుతో 2012లో జాషువా ఓపెన్‌హెయిమర్‌ తీసిన డాక్యుమెంటరీ చిత్రం ఆ నిశ్శబ్దాన్ని తొలుత భగ్నం చేసింది. 2013లో హేగ్‌లో దానిని ప్రదర్శించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చలో 35 మంది ప్రవాస ఇండోనేషియన్లు పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు, కొంత మంది సామాజిక కార్యకర్తలు, పరిశోధకులు కూడా హాజరయ్యారు.2012లోనే ఇండోనేషియా మానవహక్కుల సంఘం ఇచ్చిన నివేదికను కూడా అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు.దీంతో ఒక అంతర్జాతీయ ప్రజాకోర్టును ఏర్పాటు చేసి వాస్తవాలను వెలికి తీయాలని, వాటిపై ఒక నివేదికను రూపొందించాలన్న సూచన కార్యరూపం దాల్చింది. నూర్సియా బానీ కాట్‌జసంగ్‌కానా కన్వీనర్‌గా 2013 మార్చినెలలో తొలుత కొద్ది మందితో సమావేశం జరిపి విచారణ తీరుతెన్నులను చర్చించారు. జకర్తా, నెదర్లాండ్స్‌ (ఇండోనేషియా నెదర్లాండ్స్‌ వలస రాజ్యం అన్న విషయం తెలిసిందే) అంతర్జాతీయ ప్రజాకోర్టు( ఐపిటి) 1965 పేరుతో 2014 మార్చి 18న ఒక న్యాయ సంస్ధను రిజిస్టర్‌ చేసి 2015లో విచారణ జరిపేందుకు ముందుకు వచ్చే న్యాయమూర్తులను సంప్రదించారు.ఈ ప్రక్రియకు వందమందికి పైగా సహకరించారు. అనేక మంది ప్రవాస ఇండోనేషియా విద్యార్ధులు ముందుకు వచ్చారు. వారిని బెదిరింపులకు గురిచేసినప్పటికీ లొంగలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Don’t carry people on ‘dream path’ of consumerism: ESL Narasimhan

19 Tuesday Jul 2016

Posted by raomk in AP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Telangana

≈ Leave a comment

Tags

AP crisis, consumerism, dream path, MFIs, microfinance

 

The microfinance institutions (MFIs) should find out adequacy of skills, competence, capability and the need of the borrower before lending money thereby learning lessons from the crisis that originated in erstwhile Andhra Pradesh in 2010, Telangana and Andhra Pradesh Governor, Mr E.S.L. Narasimhan said at an ASSOCHAM event held in Hyderabad today.

“Today when you are talking of skill development and Make in India as one of the priority areas, I think there is a great responsibility on MFIs, please do not carry people on the dream path of consumerism once again to start with,” said Mr Narasimhan while inaugurating an ASSOCHAM National Summit on Microfinance.

Talking about financial inclusion, he said that there is an urgent need to bridge the growing gap between haves and have-nots together with the divide between rural-urban, rich-poor, privileged-under privileged.

“Unless we are able to bridge this concept of financial inclusion, (programs like) Skill India, Make in India are not going to take us anywhere, we need to make a very conscious effort to bridge this gap,” said the Governor.

“While looking at financial inclusion, we particularly need to go into the rural areas as there are lot of skills available there which die unheard of because they are not able to support their ideas,” he added.

“I think it is for all of us to learn lessons from the past and ensure that we do not repeat the whole crisis of 2010 and force us to do something more again,” said the Governor on the crisis that broke out in erstwhile Andhra Pradesh when the government had to pass an ordinance to control the MFIs.

“The purpose of the MFIs was to help the self-help groups (SHGs) to grow but unfortunately what happened was that lending system went beyond a certain level, the very purpose of the SHGs was itself was to promote entrepreneurship, skills, employment, earning capabilities and basically to improve the economy but a temptation was put forth by the MFIs in lending at so-called hidden rates of interest which made people borrow large sums of money and get into consumerism,” he further said.

He urged the MFIs to spread their institutions’ operations into rural India with the advantage of technological advancement.

Earlier while addressing the ASSOCHAM summit, Mr Navin Mittal, finance secretary, Government of Telangana said that the state government is focussing on start-ups and is looking at phase-after-phase development of start-incubator, T-Hub.

“The T-Hub which has come up very recently in Hyderabad has been really able to attract imagination of a lot of people, we are now planning phase-after-phase for the T-Hub because it has really triggered the latent energies of start-up ecosystem,” said Mr Mittal.

He also said that for the self-employment sector, Telangana is focussing a lot on the marginalised communities.

“We have been able to step up our investment in terms of investment subsidy support to people from OBC, SC/ST, minorities in a huge way and I must say that in times to come the state will emerge as an ideal place to invest and to do business,” said Mr Mittal.

“We have a legislation-backed industrial promotion scheme in terms of TS-iPASS that is where we have taken the concept of single window clearance to a new level altogether that it is not just a clearance but is working on the mode of self-certification,” he added.

Highlighting that Telangana has developed a very investor and business friendly environment, the state’s finance secretary said that its ranking will go very high in the latest rankings in the country in terms of ease of doing business when they come out as there is a huge focus on easing things to make them more transparent and workable.

While addressing the ASSOCHAM summit, the chamber’s president, Mr Sunil Kanoria said, “The success of the MFI sector will largely depend on how well the players can blend technology and human interface in providing financial solutions to the clients and leveraging technology to bring down operational costs and enhancing penetration and training employees to offer customised solutions to the clients will shape the future of the MFI sector.”

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంతరాష్ట్ర మండలిలో తెలుగు చంద్రులేం ప్రసరించారు ?

18 Monday Jul 2016

Posted by raomk in AP, BJP, CPI(M), Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, inter state council meet, Inter-State Council, ISC, KCR, Modi

ఎం కోటేశ్వరరావు

     పది సంవత్సరాల తరువాత జూలై 17న న్యూఢిల్లీలో సాదాసీదాగా అంతరాష్ట్ర మండలి సమావేశం జరిగింది. కేంద్రం-రాష్ట్ర సంబంధాలు, ముఖ్యంగా నిధులు, విధుల బదలాయింపులు, రాష్ట్రాల హక్కుల గురించి చర్చ జరుగుతుందని ఎవరైనా భావిస్తారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం ఎలా వ్యవహరిస్తున్నదో దశాబ్దకాలం పాటు అసలు సమావేశం జరగపోవటమే తేటతెల్లం చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్‌-బిజెపి దొందూ దొందే. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ మదన్‌ మోహన్‌ పంఛి అధ్యక్షతన 2007 ఏప్రిల్‌ 27న బాధ్యతలు స్వీకరించిన కమిషన్‌ 2010 మార్చి 30 కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఎలాంటి ప్రచార ఆర్బాటాలు లేకుండా తన పని తాను చేసిన కమిషన్‌గా ఇది పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి ఆ కమిషన్‌ నివేదికకు కాంగ్రెస్‌ హయాంలో నాలుగు సంవత్సరాలు, బిజెపి ఏలుబడిలో రెండు సంవత్సరాలు దుమ్ము పేరుకు పోయింది.దీనిలోని సిఫార్సులను ఏకాభిప్రాయంతోనే కేంద్రం అమలు జరుపుతుందని ముక్తాయింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర అంతరాష్ట్ర మండలి సమావేశ ముగింపులో చెప్పారు. అంటే దీని సిఫార్సులు ఎప్పుడు ఆమోదం పొందుతాయో తెలియని స్ధితి.

    తెల్లవారే సరికి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్ధానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టగలిగిన బిజెపికి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఆసక్తి, అన్నింటికీ మించి నిజాయితీ వుంటే ఈ నివేదికపై సమావేశం జరపటానికి రెండు సంవత్సరాల వ్యవధి తీసుకోవాల్సిన అవసరం లేదు. సమాఖ్య స్పూర్తిని, రాజ్యాంగ నిబంధనలను దెబ్బతీయటంలో కాంగ్రెస్‌ రికార్డును తిరగరాసేందుకు బిజెపి పూనుకుందని వుత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు చేసిన పనులను బట్టి స్పష్టమైంది. తమది భిన్నమైన పార్టీ అని స్వంత డబ్బా కొట్టుకొని ఇతరులను విమర్శించే నైతిక హక్కును అది కోల్పోయింది. పూంఛీ కమిషన్‌ సిఫార్సులకు వ్యతిరేకంగా అది వ్యవహరించింది.తమది పనిచేసే ప్రభుత్వమని, కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అని చెప్పుకున్న పార్టీ, ప్రభుత్వం ఈ సమావేశ ఏర్పాటుకు ముందే కమిషన్‌ చేసిన సిఫార్సులలో వేటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందో వేటిని తిరస్కరించిందో, వేటిపై చర్చ జరగాలని కోరుకుంటోందో ఒక వైఖరిని తీసుకొని రాష్ట్రాల ముందు వుంచితే వాటి మంచి చెడ్డలపై మధనం జరిగి, ఒక కొలిక్కి వచ్చేందుకు దారి చూపేది. అదేమీ లేకుండా మొక్కుబడిగా సాగదీసేందుకు పూనుకుంది.

    ఇప్పటికే కేంద్రం-రాష్ట్రాల మధ్య వున్న సంబంధాలు, సత్సంప్రదాయాలు, వివిధ సమస్యలపై కోర్టులు వెలువరించిన అభిప్రాయాలతో కమిషన్‌ తాను వుచితం అనుకున్న సమస్యలన్నింటిపైన అభిప్రాయాలు తెలిపే విధంగా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాల కాంగ్రెస్‌, మధ్యలో అధికారంలోకి వచ్చి స్వల్పకాలమే వున్న జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాలుగానీ గతంలో వివిధ కమిషన్లు చేసిన సిఫార్సులను తుచ తప్ప కుండా లేదా వాటి స్ఫూర్తిని గానీ అమలు జరిపిన పాపాన పోలేదు. అందువలన కమిషన్లు అంటే సాగదీయటానికి, రిటైరైన న్యాయమూర్తులు, వున్నతాధికారులకు వుపాధి కల్పన అంశాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు, దాంతో జనానికి వాటిమీద విశ్వాసం పోయింది.పూంఛీ కమిషన్‌ సిఫార్సులు కూడా గత కమిషన్ల జాబితాలో చేరతాయా ?

    పూంఛీ కమిషన్‌ చేసిన ప్రధాన సిఫార్సుల సారాంశం ఇలా వుంది.కల్లోలం సంభవించిన నిర్దిష్ట ప్రాంతాలను పరిమిత కాలం పాటు కేంద్రం తన పాలన కిందకు తెచ్చుకొనేందుకు ఆర్టికల్‌ 355,356ను సవరించాలి. ఒక జిల్లా లేదా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో స్ధానిక అత్యవసర పరిస్ధితిని ప్రకటించేందుకు కేంద్రానికి అధికారం ఇచ్చే విధంగా 355,356 ఆర్టికల్స్‌ను సవరించాలి. అయితే అలాంటి అత్యవసర పరిస్థితి వ్యవధి మూడునెలలకు మించి వుండకూడదు. మత హింసాకాండ తలెత్తినపుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా స్వల్పకాలం పాటు కేంద్ర దళాలను దించేందుకు కేంద్రానికి అనుమతిచ్చే విధంగా మత హింసాకాండ బిల్లుకు సవరణ చేయాలి. సాయుధ దళాలను దించేందుకు రాష్ట్రాల అనుమతి ఆటంకంగా మారకుండా సవరణ చేయాలి.అయితే బలగాల మోహరింపు ఒక వారానికి మాత్రమే పరిమితం చేయాలి. అంతకు మించి వుండేందుకు రాష్ట్రాల అనుమతి తీసుకోవాలి.ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి ఎన్నికలకు ముందు వున్న ఎన్నికల కూటమిని ఒక రాజకీయ పక్షంగా పరిగణిస్తూ స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించాలి. ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో గవర్నర్లు ఏ పద్దతిని పాటించాలో కూడా స్పష్టం చేయాలి.ఎన్నికలకు ముందు వున్న కూటములలో ఎక్కువ సంఖ్య వున్నదానిని ఆహ్వానించాలి.ఎన్నికల అనంతరం ఏర్పడే కూటములలోని పార్టీలన్నీ ప్రభుత్వంలో చేరే విధంగా నిర్దేశించాలి. ఒక మంత్రిపై చర్య తీసుకోకూడదని మంత్రివర్గం చేసిన సిఫార్సును తోసిపుచ్చి చర్యకు అనుమతి మంజూరు చేసే అధికారం గవర్నర్లకు వుండాలి. గవర్నర్లను విశ్వవిద్యాలయాల చాన్సలర్లుగా చేసే సాంప్రదాయాన్ని రద్దు చేయాలి. గవర్నర్లుగా నియమితులయ్యే వారు స్ధానిక స్ధాయిలలో కూడా నియామకానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుండాలి. గవర్నరు సంబంధిత రాష్ట్రానికి చెందకూడదు, ప్రముఖ వ్యక్తి అయివుండాలి. గవర్నర్లను నిరంకుశంగా తొలగించకూడదు, గవర్నర్లను రాజకీయ ఫుట్‌బాల్‌ మాదిరి పరిగణించటాన్ని నిలిపివేయాలి.గవర్నర్లను ఐదేళ్ల కాలానికి నియమించాలి, మధ్యలో వారిని తొలగించాలంటే అసెంబ్లీ అభిశంసన ద్వారా మాత్రమే జరగాలి. తొలగింపునకు కారణం బాధ్యతల నిర్వహణకు సంబంధించినదై వుండాలి. గవర్నర్‌ నియామకంలో ముఖ్యమంత్రి పాత్ర వుండాలి. గవర్నర్ల నియామకానికి ప్రధాని, హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్‌, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలి.ఈ క్రమంలో వుపరాష్ట్రపతికి కూడా ప్రమేయం కల్పించవచ్చు.ఈ సిఫార్సులపై కూలంకషంగా చర్చ జరగాలి. అంతరాష్ట్ర మండలి సమావేశాలు ఏడాదికి మూడు సార్లు జరపాలి. జాతీయ సమగ్రతా మండలిని కనీసం ఏడాదికి ఒకసారి సమావేశ పరచాలి. ఎక్కడైనా మతపరమైన సమస్య తలెత్తినపుడు వెంటనే మండలిలోని ఐదుగురు సభ్యులను అక్కడికి పంపి నివేదిక తెప్పించుకోవాలి. రాష్ట్రాలపై ఏకాభిప్రాయ బాధ్యతను పెట్టబోయే ముందు కేంద్రం తన వైఖరి ఏమిటో తెలపాలి. నరేంద్రమోడీ అధికారానికి రాకముందే ఈ సిఫార్సులను చేశారు. ఒక వేళ వాటిని బిజెపి లేదా ఎన్‌డిఏ ఆమోదిస్తున్నట్లయితే వాటి స్ఫూర్తితో నిర్ణయాలు చేసి వుండవచ్చు. ఆచరణలో గవర్నర్ల విషయంలో సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించటాన్ని మనం చూశాము.

   నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగా అన్నట్లుగా కేంద్రం మొక్కుబడిగా నిర్వహించిన ఈ సమావేశం సందర్భంగా కొందరు ముఖ్యమంత్రులు, పార్టీలు కూడా అదే విధంగా వ్యవహరించాయి. అంతరాష్ట్ర మండలి సమావేశ ప్రారంభంలో ప్రధాని ప్రసంగిస్తూ పన్నుల వాటాను 32 నుంచి 42కు పెంచామని, 2014-15తో పోలిస్తే రాష్ట్రాలకు మరుసటి ఏడాది 21శాతం ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారు. మరోవైపు వాస్తవాలు అంకెలు వేరే సందేశాన్ని ఇస్తున్నాయి. రాష్ట్రాలకు ఇస్తున్న గ్రాంట్లలో గణనీయమైన కోత పెడుతున్నది కేంద్రం. ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో ఒక ముఖ్యమైన అంశం. కేంద్రం గొప్పగా చెబుతున్న 32 నుంచి 42 శాతం పన్నుల బదిలీ 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం జరుగుతుంది. బదిలీ 2015 ఏప్రిల్‌ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వ్యవధిలో జరపాలి. అంటే ఐదేండ్ల వరకు క్రమంగా పెంచుకుంటూ పోయి ఐదవ ఏట నుంచి ప్రతి ఏటా పదిశాతం నిధుల బదిలీ జరుపుతారు.దీనికి అనుగుణంగా 2015-16లో రాష్ట్రాలకు జిడిపిలో 6.3శాతం నిధులను బదలాయించాలని ప్రతిపాదించారు.సవరించిన అంచనాల ప్రకారం అది 6.1శాతానికి తగ్గింది. వాస్తవ బదిలి తరువాత గానీ తెలియదు.కేంద్రం నుంచి రాష్ట్రాలకు రెండు రకాలుగా బదిలీ జరుగుతుంది. ఒకటి పన్నుల బదిలీ. దానికేమీ షరతులు వుండవు.రెండవది గ్రాంట్లు. వీటికి సవాలక్ష షరతులు విధిస్తారు. ఇది కూడా కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో వివాదాస్పద అంశమే. గతేడాది జిడిపిలో 3.4శాతం పన్నులను రాష్ట్రాలకు బడ్జెట్‌లో చూపారు. అది సవరించిన అంచనాలలో 3.7శాతానికి పెరిగింది. చూశారా మేం ఎంత వుదారంగా వున్నామో కేంద్రం గొప్పలు చెప్పుకోవచ్చు. పన్నులలో వాటాను పెంచినప్పటికీ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది సర్‌చార్జీలు, సెస్‌ల రూపంలో వసూలు చేసి కేంద్ర ఖజానాకు చేర్చిన మొత్తం పన్ను ఆదాయంలో 6.1 నుంచి 8.1 శాతానికి పెరిగింది.ఈ మొత్తంలో రాష్ట్రాలకు వాటా వుండదు. గ్రాంట్లుగా రాష్ట్రాలకు బడ్జెట్‌లో 2.9శాతం చూపి సవరించిన దానిలో 2.4కు తగ్గించారు.వర్తమాన సంవత్సరంలో ఈ కేటాయింపులు ఎలా అమలు జరుగుతాయో చూడాల్సి వుంది. అందువలన ఆర్ధిక మంత్రి, నరేంద్రమోడీ ఏం చెప్పినప్పటికీ ఆచరణ ఏమిటన్నదే గీటురాయి. సేవా, రైతుల పేరుతో వసూలు చేసే సెస్సులన్నీ కేంద్ర ఖాతాకే పోతాయి అంటే కేంద్రానికి చేరే నిధుల శాతం మరింతగా పెరుగుతుంది.

    కేంద్ర పధకాల పేరుతో రాష్ట్రాలపై మోపుతున్న భారాల గురించి తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వంటి వారు ప్రముఖంగా తమ వైఖరిలో వెల్లడించారు.కేంద్ర ప్రాయోజిత పధకాలన్నీంటికీ గ్రాంట్ల రూపంలో తొలుత కేంద్రం నిధులు కేటాయిస్తుంది. తరువాత అసలు కధ మొదలౌతుంది. నరేంద్రమోడీ చెప్పినట్లు పన్నుల వాటా ఖరారు గాక ముందు కేంద్రం నుంచి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు బదిలీ అయ్యాయి. పన్నుల వాటాను 42శాతానికి పెంచేందుకు అంగీకరించిన కేంద్రం,ఆ వెంటనే ఎలక్ట్రానిక్‌ పాలన, మోడల్‌ స్కూళ్ల వంటి ఎనిమిది పధకాలకు అంతకు ముందు వున్న 60:40 దామాషాలో వున్న నిధుల కేటాయింపులో కేంద్ర వాటాను తగ్గించింది. మిగతా పధకాలకు నిధుల విడుదలకు షరతులను కఠినతరం గావించింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్మే నిధుల మొత్తం పెరిగిన తరువాత రాష్ట్రాల రుణ భారం, ఆర్దిక వత్తిడి తగ్గాలి. అయితే బడ్జెట్లలో చూపిన దానికంటే 16 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు తీసుకున్నట్లు జపాన్‌ సంస్ధ నోమురా నివేదిక తెలిపింది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటాన్ని కేరళ ముఖ్యమంత్రి తప్పుపట్టారు. పూంఛీ కమిటీ సిఫార్సులపై చర్చకు ఒక స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

     తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో చేసిన ప్రసంగ పూర్తి పాఠాలను మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు తన రీతికి తగినట్లుగా 13పేజీల ప్రసంగం చేస్తే చంద్రశేఖరరావు ఏడు పేజీలకే పరిమితం అయ్యారు. అందువలన వారిద్దరూ ఏం చెప్పారనే అంశాన్ని పరిశీలించుదాం. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రసంగ సారాంశం ఇలా వుంది. జాతీయ రహదారులకు కేంద్రం కేటాయింపులు పెంచటం మంచిదే అదే సమయంలో సాగునీరు, విద్య, ఆరోగ్య రంగానికి కూడా నిధులు పెంచాలి. సాగునీటి రంగంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక భారీ పధకానికి కేంద్రం నిధులు ఇవ్వాలి.వుమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి కేంద్రం ఏదైనా నూతన చట్టం లేదా వున్న వాటికి సవరణలు తీసుకురాదలిస్తే ప్రతి సందర్భంలోనూ రాష్ట్రాల ఆమోదం తీసుకోవాలి. ఒక వేళ ఆర్ధికంగా భారం మోపేదైతే కేంద్రమే పూర్తిగా చెల్లించాలి. వుదాహరణకు విద్యాహక్కు చట్టాన్ని అమలు జరపాలంటే ఏటా తెలంగాణా ఒక్కదానికే 300 కోట్ల రూపాయలు అవసరం. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మోడల్‌ స్కూళ్ల వంటి వాటికి ఇప్పుడు నిధులు పూర్తిగా నిలిపివేశారు, వేతనాలు, ఇతర ఖర్చులు రాష్ట్రాలకు భారం అవుతున్నాయి. కేంద్రం ప్రకటించే ఏ పధకానికైనా మధ్యలో నిధులు నిలిపివేయటం గాక దాని నిర్వహణకు అయ్యే పూర్తి మొత్తాన్ని కేంద్రమే భరించాలి. వుమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వ సంస్ధల ఏకపక్ష అదుపును నివారించాలి. వుదాహరణకు విశ్వవిద్యాలయాలు నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఇవ్వకుండా కాలేజీలకు ఏఐసిటిఇ అనుమతులు ఇవ్వరాదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన సమాయానికి ఈ సంస్ధ అనుమతులు ఇచ్చిన ఇంజనీరింగ్‌ కాలేజీలు 356వరకు వున్నాయి.తగిన వసతులు లేని కారణంగా విశ్వవిద్యాలయాలు అనుబంధాలను రద్దు చేసిన కారణంగా వాటి సంఖ్య 172కు పడిపోయాయి. కొద్ది సంఖ్యలో వున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు యుజిసి నిధులలో 65శాతం, మిగతావాటన్నింటికీ కలిపి 35శాతం నిధులు ఖర్చు చేయటం అన్యాయం.గవర్నర్ల ఎంపికలో రాష్ట్రాలను సంప్రదించాలి. ఏదైనా ఒక బిల్లును నిరవధికంగా నిలిపివుంచే విచక్షణాధికారం గవర్నర్లకు వుండకూడదు, ఒక కాలపరిమితి నిర్ణయించాలి. విశ్వవిద్యాలయాలకు గవర్నర్లను ఛాన్సలర్లుగా చేయరాదన్న పూంఛీ కమిషన్‌ సిఫార్సుకు మద్దతు ఇస్తున్నాం, దానిని ఇప్పటికే అమలు జరిపాము. అంతరాష్ట్ర నదీ జలవివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్‌ నిర్ణీత వ్యవధిలో ఇచ్చే విధంగా నిర్ధేశించాలి, కేంద్రం మరింత నిర్ణయాత్మక పాత్ర వహించాలి.

      ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రసంగ సారాంశం ఇలా వుంది. సర్కారియా, ప్రస్తుత పుంఛీ కమిషన్‌ సిఫార్సులకు విరుద్దంగా ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేశారు. అది అశాస్త్రీయంగా వుండటమే గాక మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బందులను కలిగించింది.అందరికీ వర్తించేదిగా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి భిన్న ప్రమాణాలను పాటించారు. వుదాహరణకు జనాభాలో 58శాతం వున్న రాష్ట్రానికి వుమ్మడి రాష్ట్ర ఆదాయంలో 46శాతమే కేటాయించారు. అప్పులను జనాభా ప్రాతిపదికన, ఆస్థులను మాత్రం ఎక్కడివి అక్కడే అన్న పద్దతిలో పంచారు. విద్యుత్‌ రంగంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. రాష్ట్ర దుస్థితిని తగ్గించేందుకు ప్రధాన మంత్రి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది.పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేందుకు కేంద్రం మౌలిక సదుపాయాల కల్పన, ఆర్ధికంగానూ ఎంతో సాయం చేయాల్సి వుంది.రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రధాన మంత్రి చేసిన హామీలన్నింటినీ అమలు జరిపేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రత్యేక రాష్ట్ర తరగతి హోదా, రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి పూర్తి చేయటం, విశాఖ రైల్వే జోన్‌ మంజూరు, పరిశ్రమలకు పన్నుల రాయితీలు కల్పిస్తూ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక పధకం, వనరుల లోటు పూడ్చేందుకు అవసరమైన గ్రాంటు మంజూరు చేయాలి. చివరి రాష్ట్రంగా వున్నందున ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నది, గోదావరి, కృష్ణ బోర్డులను ఈ రోజు వరకు వేయలేదు.

     గవర్నరన్లు ఐదేండ్ల వ్యవధికి నియమించాలన్న పూంఛీ సిఫార్సుల వంటికి కొన్ని ఆచరణ సాధ్యం కాదు, తగిన విధంగా లేవు.గవర్నర్ల అభిశంసనకు అనుసరించాల్సిన పద్దతిపై సిఫార్సు అంగీకారం కాదు. బిల్లుల ఆమోదం, సూచనలకు ఆరునెలల వ్యవధి అవసరం లేదు, ఒక నెల చాలు. స్ధానికంగా అత్యవసర పరిస్ధితి విధింపునకు 355,356 ఆర్టికల్‌ను సవరించకూడదు. అది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని అతిక్రమించటమే. ఆర్ధిక మంత్రుల సాధికార కమిటీ పనితీరును చూసిన తరువాత ఇతర రంగాలకు అలాంటి సాధికార కమిటీలను వేయటం సరైంది కాదు. రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తే పెద్ద రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం. కేంద్ర బలగాలను ఏకపక్షంగా నియమించటం ఫెడరలిజం సూత్రానికే విరుద్దం.జల వివాదాలపై ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులపై అప్పీలుకు సుప్రీం కోర్టుకు వెళ్లాలనటం సరైంది కాదు, రాజ్యాంగ బద్దంగా అప్పిలేట్‌ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి.

    ఇద్దరు ముఖ్య మంత్రులు చేసిన ప్రసంగ పాఠాలను చూసినపుడు చంద్రశేఖరరావు ఆర్ధికాంశాలపై ఎక్కువగా కేంద్రీకరించారు.చంద్రబాబు నాయుడు వాటిని దాదాపుగా విస్మరించారు. ఎవడబ్బ సొమ్మంటూ కేంద్రంపై ధ్వజమెత్తిన ఎన్‌టిరామారావు వారసులమని చెప్పుకొనే చంద్రబాబు నాయుడు ఏపీకి ఇస్తామన్న నిధుల గురించి అడిగారు తప్ప రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులు, విధుల గురించి విస్మరించటం విస్మయం గొలుపుతోంది. మాకు మా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే చాలు ఇంకేమీ లేదు, బంగారు తెలంగాణాగా మార్చుకుంటాం అని వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చిన చంద్రశేఖరరావుకు కేంద్ర పధకాల భారపు సెగతగలటం, తెలంగాణాను బంగారంగా మార్చటం సాధ్యం కాదని అర్ధమైందేమో అనివార్యంగా నిధుల గురించి నిర్మొహమాటంగా చెప్పాల్సి వచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మొక్కజొన్న తోటల్లో చీకట్లు ముసరనున్నాయా ?

16 Saturday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Telangana

≈ Leave a comment

Tags

corn, corn imports, corn msp, corn prices, india corn imports

ఎం కోటేశ్వరరావు

    అమెరికాలో సాధారణం కంటే ఎక్కువగా సాగు చేశారన్న అక్కడి వ్యవసాయశాఖ అంచనాతో ప్రపంచ మార్కెట్‌లో మొక్క జొన్నల ధరలు పడిపోయాయి. మన దేశంలో పత్తి సాగును తగ్గించిన రైతాంగం మొక్కజొన్న వైపు మొగ్గిందనే వార్తలతో తన విత్తన వ్యాపారం మూడు జొన్న కర్రలు ఆరు పొత్తులుగా పెరుగుతుందని మోన్‌శాంటో కంపెనీ లాభాల లెక్కలు వేసుకొంటోంది. గత రెండు సంవత్సరాలుగా వుత్పత్తి తగ్గిన కారణంగా దొంగ నిల్వదారుల చర్యలను వమ్ము చేసేందుకు, ధరలను తగ్గించేందుంటూ మొక్కజొన్నల దిగుమతికి అనుమతిస్తూ నరేంద్రమోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకోవటంతో టన్ను పద్దెనిమిదివేలు వున్న ధర అమాంతం పద్నాలుగు వేలకు పడిపోయింది.అనేక రికార్డులను బద్దలు చేస్తున్న మోడీ సర్కార్‌ పాతిక సంవత్సరాల క్రితం గరిష్టంగా వున్న రెండున్నరలక్షల టన్నుల దిగుమతి రికార్డును బద్దలు కొడుతూ ఐదు లక్షల టన్నులకు అనుమతించింది. వాటిపై దిగుమతి పన్నుకు పూర్తి మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయ పర్యవసానాలు ఎవరికి మేలు చేస్తాయి, ఎవరికి కీడు చేస్తాయి ?

     మొక్క జొన్నలు ప్రధానంగా కోళ్ల, పశుదాణా, గంజి పౌడరు తయారీకి వినియోగిస్తారు. ధరలు ఎక్కువగా వున్నాయి కనుక ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతులకు అనుమతివ్వాలని వ్యాపారులు చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గిందా? లేక తమ వద్ద పేరుకుపోతున్న నిల్వలను తగ్గించుకొనేందుకు అమెరికా సర్కార్‌ చేసిన వత్తిడికి మోడీ సర్కార్‌ లొంగి పోయిందా ? ప్రభుత్వం అంటే సమాజంలో అన్ని తరగతులకు సమన్యాయం చేయాల్సిన బాధ్యత కలిగినది. గత నాలుగు సంవత్సరాలుగా పెరిగిన వ్యవసాయ ఖర్చులతో పోల్చుకుంటే మొక్కజొన్నలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తక్కువే. క్వింటాలుకు రు.1310 నుంచి 1365కు మాత్రమే పెంచింది.అంటే ఏడాదికి సగటున 14 రూపాయలకు లోపు, ఇదే సమయంలో గుడ్డు ధరలు ఎంత పెరిగాయి? రైతులకు హైదరాబాదులో 2013 జూలైలో ఒక గుడ్డుకు సగటున 306.7పైసలు లభిస్తే అదే 2016 జూలైలో 360 పైసలకు పెరిగింది. ఇక వినియోగదారుల విషయానికి వస్తే 311 నుంచి 414.80పైసలకు పెరిగింది. ఇవి జాతీయ గుడ్ల సమన్వయ కమిటి ప్రకటించిన రేట్లు, చిల్లర దుకాణాలలో హైదరాబాదులో గత కొద్ది వారాలుగా ఐదు రూపాయలు అమ్ముతున్నారు. ఒక గుడ్డుకే ఇంత ధర పెరిగితే మొక్క జొన్నలకు క్వింటాలకు నాలుగు సంవత్సరాలలో 55 రూపాయలు పెరచటాన్ని ఏమనాలి? టోల్‌ టాక్సు పెంపుదలకు ద్రవ్యోల్బణం, వుద్యోగులు, కార్మికుల వేతనాలు, కరవు భత్యం పెంపుదలకు ఇలా ప్రతి దాని ధరల పెంపుదలకు ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్న సర్కార్‌ మొక్కజొన్నల మద్దతు ధరల పెంపుదలకు దానిని ఎందుకు వర్తింపచేయటం లేదు ? వరుసగా 2012 నుంచి 2015 వరకు వినియోగదారుల (సిపిఐ) ద్రవ్యోల్బణం 11.17,9.13,5.86,6.32 శాతం చొప్పున పెరిగింది. ప్రభుత్వం 2013-14 సంవత్సరానికి మొక్క జొన్నలకు ప్రకటించిన మద్దతు ధర రు.1310. అంతకు ముందు 2012 (డిసెంబరు నుంచి డిసెంబరు) ద్రవ్యోల్బణం రేటు 11.17శాతం అంటే 2012-13 సంవత్సరానికి గాను క్రితపు ఏడాది ప్రకటించిన రు.1175 మీద రు.131 పెంచాల్సి వుండగా నాలుగు రూపాయలు కలిపి 1310 చేశారు. మరుసటి ఏడాది ద్రవ్యోల్బణం రేటు 9.17 శాతానికి గాను 2014-15లో 119 రూపాయలు కలిపి రు.1429కి పెంచాల్సి వుండగా రు.1310నే కొనసాగించారు. 2015-16కు గాను మరో 83పెంచి రు.1512 కు బదులు 1325, 2016-17కు 95 రూపాయలు పెంచి రు1607 బదులు రు.1365గా మాత్రమే నిర్ణయించారు. సీజన్‌లో ప్రభుత్వ మద్దతు ధరలకు అటూ ఇటుగా మాత్రమే బహిరంగ మార్కెట్‌లో రైతాంగానికి దక్కుతున్న విషయం తెలిసిందే.

    తెలంగాణాలో దాదాపు ఎనిమిది లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో రెండున్న లక్షల హెక్టార్లలో మొక్క జొన్న సాగు అవుతోంది. తెలంగాణాలో ఇదే మూడవ పెద్ద పంటగా వుంది. అందువలన అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో వచ్చే మార్పులు తెలంగాణా రైతాంగంపై ప్రధానంగా ప్రభావం చూపుతాయని వేరే చెప్పనవసరం లేదు. చైనా నుంచి డిమాండ్‌ తగ్గటం కారణంగా ప్రపంచ మార్కెట్లో గణనీయంగా ధరలు పడిపోయాయి. దీనికి తోడు అమెరికాలో పెద్ద ఎత్తున నిల్వలు వుండిపోయాయి. కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున మొక్క జొన్నలు దిగుమతి చేసుకొనేందుకు నిర్ణయించిందంటే భారీ మొత్తంలో ఎగుమతి సబ్సిడీలు పొందే అమెరికా వ్యాపారులు ముందుగా లబ్ది పొందుతారు.మన దేశంలో సాధారణ వినియోగం ఏటా 20మిలియన్‌ టన్నులు వుంది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే మన దేశంలో మొక్క జొన్నల వుత్పత్తి 2015-16లో 23.67 నుంచి 21.02 మిలియన్‌ టన్నులకు పడిపోయినట్లు అంచనా. ఇది సాధారణ వినియోగం కంటే స్వల్పంగా ఎక్కువే. అంతకు ముందు 17 మిలియన్‌ టన్నులకు పడిపోయిన సందర్బాలలో కూడా మనం దిగుమతులు చేసుకోలేదు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి లేకున్నా దిగుమతులకు నిర్ణయించటం గమనించాల్సిన అంశం. మన దేశంలో ఆహార వినియోగం 17-20శాతం కాగా, దాణాగా 60-62శాతం, మిగిలింది విత్తనాలు, పారిశ్రామిక వినియోగంలో వున్నట్లు ఫిక్కీ నివేదిక పేర్కొన్నది.మాంసానికి పెంచే బ్రాయిలర్‌ కోడికి ఐదు వారాలలో 3.6 నుంచి 4 కిలోలు, గుడ్లు పెట్టే కోడికి ఏటా 42-47కిలోలను దాణా వేస్తారు. ఇది ప్రధానంగా మొక్కజొన్నలతో తయారు చేస్తారు. మొక్క జొన్నలకు ప్రత్యామ్నాయంగా వున్న జొన్నల లభ్యత సమస్యగా వుండటంతో మొక్కజొన్నలపైనే ప్రధానంగా పరిశ్రమ ఆధారపడుతోంది.

     వర్షాభావం కారణంగా రెండు సంవత్సరాలుగా వుత్పత్తి తగ్గినప్పటికీ ఈ ఏడాది సాగు 20-30శాతం వరకు పెరగవచ్చని, పత్తిసాగు తగ్గుతుందని కన్సెల్టెన్సీలు తమ ఖాతాదార్లకు సమాచారం పంపాయి. ఈ కారణంగానే మోన్‌శాంటో పెద్ద ఎత్తున విత్తనాలను రంగంలోకి దించి లాభాలను పెంచుకోవచ్చని అంచనా వేసుకున్నది.దానికి అనుగుణంగానే స్టాక్‌ ఎక్సేంజ్‌లలో దాని షేరు విలువ కూడా పెరిగింది.

     మార్కెట్‌ మాయాజాలం విషయానికి వస్తే 2011-12లో అమెరికాలో టన్ను మొక్కజొన్న ధర 295-300డాలర్ల మధ్య వుండగా మన దేశ కనీస మద్దతు ధర నాటి రూపాయి విలువలో 9800, డాలర్లలో 211 వుంది. 2014-15లో అమెరికా ధర 170-175 డాలర్లకు పడిపోగా మన దేశంలో 13,100 రూపాయలకు, 215 డాలర్లకు పెరిగింది. అందువలన దిగుమతులు చౌకగా మారాయి. ఈ కారణంగా మన ప్రభుత్వ దిగుమతులపై పన్ను విధించి దిగుమతులను నిరుత్సాహపరచింది. ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో జూలై 14న రోజువారీ మండీ ధర 164 డాలర్లు కాగా జూలై 16వ తేదీ ముందస్తు మార్కెట్‌ ధర 142 డాలర్లు వుంది.మన రూపాయి విలువ తగ్గిన కారణంగా పన్నెండు వేల రూపాయలకే టన్ను మొక్కజొన్నలు వస్తాయి. జూలై 16న తెలంగాణాలోని వివిధ మార్కెట్లలో క్వింటాలు ధర 1100 నుంచి 1680, ఆంధ్రప్రదేశ్‌లో 1310-1500 మధ్య వుంది. గతేడాది పత్తి రైతుల అనుభవం చూస్తే వారు పూర్తిగా అమ్ముకున్న తరువాత క్వింటాలు ఆరువేల రూపాయల వరకు పెరిగింది, దానితో విదేశీ కంపెనీలు లాభపడ్డాయని తాము నష్టపోయామని నూలు మిల్లుల యజమానులు గగ్గోలు పెట్టటంతో కొద్ది రోజుల పాటు మిల్లులను మూసివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మొక్క జొన్నల విషయంలో పంట చేతికి వచ్చే తరుణానికి దిగుమతుల కారణంగా గతేడాది కంటే ధరలు తగ్గితే అందుకు బాధ్యత కేంద్రానిది, కేంద్ర చర్యలపై నోరు మెదపని రాష్ట్రాలది అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Index Numbers of Wholesale Price in India rose by 1.4 percent

14 Thursday Jul 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Index Numbers, Index Numbers of Wholesale Price, Wholesale Price in India

The official Wholesale Price Index for ‘All Commodities’ (Base: 2004-05=100) for the month of June, 2016 rose by 1.4 percent to 182.0 (provisional) from 179.4 (provisional) for the previous month.

INFLATION

The annual rate of inflation, based on monthly WPI, stood at 1.62% (provisional) for the month of June, 2016 (over June, 2015) as compared to 0.79% (provisional) for the previous month and -2.13% during the corresponding month of the previous year.  Build up inflation rate in the financial year so far was 3.82% compared to a build up rate of 1.70% in the corresponding period of the previous year.

Inflation for important commodities / commodity groups is indicated in Annex-1 and Annex-II.

The movement of the index for the various commodity groups is summarized below:-

PRIMARY ARTICLES (Weight 20.12%)

The index for this major group rose by 2.9 percent to 262.8 (provisional) from 255.3 (provisional) for the previous month. The groups and items which showed variations during the month are as follows:-

The index for ‘Food Articles’ group rose by 2.9 percent to 279.0 (provisional) from 271.1 (provisional) for the previous month due to higher price of fruits & vegetables and urad (8% each), gram (7%), tea and maize (3% each), rice and wheat   (2% each) and barley, milk, mutton and fish-marine (1% each).  However, the price of moong (4%), poultry chicken and ragi (2% each) and pork, bajra, beef & buffalo meat and masur (1% each) declined.

The index for  ‘Non-Food Articles’ group rose by 2.1 percent to 231.2 (provisional) from 226.4 (provisional) for the previous month due to higher price of linseed (12%), raw cotton (11%), fodder (5%), raw jute (4%), cotton seed (3%),      raw rubber,  rape & mustard seed, raw wool and groundnut seed (2% each) and sunflower (1%).  However, the price of      flowers (9%), safflower (kardi seed) (5%), copra (coconut) (4%), castor seed (3%),  gingelly seed, guar seed and niger seed (2% each) and raw silk and mesta (1% each) declined.

The index for ‘Minerals’ group rose by 6.9 percent to 199.0 (provisional) from 186.2 (provisional) for the previous month due to higher price of manganese ore (17%), crude petroleum (11%), iron ore (5%), copper ore (2%) and chromite (1%). However, the price of sillimanite (6%), phosphorite (2%) and magnesite (1%) declined.

FUEL & POWER (Weight 14.91%)

The index for this major group rose by 3.4 percent to 186.5 (provisional) from 180.3 (provisional) for the previous month due to higher price of furnace oil (13%), aviation turbine fuel (11%), high speed diesel (8%), petrol (5%), kerosene (2%) and LPG (1%).  However, the price of non-coking coal (12%) and bitumen (2%) declined.

MANUFACTURED PRODUCTS (Weight 64.97%)

The index for this major group rose by 0.2 percent to 156.0 (provisional) from 155.7 (provisional) for the previous month. The groups and items for which the index showed variations during the month are as follows:-

The index for ‘Food Products’ group rose by 0.9 percent to 186.9 (provisional) from 185.3 (provisional) for the previous month due to higher price of tea dust (unblended) (5%), sooji (rawa) (4%), vanaspati (3%), oil cakes, cotton seed oil,     mixed spices, wheat flour (atta), groundnut oil and tea dust (blended) (2% each) and gur, sugar, tea leaf (unblended),     palm oil,  powder milk, gola (cattle feed), maida and mustard & rapeseed oil (1% each).  However, the price of tea leaf (blended) (5%), processed prawn (3%), gingelly oil (2%) and copra oil (1%) declined.

The index for ‘Beverages, Tobacco & Tobacco Products’ group rose by 0.8 percent to 220.7 (provisional) from 219.0 (provisional) for the previous month due to higher price of imfl – blended (5%) and cigarette (3%).  However, the price of      beer (4%), rectified spirit (2%) and dried tobacco and soft drinks & carbonated water (1% each) declined.

The index for ‘Textiles’ group rose by 0.2 percent to 140.9 (provisional) from 140.6 (provisional) for the previous month due to higher price of gunny and hessian cloth (2%), tyre cord fabric, jute yarn, jute sacking cloth and cotton yarn (1% each).  However, the price of   man made fabric and jute sacking bag (1% each) declined.

The index for ‘Wood & Wood Products’ group declined by 0.2 percent to 196.6 (provisional) from 197.0 (provisional) for the previous month due to lower price of  plywood & fibre board (2%).  However, the price of timber / wooden planks and processed wood (2% each) moved up.

The index for ‘Paper & Paper Products’ group rose by 0.3 percent to 155.9 (provisional) from 155.4 (provisional) for the previous month due to higher price of paper rolls (2%) and newsprint (1%).

The index for ‘Leather & Leather Products’ group declined by 0.1 percent to 145.5 (provisional) from 145.7 (provisional) for the previous month due to lower price of leather handbags/wallets (3%), footwear/safety boot (2%) and other leather foot wear (1%).  However, the price of leather gloves (2%) and crome tanned leather and leather shoe upper (1% each) moved up.

The index for ‘Rubber & Plastic Products’ group rose by 0.1 percent to 146.1 (provisional) from 146.0 (provisional) for the previous month due to higher price of plastic products (1%).  However, the price of tubes (7%) and rubber products     (1% each) declined.

The index for ‘Chemicals & Chemical Products’ group rose by 0.5 percent to 150.9 (provisional) from 150.1 (provisional) for the previous month due to higher price of ammonium sulphate (4%), rubber chemicals (2%) and basic organic chemicals, paints, urea, polymers, non-cyclic compound, basic inorganic chemicals, antibiotics and dye & dye intermediates (1% each).  However, the price of lacquer & varnishes (1%) declined.

The index for ‘Non-Metallic Mineral Products’ group declined by 0.6 percent to 177.7 (provisional) from 178.7 (provisional) for the previous month due to lower price of marbles (8%) and asbestos corrugated sheet (4%).  However, the price of railway sleeper and polished granite (2% each) and lime (1%) moved up.

The index for ‘Basic Metals, Alloys & Metal Products’ group declined by 0.6 percent to 153.9 (provisional) from 154.9 (provisional) for the previous month due to lower price of rounds (5%), wire rods and billets (4% each), sponge iron,     pencil  ingots and angles (3% each),  melting scrap, gp/gc sheets, joist & beams and rebars (2% each) and steel structures,     plates,  pressure cooker, HRC, utensils (other than aluminium), CRC and metal containers (1% each).  However, the price of furniture (4%), silver (2%) and gold & gold ornaments, pipes/tubes/rods/strips, aluminium and steel: pipes & tubes (1 % each) moved up.

The index for ‘Machinery & Machine Tools’ group declined by 0.1 percent to 135.3 (provisional) from 135.5 (provisional) for the previous month due to lower price of fibre optic cable (10%), electric motor starters (4%), grinding /wet coffee machinery (3%) and pvc insulated cable, ball/roller bearing, electric motors and machine tools (1% each).  However, the price of lifts (2%) and heating elements, engines, insulators, industrial valves and washing / laundry machines (1%each) moved up.

The index for ‘ Transport, Equipment & Parts ‘ group rose by  0.1  percent to 139.4 (provisional) from 139.3 (provisional) for the previous month due to higher price of tractors (2%)

FINAL INDEX FOR THE MONTH OF APRIL, 2016 (BASE YEAR: 2004-05=100)

For the month of April, 2016, the final Wholesale Price Index for ‘All Commodities’ (Base: 2004-05=100) stood at 177.8 as compared to 177.0 (provisional) and annual rate of inflation based on final index stood at 0.79 percent as compared to 0.34 percent (provisional) respectively as reported on 16.05.2016.

Annexure-I

Wholesale Price Index and Rates of Inflation (Base Year: 2004-05=100)

Month of June, 2016
Commodities/Major Groups/Groups/Sub-Groups Weight WPI June- 2016 Latest month over month Build up from March Year on year
2015-16 2016-17 2015-16 2016-17 2015-16 2016-17
ALL COMMODITIES 100.00000 182.0 0.62 1.45 1.70 3.82 -2.13 1.62
PRIMARY ARTICLES 20.11815 262.8 2.01 2.94 4.23 6.79 -0.48 5.50
Food Articles 14.33709 279.0 2.63 2.91 3.45 7.51 3.12 8.18
Cereals 3.37323 245.6 0.22 1.87 -0.04 1.78 -0.39 6.32
Rice 1.79348 245.2 1.19 2.34 1.54 2.72 -1.62 3.37
Wheat 1.11595 225.2 -1.08 1.76 -2.18 -1.31 1.84 6.83
Pulses 0.71662 400.2 11.07 3.73 22.61 15.50 36.78 26.61
Vegetables 1.73553 297.3 13.12 17.09 17.30 39.97 -6.82 16.91
Potato 0.20150 248.7 8.54 11.57 0.00 54.38 -51.60 64.48
Onion 0.17794 255.4 12.98 3.03 7.58 -6.65 19.07 -28.60
Fruits 2.10717 260.9 -1.64 0.42 0.98 9.85 7.60 5.97
Milk 3.23818 258.0 0.08 0.94 1.05 1.61 5.18 3.24
Egg, Meat & Fish 2.41384 305.4 3.02 0.13 -1.31 1.53 -2.25 6.67
Non-Food Articles 4.25756 231.2 0.92 2.12 7.95 5.19 1.16 5.72
Fibres 0.87737 238.8 0.05 8.25 8.07 14.31 -11.63 14.26
Oil Seeds 1.78051 224.1 1.11 0.90 6.95 5.91 3.06 2.52
Minerals 1.52350 199.0 -1.26 6.87 3.21 3.16 -27.64 -20.75
FUEL & POWER 14.91021 186.5 0.73 3.44 2.93 8.18 -8.86 -3.62
Liquefied petroleum gas 0.91468 161.2 -0.31 0.56 0.06 0.69 -4.85 -0.98
Petrol 1.09015 166.0 2.36 4.80 10.18 11.56 -7.10 -8.74
High speed diesel 4.67020 214.4 1.15 7.68 4.33 16.97 -9.86 1.13
MANUFACTURED PRODUCTS 64.97164 156.0 -0.06 0.19 0.19 1.23 -0.77 1.17
Food Products 9.97396 186.9 0.12 0.86 1.41 4.06 -0.46 8.35
Sugar 1.73731 207.8 -2.25 0.78 -5.56 9.20 -13.26 26.09
Edible Oils 3.04293 154.3 1.43 1.25 3.04 3.07 2.83 3.42
Beverages, Tobacco & Tobacco Product 1.76247 220.7 0.05 0.78 1.38 4.20 3.99 7.14
Cotton Textiles 2.60526 158.5 0.38 0.57 0.76 1.73 -4.96 -0.25
Man Made Textiles 2.20573 128.4 -0.07 -0.31 0.98 -0.54 -1.03 -4.11
Wood & Wood Products 0.58744 196.6 0.10 -0.20 3.69 -0.20 5.24 -0.05
Paper & Paper Products 2.03350 155.9 0.00 0.32 0.26 0.06 2.54 1.70
Leather & Leather Products 0.83509 145.5 0.21 -0.14 1.48 -0.21 -0.96 0.76
Rubber & Plastic Products 2.98697 146.1 0.34 0.07 0.88 0.55 -0.33 -2.34
Chemicals & Chemical Products 12.01770 150.9 0.13 0.53 0.40 0.87 -1.17 -0.40
Non-Metallic Mineral Products 2.55597 177.7 0.40 -0.56 -1.06 -0.39 4.62 0.51
Cement & Lime 1.38646 174.8 0.81 -0.34 -2.25 -0.51 4.95 0.63
Basic Metals Alloys & Metal Product 10.74785 153.9 -0.94 -0.65 -1.98 0.33 -4.91 -3.02
Iron & Semis 1.56301 135.5 -1.42 -1.95 -2.15 -0.59 -9.67 -7.00
Machinery & Machine Tools 8.93148 135.3 0.15 -0.15 0.15 0.15 0.52 0.07
Transport Equipment & Parts 5.21282 139.4 0.00 0.07 0.29 0.29 1.18 1.23

 

 


 Annexure-II
 
Trend of Rate of Inflation for some important items during last six months
 
Commodities/Major Groups/Groups/Sub-Groups Weight (%) Rate of Inflation for the last six months
June-16 May-16 Apr-16 Mar-16 Feb-16 Jan-16
ALL COMMODITIES 100.00 1.62 0.79 0.79 -0.45 -0.85 -1.07
PRIMARY ARTICLES 20.12 5.50 4.55 3.41 2.97 2.03 4.30
Food Articles 14.34 8.18 7.88 4.70 4.09 3.91 6.46
Cereals 3.37 6.32 4.60 4.24 4.41 3.30 2.91
Rice 1.79 3.37 2.22 1.75 2.18 -0.08 -0.13
Wheat 1.12 6.83 3.85 5.00 5.89 6.03 5.54
Pulses 0.72 26.61 35.56 36.55 34.41 38.37 45.03
Vegetables 1.74 16.91 12.94 2.90 -2.03 -2.94 12.71
Potato 0.20 64.48 60.01 40.84 6.55 -7.39 -17.08
Onion 0.18 -28.60 -21.70 -17.89 -17.71 -10.20 7.45
Fruits 2.11 5.97 3.80 -1.81 -2.58 -1.66 -2.03
Milk 3.24 3.24 2.36 2.83 2.67 1.74 1.42
Egg, Meat & Fish 2.41 6.67 9.75 3.27 3.69 3.40 5.90
Non-Food Articles 4.26 5.72 4.48 7.26 8.49 7.09 9.35
Fibres 0.88 14.26 5.60 5.17 8.01 10.17 7.97
Oil Seeds 1.78 2.52 2.73 6.07 3.52 3.46 5.76
Minerals 1.52 -20.75 -26.78 -18.69 -20.72 -27.65 -29.27
FUEL & POWER 14.91 -3.62 -6.14 -4.83 -8.30 -7.06 -9.89
Liquefied petroleum gas 0.91 -0.98 -1.84 -1.84 -1.60 -0.37 -1.26
Petrol 1.09 -8.74 -10.86 -4.18 -9.87 -1.03 -5.45
High speed diesel 4.67 1.13 -5.01 -3.94 -9.79 -7.75 -13.00
MANUFACTURED PRODUCTS 64.97 1.17 0.91 1.04 0.13 -0.52 -1.17
Food Products 9.97 8.35 7.54 8.72 5.58 4.34 2.79
Sugar 1.74 26.09 22.30 17.34 9.05 5.23 -0.55
Edible Oils 3.04 3.42 3.60 5.41 3.38 2.40 1.64
Beverages, Tobacco & Tobacco Product 1.76 7.14 6.36 7.23 4.23 2.91 2.13
Cotton Textiles 2.61 -0.25 -0.44 -0.44 -1.20 -1.27 -2.14
Man Made Textiles 2.21 -4.11 -3.88 -2.79 -2.64 -2.34 -2.72
Wood & Wood Products 0.59 -0.05 0.25 2.97 3.85 3.80 3.49
Paper & Paper Products 2.03 1.70 1.37 1.37 1.90 2.64 2.78
Leather & Leather Products 0.84 0.76 1.11 2.31 2.46 2.96 1.75
Rubber & Plastic Products 2.99 -2.34 -2.08 -1.75 -2.02 -1.89 -2.15
Chemicals & Chemical Products 12.02 -0.40 -0.79 -0.66 -0.86 -0.73 -1.32
Non-Metallic Mineral Products 2.56 0.51 1.48 0.17 -0.17 0.62 1.83
Cement & Lime 1.39 0.63 1.80 0.11 -1.13 -0.92 1.05
Basic Metals Alloys & Metal Product 10.75 -3.02 -3.31 -4.46 -5.25 -7.89 -9.30
Iron & Semis 1.56 -7.00 -6.50 -8.53 -8.46 -12.82 -13.46
Machinery & Machine Tools 8.93 0.07 0.37 0.52 0.07 -0.15 -0.44
Transport Equipment & Parts 5.21 1.23 1.16 1.38 1.24 1.39 1.46

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెరిగిన జపాన్‌ కమ్యూనిస్టుల ఓట్లు, సీట్లు

14 Thursday Jul 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Uncategorized

≈ Leave a comment

Tags

japan Upper house elections, japanese communist party, japanese communist party votes and seats increased, jcp

ఎంకెఆర్‌

    గత ఆదివారం నాడు జపాన్‌ ఎగువ సభకు జరిగిన ఎన్నికలలో పాలక లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎల్‌డిపి) కూటమి మెజారిటీ సీట్లు తెచ్చుకుంది. మూడింట రెండువంతుల మెజారిటీతో చేయాల్సిన సవరణకు సరిపడా సీట్లు సాధించింది. ఎగువ సభలోని 242స్ధానాలలో ప్రతి మూడు సంవత్సరాలకు సగం సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. నియోజకవర్గాల ప్రాతిపదికన 73 దామాషా ఓటింగ్‌ ప్రకారం 48 మంది సభ్యులను ఎన్నుకుంటారు. మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల తరువాత కమ్యూనిస్టుపార్టీ పదకొండు స్ధానాలను పొందగా ఈ సారి 14కు పెరిగింది. గతం కంటే ఓట్లు పెరగటమే దీనికి కారణం. పాలక ఎల్‌డిపి నాయకత్వం ప్రధాన ప్రతిపక్షంగా వున్న డెమోక్రటిక్‌ పార్టీ(డిపి)తో సమంగా కమ్యూనిస్టులను విమర్శించారు, విమర్శలతో పాటు కమ్యూనిస్టు వ్యతిరేక విషాన్ని చిమ్మారు. అ యినప్పటికీ వాటన్నింటినీ తట్టుకొని కమ్యూనిస్టుపార్టీ తన బలాన్ని పెంచుకుంది. ఈ ఎన్నికలలో పాలకపార్టీ విజయం సాధించినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అత్యంత తక్కువ మంది ఓటర్లు పాల్గొన్న (54.7) ఎన్నికలలో ఇది నాలుగవది. ఓటింగ్‌ వయస్సును 20 నుంచి 18కి తగ్గించిన కారణంగా యువ ఓటర్లు వుత్సాహంతో పాల్గొన్నప్పటికీ ఇంత తక్కువ శాతం పోలు కావటం అక్కడి పాలకకూటమిపై అవిశ్వాసం, ప్రతిపక్ష పార్టీలపై విశ్వాసలేమిని సూచిస్తున్నది.

    గత రెండున్నదశాబ్దాలుగా తీవ్ర ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న జపాన్‌ రాజకీయ వ్యవస్ధలో అస్ధిరత్వం అంతర్భాగంగా మారిపోయింది. పాలక, ప్రతిపక్ష పార్టీలలో చీలికలు, కొత్త దుకాణాలు తెరవటం సర్వసాధారణం. సంక్షోభం నుంచి బయట పడేందుకు పాలకవర్గం జపాన్‌ రాజ్యాంగ సవరణకోసం గత కొద్ది సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నది. రెండవ ప్రపంచ యుద్దంలో విజేతగా వున్న అమెరికా పరాజిత జపాన్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవటంతో పాటు జపాన్‌కు మిలిటరీ లేని రాజ్యాంగాన్ని ఆమోదించే విధంగా షరతు విధించింది, జపాన్‌ రక్షణ బాధ్యత తాను తీసుకుంది. దాంతో మిలిటరీ ఖర్చును పరిశోధన, అభివృద్ధికి వుపయోగించి సాంకేతిక రంగంలో అమెరికా, ఇతర ఐరోపా అగ్రదేశాలను అధిగమించి ఆర్ధిక రంగంలో జపనీయులు సవాలు విసిరారు. ప్రపంచ రాజకీయ రంగంలో పోయిన తమ పెత్తనాన్ని పునరుద్దరించుకొనేందుకు జపాన్‌ పాలకవర్గం తిరిగి మిలిటరీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నది. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి గురైన పూర్వరంగంలో అక్కడి జనం తిరిగి మిలిటరీ ఏర్పాటుకు అనుకూలంగా లేరు. అయితే ఒక్క కమ్యూనిస్టుపార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజ్యాంగ సవరణ తద్వారా మిలిటరీ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నాయి. అయితే కమ్యూనిస్టుపార్టీతో పాటు కొన్ని శక్తులు, కొందరు ప్రముఖులు మాత్రం మిలిటరీ రాజ్యాంగ సవరణలను వ్యతిరేకిస్తున్నారు.

    జపాన్‌కు మిలిటరీ లేకుండా చేయటంలో రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రధాన పాత్ర వహించిన అమెరికన్లు ఇటీవలి కాలంలో తమ వైఖరిని మార్చుకున్నారు. జపాన్‌ రాజ్యాంగంలో తొమ్మిదవ ఆర్టికల్‌ ప్రకారం జపాన్‌ మిలిటరీని కలిగి వుండటం, యుద్ధాలలో పాల్గొనటం నిషిద్ధం. అయితే అమెరికన్లు వివిధ దేశాలలో జోక్యం చేసుకున్న సందర్భంగా తమ సైనికుల ప్రాణాలు పోవటం, ఆర్ధికంగా పెనుభారంగా మారటంతో పాటు ఒక్క యుద్ధంలో కూడా విజయం సాధించని విషయం తెలిసిందే. దాంతో తమ యుద్ధ భారాన్ని మిత్రదేశాలపై రుద్దేందుకు అమెరికా పూనుకుంది. తన తరఫున దాడులలో పాల్గొనేందుకు జపాన్‌ను ప్రోత్సహిస్తోంది. అందుకు రాజ్యాంగ సవరణ జరపమని సలహా ఇస్తోంది. పాతిక సంవత్సరాల క్రితం సోవియట్‌ రద్దయి పోయి, రష్యా తిరిగి అవతరించటం, చైనా చుట్టూ అమెరికా ఏర్పాటు చేస్తున్న సైనిక వలయంలో జపాన్‌ పాత్ర లేకుండా అమెరికన్లు నేరుగా పాల్గొనటం అంత తేలిక కాదు. తమ దేశాన్ని తిరిగి మిలిటరీ మయం గావించటాన్ని మెజారిటీ జపనీయులు అంగీకరించటం లేదు. రాజ్యాంగసవరణ ప్రతిపాదనలను ముందుకు తెచ్చినపుడల్లా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు, ఇదే సమయంలో తమ దేశంలో ఏర్పాటు చేసిన సైనిక స్ధావరాలలో అమెరికన్లు తిష్ట వేయటాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆత్మరక్షణ దళం పేరుతో వున్న బలగాలకు జాతీయ రక్షణ బలగాలని నామకరణం చేయటం ద్వారా మిలిటరీకరణకు 2012లో ఒక ప్రతిపాదనను ముందకు తెచ్చారు.దాని ప్రకారం శాంతి పరిరక్షణ పేరుతో విదేశాలలో జపాన్‌ సాయుధశక్తులను నియమించవచ్చు, దానికి తోడు సంయుక్త ఆత్మరక్షణ పేరుతో అమెరికాతో కలసి దాడులలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ప్రధాని సైనిక దళాల ప్రధాన అధికారిగా వుంటారు. ఈ దళాలను అంతర్గతంగా వెల్లడయ్యే వ్యతిరేకతను అణచివేయటానికి కూడా నియోగించవచ్చు. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా అవసరమైన ముసాయిదా సవరణలను కూడా సిద్ధం చేశారు.

     ఈ సవరణ ఆమోదం పొందితే ప్రపంచ రాజకీయాలపై అది ప్రభావం చూపుతుంది.ప్రస్తుతం జపాన్‌ పాలకవర్గం వివిధ కారణాలతో అమెరికన్లకు లోబడి వున్నప్పటికీ అధికారికంగా మిలిటరీ ఏర్పడిన తరువాత కూడా అలాగే వుంటుందన్న గ్యారంటీ లేదు. ఆసియాలో ఒక పెద్ద ఆర్ధిక శక్తిగా చైనా అవతరించటం, దానికి ప్రస్తుతానికి రష్యాతో విబేధాలు లేకపోవటం వంటి కారణాలతో చైనా, రష్యాలను ఎదుర్కొనేందుకు జపాన్‌ అవసరం అది భావిస్తున్నది. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్ధానంలో జపాన్‌ పౌరుడిని న్యాయమూర్తిగా నియమించటం, దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుతం చైనా కమాండ్‌లో వున్న కొన్ని దీవులపై చైనాకు హక్కులేదని తాజాగా తీర్పు వెలువరించటంలో అమెరికా హస్తం వుంటుందని వేరే చెప్పనవసరం లేదు.ఈ పూర్వరంగంలో జపాన్‌ ఎన్నికలలో పాలకకూటమి ఎగువ సభలో మూడింట రెండువంతుల మెజారిటీ సాధించటం రానున్న రోజులలో ఎలాంటి పరిణామాలకు నాంది అవుతుందో చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d