• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CPI(M)

బిజెపి సమావేశాలలో నరేంద్రమోడీ భజన

21 Monday Mar 2016

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, BJP National executive meet, Congress, Modi, narendra modi namo mantra

సత్య

   న్యూఢిల్లీలో శని, ఆదివారాలలో రెండు రోజుల పాటు జరిగిన బిజెపి జాతీయ కార్యనిర్వాహకవర్గ సమావేశం జాతీయ వాదం, భారత మాతాకీ జై, అభివృద్ధి గురించి జపం చేసిందన్నది మీడియా వార్తల సారాంశం. అభివృద్ధి, అభివృద్ధి, మరింత అభివృద్ధి మీద కేంద్రీకరించాలి తప్ప ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ఇతర అంశాల జోలికి పోవద్దని ప్రధాని నరేంద్రమోడీ నొక్కి వక్కాణించినట్లు సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించిన హోంమంత్రి రాజనాధ్‌ సింగ్‌ చెప్పారు. గత ఇరవై రెండు నెలల బిజెపి కేంద్ర పాలన తీరును చూస్తే అభివృద్ధి గురించి చెప్పుకొనేందుకు బిజెపికి ఏమైనా వుందా ? ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల సందర్భంగా ఈ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ ఐదు చోట్లా బిజెపికి ఎక్కడా అవకాశాలు లేవన్నది స్పష్టం. పార్లమెంట్‌ ఎన్నికలలో అసోంలో అది పొందిన ఓట్లను బట్టి అక్కడ పెద్ద పార్టీగా అవతరించవచ్చని కొంతమంది వూహాగానాలు చేస్తున్నారు, బిజెపి కూడా అదే ఆశతో వున్నట్లు కనిపిస్తోంది. చిత్రం ఏమిటంటే అక్కడ మోడీని ముందు పెడితే ప్రయోజనం లేదనుకుందో ఏమో ముందుగానే ముఖ్య మంత్రి అభ్యర్ధిని ప్రకటించింది. దీని వలన ఫలితం ఎలా వున్నా ఏ విధంగా అయినా భాష్యం చెప్పుకోవచ్చు. మోడీని ముందు పెడితే ప్రతికూల ఫలితాలు వస్తే మరింత పరువుపోవటం ఖాయం కనుక ఇలా చేశారని చెబుతున్నారు.

  భావ ప్రకటన స్వేచ్ఛ రాజకీయ విమర్శలను తాము అంగీకరిస్తామని కానీ స్వేచ్ఛ పేరుతో జాతీయ వ్యతిరేక కార్యకలాపాలను అంగీకరించేది లేదని రాజనాధ్‌ సింగ్‌ రాజకీయ తీర్మానం గురించి వివరించారు.భారత మాతాకి జై అంటేనే జాతీయ వాదం, దేశ భక్తి అనే విధంగా జాతీయ వాదానికి బిజెపి తాజా వ్యాఖ్యానం చెప్పటం జర్మనీలో హిట్లర్‌ను గుర్తుకు తెస్తున్నది.

   బిజెపి జాతీయ కార్యవర్గంలో నిజంగా ఏం చర్చించారో, ఎవరు ఏం మాట్లాడారో మిగతావారు వినలేదా ? అంటే సమాధానం చెప్పటం కష్టం. రాజకీయ తీర్మానాన్ని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు ప్రవేశపెట్టారు.దాని గురించి మరో మంత్రి ఆరుణ్‌ జైట్లీ విలేకర్లకు వివరించారు. వెంకయ్య నాయుడు ప్రవేశపెట్టారన్న సమాచారం తప్ప ఆయనేం మాట్లాడారనే అంశాన్ని కనీస ప్రస్తావన కూడా చేయలేదు. అంతకు ముందే వెంకయ్య నాయుడు తన ప్రసంగంలోని అంశాలంటూ మీడియాకు ఇమెయిల్‌ ద్వారా పంపారు. దానిలో ప్రధాని నరేంద్రమోడీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తారు. ఇదే విషయం గురించి హోం మంత్రి రాజనాధ్‌ సింగ్‌ను అడగగా వెంకయ్యగారు చెప్పిన వాటితో అంగీకరించటానికి గానీ కాదనటానికి గానీ తానసలు వెంకయ్య వుపన్యాసం వినలేదని భట్టిప్రోలు పంచాయతీ తీర్పు చెప్పారు.

    ఇంతకీ వెంకయ్య ఏం చెప్పారు? ఆయన మీడియాకు పంపిన ఇమెయిల్‌ ప్రకారం ‘మోడీ దేశానికి ఒక వరం, దేవుడు పంపిన పేదల రక్షకుడు, మోడీ పేరు ప్రతిష్టలు నూతన స్ధాయికి చేరాయి.లండన్‌లోని మాడమే టుస్సాడ్స్‌లో మోడీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. కోటీ ఎనభైలక్షల మంది ట్విటర్‌ అనుచరులు, మూడు కోట్ల ఇరవైలక్షల మంది ఫేస్‌బుక్‌ లైక్‌లతో ప్రపంచ స్థాయిలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి నాయకుడు మోడీ. అభివృద్ధి చెందుతున్న భారత్‌ను రూపాంతరం(మోడి ఫయర్‌) చెందించిన వ్యక్తి. ఇలా సాగింది వెంకయ్య గారి మోడీ స్త్రోత్రం. మోడీ పేదలకు బదులు పెట్టుబడిదారుల రక్షకుడని కాంగ్రెస్‌ ఎత్తి పొడిచింది.

   ఈ పొగడ్తల గురించి మీడియా ముందు జెట్లీ లేదా రాజనాధ్‌ సింగ్‌ చెప్పరని వెంకయ్యకు బాగా తెలుసు.అందుకే తన మీడియా మేనేజ్‌మెంట్‌ పద్దతులలో ప్రసంగ అంశాలను మీడియాకు ముందే పంపారు.ఈ భజన చూస్తే అత్యవసర పరిస్థితి సందర్భంగా ఇందిరే ఇండియా ఇండియా ఇందిర అని కాంగ్రెస్‌ నేత డికె బారువా చేసిన పొగడ్తలు గుర్తుకు వస్తున్నాయి. దాని గురించి ఆ నాడు జనసంఘంగా వున్న నేటి బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేశారు. నేడు వెంకయ్య పొగడ్తలు అంతకు తక్కువేమీ కాదు.

   మోడీని వ్యతిరేకించే ఎల్‌కె అద్వానీ ప్రియశిష్యుడిగా పేరు పొందిన వెంకయ్య నాయుడు పార్టీలో నరేంద్రమోడీ ప్రాభవం పెరగ్గానే ఇటువైపు ఫిరాయించారు. తన స్వామి భక్తిని నిరూపించుకొనేందుకు మోడీని పదే పదే పొగడటంలో వెంకయ్య పేరు మోశారు. తాజా సమావేశాలలో ఆయన పొగడ్తల గురించి రాజనాధ్‌ సింగ్‌ గాలి తీయటం, దానిని జాతీయ మీడియా ప్రముఖంగా పేర్కొని వ్యాఖ్యానాలను రాయటం బహుశా వెంకయ్య నాయుడు వూహించి వుండరు. నరేంద్రమోడీ మోడీని పొగడటంలో కేంద్ర మంత్రులు పోటీ పడుతున్నారు.

    ఈ సమావేశాలకు ముందు రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజ్జు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో నరేంద్రమోడీ 2026 వరకు ప్రధానిగా పదవిలో కొనసాగుతారని 1555లోనే ఫ్రెంచి జోస్యుడు నోస్ట్రాడామస్‌ చెప్పారని ఒక పోస్టును పెట్టాడు. మోడీ భారత్‌ను స్వర్ణయుగంలో ప్రవేశపెడతారని, అనేక దేశాలకు రక్షణ కల్పించే దేశంగా భారత్‌ ఎదుగుతుందని పేర్కొన్నాడు. ‘ 2014 నుంచి 2026 వరకు మధ్య వయస్కుడైన ఒక వ్యక్తి భారత్‌కు నాయకత్వం వహిస్తాడని, ఆయనను తొలుత జనం ద్వేషించినా, తరువాత ఎంతగానో ప్రేమిస్తారని దేశ దశ, దిశను ఆయన మారుస్తాడని, ఆయన నాయకత్వంలో భారతదేశమే గాక మొత్తం ప్రపంచం స్వర్ణయుగంలో ప్రవేశించటమే గాక ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహిస్తుందని ‘ జోస్యం చెప్పినట్లు రిజు పేర్కొన్నారు.

   సాధించిన విజయాలేమీ లేనపుడే ఇలాంటి పోసుకోలు కబుర్లతో నాయకత్వాన్ని పొగుడుతూ కాలక్షేపం చేయటం అన్ని పాలకవర్గ పార్టీలలో వున్న ఒక వుమ్మడి లక్షణం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

The physical assault on Sh. Kumar in the court premises appears to be organized and pre- planned:NHRC

21 Sunday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

JNU, JNU ROW, JNUSU, Kanhaiya Kumar, NHRC

NHRC Team visits Central Prison, Tihar to inquire into important issues pertaining to Shri Kanhaiya Kumar; inquiry report forwarded to Commission of Police, Delhi and Director General of Prisons, Tihar Jail for comments (19.02.2016)

New Delhi, 19th February, 2016

On 16.02.2016, the Commission took suo motu cognizance of the newspaper report published in Hindu newspaper dated 13.02.2016 captioned as “Govt. acts tough, JNU student leader charged with sedition”. It was reported that the President of JUNSU was arrested on the charges of sedition after allegedly raising anti-India slogans. The Commission issued notice to the Home Secretary, Govt. of India, Chief Secretary, NCT of Delhi, Commissioner of Police, Delhi and the Registrar, Jawaharlal Nehru University.

On 18th February, 2016, the Acting Chairperson, NHRC directed that a team comprising Sh. C. K. Chaturvedi, Registrar (Law) and Sh. S. K. Jain, SSP (Investigation) may visit Central Prison, Tihar and inquire into the following important issues pertaining to Sh. Kanhaiya Kumar :
I. To assess arrangements made and measures taken to ensure safety and security of Sh. Kanhaiya Kumar in the prison and to ascertain the apprehensions, if any, in the mind of Sh. Kanhaiya Kumar with regard to his safety and security.
II. To ascertain the treatment meted out to Sh. Kanhaiya Kumar by the police and prison authorities while in custody.
III. To ascertain whether the statement released to the press by the Commissioner of Police, Delhi in the name of Sh. Kanhaiya Kumar was made by Sh. Kanhaiya Kumar voluntarily and without any extraneous influence.

The NHRC team has submitted a report dated 19.02.2016 with the following findings:

i. The Central Prison, Tihar has made special arrangements to ensure safety and security of Sh. Kanhaiya Kumar inside the prison. He has been kept in an independent and separate cell. Dedicated security staff has been deployed to ensure his safety and security round the clock. Several security instructions have been issued by the prison authorities in this regard. He has no complaints against prison official.
ii. According to Sh. Kanhaiya Kumar, he was arrested without any valid reason and without disclosing to him even grounds of arrest. He had not committed any offences as now alleged. However, this aspect is under investigation by the police.
iii. Sh. Kanhaiya Kumar did not complain of any physical assault by the police while in custody. However, he was subjected to psychological pressure during interrogation.
iv. The statement which was issued by the police as an appeal on behalf of Sh. Kanhaiya Kumar was not written by him voluntarily. The content, construction and framework of the statement were as dictated by the police.
v. Sh. Kanhaiya Kumar was abused and physically assaulted by some persons dressed as advocates in the Patiala House court premises on 17.02.2016. He was even physically assaulted inside the adjoining court room in the presence of police who did not do anything to prevent the assault or apprehend the attackers even though they were identified by Sh. Kanhaiya Kumar then and there.
vi. The physical assault on Sh. Kumar in the court premises appears to be organized and pre- planned.
vii. What happened in the Patiala House Court Complex on 17.02.2016 was a major security lapse on the part of the police. There was serious dereliction of duty on the part of the police.
viii. Going by the sequence of events, the safety and security of Sh. Kanhaiya and his family members is a serious cause of concern.

A copy of the inquiry report submitted by the NHRC team has been forwarded to the Commisioner of Police, Delhi and the Director General of Prisons, Tihar Jail for their comments, to be received by the Commission, on or before 26.02.2016.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

లాయర్లా ! ఫాసిస్టు శక్తులా !!

18 Thursday Feb 2016

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ABVP, JNU, JNU ROW, RSS

 

ఎం కోటేశ్వరరావు

      జెఎన్‌యులో జరుగుతున్న ఘటనలకు మూలం ఏమిటి ? అని నేను రాసిన అంశంపై వచ్చిన విమర్శల సారాంశం ఏమంటే ఒకటి పూర్తిగా ‘ఎడమవైపు’నుంచే రాశారు, మావోయిజాన్ని విశ్వసించే డిఎస్‌యు అనే విద్యార్ధి సంస్ధ కాశ్మీరీ వేర్పాటు వాదులకు సానుభూతిగా సభ ఏర్పాటు చేయటం నిజమే కదా , అక్కడ జాతి వ్యతిరేక నినాదాలు చేశారు కదా అంటే దానర్ధం వారు కూడా మద్దతు ఇచ్చినట్లే అలాంటపుడు వారిపై చర్య తీసుకుంటే తప్పేమిటి అన్నది ఒక సమర్ధన. ఇవే కాదు, ఇంకా ఎవరైనా చేసే విమర్శలకు ఆహ్వానం. మన దేశంలో రెండువేల సంవత్సరాలకు పూర్వమే తర్క శాస్త్రాన్ని (వాద విద్య) అభివృద్ధి చేసిన వారిలో గౌతముడు ఒకరు.ఈ గౌతముడు పురాణాలలో కనిపించే సప్త రుషులలో ఒకరు గానీ, గౌతమ బుద్దుడు గానీ కాదని గమనించాలి. వేదాలు, వుపనిషత్తులు మొదలైన వాటిని చార్వాకులు, లోకాయతుల వంటి ఆది భౌతికవాదులు ప్రశ్నించటం ప్రారంభించినపుడు వాటికి సమర్ధనగా రూపొందించినదే తర్కశాస్త్రమని ఒక అభిప్రాయం. దానితో ఎవరైనా విబేధించవచ్చు అది వేరే విషయం. శంకరాచార్యుడి చివరి దినాలలో తమకేదైనా వుపదేశం చెయ్యమని శిష్యులు అడిగినపుడు చెప్పిన అనేక అంశాలలో ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే దానికి రంధ్రాన్వేషణ చేయకుండా తర్కబద్దమైన సమాధానం చెప్పాలని వుపదేశించినట్లుగా రాశారు. అందువలన అటువంటి చర్చలు ఎన్నయినా జరపవచ్చు. ఇందుకు ‘కుడి,ఎడమ’లు ఎవరికీ మినహాయింపు కాదు. ఇది మా విశ్వాసం, తర్కానికి, న్యాయశాస్త్రానికి అతీతం అందువలన దీనిపై తర్కించేదేమీ లేదు, మేము చెప్పింది వినాలి తప్ప మరొకటి కాదు, మరీ కాదంటే తంతాం, చంపుతాం అంటే కుదురుతుందా ? సహించాలా ?

     దేశద్రోహం ఆరోపణలతో అరెస్టు చేసిన జెఎన్‌యు విద్యార్ధి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్‌ను బుధవారం నాడు పాటియాల కోర్టుకు హాజరు పరిచే సమయంలో అతనిపై లాయర్ల ముసుగులో వున్న వ్యక్తులు గూండాల మాదిరి దాడి చేయటం లోకమంతా చూసింది. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు అది తోపులాటలా కనిపించింది కనుక ఆయనకు వైద్య పరీక్షలు చేయటం అవసరం. వారు లాయర్లా లేక నల్లకోట్లు వేసుకొని వచ్చిన సంఘపరివార్‌ కార్యకర్తలా లేక లాయర్లలో వున్న దేశభక్తులైన సంఘపరివార్‌ కార్యకర్తలా అన్నది దాచినా దాగదు. వారు ప్రవర్తించిన తీరు గురించి ప్రత్యక్షంగా చూసిన మరొక లాయర్‌ చెప్పిన కధనాన్ని ఫిబ్రవరి 18వ తేదీ పత్రికలో హిందుస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. అదేమీ కమ్యూనిస్టుల లేదా అభ్యుదయ వాదుల పత్రిక కాదు. ఆ లాయర్‌ పేరు రాస్తే ఆయన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వస్తుందో అని పేరు రాయలేదు. దీన్ని ఎవరైనా కట్టుకధ అంటే చేసేదేమీ లేదు. ఫాసిస్టుశక్తులు, ఫాసిజం లక్షణాలు తప్ప ఇవి మరొకటి కాదు.

    ‘ బుధవారం నాడు వృత్తి చేస్తున్న ఒక లాయర్‌గా నా ప్రస్తానంలో అత్యంత ఆందోళనకరమైన వుదంతాన్ని చూశాను.అది సాయంత్రం ఒంటి గంట సమయం. పాటియాలా కోర్టుల ప్రాంగణంలో కన్నయ్య కుమార్‌ను చూసేందుకు రెండవ నంబరు గేటు దగ్గర వందలాది మంది లాయర్లు గుమికూడారు.పరిమితమైన సంఖ్యలో మాత్రమే కోర్టు లోపలికి అనుమతించనున్నట్లు ఒక పోలీసు ప్రకటన చేశాడు.అప్పుడు అంతా ప్రారంభమైంది. అందరు జర్నలిస్టులు మరియు జెఎన్‌యు విద్యార్ధులను బయటకు పంపాలని లాయర్లు డిమాండ్‌ చేయటానికి ఆ ప్రకటన ఒక సంకేతమైంది. కొంతమంది లాయర్ల బృందం బాల్కనీలో గుమికూడి వుంది. ఎవరైనా వీడియో తీస్తున్నారా అని వారు చూస్తున్నారు. ఆ తరువాత దేశభక్తి చర్యగా బాల్కనీ నుంచి ఒక లాయర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసి భారత మాతాకీ జై అంటూ నినాదాలు ఇచ్చాడు. అతని పక్కనే వున్న మరొక లాయర్‌ కన్నయ్యను తీసుకురానివ్వండి వాడిని సజీవ దహనం చేస్తాము అని అరిచాడు. పోలీసుల పక్కనే వున్న కొంత మంది లాయర్లు దానితో వుత్సాహపడ్డారు. వారిలోని ఒక లాయర్‌ సెల్‌ఫోన్‌ తీసి నువ్వు కూడా రా ఒకరిద్దరు జెఎన్‌యు విద్యార్ధులను బాదవచ్చు అని చెప్పాడు.

      అది రెండున్నర గంటల సమయం. కన్నయ్య కుమార్‌ కోర్టు వద్దకు చేరాడు. అతనిని మరొక మార్గం ద్వారా లోపలికి తీసుకు వెళ్లారు. ఇది తెలిసిన లాయర్లు వెంటనే ఆ గేటువైపు వెళ్లి కన్నయ్యపై దాడి చేశారు. ఆ తరువాత గర్వంతో తిరిగి వస్తున్న లాయర్లను నేను చూశాను. వారిలో ఒకరు నేను రెండుసార్లు తన్నాను, ముఖంపై కొట్టాను అని చెప్పాడు. మా నల్లకోట్లు మేము ఒక విద్యావంతులైన తరగతికి చెందిన వారమని వెల్లడించేందుకు వుద్దేశించినవి, కానీ కొంత మంది లాయర్లు బార్‌ ప్రతిష్టకు మచ్చతెచ్చారు.’ అని చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. కావాలంటే అలాంటి వారు నల్ల కోట్లు తీసి వేసి కాషాయ దుస్తులతోనే గూండాయిజం చేయవచ్చు. అప్పుడు సమాజమే వారి సంగతి తేల్చుకుంటుంది. అలాగాక వారు కోర్టులో కన్నయ్యకు వ్యతిరేకంగా తమ వాద విద్య పటిమను ప్రదర్శించి వుంటే దాని గురించి గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ వారు నల్లకోట్లు వేసుకొని శంకరాచార్యుడి వుపదేశాలకు విరుద్ధంగా గూండాయిజానికి పాల్పడ్డారు.ఇలాంటి ‘కుడి’ వారి గురించి ఏమని చెప్పాలి?

    మావోయిజాన్ని నమ్మే డిఎస్‌యు కాశ్మీర్‌ వేర్పాటు వాదులు, దేశద్రోహులతో కలసి సభ జరపటాన్ని ఎలా సమర్ధిస్తారన్నది. ముందుగా ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. మావోయిజం అంటే దేశ వ్యతిరేకం కాదు. మార్క్స్‌-ఎంగెల్స్‌ రూపొందించిన దానిని మార్క్సిజం అని పిలిచారు. తరువాత దానిని రష్యాకు అనువర్తింపచేసి విప్లవాన్ని ముందుకు నడిపించిన లెనిన్‌ అనుభవాలను జోడించి తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజం అన్నారు. ఈ రెండింటినీ మేళవించి ఆసియాలో భిన్నమైన పరిస్ధితులున్న చైనాలో దోపిడీ వ్యవస్ధను కూలదోసేందుకు అక్కడి కమ్యూనిస్టుపార్టీ మావో నాయకత్వంలో అభివృద్ధి చేసిన విధానాన్ని మావోయిజం అన్నారు. అన్నింటినీ కలిపి మార్క్సిజం-లెనినిజం- మావోయిజాల అనుభవాలన్నింటినీ తీసుకొని ఆ తరువాత కాలంలో అనేక దేశాలలో కమ్యూనిస్టులు తమకు అనువైన విధానాలు, ఎత్తుగడలు రూపొందించుకుంటున్నారు.ఈ క్రమంలో భారత్‌లో కొందరు కమ్యూనిస్టులు స్వతంత్ర కార్యాచరణ, ఎత్తుగడలను విస్మరించి తాము చైనా పంధాలో విప్లవాన్ని తీసుకువస్తామని చెప్పేందుకు తమది మావోయిస్టు పంధా అని చెప్పటమే కాక మావోయే మా చైర్మన్‌ అన్నంత దుందుడుకు వైఖరి తీసుకున్నారు. ఇదంతా ఐదు దశాబ్దాల నాటి చరిత్ర. ఆ వైఖరి విఫలం కావటమే కాక మావోయిజాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకొనేవారు చీలికలు పీలికలై పోయారు. ప్రతి ఆందోళనను విప్లవ మార్గంవైపు మార్చాలనే మావో సూత్రీకరణకు తప్పుడు భాష్యం చెప్పి కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని సమర్ధించేవరకు వారు పయనించారు. దానితో సిపిఎం, సిపిఐ ఏకీభవించటం లేదు. అలాంటి వారిని సమర్ధించిన వుదంతం చరిత్రలో ఒక్కటంటే ఒక్కటీ లేదు. మరైతే సమస్య ఎక్కడ ?

    జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం అరాచకవాదం నుంచి అన్ని రకాల భావజాలాలకు ప్రాతినిధ్యం వహించేవారు వున్న ఒక విద్యా సంస్ధ. ఎవరికి వారు తమ భావజాలాన్ని విద్యార్ధులలో ప్రచారం చేసుకోవటానికి సభలు, సమావేశాలు పెట్టుకోవటం ఎప్పటి నుంచో జరుగుతోంది. అందుకు అధికార యంత్రాంగం కూడా అనుమతిస్తోంది. కాశ్మీర్‌ సమస్య విషయంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు అక్కడ సమస్యను మరింత క్లిష్టతరం గావించాయన్నది తిరుగులేని వాస్తవం. దానిమీద అనేక తరగతులలో భిన్న అభిప్రాయాలు వున్నాయి. వాటిని చర్చించేందుకు వేదికలను ఏర్పాటు చేసుకున్నారు. దానిలో భాగంగానే ఈనెల తొమ్మిదిన డిఎస్‌యు ఒక సభను ఏర్పాటు చేసింది. అదేమీ రహస్య సమావేశం కాదు, అధికార యంత్రాంగం కూడా అనుమతించింది. తీరా సభ జరగబోయే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ అఖిల భారత విద్యార్ధి పరిషత్‌(ఎబివిపి) రంగంలోకి దిగి సభకు అనుమతివ్వటంపై అభ్యంతరం తెలుపుతూ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ వత్తిడికి వారు లొంగారు. చివరి నిమిషంలో సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఎప్పటి నుంచో అలాంటి సభలు జరపటానికి లేని అభ్యంతరం ఇప్పుడు పెడుతున్నారని ఈ విషయంలో సభ జరుపుకొనేందుకు తమకు మద్దతు తెలపాలని డిఎస్‌యు అక్కడ వున్న విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య, ఇతర సంఘాలైన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్‌ వంటి సంఘాలను కోరారు తప్ప తమ భావజాలానికి మద్దతు ఇవ్వాలని వారు అడగలేదు. దాంతో అధికారులు సభ జరిగే ప్రాంతానికి కొంత మంది భద్రతా సిబ్బందిని పంపటంతో పాటు, మైకులు లేకుండా నిర్వహించుకోవాలని షరతు విధించారు. దానికి కూడా నిర్వాహకులు అంగీకరించారు. ఈ విషయం తెలిసిన ఎబివిపి ఎలాగైనా సరే ఆ సభను జరగనివ్వకూడదని తన మద్దతుదార్లను సమీకరించింది.ఆ సమయంలో కన్నయ్యతో సహా అనేక విద్యార్ధి సంఘాలకు చెందిన వారూ , ఏ సంఘాలకూ చెందని వారూ, డిఎస్‌యు లేదా వారితో ఏకీభవించే ఇతర సంఘాలకు చెందిన వారు వున్నారు. వారిలో వుగ్రవాద సంస్ధలతో సంబంధం వున్న వారు కూడా వున్నారని ఆ వుదంతం తరువాత వెల్లడైంది. సభ నిర్వాహకులు, దానికి హాజరయ్యేందుకు బయటి నుంచి వచ్చిన వారిలో కొందరు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. అంతే తప్ప కన్నయ్య లేదా ఎఎఫ్‌ఐ ఇతర సంఘాలకు చెందిన వారు కాశ్మీర్‌ వేర్పాటు వాద లేక పాక్‌అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేయలేదు. కొందరు చేసిన నినాదాలను సాకుగా తీసుకొని అక్కడి వామపక్ష విద్యార్ధి కార్యకర్తలను వేధించటానికి, విశ్వవిద్యాలయంలో వున్న భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామిక వాతావరణాన్ని లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందన్నది స్పష్టం.

      బయటి వ్యక్తులు లేదా అక్కడి కొంత మంది భారత వ్యతిరేక నినాదాలు చేసిన సమయంలో విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య మరికొందరు వున్న వీడియోలు తప్ప వ్యతిరేక నినాదాలు చేశారన్న సాక్ష్యాలు లేవు. తాము అ సమయంలో అక్కడ ఎందుకున్నదీ వారు స్పష్టం చెబుతున్నారు, లేరని బుకాయించటం లేదు. ఏబివిపి వత్తిడి, అభ్యంతరం పెట్టింది కనుక అధికారులు డిఎస్‌యు సభను రద్దు చేయాలని ప్రయత్నించారు. ఈ రోజు డిఎస్‌యు సభను అడ్డుకున్న వారు రేపు తమ సభను మాత్రం అడ్డుకోరన్న గ్యారంటీ ఏముంది? అందువలన ఆ సంగతేదో ఇక్కడే,ఇప్పుడే తేల్చుకోవాలని ఇతర సంఘాల వారు కూడా అక్కడే వున్నారు. దీనికి దేశద్రోహం అని పేరు పెట్టారు. ఆ సమయంలో ఎబిబివి ఆరోపణలను ఖండిస్తూ దేశభక్తి గురించి తాము ఎబివిపి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని కన్నయ్య చేసిన వుపన్యాసంలో కూడా విమర్శ తప్ప అభ్యంతరకర భాష, పదజాలం లేదు. అందువలన ఇప్పుడు జరుగుతున్న రచ్చ లేదా నిరసన, ఆందోళనలకు కారకులు ‘కుడి పక్షం’ తప్ప మరొకరు కాదు. అందుకే చివరికి ఎబివిపిలో కాస్త తర్కబద్దంగా ఆలోచిస్తున్నవారు కూడా దేశవ్యతిరేక నినాదాలు చేసిన వారిని తప్పుపడుతూనే చేయనివారి పట్ల అనుసరించిన వైఖరికి నిరసనగా ముగ్గురు ఎబివిపి కమిటీ నుంచి తప్పు కున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుసరించిన వైఖరితో తాము విబేధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే వారు కూడా దేశద్రోహులను సమర్ధించినట్లా ?

     కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో ఢిల్లీ పోలీసు నడుస్తున్నదనటానికి జెఎన్‌యు విశ్వవిద్యాలయ విద్యార్ధుల గురించి ఎలాంటి నివేదిక ఇచ్చారో గురువారం నాటి పత్రికల్లో వచ్చింది. విద్యార్ధులు బీఫ్‌ పెట్టాలని కోరారని, కొందరు మహిషాసుర వర్ధంతి జరిపారని నివేదికలో ఆరోపించారంటే హిందూత్వ ఎలా తలకెక్కిందో అర్ధం అవుతోంది.అరుణాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ కనుసన్నలలో నడిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని బిజెపి ఏం చేసిందో దేశమంతా చూసింది. అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు గవర్నర్‌ చూపిన కారణాలలో రాజభవన్‌ ఎదుట గోవధ చేశారని కూడాపేర్కొన్నారు. ప్రతిదానికీ ఆవు కధకు లంకె పెడుతున్నారు. అంటే ఎవరు ఏమి తినాలో ఎవరిని అభిమానించాలో,పూజించాలో కూడా మనువాదులు చెప్పినట్లు జరగాలా ? కేంద్రంలోని బిజెపి సర్కార్‌, వారిని నిత్యం సమీక్షించి, మార్గదర్శనం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివార్‌ దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పక్కన పెట్టి వివాదాస్పద, ఏకపక్షంగా తమ మతభావజాలాన్ని రుద్దే క్రమంలో తెగేదాగా లాగేందుకే నిర్ణయించుకున్నట్లు అనేక పరిణామాల సందర్బంగా అనుసరిస్తున్న వైఖరి వెల్లడిస్తోంది. అందుకే గతంలో పేర్కొన్నదే అయినప్పటికీ మరోసారి హిట్లర్‌ హయాంలో బందీ అయిన ఒక పాస్టర్‌ మార్టిన్‌ నియోమిలర్‌ రాసిన మేలుకొలుపు అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. మార్పల్లా అక్కడ నాజీలు అయితే ఇక్కడ హిందూత్వవాదులను చేర్చుకోవటమే. దాన్ని నేటి పరిస్ధితులకు మారిస్తే ఇలా వుంటుంది.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు,

నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను.

తరువాత వారు ప్రజాస్వామిక వాదుల కోసం వచ్చారు,

ప్రజాస్వామ్యం అంటే నాకు విశ్వాసం పోయింది కనుక మిన్నకున్నాను.

తరువాత మహిళల కోసం వచ్చారు,

ఇంటి పట్టున వుండక ఫ్యాషన్లంటూ మగాళ్లను రెచ్చగొడుతున్నారు కనుక మంచిదే అనుకున్నాను.

ఆ వెంటనే ముస్లింల కోసం వచ్చారు,

నేను ముస్లింను కాదు గనుక పట్టించుకోలేదు.

తరువాత వారు దళితుల కోసం వచ్చారు,

వారు అంటరాని వారని మా పెద్దలు చెప్పారు గనుక ఆ ఛాయలకే పోలేదు.

తరువాత వారు బీసీల కోసం వచ్చారు,

నేను బీసి కాదు కనుక చూసీ చూడనట్లు వున్నాను.

చివరికి నా కోసం వచ్చారు,

అప్పుడు చూస్తే అసలు నా వెనుకెవరూ మిగల్లేదు.

చెన్నయ్‌ ఐఐటిలో,పూనా ఫిలిం ఇన్సిస్టిట్యూట్‌లో, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, కలుబుర్గి, గోవింద పన్సారే, నరేంద్ర దబోల్కర్‌ల వుదంతాలలో ప్రజాస్వామిక వాదులు, భావప్రకటన స్వేచ్చను కోరుకొనే వారు, లౌకిక వాదులు తగినంతగా స్పందించి వుంటే ఇప్పుడు జెఎన్‌యు పరిణామాలు జరిగి వుండేవి కాదు. ఇప్పటి కైనా మేల్కొనకపోతే అన్ని జీవన రంగాలకు ఈ ధోరణి విస్తరిస్తుందని గమనించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జెఎన్‌యులో జరుగుతున్న ఘటనలకు మూలం ఏమిటి ?

17 Wednesday Feb 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ABVP, Anti communist, ANTI NATIONAL, BJP, democracy, JNU, JNU ROW, RSS, students

ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో  సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి.

ఎం కోటేశ్వరరావు

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలను అణచేపేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అణచివేత వైఖరి బంగారం లాంటి ఒక యువశాస్త్రవేత్త వేముల రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైంది.ఈ వుదంతంపై జరుగుతున్న ఆందోళన ఇంకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వుంది. ఒక వుదంతం జరిగితే దాన్నుంచి మంచో చెడో ఏదో ఒకటి నేర్చుకోవాలన్నది సమాజం నేర్పిన పాఠం. హైదరాబాదు వుదంతం నుంచి కేంద్రం ప్రభుత్వం ఏమి నేర్చుకున్నది? తన భావజాలానికి వ్యతిరేకులుగా వున్న వారిని అణచివేసేందుకే ముందుకు పోవాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దానిలో భాగమే న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో వామపక్ష భావజాలం వున్న విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలపై దేశద్రోహ ముద్రవేసి అరెస్టులకు పూనుకున్నది. దానిలో భాగంగానే విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ తదితరుల అరెస్టు. హైదరాబాదు వుదంతంలో స్ధానిక ఎంఎల్‌ఏ,ఎంఎల్‌సిలు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ లేఖలు, ఇతర రూపంలో విశ్వవిద్యాలయ అధికారులపై వత్తిడి, ఏబివిపి విద్యార్ధులతో అసత్య కేసుల నమోదు వంటి పనులు చేశారు. న్యూఢిల్లీలో ఏకంగా బిజెపి ఎంఎల్‌ఏ ఒపి శర్మ కోర్టుకు వచ్చిన విద్యార్ధులు, అధ్యాపకులు, జర్నలిస్టులపై ఏకంగా పోలీసుల సమక్షంలో చేయి చేసుకున్నాడు. అంతే కాదు తనకు చిన్నప్పటి నుంచి జాతి వ్యతిరేకులుగా వున్నవారిపై దాడి చేయటం అలవాటని ఆ పెద్దమనిషి సమర్ధించుకున్నాడు.అంటే అధికార యంత్రాంగాన్ని వుపయోగించుకోవటమే కాదు, తమతో విబేధించేవారిపై సంఘపరివార్‌ కార్యకర్తలు ప్రత్యక్షంగా గూండాగిరీ చేయటానికి కూడా సిద్ధం అవుతున్నారనుకోవాలా ? ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే సందర్బంగా భజరంగ్‌దల్‌, విశ్వహిందూ పరిషత్‌ ఇతర వారి అనుబంధ సంఘాల కార్యకర్తలు వీధులు, పార్కుల వెంట తిరిగి అనుమానం వచ్చిన యువతీ యువకులను కొట్టటాన్ని మాత్రమే చూశాము.ఇప్పుడు వారు విశ్వవిద్యాలయాల వ్యవహారాలలో కూడా జోక్యం చేసుకుంటున్నారు.జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్న విద్యార్ధులు, అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రతి ప్రదర్శన చేశారు. అలాంటి వారికి కేంద్రంగా వుందంటూ పనిలో పనిగా అసలు ఆ విశ్వవిద్యాలయాన్నే మూసివేయాలని కూడా డిమాండ్‌ చేశారు.

జెఎన్‌యులో ఏం జరిగింది? అసలు జాతి వ్యతిరేకత అంటే ఏమిటి? అన్నది ప్రతివారిలోనూ వస్తున్న సందేహం? విద్యార్ధులు ఏవైనా తప్పులు చేస్తే వారిని సరిదిద్దాలా లేక జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి జైళ్లకు పంపాలా ? ‘ఫిబ్రవరి తొమ్మిది రాత్రి నిజంగా ఏం జరిగింది ?’ అనే శీర్షికతో హిందూస్ధాన్‌ టైమ్స్‌ పత్రిక ఫిబ్రవరి 16న ఒక విద్యార్ధి కధనాన్ని ప్రచురించింది. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో శిక్ష పడిన అప్జల్‌ గురు స్మారకార్ధం ‘ఏ కంట్రీ వితౌట్‌ పోస్టాఫీసు’ అనే పేరుతో ఒక విద్యార్ధి సంఘం ఒక మీటింగ్‌ ఏర్పాటు చేసింది. దాని గురించి హర్షిత్‌ అగర్వాల్‌ అనే విద్యార్ధి క్వోరా వెబ్‌సైట్‌లో రాసిన అంశాలను హిందూస్థాన్‌ టైమ్స్‌ పేర్కొన్నది.’ ఫిబ్రవరి తొమ్మిదిన డిఎస్‌యు అంటే డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పేరుతో వ్యవహరించే విద్యార్ధి సంఘం ఒక సాంస్కృతిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వారు పేర్కొన్నట్లుగా కాశ్మీరీ పౌరుల ప్రజాస్వామిక హక్కయిన స్వయంత్రిపత్తి పోరాటానికి మద్దతుగా మరియు న్యాయవ్యవస్ధ హత్యకు గురైన అప్జల్‌ గురు మరియు మక్బూల్‌ భట్ల సంస్మరణగా ఆ సభ జరిగింది. క్యాంపస్‌(జెఎన్‌యు)లోని మరియు వెలుపలి నుంచి పెద్ద సంఖ్యలో కాశ్మీరీ విద్యార్ధులు ఈ కార్యక్రమానికి వచ్చారు.’ డిఎస్‌యు మావోయిజాన్ని నమ్మే విద్యార్ధులతో కూడిన ఒక చిన్న వుగ్రవాద వామపక్ష సంస్ద. వారు ఏ అర్ధంలో చూసినా టెర్రరిస్టులు గానీ నక్సల్స్‌గానీ కాదు. నేను రెండు సంవత్సరాలకుపైగా కాంపస్‌లో వుంటున్నాను. వారు ఎప్పడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడటం గురించి రాజ్యాన్ని కూలదోయటానికి ఒక రాయి వేయటం వంటివిగానీ నేను చూడలేదు. వారి మీటింగ్‌ ప్రారంభం కావటానికి 20 నిమిషాల ముందు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ అధికారయంత్రాంగానికి ఒక లేఖ రాసింది.కాంపస్‌ వాతావరణానికి హానికరం గనుక ఆ సమావేశానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరింది. ఘర్షణలు జరుగుతాయనే భయంతో అధికారయంత్రాంగం అనుమతి నిరాకరించింది. జెఎన్‌యు అన్ని రకాల గళాలను వినటానికి ఒక అనువైన ప్రజాస్వామిక భావనల కేంద్రం. భావాలు తీవ్రవాదంతో కూడినప్పటికీ వ్యక్తం చేయటాన్ని గౌరవిస్తారు. ఇపుడు ఎబివిపి అటువంటి దాన్ని అడ్డుకుంటోంది. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో తమ సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి. సభజరగాల్సిన బ్యాడ్‌మింటన్‌ కోర్టు వద్దకు అధికార యంత్రాంగం భద్రతా సిబ్బందిని పంపింది. అయితే మైకులను వినియోగించటానికి మాత్రం అనుమతి నిరాకరించింది. అందుకు నిర్వాహకులు అంగీకరించి మైకులు లేకుండానే సభ జరుపుకోవాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఎబివిపి తన కార్యకర్తలను సమీకరించి హాజరైన విద్యార్ధులు, నిర్వాహకులను బెదిరించటం ప్రారంభించింది. ఏ కాశ్మీర్‌ హమారా హయ్‌, సారా కా సారా హయ్‌ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిస్పందనగా సభ నిర్వాహకులు హమ్‌ క్యా చాహతే అజాదీ అని నినాదాలు చేశారు.తరువాత తుమ్‌ కితనే అఫ్జల్‌ మారోగె, హర్‌ ఘర్‌ సె అఫ్జల్‌ నికేగా అని నినదించారు. జెఎన్‌యు బయటి నుంచి వచ్చిన కాశ్మీరీ విద్యార్ధుల బృందం ఒకటి సభకు వచ్చిన వారి మధ్యలో ఒక వలయంగా ఏర్పడ్డారు. నన్ను నమ్మండి వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారు లేరు. ఆ కార్యక్రమం సందర్బంగా నేను కొద్ది సేపు వున్నాను. వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారిని నేను గుర్తించలేదు. దశాబ్దాల తరబడి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్ట అణచివేతకు గురైన కాశ్మీరీ విద్యార్ధులు ఏబివిపి వారిని చూడగానే భారత వ్యతిరేక నినాదాలు చేశారు. నేను దాదాపు రెండున్నర సంవత్సరాలుగా జెఎన్‌యులో వున్నాను. అటువంటి నినాదాలు నేను ఎక్కడా వినలేదు, డిఎస్‌యును మినహాయిస్తే ఏ వామపక్ష పార్టీ భావజాలానికి దగ్గరగా లేవు. పాకిస్ధాన్‌ జిందాబాద్‌ అనే నినాదానికి సంబంధించి అది వివాదాస్పాదం. నేను అక్కడ వున్నంత వరకు ఆ నినాదాన్ని వినలేదు. అటువంటి నినాదం చేసినట్లు ఒక వీడియో వుంది. అయితే అది స్పష్టంగా లేదు, కాశ్మీరీ విద్యార్ధులు చేశారా లేదా ఎబివిపి కుట్ర అన్నది తెలియటం లేదు.జెఎన్‌యు విద్యార్ధి సంఘనాయకుడు కనయ్య కుమార్‌ ఎలాంటి నినాదాలు చేయలేదు.అతను ఎఐఎస్‌ఎఫ్‌( సిపిఐ విద్యార్ధి విభాగం) సభ్యుడు మావోయిస్టు లేదా వేర్పాటు వాదానికి వారు వ్యతిరేకం’ అని అగర్వాల్‌ పేర్కొన్నాడు.

ఇక్కడ సమస్య ఏబివిపి అభ్యంతర పెట్టినా అడ్డుకున్నా ఆ సభ జరిగింది. సభ జరగటానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు సహకరించాయనే దుగ్డతో ఎలాగైనా నిరంకుశ,అణచివేత చర్యల ద్వారా వారిని బెదిరించాలి, విశ్వవిద్యాలయంలో తమ పలుకుబడిని పెంచుకోవాలన్నది తప్ప మరొకటి కనిపించటం లేదు. పోలీసులను వినియోగించి తప్పుడు కేసులు బనాయించటాన్ని దేశ, విదేశాలలో లోని అనేక మంది విద్యావేత్తలు, విద్యార్ధులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పలు సంస్ధలు దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేకం పేరుతో తమ వ్యతిరేకులను, ముఖ్యంగా వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు చూస్తున్నాయి. ప్రజాస్వామిక పద్దతులలో చర్చల ద్వారా ఒప్పించి తమ భావాలను ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, మద్దతుదార్లను కూడగట్టుకోవచ్చు. కానీ తమ వాదనలో పసలేనపుడు ఎదుటివారిపై భౌతికదాడులకు దిగి నోరు మూయించటం ప్రజాస్వామ్యమా ? ఫాసిజమా ? జెఎన్‌యు విద్యార్ధులకు మద్దతు ఇస్తున్నందుకు ఢిల్లీలోని సిపిఎం కేంద్రకార్యాలయంపై దాడికి ప్రయత్నించటం, తరువాత పాటియాల కోర్టు ఆవరణలో బిజెపి ఎంఎల్‌ఏ నాయకత్వంలో పరివార్‌ మద్దతుదారులైన న్యాయవాదులు కూడా నల్లకోట్లు వేసుకొని విద్యార్ధులు, అధ్యాపకులు, వార్తల సేకరణకు వచ్చిన జర్నలిస్టులపై దాడులు చేయటం, మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా దాడులకు దిగటం ప్రమాదకర పోకడలకు నిదర్శనం.

అఫ్జల్‌ గురువంటి వుగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేయటం ద్వారా వుగ్రవాదులపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను అవమానించటమే అని వారి త్యాగాలను అపహాస్యం చేయటమే అని మనోభావాలను రెచ్చగొడుతూ తమ తప్పుడు చర్యలను సమర్ధించుకొనేందుకు సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది.పంజాబు, కాశ్మీరులలో అమెరికా కుట్రలో భాగంగా పాకిస్ధాన్‌ కేంద్రంగా వున్న వుగ్రవాదులు జరిపిన దాడులలో ఎందరో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ పార్టీలలో వారిని ఎదుర్కొని ఎందరో నాయకులు, కార్యకర్తలను కోల్పోయిన సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు , అకాలీదళ్‌ తప్ప దేశభక్తి,దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పుకొనే బిజెపి , ఇతర పార్టీలకు చెందిన వారు ఎందరున్నారో చెప్పమనండి. బిజెపి కుహనా (నకిలీ) దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేక పోరాట బండారం గురించి గతేడాది జూలైలో మన రిసర్చ్‌ మరియు ఎనాలసిస్‌ వింగ్‌( రా)లో పనిచేసిన మాజీ అధికారి ఎఎస్‌ దౌలత్‌ గతంలో బిజెపి అధికారంలో వున్నపుడు 1999లో కాందహార్‌ విమాన హైజాక్‌ వుదంతంలో వ్యవహరించిన తీరు గురించి వివరించారు. వందలాది మంది పౌరుల, భద్రతా సిబ్బంది ప్రాణాలు తీసిన వుగ్రవాదులతో రాజీపడిన వాజ్‌పేయి సర్కార్‌ ముగ్గురు కరడు గట్టిన తీవ్రవాదులను విడుదల చేసింది. పోనీ విమాన ప్రయాణీకుల ప్రాణాలు కాపాడేందుకు ఆ పనిచేసిందని సరిపెట్టుకోవచ్చు.కానీ పాకిస్ధాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హిజబుల్‌ ముజహిదీన్‌ అధిపతి సయీద్‌ సలావుద్దీన్‌ కుమారుడికి 1999లో బిజెపి ప్రభుత్వం మనదేశంలోని ఒక మెడికల్‌ కాలేజీలో సీటు ఇప్పించటం దేశ భక్తా, వుగ్రవాదులతో కుమ్మక్కా? ఏ ప్రయోజనం ఆశించి చేసినట్లు ఇంతవరకు దాని గురించి ప్రభుత్వం నోరు విప్పదు. ఆ విమాన హైజాక్‌ వుదంతంలో అది అమృతసర్‌ నుంచి బయలుదేరి వెళ్లటానికి అనుమతించటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది అమృతసర్‌ నుంచి వెళ్లిన తరువాత వుగ్రవాదులది పైచేయి అయిందని రా మాజీ అధికారి వ్యాఖ్యానించారు. నాటి బిజెపి ప్రభుత్వం రాజీపడి మన జైళ్లలో వున్న ముగ్గురు వుగ్రవాదులను విడుదల చేసింది.

నినాదాలు చేయటం చట్ట ప్రకారం వ్యతిరేకం, అందుకు పాల్పడిన వారిని శిక్షించవచ్చు, కానీ కాశ్మీర్‌లో ప్రతిరోజూ అనేక కారణాలతో అక్కడి పౌరులు ఏదో ఒకచోట నిరసన తెలుపుతూ భారత వ్యతిరేక నినాదాలు చేస్తూనే వున్నారు. వారందరినీ దేశవ్యతిరేకులుగా పరిగణించి జైళ్లలో పెడితే సమస్య పరిష్కారం అవుతుందా ? లేదు కొందరు నినాదాలు చేసినంత మాత్రానే కాశ్మీర్‌ విడిపోయి వుంటే ఈ పాటికి అ పని ఎప్పుడో జరిగి వుండేది. కానీ బిజెపి అలాంటి వుదంతాలను సాకుగా చూపి నకిలీ దేశభక్తిని ప్రదర్శిస్తోంది. చరిత్రలోకి వెళ్లేట్లయితే అసలు కాశ్మీర్‌ భారత్‌లో విలీనం విషయంలో నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ తటపటాయింపులు, విలీనానికి ఒక దశలో విముఖత, దానికి నేటి బిజెపి, అంతకు ముందు జనసంఘరూపంలో వున్న, సంఘపరివార్‌కు చెందిన వారంతా రాజుకు మద్దతుగా విలీనానికి విముఖత తెలిపిన వారే అన్నది చరిత్రలో నమోదయ్యే వుంది. రాజుకు వ్యతిరేకంగా నాడు షేక్‌ అబ్దుల్లా పోరాడి కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు కారకుడయ్యాడు కనుకనే విలీనం తరువాత ప్రధానిగా షేక్‌ అబ్దుల్లాను నియమించమని నాటి రాజు హరిసింగ్‌ స్వయంగా బ్రిటీష్‌ ప్రభుత్వానికి రాశారు. నాడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, యువతలో నిరుద్యోగం, దారిద్య్రం వంటి కారణాలకు తోడు నిరంతరం పాకిస్ధాన్‌, అమెరికా తదితర సామ్రాజ్యవాదుల కుట్రకారణంగా కాశ్మీర్‌ వేరుపడి స్వతంత్ర రాజ్యం ఏర్పడాలనే భావనలు అక్కడ తలెత్తాయి. దానికి తోడు కాశ్మీర్‌కు రాజ్యాంగబద్దంగా కల్పించిన రక్షణలైన ఆర్టికల్‌ 370కు వ్యతిరేకంగా సంఘపరివార్‌ రాజకీయ రూపం ఎలా వున్నప్పటికీ నిరంతరం కాశ్మీరీయులకు వ్యతిరేకంగా ఏదో ఒక రూపంలో రెచ్చగొడుతూనే వున్న అపర దేశభక్తులు వారు. కాశ్మీర్‌లో తలెత్తిన వేర్పాటు వాద ధోరణులు, పాక్‌, అమెరికా సామ్రాజ్యవాదుల వుగ్రవాదుల కార్యకలాపాలను ఒకేగాటన గట్టిన కాంగ్రెస్‌, బిజెపి పాలకుల వైఖరి కారణంగా ఎవరు వేర్పాటు వాదో, ఎవరు వుగ్రవాదో తెలియని స్ధితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రెండుశక్తులను దగ్గరయ్యేట్లు చేశారు. అంతే కాదు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మిజోరాం, మణిపూర్‌,అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సోం, తదితర రాష్ట్రాలన్నింటా వేర్పాటు వాదశక్తులు తలెత్తి సాయుధ పోరాటాలను కూడా సాగించిన విషయంతెలిసిందే. ఆ రాష్ట్రాలలో వాటికి ప్రభావితులైన యువతరాన్ని దేశద్రోహులుగా పరిగణించి జైళ్లలో పెడితే ఈశాన్య ప్రాంతంలో పరిస్ధితులు వేరే విధంగా వుండేవి. అందువలన కొత్తబిచ్చగాడికి పంగనామాలెక్కువ అన్నట్లు అసలు ఏనాడూ దేశభక్తులుగా లేని సంఘపరివార్‌ శక్తులు ఈనాడు తాము చెప్పిందే దేశభక్తి దానికి భిన్నంగా వుండేవారందరూ దేశద్రోహులే అన్నట్లు మాట్లాడుతూ నానా యాగీ చేయటమే కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేసి అణచివేసేందుకు పూనుకుంది.

సంఘపరివార్‌ నాయకులలో ఒకరైన వీర సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి వారికి విధేయుడిగా పనిచేస్తానని 1914లోనే రాసిన లేఖ వారి దేశభక్తికి పెద్ద నిదర్శనం. దానికి అనుగుణంగానే తరువాత ఎక్కడా సంఘపరివారెవరూ స్వాతంత్య్ర వుద్యమంలో మనకు కనపడరు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి రాసిన లేఖ బయటపడగానే ఈ దేశభక్తులు కొత్త పల్లవి అందుకున్నారు. చరిత్రలో చాలా మంది ఒక ఎత్తుగడగా తమ శ త్రువులకు లొంగిపోయినట్లు లేఖలు రాసినట్లుగానే సావర్కర్‌ కూడా బ్రిటీష్‌ వారికి లేఖ రాసిన మాట నిజమే అని హాస్యాస్పదమైన ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్య్ర వుద్యమంలో ఈ కాషాయ దళం భాగస్వామి అయి వుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన గాడ్సే జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసి వుండేవాడు కాదు. గాంధీ హత్య జరిగిన రెండు దశాబ్దాల తరువాత సంఘపరివార్‌ అధికారిక పత్రిక ఆర్గనైజర్‌లో 1970 జనవరి 11 సంచిక సంపాదకీయంలో ఇలా రాశారు.’ పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూకు మద్దతుగా గాంధీజీ దీక్షకు దిగారు, ఈ క్రమంలోనే జనాగ్రహం స్వయంగా ఆయనపైకి మళ్లింది. కాబట్టే నాధూరామ్‌ గాడ్సే ‘ప్రజలకు’ ప్రాతినిధ్యం వహించాడు మరియు జనాగ్రహానికి స్పందన అన్నట్లుగా హత్యకు పాల్పడ్డాడు’ అని నిస్సిగ్గుగా గాడ్సేసు, గాంధీజీ హత్యను సమర్ధించారు.అంతకు ముందు 1961లో దీన దయాళ్‌ వుపాధ్యాయ ఇలా చెప్పారు.’ గాంధీజీపై అన్ని రకాల గౌరవభావంతో మనం ఆయనను జాతిపిత అని పిలవటం మానివేద్దాం. మనం జాతీయవాద పాత ప్రాతికను అర్ధం చేసుకుంటే అది హిందూయిజం తప్ప మరొకటి కాదని మనకు స్పష్టం అవుతుంది.’ అన్నారు. 1989 అక్టోబరు 17నాటి సంపాదకీయంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఇలా వ్యాఖ్యానించింది.’ శ్రీ అద్వానీ భారత మాతను ముందుకు తెస్తున్నారంటే ఇప్పటివరకు జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మాగాంధీని నిరాకరించటమే అవుతుంది’ అన్నది. గాడ్సేను కీర్తిస్తూ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు గోవాలో అధికారంలో వున్న బిజెపి నాయకుడు అంగీకరించటమే గాక, తాను అధ్యక్షుడిగా వున్న ప్రభుత్వానికి చెందిన రవీంద్ర భవన్‌ను వేదికగా కూడా ఇచ్చిన ఆ పెద్దమనిషి దేశభక్తుడు, దానిని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, తిమ్మినిబమ్మిని చేయటం అంటే ఇదే.ఈ లెక్కన బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏది చెబితే దాన్ని దేశ ప్రజలందరూ అంగీకరించాలి. అది హిందూయిజాన్ని జాతీయ వాదం అంటే అంగీకరించాలి, ఆ ప్రాతిపదికన దేశ భక్తులు ఎవరో ఎవరు కాదో నిర్ణయించేది వారే. వారి జాబితాలో వున్న గాడ్సే లాంటి వారందరూ దేశ భక్తులు, ఎవరైనా కాదంటే దేశద్రోహులు, కాదని గట్టిగా వాదిస్తే వారిపై దాడి చేసి ఒప్పిస్తారు. హైదరాబాదు కేంద్రీయ విద్యాలయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది కనుక మంత్రులతో వత్తిడి చేయించి ఐదుగురు అంబేద్కరిస్టు దళిత విద్యార్ధులపై చర్య తీసుకొనేట్లు వత్తిడి చేశారు. జెఎన్‌యులో డిఎస్‌యు సభకు అధికారులే షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు కనుక తమ చేతిలో వున్న పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించారు.అరెస్టయిన వారిని కోర్టులో ప్రవేశ పెట్టేందుకు తీసుకువస్తున్న సందర్భంగా చూసేందుకు వచ్చిన విద్యార్ధులు, అద్యాపకులు, వార్తలు సేకరించేందుకు వచ్చిన జర్నలిస్టులపై బిజెపి ఎంఎల్‌ఏ, న్యాయవాదులుగా వున్న పరివార్‌ కార్యకర్తలు దాడికి దిగారు. బిజెపికి మార్కు ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? దీన్ని నోర్మూసుకుని జనం అంగీకరించాలా ? మధ్య యుగాలలో శైవులు, వైష్ణవులు తమ మతాలను అనుసరించని వారిని, వ్యతిరేకించిన జైన, బౌద్ధ మతాలవారిని, చార్వాకులు, లోకాయతులపై భౌతికంగా దాడి చేసి హతమార్చారని, జైన, బౌద్ధ కేంద్రాలను వీర శైవమతస్దులు శివాలయాలుగా మార్చివేశారని చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు తిరిగి బిజెపి, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్నదానికి గతంలో జరిగినదానికీ పెద్ద తేడా కనిపించటం లేదు. జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ యూదులు, కమ్యూనిస్టులపై వ్యతిరేకతను రెచ్చగొడితే మన దేశంలో సంఘపరివార్‌ ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులపై జనాన్ని వుసిగొల్పుతున్నది.అలాంటి శక్తులకు ఐరోపాలో, ప్రపంచంలో ఇతర చోట్ల ఏమి జరిగిందో మరోసారి చెప్పాల్సిన పనిలేదు.

సంఘపరివార్‌ ఇలాంటి దాడులకు ఎందుకు పూనుకున్నది, విశ్వవిద్యాలయాలను అది వేదికగా ఎందుకు చేసుకున్నది అన్నది అనేక మందిలో నలుగుతున్న సందేహం. విశ్వవిద్యాలయాలెప్పుడూ పురోగామి కేంద్రాలు తప్ప తిరోగాములకు ఆలవాలం కాదు. ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రతి భావాన్ని వ్యక్తం చేసే విశాల ప్రజాస్వామిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. సహజంగానే అవి వివిధ వామపక్ష, ప్రజాస్వామిక భావజాల కేంద్రాలుగా వున్నాయి. సంఘపరివార్‌కు చెందిన అఖిలభారతీయ విద్యార్ధి పరిషత్‌ చరిత్రను వెనక్కు నడపాలని చూసే ఒక తిరోగామి శక్తి. సైద్ధాంతిక చర్చలో అది ప్రతి చోటా పాడిందే పాడరా అన్నట్లు సభ్య సమాజం ఎప్పుడో తిరస్కరించిన భావజాలాన్నే ముందుకు తెస్తోంది. సహజంగానే అది విద్యార్ధులలో తిరస్కరణకు గురి అవుతోంది. అందువలన వాటిని ఎలాగైనా తమ అదుపులోకి తెచ్చుకోవాలని, వాటిని కూడా మత కేంద్రాలుగా మార్చాలన్నది ఎప్పటి నుంచో వున్న దాని పధకం. ఇప్పుడు కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారంలో వుంది కనుక అధికారిక సంస్ధలన్నింటినీ తన భావజాలంతో వున్నవారు లేదా వారి కనుసన్నలలో నడిచే వారితో నింపుతోంది. పూనా ఫిలిం సంస్ధ వంటి ప్రఖ్యాత అకేంద్రానికి మహాభారత్‌ సీరియల్‌లో గుడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర ధరించటం మినహా మరొక అర్హతలేని చిన్న నటుడిని అధిపతిగా నియమించటాన్ని అక్కడి విద్యార్ధులు వ్యతిరేకించి నెలల తరబడి ఆందోళన జరిపినా పోలీసు బలప్రయోగంతో అణచివేసింది తప్ప ప్రజాభిప్రాయాన్ని మన్నించలేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఎంఎం కలుబర్గిని హిందూత్వ శక్తులు హత్య చేసిన కారణంగానే ఆ చర్యను ఖండించేందుకు అకాడమీ ముందుకు రాలేదన్నది తెలిసిందే. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలిగే వ్యక్తిని వైస్‌ఛాన్సలర్‌గా నియమించిన వెంటనే మంత్రులు వత్తిడి చేయటం తదనంతర పరిణామాలో వేముల రోహిత్‌ అనే దళిత విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. దానిలో కూడా అతడు దళితుడు కాదు, బిసి అని తప్పుడు ప్రచారం చేసి సమస్యను పక్కదారి పట్టించాలిని చూశారు. దళితుడు కాకపోతే బిసి అయినా ఒక విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడేట్లు చేయటం ఏమిటి ? అసలు సమస్య అతను దళితుడా, బిసి అని కాదు, సంఘపరివార్‌ భావజాలాన్ని వ్యతిరేకించాడు అందుకే అంతటి కక్షగట్టారు. ఇటువంటి సంఘపరివార్‌ వ్యతిరేక, వామపక్ష భావజాలానికి కేంద్రంగా వున్న ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనే తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకుంటే మిగతా విశ్వవిద్యాలయాలన్నీ తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవటం సులభం అని అక్కడ తమ పధకాన్ని అమలు జరుపుతున్నారు. అక్కడి పరిణామాలకు అదే మూలం. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దేశమంతటా వేర్పాటు వాదానికి వ్యతిరేక ప్రచారం పేరుతో జాతీయవాదాన్ని ప్రచారం చేయాలని బిజెపి పధకం వేసింది.

అన్నింటి కంటే కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఏలుబడికి ఇరవై నెలలు నిండింది. రూపాయి విలువ దగ్గర నుంచి ఎగుమతుల వరకు అన్ని రంగాలలో ప్రతికూల పరిస్ధితులు ముసురుకుంటున్నాయి.స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. నరేంద్రమోడీ వచ్చిననాటికి సూచీలు పతనమయ్యాయి. ధరలు తగ్గటం లేదు, అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమైనా పన్నులు విధిస్తూ స్ధానికంగా ధరలు తగ్గకుండా చూస్తున్నారు. కొత్తగా పరిశ్రమలు రావటం లేదు, వున్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. అంకెల్లో చెబుతున్న అభివృద్ధి అంతా వుపాధి రహితమే. వేతన కమిషన్‌ సిఫార్సులపై వుద్యోగులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. రైల్వే వంటి చోట్ల సమ్మె బ్యాలట్‌ తీసుకొనే వరకు వచ్చింది. మిగతా రంగాలలో కూడా ఆందోళనకు రంగం సిద్ధం అవుతోంది. స్వచ్ఛభారత్‌, మేకిన్‌ ఇండియా వంటి వన్నీ నినాదాలకే పరిమితం తప్ప మరొకటి కాదు. ఈ పూర్వరంగంలో ఒకవైపు సంఘపరివార్‌కు చెందిన భజరంగదళ్‌, విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్ధలు రామాలయ నిర్మాణ సమస్యను మరోసారి ముందుకు తెస్తున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి జనం దృష్టిని పక్కదారి పట్టించేవే. జెఎన్‌యు, ఇతర విశ్వవిద్యాలయాలలో రాజేసిన కాష్టం కూడా దానిలో భాగమే అంటే కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేనికీ ‘అసహనం’, ఎందుకా ‘సహనం ‘ ఓ మహాత్మా ! ఓ మహర్షీ !!

13 Saturday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

Intolerance, Reservations, Tolerance

 

ఎం కోటేశ్వరరావు

     ఇటీవలి కాలంలో సామాజిక మీడియాలో రిజర్వేషన్లు,సామాజిక వివక్షపై జరుగుతున్న చర్చలలో రెండు రకాల ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. భాష, భావం తీరుతెన్నులు చూస్తే వుభయులూ తీవ్ర స్ధాయిలోనే వున్నట్లు కనిపిస్తోంది. ఒకటి వేల సంవత్సరాల అణచివేత, అమానుష వివక్షపై ఎందుకీ సహనం అన్న ఆగ్రహంతో కూడిన జ్వాల. రెండవది దీనికి బాధ్యత తమది కానపుడు దాని పర్యవసానాలను తామెందుకు అనుభవించాలన్న ఆక్రోశం, దాని నుంచే దళితులు, గిరిజనులు, ఓబిసిలకు రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగిస్తారు అనే తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. పుట్టుక అన్నది యాదృచ్చికం. కానీ ఒక చోట పుట్టిన వారికి ఒక ముద్రవేసి ఒక విధంగానూ, మరొక చోట పుట్టిన వారికి మరో తోక తగిలించి వేరే విధంగా చూడటం అన్నది కాదనలేని వాస్తవం. రిజర్వేషన్ల వయస్సు ఏడు పదులు, మరి అమానుష వివక్ష, అణచివేత ఎంత కాలం నుంచి కొనసాగుతోంది, ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, చెప్పేవారెవరు ?

      రిజర్వేషన్ల గురించి రానున్న రోజుల్లో మరోసారి తీవ్ర చర్చకు తెరలేవ నుంది.ప్రయివేటు రంగంలో కూడా వుద్యోగాలలో రిజర్వేషన్‌ విధానాలను పాటించాలని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్‌సిబిసి) కేంద్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగంలో వున్న రిజర్వేషన్లనే తొలగించాలని తాము కోరుతుంటే ప్రయివేటు రంగంలో కూడా అమలు జరపాలని సిఫారసు చేయటం ఏమిటని రిజర్వేషన్‌ వ్యతిరేకులు మండిపడుతున్నారు. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల కారణంగా అప్పటి నుంచి క్రమంగా ప్రభుత్వరంగంలో పెట్టుబడులు నిలిచిపోయాయి. అటు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ కొత్త పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి రాలేదు. హెచ్‌ఎంటి, ఐడిపిఎల్‌ , భెల్‌ వంటి కొన్నింటిని ఒక పధకం ప్రకారం మూతపడేట్లు చేశారు. అవి పోగా వున్నవాటిలో యాంత్రీకరణ, పాక్షిక ప్రయివేటీకరణ వంటి చర్యల ద్వారా 2006 -12 మధ్య కాలంలో ప్రభుత్వ రంగంలో 3.3శాతం వుద్యోగాలు తగ్గిపోగా, ఇదే సమయంలో ప్రయివేటు రంగంలో 35.7శాతం పెరిగాయి. ప్రయివేటు రంగం అందరికీ గౌరవ ప్రదమైన జీవనానికి వుపాధి కల్పించి వుంటే అసలు ఈ రిజర్వేషన్ల అనుకూలం లేదా వ్యతిరేకత సమస్య తలెత్తి వుండేది కాదు. ఈనేపధ్యంలోనే ఈ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. దానికి అనుగుణ్యంగానే ఎన్‌సిబిసి సిఫారసు వెలువడింది. ఇప్పటికే ఈ డిమాండ్‌పై పలు చోట్ల ప్రచార ఆందోళన చేపట్టిన వామపక్షాలు, అవి పనిచేసే ప్రజాసంఘాలు సహజంగానే ఈ పరిణా న్ని హర్షిస్తాయి. తమ వుద్యమాలను మరో మెట్టు ముందుకు తీసుకుపోతాయి.

     ప్రస్తుతం అధికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారస్‌ను తిరస్కరిస్తుందా? ఆమోదిస్తుందా? ఆమోదిసే,్త అమలు జరుపుతుందా? ఎప్పటి నుంచి? ఎంత కాలం అమలు జరుపుతుంది వంటి అనేక ప్రశ్నలు ముందుకు వస్తాయి. ఇవన్నీ చర్చకు తెరలేపుతాయి. బిజెపి, కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె, అన్నాడిఎంకె వంటి ప్రాంతీయ పార్టీలన్నీ పాలకవర్గ పార్టీలే. అధికారంలో లేనపుడు సామాన్య జనం పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే వారిని మర్చిపోయి పెట్టుబడిదారులు, భూస్వాముల సేవలో తరిస్తూ వారి ప్రయోజనాలను కాపాడే వారిని పాలకవర్గ పార్టీలు అంటారు.మిగతావాటిలో సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు కొన్ని సందర్బాలలో అక్కడక్కడా అధికారానికి వచ్చినప్పటికీ వాటిని పాలకవర్గ పార్టీలుగా పరిగణించటం లేదు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో డెమోక్రటిక్‌, లేబర్‌, సోషలిస్టు పార్టీల పేరుతో వున్నవి కూడా ప్రతిపక్షంలో వుండగా ఏమి చెప్పినా సామాజికాంశాలలో తరతమ తేడాలు తప్ప ఆర్ధిక విషయాలలో మిగతా పార్టీలకు ఏమాత్రం తీసిపోవు కనుక వాటిని కూడా పాలకవర్గ పార్టీలే అంటున్నారు.

       ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల విషయానికి వస్తే ఎన్‌సిబిసి సిఫార్సును బిజెపి స్వాగతించింది. అయితే సాధ్వీ సావిత్రీ అదియును నీ పతిప్రాణంబు దక్క అని యముడు షరతు పెట్టినట్లు ఒక చిన్న మెలిక పెట్టింది. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు జరపటానికి అనువైన పరిస్ధితులు వచ్చినపుడు మాత్రమే అమలు జరపాలి తప్ప బలవంతంగా చేయకూడదు అని బిజెపి ప్రతినిధి విజయ్‌ సోంకార్‌ శాస్త్రి ముక్తాయింపు ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఏ ప్రభుత్వం ఈ దిశగా ఏమీ చేయలేదని కూడా విమర్శించారు. అమలుకు అనుకూలమైన పరిస్ధితులంటే ఏమిటో, అవి ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పలేదు. ప్రతి పక్ష కాంగ్రెస్‌ కూడా స్పందించింది.’ ఎల్లవేళలా సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు తాము చర్యలు తీసుకున్నామని,అందుకోసం ఎస్‌సి,ఎస్‌టి మరియు ఓబిసిల రిజర్వేషన్లు అమలు జరిపేందుకు తాము చట్టాలు తెచ్చామని, ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్ల గురించి తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నామని కాంగ్రెస్‌ గుర్తు చేసింది.

       ఈ సమస్యపై ప్రతిపక్షాలు దెబ్బలాటలకు కవ్వించే అవకాశం వున్నందున బిజెపి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ పార్టీ మేథావులు అప్పుడే ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.ఈ సవాలును తేలికగా తీసుకోవద్దంటూ రిజర్వేషన్ల ఫలాలు దిగువకు సక్రమంగా అందాల్సిన వారికి అందనందున వాటిని సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగత్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అయినా బీహార్‌ ఎన్నికలలో బిజెపి భారీ మూల్యం చెల్లించించిందని వారు గుర్తుకు తెచ్చారు. రాజ్యాంగం ఆర్టికల్‌ 16లో ప్రభుత్వరంగంలో రిజర్వేషన్ల గురించి మాత్రమే వుందని ప్రయివేటు రంగం గురించి ఏ కోశానా ప్రస్తావన లేదని, అయితే రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పని చేయవచ్చని, దీని వలన తాత్కాలికంగా బిజెపి రాజకీయ ప్రయోజనం పొందినప్పటికీ మండల్‌ తరహా ఘర్షణలు చోటు చేసుకోవచ్చని, ఓబిసిల తరువాత మతపరమైన మైనారిటీలు కూడా తమకూ అమలు జరపాలని కోరతారని, ఆర్ధిక వ్యవస్ధకు ఎంతో నష్టం కలిగిస్తుందని కాషాయ మేథావులు హెచ్చరిస్తున్నారు. యుపిఏ-2 హయాంలో పారిశ్రామికవేత్తలు బయటి దేశాలలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రాధాన్యత ఇవ్వటంతో పెట్టుబడులు బయటకు పోయాయని, ఇప్పుడు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే మేథావులు కూడా వలస పోతారని బెదిరిస్తున్నారు. సామాజికంగా వెనుక బడిన తరగతుల వారికి కావాలంటే వుచిత విద్య, విద్యా రుణాల సౌకర్యం వంటివి కలిగించాలని ఎంతో వుదారంగా సలహాలు ఇస్తున్నారు.

     ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు వుద్రేకాలను తగ్గించుకొని ఆలోచించటం అవసరం. సమాజంలోని మెజారిటీ ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసి సామాజిక తరగతుల శ్రమ స్వేదంతో సృష్టించబడేదే సంపద. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రమలో ఏ మాత్రం పాత్రలేని కొన్ని సామాజిక తరగతులు వునికిలో వుండటం మన సమాజ ప్రత్యేకత. దానికి కూడా తమకు అనుకూలమైన నియమనిబంధనలను రూపొందించారు. సామాజిక పరిణామ క్రమంలో వివిధ రూపాలలో అధికారిక వ్యవస్ధలు వునికిలోకి వచ్చాయి.అవి సమాజ పురోభివృకి ఆటంకంగా మారినపుడు వాటిని తొలగించి మెరుగైన కొత్త వ్యవస్ధలను ఏర్పాటు చేసుకుంది సమాజం. భూస్వామిక వ్యవస్ధ తమకు ఆటంకం అని భావించినపుడు ఐరోపా దేశాలలో పెట్టుబడిదారులు ఆ భూస్వామిక వ్యవస్ధను నామరూపాలు లేకుండా నాశనం చేశారు. ఫ్రెంచి విప్లవం అంటే అదే. అటువంటిది మన మన దేశంలో జరగలేదు. బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఆక్రమించి తమకు అవసరమైన కొన్ని పరిశ్ర మలను ప్రోత్సహించారు తప్ప మన దేశాన్ని తమకు అవసరమైన ముడిసరకులను అందచేసే దేశంగానే వుంచారు. అందుకే భూస్వాములతో రాజీపడి వారిని కూడా కొనసాగించారు. ఈ కారణంగానే ప్రస్తుతం మన దేశంలో పెట్టుబడిదారుల నాయకత్వంలో భూస్వాములు కూడా అధికార వ్యవస్ధలో పెత్తనం సాగిస్తున్నారు. ఇటువంటి ప్రత్యేక పరిస్ధితి ప్రపంచంలో మరోచోట కనపడదు.అందువలననే మన సమాజంలో కూడా భూస్వామిక, పెట్టుబడిదారీ లక్షణాలు రెండూ జంటగా కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రభావంతో కొన్ని అంశాలో పురోగామి వైఖరిని ప్రదర్శించేవారు మరికొన్ని విషయాలలో తిరోగామి భావజాలానికి లొంగిపోతున్నారు. సామాజిక వివక్ష చట్ట ప్రకారం నేరం అని అంగీకరిస్తూనే తమదాకా వచ్చేసరికి సాంప్రదాయం, ఎప్పటి నుంచో వుంది, ఆ మనోభావాలను కూడా మనం అంగీకరించాలి కదా అనే వాదనలతో చట్ట వ్యతిరేకమైన తాతగారి నాన్నగారి భావాలను ముందుకు పెడుతున్నారు. అది సమాజంలో ఘర్షణకు దారితీస్తోంది.

     ప్రయివేటు రంగ రిజర్వేషన్ల విషయంలో కూడా దీన్ని చూడవచ్చు. ప్రయివేటు రంగంలో ఏ చిన్న పరిశ్రమ పెట్టాలన్నా, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కావాలన్నా చేయాల్సింది ఎవరు ? ప్రభుత్వమే. పెట్టుబడి ఇవ్వాల్సింది ఎవరు ప్రభుత్వరంగంలోని బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలే. అంటే ప్రయివేటు రంగం గాలిపీల్చి మనుగడ సాగించాలంటే ప్రభుత్వం లేకుండా ఒక్క క్షణం నడవదు. ప్రభుత్వమంటే ప్రజలు తప్ప మరొకటి కాదు. అందువలన ప్రభుత్వ రంగం పాటిస్తున్న విధానాలను ప్రయివేటు రంగం అమలు జరపాలని కోరటం ప్రజల హక్కు తప్ప దయాదాక్షిణ్యం కాదు. ఎవరైనా తమకు అందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటే ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా తమ స్వంత పెట్టుబడులు, విద్యుత్‌, నీరు, భూమి, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను స్వంతంగా సమకూర్చుకోమనండి. అది సాధ్యం కాదు కనుకనే 2004 నవంబరు 18న దేశంలోని 218 అగ్రశ్రేణి సంస్ధలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సాధికారత కలిగించేందుకు మనసా వాచా కర్మణా తాము చేయాల్సిందంతా చేస్తామని రాతపూర్వంగా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివేదించాయి. అంటే అర్ధం ఏమిటి స్వచ్చందంగా ఆ తరగతుల వారికి తగు స్ధానం కల్పిస్తామని చెప్పటమే కదా? ఆ వాగ్దానాన్ని ఎన్ని సంస్ధలు ఎంత మేరకు అమలు జరిపాయి? రాజ్యాంగంలో హక్కులు కాకుండా ఆదేశిక సూత్రాల పేరుతో అనేక పురోగామి భావాలను అమలు జరపాలని చెప్పారు. కానీ వాటిని హక్కుగా అమలు జరిపే పరిస్ధితి ఇంకా మనకు రాలేదనే పేరుతో మన పాలకులు ఎగవేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటా ఐదారు లక్షల కోట్ల రూపాయలను రాయితీలుగా ఇస్తున్న ప్రభుత్వాలు స్కూళ్లలో పిల్లలకు అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు కట్టించాలంటే డబ్బు లేదంటూ ఇంతకాలం వాయిదా వేశాయా లేదా ? కనుకనే ప్రయివేటు రంగంలో వుద్యోగాల రిజర్వేషన్లు చట్టబద్దంగా అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.

     రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు జరపాల్సింది పది సంవత్సరాలే కదా, అయినా డెబ్బయి సంవత్సరాలుగా అమలు జరుపుతున్నారు, ఇంకా ఎంతకాలం ఇలా అని అనేక మంది ‘అసహనం’ వ్యక్తం చేస్తున్నారు. నిజమే దానిని అర్ధం చేసుకోవాల్సిందే, మనది ప్రజాస్వామ్యం కనుక ఆ భావాల వ్యక్తీకరణను ‘సహించాల్సిందే’, ఎలాంటి మినహాయింపులు లేవు. ఎలాంటి చట్టాలు లేకుండానే వేల సంవత్సరాల పాటు కుల వివక్ష, అణచివేతను సమాజం అమలు జరిపింది. చట్టబద్దంగా రద్దు చేసిన తరువాత కూడా అమలు జరిపేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. దళితులు దేవాలయ ప్రవేశ ం చేస్తే అవి మలిన పడ్డాయనే పేరుతో శుద్ధి చేయటం నేరం. దానికి ఎవరినైనా ఇంతవరకు శిక్షించారా ? వివక్షను ఇంకా రూపు మాపలేదెందుకన్న ‘అసహనం’ ఎందుకు వ్యక్తం చేయరు? అసలు రిజర్వేషన్లకు మూలం ఆ సామాజిక వివక్షే కదా ? దాన్ని నిర్మూలించకుండా దాని పర్యవసానాలను వ్యతిరేకించటం, అసహనం వ్యక్తం చేస్తే ప్రయోజనం వుంటుందా ?

     కుల వివక్షకు వ్యతిరేకంగా ఆరువందల సంవత్సరాల నాడే వేమనతో ప్రారంభించి అంబేద్కర్‌ వరకు ఎందరో సంస్కర్తలు తమ పరిధులు, పద్దతులలో వాటిని నిరసించి వ్యతిరేకించారే మరి సమాజం మొత్తంగా దానిని ఎందుకు నిరసించటంలేదు? ఎక్కడైనా వ్యతిరేకిస్తే సామూహిక దాడులకు పాల్పడటాన్ని ఏమనాలి? ఎక్కడో దక్షిణాఫ్రికాలో, అమెరికాలో నల్లజాతీయుల పట్ల వివక్షను ఖండించే మనం మన చుట్టుపక్కల మానవత్వానికే మాయని మచ్చగా వున్న వివక్ష పట్ల ఎక్కడలేని ‘సహనం ‘ ఎందుకు వహిస్తున్నట్లు? ఆ వివక్షను ఎదుర్కొనే వారి ఆక్రోశానికి ఎవరు సమాధానం చెబుతారు ?

     ఏదేశంలోనూ లేని రిజర్వేషన్లు మన దేశంలోనే ఎందుకు అని ప్రశ్నించే వారు ఎక్కడా లేని వివక్ష, కుల వ్యవస్ధ ఇక్కడ ఎందుకో చెప్పాల్సిన అవసరం లేదా ? అదంతా పూర్వజన్మ సుకృతం ఎవరు ఎంత చేసుకుంటే అంత అనుభవించాలి అని చెబుతారా ? అయితే రిజర్వేషన్లు కూడా అలాంటివే అనుకోవాలి. వేదాలలోనే విజ్ఞానం అంతా నిక్షిప్తమై వుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. తిరోగమన శక్తులు అధికార కేంద్రాలలో తిష్టవేయటంతో ఇటీవలి కాలంలో మరోసారి చెప్పటం ఎక్కువైంది. అదెంత నిజమో ? వాస్తవాలేమిటో కాసేపు పక్కన పెడదాం. ఆ వేదాలను బ్రహ్మ ముఖంలోంచి పుట్టుకు వచ్చారని చెప్పుకొనే బ్రాహ్మణులు మాత్రమే చదవాలని,చెప్పాలన్న రిజర్వేషన్లు అవి పుట్టినప్పటి నుంచి కొనసాగుతున్నాయి కదా ? బ్రాహ్మణులు తప్ప వేరే కులాల వారు చదవకూడదన్న నిషేధం ఇప్పటికీ కొనసాగుతున్నదా లేదా ? వేదాలు, పురాణాలలో చెప్పినట్లు బ్రాహ్మణులు తిరిపెమొత్తుకుని తినాలి తప్ప వుద్యోగాలు చేయకూడదనే నిషేధాలు ఇప్పుడు లేవే ? రిజర్వేషన్లు కూడా జనాభా ప్రాతిపదికగా దామాషా పద్దతి ప్రకారం అమలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదే. వేద పఠనంపై కొనసాగిన రిజర్వేషన్లతో పోల్చితే నేటి వుద్యోగ, విద్యా రిజర్వేషన్ల వ్యవధి ఎంత ? అన్నింటినీ మన ఖర్మ అనుకొని సహిస్తున్నవారు రిజర్వేషన్ల విషయంలో కూడా అలా అనుకోకుండా వ్యతిరేకంగా వీధులకు ఎందుకు ఎక్కుతున్నట్లు ? హింసాకాండకు ఎందుకు పాల్పడుతున్నట్లు ?

    సామాజిక అంశాలలో కొనసాగుతున్న వివక్ష గురించి ఎక్కడలేని ‘సహనం’ వ్యక్తం అవుతోంది. రిజర్వేషన్లపై వెల్లడిస్తున్న వ్యతిరేకత, ఇతర సామాజిక వివక్షపై వ్యక్తం చేయటం లేదంటే అర్ధం దాన్ని సహిస్తున్నట్లే. సమాజంలో ఈ వైఖరి కొనసాగినంత కాలం ఏదో ఒక రూపంలో దాని పర్యవసానాలు సంభవిస్తూనే వుంటాయి. రిజర్వేషన్లు కొనసాగుతూనే వుంటాయి. అయితే రిజర్వేషన్లే అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు ఆశించిన మేలు చేకూర్చలేవని కూడా ఈ కాలంలో రుజువైంది. అందువలన పరిమితంగా వున్న అవకాశాలను చేజిక్కించుకొనేందుకు కొట్లాడుకోవటం కాకుండా అందరికీ అన్ని అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ విధానాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం లేదా ? ఆలోచించండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

హైదరాబాద్‌ ఎన్నికల ఫలితాలు-పార్టీలపై పర్యవసానాలు

06 Saturday Feb 2016

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

BJP, Congress, GHMC, HYDERABAD, tdp, trs

ఎంకెఆర్‌

     ఈనెల రెండున జరిగిన హైదరాబాదు మహానగర పాలక సంస్ధ ఎన్నికలు అటు ఘన విజయం సాధించిన అధికార పార్టీని, ఇటు ఘోరపరాజయం పాలైన తెలుగుదేశం-బిజెపి కూటమి, కాంగ్రెస్‌ను ఆశ్చర్యంలో ముంచాయంటే అతిశయోక్తి కాదు. మూడు జిల్లాల పరిధిలోని 150 వార్డులకు గాను తెలంగాణా రాష్ట్రసమితి 99,  కాంగ్రెస్‌ మెదక్‌ జిల్లాలోని పటాన్‌చెరు, రంగారెడ్డి జిల్లాలోని నాచారం స్ధానంతో సరిపెట్టుకొని హైదరాబాదు జిల్లాలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక అసలైన పరాజయం గౌరవ ప్రద స్ధానంలో వుంటామని కలలు కన్న తెలుగుదేశం-బిజెపి కూటమిది. తెలుగు దేశం పార్టీ రంగారెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్టు స్థానాన్ని గెలుచుకొని ఎట్టకేలకు ప్రాతినిధ్యం సాధించింది, బిజెపి నాలుగు స్ధానాలు తెచ్చుకుంది.మజ్లీస్ 44 తెచ్చుకుంది

    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర రాజధాని స్ధానిక ఎన్నికలలో పాల్గొనటం, ఘోరంగా ఓడిపోవటం మన దేశ చరిత్రలో బహుశా ఇదే మొదటిసారేమో.ఆ ఖ్యాతి ఎన్‌ చంద్రబాబు నాయుడికి దక్కింది. మరొకరెవరూ ఇలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా హెచ్చరికలు చేసింది. హైదరాబాదు ఎన్నికలలో తాము 99 స్ధానాలను గెలుచుకుంటామని అసలు తెలంగణా రాష్ట్ర సమితికే నమ్మకం లేదు.వుంటే ముందు జాగ్రత్త చర్యగా కార్యనిర్వాహక అధికారాల ద్వారా చట్ట సవరణ చేసి ఎంఎల్‌సీల ఓట్లతో గద్దె నెక్కాలని చూసేది కాదు. దానిని కొట్టివేస్తామని కోర్టు సూచన ప్రాయంగా చెప్పటంతో ఎన్నికలు జరిగి-ఫలితాలు వెలువడే మధ్యలో ఒక అసాధారణ ఆర్డినెన్సు ద్వారా చట్ట సవరణ తెచ్చి విమర్శలకు తావిచ్చింది. అయితే ఎంఎల్‌సి దొడ్డిదారితో నిమిత్తం లేకుండానే అప్పటికే ఓటర్లు తమ నిర్ణయాన్ని తీసుకున్నారని అది వూహించలేకపోయింది. ఏ మాత్రం పసిగట్టినా అపర ప్రజాస్వామికంగా వుండేది.

    విజయం సాధించింది కనుక చంద్రశేఖరరావు కోర్టు అభిప్రాయాన్ని మన్నించినట్లు ఆ ఆర్డినెన్సుకు కొత్త భాష్యం చెప్పారు. అంత మాత్రాన దానివెనుక వున్న దురాలోచన దాస్తే దాగేది కాదు. ఈ విజయం తెలంగాణా రాష్ట్రసమితిలో కొత్త పరిణామాలకు నాంది పలుకుతుంది. హైదరాబాద్‌ ఎన్నికలను చంద్రశేఖరరావు తనయుడు, మంత్రి కెటిఆర్‌ ఒక్కడే తన బాధ్యతగా ఎదుర్కొన్నారు. అదేదో యాదృచ్పికంగా జరిగిందంటే ఎవరూ నమ్మరు. ఎన్నికల స్క్రిప్టు, డైలాగులు, డైరెక్షన్‌ అంతా కెసిఆర్‌ వారసుడు ఎవరో స్పష్టం చేసేందుకే అన్నది సుస్పష్టం.ఈ విజయంతో తెరాసలో మిగిలిన మంత్రులు, ఇతరులు మరింతగా డమ్మీలుగా మారతారు. అధికారం మరింతగా కుటుంబపరంగా కేంద్రీకృతం అవుతుంది. అది వచ్చే ఎన్నికల నాటికి కొత్త సమస్యలకు నాంది పలుకుతుంది. అన్ని పాలక రాజకీయ పార్టీలలో జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేది ఇదే.

    ఒక వూరి మునసబు పక్క వూరికి వెట్టితో సమానం అన్నది ఒక సామెత.దీనిని వినయంతో ఎవరైనా గుర్తిస్తే పరువు నిలబడుతుంది. లేకుంటే చంద్రబాబు నాయుడి మాదిరి శృంగభంగం తప్పదు.కోటి మంది జనాభా వున్న హైదరాబాదు ఎన్నికలకు ప్రాధాన్యత లేదని ఎవరూ అనరు. స్వంత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే ప్రచారానికి దిగకుండా ఒక బహిరంగ సభ పెట్టి గౌరవ ప్రదంగా వ్యవహరించారు. ఒక వేళ ఓడిపోతే, తగినన్ని సీట్లు రాకపోతే ముఖ్యమంత్రి ప్రచారానికి వెళ్లినా ఓడిపోయారంటారు. లేకపోతే సిఎం వచ్చి వుంటే విజయం దక్కేది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద విజయం లేదా ఓటమిపై సంశయం కారణంగానే కెసిఆర్‌ ఈ విధంగా ప్రచారానికి దూరంగా వున్నారు. తన కొడుకును దించారు. ఓడిపోయినా ఇబ్బంది లేదు, గెలిస్తే చెప్పక్కర లేదు. కానీ మిగతావారి పరిస్ధితి అది కాదు.

   పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకంటే తెలుగుదేశంలో పలుకుబడిన నాయకుడిగా చక్రంతిప్పుతున్నారని కొందరంటే, రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నారని కొందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కుమారుడు నారా లోకేష్‌, కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ తరువాత అంతటి పలుకుబడి కలిగిన మోడీ అంతరంగికులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు వంటి వారు ప్రచారం చేసినా , తమ కూటమి వారిని గెలిపించకపోతే కేంద్రం నుంచి నిధులు రావని బెదిరించినా పరాభవమే మిగిలింది. వారు చేసిన ప్రచారం ఓటర్లలో ఎంత వుత్సాహం నింపిందంటే తాము ఓటు వేయకపోయినా సరే తెలుగుదేశం-బిజెపి కూటమి విజయం సాధిస్తుందనే విశ్వాసంతో కాబోలు అసలు ఓటింగ్‌కే రాలేదు. కొన్ని పరిణామాలు మరికొన్నింటిని వేగవంతం చేస్తాయి. ఎక్కడో స్విచ్‌ వేస్తే ఎక్కడో లైటు వెలుగుతుంది.ఎన్నడూ ఓటింగ్‌కు రాని వారు కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో పనిగట్టుకొని వచ్చి హైదరాబాదులోని కొన్ని ప్రాంతాలలో తెరాసకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. నగరం మరింతగా విస్తరిస్తోంది. పరిశ్రమలు పెరగటం లేదు,మూతపడుతున్నాయి, కొత్తగా వచ్చే వాటిలో వుపాధి తక్కువగా వుంటోంది. అసమానతలు తీవ్ర మౌతున్నాయి.నగరంలో పారిశుధ్యం, కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్య రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా కానుంది.వాటిని పరిష్కరించకుండా ఎక్కువ కాలం గడపలేరు.

     గతంతో పోలిస్తే తాను మారానని చెబుతూ చంద్రబాబు నాయుడు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదే పదే జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించారు. ఆయనలో ఎలాంటి మార్పూ లేదని ఎన్నికైన తరువాత ప్రతి చర్య ద్వారా జనాలలో గట్టి విశ్వాసం కల్పించేందుకు ఎలాంటి లోపం లేకుండా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిలో హైదరాబాడు నగర ఎన్నికలలో తెలుగుదేశం, దానితో జతకట్టిన బిజెపి ఓడిపోవటం పార్టీల కన్నా చంద్రబాబు నాయుడికి వ్యక్తిగతంగా కలిగిన ఘోరపరాభంగానే పరిగణించాలి. తాను అభివృద్ధి చేశానని చెప్పుకున్న హైదరాబాదు నగరం తన పార్టీకి ఒక్కటంటే ఒక్కటే కార్పారేటర్‌ సీటు కట్టబెట్టిందంటే ఆయన చెప్పింది అవాస్తవమైనా అయి వుండాలి లేదా చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోకను బట్టి గోదావరిని ఈదినట్లే అని జనం నిర్ధారణకు వచ్చి వుండాలి. చంద్రబాబు నాయుడు తనను తానే నమ్మడని ప్రతీతి. అందుకని ఇతరులను నమ్మే పరిస్ధితి వుండదు. అలాంటి వ్యక్తి ఎండమావులను కూడా సునామీ వరదలని నమ్మించగల దిట్ట కావటం వలనే ప్రతి తరంలో ఎంతో కొంత మంది అపరచాణుక్యుడని నమ్ముతూ వుంటారు. మాటల ద్వారా మూతులు, డబ్బుతో చేతులు కాల్చుకుంటారు. ఇప్పుడు హైదరాబాదులో అదే జరిగింది.

     తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ దుకాణం మూతపడటం గత ఎన్నికల మరుసటి రోజునుంచే ప్రారంభమైంది. అయినా అవకాశం లేని వారు, అనివార్యంగా ప్రతిపక్షంలో వుండాల్సిన వారు లేదా చంద్రబాబు చాణక్యం మీద అతి విశ్వాసం వున్నవారు గానీ మొత్తం మీద పార్టీలో మిగిలారు. ఇప్పుడు మిగిలిన పార్టీ కూడా ఎంత త్వరగా అంతరిస్తుందన్నదే సమస్య. దేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ ఒకటికి మించి రెండు రాష్ట్రాలలో కొనసాగిన దాఖలా మనకు ఎక్కడా కనపడదు. బీహార్‌, వుత్తర ప్రదేశ్‌లను చీల్చి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన తరువాత సమాజవాది పార్టీ యుపికి, ఆర్‌జెడి బీహార్‌కు పరిమితం అయ్యాయి తప్ప రెండోచోట లేవు. తెలుగుదేశం పార్టీ అందుకు మినహాయింపు అనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి వుండదు. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాదులో తెలుగుదేశం పార్టీకి ఇంతటి పరాభవం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌లోని వారు అసలు వూహించి వుండరు. ఎందుకంటే చంద్రబాబు మంత్రదండంపై నమ్మకం వున్నవారు ఇంకా గణనీయంగా వున్నారు. వారి సంఖ్యను హైదరాబాద్‌ ఎన్నికలు గణనీయంగా తగ్గిస్తాయి.

    హైదరాబాదు ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోతే చంద్రబాబు నాయుడికి పోయేదేమీ లేదు, తీరని నష్టం బిజెపికి. మతోన్మాద అజెండా లేకుండా అది మనుగడ సాగించలేదు. ప్రస్తుతం హైదరాబాదులో అటువంటి పరిస్ధితులు లేవు. తెలుగుదేశం వంటి పార్టీతో అది సర్దుబాటు చేసుకోవాలంటే తాత్కాలికంగా అయినా అది మేకతోలు కప్పుకోవాలి. స్వంత ఎజండా మతోన్మాదాన్ని రెచ్చగొట్టటాన్ని నిరంతరం కొనసాగిస్తున్నది కనుక, ప్రతి ఎన్నికలో అది ఏదో ఒక పార్టీతో లోపాయికారీ వప్పందాలకు వస్తుండటంతో మజ్లిస్‌ తన స్ధానాన్ని నిలబెట్టుకోగలుగుతున్నది. తెరాస స్వంతంగా మెజారిటీ తెచ్చుకున్నది కనుక మజ్లిస్‌ అప్రజాస్వామిక పోకడలను అడ్డుకొని హైదరాబాదు పాతబస్తీలో మార్పులకు శ్రీకారం చుడితే దానిని రాజకీయంగా వ్యతిరేకించేవారు కూడా హర్షిస్తారు.లేనట్లయితే మజ్లిస్‌ను చూపి బిజెపి, బిజెపిని చూపి మజ్లిస్‌ మత రాజకీయాలు చేస్తాయి. అది తెరాసకు రాజకీయంగా నష్టదాయకమే గాక, తెలంగాణాకు పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుంది.

     కాంగ్రెస్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాని అవకాశ వాదానికి అటు వుమ్మడి రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్‌ జనమూ వ్యతిరేకించారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకున్న చోటా అదే పరిస్ధితి కల్పించారు. వామపక్షాల విషయానికి వస్తే గతంలో వాటికి వున్నదీ లేదు ఇప్పుడు పోగొట్టుకున్నదీ లేదు. తమ నుంచి తమ జనం చేజారి పోయిన చోటే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాయి గనుక తిరిగి ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనటానికి ఎలాంటి పద్దతులు అనుసరిస్తాయన్నది చూడాల్సి వుంది

Share this:

  • Tweet
  • More
Like Loading...

మిత్రులెవరు? శత్రువులెవరు?

29 Friday Jan 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Readers News Service, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, CPI(M), Dalit, discrimination against dalits india, Rohith Vemula, Vemula Rohit

– వి. శ్రీనివాసరావు

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయ రీసెర్చి స్కాలర్‌ వేముల రోహిత్‌ చక్రవర్తి బలవన్మరణంపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగు తోంది. మూడేళ్ళ క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన దేశ వ్యాప్త నిరసనోద్యమం తర్వాత అంత కన్నా తీవ్రస్థాయిలో జరుగుతున్న ఉద్యమమిది. అప్పటి ప్రభుత్వం చేతులు కాలాక ఆలస్యం గానైనా కొన్ని చర్యలు తీసుకోక తప్పలేదు. కానీ నేటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. దళితోద్ధరణ కోసమే తాను జన్మించినట్లుగా మాటల గారడీతో నమ్మ బలుకుతున్నట్లు నటించే ప్రధాని ఐదు రోజుల మౌనం తర్వాత దీనిపై బలవంతంగా నోరు తెరిచినా చేతల్లో మాత్రం ఏ చొరవా చూపలేదు. పైగా లక్నో సభలో రోహిత్‌ ఘటనపై ప్రధాని స్పందించాలని నిలదీసిన ముగ్గురు దళిత విద్యార్థులను కూడా హాస్టల్‌ ఖాళీ చేయించి ఇంటికి పంపా రు. ముంబాయిలో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై ఆర్‌యస్‌యస్‌ మూక అడ్డంగా దాడి చేసి అనేక మందిని కిరాతకంగా గాయపరిచారు. ఈ దేశంలో న్యాయం చేయక పోయినా, కనీసం న్యాయం చేయమని అడిగే హక్కు కూడా లేదా? ఇలా నోళ్లు కుట్టేస్తారా? ప్రశ్నించేవారిని వేధిస్తారా? ఒక ప్రజాస్వామిక దేశంలో ఫాసిస్టు ప్రభుత్వమా?
రోహిత్‌ బలవన్మరణానికి కారకుడైన వైస్‌-ఛాన్సలర్‌ పొదెల అప్పారావుపై ఇంతవరకు ఎలాంటి చర్యా తీసుకో లేదు. ఆయనపై ఎఫ్‌ఆర్‌ఐ నమోదైనా కనీసం అరెస్టు చేయలేదు. పేరుకు సెలవులో ఉన్నా పదవిలోనే కొనసాగు తున్నాడు. అంతకన్నా దుర్మార్గం అతని స్థానంలో తాత్కాలిక విసిగా ఈ ఘటనకు కారకులైన మరొక శిఖండిని నియమిం చడం. ఇది విద్యార్థులను రెచ్చగొట్టడం కాక మరేమవు తుంది? నిందితులపై చర్య తీసుకోవాల్సిన పోలీసులు వారిని కనీసం విచారించను కూడా విచారించలేదు. తద్విరు ద్ధంగా రోహిత్‌ కుటుంబ చరిత్రను తొవ్వడానికి నానా యాతనలు పడుతున్నారు. అవసరం లేని విషయాల్లో తలదూర్చి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రోహిత్‌, నిర్భయ ఘటనల్లో సారూప్యతలు న్నాయి. నాడు కూడా జరిగిన దుర్మార్గాన్ని పట్టించుకోకుండా నిర్భయ శీలాన్ని శంకించే ప్రకటనలు చేశారు. నాడూ ఇలాగే మనువాదానికి ప్రాతినిధ్యం వహించే ఫ్యూడల్‌ ఛాందస శక్తులు ఆడపిల్లల వస్త్రధారణ గురించి, రాత్రిపూట అబ్బాయి లతో కలిసి సంచరించడంపై సందేహాలు లేవనెత్తారు. అవే శక్తులు ఇప్పుడు రోహిత్‌ కులాన్ని, వామపక్షాల నిజాయితీని శంకిస్తున్నాయి. రోహిత్‌ బతికున్నంత వరకు వేపుకు తిన్నారు. అడుగడుగునా కులవివక్షను ప్రదర్శించారు. ఆఖరికి చనిపోయాక కూడా వదల్లేదు. తనను తాను అంతం చేసుకోవడం ద్వారా ఈ కులరాక్షసి కబంద హస్తాల నుంచి బయట పడాలనుకున్నాడు. కానీ రోహిత్‌ ఆత్మను కూడా వారు వదలదలచుకోలేదు. నీదే కులం అంటూ వెంటాడి పీడిస్తూనే ఉంది. రోహిత్‌ తల్లి రాధిక అతను చనిపోయిన నాటి నుంచి గుండెలవిసిపోయేలా కన్నీళ్ల పర్యంతమవు తూనే ఉంది. కానీ పాలకుల గుండెలు మాత్రం కరగడం లేదు. కేంద్రం గద్దెపై కూర్చున్న పాలకులను ”మను”వ్యాధి పీడిస్తోంది. దెబ్బకు దెయ్యం వదులుతుంది అన్నట్లుగా మనువ్యాధి పీడితులకు పోరాటమే చికిత్స. అదే నేడు విద్యార్థులు ఐకమత్యంతో చేస్తున్న పోరాటం.
ఘటన జరిగిన రోజు నుంచే దీన్ని దళిత-దళితేతర సమస్యగా చిత్రీకరించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ పేరుతో అగ్రకులాలను తమ వైపు తిప్పుకోవాలన్న దుర్బుద్ధి వారిలో కనిపిస్తుంది. కానీ వారి ఆశలను అడియాసలు చేస్తూ కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా విద్యార్థులంతా ఏకమై ఆందోళన చేస్తు న్నారు. తోటి విద్యార్థికి జరిగిన అన్యాయం మరొకరికి జరగ కూడదన్న పట్టుదలతో వారున్నారు. సెమిస్టర్‌ కొద్దిరోజుల్లో ముగియనుండగా తమ చదువులను సైతం లెక్క చేయ కుండా క్లాసులను బహిష్కరించి, విశ్వవిద్యాలయ పాలక వర్గాన్ని నిలదీస్తున్నారు. ఐదుగురు దళిత విద్యార్థుల ”సామాజిక బహిష్కరణ”కు విరుగుడే ఈ తరగతుల సమైక్య బహిష్కరణ. తెరవెనుక నుంచి ఎబివిపి ద్వారా విద్యార్థుల్లో చీలికలు పెట్టడానికి నానా యాతన పడుతున్నాయి బిజెపి, ఆర్‌యస్‌యస్‌లు. విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులే కాదు బయట కూడా దళిత సంఘాలతో పాటు అనేక ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రగతిశీలురు గళం విప్పి వారికి అండగా నిలబడుతున్నారు. ఇదొక సమై క్యతా శంఖారావం. దీన్ని కులం పరిధిలో ఇరికించి బలహీన పరచాలనుకునే వారి కుట్రలు సాగవని విద్యార్థిలోకం నిరూపిస్తోంది.
రాజకీయ శక్తులు జొరబడి ఉద్యమాన్ని రాజకీయం చేస్తున్నాయని బిజెపి మరొక అస్త్రాన్ని బయటకు తీసింది. అసలు ఈ సమస్యంతా బిజెపి రాజకీయ జోక్యంతోనే మొదలైంది. కన్నంలో దొరికిన దొంగలా ఉంది బిజెపి పరిస్థితి. ఆఖరికి దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా ఇతరులు రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఇరు వర్గాలకు చెందిన విద్యార్థుల గొడవను రాజకీయం చేసింది బిజెపి. క్యాంపస్‌లో జొరబడి ఈ ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్‌ చేసేదాకా వదల్లేదు. బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తమ అనుచరుల్ని వెంటేసుకొని వైస్‌ ఛాన్సలర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వాస్తవాలేమిటో తెలుసుకోకుండానే వారిని జాతి వ్యతిరేకులంటూ ముద్ర వేశారు. కేంద్రమంత్రి ఇరానీ చర్య తీసుకునేదాకా వదల కుండా ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు. ఇదంతా వారి రాజకీయ జోక్యాన్నే తెలియచేస్తున్నది. ఆఖరికి అదే తమకు ఎదురు తిరిగేసరికి ఎవరో రాజకీయం చేస్తున్నారంటూ కాకిగోల చేస్తున్నారు.
పనిలో పనిగా తమ కొమ్ముకాసే కొందరు దళిత మేధావులు, సంఘాలను ఉపయోగించుకొని ఉద్యమంపై నీచమైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి కొండంత అండగా నిలబడ్డ వామపక్షాలపై వారి దాడి ఎక్కుపెడుతున్నారు. నానా రకాల ఆరోపణలు చేసి వామ పక్షాలను అప్రతిష్టపాలు చేయాలన్న దుష్టతలంపుతో వ్యవహరిస్తున్నారు. సోషల్‌మీడియాలో ఆర్‌యస్‌యస్‌ నెట్‌వర్క్‌ ద్వారా రకరకాల ఆకాశరామన్న పేర్లతో వామపక్షా లపై విషం కక్కుతున్నారు. తెలిసో తెలియకో కొందరు ఈ వలలో పడిపోతున్నారు. వామపక్షాలు, విద్యార్థిసంఘాలు, దళితసంఘాలు కలసికట్టుగా వ్యవహరించడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఐక్యతను దెబ్బ తీయడానికే వామపక్షాలను కేంద్రంగా చేసుకొని కాలం చెల్లిన విమర్శనాస్త్రాలను తిరిగి తమ అంబులపొది నుంచి బయటకు తీసి సంధిస్తున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వామపక్షాల్లో ప్రత్యేకించి సిపియంలో అగ్రకులాలదే పెత్తనమని, దళితులు నాయకత్వస్థానాల్లో లేరని, అలాంటి వారు రోహిత్‌ సమస్యను ఆసరా చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ అరిగిపోయిన రికార్డులే. గతంలో పట్టించుకోవడం లేదని విమర్శించిన వారే ఇప్పుడు పట్టించుకుంటున్నందుకు అభినందించాల్సింది పోయి విమర్శలెందుకు చేస్తున్నారు? ఇది ఎవరికి ఉపయోగం? ఎవరిని సంతృప్తి పర్చడానికి ఈ అబద్ధాలు వల్లిస్తున్నారు? ఇలాంటి చర్చ సమస్య పరిష్కారానికి తోడ్పడుతుందా? లేక ఉద్యమాన్ని బలహీనపర్చడానికి ఉపయోగపడుతుందా? అలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోహిత్‌, తదితరుల మీద చర్య తీసుకున్నప్పుడు ఎస్‌ఎఫ్‌ఐ ఎక్కడ ఉంది అంటూ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వ్యాసం రాస్తూ అడిగాడు. అతనెక్కడున్నాడో ముందు చెప్పాలి? తన పదవి కోసం బిజెపికి దళిత ఉద్యమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం? ఆయనొకప్పుడు ఏం చేశాడనేది కాదు ఇప్పుడెక్కడున్నాడనేది ముఖ్యం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిపి దళిత సమస్యను చర్చించాలని దళిత శోషిత్‌ ముక్తిమంచ్‌ (డిఎస్‌యంయం) డిమాండు చేస్తూ పార్లమెంటు సభ్యులకు విన్నపం చేసుకోడానికి ఢిల్లీలో ఆయన ఇంటికి వెళ్లిన కార్యకర్తలను బూతులు తిట్టి పంపాడు. అదీ ఆయన నైజం. దీనిపై ఢిల్లీలో నిరసన కూడా వ్యక్తమైంది. ఇలాంటివారే మరికొంత మంది వామపక్షాలపై విరుచుకుపడుతున్నారు. రోహిత్‌ ఆత్మహత్యపై తక్షణమే స్పందించి ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టినందుకే వారికి కంటగింపుగా ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన ప్పుడు చురుగ్గా ఉండే కొంతమంది నాయకులు ఈసారి కనుమరుగయ్యారు. అలాంటి వారికి కూడా వామపక్షాల చొరవ నచ్చడం లేదు. ఏది ఏమైనా వామపక్షాలు తాము నమ్మిన మార్గాన్ని వదిలిపెట్టవు. దళితులు, దళిత ఉద్యమాలు వామపక్ష ఉద్యమ స్రవంతిలో అంతర్భాగం. వారిని విడదీయం అంత సులభం కాదు.
ఐదుగురు దళిత విద్యార్థులపై అన్యాయంగా చర్య తీసున్నప్పటి నుంచి వారి సంఘం(అసా)తో తమకున్న విబేధాలను పక్కన పెట్టి ఎస్‌ఎఫ్‌ఐ చొరవతో వ్యవహరించింది. తాము యూనియన్‌లో గెలిచినప్పటికీ దానితో నిమిత్తం లేకుండా అసాతో సహా అన్ని సంఘాలను కలిపి ”సామాజిక న్యాయం కోసం ఐక్య కార్యాచరణ కమిటీ”ని ఏర్పరచింది. దానిలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఆ సమయంలోనే ఈ రచయిత కూడా వారిని పలకరించాడు. సంఘీభావం తెలిపాడు. ఈ మధ్యలో రోహిత్‌ ఘోరం జరిగింది. దానితో ఉద్యమం మరింత ఊపందుకుంది. అన్ని రిపోర్టులూ ఆ అయిదుగురు విద్యార్థులు ఏ తప్పూ చేయలేదని ఘోషిస్తున్నా కావాలని రాజకీయ ఒత్తిళ్లతో చర్య తీసుకున్నారు. తన కొడుకుపై చర్య తీసుకుంటే ఎందుకు ఇంతవరకు-చని పోయిన తర్వాత కూడా- తనకు తెలియజేయలేదని రోహిత్‌ తల్లి నిలదీస్తుంటే దానికి వారి దగ్గర సమాధానం లేదు. ఇది బాధ్యతారాహిత్యం కాదా? తనకు న్యాయం కావాలని ఆ తల్లి అడుగుతుంటే సమాధా నం చెప్పరా? ఇదేనా విశ్వవిద్యాలయాలు నేర్పించే చదువు? రోహిత్‌ మరణానికి నిరసనగా హైదరాబాద్‌లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఆందోళన సాగుతోంది. వివిధ చోట్ల దళితుల పట్ల ఎంతగా వివక్షత సాగుతుందో కథనాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. ఆఖరికి ప్రఖ్యాతిగాంచిన జవహర్‌లాల్‌ నెహ్రూ యూని వర్శిటీలోనూ దళిత విద్యార్థుల పట్ల వివక్షత కొనసా గుతున్నదంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.
రోహిత్‌ చనిపోయి ఇప్పటికి మూడు వారాలవు తోంది. అప్పటి నుంచి హైదరాబాద్‌ కేందీయ విశ్వవిద్యా లయ విద్యార్థులు సమ్మెలో ఉన్నారు. వారి భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయ యాజమాన్యంపై ఉంది. విద్యా సంవత్సరం నష్టపోతే అందుకు వారిదే బాధ్యత అవుతుంది. విద్యార్థుల కోర్కెలన్నీ చట్టబద్ధమైనవి, న్యాయమైనవి. చట్టాన్ని అమలు చేయమని విద్యార్థులు కోరుతున్నారు. వాటిని ధిక్కరిస్తున్నది కేంద ప్రభుత్వం, విశ్వవిద్యాలయ పాలకవర్గం. తాజాగా తమిళనాడులోని విల్లుపురంలో ముగ్గురు విద్యార్థినులు ఇదే విధంగా వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. దానికి బాధ్యులైన ప్రిన్సిపాల్‌, కరస్పాండెంట్‌ను వెంటనే అరెస్టు చేసి రిమాండుకు పంపారు. కానీ హైదరాబాద్‌లో రోహిత్‌ మరణానికి కారకులైన వారు దర్జాగా, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి ఎదుటివారిపై ఆరోప ణలు చేస్తున్నారు. ఇంతకన్నా వివక్షత ఇంకేమన్నా ఉందా? వైస్‌ఛాన్సలర్‌ను వెంటనే అరెస్టు చేయడం పోలీసు ధర్మం. కానీ వారు కేంద్రం ఒత్తిడితో తమ విధుల్ని నిర్వహించడంలో విఫలమవుతున్నారు. రేపు విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోతే అందుకు పోలీసు కూడా బాధ్యత వహించాలి. సవరించిన ఎస్‌స్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ చట్టం ప్రకారం అలక్ష్యంగా వ్యవహరించే పోలీసులు కూడా శిక్షార్హులే. వెంటనే విద్యార్థుల న్యాయసమ్మతమైన కోర్కెలను పరిష్క రించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. లేకుంటే ఈ తరహా బాధ్యతారాహిత్యం మరింత మంది రోహిత్‌లను బలిచేయడానికే తోడ్పడుతుంది. మనకెందుకులే అని మిగతావారు నోరు మూసుకున్నా లేదా రోహిత్‌ దళితుడు గదా మనకెందుకులే అని ఇతర కులస్తులు అనుకున్నా ఈరోజు రోహిత్‌ అయితే రేపు మరొకరవుతారు. అన్యా యాన్ని ప్రశ్నించకపోతే అదే రేపు మనల్ని బలితీసు కుంటుందని మరచిపోరాదు. అందుకే ప్రతి ఒక్కరూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమానికి అండగా ముందుకు రావాలి. ఈ దేశానికి శత్రువులెవరో, మిత్రులెవరో తెలుసుకోవాలి.
(వ్యాసకర్త సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు)

This article first published in Prajasakti

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిపిఎం పాలనలో పెరిగిన త్రిపుర కుటుంబ జీవన సూచీలు

25 Monday Jan 2016

Posted by raomk in CPI(M), Current Affairs, Economics, Health, Left politics, NATIONAL NEWS, Women

≈ Leave a comment

Tags

CPI(M), National Family Health Survey 2015-16 (NFHS-4, NFHS_4 Tripura, Tripura, Tripura Left Front

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ లేదా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలలో గానీ పాలకులు ఎంచుకున్న అభివృద్ధి మార్గాలలో ప్రభుత్వరంగంలోని ఆసుపత్రులను నిర్వీర్యం చేసి ప్రయివేటు రంగాన్ని పెంచి పోషించటం. పేదలకు ఆధునిక వైద్యం అందించే పేరుతో ప్రవేశపెట్టిన పధకాలన్నీ ఆచరణలో కార్పొరేట్‌ ఆసుపత్రుల యంత్రాలు వాటి యజమానులు, యంత్రాల వంటి వైద్యుల జేబులు నింపటానికి తోడ్పడుతున్నాయన్నది కాదనలేని సత్యం. అందుకే ఆంధ్రప్రదేశ్‌ లేదా తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రులలో 38,48 శాతాల చొప్పున కాన్పులు జరుగుతుంటే త్రిపురలో 69శాతం వున్నాయి. మేఘాలయను పాలించిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల శ్రద్ధ తీసుకోలేదు, కార్పొరేట్లు అక్కడికి వెళ్లవు గనుక అసలు ఆసుపత్రులలో జరిగే కాన్పులే 51శాతం వుండగా ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేవి 39శాతం మాత్రమే వున్నాయి. కుటుంబ ఆరోగ్యం, సంక్షేమం విషయాలలో త్రిపుర ఎంతో పురోగమించింది.

ఎం కోటేశ్వరరావు

కమ్యూనిస్టులు అనగానే అభివృద్ధి చేయరు,తమ వుద్యమాలను కొనసాగించేందుకు పేదలను, పేదరికాన్ని అలాగే వుంచాలని కోరుకుంటారు అన్నది కమ్యూనిస్టు వ్యతిరేకులు చేసే తప్పుడు ప్రచారాలలో ఒకటి. దశాబ్దాల తరబడి ఏనుగువంటి అమెరికా అష్టదిగ్బంధనం చేసినా ఎలుకపిల్లంతటి క్యూబాలో కమ్యూనిస్టుల నాయకత్వాన వైద్యరంగంలో సాధించిన విజయాలేమిటో ప్రజలందరికీ తెలిసిందే. మన దేశంలో రాష్ట్రాలు అంటే మున్సిపాలిటీల కింద లెక్క. అందునా త్రిపుర వంటి గిరిజన ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు తప్ప స్ధానికంగా ఆదాయం వచ్చే అవకాశాలు నామమాత్రం. అయినా త్రిపుర కుటుంబజీవన పరిస్ధితులను మెరుగు పరచటంలో అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం సాధించిన విజయాలేమిటో ఒక్కసారి చూడండి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అక్కడ జరుగుతున్నదేమిటో చూద్దాం. ఏడుగురు సోదరీ మణులుగా పిలిచే ఈశాన్య రాష్ట్రాలలో మేఘాలయ కూడా ఒకటి.అదీ వెనుకబడిన కొండ ప్రాంతమే. అక్కడ ఏ పార్టీ అయినా కమ్యూనిస్టులు కాని వారే పాలకులుగా వున్నారు.అక్కడి పరిస్ధితులు ఎలా వున్నాయో పోల్చుకుంటే కమ్యూనిస్టుల ప్రత్యేకత, జనం పట్ల జవాబుదారీతనం ఏమిటో తెలుస్తుంది. ఈనెల 19న కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16కు సంబంధించి కొన్ని రాష్ట్రాల వివరాలను ప్రకటించింది.

గతంలో కొన్ని వివరాలు సేకరించలేదు కనుక కొన్నింటితో పోల్చుకోలేము కనుక ఆ పరిమితులను గమనంలో వుంచుకోవాలి. గత సర్వే 2005-06లో జరిగింది. వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వివరాలు పదేళ్లనాటి సర్వే వివరాలని గమనించాలి. (వు.అ-వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఏపి-ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌)

ఏపి  త్రిపుర తమిళనాడు

1.ఆరేళ్లకు పైబడిన పురుషులలో స్కూళ్లకు వెళ్ళిన వారు   62.0 81.9 77.2

2. పదిహేనేళ్ల లోపు జనాభా                                 23.7 24.5 23.3

3వెయ్యిమంది పురుషులకు మహిళలు                      1020 998 1033

4.గత ఐదేళ్లలో పుట్టిన వెయ్యిమంది పురుషులకు మహిళలు 914 966 954

5.అయోడిన్‌ వుప్పు వాడుతున్నవారు                       81.6 99.1 82.8

6.మెరుగైన మరుగుదొడ్డి వున్నవారు                         53.6 61.3 52.2

7.మంచినీటి సౌకర్యం వున్నవారు                            72.7 87.3 90.6

8 వంటకు గ్యాస్‌, విద్యుత్‌ వాడుతున్నవారు                  62.0 31.9 73.0

9.మహిళా అక్షరాస్యులు                                      62.9 80.4 79.4

10.పురుష అక్షరాస్యులు                                      79.4 89.5 89.1

11. పదేళ్లకు పైగా చదువుకున్న మహిళలు                   34.3 23.4 50.9

12. పద్దెనిమిదేళ్లకు ముందే వివాహమైన యువతులు         32.7 32.2 15.7

13.21ఏళ్లకు ముందే వివాహిత యువకులు                   23.5 22.2 17.0

14.ప్రసవ సమయంలో పిల్లల మరణాలు                         35   27   21

15.ఐదేళ్లలోపు పిల్లల మరణాలు                                  41  33   27

16.ఏదో ఒక కుటుంబనియంత్రణ                               69.5 64.1 53.3

17.మహిళలకు ఆపరేషన్లు                                      68.3 13.9 49.4

18.ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవానికి అదనపు ఖర్చు రు. 2,138 4,412 2496

19.ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు                           38.3 69.1 48.1

20.సిజేరియన్‌ ఆపరేషన్లు                                        40.1 20.5 34.1

21.ప్రభుత్వ ఆసుపత్రులలో సిజేరియన్లు                         25.5 18.1 26.3

22.ప్రయివేటు ఆసుపత్రులలో సిజేరియన్లు                       57.0 73.7 51.3

23.ఎత్తుకు సరిపడా బరువులేని మహిళలు                      17.6 18.9 14.6

24.ఎత్తుకు సరిపడా బరువులేని పురుషులు                      14.8 15.7 12.4

25.అధిక బరువున్న మహిళలు                                   33.2 16.0 30.9

26.అధిక బరువున్న పురుషులు                                  33.5 15.9 28.2

27.పిల్లలలో రక్త హీనత                                           58.6 48.3 50.7

28.మహిళలలో రక్త హీనత                                       60.0 54.5 55.1

29.పురుషులలో రక్త హీనత                                      26.9 24.7 20.6

30.స్త్రీలలో మద్యపానం                                             0.4   4.8   0.4

31.పురుషులలో మద్యపానం                                      34.9 57.6 46.7

32.స్త్రీలలో పొగతాగేవారు                                            2.3 42.2  2.2

33.పురుషులలో పొగతాగేవారు                                     26.8 67.8 31.7

34.మహిళలలో స్వంతంగా సెల్‌ వున్నవారు                        36.2 43.9 62.0

35.బ్యాంకు ఖాతా వున్న మహిళలు                                 66.3 59.2 77.0

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

బ్రాహ్మణిజానికి అనుకూలమో ! వ్యతిరేకమో తేల్చుకోవాలి !!

23 Saturday Jan 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Brahminism, Hinduthwa, Social reformers, Vemula Rohit

సత్య

వినదగు నెవ్వరు చెప్పిన………

     వినినంతనే వేగపడక గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అసలేం జరుగుతోందో తెలుసుకోవాలి? ముందు ముందు ఏం చేయాలో ఆలోచించాలి. అంతకు మించి మరొక మార్గం లేదు. వుద్రేక పడితే ప్రయోజనం లేదు. ఈ మధ్య సామాజిక మీడియాలో అనేక అంశాలపై చర్చ జరుగుతోంది. అది మంచిదే, కానీ కొందరు మరక మంచిదే అని ఒక వాణిజ్య ప్రకటనలో చెప్పిన మాదిరి ఎదుటివారిపై మరకలు పడేస్తున్నారు. కొన్ని అంశాలను ఈ సందర్బంగా అవలోకించ మనవి. కొందరు తీవ్ర బ్రాహ్మణ వ్యతిరేకత చూస్తుంటే బాధేస్తోంది అంటున్నారు. దానిలో వాస్తవం లేకపోలేదు. నిజమే తాము బాధ్యులం కాని దానికి తమను నిందిస్తే ఒక్క బ్రాహ్మణులేమిటి ఏ కులం వారిపై నిందవేసినా, విమర్శలు చేసినా , వివక్ష చూపినా బాధపడటం సహజం.హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మ హత్య చేసుకున్న వేముల రోహిత్‌ దళితుడిగా పుట్టటం నేరమా అంటూ వేసిన ప్రశ్న అలాంటి బాధలోంచి వచ్చిందే. కొన్ని సమస్యలను కూలంకషంగా అర్ధం చేసుకోకపోతే కొన్ని సందర్బాలలో అపార్ధాలకు దారితీయటం, అనేక పర్యవసానాలకు మూలం అవుతోంది.

     అలాంటి వాటిలో బ్రాహ్మణ వ్యతిరేకత ఒకటి. దేశంలో ముఖ్యంగా దక్షిణ భారత్‌, పశ్చిమ ప్రాంతాలలో ఇదొక ప్రధాన చర్చనీయాంశం. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్లు దీనికి ఎవరు కారకులు అన్న చర్చలోకి పోతే తేలదు. ఏం చేయాలో ఆలోచించాలి. చరిత్రలో ఇలానే ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగలేదు అంటే కొన్నింటికి సమాధానాలు దొరకవు.దేవుడి దృష్టిలో అందరూ ఒకటే అని చెప్పే వారు అదే దేవుడు కొందరిని అంటరాని దళితులుగా , వారితో సమంగా వివక్షకు గురి అవుతున్న మహిళలుగా ఎందుకు పుట్టించాడు. శాఖా బేధాలు, నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధ ఘనీభవించి పోయిన మన దేశంలో అవి అగ్ర అనుకొనేవా లేక అధమ అనిపిలిచేవా ఏవైనప్పటికీ అంతర్గతంగా ఒకరి నొకరు తక్కువగా చూసుకోనివి, విభేదాలతో కొట్టుకోని కులాలు ఏమున్నాయి? తమకు మొత్తంగా ఎసరు వచ్చిందనుకున్నపుడు రాజీపడుతున్నాయి.

     బ్రాహ్మణిజం-బ్రాహ్మణ వ్యతిరేకత విషయానికి వస్తే మనుస్మృతి, వేదాలు,పురాణాలు, వుపనిషత్తులు ఇంకా అలాంటి వాటన్నింటిలో చెప్పినవి,మధ్యలో చొప్పించినవి,భిన్న వ్యాఖ్యానాలు చేసినవి కలిపి హిందూయిజం లేదా హిందుత్వ, హిందూ జీవన విధానం ఏ పేరుతో అయినా పిలవనివ్వండి వేల సంవత్సరాలుగా హిందూగా చలామణిలోకి వచ్చాయి. అవి సమాజంలోని మెజారిటీ ప్రజానీకాన్ని అణచివేశాయి, అవకాశాలు దక్కకుండా చేశాయి, చీకట్లో వుంచాయి. రాజులు, రంగప్పలు, భూస్వాములు,జమిందార్లు, జాగీర్దార్లు ప్రాంతాన్ని బట్టి పేర్ల మార్పు తప్ప అలాంటి ఫ్యూడలిస్టు(భూస్వామిక) పాలకవర్గాలన్నింటికీ ఆశ్రిత తరగతిగా, సలహాదారులుగా, అవకాశాలు దొరికితే మంత్రులుగా, పాలకులుగా, హిందూయిజానికి భాష్యం చెప్పేవారిగా బ్రాహ్మణులు కొనసాగుతూ వచ్చారు, అందుకే హిందూయిజానికి మారుపేరుగా దానిని బ్రాహ్మణిజం అని కూడా పిలిచారు. ఎవరైనా తాము అ పురాతన భావాలకు ప్రతినిధులం అని భావిస్తే తిరోగమన వాదుల ప్రశంసలతో పాటు పురోగమన వాదుల విమర్శలనూ ఒకే విధంగా తీసుకోకతప్పదు.

    బ్రాహ్మణిజంతో పాటు బ్రాహ్మలను వ్యతిరేకించాలని పెరియార్‌ ఇవి రామస్వామి నాయకర్‌ పిలుపునందుకొని బ్రాహ్మణిజానికి ప్రతిరూపంగా వున్న బ్రాహ్మణులను తీవ్రంగా వ్యతిరేకించిన రోజులు గతంలో వున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలో రామస్వామి నాయకర్‌ స్ధాపించిన జస్టిస్‌ పార్టీ అనుయాయులు బ్రాహ్మణ వ్యతిరేకతలో భాగంగా పెళ్లి మంత్రాలు చదువుకొని కమ్మ, రెడ్డి బ్రాహ్మణులుగా అవతారమెత్తి వివాహాలు చేయించిన వుదంతాలు కూడా వున్నాయి. నిజానికి మంత్రతతంగం బ్రాహ్మణిజంలో భాగమే అని వారు గుర్తించలేకపోయారు.అంటే బ్రాహ్మణులను తప్ప బ్రాహ్మణిజాన్ని వారు వ్యతిరేకించ లేదు. పెరియార్‌ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా హేతువాదిగా మారితే తరువాత తరంలో పుట్టిన అంబేద్కర్‌ తన జీవితాంతం బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడి అలసిపోయి చివరి దశలో బౌద్దమతాన్ని పుచ్చుకున్నాడు తప్ప బ్రాహ్మణులను వ్యతిరేకించలేదు. అలా వ్యతిరేకించి వుంటే అంబేద్కర్‌ అనే ఒక బ్రాహ్మణుడి ఇంటి పేరును తన ఇంటి పేరుగా కొనసాగించి వుండేవారు కాదు, ఒక బ్రాహ్మణ యువతిని ద్వితీయ వివాహం చేసుకొని వుండేవారు కాదు. అందువలన బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించిన వారిలో రెండు ధోరణులూ వున్నాయి.ఇప్పుడు పెరియార్‌ అనుచరులుగా వున్నవారు కూడా బ్రాహ్మణులను వ్యతిరేకించాలని పిలుపు ఇవ్వటం లేదు. అదే జరిగి వుంటే తమిళనాడు జయలలిత ముఖ్యమంత్రి ఎలా అవుతారు. ఎవరైనా ఫేస్‌బుక్కులో అలాంటి సందేశాలు పెట్టి వుంటే వాటిని పట్టించుకోనవసరం లేదు. బ్రాహ్మణిజానికి పాలకవర్గాలు మద్దతు ఇచ్చినంత కాలం దాని ఫలాలను అనుభవించిన బ్రాహ్మణులు ఇపుడు ఆ పరిస్ధితి లేదు, దాని దుష్పరిణామాలను తాము అనుభవించాల్సి వస్తోంది కనుక వారు కూడా సమాజంతో పాటు మారాల్సిన అవసరం వుంది.

       ఇక బ్రాహ్మణులుగా పుట్టి బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించినవారు మన దేశంలో కోకోల్లలు. బెంగాల్‌లో 1772లో పుట్టిన రాజా రామమోహనరాయ్‌ పేరు ఇప్పటికీ ఏదో ఒక మూలన పెట్టుకుంటూనే వుంటున్నారు. ఆయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణిజం లేదా హిందూయిజం రుద్దిన సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంస్కర్త.అదే ప్రాంతంలో పుట్టిన మరో గొప్ప సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ కూడా బ్రాహ్మణుడే.తెలుగువాడైన గురజాడ అప్పారావు పంతులు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి పరంపరగా తరువాత కాలంలో ఎందరో బ్రాహ్మణులు సంఘసంస్కరణ వుద్యమం నుంచి మరొక అడుగు ముందుకు వేసి కమ్యూనిస్టులుగా కూడా కూడా మారిన చరిత్ర మన కళ్ల ముందు వుంది.

     ఇలాంటి వారందరినీ హిందూత్వ పదికాలాల పాటు కొనసాగాలనుకొనే ఛాందసులు కులంలో తప్పు పుట్టారని నిందించారు. అలా కులంలో తప్పు పుట్టిన వారిగా పేరు తెచ్చుకున్నవారిలో తెలుగునాట పోలేపెద్ద నరసింహమూర్తి( ఆంధ్రకమ్యూనిస్టు కమిటి తొలి కార్యదర్శి) పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, నండూరి ప్రసాదరావు, కంభంపాటి సత్యనారాయణ , చండ్రరాజేశ్వరరావు, మగ్దుం మొహిద్దీన్‌, గుంటూరు బాపనయ్య, రావినారాయణ రెడ్డి ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఎందరో మనకు కనిపిస్తారు. వర్తమాన తరానికి వస్తే ఈ పరంపరను కొనసాగిస్తున్న సీతారామ్‌ ఏచూరి సిపిఎం జాతీయ కార్యదర్శి. బ్రాహ్మణులతో పాటు వివిధ కులాలకు చెందిన వీరందరూ తమ జీవితకాలాల్లో బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించిన వారే. సకల శ్రామికవర్గాన్ని పీల్చిపిప్పి చేసే పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్ధను కూల్చివేయాలని పిలుపునిస్తూ కమ్యూనిస్టు ప్రణాళిక రూపొందించిన కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు ఆ పెట్టుబడిదారీ వర్గంలోనే పుట్టారు. తన కంటే ముందున్న మతంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏసుక్రీస్తు, హిందూమతాన్ని వ్యతిరేకించి బౌద్ధాన్ని స్ధాపించిన గౌతమ బుద్దుడూ, అంతెందుకు రాక్షసరాజు కుటుంబంలో పుట్టిన ప్రహ్లాదుడు తాము పుట్టిన వర్గానికి వ్యతిరేకంగా పనిచేసిన వారే. అంతకంటే మనకు మరొకరి మార్గదర్శకత్వం అవసరం ఏముంది? మనం ఒక కులం లేదా మతం, కుటుంబంలో పుట్టటం అనేది యాదృచ్ఛికం తప్ప మరొకటి కాదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లు కాకుండా మన జీవితానికి ఒక అర్ధం, సంతృప్తి వుండాలంటే మనం ఎక్కడ పుట్టినా శ్రీశ్రీ చెప్పినట్లు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి అన్నట్లు మనం సమాజ పురోగమనానికా తిరుగమన ప్రతినిధులమా అన్నది నిర్ణయించుకోవాలి.

    హిందూయిజం లేదా బ్రాహ్మణిజాన్ని విమర్శించినంత మాత్రాన బ్రాహ్మణులందరూ తమనే విమర్శిస్తున్నారని భావించనవసరం లేదు.ముందే చెప్పుకున్నట్లు హిందూయిజం మన సమాజానికి చేసిన హాని అంతా ఇంతా కాదు. దయానంద సరస్వతి వంటి వారు హిందూపురాణాలు పేర్కొంటున్న విగ్రహారాధన, అంటరానితనం, బాల్యవివాహాల వంటి ఇతర మూఢనమ్మకాలను వ్యతిరేకించి హిందూ సమాజ సంస్కరణలో భాగంగా కులవివక్షలేని వేదకాలాన్ని పునరుద్దరించాలని కోరుకున్నారు. అందుకోసం ఆర్యసమాజాన్ని స్ధాపించారు. అయితే దానితో పాటు ఇతర మతాలలోకి మారిన వారిని శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి మార్చాలనే వివాదాస్పద కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రతిపాదించారనేది వేరే విషయం. ఇప్పుడు సంఘపరివార్‌ సంస్ధలు చెప్పే ఘర్‌వాపసీ కార్యక్రమానికి మూలం అదే.

      హిందూత్వ లేదా బ్రాహ్మణిజాన్ని విమర్శిస్తున్నారని బాధపడే వారు బ్రాహ్మణులైనా, లేదా ఇతర కులాల వారి ముందు రెండే మార్గాలు వున్నాయి. బిడ్డ తల్లి గర్భంలోంచి ఒకసారి బయటకు వచ్చిన తరువాత తిరిగి వెనక్కు వెళ ్లటం ఎంత అసాధ్యమో రోసిపోయిన హిందూత్వ కూడా అలాంటిదే. ఒక వేళ ఎవరైనా చరిత్రను వెనక్కు తిప్పాలని అమలుకు పూనుకుంటే ఇస్లామ్‌లో షరియత్‌పేరుతో ఛాందసులుగా, వుగ్రవాదు లుగా మారిన తాలిబాన్లను అనుసరించటం. అందుకు పూనుకున్నపుడు విమర్శలు , ప్రతిఘటనలు రాకుండా ఎలా వుంటాయి బాధ పడటమెందుకు అనుకోవాలి లేదా కాలం చెల్లిన హిందూత్వ లేదా బ్రాహ్మణిజానికి మేం కూడా వ్యతిరేకం అనుకున్నపుడు ఎవరైనా వాటిని విమర్శించినందుకు చింతించాల్సిన అవసరం లేదు. అందువలన ముందు ఎటు వుండాలో తేల్చుకోవాల్సి వుంది. కుండలో కూడు కుండలోనే వుండాలి, పిల్లాడు దుడ్డుగా తయారు కావాలి అన్నట్లుగా అనేక అవలక్షణాలున్న హిందూత్వ లేదా బ్రాహ్మణిజం అలాగే వుండాలి, దాన్ని ఎవరూ పల్తెత్తు మాట అనకూడదంటే కుదరదు.

     రాజారామ్మోహనరాయ్‌, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌, మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, జ్యోతిబాపూలే కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి ఎందరో సంస్కర్తల పతాకను సమున్నతంగా ఎగురవేస్తూ , విమర్శలను సహించే ఏకత్వంలో భిన్నత్వానికి ప్రాతినిధ్యం వహించే మహత్తర భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకుపోయే, తాతగారి నాన్నగారి భావాలకు పాడెకట్టే ముందుయుగం దూతల వారసులు వున్న దేశం ఇది. విమర్శలను సహించక తప్పదు. మీరూ విమర్శించండి, నిజాల నిగ్గు తేల్చండి, మా మనోభావం, మా నమ్మకం అంటే కుదరదు. ఎవరి నమ్మకాలు, ఎవరి మనోభావాలు వారికీ వుంటాయని గుర్తించండి.జనాన్ని మెప్పించండి, నొప్పించకండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

HU VC Responsible for Student’s suicide, book him:CPI(M)

19 Tuesday Jan 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

ABVP, Central University of Hyderabad, CPI(M), RSS, Vemula Rohit, Vice Chancellor

The Polit Bureau of the Communist Party of India (Marxist) has issued the
following statement:

The Polit Bureau of the CPI(M) expresses its deep anguish at the suicide of
a dalit student, Vemula Rohit, in the Central University of Hyderabad.

The four dalit students were on indefinite hunger strike protesting against
the newly-appointed Vice Chancellor’s decision to rusticate them from the
hostels of the University.

Following an alleged altercation between the RSS student wing – ABVP – and
the Ambedkar Students Union, an enquiry was conducted by the University and
the incident appeared to have been settled.

The newly-appointed Vice Chancellor, allegedly, under pressure from the
Minister of the Union Cabinet belonging to Hyderabad and the consequent
direction by the Human Resources Development Ministry, had taken this action
of suspension from the hostels.  The hunger strike was a protest against
this action by the Vice Chancellor.

Under these circumstances, the Polit Bureau of the CPI(M) condemns the Vice
Chancellor’s motivated decision that led to this suicide  and demands that
the Vice Chancellor be booked under the SC Prevention of Atrocities Act
immediately.

The Central government must conduct a thorough enquiry into this incident in
this prestigious Central University that was established by law by the
Parliament of India.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d