• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Readers News Service

వచ్చేవి అచ్చేదిన్‌ కాదు జనానికి చచ్చే దినాలు : ప్రపంచ బ్యాంకు

26 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

Forecasts, gloomy days, World Bank

ఎంకెఆర్‌

   ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చేసిన అనేక వాగ్దానాలలో రెండు ప్రాధాన్యతగలిగినవి. ఒకటి విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వందరోజుల్లో వెనక్కు తెచ్చి ప్రతి వారి ఖాతాలో పదిహేనులక్షలు వేస్తామన్నది ఒకటి. రెండవది 2022 నాటికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది మరొకటి. ఇవి రెండూ ఎంతో ముఖ్యమైనవి. మొదటి దాని గురించి అసలు సాబ్‌ అలా చెప్పలేదు అనే వారు కొందరు, ప్రాణ, విత్త, మాన భంగములందు అబద్దాలు చెప్పవచ్చు అన్నట్లుగా ఎన్నికల సమయంలో చెప్పిన వాటినన్నింటినీ అమలు జరపలేరంటూ సమర్ధించేవారు మరి కొందరు. ఇంకొందరున్నారు చెప్పినట్లు నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలేకపోయినా కొత్తగా విదేశాలకు తరల కుండా చేశారంటారు. అయితే అది కూడా వాస్తవం కాదని, గత రెండు సంవత్సరాలలో కొత్తగా భారతీయులు బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు పనామా పత్రాలు వెల్లడించాయి కనుక అది కూడా వాస్తవం కాదని తేలిపోయింది. బహుశా వారికి అచ్చేదిన్‌ వచ్చి వుంటాయి. రెండవది రైతుల ఆదాయాలు రెట్టింపు చేయటం. ప్రపంచ వ్యాపితంగా వ్యవసాయ వుత్పత్తుల ధరలు పతనమౌతున్న తరుణంలో ఆదాయాలు రెట్టింపు చేస్తామని ఓట్లను కొల్ల గొట్టేందుకు నరేంద్రమోడీ చెప్పటం మరో నల్లధనం వెలికితీత వంటిదే. మోడీ అంతరంగమైన అమిత్‌ షా ఏదో మాయాజాలం చేసి వాగ్దానాలు అమలు చేస్తారు అని నమ్ముతున్నవారు ఇంకా వున్నారు. అయితే తాజాగా మంగళవారం నాడు ప్రపంచ బ్యాంకు 2016 జోశ్యం గురించి చేసిన ప్రకటన ఆ ఆశల మీద కూడా నీళ్లు చల్లింది.జనం మీద భారం మోపే చమురు ధరలు పెరుగుతాయన్నది ఒకటి. కోట్లాది మంది రైతులు నోట్లే రాబోయే రోజుల్లో కూడా మట్టే అని మరొకటి. జనవరి జోశ్యంలో 2016-17లో వ్యవసాయ వుత్పత్తుల ధరలు గతేడాదితో పోల్చితే 1.8శాతం పెరుగుతాయని ప్రపంచబ్యాంకు పేర్కొన్నది. మూడు నెలలు తిరిగే సరికి రెండవ సవరింపులో 2016లో 1.8, 2017లో 1.7శాతం మేరకు ధరలు పతనమౌతాయని పేర్కొన్నది. తదుపరి అంచనాలలో ఏం చెబుతుందో తెలియదు. ఇప్పుడు చెప్పిన రెండూ జనానికి అచ్చేదిన్‌ కాదు జనానికి చచ్చే దినాల రానున్నాయని వెల్లడిస్తున్నాయి.

    సరిగ్గా బ్యాంకు ఈ నివేదికను రూపొందిస్తున్న తరుణంలోనే ఇక నుంచి రైతులు తమ వుత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. అందుకు గాను ఏప్రిల్‌ 14న ‘ఇనామ్‌’ ప్రారంభించారు. దీన్ని ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ అని పిలుస్తున్నారు. రైతులు సమీప మార్కెట్లో అక్కడి వ్యాపారులు చెప్పిన అతి తక్కువ ధరలకు తమ వుత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తున్నదని ఇనామ్‌ ద్వారా కోరుకున్న ధరకు అమ్ముకొని అధికంగా సంపాదించుకోవచ్చని ప్రధాని ప్రకటించారు. తొలి దశలో ఎనిమిది రాష్ట్రాలలోని 22 మార్కెట్‌ యార్డులను అనుసంధానించారు.మొత్తం 585 వ్యవసాయ మార్కెట్‌ యార్డులను 2018 నాటికి పూర్తిగా అనుసంధానిస్తారు. అయితే ఇందుకు రాష్ట్రాలు చట్టాలను సవరించి అనుసంధానానికి ఆమోదం తెలపాల్సివుంటుంది. తొలి దశలో గుజరాత్‌, తెలంగాణా, రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, వుత్తర ప్రదేశ్‌, హర్యానా , జార్ఖండ్‌, హిమచల్‌ ప్రదేశ్‌కు చెందిన మార్కెట్లను అనుసంధానించారు. ఇరవై అయిదు రకాల పంటలను విక్రయించుకోవచ్చు. తొలి దశలో ఆయా రాష్ట్రంలోని మార్కెట్లలో మాత్రమే లావాదేవీలు జరుగుతాయి. వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో క్రయ విక్రయాల ద్వారా ఆయా రాష్ట్రాలకు ఆదాయం వస్తోంది. వాటిని కోల్పోవటానికి ఏ రాష్ట్రమూ అంగీకరించదు. అందువలన ఈ సమస్యను ఎలా పరిష్కరించేది చూడాల్సి వుంది. దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న విధానం అమలులోకి రావటం అంత సులభం కాదని చెబుతున్నారు.

   గత కొద్ది సంవత్సరాలుగా వ్యవసాయ పంటలపై రైతాంగానికి వస్తున్న ఆదాయాలు పడిపోతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలలో భాగంగా తమ బాధ్యతల నుంచి ఒక్కొక్క రంగం నుంచి క్రమంగా తప్పుకుంటున్నాయి. ఈ మార్కెట్లు కూడా దానిలో భాగమే. ఈ ఏడాది బడ్జెట్‌లో రైతాంగానికి పెద్ద పీట వేసినట్లు ప్రభుత్వం, మీడియా కూడా డబ్బా కొట్టాయి. బడ్జెట్‌ను అంకెల గారడీ అని కూడా వర్ణిస్తారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 2022 రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని పదే పదే చెబుతున్నారు. దీనిలో రెండు అర్ధాలు వున్నాయి. ఒకటి ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఆ మేరకు రైతాంగ వుత్పత్తుల ధరలు పెరిగితే రైతులకు ఎక్కువ డబ్బు వచ్చినట్లు కనిపించవచ్చుగానీ అదే సమయంలో వారి పెట్టుబడులు కూడా అంతకంటే ఎక్కువ పెరుగుతాయి. స్ధిర ధరలలో పెరుగుదల ఎంత అన్నదే నిజమైన కొలబద్ద అవుతుంది. అలా జరగాలంటే ప్రభుత్వాలు అది కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఎంత మేరకు బడ్జెట్‌ కేటాయింపులు జరిపాయన్నదానిని బట్టే వుంటుంది.

    ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది కంటే విలువ తగ్గిన రూపాయల కేటాయింపు అంకెల్లో ఎక్కువగా కనిపించినా, దేశ స్ధూలాదాయంలో శాతాలలో చూస్తే గతేడాది కంటే వ్యవసాయంలో భాగమైన గ్రామీణ వుపాధికి కేటాయింపు 0.3శాతం తగ్గింది. వాటిలో గతేడాది బకాయిల మొత్తం, యంత్రాల వినియోగానికి అనుమతుల వంటి వాటిని చూస్తే వాస్తవానికి ఇంకా ఎక్కువ తగ్గుతుంది. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలలో రైతుల ఆదాయంలో ఇది కూడా ఒక భాగంగా మారిన విషయం తెలిసిందే. అందువలన ఆదిలోనే హంసపాదు అన్నట్లు గ్రామీణ బడ్జెట్‌గా వర్ణించిన దానిలో దానికి ప్రాధాన్యత ఇవ్వలేదని తేలిపోయింది.

                                     వ్యవసాయ రంగంలో సంక్షోభం

     గత కొద్ది సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో సంక్షోభ తీవ్రత పెరుగుతోంది. అందువలననే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత కూడా రైతుల ఆత్మహత్యల తీవ్రత పెరిగింది తప్ప తగ్గటం లేదు.గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది.వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ హయాంలో వ్యవసాయరంగం తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నది. దానిని మరుగు పరచి దేశం వెలిగిపోతోంది అన్న ప్రచారంతో ఎన్‌డిఏ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటంతో తీవ్ర ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే.సరిగ్గా అటు వంటి పరిస్థితి మరోసారి ప్రారంభమై దిగజారటం వేగం పుంజుకుంటున్న స్ధితిలో నరేంద్రమోడీ రైతాంగానికి ఆదాయాల రెట్టింపు వంటి అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చారు. రైతాంగం సంక్షోభంలో భాగంగా రుణవూబిలో కూరుకుపోయిన కారణంగానే రుణాల రద్దు నినాదానికి ఆంధ్రప్రదేశ్‌లో రైతులు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడికి పీఠం అప్పగించారు.

     2004ఎన్నికలలో ఎన్‌డిఏ రైతుల ఆగ్రహాన్ని చూసిన తరువాత కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నది. గ్రామీణ వుపాధి కార్యక్రమం దాని పర్యవసానమే. దీనికి తోడు ప్రపంచ వ్యాపితంగా వ్యవసాయ వుత్పత్తుల ధరల పెరుగుదల ప్రభావం మన దేశంపై కూడా పడి రైతుల ఆదాయాలు పెరిగాయి.అది మరో నిర్మాణ రంగం పెరుగుదలకు దోహదం చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్లిన వారికి వేతన రూపంలో ఆదాయాలు పెరగటానికి కూడా దారితీసింది. ఇది కొంత మేరకు సంక్షోభాన్ని పెరగకుండా చేసింది తప్ప పూర్తిగా పరిష్కరించలేదు. యుపిఏ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత లోటు తగ్గింపు పేరుతో కోతలు విధించటం ప్రారంభించింది. ఇదే సమయంలో వ్యవసాయ వుత్పత్తుల ధరల పెరుగుదల ఆగిపోయి మరోసారి వెనుక పట్టు పట్టింది. బడ్జెట్‌ కోతలో భాగంగా వ్యవసాయానికి పెట్టుబడులు తగ్గాయి. 2010-11 నుంచి అప్పటి వరకు స్ధిరంగా వున్న వ్యవసాయ సంక్షోభం తిరిగి పెరగటం ప్రారంభమైంది. మోడీ హయాంలో ఇంకా పెరుగుతోంది. మాంద్యం లేదా సంక్షోభం తలెత్తినపుడు పెట్టుబడిదారులకు రాయితీలు తప్ప ప్రజా సంక్షేమానికి కోత పెడతారు. దానిలో వ్యవసాయం కూడా ఒకటని వేరే చెప్పనవసరం లేదు. వ్యవసాయ రంగం సంక్షోభంలో వున్న వర్తమాన తరుణంలో కొన్ని విభాగాలకు కొంత కేటాయింపులు పెంచినంత మాత్రాన రానున్న ఆరు సంవత్సరాలలో రైతుల అదాయాలు రెట్టింపు అవుతాయంటే అంతకంటే హాస్యాస్పదం మరొకటి వుండదు. నిజానికి ఎరువులు,డీజిల్‌, ఇతర పెట్టుబడులపై ఇస్తున్న రాయితీలను ఎత్తివేసిన తరువాత బడ్జెట్‌లో నామమాత్రంగా కేటాయింపులు పెంచినా దాని వలన రైతాంగానికి ఎలాంటి వుపయోగం వుండదు.

      నరేంద్రమోడీ సర్కార్‌ అన్ని రంగాలలో విదేశీ పెట్టుబడుల గురించి జపం చేస్తోంది. ఆయనను ప్రధాని గద్దెపై కూర్చొనేందుకు ఎంపిక చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ మరోవైపు స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో కబుర్లు చెబుతోంది. ఆహార వుత్పత్తుల రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తామని అరుణ్‌ జెట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పటం ఆచరణలో విదేశీ ఆదరణ మంచగా దేశాన్ని మార్చటమే. . ఇది చిన్న సన్నకారు రైతాంగానికేమీ వుపయోగపడదని ముఖ్యంగా పండ్లు, కూరగాయల రైతాంగానికేమీ ప్రయోజనం లేదని అనేక మంది నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ రంగంలో పెట్టుబడులను పెంచితేనే వారికి లబ్ది చేకూరుతుంది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు అంటే ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధన, పేదరిక నిర్మూలన కూడా ఇమిడి వుంది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించటం అంటే విదేశీ కార్పొరేట్‌, ప్రయివేటు శక్తులకు పెద్ద పీట వేయటమే. విదేశీ పెట్టుబడులు వ్యవసాయరంగంలో ప్రవేశించటం వాటి లాభాల కోసం తప్ప మన బాగుకోసం కాదు. బ్రిటీష్‌ వారు తమ ఆక్రమిత దేశాలైన భారత్‌, చైనా వంటి చోట్ల తమ లాభాల కోసం నల్లమందు సాగు, తయారీని ప్రోత్సహించి జనాన్ని నల్లమందు భాయీలుగా మార్చటమే కాదు చివరకు నల్లమందు యుద్ధాలు చేసిన విషయం చరిత్ర చెబుతోంది.

      అంతెందుకు వర్తమాన చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ వుగ్రవాదులను పెంచి పోషించేందుకు అమెరికన్లు అక్కడ వారిచేత అదే పని చేయించారు. ఇప్పుడు మత్తుమందుల రవాణాలో ఆఫ్ఘనిస్తాన్‌ ఒక కీలక ప్రాంతంగా మారింది. తాలిబాన్లకు అవసరమైన ఆదాయ వనరుగా మారింది. వ్యవసాయంలో విదేశీ పెట్టుబడులంటే మరో విధంగా చెప్పాలంటే ఈ విధానం వెనుక వున్న పరమార్ధం తన బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవటం, మార్కెట్‌ శక్తులకు రైతాంగాన్ని అప్పగించటమే. దానిలో అంతర్బాగంగానే రైతులకు ఏమాత్రం వుపయోగపడకుండా ఇప్పుటికే వున్న పంటల బీమా పధకంలో మార్పులతో అందుకు శ్రీకారం చుట్టింది. రైతాంగానికి రక్షణ కల్పించే అనేక అంశాలలో బీమా ఒకటి మాత్రమే. బీమా సంస్ధలు ప్రీమియం స్వీకరించే ముందు చెప్పే కబుర్లకు తరువాత చెల్లించాల్సిన సమయంలో పెట్టే షరతులకు ఎంత తేడా వుంటుందో తెలిసిందే. అయినా వ్యవసాయ సంక్షోభానికి సమగ్ర పంటల బీమా అన్నది ఒక తోడ్పాటు మాత్రమే తప్ప జిందా తిలిస్మాత్‌ కాదు. మరో విధంగా చెప్పాలంటే సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని రైతాంగాన్ని ఒక ఆర్ధిక సరకుగా ద్రవ్య వ్యాపారులకు అప్పగించే నయా వుదారవాద విధానం తప్ప మరొకటి కాదు. పశ్చిమ దేశాలలో మనకంటే మెరుగైన వ్యవసాయ బీమా పధకాలు వున్నప్పటికీ ఏదో ఒక పేరుతో ప్రభుత్వాలు భారీ మొత్తంలో సబ్సిడీలు ఇవ్వటమే గత దశాబ్దన్నర కాలంగా దోహా చర్చలు ముందుకు పోకపోవటానికి అడ్డుపడుతున్న కారణాలలో ఒకటని గుర్తించాలి. మోడీ సర్కార్‌ ఆ సబ్సిడీల గురించి మాట్లాడటం లేదు, వున్నవాటిని క్రమంగా రద్దు చేస్తోంది.

    ప్రపంచ బ్యాంకు వ్యవసాయం గురించి తాజాగా చెప్పిన అంశాల గురించి చూద్దాం. గత ఎనిమిది త్రైమాసకాలుగా (రెండు సంవత్సరాలుగా) ప్రపంచంలో వ్యవసాయ వుత్పత్తుల ధరలు పడిపోతూనే వున్నాయి.గతేడాది కంటే తొమ్మిదిశాతం తక్కువ. ఎక్కువ భాగం వ్యవసాయ వుత్పత్తుల ధరలు ఈ ఏడాది పతనం అవుతాయి. ధాన్యం ధరలు 3.4శాతం తగ్గుతాయని జనవరిలో వేసిన అంచనాను తాజాగా 5.3శాతానికి పెంచింది. వ్యవసాయ ధరలు తగ్గటంతో పాటు చమురు, గ్యాస్‌ ధరలు పెరుగుతాయని చెప్పటం అంటే అంటే పరోక్షంగా రైతులపై మరింత భారం మోపటమే. ఎరువుల ధరలు తక్షణమే పెరుగుతాయి.ఇది ఒక విష వలయం. ఒకదాని ప్రభావం మరొకదానిపై పడి అన్నింటినీ దెబ్బతీస్తాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Selling of Medicines Banned in Foreign Countries

26 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Health, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Analgin, Medicines, Nimesulide, Pioglitazone

A drug banned / restricted in one country may continue to be marketed in other countries as the respective Governments examine the usage, doses, indications permitted, etc. along with the overall risk-benefit ratio and take decisions on the continued marketing of any drug in that country. In India, safety issues concerning drug formulations are, as and when noted, assessed in consultation with the experts. Safety and efficacy issues relating to certain drugs which have been banned in some countries have been examined and some of these have been allowed for continued marketing subject to stipulated condition/restrictions. These include:

I. Nimesulide:- The manufacture, sale and distribution of Nimesulide formulation for human use in children below 12 years of age has been prohibited in the country.

II. Analgin:- The manufacture for sale, sale and distribution of Analgin and its formulations containing Analgin for human use was initially suspended in the country w.e.f. 18.06.2013. Subsequently, DTAB examined the issue of suspension of manufacture and sale of the said drug on 25.11.2013 in its 65th meeting and on the basis of the recommendations of the DTAB, the ban was revoked subject to the condition that manufacturers will be required to mention the following on their package insert and promotional literature of the drug:-

“The drug is indicated for severe pain and pain due to tumour and also for bringing down temperature in refractory cases when other antipyretics fail to do so”.

III Pioglitazone:- The manufacture for sale, sale and distribution of the drug Pioglitazone and formulations containing Pioglitazone for human use was initially suspended w.e.f. 18.06.2013. Subsequently, DTAB, after examination, recommended for revocation of the suspension of the manufacture and sale of the drug subject to certain conditions and accordingly, the suspension was revoked subject to the condition that the manufacturer shall mention on the package insert and promotional literature of the drug the following:-

a) The drug should not be used as first line of therapy for diabetes.

b) The manufacturer should clearly mention the following box warning in bold red.

“Advice for healthcare professionals:

I. Patients with active bladder cancer or with a history of bladder cancer, and those with uninvestigated haematuria, should not receive pioglitazone.

II. Prescribers should review the safety and efficacy of pioglitazone in individuals after 3–6 months of treatment to ensure that only patients who are deriving benefit continue to be treated. Pioglitazone should be stopped in patients who do not respond adequately to treatment (e.g. reduction in glycosylated haemoglobin, HbA1c).

III. Before starting pioglitazone, the following known risk factors for development of bladder cancer should be assessed in individuals: age; current or past history of smoking; exposure to some occupational or chemotherapy agents such as cyclophosphamide; or previous irradiation of the pelvic region.

IV. Use in elderly patients should be considered carefully before and during treatment because the risk of bladder cancer increases with age. Elderly patients should start on the lowest possible dose and be regularly monitored because of the risks of bladder cancer and heart failure associated with pioglitazone.”

V. The Central Government has banned 344 Fixed Dose Combinations on 10.03.2016, as these combinations lacked therapeutic rationality/ justification.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Draft Guidelines for Organ Donation

26 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Health, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

NOTTO, Organ, Organ Donation

 

Draft guidelines for kidney had been placed in public domain for seeking comments and suggestions from the general public. Based on the comments received, the Government has since finalized the said guidelines and issued Allocation Criteria for deceased donor kidney transplant which have been uploaded on the website of National Organ and Tissue Transplant Organization (NOTTO) namely http://www.notto.gov.in.  The allocation policy for organs has been developed keeping in view the ethical, legal and scientific rationale. Further, these guidelines provide for allocation of kidney in a transparent manner. Draft guidelines for Liver and Heart have been prepared/placed on the NOTTO website for seeking comments from public and stakeholders.

These guidelines concern allocation criteria of organs from cadaver donors and not the illegal trading of organs. The illegal trading and transplantation of organs is regulated in terms of the Transplantation of Human Organs and Tissues Act, 1994 and Transplantation of Human Organs and Tissues Rules 2014, which are available on the NOTTO website namely www.notto.gov.in .

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘గుడ్డి వాళ్ల రాజ్యంలో ఒంటి కన్నువాడే మహరాజు’

20 Wednesday Apr 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

'In the land of the blind the one-eyed man is king', Modi Sarkar, Narendra Modi Failures, Raghu ram rajan, RBI, Rbi governer

ఎం కోటేశ్వరరావు

    నిజం చెబితే నిష్ఠూరమాడతారు. నిష్టూర మంటే నిజానికి మీరు మాట్లాడింది చాలా బాగో లేదు అని మర్యాదగా కోపగించుకోవటమే. మన రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యలపై మన తెలుగింటి ఆడపడుచు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అదే చేశారు. ఇంతకీ రిజర్వుబ్యాంకు రాముడు అన్నదేమిటి ? గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అన్న సామెతను వుపయోగించి మన ఆర్ధిక వ్యవస్ధ గురించి గొప్పలు చెప్పుకుంటున్నవారి గాలి తీశారని కొందరు అంటుంటే, కాదు మన స్ధితి గురించి వినమ్రంగా తనదైన శైలిలో చెప్పారు తప్ప అది ప్రభుత్వానికో , మోడీకో వ్యతిరేకం కాదని మరికొందరు భాష్యం చెబుతున్నారు. వరుస వైఫల్యాలు సంభవిస్తున్న పూర్వరంగంలో రాజన్‌ వ్యాఖ్య సహజంగానే మోడీ భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ‘2019లో బిజెపి తిరిగి అధికారాన్ని పొందాలంటే అదృష్టం పట్ల వ్యామోహాన్ని వదులు కోవాలి’ అనే శీర్షికతో ‘మేం మితవాదులం ‘ అని సగర్వంగా చెప్పుకొనే మోడీ భక్తుడైన ఎస్‌ మురళీధరన్‌ అనే వ్యాసకర్త ‘స్వరాజ్య’ పత్రికలో ఈనెల 19న రాశారు. రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యలకు మురళీనాదానికి సంబంధం వుందా ?

    ‘మోడీ ప్రభుత్వం పతాక పధకాలుగా ప్రారంభించిన పంటల బీమా పధకం, ఇ మండి(ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ యార్డులు), మేక్‌ ఇన్‌ ఇండియా వంటి ఇతర పధకాలకు దాదాపు ఎలాంటి సన్నాహాలు లేకుండా మొదలు పెట్టారు. చివరకు అవి విఫలం కావటానికే ఎక్కువ అవకాశాలున్నాయంటే ఆశ్చర్యపడనవసరం లేదు. మన ఎన్నికల అవనికలో పునశ్చరణగా జరుగుతున్నట్లుగా చంద్రుడు, చుక్కలను తీసుకు వచ్చి చేతుల్లో పెడతామని చెప్పటం ద్వారా 2019 ఎన్నికలలో బిజెపి ప్రభుత్వ వ్యతిరేకతను తెచ్చుకోవచ్చు’. ఇవి ఏ ప్రతిపక్ష పార్టీనో మరొకరో కాదు స్వయంగా మురళీధరన్‌ రాసిన మాటలు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చి ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాక ముందే మరో మూడు సంవత్సరాల తరువాత జరిగే ఎన్నికలలో సంభవించబోయే పరిణామాల గురించి ఆయన భక్తులు హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే రఘరామ్‌ రాజన్‌ మాట్లాడినదానిలో తప్పేమన్నా వుందా ? నిర్మలా సీతారామన్‌ వంటి మోడీ సైనికులకు మండ కుండా వుంటుందా ?

   మామ తిట్టినందుకు కాక తోడల్లుడు తొంగి చూసినందుకు కోపం వచ్చిందన్న కొత్త సామెతను ప్రచారంలో పెడదాం. మురళీధరన్‌ మోడీ ప్రభుత్వానికి మామ అనుకుందాం. సదరు మామ చెప్పిన అంశాల సారం ఇలా వుంది. ‘ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. రాజకీయాలలో ఒక వారమే దీర్ఘకాలం అనుకుంటే ప్రభుత్వం ఎటు వైపు పయనిస్తోందో చెప్పటానికి రెండు సంవత్సరాలు చాలు. గాలిలో గడ్డి పరకలు దిశను తెలియచేసినట్లే తన విధానాలు, కార్యక్రమాల గురించి సమర్ధనీయం కాని ఆశాభావం, అదృష్టాన్ని నమ్ముకొనే విపరీత వ్యామోహంతో వున్నట్లు కనిపిస్తోంది.

   ఎలక్ట్రానిక్‌ వ్యవసాయ మార్కెట్లనే చూద్దాం. అది మంచి ఆలోచనే కానీ మనం దానికి అనువుగా వున్నామా ? ఒక వస్తువును దుకాణానికి చేర్చాలంటే మార్కెటింగ్‌ వ్యక్తులకు తొడతొక్కిడిగా వుంటుంది, అంతకంటే ముందు అదే పరిస్ధితి వుత్పాదక కేంద్రాలలో వుంటుంది.అలాగే మౌలిక సదుపాయాలు లేకుండా ఏ ప్రభుత్వమూ పధకాలను ప్రారంభించకూడదు. మన దేశంలో 15శాతానికే ఇంటర్నెట్‌ అందుబాటులో వుంది. వంద కోట్ల సెల్‌ఫోన్లు వున్నాయనుకుంటే ఇరవై కోట్ల మందే స్మార్ట్‌ ఫోన్లను వాడుతున్నారు. ఇది సానూకూల చిత్రం.

   వ్యవసాయ వుత్పత్తులకు ఒక సమీకృత మార్కెట్‌ అంటే వుత్పత్తి జరిగే చోట శీతల గిడ్డంగులతో పాటు వాటిని అవసరమైన చోటికి చేరవేయటానికి శీతల సదుపాయం వున్న రవాణా వాహనాలు కావాలి. ఇవేమీ లేకుండానే మరొక ప్రారంభానికి నాంది పలికారా ? పంటల బీమా పధకం కూడా ఇలాగే ప్రారంభించారు. వ్యవసాయ రంగంలోని అన్ని అనర్ధాలకు సబ్సిడీతో కూడిన పంటల బీమా పధకం సర్వరోగనివారిణి కాదనే వైపు మోడీ ప్రభుత్వం ఆలోచించలేదు. మాయలాడిని చూసి మోసపోయిన ప్రేమికుడి మాదిరి బీమా సొమ్మును నిరాకరిస్తే రైతు ఆగ్రహోదగ్రుడు అవుతాడు.

    తాను అధికారానికి వచ్చిన వందరోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల వంతున వేస్తానని బాధ్యతా రహితంగా 2014 ఎన్నికలలో మోడీ వాగ్దానం చేయటంతో ఈ ధోరణి ప్రారంభమైంది. అది ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు చెప్పిన మాట అని తెలిసినప్పటికీ రంధ్రాన్షేషణ చేసే టీవీ యాంకర్ల మొదలు వాక్చాతుర్యం గల ప్రతిపక్షాల వరకు మోడీ ప్రభుత్వం వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని నానాయాగీ చేస్తున్నారు. మేకిన్‌ ఇండియా నినాదం కూడా ఇలాంటిదే. గత రెండు సంవత్సరాలలో వచ్చిన ఎఫ్‌డిఐలో ఎక్కువ భాగం వుత్పాదకేతర ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వాణిజ్యరంగంలోకే వచ్చింది.   విదేశాంగ విధానంలో కూడా అదృష్టాన్ని నమ్ముకొనే వ్యామోహంతో వున్నారు. వాజ్‌పేయి ఎన్నో కలలతో లాహోర్‌కు బస్సులో వెళితే మోడీ దాన్ని అధిగమించి దిగజారి పాకిస్థాన్‌ ప్రధాని కుటుంబ కార్యక్రమానికి ఎలాంటి ఆహ్వానం లేకుండానే ఆకస్మికంగా వెళ్లారు.’ ఇదే విమర్శను ఏ సిపిమ్మో, కాంగ్రెసో చేసి వుంటే స హించలేక ఈ పాటికి సంఘపరివార్‌ మీడియా సైన్యం రెచ్చిపోయి నానా యాగీ చేసి వుండేది.

    నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన విజయాలలో వాణిజ్య లోటు తగ్గింపు గురించి చెప్పుకొంటోంది. లోటు తగ్గిన మాట నిజం. మోడీ అధికారానికి వచ్చిన వెంటనే మేకిన్‌ ఇండియా నినాదమిచ్చారు. కానీ అప్పటి నుంచి మన దేశంలో తయారైన సరకులు ఎగుమతులు తగ్గిపోయాయి. వరుసగా గత పదహారు నెలలుగా తగ్గుతున్నట్లు తాజాగా ప్రభుత్వమే ప్రకటించింది.మరో ఏడాది పాటు ఇలాగే వుండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.ఈ వివరాలు వెల్లడి అయిన సమయంలోనే గత తొమ్మిది నెలల్లో తొలిసారిగా మార్చినెలలో చైనా ఎగుమతులు పెరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో మన దిగుమతుల ఖర్చు కూడా తగ్గింది. దీనిలో మోడీ ఘనత వుందా? ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా తగ్గిన కారణంగా మన బిల్లుతగ్గింది తప్ప మరొకటి కాదు. ప్రపంచ మార్కెట్లో తగ్గిన మేరకు వినియోగదారులకు తగ్గించారా అంటే లేదు పన్నులు పెంచి జనాన్ని బాదుతున్నారు. చైనా ఈ రోజు ప్రపంచంలో అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. మన దేశంలోని కొందరు త్వరలో దానిని అధిగమించబోతున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 12శాతం కాగా మనది 1.7 మాత్రమే. దీనిని 2020 నాటికి ఐదుశాతానికి పెంచాలని అనుకుంటున్నట్లు నరేంద్రమోడీ చెబుతున్నారు.అంటే మరో నాలుగు సంవత్సరాలలో మన ఎగుమతులు మూడు రెట్లు పెరగాలి. అందుకే మురళీధరన్‌ చెప్పినట్లు వాస్తవాలకు దూరంగా నరేంద్రమోడీ సర్కార్‌ అదృష్టంపై వ్యామోహం పెంచుకొని ఎదురు చూస్తున్నది.

     రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ గతవారంలో వాషింగ్టన్‌ నగర పర్యటన సందర్భగా మార్కెట్‌ వాచ్‌ సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్‌ ఆశాజనక కేంద్రంగా వుందని ఐఎంఎఫ్‌తో సహా అనేక సంస్ధలు వర్ణించిన విషయాన్ని విలేకరి ప్రస్తావించి దాని రహస్యం ఏమిటని అడిగారు. దానిపై రాజన్‌ స్పందిస్తూ ‘ మేము సంతృప్తి చెందాల్సిన కేంద్రానికి చేరాలంటే మేము ఇంకా ప్రయాణించాల్సి వుంది.గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్నువాడే మహారాజు అని మేము చెబుతూ వుంటాం, మేము దానికి అతి దగ్గరలో వున్నాం’ అన్నారు. చైనాతో పోలిక గురించి అడగ్గా సంస్కరణల ప్రారంభంలో చైనా కంటే భారత్‌ పదేళ్లు వెనుక వుంది. రెండు ఆర్ధిక వ్యవస్థలలోనూ ఆ తేడా కనిపిస్తుంది.మేము వారితో పోలిస్తే నాలుగు నుంచి ఐదోవంతు మధ్య వున్నాం, మేం కొన్ని సరైన చర్యలు తీసుకుంటే కొంత కాలానికి వారిని మేము చేరుకోగలం అన్నారు. వారు ఇప్పుడున్న స్ధాయికి చేరుకోవటానికి వారు అనుసరించిన మంచి విధానాలు అసాధారణమైనవి, కాబట్టి మేం కూడా మంచి విధానాలను రూపొందించి వారి మాదిరే అమలు జరపాల్సి వుంది. ఇతరులు నడిచిన బాటను మేం అనుసరించాలని లేదు, దాని అర్ధం బాగా కష్టపడాల్సి వుంది’ అన్నారు.

    రాజన్‌ చేసిన వ్యాఖ్యలను అన్వయించటాన్ని బట్టి ఏ విధంగా అయినా వుపయోగించవచ్చు. రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా వున్న వ్యక్తి మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఆలా వ్యాఖ్యానించి వుంటారని అనుకోలేము. సాధించిన దానికి సంతృప్తి చెందటం లేదనే సానుకూల అర్ధంలో కూడా కావచ్చు. అనేక సందర్బాలలో నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించిన రాజన్‌ ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురౌతున్నట్లు వార్తలు వచ్చాయి.గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అన్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ అతిగా స్పందించినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు అలాంటి వాటిని వుపయోగించుకోవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ కేంద్ర మంత్రి ఆ విధంగా స్పందించటం అంటే ప్రభుత్వ వైఫల్యాలపై వస్తున్న విమర్శలను తట్టుకొనే సహనం కోల్పోతున్నారనటానికి సూచన ఇది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిన్న, సన్న కారు రైతాంగాన్ని భూమికి దూరం చేసే యత్నాలు

19 Tuesday Apr 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, Latin America

≈ Leave a comment

Tags

Agriculture, Brazil’s peasant internationalism, farmland privatization, La Via Campesina, Narendra Modi, Niti Aayog, peasant internationalism, peasants

Poster from the campaign “O Grito dos Excluídos” (“The Scream of the Excluded”). Some rights reserved.

ఏప్రిల్‌ 17 అంతర్జాతీయ భూ పోరాట దీక్షా దిన ప్రాధాన్యత

ఎం కోటేశ్వరరావు

    చెదురుమదురుగా వున్న చిన్న భూ కమతాలను ఒకటిగా చేయాల్సిన అవసరం వుందని నరేంద్రమోడీ సర్కార్‌ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు అరవింద్‌ పంగారియా చెప్పారు. సోమవారం నాడు జమ్మూలోని కాశ్మీర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసంలో భూ కమతాలను పెద్దవిగా రూపొందించాల్సిన అవసరం గురించి చెప్పారు. ఇది జరగాలంటే రైతులు భూములను అమ్ముకొని ఇతర పనులను చూసుకోవాలి, అయితే భూమి కలిగి వుంటే రక్షణ వుంటుందని భావిస్తున్న కారణంగా వారు విక్రయానికి ముందుకు రారు, అందువలన యజమానులకు భూములపై చట్టపరమైన రక్షణ కల్పించి వాటిని కౌలుకు ఇచ్చే విధంగా చట్టాలను సవరించాల్సిన అవసరం వుందని పంగారియా చెప్పారు. ఈ మేరకు కేంద్రం ఒక నమూనా బిల్లును రూపొందించిందని దానిని రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణ్యంగా మార్చుకొని చట్ట సవరణ చేయవచ్చని చెప్పారు. ఇది జరిగితే చిందరవందరగా వున్న కమతాలను కౌలుకు తీసుకొని పెద్దవిగా రూపొందించటం సులభం అవుతుందని తెలిపారు. దేశంలో2011-12 సమాచారాన్ని బట్టి భూమిపై 49శాతం కార్మికవర్గం ఆధారపడుతున్నదని, జిడిపిలో వ్యవసాయ వాటా 15శాతం మాత్రమే వుందని, వ్యవసాయ రంగం ఏటా ఐదు శాతం వృద్ధి చెందినా రాబోయే రోజులలో జిడిపి వాటా తగ్గనుందని కూడా ఆయన చెప్పారు.

     పంగారియా మాటలు, కౌలు రైతు నమూనా బిల్లును బట్టి రైతాంగం నుంచి ముఖ్యంగా చిన్న రైతాంగం నుంచి ఏదో ఒక రూపంలో భూములను విడిపించి ధనిక, కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించటాన్ని వేగవంతం చేయాలన్నది నరేంద్రమోడీ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. నిజానికి ఇది అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్య కార్పొరేట్‌ సంస్ధలు, ద్రవ్య పెట్టుబడిదారుల వత్తిడి మేరకు వాటి ప్రతినిధులుగా వున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధలు ఎప్పటి నుంచో సూచిస్తున్న విధానం. మన దేశంలో భూమి కోసం జరిగిన మహత్తర పోరాటాలు, ప్రాణత్యాగాల పూర్వరంగం, భూస్వామ్య విధానాన్ని రద్దు చేస్తే తప్ప పెట్టుబడిదారీ విధానం వృద్ధి చెందదన్న సాంప్రదాయ అవగాహన మేరకు ఒకవైపు భూస్వాములతో రాజీ పడుతూనే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు భూసంస్కరణల చట్టాలను చేయకతప్పలేదు. ముందే చెప్పుకున్నట్లు భూస్వాములతో రాజీ కారణంగా ఆ చట్టాలను నీరు గార్చారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ వంటి పార్టీలు అసలు భూ సంస్కరణల గురించి మాట్లాడటానికే సిద్ధం కానందున ఆ చట్టాలను అమలు జరిపే ప్రసక్తే వుండదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాపితంగా నయా వుదారవాద విధానాలు అమలులోకి వచ్చిన కారణంగా సిపిఎం వంటి కమ్యూనిస్టు, ఇతర వామపక్ష పార్టీలు తప్ప కాంగ్రెస్‌తో సహా అన్ని పాలకవర్గ పార్టీలు భూముల నుంచి రైతాంగాన్ని తొలగించేందుకు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు దారులు వెతుకుతున్నాయి. మన దేశంలోని సంక్లిష్ట పరిస్ధితులు, ముందే చెప్పుకున్నట్లు గ్రామీణ ప్రాంతాలలో భూ దాహం కారణంగా వారు అనుకున్నది వెంటనే సాధ్యం కావటం లేదు. పొమ్మనకుండా పొగ పెట్టినట్లు చిన్న,సన్నకారు రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసి వారు భూములను వదులుకొనేట్లు చేస్తున్నారు. దానిలో భాగంగానే వ్యవసాయం రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెట్టటం మానివేశారు. ఎరువులు, డీజిల్‌ వంటి వాటికి ఇస్తున్న రాయితీలు,సబ్సిడీలను ఎత్తివేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల కార్యకలాపాలను నిర్వీర్యం చేస్తున్నారు. ధాన్య సేకరణ వంటి బాధ్యతల నుంచి ప్రభుత్వం క్రమంగా తప్పుకొంటోంది. వాటి స్ధానంలో స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తోంది.ఇవన్నీ భూముల నుంచి రైతాంగాన్ని తప్పించేందుకు, కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు చేస్తున్న ప్రయతాలు.

     అటువంటి యత్నాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను సమీక్షించేందుకు ఈ నెల 17న అంతర్జాతీయ రైతాంగ పోరాటాల దీక్షా దినం పాటించబడింది.ఈ సందర్బంగా అనేక దేశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్‌ 17న బ్రెజిల్‌లో భూమికోసం, భుక్తి కోసం శిరమెత్తిన రైతాంగంపై కార్పొరేట్లకు వత్తాసుగా రంగంలోకి దిగిన మిలిటరీ,పోలీసులు భూమిలేని పేదల వుద్యమ సంస్ధ(ఎంఎస్‌టి) సభ్యులు, మద్దతుదార్లపై జరిపిన కాల్పులలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, ఎందరో గాయపడ్డారు.ఈ హత్యాకాండ జరిగిన సమయంలోనే మెక్సికోలోని లాక్సాకాలాలో వివిధ దేశాల రైతు సంఘాల ప్రతినిధుల రెండవ అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే అంతర్జాతీయ రైతుపోరాటాల దినం పాటించాలని నిర్ణయించారు. ఆ రోజు బ్రెజిల్‌లో హత్యాకాండకు పాల్పడిన వారికి ఇంత వరకు ఎలాంటి శిక్షలు పడలేదు. ప్రతి ఏటా అప్పటి నుంచి ఆ రోజును రైతాంగ పోరాటాల దీక్షా దినంగా పాటిస్తున్నారు.

    ప్రపంచ పెట్టుబడిదారీ వర్గ లాభాల రేటును కాపాడేందుకు దాని ప్రతినిధులైన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ రూపొందించిన అజెండా, విధానాల మేరకుముందుకు తెచ్చిన సరికొత్త విధానాలకే ముద్దుగా సంస్కరణలు అని పేరు పెట్టారు. వాటినే నయా వుదారవాదం అని ప్రపంచీకరణ అని రకరకాలుగా పిలుస్తున్నారు. పేరులోనేమున్నది పెన్నిది అన్నట్లుగా ఏం చెప్పినా కార్పొరేట్ల లాభాల సంరక్షణే వీటి ప్రధాన లక్షణం, ధ్యేయం. తమ లాభాల కోసమే పెట్టుబడిదారీ వర్గం తమ పెరుగుదలకు అడ్డంగా వున్న ఫ్యూడల్‌ విధానాన్ని బద్దలు కొట్టింది. భూసంస్కరణలను ప్రోత్సహించింది. అదే పెట్టుబడిదారీ వర్గం బహుళజాతి గుత్త సంస్థలు(కార్పొరేట్‌లు)గా మారి ప్రపంచ మార్కెట్లపై పెత్తనం చేస్తున్నాయి. వాటి కన్ను ఇప్పుడు పరిశ్రమలు, వాణిజ్యంతో పాటు వ్యవసాయంపై పడింది.ఈ రంగాన్ని కూడా కార్పొరేటీకరణ చేయటం ద్వారా దాని నుంచి కూడా లాభాలు పిండాలని చూస్తోంది. దానిలో భాగంగా రైతులను భూములనుంచి వెళ్లగొట్టి కార్పొరేట్‌ భూస్వాములను తయారు చేసేందుకు పూనుకుంది. ఈ ప్రయోగాలకు ముందుగా లాటిన్‌ అమెరికాను ఎంచుకుంది.

    గుండు సూది నుంచి వూరంత ఓడల నిర్మాణాల మొదలు, వాటిని విక్రయించే వాణిజ్య సంస్ధలుగానూ, వాటికి అవసరమైన ముడి సరకులు అందించే, వ్యవసాయానికి అవసరమైన విత్తనాల నుంచి, పురుగుమందులవరకు తయారీ, సరఫరా, చివరకు వ్యవసాయ వుత్పత్తుల కొనుగోలు చేసి వాటిని ఆహారంగా మార్చి విక్రయించటం వరకు కార్పొరేట్‌ కంపెనీలు వివిధ అవతారాలు ఎత్తుతున్నాయి. అందువలన వర్తమానంలో పోరాటాలు కూడా వివిధ తరగతుల కార్మికులు, రైతులు, వినియోగదారులు అందరూ ఐక్యంగా తమను ప్రభావితం చేస్తున్న కార్పొరేట్లకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో శత్రువు ప్రత్యక్షంగా కనపడే వాడు, ఇప్పుడు అలా కాదు. వ్యవసాయ రంగంలో పారిశ్రామిక పెట్టుబడిదారులతో పాటు ద్రవ్య పెట్టుబడిదారులు కూడా ప్రవేశిస్తున్నారు. ఎక్కడో అమెరికాలో వుండి అనకాపల్లి బెల్లం మార్కెట్‌ను, మదనపల్లిలోని టమోటా, కర్నూలు వుల్లిపాయల, నిజామాబాద్‌ పసుపు మార్కెట్‌లను కూడా అదుపు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.ఈ సంక్లిష్ట,నూతన పరిస్ధితులను అర్ధం చేసుకోవటానికి, కార్యాచరణకు పూనుకోవటానికి నూతన పద్దతులు, రూపాలను ఎంచుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే నయావుదారవాద విధానాల ప్రయోగం మొదలయిందో అక్కడే వికటించి ప్రతిఘటన కూడా ప్రారంభమైంది. అందుకనే నయావుదారవాద విధానాలకు వ్యతిరేేక వేదికగా లాటిన్‌ అమెరికా తయారైంది. వుద్యమాలు, వాటి రూపాలు అన్నింటిలోనూ నూతన విధానాలు, పద్దతులు వునికిలోకి వస్తున్నాయి. రాబోయే రోజులలో ఇంకా వస్తాయి.భూమి హక్కుతో పాటు ఆహార హక్కును కూడా కార్పొరేట్‌లు హరించేందుకు పూనుకున్నాయి. భూములను కబళిస్తున్న కార్పొరేట్‌ సంస్ధల బకాసురులకు వ్యతిరేకంగా నేడు భూ పోరాటం చేయటం అంటే ఒక్క రైతులే కాదు, సదరు కార్పొరేట్‌ కంపెనీ వలన ప్రభావితమయ్యే తరగతులందరూ కలిసి వస్తేనే అవి సంపూర్ణం అవుతాయి. అంటే రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, మధ్యతరగతి వుద్యోగులు, వినియోగదారులూ భాగస్వామలు కావాల్సి వుంది.

    గత కొద్ది దశాబ్దాలుగా అనుసరించిన స్వేచ్ఛా వ్యవసాయ వాణిజ్య విధానాలు సామాన్య రైతు వుత్పత్తి ఖర్చులకంటే తక్కువకు వ్యవసాయ వుత్పత్తుల ధరలను నెట్టి గిట్టుబాటు కాకుండా చేస్తున్నాయి.ఒకే రకమైన పంటల సాగు క్రమంగా పెరుగుతోంది. వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఎరువులు,పురుగు మందుల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. పర్యవసానంగా చిన్న రైతులు వ్యవసాయం నుంచి తప్పుకుంటున్నారు. 1935లో అమెరికాలో 70లక్షల కమతాలు వుండగా నేడు 21లక్షలకు తగ్గిపోయాయి. రానున్న పది-ఇరవై సంవత్సరాలలో 40 కోట్ల ఎకరాల మేరకు చేతులు మారవచ్చని అంచనా. అమెరికాలో 30లక్షల మంది వ్యవసాయ కార్మికులు తక్కువ వేతనాలు, మానవ హక్కులకు నోచుకోకుండా గడుపుతున్నారు. అమెరికాలో మరొక ముఖ్యాంశాన్ని కూడా చూడాల్సి వుంది. మన దేశంలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారి మాదిరే అమెరికాలో రెడ్‌ ఇండియన్లు, లాటినోలు, ఆసియన్‌ అమెరికన్లు, ఆఫ్రో అమెరికన్ల వంటి వారందరూ కేవలం ఏడు శాతం భూమి కలిగి వుండగా తెల్లజాతీయులు 93శాతం భూమి కలిగి వున్నారు.

     భూ కేంద్రీకరణ ఒక్క అమెరికాలోనే కాదు ఐరోపాలోనూ జరుగుతోంది. అక్కడ వంద హెక్టార్లు, అంతకు పైబడినవి కోటీ 20లక్షల కమతాలున్నట్లు అంచనా. అవి మొత్తం కమతాలలో కేవలం మూడు శాతమే అయినా అక్కడి భూమిలో సగం వాటిలోనే వుంది. జర్మనీలో 1966-67లో 12,46,000 కమతాలుండగా 2010 నాటికి 2,99,100కు పడిపోయాయి. వీటిలో కూడా రెండు హెక్టార్లకు లోపు వున్నవి 1990లో 1,23,670 వుండగా 2007 నాటికి 20,110కి తగ్గాయి. యాభై హెక్టార్లు అంతకంటే ఎక్కువ వున్న కమతాలలోని భూమి 1990లో 92లక్షల హెక్టార్లు వుండగా 2007 నాటికి కోటీ 26లక్షల హెక్టార్లకు పెరిగింది. సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత తూర్పు ఐరోపా దేశాలు ఐరోపా యూనియన్‌లో చేరినందున రైతాంగం దివాలా తీసింది. పశ్చిమ ధనిక దేశాల నుంచి భారీ సబ్సిడీలతో కూడిన వ్యవసాయ వుత్పత్తులు వరదలా తూర్పు దేశాలను ముంచెత్తాయి. దానికి తోడు ఐరోపా యూనియన్‌ అందచేసే సబ్సిడీలను పొందేందుకు చిన్న రైతులు అనర్హులు అన్న నిబంధన కారణంగా వారంతా గిట్టుబాటు గాక భూములను అమ్ముకున్నారు. ఈ పరిస్ధితిని స్పెక్యులేటర్లు, కార్పొరేట్‌ మదుపుదార్లు సొమ్ము చేసుకున్నారు.

    ఐరోపా వుమ్మడి వ్యవసాయ విధానం పేరుతో అందచేసిన సబ్సిడీలు పెద్ద రైతాంగమే దక్కించుకుంటోంది.ఇటలీలోని 0.29శాతం కమతాలు 2011లో అందచేసిన మొత్తం రాయితీలలో 18శాతం మొత్తాన్ని దక్కించుకున్నాయి. వాటిలో 0.000 శాతం(150 కమతాలు) అన్ని రకాల సబ్సిడీలలో ఆరుశాతాన్ని దక్కించుకున్నాయి. స్పెయిన్‌లో 75శాతం సబ్సిడీలను 16శాతం, హంగరీలో 72శాతం మొత్తాలను 8.6 శాతం పెద్ద కమతాల రైతులు దక్కించుకున్నారు. ఈ పరిణామాలను చూసిన తరువాత ప్రస్తుతం ప్రతి హెక్టారుకు ఇంత అనే పద్దతిలో సబ్సిడీలు ఇచ్చేందుకు నిబంధనలను సవరిస్తున్నారు. భూమి మాత్రమే కాదు కార్పొరేట్లు సముద్రాలను కూడా కబళిస్తున్నారు.చేపలు పట్టుకొనే హక్కును వేలం వేయటంతో బడా బ్యాంకులు, కార్పొరేట్లు రంగంలోకి దిగి చిన్నచిన్న మత్స్యకారులను వెనక్కు నెట్టివేస్తున్నాయి.

   లా వియా కంపేసినా (స్పానిష్‌) అంటే రైతు మార్గం పేరుతో 1993లో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో ఏర్పడిన అంతర్జాతీయ సంస్ధ ప్రతి ఏటా ఏప్రిల్‌ 17న రైతాంగ పోరాటాలను సమీక్షిస్తున్నది. భూమికోసం, భూ రక్షణ పోరాటంలో భవిష్యత్‌లో మరొక ప్రాణం పోరాదన్నది దాని నినాదం. ప్రస్తుతం 73 దేశాలు, 164 జాతులకు చెందిన సంస్దలు , ఎన్‌జీవోలు ఈ వుద్యమంలో భాగస్వాములుగా వున్నాయి. ఏటేటా మరింతగా విస్తరించటంతో పాటు మరిన్ని పోరాటాలకు వేదికగా ఈ వుద్యమం మారుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Index Numbers of Wholesale Price in India (Base: 2004-05=100) Review for the month of March, 2016

18 Monday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Index Numbers of Wholesale Price in India (Base: 2004-05=100) Review, Wholesale Price in India

The official Wholesale Price Index for ‘All Commodities’ (Base: 2004-05=100) for the month of March, 2016 rose by 0.3 percent to 174.6 (provisional) from 174.0 (provisional) for the previous month.

INFLATION

The annual rate of inflation, based on monthly WPI, stood at -0.85% (provisional) for the month of March, 2016 (over March, 2015) as compared to -0.91% (provisional) for the previous month and -2.33% during the corresponding month of the previous year.  Build up inflation rate in the financial year so far was -0.85% compared to a build up rate of -2.33% in the corresponding period of the previous year.

Inflation for important commodities / commodity groups is indicated in Annex-1 and Annex-II.

The movement of the index for the various commodity groups is summarized below:-

PRIMARY ARTICLES (Weight 20.12%)

The index for this major group declined by 0.2 percent to 244.1 (provisional) from 244.7 (provisional) for the previous month.  The groups and items which showed variations during the month are as follows:-

The index for ‘Food Articles’ group declined by 0.2 percent to 258.6 (provisional) from 259.1 (provisional) for the previous month due to lower price of tea (7%), egg (6%), arhar and masur (4% each), condiments & spices (3%), gram, urad, moong and fish-inland (2% each) and barley and fruits & vegetables (1% each).  However, the price of poultry chicken   (9%), bajra (4%), fish-marine (3%) and maize, jowar, beef & buffalo meat, milk and pork (1% each) moved up.

The index for ‘Non-Food Articles’ group rose by 0.5 percent to 219.0 (provisional) from 217.9 (provisional) for the previous month due to higher price of raw rubber (17%), groundnut seed (8%), sugarcane (6%), raw jute, soyabean and linseed (2% each) and coir fibre, cotton seed, fodder and safflower (kardi seed) (1% each).  However, the price of flowers (17%), copra (coconut) (8%), rape & mustard seed (5%), raw silk, guar seed, raw cotton, gingelly seed and mesta (3% each) and castor seed and niger seed (2% each) declined.

The index for ‘Minerals’  group declined by 2.5 percent to 178.5 (provisional) from 183.0  (provisional) for the previous month due to lower price of crude petroleum (4%), iron ore (3%), magnesite (2%) and chromite (1%).  However, the price of zinc concentrate (4%) and sillimanite (1%) moved up.

FUEL & POWER (Weight 14.91%)

The index for this major group rose by 1.7 percent to 172.4 (provisional) from 169.6 (provisional) for the previous month due to higher price of aviation turbine fuel (14%), high speed diesel (6%), furnace oil (5%) and kerosene and bitumen (1% each).  However, the price of electricity and petrol (3% each) and LPG (1%) declined.

MANUFACTURED PRODUCTS (Weight 64.97%)

The index for this major group rose by 0.4 percent to 153.7 (provisional) from 153.1 (provisional) for the previous month. The groups and items for which the index showed variations during the month are as follows:-

The index for ‘Food Products’ group declined by 0.2 percent to 177.7 (provisional) from 178.1 (provisional) for the previous month due to lower price of tea leaf (unblended) (14%), tea leaf (blended) (4%), tea dust (unblended) (3%), mustard & rapeseed oil (2%) and gur (1%).  However, the price of gola (cattle feed) (5%), processed prawn, gingelly oil and tea dust (blended) (3% each), khandsari and canned fish (2% each) and powder milk, rice bran oil, palm oil, cotton seed oil and bakery products (1% each) moved up.

The index for ‘Beverages, Tobacco & Tobacco Products’ group rose by 1.4 percent to 210.2 (provisional) from 207.2 (provisional) for the previous month due to higher price of imfl-blended (11%), dried tobacco (7%), chewing tobacco (scented or not) (4%) and soft drinks & carbonated water and beer (1% each).  However, the price of zarda (3%) declined.

The index for ‘Textiles’ group rose by 0.1 percent to 139.8 (provisional) from 139.6 (provisional) for the previous month due to higher price of jute yarn (6%), jute sacking bag (3%), jute sacking cloth (2%) and man made fabric (1%).  However, the price of tyre cord fabric (2%) declined.

The index for ‘Wood & Wood Products’ group rose by 0.5 percent to 196.9 (provisional) from 195.9 (provisional) for the previous month due to higher price of processed wood (1%).

The index for ‘Paper & Paper Products’ group rose by 0.4 percent to 156.1 (provisional) from 155.5 (provisional) for the previous month due to higher price of corrugated sheet boxes (2%) and newspaper, kraft  paper & bags, cream  laid woven paper and paper rolls (1% each).

The index for ‘Leather & Leather Products’ group rose by 0.6 percent to 146.0 (provisional) from 145.2 (provisional) for the previous month due to higher price of leather footwear and leathers (1%).

The index for ‘Rubber & Plastic Products’ group rose by 0.4 percent to 145.6 (provisional) from 145.0 (provisional) for the previous month due to higher price of tubes (3%) and plastic products (1%).

The index for ‘Non-Metallic Mineral Products’ group rose by 0.3 percent to 178.3 (provisional) from 177.7 (provisional) for the previous month due to higher price of polished granite (2%) and grey cement (1%).  However, the price of railway sleeper (1%) declined.

The index for ‘Basic Metals, Alloys & Metal Products’ group rose by 1.8 percent to 153.1 (provisional) from 150.4 (provisional) for the previous month due to higher price of gp/gc sheets (7%), rounds (6%), plates and billets (5% each),     HRC, melting scrap, wire rods and angles (4% each), CRC, gold & gold ornaments, joist & beams and pencil  ingots (3% each), silver, sponge iron, nuts/bolts/screw/ washers and rebars (2% each) and pig iron (1%).  However, the price of steel rods (5%), lead (3%), sheets and steel: pipes & tubes (2% each) and pipes/tubes/rods/strips and steel castings (1% each) declined.

The index for ‘Machinery & Machine Tools’ group declined by 0.1 percent to 134.9 (provisional) from 135.1 (provisional) for the previous month due to lower price of fibre optic cable (9%), fluorescent tubes (3%), pvc insulated cable, electric motors and heat exchanger (2% each) and industrial  valves, engines, conductor and ball/roller bearing (1% each).  However, the price of machine tools (3%) and insulators (1%) moved up.

The index for ‘Transport, Equipment & Parts’ group rose by 0.6 percent to 139.0 (provisional) from 138.2 (provisional) for the previous month due to higher price of motor cycle / scooter / moped (4%).  However, the price of railway brake gear (2%) declined.

FINAL INDEX FOR THE MONTH OF JANUARY, 2016 (BASE YEAR: 2004-05=100)

For the month of January, 2016, the final Wholesale Price Index for ‘All Commodities’ (Base: 2004-05=100) stood at 175.4 as compared to 175.7 (provisional) and annual rate of inflation based on final index stood at -1.07 percent as compared to     -0.90 percent (provisional) respectively as reported on 15.02.2016.

Next date of press release: 16/05/2016 for the month of April, 2016

Office of Economic Adviser, Ministry of Commerce & Industry, New Delhi,

 Annexure-I

Wholesale Price Index and Rates of Inflation (Base Year: 2004-05=100)

 

          Month of March, 2016
Commodities/Major Groups/Groups/Sub-Groups Weight WPI Mar- 2016 Latest month over month Build up from March Year on year
2014-15 2015-16 2014-15 2015-16 2014-15 2015-16
ALL COMMODITIES 100.00000 174.6 0.28 0.34 -2.33 -0.85 -2.33 -0.85
PRIMARY ARTICLES 20.11815 244.1 -0.79 -0.25 -0.17 2.13 -0.17 2.13
Food Articles 14.33709 258.6 -0.56 -0.19 6.27 3.73 6.27 3.73
Cereals 3.37323 236.8 -1.03 0.30 0.00 2.47 0.00 2.47
Rice 1.79348 235.0 -2.30 -0.09 0.65 0.60 0.65 0.60
Wheat 1.11595 222.0 -0.05 0.18 -1.19 3.02 -1.19 3.02
Pulses 0.71662 346.6 0.43 -2.75 13.22 34.45 13.22 34.45
Vegetables 1.73553 211.9 -4.83 -3.77 9.27 -2.26 9.27 -2.26
Potato 0.20150 156.6 -6.90 2.89 -21.50 3.57 -21.50 3.57
Onion 0.17794 273.8 -3.62 -8.55 36.49 -17.65 36.49 -17.65
Fruits 2.10717 238.6 1.25 1.06 12.56 -2.13 12.56 -2.13
Milk 3.23818 253.9 -0.04 0.87 7.48 2.67 7.48 2.67
Egg, Meat & Fish 2.41384 300.8 0.59 0.80 2.62 3.69 2.62 3.69
Non-Food Articles 4.25756 219.0 -1.55 0.50 -6.94 8.09 -6.94 8.09
Fibres 0.87737 206.3 0.83 -1.81 -18.91 6.67 -18.91 6.67
Oil Seeds 1.78051 210.9 0.89 0.43 -1.26 3.18 -1.26 3.18
Minerals 1.52350 178.5 -1.78 -2.46 -29.58 -26.63 -29.58 -26.63
FUEL & POWER 14.91021 172.4 3.75 1.65 -12.23 -8.30 -12.23 -8.30
Liquefied petroleum gas 0.91468 160.1 0.12 -1.23 -7.92 -1.60 -7.92 -1.60
Petrol 1.09015 148.8 6.31 -3.19 -17.70 -9.87 -17.70 -9.87
High speed diesel 4.67020 183.3 7.86 5.47 -12.11 -9.79 -12.11 -9.79
MANUFACTURED PRODUCTS 64.97164 153.7 -0.06 0.39 -0.19 -0.13 -0.19 -0.13
Food Products 9.97396 177.7 -0.29 -0.22 0.59 4.47 0.59 4.47
Sugar 1.73731 185.3 -1.86 0.05 -4.85 6.19 -4.85 6.19
Edible Oils 3.04293 150.0 -0.55 -0.13 -1.16 3.59 -1.16 3.59
Beverages, Tobacco & Tobacco Product 1.76247 210.2 0.25 1.45 3.83 3.44 3.83 3.44
Cotton Textiles 2.60526 155.3 -0.13 -0.06 -4.37 -1.52 -4.37 -1.52
Man Made Textiles 2.20573 129.1 0.15 0.00 -1.78 -2.64 -1.78 -2.64
Wood & Wood Products 0.58744 196.9 0.11 0.51 1.23 3.80 1.23 3.80
Paper & Paper Products 2.03350 156.1 0.99 0.39 3.59 2.09 3.59 2.09
Leather & Leather Products 0.83509 146.0 0.21 0.55 -2.53 2.60 -2.53 2.60
Rubber & Plastic Products 2.98697 145.6 0.27 0.41 -1.07 -1.82 -1.07 -1.82
Chemicals & Chemical Products 12.01770 149.5 0.20 0.00 -1.11 -0.93 -1.11 -0.93
Non-Metallic Mineral Products 2.55597 178.3 1.42 0.34 6.69 -0.22 6.69 -0.22
Cement & Lime 1.38646 174.8 2.13 0.69 8.29 -1.63 8.29 -1.63
Basic Metals Alloys & Metal Product 10.74785 153.1 -1.04 1.80 -3.40 -5.44 -3.40 -5.44
Iron & Semis 1.56301 135.3 -1.59 2.19 -6.29 -9.13 -6.29 -9.13
Machinery & Machine Tools 8.93148 134.9 -0.15 -0.15 1.35 -0.07 1.35 -0.07
Transport Equipment & Parts 5.21282 139.0 0.15 0.58 1.10 1.24 1.10 1.24

  

 

Annexure-II

               
Trend of Rate of Inflation for some important items during last six months
               
Commodities/Major Groups/Groups/Sub-Groups Weight (%) Rate of Inflation for the last six months
Mar-16 Feb-16 Jan-16 Dec-15 Nov-15 Oct-15
ALL COMMODITIES 100.00 -0.85 -0.91 -1.07 -1.06 -2.04 -3.70
PRIMARY ARTICLES 20.12 2.13 1.58 4.30 4.58 2.15 0.04
Food Articles 14.34 3.73 3.35 6.46 7.89 5.55 3.33
Cereals 3.37 2.47 1.11 2.91 1.93 0.51 -0.13
Rice 1.79 0.60 -1.63 -0.13 -1.25 -3.26 -3.40
Wheat 1.12 3.02 2.78 5.54 3.91 4.44 4.58
Pulses 0.72 34.45 38.84 45.03 55.76 58.09 53.06
Vegetables 1.74 -2.26 -3.34 12.71 19.50 13.25 3.17
Potato 0.20 3.57 -6.28 -17.08 -35.40 -52.87 -58.10
Onion 0.18 -17.65 -13.22 7.45 18.32 44.51 89.52
Fruits 2.11 -2.13 -1.95 -2.03 -0.55 -2.59 -4.46
Milk 3.24 2.67 1.74 1.42 1.78 1.58 1.75
Egg, Meat & Fish 2.41 3.69 3.47 5.90 5.03 0.49 0.46
Non-Food Articles 4.26 8.09 5.88 9.35 7.84 6.33 5.10
Fibres 0.88 6.67 9.54 7.97 2.71 0.10 -2.20
Oil Seeds 1.78 3.18 3.65 5.76 8.23 6.97 6.66
Minerals 1.52 -26.63 -26.12 -29.27 -31.02 -32.95 -33.64
FUEL & POWER 14.91 -8.30 -6.40 -9.89 -9.15 -10.99 -16.32
Liquefied petroleum gas 0.91 -1.60 -0.25 -1.26 -2.51 -5.74 -5.83
Petrol 1.09 -9.87 -1.03 -5.45 -7.90 -9.36 -13.16
High speed diesel 4.67 -9.79 -7.75 -13.00 -13.80 -16.69 -26.21
MANUFACTURED PRODUCTS 64.97 -0.13 -0.58 -1.17 -1.49 -1.42 -1.67
Food Products 9.97 4.47 4.40 2.79 1.69 1.10 0.46
Sugar 1.74 6.19 4.16 -0.55 -7.51 -11.22 -13.08
Edible Oils 3.04 3.59 3.16 1.64 4.68 4.66 4.74
Beverages, Tobacco & Tobacco Product 1.76 3.44 2.22 2.13 2.03 2.23 2.29
Cotton Textiles 2.61 -1.52 -1.58 -2.14 -2.51 -3.18 -4.00
Man Made Textiles 2.21 -2.64 -2.49 -2.72 -3.78 -4.26 -5.09
Wood & Wood Products 0.59 3.80 3.38 3.49 3.28 4.86 4.81
Paper & Paper Products 2.03 2.09 2.71 2.78 2.58 2.38 2.31
Leather & Leather Products 0.84 2.60 2.25 1.75 0.21 -1.16 -1.37
Rubber & Plastic Products 2.99 -1.82 -1.96 -2.15 -2.61 -2.60 -2.78
Chemicals & Chemical Products 12.02 -0.93 -0.73 -1.32 -1.71 -2.02 -1.83
Non-Metallic Mineral Products 2.56 -0.22 0.85 1.83 2.71 2.28 0.45
Cement & Lime 1.39 -1.63 -0.23 1.05 3.25 3.22 -0.12
Basic Metals Alloys & Metal Product 10.75 -5.44 -8.07 -9.30 -9.23 -8.00 -7.50
Iron & Semis 1.56 -9.13 -12.49 -13.46 -14.16 -13.67 -12.96
Machinery & Machine Tools 8.93 -0.07 -0.07 -0.44 0.22 0.15 0.00
Transport Equipment & Parts 5.21 1.24 0.80 1.46 1.47 1.62 1.32

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

India’s Foreign Trade: March, 2016

18 Monday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Foreign Trade, India’s Foreign Trade

 MERCHANDISE TRADE

  EXPORTS (including re-exports)

Exports during March, 2016 were valued at US$ 22718.69 million (Rs.152264.96 crore) which was 5.47 per cent lower in Dollar terms (1.45 per cent higher in Rupee terms) than the level of US$ 24032.55 million (Rs.150082.80 crore) during March, 2015. Cumulative value of exports for the period April-March 2015-16 was US$ 261136.80 million (Rs.1708841.43 crore) as against US$ 310338.47 million (Rs.1896348.40 crore) registering a negative growth of 15.85 per cent in Dollar terms and 9.89 per cent in Rupee terms over the same period last year.

Non-petroleum exports in March 2016 are valued at US$ 20639.78 million against US$ 21386.48 million in March 2015, a reduction of 3.49 per cent. Non-petroleum exports during April to March 2016 are valued at US$ 231952.95 million as compared to US$ 253544.33 million for the corresponding period in 2015, a reduction of 8.52 per cent.

The trend of falling exports is in tandem with other major world economies. The growth in exports have fallen for USA (10.81 per cent), European Union (7.40 per cent), China (11.37 per cent) and Japan (12.85 per cent) for January 2016 over the corresponding period previous year as per WTO statistics.

IMPORTS

            Imports during March, 2016 were valued at US$ 27789.56 million (Rs.186250.88 crore) which was 21.56 per cent lower in Dollar terms and 15.82 per cent lower in Rupee terms over the level of imports valued at US$ 35428.72 million (Rs.221251.65 crore) in March, 2015. Cumulative value of imports for the period April-March 2015-16 was US$ 379596.17 million (Rs.2481367.22 crore) as against US$ 448033.42 million (Rs.2737086.58 crore) registering a negative growth of 15.28 per cent in Dollar terms and 9.34 per cent in Rupee terms over the same period last year.

CRUDE OIL AND NON-OIL IMPORTS:           

Oil imports during March, 2016 were valued at US$ 4799.96 million which was 35.30 per cent lower than oil imports valued at US$ 7418.51 million in the corresponding period last year. Oil imports during April-March, 2015-16 were valued at US$ 82662.26 million which was 40.24 per cent lower than the oil imports of US$ 138325.50 million in the corresponding period last year.

Non-oil imports during March, 2016 were estimated at US$ 22989.60 million which was 17.92 per cent lower than non-oil imports of US$ 28010.21 million in March, 2015. Non-oil imports during April-March, 2015-16 were valued at US$ 296933.91 million which was 4.12 per cent lower than the level of such imports valued at US$ 309707.92 million in April-March, 2014-15.

II.TRADE IN SERVICES (for February, 2016, as per the RBI Press Release dated 18th April, 2016)

EXPORTS (Receipts)

Exports during February, 2016 were valued at US$ 12329.00 Million (Rs. 84130.26 crore).

During February, 2016, on month-on-month basis, growth in services export remained negative (with a growth of 1.94 per cent) as compared to negative growth (10.44 per cent) during January 2016 (as per RBI’s Press Release for the respective months).

IMPORTS (Payments)

Imports during February, 2016 were valued at US$ 7189.00 million (Rs. 49056.08 crore). 

III.TRADE BALANCE

MERCHANDISE: The trade deficit for April-March, 2015-16 was estimated at US$ 118459.37 million which was lower than the deficit of US$ 137694.95 million during April-March, 2014-15.

SERVICES: As per RBI’s Press Release dated 18th April 2016, the trade balance in Services (i.e. net export of Services) for February, 2016 was estimated at US$ 5140 million. The net export of services for April- February, 2015-16 was estimated at US$ 64600.21 million which is lower than net export of services of US$ 69136.42 million during April- February, 2014-15. (The data for April-February 2015-16 has been derived by adding April-December 2015-16 with month wise QE data of RBI Press Release dated 18th April 2016).

 

OVERALL TRADE BALANCE: Taking merchandise and services together, overall trade deficit for April-March, 2015-16 estimated at US$ 53859.16 million as compared to US$ 68558.53 million over same period last year has fallen by 21.44 per cent (Services data pertains to April- February as February 2016 is the latest data available as per RBI’s Press Release dated 18th April 2016).

MERCHANDISE TRADE

 

EXPORTS & IMPORTS  : (US $ Million)
(PROVISIONAL)  
  MARCH APRIL-MARCH
EXPORTS(including re-exports)  
2014-15 24032.55 310338.47
2015-16 22718.69 261136.80
%Growth2015-16/ 2014-15 -5.47 -15.85
IMPORTS
2014-15 35428.72 448033.42
2015-16 27789.56 379596.17
%Growth2015-16/ 2014-15 -21.56 -15.28
TRADE BALANCE
2014-15 -11396.17 -137694.95
2015-16 -5070.87 -118459.37
   
EXPORTS & IMPORTS  : (Rs. Crore)
(PROVISIONAL)
  MARCH APRIL-MARCH
EXPORTS(including re-exports)  
2014-15 150082.80 1896348.40
2015-16 152264.96 1708841.43
%Growth2015-16/ 2014-15 1.45 -9.89
IMPORTS
2014-15 221251.65 2737086.58
2015-16 186250.88 2481367.22
%Growth2015-16/ 2014-15 -15.82 -9.34
TRADE BALANCE
2014-15 -71168.85 -840738.18
2015-16 -33985.92 -772525.79

 

SERVICES TRADE

 

EXPORTS & IMPORTS (SERVICES) : (US $ Million)
(PROVISIONAL) February 2015-16
EXPORTS (Receipts) 12329.00
IMPORTS (Payments) 7189.00
TRADE BALANCE 5140.00
   
EXPORTS & IMPORTS (SERVICES): (Rs. Crore)
(PROVISIONAL) February 2015-16
EXPORTS (Receipts) 84130.26
IMPORTS (Payments) 49056.08
TRADE BALANCE 35074.18
Source: RBI Press Release dated 18th April 2016

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

మొసాక్‌ ఫోన్సెకా కథ, కమామిషు

12 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Mossack Fonseca, panama, panama papers

ఎం కోటేశ్వరరావు

      ప్రపంచ నేతలు, పేరు మోసిన ప్రముఖులను గడ గడలాడిస్తున్న  పత్రాలను కలిగి వున్న కంపెనీ మొసాక్‌ ఫోన్సెకా కథ, కమామిషు ఏమిటి ? అనగా అనగా ఒక భూ ప్రపంచం, దానిలో ఒక ఖండం పేరు దక్షిణ అమెరికా, దానికి ఇంకొక పేరు లాటిన్‌ అమెరికా.దీనిని వుత్తర అమెరికా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు వున్న ఖండం) ఖండాన్ని కలుపుతూ మధ్యలో వున్న చిన్న దేశాలలో ఇదొకటి. అందుకని దీనిని మధ్య అమెరికా దేశం అని కూడా అంటారు గానీ ఖండాల వారీ చూస్తే దక్షిణ అమెరికాకే చెందుతుంది. పసిఫిక్‌-అట్లాంటిక్‌ సముద్రాలను కలుపుతూ ఒక కాలువను తవ్వారు అదే పనామా కాలువ.అంతకు ముందు ఐరోపా, ఆఫ్రికా ఖండాల నుంచి దూరప్రాచ్య దేశాలకు వెళ్లాలంటే దక్షిణ అమెరికాలోని చిలీలో వున్న కేప్‌ హారన్‌ను చుట్టి రావాల్సి వుండేది. అది ఖర్చు, సమయం వృధాతో పాటు ప్రమాదకర మార్గంగా వుండేది. దాంతో ఆఫ్రికా ఖండంపై ఆధిపత్యం సంపాదించిన ఫ్రెంచి పాలకులు పనామా కాలువకు రూప కల్పన చేశారు. ఈ కధ వేరే. అలాంటి పనామా తమ దేశంలో తవ్విన కాలువను జాతీయ చేసిన తరువాత ఆ కాలువ గుండా ప్రయాణించే ఓడల నుంచి టోలు వసూలు చేసుకోవటంతో పాటు సులభంగా డబ్బు సంపాదించేందుకు తమ దేశంలో కంపెనీలను ఏర్పాటు చేస్తే ఎలాంటి పన్నులు విధించబోమని ప్రకటించింది. పరిశ్రమలు పెడితే, వ్యాపారాలు నిర్వహించి తమ జనానికి వుపాధి కల్పిస్తే రాయితీలు ఇస్తామని ప్రకటించే దేశాల గురించి చాలా మందికి తెలుసు గానీ ఇలా కేవలం కంపెనీలను రిజిస్టర్‌ చేస్తే రాయితీలిచ్చే దేశాలు, ప్రాంతాలు ప్రపంచంలో చాలా తక్కువగా వున్నాయి.

    ఇంతకీ పనామా జనాభా ఎంత అనుకుంటున్నారు. నలభై లక్షల లోపు, వారిలో సగం మంది రాజధాని పనామా సిటీలోనే వుంటారు.కార్పొరేట్‌ కంపెనీలకు సేవలు అందించేందుకు 1977లో జర్మన్‌ లాయర్‌ జర్గన్‌ మొసాక్‌ తన పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేశాడు. పది సంవత్సరాల తరువాత పనామాకు చెందిన లాయర్‌ రామొన్‌ ఫొన్సేకా దానిలో చేరటంతో అది మొసాక్‌ ఫొన్సేకా కంపెనీగా మారింది. తరువాత స్విడ్జర్లాండ్‌కు చెందిన మరో లాయర్‌ క్రిస్టోఫ్‌ జోలింగర్‌ వారితో భాగస్వామిగా చేరాడు. ఇంకేముంది ముగ్గురు లాయర్లు అరవై కక్షిదారులుగా వారి వ్యాపారం విస్తరించింది. వాణిజ్య , ట్రస్ట్‌ చట్టాలు, కంపెనీ రిజిస్ట్రేషన్లు,మదుపు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్ధల గురించి సలహాలు అందించటంలో అది పేరు తెచ్చుకుంది.దానికి ప్రపంచంలో 40 కార్యాలయాలు వాటిలో 500 మంది సిబ్బంది వున్నారు. గుట్టుగా లావాదేవీలు నిర్వహించే ఈ సంస్ధలో 1977-2015 మధ్యకాలంలో దాని సేవలు పొందిన, పొందుతున్న ఖాతాదారుల వివరాల పత్రాలు వెల్లడి కావటంతో ప్రపంచ వ్యాపితంగా దాని పేరు తెలిసిపోయింది. పనామాలో ఇంకా ఇలాంటి సేవలు అందించే కంపెనీలు చాలా వున్నాయి.పనామాలో నమోదైన మొత్తం కంపెనీలలో సగం ఇలాంటి ఏడు పెద్ద సంస్ధల సేవలు పొందుతున్నాయి.

    ఎంత ఎదిగినా ఒదిగి వుండాలన్నట్లుగా అబ్బే మా కంపెనీ చాలా చిన్నదండీ ప్రపంచ ఆర్ధిక సేవల సలహాలలో కేవలం ఐదుశాతమే మా వాటా అని మొసాక్‌ ఫొన్సేకా చెప్పుకుంటుంది. కానీ పదిశాతం వరకు వుంటుందని ఒక అంచనా.కరీబియన్‌ ప్రాంతంలో బ్రిటీష్‌ వారి ఏలుబడిలో వున్న వర్జిన్‌ ఐలాండ్స్‌ అనే దీవిలో కూడా మొసాక్‌ ఫొన్సెకా కార్యకలాపాలు వున్నాయి. ఇక్కడ అది లక్షకు పైగా కంపెనీలను నమోదు చేసింది. ఇవి అక్కడి జనాభాకు నాలుగు రెట్లు ఎక్కువంటే ఆశ్చర్యపోవద్దు. వీటిని సూట్‌ కేస్‌ కంపెనీలని కూడా అంటారు. వాటికి కార్యాలయాలు వుండవు, సిబ్బంది వుండరు.పేరుకు అక్కడ ఆఫీసులు, ఇతర చోట్ల కార్యకలాపాలు, పన్నుల చెల్లింపు విషయానికి వస్తే అక్కడి చిరునామాను చూపి తప్పించుకుంటాయి. బినామీ, సూట్‌ కేసు కంపెనీల ఏర్పాటుకు సలహాలు ఇచ్చే మొసాక్‌ ఫోన్సెకా వంటి కంపెనీలు కూడా నకిలీలను ఏర్పాటు చేసుకుంటాయి. అర్జెంటీనా అక్రమాల విచారణలో ఇది ఎంఎఫ్‌ అనే మరో సూట్‌ కేసు కంపెనీ ఏర్పాటు చేసినట్లు బయటపడింది. బ్రెజిల్‌లో జరిగిన అక్రమాలలో కూడా ఇలాంటిదే బయట పడింది. అయితే అక్కడి కార్యాలయం తమ ఏజంట్‌ తప్ప తమ ప్రధాన కార్యాలయంనుంచి పనిచేయదని తప్పించుకుంది. ఈ కంపెనీ యజమానులలో ఒకరు పనామా సలహాదారుగా వుండి, ఈ కుంభకోణం బయటపడటంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

   మనదేశ చరిత్రలో అనేక కుంభకోణాలు జరిగాయి. వాటన్నింటినీ ఇక్కడ పేర్కొనటం సాధ్యం కాదు. వాటిలో దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించి అవినీతి మైలు రాళ్లుగా (ఇప్పుడు కిలోమీటర్‌ రాళ్లు అనుకోవాలి) చెప్పుకొనే కొన్నింటిని రేఖా మాత్రంగా ఇక్కడ చూద్దాం. నయా వుదారవాద విధానం లేదా నూతన ఆర్ధిక విధానాల పేరుతో 99శాతం ప్రజలకు చెందాల్సిన వనరులను ఒక శాతం కార్పొరేట్లకు కట్టపెట్టటం జరుగుతోంది.

    రాజ్యాంగ సంస్ధ అయిన కంప్ట్రోలర్‌ మరియు ఆడిటర్‌ (కాగ్‌) నివేదికల ప్రకారం మన దేశంలో అపారంగంగా వున్న బొగ్గు నిల్వలను వేలం పాట లేకుండా అడ్డదారుల్లో, అవినీతి మార్గాలలో ప్రయివేటు సంస్ధలకు కట్టపెట్టటం పెద్ద కుంభకోణం.దీనికి వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రూపకల్పన చేస్తే మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం అమలు జరిపింది. పనిలో పనిగా విమర్శలను తప్పించుకొనేందుకు కొన్ని ప్రభుత్వ రంగ సంస్ధలకు కూడా ఇచ్చారు. దాని వలన నష్టం లేదు. వచ్చే లాభాలు తిరిగి ప్రభుత్వానికే చేరతాయి.ఈ కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు లక్షా 86వేల కోట్ల రూపాయల నష్టమని కాగ్‌పేర్కొనగా మీడియా అంచనా పదిలక్షల కోట్లకు పైగానే వుంది. ఇదంతా 2004-09 మఢ్యనే జరిగింది. అదీ స్వయంగా ప్రధాని ఆధ్వర్యంలోనే అని తెలుసుకోవాలి.

    బాగా చర్చజరిగిన 2జి స్పెక్ట్రం కుంభకోణం కారణంగా ఖజానాకు లక్షా 76వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. పెరిగిన 2008 రేట్లు వున్నప్పటికీ నిబంధనలను పక్కదారి పట్టించి 2001 రేట్ల ప్రకారం కేటాయింపులు జరిపి ఈ అక్రమానికి తెరతీశారు.

   హవాలా కుంభకోణం. పన్ను ఎగవేసేందుకు, విదేశాల్లో డబ్బు దాచుకొనేందుకు అనుసరించిన విధానాన్ని హవాలా అంటారు. ఒక వ్యక్తి మన దేశం నుంచి అమెరికాకు డబ్బు పంపాలి. మరొకరు అక్కడి నుంచి మన దేశానికి పంపాలి. చట్ట బద్దమైన పద్దతులలో పంపితే లెక్కలు చూపాలి, పన్ను కట్టాలి.ఇవేమీ లేకుండానే కొంత కమిషన్‌ తీసుకొని అక్కడా ఇక్కడా డబ్బు సర్దుబాటు చేసే ఏజంట్లు వుంటారు.ఇందుకు గాను మన దేశంలో రాజకీయ నాయకులకు కోటీ ఎనభైలక్షల డాలర్ల మేర ముడుపులు ఇచ్చారని 1996లో వెల్లడయింది. దీనిలో అద్వానీ పేరు కూడా చోటు చేసుకుంది. తరువాత కాదని తేల్చారు. ఈ కుంభకోణం ఇప్పుడు కూడా నడుస్తున్నది.

    పెద్ద గీతను చిన్నదానిగా చేయాలంటే దాని పక్కనే మరింత పెద్దగీత గీయాలి. ఒకప్పుడు హర్షద్‌ మెహతా పెద్ద గీత ఇప్పుడు అంతకంటే ఎన్నో పెద్ద గీతలు.బ్యాంకులు, బోంబే స్టాక్‌ మార్కెట్‌ను మోసం చేసి దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన హర్షద్‌ మెహతా బీమా కంపెనీలో ఒక చిన్న వుద్యోగి. ఆర్ధిక లావాదేవీలలో లొసుగులను కనిపెట్టి వాటిని వుపయోగించుకున్నాడు.మొత్తం 28 కేసులు నమోదు చేయగా నాలుగింటిలోనే శిక్ష పడింది. 47ఏళ్ల వయసులో జైల్లో మరణించాడు. ఆ కేసులు మాత్రం ఇంకా నడుస్తూనే వున్నాయి.

  రక్షణ రంగంలో ముడుపులు లేని లావాదేవీ వుండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాటిని బహిర్గతం చేసింది బోఫోర్స్‌ కుంభకోణం. పెద్ద తుపాకుల కొనుగోలు కాంట్రాక్టులో 80 కోట్ల రూపాయల కమిషన్లు పొందిన వారిలో రాజీవ్‌ గాంధీ వున్నట్లు వెల్లడైంది. దీంతో పెద్ద సంచలనం. ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలతో పోలిస్తే ఇది మరీ చిన్నగీత.

   కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా చివరికి గడ్డిలో కూడా కోట్లు సంపాదించవచ్చుని బీహార్‌లో జరిగిన 900 కోట్ల రూపాయల ఈ కుంభకోణం నిరూపించింది. దీని పేరు చెబితే వెంటనే లాలూ ప్రసాద్‌ యూదవ్‌ గుర్తుకు రాక మానరు.. బ్యాంకింగ్‌ రంగంలో వున్న లొసుగులను వుపయోగించుకొని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను కేతన్‌ పరేఖ్‌ అనే పెద్ద ఒక విధంగా వందల కోట్ల రూపాయలకు ముంచాడు.

    దాదాపు పది సంవత్సరాల పాటు విదేశీ, స్వదేశీ జనాలు, కంపెనీలను దాదాపు 14వేల కోట్ల రూపాయలకు ముంచిన సత్యం కంప్యూటర్స్‌ గురించి పెద్దగా చెప్పుకోనవసరం లేద. బిల్‌గేట్స్‌,చంద్రబాబు నాయుడు వంటి వారు ఈ మోసగాడిని తమ పక్కన కూర్చో పెట్టుకొని అందలమెక్కించారు. నకిలీ స్టాంపుల ముద్రణతో 20వేల కోట్లకు పైగా ముంచిన తెల్గి, దాదాపు పదివేల కోట్ల రూపాయలను స్వాహా చేసిన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణం వంటివి మన కళ్ల ముందే జరిగాయి. వీటిలో భాగస్వాములైన వారిని శిక్షిస్తారా ? పోయిన ప్రజల సొమ్మును తిరిగి రాబడతారా ? అప్పనంగా సొమ్మును అప్పగించటమే అవినీతి కాదు, అలా తేలిన సొమ్మును రాబట్టకపోవటం కూడా అవినీతిలో భాగమే అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పనామా కంపెనీ పత్రాలు – పెద్దల అవినీతి చిత్రాలు

12 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

big shots corruption, CORRUPTION, panama, panama papers

ముందుగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకొని దానిలో దూరిపో , లెక్క తప్పి అధికారానికి రాకపోయినా ఫరవాలేదు, తరువాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సిగ్గూ ఎగ్గూ పక్కన పెట్టేసి అధికారానికి వచ్చిన పార్టీలో చేరిపో, మంచి పదవి కొనుక్కో , వెంటనే చూసుకో ఒక పన్ను స్వర్గం ! పెట్టుకో లేదా కొనుక్కో అక్కడో సూట్‌కేస్‌ కంపెనీ !! ఇక్కడ దండుకో అందినంత సొమ్ము !!! భారత మాతాకీ జై కొట్టు !!!!

ఎం కోటేశ్వరరావు

   లైసన్సులు, పర్మిట్లు ఇప్పించినందుకు లంచాలు తీసుకోవటం, బల్లకింద చెయ్యి పెట్టటం నాటి పద్దతి ! ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలు, భూములు, రుణాలు ఇప్పించి నీకది-నాకిది, నీకింత -నాకింత అని పంచుకోవటం నేటి పద్దతి !! ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకుంటుంటే అవినీతి నిరోధకశాఖ సిబ్బంది నాటకీయంగా వలపన్నటం లెక్కలేనన్ని సినిమాల్లో అందరూ చూసింది మోటు పద్దతి. ఇప్పుడు అంతా చట్టబద్దమే, బల్లమీది వ్యవహారమే.

    రాజకీయ నేత, పారిశ్రామికవేత్త, వ్యాపారి, సినిమా యాక్టర్‌ ఇలా ఎందరో మహాను భావులు , చిదిమితే దేశ భక్తి కారిపోతుంటుంది. ప్రతిదానినీ వ్యాపారం-లాభం లెక్కలలో చూసుకొనేవారు ఎవరైనా ఇదే పద్దతి. గజం పాతికవేల రూపాయల స్ధలాన్ని కంపెనీ పేరుతో పాతిక రూపాయలకే అప్పనంగా పొందవచ్చు. దీన్ని కేటాయించిన సదరు మంత్రి కుమారుడు, కుమార్తెల పేరుతో (ఎందుకంటే ఇప్పుడు బావమరుదులను కూడా నమ్మటం లేదు మరి) ముందుగానే ఏర్పాటు చేసిన సూట్‌ కేసు కంపెనీలలో పది రూపాయల వాటాను వెయ్యి రూపాయలకు కొనటం లేదా సదరు కంపెనీకి ఎలాంటి వడ్డీ లేకుండా వందల కోట్ల రుణం పేరుతో డబ్బు బదలాయించి చట్టబద్దంగానే లంచం చెల్లించటం నేటి పద్దతి.

     ఇక అలా సంపాదించిన దానిని స్నేహితులు, బంధువుల పేరుతోనో మరొక పేరుతోనో దాస్తే, ఎవరినీ నమ్మే రోజులు కావివి, తీరా గడ్డితిని సంపాదించిన దానిని వారు నొక్కేస్తే ? డబ్బూపోయె శనీ పట్టె అన్నట్లు ఎందుకొచ్చిన తిప్పలు ! విదేశాల్లో దాచుకుంటే ఏ గొడవా వుండదు. అందుకే ముందుగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకొని దానిలో దూరిపో , లెక్క తప్పి అధికారానికి రాకపోయినా ఫరవాలేదు, తరువాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సిగ్గూ ఎగ్గూ పక్కన పెట్టేసి అధికారానికి వచ్చిన పార్టీలో చేరిపో, మంచి పదవి కొనుక్కో , వెంటనే చూసుకో ఒక పన్ను స్వర్గం ! పెట్టుకో లేదా కొనుక్కో అక్కడో సూట్‌కేస్‌ కంపెనీ !! ఇక్కడ దండుకో అందినంత సొమ్ము !!! భారత మాతాకీ జై కొట్టు !!!!

     మనకు బాగా తెలిసి పన్నుల స్వర్గం స్విడ్జర్లాండ్‌. అక్కడి బ్యాంకుల నిబంధనల ప్రకారం ఎవరైనా ఎంతైనా డబ్బు దాచుకోవచ్చు. అది ఎక్కడిది, అక్రమమా, సక్రమమా అని ఎవరూ అడగటానికి వీలు లేకుండా నిబంధనలు రూపొందించారు.అందుకని ఎవరైనా స్విడ్జర్లాండ్‌ వెళ్లారంటే అక్కడ లావాదేవీలు చూసుకొని రావటానికే అని అనుమానించటం సహజం. ఇపుడు స్విడ్జర్లాండ్‌ నిబంధనలు మార్చారు.ఎవరైనాఅడిగితే సమాచారాన్ని తెలియచేయాల్సి వుంటుంది. ఏ సమాచారమూ ఇవ్వనవసరం లేని పనామా వంటి దేశాలు, దీవులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. డబ్బుంటే చాలు, దానిని ఎలా దాచుకోవాలో, ఎలా పన్నులు ఎగ్గొట్టాలో సలహాల సేవలు అందించే కంపెనీలు చాలా వున్నాయి. అదిగో అలాంటి వాటిలో పనామాలోని ఒక పెద్ద సంస్ధ మోసాక్‌ ఫొన్సెకా. దాని దగ్గర వున్న లక్షలాది లావాదేవీల పత్రాలు బయటికి వచ్చాయి. ఆ కంపెనీ పనామాలో వుంది కనుక వాటిని పనామా పత్రాలని పిలుస్తున్నారు.రెండులక్షలకు పైగా కంపెనీల వివరాలు ఇపుడు బయటకు వచ్చాయి. తమ కంప్యూటర్లను హాక్‌ చేశారని మొసాక్‌ ఫొన్సేకా ప్రకటించింది.

    ఏప్రిల్‌ మొదటివారంలో ఈ పత్రాలు వెలువడగానే దాదాపు అన్ని పత్రికలు ఆ వార్తను పతాక శీర్షికలతో పెట్టాయి. తరువాత వాటి గురించి దాదాపు మరిచి పోయాయి ? పెట్టుబడిదారుల పుత్రికలైన పత్రికలు కొనసాగింపు వార్తలను ఇస్తాయని ఎవరైనా ఆశిస్తే అది దురాశే.మన దేశానికి చెందిన పెద్దల పేర్లు కూడా పనామా పత్రాలలో వుండటంతో మన ప్రధాని నరేంద్రమోడీ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. వాటి వెనుక కారణాలు ఏవున్నప్పటికీ ఆ మేరకు స్పందించినందుకు కొంత మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు పంచుతామని ఎన్నికలకు ముందు చెప్పిన ప్రధాని రెండేళ్లు గడుస్తున్నా చేసిందేమీ లేదనే విమర్శలను తప్పించుకోవటానికే మొక్కుబడిగా ఆ ప్రకటన చేశారని ఎందరో భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వెల్లడైన సమాచారం చాలా పరిమితమే. రానున్న రోజుల్లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ మరింత సమాచారాన్ని వెల్లడించనుంది.అందువలన ఇది అంతంకాదు ఆరంభం మాత్రమే. వస్తున్న విశ్లేషణలు, నిబంధనలను పరిశీలిస్తే ఎవరెంత మన దేశంలో దోచుకున్నారో విదేశాల్లో దాచుకున్నారో వివరాలు కొంతమేరకు తెలుసుకోవచ్చేమో తప్ప సరిహద్దులు దాటిపోయిన ధనం ఏమేరకు తిరిగి వస్తుందన్నది అనుమానమే.

     పనామా పత్రాలు ప్రపంచంలో అనేక మంది రాజకీయ నేతలకు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఐస్లాండ్‌ ప్రధాని రాజీనామా చేశాడు.నలభై లక్షల డాలర్ల అక్రమ బాండ్ల వివరాలు బయటకు రావటంతో తోకముడిచాడు. బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ పన్నులకు సంబంధించి తప్పుడు సమాచారమిచ్చినట్లు బయటకు రావటంతో ఇబ్బందులలో పడ్డాడు. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.ఇలాంటి వారు 45 దేశాధినేతల పేర్లు ఈ పత్రాలలో ప్రస్తావనకు వచ్చాయి.న్యూస్‌ వీక్‌ పత్రిక సమాచారం ప్రకారం ప్రపంచంలోని పన్నుల స్వర్గాలలో 21నుంచి 32లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రపంచ సంపన్నులు, కార్పొరేట్లు అక్రమంగా దాచుకున్నారు. స్విడ్జర్లాండ్‌, హాంకాంగ్‌, అమెరికా, సింగపూర్‌, కేమాన్‌ దీవులు ప్రధమ స్ధానాలలో వుండగా పనామా 13,బ్రిటన్‌ 15వ స్ధానంలో వుంది.బ్రిటన్‌ వర్జిన్‌ ఐలాండ్‌లో పన్ను చెల్లించనవసరం లేకపోవటంతో ఎఫ్‌డిఐలు అక్కడికి లక్షా ఇరవైవేల కోట్ల పౌండ్ల మేరకు వచ్చాయి. అక్కడ 6,72,500 కంపెనీలు లేదా ఖాతాలు వున్నాయి. దారి జనాభా 30వేలకు లోపు. ఇలాంటి అక్రమలావాదేవీలకు ప్రధాన కేంద్రంగా బ్రిటన్‌ వుంది. పనామా పత్రాల తీవ్రత ‘పెట్టుబడిదారీ విధానాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేదిగా వుందని’ టైమ్‌ పత్రిక వ్యాఖ్యానించింది.’21వ శతాబ్దపు పెట్టుబడిదారీ విధాన వాహనం అడ్డుగోడను ఢీకొట్టేందుకు శబ్దం చేస్తూ వెళ్లే దారిలో మొసాక్‌ ఫొన్సెకా వ్యవహారం ఒక మైలు రాయి అని ‘ జీన్‌ పెరీ లేమాన్‌ అనే పారిశ్రామికవేత్త వ్యాఖ్యానించాడు.

     ఆర్ధిక అసమానతలను పరిష్కరించని పక్షంలో మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్ధకే ముప్పు వస్తుందని తీవ్ర హెచ్చరిక చేసిన ఫ్రెంచి ఆర్ధికవేత్త థామస్‌ పికెటీ పన్నుల స్వర్గాలను అదుపు చేయని పక్షంలో మొత్తం ప్రపంచ వ్యవస్తే కుప్పకూలి పోతుందని అది జరగక ముందే వాటిని తక్షణమే అదుపు చేయాలని,నిబంధనలు పాటించని దేశాలపై అవసరమైతే ఆర్ధిక ఆంక్షలు విధించాలని పనామా పత్రాల వెల్లడి గురించి వ్యాఖ్యానించారు. పన్నుల స్వర్గాలలో జరుగుతున్న అక్రమాల గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయని ప్రభుత్వాలు చేసే ప్రకటనలకు, ఆచరణకు నక్కకూ నాగలోకానికి వున్నంత దూరం వుందని పికెటీ పేర్కొన్నారు. 2014లో లక్సెంబర్గ్‌ లీక్స్‌ లేదా లక్స్‌లీక్స్‌ దర్యాప్తులో ఐరోపాలోని కార్పారేట్‌ కంపెనీలేవీ పన్నులు కట్టటం లేదని తేలింది. పనామా పత్రాల ప్రకారం ధనిక, పేద దేశాల ఆర్ధిక, రాజకీయ పెద్దలు తమ ఆస్థులను ఎలా దాచుకుంటున్నారో వెల్లడి అయింది. జర్నలిస్టులు తమ విధి నిర్వహిస్తున్నందుకు మనం సంతోషించాలి.సమస్య ఎక్కడంటే ప్రభుత్వాలే తమపని తాము చేయటం లేదు. వాస్తవం ఏమంటే 2008లో ప్రారంభమైన సంక్షోభం తరువాత అసలు చేసిందేమీ లేదు.మరో విధంగా చెప్పాలంటే పరిణామాలు మరింతగా దిగజారాయి.తమ ఆధీనంలోని వర్జిన్‌ దీవులు, ఇతర ప్రాంతాలలో కొల్లగొట్టే పనులు చేస్తూనే బ్రిటన్‌ తన పన్ను రేటును 17శాతానికి తగ్గించబోతున్నది. ఒక పెద్ద దేశం ఇలా చేయటాన్ని ఎక్కడా వినలేదు. దీని గురించి ఏమీ చేయకపోతే మనమందరం ఐర్లండ్‌ మాదిరి 12శాతం లేదా సున్నా లేకపోతే పెట్టుబడులు పెట్టిన వారికి గ్రాంట్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అని కూడా పికెటీ వ్యాఖ్యానించారు.

      పన్నుల స్వర్గాలలో ప్రయివేటు ఆస్ధులను దాచుకోవటంపై ఇప్పటికీ పూర్తి పారదర్శకత లేదు, 2008 నుంచి ఆర్ధిక వ్యవస్ధల కంటే ఆస్తులు వేగంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే వారు ఇతరుల కంటే తక్కువ పన్ను చెల్లించటం ఒక కారణం.ప్రభుత్వం ఎలాగూ దర్యాప్తు చేయదనే భయంతో ప్రాన్స్‌లో ఒక జూనియర్‌ మంత్రి తనకు స్విడ్జర్లాండ్స్‌లో ఖాతాలు లేవని 2013లో మంత్రి తాపీగా చెప్పాడు. జర్నలిస్టులు వాస్తవాలను వెల్లడించారు. తమ దగ్గర వున్న సమాచారాన్ని వున్నది వున్నట్లు అధికారికంగా తెలియచేసేందుకు స్విడ్జర్లాండ్‌ అంగీకరించింది. పనామా ఇప్పటికీ తిరస్కరిస్తున్నది. సమాచారాన్ని వెల్లడి చేయటమంటే అదొక ప్రభావ వంతమైన సామాజిక నిరసన అనే సిద్ధాంతం గతంలో లేని విధంగా నేడు పరీక్షకు గురి అవుతోంది. అది పెట్టుబడిదారీ విధానం రానున్న రోజుల్లో మరింత తీవ్ర సంక్షోభంలో పడవేయటానికి తోడ్పడుతుందని పికెటీ హెచ్చరించారు.

మన జర్నలిస్టులూ భాగస్వాములే

      ఈ శతాబ్ది జర్నలిజం ప్రాజెక్టుగా పేరుతెచ్చుకున్న పనామా పత్రాలను బయట పెట్టిన జర్నలిస్టులలో మన దేశానికి చెందిన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన వారు ముగ్గురు వున్నారు. పి వైద్యనాధన్‌, రితు శరీన్‌, జయ్‌ మజుందార్‌ దాదాపు ఎనిమిది నెలల పాటు పనామా పత్రాల పరిశీలనలో నిమగ్నమయ్యారు.యాజమాన్యం వారిని అందుకు అనుమతించింది. విలేకర్లు తెచ్చిన సమాచారాన్ని తీసుకొని డబ్బున్న, అక్రమాలకు పాల్పడిన వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బు సంపాదించే మీడియా సంస్ధల యజమానులు విచ్చల విడిగా వున్న ఈ రోజుల్లో విశ్వసనీయత ముఖ్యమైనది. అందుకు గాను గతంలో వారి పరిశోధనలు, వెల్లడించిన సమాచారం, వ్యక్తిగత నిజాయితీల రికార్డు ఆధారంగా ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసిఐజె) తన బృందాన్ని ఎంపిక చేసుకుంటుంది. దీనిలో అలా రాటు దేలిన వారు 25 భాషలు, 70 దేశాలకు చెందిన 250 మంది జర్నలిస్టులు భాగస్వాములయ్యారు. వీరికి అందుబాటులోకి వచ్చిన సమాచారం గురించి వింటే పడిపోవాల్సిందే. 1977 నుంచి 2015 డిసెంబరు వరకు వున్న నలభై ఎనిమిది లక్షల ఇమెయిల్స్‌, 21లక్షల పిడిఎఫ్‌ పైల్స్‌ను వారు వడపోశారు.ఒక జర్మన్‌ పత్రిక సమాచారం ప్రకారం కోటీ 15లక్షల రహస్య పత్రాలు జర్నలిస్టులకు అందుబాటులోకి వచ్చాయి. తామేం చేస్తున్నామో, తాము పరిశీలిస్తున్న మొసాక్‌ ఫోన్సెకా పేరు కూడా తమ స్వంత సంస్ధలోని వారికి కూడా పత్రాలను బహిర్గతం చేసేవారికి కూడా తెలియదని రీతు శరీన్‌ చెప్పారు. ఆమె గత నలభై సంవత్సరాలుగా ఇలాంటి వార్తలను సేకరించటంలో నిమగ్నమయ్యారు.ఆమె అంతకు ముందు బ్రిటన్‌లోని పెద్ద బ్యాంకు అయిన హెచ్‌ఎస్‌బిసి-స్విస్‌ బ్యాంకు, వర్జిన్‌ ఐలాండ్‌లోని భారతీయుల ఖాతాల లోగుట్టును బయటపెట్టారు.ఇది ఐసిఐజెతో ఆమెకు మూడవ ప్రాజెక్టు. నీరారాడియా టేపులను బహిర్గతంలో చేయటంలో చేయితిరిగిన రీతు తన బృందంలో బ్యాంకింగ్‌, ఆర్ధిక రంగాలలో సమగ్రపరిజ్ఞానం వున్న వారిని ఎంపిక చేసుకున్నారు. వారికి మరో 22 మంది వివిధ రాష్ట్రాల రిపోర్టర్లు తోడ్పడ్డారు. అయితే వారంతా ఈ ముగ్గురు బృందం అడిగిన సమాచారం అంటే పనామా పత్రాలలో వున్న భారతీయుల చిరునామాలు, ఇతర సమాచారాన్ని ఇవ్వటం తప్ప తామెందుకు ఆ సమాచారం ఇస్తున్నారో కూడా వారికి తెలియదు. మన దేశానికి సంబంధించిన 36వేల పత్రాలను ఎక్స్‌ప్రెస్‌ బృందం పరిశీలించింది.ఎప్పటి కప్పుడు సమాచారం బయటకు పొక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. రీతు రెండు అంతర్జాతీయ రహస్యసమావేశాలకు వెళ్లి పత్రాల పరిశీలనలో శిక్షణ కూడా తీసుకున్నారు.

      నరేంద్రమోడీ సర్కార్‌ విదేశాల్లో వున్న నల్లధనం తెస్తానని రంకెలు వేయటం, అక్రమార్కులను సర్దుకోమని చెప్పటం తప్ప మరొకటి కాదని తేలిపోయింది. పనామా పత్రాల ప్రకారం గతేడాది కూడా అనేక మంది నల్లధన కుబేరులు పనామాలో ఖాతాలు తెరిచినట్లు బయట పడింది. మన చట్టాలు ఎంత లోప భూయిష్టంగా వున్నాయంటే పనామా వంటి పన్ను స్వర్గాలలో కంపెనీలు తెరవటానికి అనుమతించవు గానీ వాటిలో వాటాలు, ఏకంగా కంపెనీలనే కొనుగోలు చేయవచ్చు. అంటే చట్టబద్దంగానే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవటం సులభమైంది కనుకనే అనేక మంది తాపీగా తమ లావాదేవీలన్నీ చట్టబద్దమే అని చెబుతున్నారు. దాదాపు ఐదు వందల మంది భారతీయులకు పనామాలో ఖాతాలున్నట్లు అంచనా. వారిలో పద్మభూషన్‌ కౌశల్‌ పాల్‌ సింగ్‌ నుంచి ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ, కాంగ్రెస్‌కు సన్నిహితుడైన సమీర్‌ గెహ్లట్‌, బిగ్‌బి అమితాబ్‌,ఆయన కోడలు ఐశ్వర్యారాయ్‌ తదితరులు ఈ జాబితాలో వున్నారు. వాణిజ్య వేత్తలు తాము అధికారులకు అన్నింటినీ వెల్లడించామని, అంతా చట్టబద్దంగానే జరిగిందని చెబుతుండగా అమితాబ్‌ మాత్రం అస్సలు తమకేమీ తెలియదని ప్రకటించారు.మరికొందరు ప్రవాస భారతీయులు తమకు భారత చట్టాలు వర్తించవని తమ దేశభక్తిని ప్రకటించుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శని సింగనాపూర్‌లో మనువాదంపై మహిళల తిరుగులేని విజయం

09 Saturday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Women

≈ Leave a comment

Tags

Bhumata Brigade, manuvadis, Shani Shingnapur, Trupti Desai, Women decisive victory, women power

సత్య

13న కొల్లాపూర్‌ మహలక్ష్మి దేవాలయ ప్రవేశం

    తృప్తి దేశాయ్‌ ! భూమాత రాన్‌ రాగిణి బ్రిగేడ్‌ !! శని శింగనాపూర్‌ !!!

       దేశంలో అనేక మంది నోళ్లలో నానుతున్న పేర్లివి. నాలుగు వందలఏళ్ళ  నాటి శని దేవాలయంలో మహిళలకు ప్రవేశ నిషేధ శని శుక్రవారం సాయంత్రంతో వదలి పోయింది.ఈనెల ఒకటవ తేదీన బొంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో శని దేవాలయ పాలకవర్గం మహిళలపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇది నిజంగా మహిళలు సాధించిన పెద్ద విజయాలలో ఒకటి. దీనితో వుత్తేజితులైన మహారాష్ట్ర మహిళలు ఇప్పుడు తమ దృష్టి ఇతర దేవాలయాలపై సారించారు. తదుపరి ఈనెల 13న తాము కొల్లాపూర్‌లోని మహలక్ష్మి దేవాలయ ప్రవేశం చేస్తామని, తరువాత నాసిక్‌లోని త్రయంబకేశ్వర ఆలయ ప్రవేశం చేస్తామని ఈ వుద్యమానికి నాయకత్వం వహిస్తున్న తృప్తి దేశాయ్‌ శనివారం నాడు ప్రకటించారు. ఒక చిన్న పల్లెటూరు శని శింగనాపూర్‌లో ప్రారంభమైన ఈ వుద్యమం దేశంలోని ఇతర పాంతాలకు విస్తరిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో దళితులకు దేవాలయ ప్రవేశాలపై వున్న ఆంక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేవాలయ ప్రవేశ వుద్యమాలు సాగిన విషయం తెలిసిందే. ఇపుడు మహిళా ప్రవేశ వుద్యమానికి నాంది పలికారు.దీంతో మనువాదులు మింగా కక్కలేకుండా వున్నారు. రాజ్యాంగం చట్టాలు వుండబట్టిగాని లేకపోతే ఇలాంటి తీర్పులు ఇస్తున్న న్యాయమూర్తుల అంతం చూసి వుండేవాళ్లం ప్రకటించే సర్వసంగ పరిత్యాగులమని ఫోజు పెట్టే సాధ్వులు, బాబాలు, యోగులు,యోగినులు మనకు దర్శనమిచ్చినా ఆశ్చర్యం లేదు.

     చాలా మందికి సుపరిచితమైన షిరిడీకి దగ్గరలో అహమ్మద్‌ నగర్‌ జిల్లాలో ఈ శనిదేవాలయం వుంది. తమకు పట్టిన శని వదలాలని లేదా పట్టకుండా వుండాలని ముందస్తుగా కోరుకుంటూ వేలాది మంది నిత్యం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మహిళలు సాగిస్తున్న ఈ వుద్యమం ఆస్తికులకే గాక నాస్తికులకు కూడా అభ్యంతరకరంగా వున్నట్లు అక్కడక్కడా వినిపిస్తోంది. ఇక్కడ సమస్య మహిళలలో మూఢనమ్మకాలను ప్రోత్సహించటం కాదు. దళితుల దేవాలయ ప్రవేశ వుద్యమానికి కమ్యూనిస్టు అగ్రనాయకులు అనేక మంది నాయకత్వం వహించారంటే అర్ధం దళితులను తీసుకువెళ్లి మనువాదానికి అప్పగించాలని కాదు. పుట్టుక కారణంగా వివక్ష ప్రదర్శించటాన్ని, తోటి మనిషిని మనిషిగా చూడాలనే ప్రజాతంత్ర డిమాండ్‌, హక్కును నిర్ధారించుకొనేందుకే ఆ వుద్యమాలు జరిగాయి.ఇప్పుడు మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న వుద్యమం, న్యాయపోరాటాలను కూడా అలాగే చూడాలి. ఒక వ్యక్తి దేవుడిని, మతాన్ని నమ్మటమా నమ్మకపోవటమా అన్నది వారి వ్యక్తిగతం.

    ఈ వుద్యమానికి నాంది పలికిన 31 సంవత్సరాల యువతి ఆస్ధికురాలు. మహారాష్ట్రలో అధికారంలో వున్న బిజెపి-శివసేన సంకీర్ణ కూటమి ప్రభుత్వం శని ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకొనేందుకు చేయని ప్రయత్నం లేదు. మహిళలను అడ్డుకొనేందుకు తొలిసారిగా ఆ దేవాలయానికి మహాళా ధర్మకర్తలను నియమించి వారి ద్వారా అడ్డుకోవాలని చౌకబారు ఎత్తుగడ వేసింది. మహిళలను సమీకరించేందుకు కూడా చేయూత నిచ్చింది.అయితే బోంబే హైకోర్టులో ప్రభుత్వం వివక్షకు వ్యతిరేకమని అఫిడవిట్‌ ఇవ్వాల్సి వచ్చింది. అయినా తీర్పును అమలు జరిపేందుకు సిద్ధం కాకపోవటంతో ముఖ్య మంత్రిపై కోర్టు ధిక్కరణ నేరం కింద కోర్టుకు లాగుతామని తృప్తి దేశాయ్‌ ప్రకటించిన తరువాతే శని ఆలయ కమిటీ దిగివచ్చింది. ఇంత జరిగాక దేవాలయ ప్రవేశం కోసం మహిళలు ఆందోళన చేయాల్సి రావటం సిగ్గుచేటని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించటం విశేషం. వివక్షను పాటిస్తున్న ఇతర దేవాలయాల ప్రవేశం సందర్భంగా ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూడాల్సి వుంది.

   కాలం చెల్లిన మనువాదులను వుక్కిరి బిక్కిరి చేస్తున్న తృప్తి దేశాయ్‌ ఒక సాధారణ కుటుంబానికి చెందిన గృహిణి. కర్ణాటక సరిహద్దులోని నిపానీ తాలుకాలో జన్మించిన తృప్తి కుటుంబం తరువాత పూనాలో స్ధిరపడింది. ముంబైలో హోం సైన్సు కోర్సులో చేరిన ఆమె కుటుంబ పరిస్ధితుల కారణంగా ఒక ఏడాది తరువాత విద్యను మానుకోవాల్సి వచ్చింది.తరువాత తాను నివసించే పరిసరాలలో క్రాంతి వీర్‌ అనే ఒక సంస్ధలో చేరి దానికి అధ్యక్షురాలైంది. పేదలకు రేషన్‌ కార్డులు ఇప్పించేందుకు, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి, వుపాధికి తోడ్పటం వంటి కార్యకలాపాలను ఆ సంస్ధ నిర్వహించేది.ఈ క్రమంలోనే 2007లో ఆమె ఎన్‌సిపి అగ్రనేత అజిత్‌ పవార్‌ కుటుంబ ఆధ్వర్యంలో నడిచే అజిత్‌ సహకార బ్యాంకులో జరిగిన 50 కోట్ల అవినీతికి వ్యతిరేకంగా తృప్తి దేశాయ్‌ గళం విప్పింది.బ్యాంకు డిపాజిట్‌దార్లతో పోరాట సమితిని ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల తరువాత 29వేల మందికి తమ డిపాజిట్లు వచ్చేట్లు చేయటంతో ఆమె వెలుగులోకి వచ్చారు. దాంతో కొంత మంది ఆమెకు ఏదైనా సామాజిక సంస్ధను ఏర్పాటు చేయమని సలహా ఇచ్చారు.

     అలా ఏర్పడిందే భూమాత బ్రిగేడ్‌.నలభై మందితో 2010 సెప్టెంబరు 27న ప్రారంభమైన ఈ సంస్ధలో ఇపుడు ఐదువేల మందికి పైగా స్త్రీ, పురుష సభ్యులున్నారు. అనేక అంశాలపై ఈ సంస్ధ పని చేస్తుంది.అన్నా హజారే జనలోక్‌పాల్‌ ఆందోళనలోనూ వారు పాల్గొన్నారు. శని దేవాలయ ప్రవేశం కోసం భూమాత బ్రిగేడ్‌ ఒక వుప విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి భూమాత రాన్‌రాగిణి బ్రిగేడ్‌ అని పేరు పెట్టారు. నవంబరు 29న ప్రారంభమైన ఈ వుద్యమం ఏప్రిల్‌ ఎనిమిదిన దేవాలయ ప్రవేశంతో విజయం సాధించింది. తృప్తి దేశాయ్‌ 2006లో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇప్పుడు ఆరు సంవత్సరాల కుమారుడు. భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. తన భార్య కార్యకలాపాలను చూసి తాము గర్వ పడుతున్నట్లు ఆమె భర్త ప్రశాంత్‌ దేశాయ్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d