• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Communalism

అడ్డు సవాళ్లు తరువాత, ముందు మతాలలోని వివక్ష, వైరుధ్యాలను అంగీకరిస్తారా లేదా ?

16 Saturday Jan 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Counter Challenges, Hinduism, Hinduthwa, Riddles in Reigions

ఇక హిందూమతాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు అనే వాదన ప్రతి కొత్త తరానికి అది అబ్బ ఏం చెప్పిండు అన్నట్లు కొత్తగా వినసొంపుగా వుండవచ్చుగాని నిజానికి పాతచింతకాయ పచ్చడి.

ఎం కోటేశ్వరరావు

      జల్లి కట్టు లేకపోతే ఎద్దులు అంతరిస్తాయా ? మహిళలను అనుమతిస్తే అయ్యప్ప బ్రహ్మ చర్యం పోతుందా అనే శీర్షికతో నేను రాసిన అంశాలపై పెద్ద సంఖ్యలో ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు నాకు మద్దతు పలికిన వారు కూడా వున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వారు అనేక ప్రశ్నలు సంధించారు. అందువలన వారికి మాయాబజార్‌ సినిమాలో చెప్పినట్లు వీరతాళ్లు వేద్దాం. అయితే వాణిజ్య ప్రకటనలలో చిన్న నక్షత్రం వేసి దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగానే గానే వీరూ ఆ షరతులకు లోబడే వీరతాళ్లు  వేసుకొనేందుకు అర్హులు. నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు చేసిన ఆరోపణ లేదా విమర్శలు ఏమిటి ? హిందూయిజాన్ని సులభంగా విమర్శిస్తారు, ఇతర మతాలు ముఖ్యంగా ఇస్లామును ఏమీ అనలేరు, వారిని విమర్శించటానికి లేదా వారి పేరు ఎత్తటానికి దమ్ము, ధైర్యాలు లేవు, హిందూయిజాన్ని విమర్శించటం ఒక ఫ్యాషన్‌గా మారింది. హిందువులు సహనశీలురు కాబట్టే ఇలాంటి వారి ఆటలు సాగుతున్నాయి, ఇస్లామిక్‌ దేశంలో ఇలా అని బతగ్గలరా ? ఇలా సాగాయి.విమర్శించిన వారందరూ సంఘపరివార్‌ తాలిబాన్‌ హిందూత్వ వాదులు కాదు, వారి వాదనల ప్రభావానికిలోనై ప్రశ్నించినంత మాత్రాన వారిని, కరడు గట్టిన వారినీ ఒకే గాటన కట్టటం లేదు.

       మన దేశంలో అభివృద్ధి చెందిన వాటిలో తర్కశాస్త్రం ఒకటి. ఇది శాస్త్రీయమైనది, దీనిలో గతి తార్కిక విధానం అంటే తర్కము, హేతువు వుండాలి. గతి తార్కిక విధానము అనగానే ఇదేదో కమ్యూనిస్టుల పదజాలం అని కొందరికి తేళ్లు జెర్రులు పాకినట్లు వుండవచ్చు. వారు పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల నాడే భారత సమాజంలో వుంది. అసలు తర్కము, హేతువు నుంచే సమాజం ఇంతగా పురోగమించింది. అవేమీ లేకపోతే మనం ఇంకా ఆకులు చుట్టుకొనే దశలోనో అంతకు పూర్వ దశలోనో వుండే వాళ్లం. తర్కాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు లోకాయతులు. వేదాలను, వైదిక క్రతువులను రెండున్నర-మూడువేల సంవత్సరాల నాడే వ్యతిరేకించి వాటి ప్రామాణికతను సవాలు చేసిన హేతువాదులు వారు . వారిని చార్వాకులు అని కూడా పిలిచారు. వేదాలను సమర్ధించే శక్తులు వారిని భౌతికంగా అంతం చేసి వారి తర్కశాస్త్రాన్ని నాశనం చేసి తరువాతి తరాలకు అందకుండా చేశారు. వారిని తిడుతూ లేక విమర్శిస్తూ రాసిన అంశాలను బట్టి లోకాయతుల గురించి మనకు ఇప్పుడు తెలుస్తున్నది. అందువలన నేను రాసిన దానిని తప్పుపట్టిన వారు ముందు వుద్రేకాన్ని తగ్గించుకొని మన పురాతన గతి తార్కిక పద్దతిలో ఆలోచించాలి. తర్కశాస్త్రంలో ఒకరు ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తితే దాన్ని వుత్తర పక్షం అంటారు. రెండవవారు దానికి సమాధానం చెబితే దానిని పూర్వపక్షం అంటారు. రెండు వాదనలు విని ఏది సరైనదో తేలుస్తారు. అంటే సరైన వాదన చేసిన వారిని రెండోవారు అంగీకరించాలి. ఇటీవలి కాలంలో కొందరు అతి తెలివి ప్రదర్శిస్తూ వాదనలకు దిగి ఓడిపోయి రెండోవారిని అంగీకరించకుండా మీరు ఎన్నయినా చెప్పండి ఇది నా విశ్వాసం, నమ్మకం , మనోభావం దీనిని నేను అంగీకరించను అని అడ్డం తిరుగుతున్నారు లేదా అసలు తర్కానికే సిద్ధం కారు .ఇలాంటి వారు వీరతాళ్లు వేసుకొనేందుకు అనర్హులు. అలాంటి వారితో తర్కించటం కంఠశోష తప్ప శుద్ద దండగ. గాంధీలు పుట్టినపుడు గాడ్సేలు లేకుండా ఎలా వుంటారు అన్నట్లుగా సమాజంలో హేతుబద్దంగా ఆలోచించే వారే మెజారిటీగా వున్నందున వారి కోసమైనా కొన్ని విషయాలను చర్చించుకోవటం అవసరం. వారు వున్నారు కాబట్టే సమాజం ముందుకు పోతోంది.

      ముంబై హైకోర్టు 2010 జనవరి మొదటివారంలో ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఇస్లాం, హిందూ, క్రిస్టియన్‌ ఏ మతాన్ని అయినా భావప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాధమిక హక్కు కింద విమర్శించటం భారత దేశంలో అనుమతించదగినదే అయితే అ విమర్శ చిత్తశుద్దితో లేదా సైద్ధాంతికమైనదిగా వుండాలి తప్ప విద్వేషాన్ని రెచ్చగొట్ట కూదదు అని ఒక పుస్తకంపై తలెత్తిన వివాదం సందర్భంగా కోర్టు చెప్పింది. ఇస్లాం గురించి ముంబై న్యాయవాది ఒకరు రాసిన పుస్తకంలోని అంశాలు అభ్యంతరకరంగా వున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ పుస్తకంపై నిషేధం విధించింది. అది తన భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతమంటూ రచయిత కోర్టులో సవాలు చేశారు. కోర్టు ఆ నిషేధం సరైనదే అని సమర్ధించింది. న్యాయమూర్తులు రంజనా దేశాయ్‌, డివై చంద్రచూడ్‌, ఆర్‌ఎస్‌ మోహిత్‌లతో కూడిన బెంచ్‌ దీనిని విచారించింది. ఆరోగ్యకరమైన విమర్శ ఆలోచనలను రేకెత్తించేదిగా వుండాలి, చర్చను ప్రోత్సహించాలి ఒక నిర్ధారణకు వచ్చేందుకు తోడ్పడాలి, కానీ విమర్శ నిందలు వేసేదిగా వివిధ సామాజిక తరగతుల మధ్య విద్వేషాన్ని సృష్టించేదిగా వుండకూడదు, అది వివేకవంతమైన సంప్రదింపులకు దారితీయాలి అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. రచయిత తాను అనుకుంట్నుది సరైనదని చెప్పవచ్చు, ఒక వేళ అది తప్పయితే దానికి అతనిని శిక్షించకూడదు, కానీ చూడాల్సిందేమంటే ఇస్లాం ఏం చెప్పిందో తెలుసుకోవటానికి, దానిని బయటకు వెల్లడించటానికి రచయిత చిత్తశుద్దితో వ్యవహరించాడా లేదా అనేది చూడాలి. ఈ కేసులో ఇస్లాంపై విమర్శలు మరియు భారతీయ ముస్లింలపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు సైద్దాంతికమైనవి కాదు అని కోర్టు స్పష్టం చేసింది. అభ్యంతరకరంగా వున్న భాగాలను తొలగించాలన్న సూచనలను రచయిత నిరాకరించారు. ఇంటర్నెట్‌ యుగంలో పుస్తకాన్ని నిషేధించటం కాలం చెల్లింది, అర్ధం లేనిది అని రచయిత వాదించటం పూర్తిగా అభ్యంతరకరమని కోర్టు పేర్కొన్నది. భారతీయ ముస్లింలు హిందువులందరినీ మతమార్పిడి చేయాలని చూస్తున్నారని, హిందూ దేవాలయాలు, మహిళలపై దాడులు చేస్తున్నారంటూ రచయిత చేసిన వ్యాఖ్యలు జనాన్ని హింసాకాండకు రెచ్చగొట్టవచ్చు లేదా హింస, శతృత్వాన్ని లేదా ద్వేషాన్ని పెంచవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.

       అందువలన ఎవరైనా ఏమతం గురించైనా చేసే వ్యాఖ్యల వెనుక వున్న వుద్ధేశ్యాలు, లక్ష్యాలు ఏమిటో తెలియనంతటి స్థితిలో సమాజం లేదు. అయితే కొందరు ఒక లక్ష్యంతో చేసే వ్యాఖ్యలను మరికొందరు పర్యవసానాల గురించి ఆలోచించకుండా వాటిని తమ అభిప్రాయాలుగా స్వంతం చేసుకొని మాట్లాడుతున్నారు. విమర్శ చేస్తే వారు సహించరు. అందువలన వారిని కూడా ఎదుటి వారు ఏదో ఒక పక్షంగా భావించాల్సిన పరిస్థితులు నేడు దాపురించాయి. ముందే చెప్పుకున్నట్లు ఇస్లాంను విమర్శించటానికి దమ్ము, ధైర్యం లేదని చేసే వ్యాఖ్యలు, సవాళ్లు ఈ కోవకు చెందినవే. వీరు ముందు ఒకటి స్పష్టం చేయాలి. రాజ్యాంగాన్ని అంగీకరించి దానికి అనుగుణుంగా నడుచుకుంటారా లేదా ? మనది మతరాజ్యం కాదని అంగీకరిస్తారా లేదా ? భిన్నాభి ప్రాయాన్ని సహిస్తారా కుదరదంటారా ? మతరాజ్యాలతో పోల్చుకోవటం అంటే మనం కూడా ఆ బాట పట్టాలని చెబుతున్నారా ? ఏమతానికి చెందిన వారైనా అసలు మతాలలోని చెడు లేదా అవాంఛనీయ పోకడల మీద చేసే విమర్శలను సహిస్తారా లేదా అంగీకరిస్తారా లేదా ? మతాలలోనే అంతర్గతంగా వైరుధ్యాలు, మారాల్సిన అంశాలు వున్నాయని ఒప్పుకుంటారా లేదా ?

      వుదాహరణకు హిందూ మతంలో మహిళల పట్ల వివక్ష వుంది అనే విమర్శ చేస్తే వెంటనే వస్తున్న ప్రతివాదన ఏమిటి ? హిందూ మతం గురించి చెప్పేవారు మహిళలకు మసీదులలో ప్రవేశంపై ఆంక్షల గురించి, క్రైస్తవంలోని అంశాలపై మాట్లాడరెందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఆ మతాల గురించి విమర్శిస్తే మావి మైనారిటీ అసలు నూటికి 80 మందిగా , మా మతాల కంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి వునికిలో వున్న హిందూ మతం గురించి ఆలోచించండి అని వారు అంటారు. వీటన్నింటినీ చూసినపుడు ఏ ఒక్కమతావలంబలకులూ తమ మతంలో వివక్ష వుందని అంగీకరించటం లేదు, వున్న దానిని సమర్ధించటానికి పూనుకుంటున్నారు, తప్పించుకోవటానికి ఇతర మతాల గురించి అడ్డు సవాళ్లు విసురుతున్నారు. ఓట్లకు మతాలను వాడుకోవటం, అందుకోసం చివరికి కొట్లాటలను కూడా సృష్టిస్తున్న ఈ రోజుల్లో ఒక మతానికి చెందిన వారు ఇతర మతాల మంచి చెడ్డల గురించి చెబితే వాటిని సహృదయంతో స్వీకరించే పరిస్థితులు లేవు. అవసరమైతే వివక్ష, మూఢనమ్మకాలు, సంస్కరణల వంటి విషయాల గురించి మనం వాదులాడు కోవద్దు, విమర్శించేవారిపై వుమ్మడిగా దాడి చేద్దాం అని జెఎసి గా ఏర్పడినా ఆశ్చర్యం లేదు. మతం జనం పాలిట మత్తుమందు అని కమ్యూనిస్టులు చెబుతున్నారు. అలా అన్నందుకే కమ్యూనిజం క్రైస్తవానికి, ఇస్లాంకు వ్యతిరేకం అని ఆ మతాలు జనం మెదళ్లలో నూరిపోస్తున్నాయి. మన దేశంలో కూడా మెజారిటీ మతశక్తులూ అదే చేస్తున్నాయి. అందువలన ఇప్పుడున్న స్థితిలో ముందు ఏ మతానికి చెందిన వారు ఆ మతంలోని అవాంఛనీయ పోకడలను ప్రశ్నించాలి. ఏ మతం వారైనా ఇతర మతాలకు చెందిన వారు కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రెచ్చిపోవద్దు. వాటిని కొన్ని శక్తులు దురుద్ధేశ్యాలు, జనం మధ్య సామరస్యతను చెడగొట్టేందుకు , రోజువారీ సమస్యలపై ఐక్యం కాకుండా అడ్డుకొనేందుకు విభజించి పాలించే ఎత్తుగడలలో భాగంగా అనేక అంశాలను ముందుకు తెస్తున్నాయి. అనేక మంది వాటికి ప్రభావితులౌతున్నారు, సామాజిక మీడియాలో అవాంఛనీయ పోకడలు, వ్యాఖ్యలతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు.

      ఇక హిందూమతాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు అనే వాదన ప్రతి కొత్త తరానికి అది అబ్బ ఏం చెప్పిండు అన్నట్లు కొత్తగా వినసొంపుగా వుండవచ్చుగాని నిజానికి పాతచింతకాయ పచ్చడి. అరిగిపోయిన గ్రామఫోను రికార్డు వంటిదే. దాన్ని గురించి తరువాత పరిశీలించుదాం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిందీలో కుల నిర్మూలనతో సహా 11 అంబేద్కర్‌ రచనలు నిలిపివేసిన మోడీ సర్కార్‌

16 Saturday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Social Inclusion

≈ Leave a comment

Tags

Ambedkar, Annihilation of Caste, Narendra Modi sarkar, RSS, RSS Double game

అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతినాపగలరా ? అంబేద్కర్‌ భావాలను అడ్డుకోగలరా ?

ఎం కోటేశ్వరరావు

      నిన్నగాక మొన్న పార్లమెంట్‌లో అంబేద్కర్‌ 125వ జయంతి సందర్బంగా ఆయనకు నివాళి అర్పించారు. తియ్యటి మాటలు చెప్పారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం హిందీలో ప్రచురించిన అంబేద్కర్‌ రచనల సంపుటాలలో ఆయన తన జీవిత కాలం దేనికోసమైతే పోరాడారో ఆ అంశానికి సంబంధించి రాసిన ‘కుల నిర్మూలన,’ హిందూయిజపు వైరుధ్యాలు’ అనే ముఖ్యమైన వాటితో సహా పదకొండు పుస్తకాలను మినహాయించి మిగతా వాటిని ప్రచురించింది. కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని అంబేద్కర్‌ ఫౌండేషన్‌ ద్వారా ఈ పుస్తకాలను అచ్చువేయించారు. వాటిలో మినహాయించిన పుస్తకాల గురించి ఇండియా టుడే గ్రూప్‌ ప్రచురణల మాజీ మేనేజింగ్‌ ఎడిటర్‌గా పనిచేసిన దిలీప్‌ మండల్‌ రౌండ్‌ టేబుల్‌ ఇండియాలో తాజాగా రాసిన ఒక వ్యాసంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో కులము- వార్తా మాధ్యమం మధ్య వున్న సంబంధాలు అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు. కుల నిర్మూలన అంటే వెంటనే గుర్తుకు వచ్చేది అంబేద్కర్‌ మినహా మరొకరు కాదు. అలాంటి ముఖ్యమైన వాటిని మినహాయించటం వుపస్థ మినహా కన్యాదాన వంటిదే. పూనా ఒప్పందం, రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌, గాంధీతో చర్చల వంటి అంశాలున్న పుస్తకాలు ప్రచురణలలో లేవని దిలీప్‌ వెల్లడించారు.’ఎవరో ‘ దీని గురించి చెప్పకుండా ఈ పని జరిగివుండదని ఆ ఎవరో మోడీ సర్కార్‌ తప్ప మరొకరు కాదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ పుస్తకాలు లేకుండా అంబేద్కర్‌ రచనలను విక్రయిస్తున్నారని వాటిని ఎప్పుడు ప్రచురిస్తారో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. ఆంగ్ల పుస్తకాల ప్రచురణ మరింత సంక్లిష్టం అవుతుందంటూ వాటి ప్రచురణ హక్కులను కలిగిన మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రాన్ని అంబేద్కర్‌ ఫౌండేషన్‌ తీసుకోలేదని వెల్లడించారు.

      అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమని తెలిసి కూడా అలాంటి ప్రయత్నం చేసే ప్రబుద్ధులు వుంటారనేందుకు ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. ఓట్లకోసం అంబేద్కర్‌ పేరును పదే పదే ప్రస్తావించటానికి బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి అభ్యంతరం లేదు. దానిలో భాగంగానే అంబేద్కర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను అభినందించారని, ఆయన హిందూరాష్ట్రకు సైతం వ్యతిరేకం కాదని చిత్రించేందుకు పూనుకున్నారు. అయితే ఆయన భావాలు వారి హిందూత్వ ఎజండాకు, మను ధర్మ శాస్త్రానికి కొరుకుడు పడనివి. మను ధర్మశాస్త్రానికి ప్రతినిధి , మారు పేరు బ్రాహ్మణిజం, బ్రాహ్మణులు అన్నది కొందరి అభిప్రాయం. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆ తిరోగమన భావజాలానికి లోనైన వారు బ్రాహ్మణులు లేదా ఇతర అగ్రకులాలనబడే వారే కాదు, ఆ మనువాదానికి తరతరాలుగా బలై అంటరాని వారిగా, దూరంగా వుంచబడుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు కూడా దాన్నే భుజాన వేసుకొని మోస్తున్నారు. తమ వర్గాలకు తామే ద్రోహం చేస్తున్నారంటే అతిశయోక్తికాదు. అందువలన అంబేద్కర్‌ భజన చేస్తూనే ఆయన భావాల వ్యాప్తిని విస్తారమైన హిందీ ప్రాంతంలో అడ్డుకోవాలన్న దుర, దూరాలోచనలు తప్ప వేేరు కాదు. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్వాకంపై అంబేద్కర్‌ అభిమానులు, పురోగామి, ప్రజాతంత్రశక్తులు వత్తిడి తెస్తే తప్ప ఆ పుస్తకాలు వెలుగుకు నోచుకోవు. అలాగే మహారాష్ట్రలో వున్న ప్రభుత్వం కూడా బిజెపిదే కనుక ఆంగ్ల పుస్తకాల ప్రచురణకు నిరభ్యంతర పత్రం జారీ చేయాలని లేదా తానే వాటిని ప్రచురించాలని వత్తిడి చేయటం మినహా మరొక మార్గం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జల్లికట్టు లేకపోతే ఎద్దులు అంతరిస్తాయా ? మహిళలను అనుమతిస్తే అయ్యప్ప బ్రహ్మచర్యం పోతుందా ?

14 Thursday Jan 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Women

≈ Leave a comment

Tags

feminist, jallikattu, sabarimala ban

ఎం కోటేశ్వరరావు

ఈ వారంలో జల్లికట్టు, శబరిమల ఆలయంలో యువతుల ప్రవేశ నిషేధంపై వెలువడిన కోర్టు తీర్పులు, నిర్ణయాలు సంచలనం కలిగించాయి.కోర్టు తీర్పులపై ఎప్పుడూ ఏకాభిప్రాయం వుండదు. గెలిచిన వాడు న్యాయమైన తీర్పు అంటే ఓడిన వాడు అన్యాయం అని ఆక్రోశిస్తాడు.ఏ తీర్పు అయినా అవి వ్యక్తులు లేదా ఒక సంస్ధ వివాదాలలో అయినా ఇచ్చిన తీర్పులు మెజారిటీ ప్రయోజనాలను కాపాడుతుందా లేదా ? సమాజాన్ని ముందుకు తీసుకుపోయేందుకు దారి చూపుతుందా లేదా అన్నదే గీటురాయిగా వుండాలి. ఆ విధంగా చూసుకున్నపుడు కొన్ని సందర్బాలలో కోర్టు తీర్పులు కూడా తిరోగామిగా వుండవచ్చు. అన్నింటినీ ఒకేగాటన కట్టలేము. అందువలన దేనికి దానిని విడిగా చూడాలి.

ఈ ప్రాతిపదికన చూసినపుడు జల్లికట్టు, శబరిమల కేసులలో నిర్ణయాలను పురోగమనవాదులు హర్షిస్తుండగా తిరోగమనవాదులు చిందులు వేస్తున్నారు. విపరీత భావాలు, ఆచరణ సాధ్యం కాని సంస్ధగా సుప్రీం కోర్టు మారిపోతున్నదని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళలను ఎందుకు రానివ్వటంలేదో చెప్పాలని, నిషేధించటం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు దేవస్ధాన అధికారులను ప్రశ్నించింది. యువ న్యాయవాదులు వేసిన పదేళ్లనాటి ఒక కేసును కోర్టు విచారిస్తున్నది.ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం, ఆచారం, మనోభావాలను గాయపరచినట్లు , వాటిని ఒక్కరాత్రిలో మార్చివేయలేమని చెప్పటం తప్ప ఎలాంటి హేతుబద్దమైన సమాధానం మహిళల నిషేధాన్ని సమర్ధించేవారి వద్ద లేదు.

అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కనుక 10-50 మధ్య వయస్సు వున్న మహిళలు రుతుక్రమంలో వుంటారు కనుక వారిని ఆలయంలోకి అనుమతించటం’పాపం’ అని బోర్డు వాదిస్తున్నది. గతంలో అధికారంలో వున్న సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి దీనికంతటికీ కారణమైందని బోర్టు అధ్యక్షుడు ప్రయార్‌ గోపాల్‌కృష్ణన్‌ ఆరోపించారు. తిరువనంతపురంలోని అట్టుకల్‌ దేవీ ఆలయంలోకి పొంగలా పూజ చేసేందుకు పురుషులను అనుమతించరని, ఇలాగే ప్రతి దేవాలయానికి ఒక్కొక్క ఆచారం వుంటుందని, ఇది లింగవివక్ష సమస్య కాదు, సాంప్రదాయం అని వాదించారు. కోర్టు వీటిని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించిందని విమర్శించారు. మహిళలను అనుమతించాలా లేదా అనేది భక్తులు నిర్ణయిస్తారని, తమ హక్కుల గురించి మహిళలు తేల్చుకుంటారు తప్ప కోర్టులపని కాదనే ఘనులు కూడా తయారయ్యారు. యధాతధ స్థితిని కొనసాగించాలని కోరాలని కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచో వున్న పాత ఆచారాన్ని తాము మార్చబోమని దేవాదాయశాఖ మంత్రి శివకుమార్‌ ప్రకటించారు. విశ్వహిందూ పరిషత్‌ వంటి సంస్ధలు ఇంక సరేసరి.

ఈ సమస్యపై కోర్టు తీరును వామపక్ష ప్రజాతంత్ర కూటమి స్వాగతించింది. దీనిపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని అభిప్రాయ పడింది. తిరువాన్కూరు మాజీ రాజకుటుంబానికి చెందిన మహిళలు దేవాలయాన్ని సందర్శించినట్లు గట్టి ఆధారాలున్నాయని సిపిఎం నాయకుడైన మాజీ దేవాదాయ శాఖ మంత్రి సుధాకరన్‌ చెప్పారు. మహిళలు దేవాలయంలోకి ప్రవేశిస్తే దేవుడి బ్రహ్మచర్యం పోతుందని వాదించటంలో అర్ధం లేదని ఇదొక సామాజిక రుగ్మత అని కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన వారు వాదిస్తున్నారు. గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయంలోకి ఇతర మతాలకు చెందిన వారికి ప్రవేశం లేదు, అయ్యప్పకు అటువంటి నిషేధం లేదు.వావర్‌ స్వామి అనే ఒక ముస్లిం అయ్యప్పకు ఎంతో ఇష్టమైన భక్తుడిగా ప్రాచుర్యంలో వుండటంతో అయ్యప్ప దేవాలయానికి వెళ్లే ముందు వావర్‌ స్వామి మసీదును కూడా భక్తులు సందర్శిస్తారు. హిందువులు పూజించేవారిలో హనుమాన్‌ కూడా ఒకరు. ఆయనా బ్రహ్మచారే. ఆయనకూ దేవాలయాలున్నాయి.వాటిలో మహిళల ప్రవేశంపై ఎలాంటి నిషేధం లేదు, ఆయన బ్రహ్మచర్యం పోయిన దాఖలాలు లేవు. మరి అయ్యప్పకే ఆంక్షలు ఎందుకు?

2006లో కన్నడ సినీనటి జయమాల తాను కుర్రవయస్సులో వున్నపుడు అయ్యప్పస్వామి దేవాలయాన్ని సందర్శించినట్లు ప్రకటించటంతో మహిళలపై నిషేధం వెలుగులోకి వచ్చింది. జయమాల అలాంటి ప్రకటన చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచిందంటూ కేసును దాఖలు చేశారు.ఆమెకు మద్దతుగా అనేక మంది ముందుకు వచ్చారు. ఆ వుదంతం జరిగిన సమయంలోనే దేవాలయ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ యువ న్యాయవాదులు సుప్రీం కోర్టులో కేసును దాఖలు చేశారు. నిషేధం రాజ్యాంగ బద్దం కాదని కోర్టు అభిప్రాయ పడటంతో ఈనెల 18న తమ వాదనలు వినిపిస్తూ దేవస్ధానం బోర్డు, కేరళ ప్రభుత్వం కూడా పిటీషన్లు దాఖలు చేయనున్నాయి.

రెండవ అంశం జల్లికట్టుపై నిషేధం. సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని పూర్వపక్షం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మొరటు క్రీడను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దానిపై సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు కావటంతో జల్లికట్టును అనుమతించరాదని మరోసారి కోర్టు ఆదేశించింది.అయ్యప్ప ఆలయంలోకి మహిళలపై నిషేధం లింగవివక్ష సమస్య కాదని వితండ వాదం చేస్తున్నట్లుగానే జల్లికట్టులో ఎద్దుల పట్ల క్రూరంగా వ్యవహరించటం లేదని, అసలు ఇలాంటి పోటీలు, క్రీడలు లేనట్లయితే మన దేశంలో ఎద్దులను పెంచేవారే వుండరని, అసలా జాతే అంతరించి పోతుందనే అర్ధం లేని వాదనలు ముందుకు తెస్తున్నారు. జల్లికట్టును ఒక సాంస్కృతిక అంశంగా చూడాలని, మానవ ప్రాణాలు ఒక సమస్యగా తయారైతే తప్ప ఇలాంటి అంశాలపై తీర్పులు చెప్పటం కోర్టుల పని కాదని చెబుతున్నారు. ఒక వేళ దీనిని క్రూరమైన చర్యగా పరిగణిస్తే గుర్రపు పందాలలో గుర్రాలు కూడా గాయపడతాయని వాటిని నిషేధిస్తారా, ఇతర జంతు వధలను కూడా నిషేధించాల్సి వుంటుందన్న వాదనలు ముందుకు తెస్తున్నారు. క్రూరత్వ నిరోధ చట్టం మానవులు తయారు చేసింది తప్ప మరొకటి కాదని, రాజ్యాంగంలోని మౌలిక హక్కుల వంటిది కాదని కూడా అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు.కోర్టు వాదనల ప్రకారమైతే స్పెయిన్‌లో ఎద్దులతో యుద్ధాన్ని, అమెరికాలో కృతజ్ఞతల దినం రోజు టర్కీల వధను కూడా నిషేధించాల్సి వుంటుందని చివరికి మాంసం మానేసి పండ్లు, కూరగాయలు తినాల్సి వుంటుందని చెబుతున్నారు.అలాంటి వాదనలను ముందుకు తెచ్చేవారు ముందు వాటిపై తమ అభిప్రాయం ఏమిటో చెప్పకుండా అడ్డు సవాళ్లు విసిరితే కుదరదు. సంప్రదాయం, ఆచారాలు మనోభావాల పేరుతో రెచ్చగొట్టటం గాక ఆరోగ్యకరమైన చర్చ జరిపితే ప్రయోజనం వుంటుంది. జైనులు నడిచేటపుడు తమ కాలికింద పడి జీవులు ఎక్కడ నలిగిపోతాయో అని రోడ్లు వూడ్చుకుంటూ పోయిన తరువాతే నడుస్తారు.మరి వారు మాంసం కోసం జంతువధ చేయటం తమ మనోభావాలను గాయపరచటం కనుక కుదరదు, మా సాంప్రదాయం కాదు అంటే కుదురుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

RSS is against Science and Reason

13 Wednesday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Readers News Service

≈ Leave a comment

Tags

BJP, communalism, Prof.Irfan Habib, Reason, RSS, Science

Prof.Irfan Habib

 

Excerpt of the interview with Irfan Habib being published on the backdrop of the recently concluded Indian Science Congress

“The Rashtriya Swayamesvak Sangh (RSS) and the Hindu Mahasabha (HMS) were never nationalists they are only communalists” said professor Irfan Habib in this interview to Teesta Setalvad of Communalism Combat. “Hence they have no heroes.” “They (the RSS and the HMS) did not in any way participate in the national movement against the British. Hence they lay claim to three, Bhagat Singh, Subhash Chandra Bose and Sardar Patel. Bhagat Singh and Bose because of their differences with Gandhi and Patel because of some differences with Nehru.”

Author / Source / Date:

Newsclick, CC & Hillele Production, January 9, 2016

Share this:

  • Tweet
  • More
Like Loading...

వివేకానంద స్వామికీ తప్పని కుల వివక్ష !!

12 Tuesday Jan 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Hinduism, Swami Vivekananda, VHP

Swami Vivekananda, National Youth Day, Parliament of World's Religions

సత్య

రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆమోదించిన తమ రాజ్యాంగం గురించి అమెరికన్లు ఏమనుకుంటున్నారు? పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన ఒక సర్వేలో కేవలం 51శాతం మందే రాజ్యాంగానికి ఓటు వేస్తామని ప్రకటించారు. పోర్ట్రెయిట్‌ ఆఫ్‌ అమెరికా అనే సంస్ధ జరిపిన సర్వేలో 22శాతం మంది తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పగా మరో 27శాతం ఎటూ చెప్పలేమని అన్నారు. అంతకు ముందు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా జరిగిన సమయంలో అనేక మంది తమ రాజ్యాంగంలోని అంశాలు కమ్యూనిస్టు మానిఫెస్టోలోని వని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తమ రాజ్యాంగం గురించి అమెరికన్లు ఇప్పుడే మనుకుంటున్నారు ?

హక్కుల బిల్‌ అంటే (బిల్‌ ఆఫ్‌ రైట్స్‌) స్వంత ఇల్లు కలిగి వుండే హక్కు అని ప్రతి ముగ్గురిలో ఒకరు, సమాన పనికి సమానవేతనాన్ని గ్యారంటీ చేసేదని నలుగురికి ఒకరు, ప్రభుత్వంలోని మూడు శాఖలు అని 31శాతం, ఏ ఒక్కశాఖనూ గుర్తించలేని వారు 32శాతం, 5-4గా వున్న సుప్రీం కోర్టు తీర్పులను పార్లమెంట్‌ లేదా దిగువ కోర్టుల పరిశీలనకు తిప్పిపంపటంగా 28శాతం అనుకుంటున్నారట. ఈ సర్వే గత ఆగస్టులో జరిగింది. అన్నింటి కంటే విచిత్రం ఏమంటే పదిమందిలో ఒకరు పెంపుడు జంతువును కలిగి వుండే హక్కుకు గ్యారంటీ అని భావించటం.ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రాసుకున్న రాజ్యాంగానికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తున్నపుడు, ఆచరణలో అది అమలు జరగనపుడు జనంలో ఇలాంటి అభిప్రాయాలే ప్రబలుతాయి. ఈ రోజు అమెరికాలో వాడు గాకపోతే వీడు, వీడు గాకపోతే వాడు అన్నట్లు అటు డెమోక్రాట్లు లేదా ఇటు రిపబ్లికన్లుగానీ అమెరికా రాజ్యాంగ స్ఫూర్తిని ఏడు నిలువుల లోతున పాతిపెట్టిన ఘనులు. నైతికంగా ఏమాత్రం తగనివారు.

అలాగే ఈ రోజు మన దేశంలో వివేకానందుడు ఎవరు అంటే ఆయన కూడా సంఘపరివార్‌కు చెందిన తొగాడియా, యోగి ఆదిత్యనాధ్‌, సాధ్వి రితంబరి తదితర మతోన్మాద స్వాములు, సాధువులు, సాధ్వుల కోవకు చెందిన మరో స్వామీజీ అని చెప్పే ప్రమాదం లేకపోలేదు. ఒక్కశాతం కూడా నైతిక అర్హతలేని సంఘపరివార్‌ శక్తులు ఆయన బొమ్మలను వుపయోగించుకొని వూరూ వాడా ప్రచారం చేసిన కారణంగా ఆయన కూడా వారి భావజాలపు వ్యక్తి కానట్లయితే వారెందుకు అంతగా భుజానికెత్తుకుంటారు, కనుక ఆయన గురించి పెద్దగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని భావించేవారెందరో వున్నారంటే అతిశయోక్తికాదు. వివేకానందుడు ఒక విధంగా సంఘసంస్కర్తల పరంపరకు చెందిన వారని చెప్పవచ్చు.అందువలన ఇతర సంస్కర్తల మాదిరే ఆయనకూ పరిమితులు వుంటాయి.

వివేకానందుడు వివిధ అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు చూస్తే అసహనం అందునా పరమత అసహనం కొంత మందిలో నరనరానా జీర్ణించి వున్న స్ధితిలో ఒక వేళ ఆయనే తిరిగి వచ్చి మాట్లాడితే మైనారిటీ మతాలను సంతృప్తిపరచేందుకు చూస్తున్న కాషాయం ధరించిన కుహనా హిందువు అని ట్యాగ్‌ తగిలించినా ఆశ్చర్యం లేదు. ‘ పశ్చిమ దేశాల వారు భారత్‌ నుంచి ఒక విషయం తప్పక నేర్చుకోవాలి అదేమంటే సహనం. సారం ఒకటే అయినందున అన్ని మతాలూ మంచివే.’ అని అమెరికాలోని బ్రూక్లిన్‌ ఎథికల్‌ సొసైటీ సందర్శన సందర్బంగా వివేకానందుడు చెప్పారు. క్షుద్ర పూజలు హిందూమతంలో భాగం కాదని కూడా చెప్పారు. కానీ నేడు ఎక్కడ చూసినా క్షుద్రపూజలు చేయని, చేయించని స్వామీజీలు ఎవరో చెప్పండి. ఎవరైనా చివరికి ఆ వివేకానందుడే వచ్చి అభ్యంతరం చెప్పినా ముందు గూండాలతో గెంటేయిస్తారు, సాధ్యంగాకపోతే మా మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఆందోళనలు చేయించి పోలీసుల చేత బయటకు నెట్టిస్తారు. భారత్‌లో మహిళలు అంతగా వున్నత స్ధాయిల్లోకి రాకపోవటానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు వివిధ యుగాలలో దుర్మార్గులైన దురాక్రమణదారులు ఒక పెద్ద కారణమైతే భారతీయుల స్వయంకృతం కూడా పాక్షికంగా దానికి దోహదం చేసిందన్నారు.మహిళలను శబరిమల దేవాలయంలోకి అనుమతించకపోవటంపై సోమవారం నాడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కచ్చితంగా వివేకానందుడు హర్షించి వుండేవాడు.(మనం ఎక్కడున్నాం ! నికితా అజాద్‌కు జేజేలు !! http://vedikaa.com/2015/12/22/open-letter-to-devaswom-chief-sabrimala/) మనం స్వయం కృతంతో మహిళలపై విధించిన అర్ధంలేని ఆంక్షలలో అదొకటి. మతం ఆధారంగా తప్పించి రాజ్యాంగం ప్రకారం మహిళల ఆలయ ప్రవేశాన్ని నిషేధించజాలరని సుప్రీం కోర్టు పేర్కొన్నది. రుతుక్రమంలో వున్న మహిళలు దేవాలయ ప్రవేశం చేయకూడదని, అలా చేస్తే పవిత్రతకు భంగం అని హిందూమతం ఎక్కడ చెప్పిందన్నది ప్రశ్న.

హిందూ మత పవిత్రతను పరిరక్షించేందుకు పవిత్ర భారత భూమి నుంచి ఎవరూ బయటికి పోగూడదని, వెళ్లిన వారిపై శాస్త్రాలు ఆంక్షలు విధించినట్లు కొందరు టీకా తాత్పర్యం చెబుతున్నారు. వేల సంవత్సరాలనాడే భారత్‌ నుంచి హిందూమతం ప్రాచ్య రాజ్యాలుగా పిలిచే తూర్పు ఆసియా ప్రాంతానికి విస్తరించినట్లు మనకు తెలుసు.ఇదంతా దాదాపు రెండు వేల సంవత్సరాల పూర్వమే జరిగిందన్నది చరిత్ర. దాదాపు అన్ని దేశాలలో హిందూ దేవాలయాలు, పురాణ ఇతిహాసాలు ఏదో ఒక రూపంలో అక్కడ ఇప్పటికీ ప్రచారంలో వున్నాయి. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో వుండే జనాభాలో 90శాతం మంది హిందువులే. అక్కడ రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన మతాలలో హిందూ ఒకటి. హిందూమతం పుట్టినప్పటి నుంచి నిజంగా ఈ ఆంక్షలు వుండి వుంటే సముద్రాలు దాటి అంతదూరం ఎలా వెళ్లి వుండేది?

హిందూ మతానికి సంబంధించి అనేక అంశాలు తిరోగమనంగా వున్నాయి. వాటిని వదిలించుకొని పురోగమించాలి. సాటి మనిషిని మనిషిగా గుర్తించని ఏ మతమైనా కాలగతిలో అదృశ్యం కావాల్సిందే. హిందూ మతం గొప్పతనం గురించి చికాగోలో జరిగిన ప్రపంచ మత సమావేశాలలో గొప్పగా ప్రసంగించారని కీర్తించబడుతున్న వివేకానందుడు అక్కడ ఈ మతంలోని తిరోగమన అంశాలను చెప్పి వుండుంటే పరిస్ధితులు మరొక రకంగా వుండి వుండేవి? ఆ మత ఛాందసానికి తానే గురి అవుతానని అమెరికా వెళ్లటానికి ముందు వివేకానందుడు ఊహించి వుండడు. ఆశ్చర్యంగా వుంది కదూ !!

మత నిషేధాలను వుల్లంఘించి సముద్రయానం ద్వారా విదేశీ ప్రయాణం చేసినందుకు నాటి బెంగాలీ కులీనులు ఆయనను అంటరాని వాడిగా పరిగణించారు. 1897లో అమెరికా నుంచి కొల్‌కతా తిరిగి వచ్చినపుడు ఏం జరిగిందో శైలేంద్రనాధ్‌ ధార్‌ రాసిస వివేకానందుడి జీవిత చరిత్ర వివరించింది. 1897 మార్చి 21న స్వామి 40 సంవత్సరాల పాటు నివసించిన దక్షిణేశ్వర్‌లోని కాళీ మాత ఆలయ సందర్శనకు ఖేత్రి మహారాజుతో కలసిపెద్ద పరివారంతో వచ్చాడు. ఆ సందర్బంగా జరిగిన వుదంతంపై తరువాత పత్రికల్లో పెద్ద వివాదమైంది. మహారాజులు, స్వామి వంటి పెద్దలు వచ్చినపుడు ముందుగా తెలియచేయటం, ఆలయ యజమాని బాబు త్రిలోక్యనాధ్‌ బిస్వాస్‌ స్వయంగా వచ్చి ఆహ్వానించటం అక్కడి సంప్రదాయం. ఆలయ సందర్శన వివాదంపై ది వంగాభాషీ అనే పత్రిక స్వామి, ఆయన అనుచరులను ఆలయం నుంచి బయటకు పంపించారని రాసింది. దీనిపై త్రిలోక్యనాధ్‌ స్పందిస్తూ ‘స్వామి, రాజాను ఆహ్వానించాల్సిందిగా నేను ఎవరినీ ఆదేశించలేదు, స్వయంగా రాలేదు. ఒక విదేశానికి వెళ్లి ఇంకా తనను తాను హిందువును అని చెప్పుకొనే వారితో కలవాలని ఏమాత్రం భావించలేదు, వివేకానంద, ఆయన అనుచరులు ఆలయం వదలి వెళ్లేటపుడు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదని అనుచరులతో చెప్పాను. మీరు పత్రికలో రాసినట్లుగా దేవతను సాయంత్రం పునరాభిషేకం (శుద్ధి) చేసిన మాట అక్షరాలా నిజం’ అని పేర్కొన్నారు.(దళితులు ఎక్కడైనా ఆలయ ప్రవేశం చేసినపుడు తరువాత ఆలయాన్ని శుద్ధి చేస్తున్న తీరు ఇప్పటికీ జరుగుతున్నది)

ఈ వుదంతంపై రాణి రాసమణీ కుటుంబ సభ్యులొకరు ఒక పత్రికకు లేఖ రాస్తూ త్రిలోక్యనాధ్‌ ఆలయయజమానిగా చెప్పుకొనటాన్ని అభ్యంతర పెట్టారు. తానే యజమానినని త్రిలోక్య తిరుగు జవాబు ఇచ్చారు. స్వామి వ్యతిరేక పత్రికలు ఈ వివాదాన్ని ఏదో రూపంలో కొనసాగించాయి. స్వామి పాత స్నేహితులుగా వున్నవారు కూడా తరువాత కాలంలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. వారిలో ఒకరైన డాక్టర్‌ బర్రోస్‌ చికాగోలో స్వామిని సమర్ధించి కొల్‌కతా వచ్చిన తరువాత వివేకానందుడు నిజమైన హిందువు కాదని, అమెరికాలో హిందూయిజం గురించి మాట్లాడలేదని పేర్కొన్నాడు. వివేకానందుడి జీవిత చరిత్రలో ప్రస్తావించిన ఈ అంశం మంచి చెడ్డలను పక్కన పెడితే వివేకానందుడికి కూడా బహిష్కరణ తప్పలేదన్నది వాస్తవం. అయితే ఈ వివాదం, తనకు జరిగిన అవమానం, వ్యతిరేకంగా జరిగిన ప్రచారాన్ని వివేకానందుడు పెద్దగా పట్టించుకోలేదని జీవిత చరిత్ర రచయిత పేర్కొన్నారు. అందుకు దృష్టాంతంగా 1897 మే 30వ తేదీన రాసిన ఒక లేఖలోని అంశాలను పేర్కొన్నారు.’మత కర్మకాండలు శూద్రులకు వుద్దేశించినవి కావని మన శాస్త్రాలు చెప్పాయి. ఆహార విషయంలో వివక్ష, విదేశీ ప్రయాణంపై ఆంక్షలతో నాకు నిమిత్తం లేదు మరియు అవన్నీ నావరకు పనికిమాలినవి. నేను శూద్రుడిని మరియు మ్లేచ్ఛుడిని, ఈ సూత్రాల పాటింపు గురించి నేనెందుకు ఆందోళన చెందాలి? హిందూ సమాజంలోని అంటరానివారు మరియు మ్లేచ్ఛుల ఆహారం తీసుకోవటం నాకు సంబంధించిన విషయం.’ అని పేర్కొన్నారు.

వివేకానందుడిని స్వదేశంలో బహిష్కరించారంటూ డాక్టర్‌ బర్రోస్‌, మరికొందరు క్రైస్తవ మిషనరీలు విదేశాలలో కూడా చేస్తున్న ప్రచారం ఆయన దృష్టికి వచ్చింది. దాని గురించి మేరీ హేల్‌కు రాసిన లేఖలో ‘ ఒక సన్యాసిగా నాకు ఒక కులం అంటూ వుంటే కదా పోవటానికి అని ప్రశ్నిస్తూ నేను ఎలాంటి కులాన్ని పోగొట్టుకోలేదు కానీ సముద్రప్రయాణాన్ని వ్యతిరేకించేవారు నేను ఒక పశ్చిమ దేశానికి పోవటం గురించి కకావికలయ్యారు. మరోవైపు నేను సన్యాసిగా మారటానికి ముందు నా కులానికి చెందిన ఒక ప్రముఖ రాజు గారు నేను అమెరికా నుంచి వచ్చి ఆశ్రమంలో ప్రవేశించే ముందు నా గౌరవార్ధం పెద్ద విందు ఇచ్చారు. దానిలో ఆ కులానికి చెందిన పెద్ద వారందరూ వున్నారు. నేను బయట వీధులలోకి వెళ్లినపుడు శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులు అవసరమై వుండి వుంటే అది నిజంగా బహిష్కరణ అయివుండేది అని పేర్కొన్నారు.

ఇంత జరిగాక కూడా హిందూ సమాజానికి నిజమైన ప్రతినిధులుగా చెప్పుకొనే వారిలో ఎలాంటి మార్పు లేదు. ఈ కారణంగానే తరువాత అంబేద్కర్‌ వంటి వారు మనువాద హిందూ వ్యవస్ధకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. అందువలన వివేకానందుడి జీవితంలోని అనేక అంశాలపై మరో కోణంలో విశ్లేషణ జరపాల్సి వుంది. సముద్ర ప్రయాణంపై వున్న ఆంక్షలను ఖాతరు చేయకపోవటం, దిగువతరగతి కులాలనే బడేవారితో కలసి భోజనం చేయటంలోనూ, మ్లేచ్ఛులుగా పక్కన పెట్టాలని ఆదేశించిన వారితో కలసి సభలు, సమావేశాల్లో పాల్గొనటం వంటి వాటిని ఆచరించిన వివేకానంద స్వామి సమాజంలో పురోగామి బాటలో తీసుకున్న నిర్ణయాలుగానే భావించాలి. తమను హిందువులుగా చెప్పుకున్నవారందరినీ హిందూ మతోన్మాదులుగా చూడాల్సిన అవసరం లేదు. ఆ పేరుతో వున్మాదాన్ని రెచ్చగొట్టేవారికి, ఇతరులకు వున్న తేడాను గమనించాలి. ఆ రీత్యా వివేకానంద స్వామిని మనం నిత్యం చూసే కరడు గట్టిన తిరోగమన, పరమత ద్వేషాన్ని నిత్యం నూరిపోసే విశ్వహిందూ స్వామీజీలు, సాధ్వుల సరసన పెట్టి చూడాల్సిన అవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Vishwa Hindu Parishad Decides To Set Up Temple For Lord Ram In Every Village

11 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Ram temple, VHP

PTILUCKNOW — With Ayodhya Ram Temple issue bouncing back to the centre stage of Uttar Pradesh politics ahead of the 2017 Assembly polls, VHP has decided to construct temples in every village across the country.”The organisation has decided to set up a temple of Lord Ram in every village,” spokesman of Vishwa Hindu Parishad (VHP) Sharad Sharma said today.He said from April 15 — Ram Navami — the organiation would start a seven-day-long Ram Mahotsava.”During this period Lord Ram will be worshipped in every village,” he told .Sharma said the target is to reach 1.25 lakh villages.

“We had been observing Ram Mahotsava in the past and the organisation has already reached 70,000-75,000 villages pan India,” he said.

Sharma said that during Ram Mahotsava, statues of Lord Ram would be worshipped.

“Whether it is a statue or picture it will be installed at a place after worship,” he said.

The Ayodhya Ram temple issue is pending before the Supreme Court but it is again in focus in UP politics ahead of Assembly elections next year.

​BJP leader Subramanian Swamy recently exuded confidence that work on the construction of the Ram Temple in Ayodhya would start before the year-end. He, however, made it clear that the temple would not come up through a movement but only after the court verdict, which he hoped would come by August-September, and with the mutual consent of Muslim and Hindu communities.

Asked if raising the Ram temple issue was linked to Uttar Pradesh Assembly elections in early 2017, he said, “Ram should not be linked with elections. Ram is a matter of faith for Hindus and construction of the temple at Ayodhya is a commitment of every Hindu.”

“It’s a matter of faith for crores of Hindus in the country and we want to realise the dream of our patron late Ashok Singhal,” Sharma said when asked about Swamy’s comment.

Singhal had died on November 17 at the age of 89.

Ruling Samajwadi Party in Uttar Pradesh has said that no temple would be allowed to be built at the disputed site in Ayodhya without the court’s permission.

Senior SP leader and minister Shivpal Singh Yadav said not a single brick would be allowed to move without the court’s nod. In December last year two trucks of stones arrived in the temple city almost six months after VHP announced its nationwide drive to collect stones for construction of Ram temple in Ayodhya.

“Two trucks of stones have been unloaded at Ram Sewak Puram, a VHP property in Ayodhya, and Shila Pujan (praying of the stones) has been performed by Mahant Nritya Gopal Das, the president of Ram Janam Bhumi Nyas,” Sharma said. “Now, the time has come for the construction of Ram Mandir in Ayodhya. Lot of stones have arrived in Ayodhya. And now the arrival of stones will continue. We have signals from Modi government that Mandir construction would be done now,” Das had claimed.

Asserting its resolve to build the Ram temple, the VHP had in June last year announced a nationwide drive to collect stones for construction of the temple and had also asked the Muslim community not to pose any hindrance.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానంపై పరిశోధనలు

08 Friday Jan 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Science

≈ Leave a comment

Tags

indian science congress 2016, pseudo-scientific claims

సైన్స్‌ సమావేశాలా మూఢనమ్మకాల మేళాలా ?

ఎంకెఆర్

ఈ లెక్కన పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం పేరుతో ప్రచారంలో వున్న వాటన్నింటి మీద ఒక్కొక్క పత్రాన్ని సమర్పించవచ్చు.రుజువు అయ్యేంత వరకు వాటిని కాదనటానికి లేదు, ఏమి తర్కమిది, దేశాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారు వీరు? ప్రజాస్వామ్య దేశం, భావప్రకటనా స్వేచ్ఛ వుంది కనుక అలాంటి వాటికి కావాలంటే పిచ్చి కాంగ్రెస్‌లు ఎన్నయినా పెట్టుకోవచ్చు, పత్రాలు సమర్పించుకోవచ్చు సైన్స్‌ కాంగ్రెస్‌లలో వాటిని జొప్పించటమే మన దౌర్బాగ్యం.

ఏడు కొండల వాడా పాహిమాం రాకెట్‌ సముద్రంలో కూలిపోకుండా చూడు అని ఇస్త్రో శాస్త్రవేత్తలు మొక్కుతారు ! దేవుడా మేం కట్టే వంతెన కూలిపోకుండా చూడు అని కాంట్రాక్టరుతో కలిసి ఇంజనీర్లు కొబ్బరి కాయలు కొడతారు ! ఆపరేషన్‌ జయప్రదం చేసి నా ప్రాక్టీస్‌ను పెంచు అని వైద్యులు కత్తులు కటార్లను దేవుడి ముందుంచుతారు !!!

లోకంలో ఇన్ని జరుగుతున్నపుడు గతేడాది ముంబైలో జరిగిన సభలో సంస్కృతంలో పురాత భారత సైన్సు అంశాలు నిక్షిప్తమై వున్నాయని చెప్పి సభను ఒక ప్రహసంగా మార్చారు. ఇప్పుడు దాని కొనసాగింపుగా మైసూరులో జరిగిన సైన్స్‌ కాంగ్రెస్‌లో మరికొన్ని అశాస్త్రీయ అంశాలను అనుమతించటం, ప్రవేశపెట్టటంలో ఆశ్చర్యం ఏముంది? వేదాలను నమ్మటం నమ్మకపోవటం అన్నది వ్యక్తిగతం. కానీ వేదాల్లో అన్నీ వున్నాయష మనమేమీ చేయనవసరం లేదన్నది సహించరాని విషయం. ఇలాంటి తిరోగమన అంశాలకు ప్రస్తుతం కేంద్రంలో వున్న ప్రభుత్వమే పెద్ద పీట వేస్తున్నది. అలాంటి వాటిని ప్రచారం చేయటం జాతి ద్రోహమని తెలిసిన వారు కూడా మౌనంగా వుండటానికి పేరేమి పెట్టాలో భాషా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి లేదా వేదాల్లో ఏముందో సంస్కృత పండితులు చెప్పాలి.

శాస్త్ర సభలు సమాజంలో ముఖ్యంగా విద్యార్ధులు,యువతలో కొత్త విషయాలపై ఆసక్తిని రేకెత్తించి నూతన ఆవిష్కరణలకు దోహదం చేయాలి. మధ్య ప్రదేశ్‌కు చెందిన ప్రయివేటు విశ్వవిద్యాలయాల నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ అఖిలేష్‌ పాండే శివుడు గొప్ప పర్యావరణవేత్త అనే ఇతి వృత్తంతో మైసూరు సైన్స్‌ కాంగ్రెస్‌కు పత్రం సమర్పించటం ఏమిటి ? దాన్ని నిర్వాహకులు అంగీకరించటం ఏమిటి? భారతీయులు ఎప్పుడో విమానాలను కనిపెట్టారు, క్లోనింగ్‌ ప్రక్రియ కొట్టిన పిండి, మనిషి-జంతు శరీర భాగాలను కూడా అతికించగలిన వైద్యులు మనకుండబట్టే గణపతి తయారయ్యాడు వంటి విషయాలను ఇటీవలి కాలంలో ప్రచారం చేస్తున్నారు. వాటిని మొగ్గలోనే నిలువరించకపోవటంతో కొనసాగింపు జరుగుతోంది. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి విచిత్రాలను ఎన్నింటిని వినాల్సి, చూడాల్సి వస్తుందో !

చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్న లోకరీతి తెలిసిందే.కొందరు శాస్త్రజ్ఞులకు తెలివి కంటే అతి తెలివి ఎక్కువ అని సైన్స్‌ కాంగ్రెస్‌ చర్చ అంశాల ఎంపిక సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గంగాధర మిశ్రా నిరూపించారు. ఊహాజనితాలపై ప్రయోగాలు చేస్తూ వున్నపుడు అవి విజయవంతమైతే విజ్ఞానశాస్త్రమౌతుంది అని గొప్ప స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. శివుడు పర్యావరణ శాస్త్రవేత్త అన్న పత్రాన్ని సమర్పించేందుకు ఇచ్చిన అనుమతిని సమర్ధించుకుంటూ చెప్పిన మాటలివి. ఇలాంటివారిని చూసి దేనితో నవ్వాలో తెలియటం లేదు.ఈ లెక్కన పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం పేరుతో ప్రచారంలో వున్న వాటన్నింటి మీద ఒక్కొక్క పత్రాన్ని సమర్పించవచ్చు.రుజువు అయ్యేంత వరకు వాటిని కాదనటానికి లేదు, ఏమి తర్కమిది, దేశాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారు వీరు? ప్రజాస్వామ్య దేశం, భావప్రకటనా స్వేచ్ఛ వుంది కనుక అలాంటి వాటికి కావాలంటే పిచ్చి కాంగ్రెస్‌లు ఎన్నయినా పెట్టుకోవచ్చు, పత్రాలు సమర్పించుకోవచ్చు సైన్స్‌ కాంగ్రెస్‌లలో వాటిని జొప్పించటమే మన దౌర్బాగ్యం.

బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టినట్లుగా ఇళ్ల ముందు చల్లే పేడ కళ్లాపి నుంచి ప్రతి మూఢనమ్మకానికీ శాస్త్రీయ కారణాలున్నాయంటూ చెప్పేవారు, వాటిని ప్రచురించి వ్యాపింపచేసే పుస్తక ప్రచురణలు, మీడియా సంస్ధలూ వున్నాయి. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదేమో, తెలియని వాటిని ఎందుకు కాదనాలంటూ నమ్మటమే కాదు, ప్రచారం చేసే జనాలూ వున్నారు. ఇప్పుడు సమాజంలో ఫాస్ట్‌ ఫుడ్‌లు, అవి పెంచే వూబకాయాలతో ఫిట్‌నెస్‌ సమస్య ముందుకు వచ్చింది. ఏది చెప్పినా దానికి దేశీయత అని బ్రాండ్‌ వేయటం దేశభక్తిగా మారింది. దానిలో భాగంగానే శంఖాన్ని రోజూ కాసేపు వూదితే మెదడు చురుకుగా పనిచేస్తుందని, ముఖం కళకళలాడుతుందని, శ్వాసకోశాలు చక్కపడతాయని, పురీష నాళ కండరాలకు మర్ధన చేసినట్లు అవుతుందని కాన్పూర్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి రాజీవ్‌శర్మ ఒక పత్రం సమర్పించారు. అదే నిజమైతే దాన్ని ఒక మతానికి చిహ్నంగా వున్న శంఖానికే ఎందుకు పరిమితం చేయాలి ? బూరకు గాలి వూదినా, సన్నాయి, తబలా, హార్మోనియం వాయించినా, రబ్బరు బంతిని నలిపినా ఇలా ప్రతి పరికరానికి శరీర భాగంలో ఏదో ఒకటి కదలటం మెదడు పనిచేయటం, ముఖాలు వెలిగిపోవటం ఎందుకు జరగదు ? కొన్ని ఆపరేషన్లు చేసినపుడు, పక్షవాతానికి గురైనపుడు,ఇతర కీళ్ల సంబంధ వ్యాధులకు వైద్యులు బంతి వున్న పరికరంలోకి గాలి వూదించటం, రబ్బరు బంతులను చేతులతో నలిపించే ప్రక్రియలు కొన్ని చేయించటం మనకు తెలిసిందే. వాటికి శాస్త్రీయ కారణాలు చెప్పటానికి బదులు మహత్తులను ఆపాదించటమే అభ్యంతరకరం.రోజూ శంఖువు వూదితే కలిగే ప్రయోజనాలను ప్రతిపాదించే ముందు ఎంత మందిపై పరిశోధనలు చేశారో, ఎలా చేశారో, కందగడ్డలుగా వున్న ముఖాలు ఎన్ని ఎంతలా విప్పారాయో, మంద బుద్దులు ఎంత మంది చురుకుగా మారారో నిరూపించే అంశాలను చూపినపుడే దానికి ప్రామాణికత వుంటుంది.అవేమీ లేకుండా ఏది బడితే దాన్ని అనుమతించటం మన సైన్సు సమావేశాలను మనమే అపహాస్యం చేసుకోవటం తప్ప మరేముంది? వైద్య రంగంలో ప్రత్యామ్నాయ వైద్యం పేరుతో ఇప్పటికే అనేక ఆశ్రాస్తీయ అంశాలను శాస్త్రంగా చిత్రించి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న తరుణంలో ఇలాంటి వాటికి తావివ్వకూడదు.గతంలో ఆయిల్‌ పుల్లింగ్‌ పేరుతో పుంఖాను పుంఖాలుగా రాశారు, కొందరు చేశారు. దాని వెనుకా శాస్త్రీయ కారణాలున్నట్లు అప్పుడు ప్రచారం చేశారు. ఇపుడు ఎందుకు అలాంటి వారు కనిపించటం లేదు.

పురాణాలు, ఇతిహాసాలలో పేర్కొన్న విమానాలలో మన వారు ఎక్కడకు ప్రయాణించారో మనం నిరూపించలేము గానీ వాటిని పశ్చిమ దేశాల వారు నిరూపించినందున మన వారు చెప్పింది కరెక్టే కదా అనే వాదనలను ముందుకు తెస్తున్నారు. అపని మనం ఎందుకు చేయలేకపోయాము, మనల్ని ఆపిందేమిటి , మన మెదళ్లు అంతగా ఎందుకు మొద్దుబారి పోయాయి అన్నదే సమస్య. అన్ని దేశాలు, మతాలలో ఇలాంటి వూహలు, కల్పనలూ వున్నాయి. వాటిని నమ్మినట్లుగానే మన దేశంలో పేర్కొన్నవాటిని కూడా కొందరు పాశ్చాత్యులు నమ్మి వాటినే తిరిగి మనకు మనకు తెలియని మన శాస్త్రాంశాలుగా పుస్తకాలు రాస్తే మనం మన పాత సైన్సు ఎంత గొప్పదో అని జబ్బలు చరుచుకుంటున్నాం . వాటిని నిరూపించేంత వరకు కల్పనలుగానే తీసుకోవాలి తప్ప నిరూపించనంత మాత్రాన నిజం కాకుండా పోతాయా , అసలేమీ తెలియకుండానే చెప్పారా లేదా రాశారా అనే వితండ వాదనలు చేస్తే అర్ధం లేదు. దేనికైనా శాస్త్రీయతే ప్రమాణం.

మైసూరు సైన్స్‌ కాంగ్రెస్‌కు సమర్పించిన శంఖం, శివుడు పర్యావరణ వేత్త అనే పత్రాలు కాంగ్రెస్‌ అధికారంలో వుండి వుంటే వివాదాస్పదం అయ్యేవి కావని, బిజెపి కేంద్రంలో వుంది కనుక రాజకీయం చేస్తూ మీడియాలో రాస్తున్నారని కొందరు అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు.బిజెపి తిరోగమన పునాదులపై ఏర్పడిన పార్టీ, అందుకని అది వాటికి ఆలంబనగా వున్న హిందూయిజాన్ని ప్రచారం చేసేందుకు అన్ని వేదికలనూ వుపయోగించుకుంటుంది. పురాణ పాత్రలకు ప్రామాణిక ముసుగు వేసే యత్నమే శివుడి గురించి పత్రం.గోవును వధించిన వారిని చంపాలని వేదాలు చెప్పాయని చెప్పిన వారు వేదాల పేరుతో ఏం చేసేందుకైనా సిద్ద పడతారు.

మన సైన్స్‌ కాంగ్రెస్‌ల గురించి నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన వెంకటరామన్‌ రామకృష్ణన్‌ చేసిన వ్యాఖ్యలు కనువిప్పు కావాలి. ఆయనేమీ మోడీ లేదా సంఘపరివార్‌ వ్యతిరేక రాజకీయ నాయకుడు కాదు. మైసూరు జరిగే సైన్స్‌ సమావేశాలు ఒక సర్కస్‌ తప్ప మరొకటి కాదని, వాటికి తాను హాజరు కావటం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయాలు, మత భావాలను సైన్సుతో మిళితం చేయరాదన్నారు. గతంలో జరిగిన ఒక సభకు తాను వచ్చానని అక్కడ సైన్సు గురించి చాలా తక్కువ చర్చించారని నా జీవితంలో మరోసారి అలాంటి సభలకు రానని విలేకర్లతో చెప్పారు. చండీఘర్‌లోని పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ ఎన్నో శాస్త్రీయ విజయాలను సాధించినప్పటికీ పెద్ద సంఖ్యలో భారతీయులు ఇంకా మూఢనమ్మకాలతో వున్నారని అందువలన నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం జరుగుతోందన్నారు.మంగళయాన్‌ కార్యక్రమాన్ని ప్రస్తావించి దాని ప్రయోగానికి శుభప్రదమైన రోజంఊ మంగళవారాన్ని ఎంచుకోవటం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. రెండువేల సంవత్సరాల క్రితమే ఒక యోగి విమానాన్ని కనిపెట్టారని చెప్పటాన్ని తాను నమ్మనని అన్నారు. ఆధునిక శాస్త్రం తెల్లవారే సరికి వూడిపడలేదని, ఒక పద్దతి ప్రకారం తయారైన పరిజ్ఞానాన్ని ఎవరైనా తిరిగి ప్రతిబింబించినపుడే అది శాస్త్రం అవుతుందన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Marxism does not attack religion per se

08 Friday Jan 2016

Posted by raomk in Communalism, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

communalism, CPI(M), Marxism, Marxist philosophy, narayana Guru, SITARAM YECHURY, Sivagiri

Sitaram Yechury

[This text is based on the speech delivered by Sitaram Yechury, General Secretary of CPI(M)  at the valedictory function of the 83rd Sivagiri Pilgrimage Celebrations on January 1, 2016 at Kerala.]

It is, indeed, an honour to be here at Sivagiri. My heartfelt thanks for being invited to share some thoughts with all of you in the concluding session of the 83rd Sivagiri Pilgrimage celebrations. It is, indeed, a very new and an appropriate way to begin the new year. A Happy New Year to all of you.

I belong to a generation that grew up on the values propagated by Srinarayana Guru – `the oneness of humanity’, with no social barriers on the grounds of caste, religion, region etc.  The slogan of `one caste, one religion, one god’ is an elevated expression of humanism which recognizes the value of a human being  as being supreme. A value that recognizes all human beings as being equal, irrespective of all social divisions.  This universality of oneness of humanity, in a sense, crystallizes the finest elements of  rational thought and philosophy that emerged in the course of the advance of human civilization in these lands.  As “different rivers flow through different courses to merge in the ocean”, so do different human beings through the practice of individual beliefs and faith eventually merge with humanity as a whole. This is humanism of the highest variety.

Such humanism has a strong resonance with the Communist philosophy and worldview.  The overriding concern of Marxism is humanism.  In fact, Karl Marx had once said, “Nothing human is alien to me”.  It is the pursuit of the simple question of what constitutes the real freedom of a human being and his consequent liberation, Marx proceeded to reject the Hegelian idea of the revolution of the mind as articulated by Feuerbach, during his time, to come to a conclusion of seminal importance.  This was: consciousness of a human being is determined by the social conditions and not vice a versa. “It is not the consciousness of men that determines their being, but on the contrary their social being that determines their consciousness”.

Marxism’s focus on changing the concrete conditions of material existence, as the basic pre-requisite for human liberation, emerges from this understanding and hence Marx’s own scientific study on the real living conditions of the people and his consequent dissection of capitalism.

It, indeed, sounds as a strange paradox that a practitioner of Marxism, a Communist foot soldier, a confirmed atheist has been invited to be here as a part of these pilgrimage celebrations.  A  great deal of controversy has always existed regarding the Marxist understanding of religion. The popular perception is the normally out of context quotation that “religion is the opium of the people”. In fact, deliberately, the passage in which this statement finds place is never quoted in the full. Marx had stated :”Religious distress is at the same time the expression of real distress and the protest against real distress. Religion is the sigh of the oppressed creature, the heart of the heartless world, just as it is the spirit of the spiritless situation. It is the opium of the people”.

Religion, is the opium in the sense that it is as potent as opium in transporting human beings to an illusory world. For a human being who is oppressed, religion provides the escape for  relief, it provides  a “heart in a heartless world, a spirit in a spiritless situation.” This is the strength and power of religion. It is like opium that the people are fed, to lull themselves into submission, robbing them of their inherent potential to change the real world, and hence, remain in conditions which appear outside of both their comprehension and control.

Marxism does not attack religion per se. It’s attack is on the conditions that give rise to the conditions that perpetuate the hold of religion on the people.  The point is to change the real world; to  transform the comforts of an illusory world into concrete reality. Therefore, as a Communist, we can assure you that the CPI(M) will be the foremost upholder of every individual’s right to his/her choice of their faith and their right to maintain their beliefs and propagate them.  We will defend,  till the last breath, this right of the individual choice and protect the faith of every individual. It, therefore, necessarily follows that we shall also protect everybody against any attempt to interfere into the rights of individual liberty of faith by any body of thought or action.  This is precisely what the communal forces attempt to do today.  The CPI(M)’s opposition to communalism is, hence, integral to both its philosophy and practice.

This growth of rabid communal polarization that we see around us today runs completely in contradiction with the body of thought and action that the Guru has bequeathed to us.   This rich legacy and the philosophical activities that the Guru undertook had heralded a movement for social renaissance in Kerala.  Remember, Swami Vivekananda had once described the Kerala society as a `mad house’ of casteism.  The Guru, through his philosophy of oneness of humanity,  spread the indomitable values of equality and humanism.  Kerala was a society where caste prejudices went beyond even the obnoxious practice of untouchability. In Kerala, there was the practice of unseability. Comrade EMS Namboodiripad used to tell us that in his childhood, it was not unusual to see some `unfortunate’ human beings carrying a bell around their neck whose sound would warn the  upper castes, to take a different path!

It was the social renaissance heralded by the Guru, amongst others, that has transformed this society into one with the most progressive values in the country today. In the process, Kerala society has achieved such advances in its human development indices that it matches and, in some cases, outstrips the standards existing in the developed capitalist countries today. In the field of literacy, education, gender equality and other social parameters, Kerala proudly stands at the top on the  rest of India.

The Guru used spirituality as a propelling force for upward social mobility of the people. In this process, he developed a unique combination of materialism and spiritualism, propagating The Buddha’s preachings of the control over the Body, Word, Mind, Food and Deed.   The consecration of the Shiva Lingam in 1888 – the Aruvippuram Prathishta – remains a landmark that has gone way beyond being a symbolic gesture.

Yet another resonance with Marxist philosophy is the Guru’s emphasis on “freedom through education, strength through organisation, economic independence through industry”.  In a sense, this brings me to the point of urging all of you to explore further a thought: Spiritualism is  not to be confined within the boundaries of religion or religiosity.  Of course, there is religious spiritualism which could also be call Theistic spiritualism. On the other hand, there is also an Atheistic spiritualism. Here, spiritualism is understood as the elevation of human  consciousness to the levels of refined humanism.  Such elevation of human consciousness can be achieved as much by a materialist philosophy as it can be through a Theistic theology.  (This is a tautological term, but I am using it only to emphasise the point.)

The Guru’s philosophy spread far and wide beyond the confines of Kerala. I am told that Mahatma Gandhi came here thrice during our freedom movement.  Gurudev Rabindranath Tagore came to meet the Guru in 1922. This surely was a meeting of minds.  Tagore had by then penned the Nobel Prize winning immortal lines to awaken India: “Where the mind is without fear and the head is held high; Where knowledge is free; Where the world has not been broken up into fragments by narrow domestic walls;”.

The Guru’s teachings and personal example appear to be not merely relevant but more necessary to meet the challenges before us today.  On the one hand, the material basis of  existence for the vast mass of our people and the country, as a consequence of embracing the neo-liberal policy trajectory by the Indian ruling classes, is deteriorating. Unless material needs are satisfied, the growth of spiritualism leading to social renaissance and, therefore, to cultural renaissance would be simply impossible.  The economic policies followed  by the current government at the Centre and, to a large extent, by the government in Kerala, only buttress such material regression of our people’s lives.  These policies need to be resisted and reversed.  This is one focus of CPI(M)’s activities today.

On the other hand, the CPI(M)’s other focus is against the growing communal polarization and the vicious pursuit of consolidating the Hindutva  communal vote bank politics which is leading to severe ruptures in our society that can well destroy the unity and integrity of India.  Under the present Central government, both these aspects of anti-people economic reforms and communal polarization constitute its singular agenda.  In the process, the communal forces even make an attempt to forcibly appropriate the Guru’s philosophy and legacy.

This, simply, cannot be allowed. Such efforts, in particular, have to be defeated in order to carry ourselves to higher levels of social and material existence as envisaged and propagated by the Guru.  The efforts to replace the  rich Indian history with Hindu theology and the evolution of the syncretic Indian philosophy with a monolithic Hindu theology will have to be resisted and defeated.

I wish the Srinarayana Guru Mutt all success in its efforts to relentlessly continue to propagate the Guru’s philosophy  and vision of the `oneness of humanity’ and not permit any effort at hijacking this rich legacy to serve the narrow ends of communal forces.

Thank you once again for giving me this honour of sharing some of my thoughts at this sacred Srinarayana Guru Mutt.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పోప్‌ ఏ కులంలో పుట్టాలనుకుంటున్నారో చెబితే సంతోషం

31 Thursday Dec 2015

Posted by raomk in Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Face book, Hinduthwa, misuse of facebook, pope, religions

పేర్లకీ, పుకార్లకీ కేంద్రంగా ఫేస్‌బుక్‌

ఎంకెఆర్‌

ఈ మధ్య ఫేస్‌బుక్‌లో ‘ పోప్‌ సంచలన వ్యాఖ్యలు…’అనే శీర్షిక కింద ఒకరు ఒక పోస్టు పెట్టారు. దానిలో ఇలా వుంది.’ నాకు ఏసుక్రీస్తు మీద నమ్మకం లేదు, కేవలం ఈ సుఖానికి బానిసలా గడుపుతున్నాను, మళ్లీ జన్మంటూ వుంటే భారతీయుడిగా హిందువుగా పుట్టాలని వుంది….పోప్‌, పోప్‌ వ్యాఖ్యల్ని సమర్ధించిన బ్రిటన్‌ ప్రధాని, తాను కూడా అదే కోరుకుంటున్నానని వెల్లడి ‘

దీనికి సంబంధించిన ఆధారాల న్యూస్‌ లింక్‌ తెలియచేయమని,లేనట్లయితే పోస్టు పెట్టిన వారిని హైదరాబాద్‌ ఎర్రగడ్డ లేదా విశాఖ ఆసుపత్రులలో చికిత్సకోసం చేర్చాల్సి వుంటుందని వ్యాఖ్యానించాను. దానికి సదరు వ్యక్తి ఇంక వేరే చోట్ల పిచ్చాసుపత్రులు లేవా, నేను ఈ పోస్టు పెట్టటానికి కారణం నేను ఏ మతానికీ మద్దతు ఇవ్వటం లేదు అని చెప్పటానికే అని ప్రత్యుత్తర మిచ్చారు. పిచ్చి ముదిరి రోకలిని తలకు చుట్టమన్నాడట వెనకటి కెవడో . ప్రశ్నకు సమాధానానికి ఏమైనా పొంతన వుందా ? ఫేస్‌బుక్‌, వాట్సప్‌ సామాజిక మాధ్యమం ఏదైనా కానివ్వండి ఎలాంటి ఆధారాలు, హేతువు లేకుండా సమాచారం పేరుతో ఏదిబడితే దానిని పోస్టు చేస్తున్నారు.చాకుతో నోటిని తీపి చేసే మామిడి కాయలు కోసుకోవచ్చు,జీవితాలను అంతం చేసే మెడకాయలనూ వుత్తరించవచ్చు. సామాజిక మీడియాను కూడా ఇలాగే దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం పతాకశీర్షికను చూసి లైక్‌ లేదా షేర్‌ చేయటం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.

నేను ఏ మతానికీ మద్దతు ఇవ్వటం లేదని చెప్పటానికి ఈ పోస్టు అన్న సమాధానం తప్పించుకోవటానికి ఆపద్ధర్మంగా ఏదో ఒకటి చెప్పటం తప్ప దానిలో నిజాయితీ లేదు.ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారంలో పెట్టేది మతోన్మాదులు తప్ప మరొకరు కాదు. అది మెజారిటీ లేదా మైనారిటీ ఎవరైనా కావచ్చు. పోప్‌, బ్రిటన్‌ ప్రధాని వంటి పెద్దల పేరుతో ఇలాంటి ఆధారం లేని అభూత కల్పనలు ఆపాదించి చౌకబారు ప్రచారాలు చేస్తున్నారు. మతం,కులం, ప్రాంతం వంటి కొన్ని అంశాలు వుద్రిక్తతలను రెచ్చగొట్టటానికి జనం మెదళ్లను కలుషితం చేయటానికి గాను పని గట్టుకొని ప్రచారం చేయటానికి మతశక్తులు పెద్ద యంత్రాంగాలనే నిర్వహిస్తున్నారు. వాటిని గమనించలేకపోతే సామాజిక మీడియాలో తమపేరు పదే పదే చూసుకోవాలి లేదా కనిపించాలని కోరుకొనే వారు పోప్‌ వ్యాఖ్యల వంటి అవాస్తవాన్ని బాధ్యతా రహితంగా లేదా తమకు తెలియకుండానే మండుతున్న మంటకు ఒక చితిని చేర్చటం తప్ప మరొకటి కాదు. దీనివలన ప్రజలకు ఒక ఆయుధంగా వున్న ఈ మీడియాకు ఇప్పటికే విస్వసనీయత తగ్గిపోయింది. ఫేస్‌బుక్‌ అంటే గర్ల్‌ఫ్రెండ్స్‌తో పిచ్చాపాటీ, పోసుకోలు కబుర్ల వేదికగా మారిందనేది అనేక మంది అభిప్రాయం, అలాంటివారందరూ క్రమంగా తమ ఖాతాలను మూసివేస్తున్నారు.ఎదుటివారి మీద బురదచల్లేందుకు , తప్పుడు సమాచారాన్ని ప్రచారంలో పెట్టాలనుకొనే ప్రమాదకర శక్తులు దీనిని వుపయోగించుకొనేందుకు ఎక్కువగా ముందుకు వస్తున్నాయి. అందువలన ఆధారంలేని పోస్టులు పెట్టి ప్రజల ఆయుధాన్ని పనికిరాకుండా చేయ వద్దని , బాధ్యతా యుతంగా వుండాలని మనవి.

పోప్‌కు ఆపాదించిన వ్యాఖ్యల విషయానికి వస్తే హిందూయిజం లేదా హిందూ మతాన్ని దుర్వినియోగం చేస్తున్న శక్తులు కేంద్రంలో అధికారంలో తిష్టవేశాయి. హిందూమతం పేరుతో వేల సంవత్సరాలుగా వునికిలోకి తెచ్చిన ఆచారాలు, నియమాలు, నిబంధనలన్నీ వర్తమాన కాలానికి తిరోగమనం తప్ప పురోగమనం కాదు. మన సమాజానికి అవి చేసిన హాని అంతా ఇంతా కాదు.అన్నీ వేదాల్లోనే వున్నాయష అంటూ కొత్త విషయాలకు దూరం చేశారు. అది ఘనీభవింపచేసిన కుల వ్యవస్ధ కర్ణుడు, ఏకలవ్యుల వంటి ఎందరో ప్రతిభావంతులను తెరమరుగు చేసింది. సమాజంలో శాస్త్రీయ ఆలోచనను మొద్దుబారచేసింది. పర్యవసానంగా పారిశ్రామిక విప్లవానికి దరిదాపుల్లో కూడా మన సమాజం లేకపోయింది.కులాల నిచ్చెన మెట్లతో అగ్ర, అధమ కులాలంటూ తోటి మానవులను పశువులకంటే హీనంగా ఇప్పటికీ చూస్తున్న ఈ దేశంలో నిజంగా పోప్‌ వంటి వారు పుట్టాలనుకుంటే ఆయన ఏ కులాన్ని కోరుకుంటారు? ఆవును వధిస్తే అంతం చూస్తాం అని వూగిపోతున్న అగ్రకులాల వారు అది ముసలిదయ్యో, జబ్బుచేసో చస్తే దాన్ని తీసి గోతిలో పాతిపెట్టటానికి మాత్రం ముందుకు రారు. తరతరాలుగా ఆ పనిచేస్తున్న దళితులు, గిరిజనులు ఎక్కడైనా మేం అలాంటి పని చెయ్యం అని నిరాకరిస్తే చచ్చిన ఆవు కోసం కూడా దాడులు చేసే అగ్రకులాల్లోనా వారి దాడులకు, అత్యాచారాలకు నిత్యం బలౌతున్న దళితుల, గిరిజనుల కడుపులోనా ? అటు దరి చేరనివ్వని అగ్రకులాలతో చెట్టపట్టాలు వేసుకోలేక ఇటు అనేక అంశాలలో తమకు దగ్గరగా వుండే దళితులు, గిరిజనులతో మమేకం కాలేక అటూ ఇటూ గాకుండా వుండే బీసీల్లోనా ? ఎక్కడ పుట్టాలనుకుంటున్నారో కూడా చెబితే సంతోషం. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్నట్లుగా వివేకానందుడి పేరును వుపయోగిస్తూ ఆచరణలో ఆయన స్ఫూర్తికి, ఆచరణకు పూర్తి భిన్నంగా వ్యవహరించే నేటి కుహనా హిందూత్వ నాయకుల మాటలు, చేష్టలను విన్న కన్నవారెవరూ భారత దరిదాపులకే రారు, అలాంటిది తిరోగమన హిందువుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ?

ఇక్కడ మరొక విషయాన్ని చెప్పుకోకపోతే అపార్ధం చేసుకొనే అవకాశం వుంది. మతాల చరిత్రను పరిశోధిస్తే,, పరిశీలిస్తే రోసిపోయిన ప్రతి మతంపై తిరుగుబాటుగానే కొత్త మతాలు వచ్చాయి. హిందూమతాన్ని వ్యతిరేకించి బౌద్ధం, క్రైస్తవాన్ని వ్యతిరేకించి ఇస్లాం పుట్టుకు వచ్చిన విషయం దాస్తే దాగదు. ప్రతి తిరుగుబాటు మతం ప్రారంభంలో పూర్వం వున్నదానికంటే అభ్యుదయంగానే వున్నకారణంగానే జనాలు ఆదరించారు.కొన్నాళ్లకు అవి కూడా పాత మతాల మాదిరే తిరోగమన స్వభావాన్ని సంతరింపచేసుకున్నాయి. జనానికి మత్తుమందు మాదిరి తయారై పురోగతికి ఆటంకంగా మారుతున్నాయి.

నాకు ఏసుక్రీస్తు మీద నమ్మకం లేదు, కేవలం ఈ సుఖానికి బానిసలా గడుపుతున్నానని పోప్‌ చెప్పినట్లుగా కూడా పైన పేర్కొన్న పోస్టులో పెట్టారు. పోప్‌ అలా మాట్లాడినట్లు ఆధారం లేదు కనుక దాన్ని పక్కన పెడదాం. ఈ రోజు అది హిందు, క్రైస్తవం, ఇస్లాం, బౌద్దం ఏమతాధికారి అయినా ఆ మతాలు చెప్పినట్లు చిత్తశుద్దితో సాదా సీదాగా గడుపుతున్న పెద్దను ఒక్కరినైనా ఎవరైనా చూపగలరా ? ప్రతి మత లేదా మతం పేరుతో జనం ముందుకు వచ్చే బాబా, స్వామీజీ, ఫాదర్‌లు, ముల్లా పేరు ఏదైతేనేం ఒక్కొక్కరు ఒక్కొక్కొ కుంభకోణానికో మరొక అక్రమానికో కేంద్రంగా మారుతున్నారా లేదా ? అందువలన దయచేసి ఇప్పటికే మన దేశం మతోన్మాద చిచ్చుతో మగ్గిపోతోంది. దానికి మరింత ఆజ్యం పోసే, రెచ్చగొట్టే పోస్టులు పెట్టి లేదా వాటిని అభిమానించి, పంచుకొని (లైక్‌లు, షేర్‌లు) ఆ చిచ్చును పెంచవద్దని మనవి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

IT IS POLITICAL STONE THAT VHP IS TAKING TO AYODHYA: HINDU MAHASABHA

22 Tuesday Dec 2015

Posted by raomk in Communalism, Current Affairs, NATIONAL NEWS, Others, RELIGION

≈ Leave a comment

Tags

AYODHYA, HINDU MAHASABHA, POLITICAL STONE, VHP

New Delhi, 22 Dec 2015: Two days after media reports about first lot of stones having reached Ayodhya allegedly for construction of Ram Temple, Hindu Mahasabha has come out opposing the move and termed it as ‘political stone’ that Vishwa Hindu Parishad is taking there.

Addressing a press conference in Delhi on Tuesday, Swami Chakrapani, National President, Akhil Bharat Hindu Mahasabha, said: “It is political stone that (they are taking to Ayodhya). I want to tell VHP, Sangh Parivar and BJP to stop searching for political stone.”

Swami Chakrapani said he believes in law and wants Ram Temple under the law not through communal politics.

“Even before the verdict (of Allahabad High Court) came, I had said in 2010 that I can never support construction of a temple on dead bodies. I demanded fast-track court for the (Babri Masjid-Ram Janmabhoomi) case so that judgment can come fast. Leave aside the stone and bricks of Vishwa Hindu Parishad. It is their internal politics. If verdict comes in our favour today we will construct the temple with gold, leave aside stone. But that should be done under the law” he said.

“Leave aside the issue of stone (being sent to Ayodhya). It is political stone that (they are taking to Ayodhya). I want to tell VHP, Sangh Parivar and BJP to stop searching for political stone.”

Swami Chakrapani also condemned the alleged blasphemous remarks of a person called Kamlesh Tiwari.

“I was saddened with remarks of Kamlesh Tiwari about Prophet Muhammad. I felt sad as much as I was when Aamir Khan disrespected gods and goddesses in PK film. We opposed him and asked our office to find about his details. We found he was removed from our organisation in 2008. If he were with it today, I would have removed him. He does not deserve to be called Hindu. Similarly if a Muslim disrespects other’s religion cannot be Muslim,” said Swami.

Sharing the dais with leaders from Muslim, Sikh and Christian communities including Maulana Tauqeer Raza Khan, Swami Chakrapani demanded a strong anti-blasphemy law in the country.

“There is a need for religious communities – Hindus, Muslims, Christians, Sikhs – to take a vow that they would not allow anyone to hurt other’s religion. We demand strong anti-blasphemy law and such people should be strongly punished.”

“Such people are of no worth. They make such statement for which they can’t get respect even in their family, leave aside the society. It becomes an issue between Hindus and Muslims and the man becomes hero. We should not allow this thing to happen. It is the duty of us religious leaders to join hands and stop such people,” he said.

No indication from PM on Ram temple: VHP

The Vishwa Hindu Parishad (VHP) has said that there was no indication from Prime Minister Narendra Modi on the construction of Ram temple in Ayodhya.

In a statement on Monday, VHP general secretary Champat Rai said: “VHP is of the view that Ram Mandir at Ayodhya should be built through an act of parliament. VHP has always respected the court and have faith in it.”

“Time has come for the construction of Ram Mandir in Ayodhya. Lot of stones arrived. And now the arrival of stones will continue. We have signals from Modi government that the construction of temple would be done now,” media reports had quoted Mahant Nritya Gopal Das, president of Ram Mandir Nyas, as saying.

“Reports published in media are false. Arrival of stones is a common practice and since 1990, thousands of trucks full of stones have arrived and kept at Ramghat Karyashala after fretwork (nakkashi),” Rai said.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d