• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RELIGION

అయితే ఏమిటట !

20 Wednesday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

ABVP, BJP, Central University of Hyderabad, Dalit, Vemula Rohit

ఎం కోటేశ్వరరావు

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ దళితుడు కాదు బిసి: ఎబివిపి

అయితే ఏమిటట !

     వారు చెబుతున్నదాని ప్రకారం దళితుడు కాదు, వెనుకబడిన తరగతికి చెందిన యువకుడు. కావచ్చు, కాకపోవచ్చు, లేదు బిసి కాకపోతే ఓసి, ఓసీలోకూడా హిందూత్వను వ్యతిరేకించే గట్టి కార్యకర్త అనుకోండి…. అంతమాత్రాన అందుకు కారకులుగా విమర్శలను ఎదుర్కొంటున్నవారిని నిలదీయ కూడదా ? ఎంతో భవిష్యత్‌ వున్న ఒక విద్యార్ధిని ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్ధితుల గురించి ప్రశ్నించకూడదా ? నేరగాళ్లను వదలి వేయాలా? శిక్షించాలా ? ఎబివిపి వారికి వచ్చిన సమస్య ఏమిటి ?

దొరల పాలనా భావజాలం నుంచి బయటకురాని రాజకీయ నేతలే బీసి బంధువైన దత్తాత్రేయపై కుతంత్రాలకు పాల్పడుతున్నారు : బిజెపి ఓబిసి మోర్చా

అయితే ఏమిటట !

     ఒక విమర్శ రాగానే మోర్చావారికి మూర్ఛ రావాలా ? మోర్చా, ఎబివిపి రెండూ సంఘపరివార్‌ సంస్ధలే ఒకే నోటితో, అదీ నరం వున్న నాలుక నోటితో కదా మాట్లాడాల్సింది. విశ్వవిద్యాలయానికి దత్తాత్రేయ వుత్తరాల మీద వుత్తరాలు రాసి తోటి మంత్రి స్మృతి ఇరానీతో రాయించి ప్రతిభావంతుడైన ఒక బీసి విద్యార్ధి జీవితంతో అడుకుంటే అయన బీసి బంధువా ? బలి తీసుకొనే వ్యక్తా ? ఎన్ని నోళ్లు వున్నాయి ? వున్న నోటికి నరం వుందా ?

     ఇక్కడ వీరి బాధ రోహిత్‌ ఎవరన్నది కాదు, దేశానికి విషంగా మారిన కాషాయ హిందూత్వ, ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను గట్టిగా వ్యతిరేకించటమే అసలు సమస్య. దీర్ఘకాలం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార్‌క్‌గా వున్న దత్తాత్రేయ, వారి బాటలో నడుస్తున్న మరో మంత్రి స్మృతి ఇరానీ, విద్యార్ధులు చెబుతున్నదాని ప్రకారం దళితులు, బిసిల పొడగిట్టని విసి పొదిలి అప్పారావు అత్యుత్సాహం మ్తొత్తంగా హిందూత్వ వున్మాదం, దానికి లొంగిపోవటమే రోహిత్‌ను బలి తీసుకున్నాయన్నది స్పష్టం.

ముంబై పేలుళ్ల వుగ్రవాది యాకుబ్‌ మెమెన్‌ను వురితీస్తే దాన్ని ఖండిస్తూ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో రోహిత్‌ పాల్గొన్నాడు: సోషల్‌ మీడియా, కాషాయ మీడియా సేవకులు

అయితే ఏమిటట !

     శవాల కోసం గగన విహారం చేయటమే రాబందుల పని, ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలి పోతాయి. ఎక్కడ సంఘపరివార్‌ సంస్ధలు, వ్యక్తులకు ఇబ్బంది వస్తుందా అని అక్కడ వాలి పోదామా అని రాబందుల మాదిరి హిందూత్వ ప్రచార సేవకులు వెంటనే సామాజిక మీడియాలో తమ పనిలోకి దిగి పోతారు. మెమెన్‌ వంటి ఒక జాతి వ్యతిరేక శక్తి మరణిస్తే అంతగా స్పందించిన రోహిత్‌ ఆత్మహత్య చేసుకుంటే ఇంతగా స్పందించాలా అన్నట్లు వ్యంగ్యోక్తులతో ప్రచారానికి దిగారు.

     వుగ్రవాదులు విదేశాలలో కుట్ర చేసి దాడులకు పాల్పడ్డారా, స్వదేశంలోనే కుట్రలు చేశారా అన్నది సమస్య కాదు. ఎక్కడ చేసినా కుట్ర కుట్రే ఖండించాల్సిందే, శిక్షించాల్సిందే. ఎవరూ సమర్ధించరు. అనేక మంది హిందూ వుగ్రవాదులు జైళ్లలో వున్నారా లేదా ? స్వామి అసిమానంద ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. అజ్మీర్‌ షరీఫ్‌, మక్కామసీదు, మాలెగావ్‌, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ బాంబు పేలుళ్ల కేసులో ముద్దాయా కాదా ? తన నేరాలను మెజిస్ట్రేట్‌ ముందు అంగీకరించాడా లేదా ? దర్యాప్తు సంస్ధలు తనపై వత్తిడి తెచ్చాని బుకాయించాడు. అందులో ఆశ్చర్యం లేదు.అలా బుకాయించిన తరువాత కారవాన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వుగ్రదాడులకు ఆర్‌ఎసెస్‌ ప్రధాన కార్యదర్శి మోహన్‌ భగవత్‌ అంగీకరించాడని చెప్పాడు. తరువాత తానలా అనలేదన్నాడు. అయితే కారవాన్‌ పత్రిక ఆడియో టేపులను విడుదల చేసి అసిమానంద్‌ నిజస్వరూపాన్ని బయట పెట్టింది.యూకూబ్‌ మెమెన్‌ తనంతట తానుగా లొంగిపోయాడన్నది అందరికీ తెలిసిన నిజం. పేలుళ్ల కుట్రకు సంబంóంచి అనేక విషయాలు వెల్లడించాడు. వాటితో తనకు ఎలా సంబంధం లేదో చెప్పటానికే లొంగిపోయాడన్నది ఒక కధనం. దీన్ని కొంత మంది నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. యూకూబ్‌ మెమెన్‌ వురితీయాల్సిన వ్యక్తి కాదని స్వయంగా కేంద్ర ప్రభుత్వ కాబినెట్‌ సెక్రటేరియట్‌లో అదనపు కార్యదర్శిగానూ, పరిశోధన మరియు విశ్లేషణ( రా) పాకిస్థాన్‌ విభాగానికి అధిపతిగా పనిచేసిన బి రామన్‌ ఒక వ్యాసంలో రాశారు. ఇదేమీ రహస్యం కాదు. అలా రాసినంత మాత్రాన ఆయన దేశవ్యతిరేక శక్తా ? వురి శిక్షలను మొత్తంగా వ్యతిరేకించే సిపిఎం మెమెన్‌ వురిని వ్యతిరేకించింది. యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరింది. ఇతర అనేక మంది ఈ అభిప్రాయాన్ని కలిగి వున్నారు. కేంద్రీయ విశ్వ విద్యాలయంలోని కొందరు విద్యార్ధులు కూడా ఆ కారణంగానే సంతాపసభకు హాజరై వుండవచ్చు, వారిలో రోహిత్‌ ఒకరు కావచ్చు. తప్పేముంది ? ముంబైలో వేలాది మంది మెమెన్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత మాత్రాన వారంతా జాతి వ్యతిరేక శక్తులా ?

     జాతిపిత మహాత్మా గాంధీని చంపిన ఆర్‌ఎస్‌ఎస్‌ గాడ్సేకు గుడి కట్టేందుకు, వాడి వర్ధంతి,జయంతులను పాటింటే వారు, వారికి మద్దతు పలికే హిందూత్వ శక్తులు దేశ భక్తులుగా చలా మణి అవుతుండగా వాటి గురించి ఏమిటని ఏ చర్యలు తీసుకున్నారని లేఖలు రాయటంలో సిద్ధ హస్తుడైన దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు లేఖలు రాయటం లేదు? అంతెందుకు మజీతియా వేజ్‌ బోర్టు సిఫార్సులను మీడియా సంస్ధలు అమలు జరపటం లేదన్నది బహిరంగ రహస్యం. జర్నలిస్టులు స్వయంగా అయనకు చాలాసార్లు మౌఖికంగా చెప్పారు, రాతపూర్వకంగా ఇచ్చారు, ఆ సిఫార్సులను అమలు జరిపేందుకు కేంద్ర కార్మికశాఖా మంత్రిగా రాష్ట్రాలకు లేఖలు రాయాల్సిన బాధ్యత ఆయనదే . ఎన్ని రాష్ట్రాలకు,ఎన్నిసార్లు రాశారు?్ల సమాధానం రాకపోతే గుర్తు చేస్తూ మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు లేఖలు రాశారో చెప్పగలరా ? పత్రికలకు వివరాలు విడుదల చేయగలరా ? ఒక ఎంపీ, కేంద్ర మంత్రి దేశంలో ఏం జరిగినా పట్టించుకోవాలి కదా ?

హిందుత్వను, కాషాయాన్ని తానెంతగా వ్యతిరేకిస్తున్నాడో రోహిత్‌ చెప్పే వీడియోను కమలం గ్రూపు పేరుతో వున్నవారు సామాజిక మీడియాలో తిప్పుతున్నారు. అతని నిజస్వరూపం ఇది, అందుకు సాక్ష్యం అది అంటున్నారు.

అయితే ఏమిటట !

     వీడియోలో రోహిత్‌ చెప్పినదానిలో దానిలో తప్పేముంది? హిందువుగా జీవించు, హిందువునని గర్వించు అని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పటం లేదా దాన్ని గోడల నిండా చెడరాయటం లేదా ? ఆవును చంపిన వారిని కొట్టి చంపమని వేదాలు చెప్పాయని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్యలో వినయకృష్ణ చతుర్వేది రాయలేదా. రోహిత్‌ అంతకంటే దారుణంగా ఏమీ చెప్పలేదే. హిందూత్వ, దానికి విద్యార్ధులలో ప్రతినిధులుగా వున్న ఎబివిపి కనపడితే ఎదిరించమని తన సంస్ధ చెప్పిందన్నాడు .దళితులకు ఇంకేం నేర్పించిందంటే హిందూత్వగానీ, హిందువులుగానీ హిందూ పేరు చెప్పుకొని మైనారిటీలపైకి వచ్చే వాళ్లనిగానీ, దళితుల గురించి గానీ మాట్లాడే వారుగానీ కనపడితే ఎదిరించమని చెప్పింది అని చెప్పాడు. అంతే తప్ప కొట్టమనో, చంపమనో చెప్పింది అనలేదుగా !

     ఇక్కడ దళితుల గురించి మాట్లాడటం అంటే వారి కులం పేరు చెప్పి తిట్టటం, వర్ణవ్యవస్ధ పేరుతో ఎక్కడుండాల్సినోళ్లు అ్కడుండాలని అంటరానితనం పాటించటం వంటి హిందూయిజం కనపడితే ఎదిరించటమని అంబేద్కర్‌ ఎప్పుడో చెప్పాడు. . ఎబివిపి హిందుత్వ గురించి చెప్పినట్లుగానే అదే అంబేద్కర్‌ విద్యార్ధి సంఘమూ చెబుతోంది.తరతరాలుగా మానవత్వానికే మచ్చ తెచ్చిన హిందూత్వ గురించి ఘనంగా చెప్పుకుంటున్నవారు వుండగా లేనిది అందుకు తరతరాలుగా బలై అవమానాలు పొందిన వారు దానిని ఎదిరించమని చెప్పటం ఎలా తప్పవుతుంది. దోపిడీ వ్యవస్ధను కూల్చివేయమని కమ్యూనిస్టులు బహిరంగంగా చెప్పటం లేదా? ప్రత్యర్ధి పార్టీని ఓడించటమని పిలుపివ్వని, కార్యకర్తలకు చెప్పని పార్టీ ఏదో చెప్పమనండి.

     గుజరాత్‌ మారణకాండ సందర్బంగా మూడు రోజుల పాటు ఏం చేయదలచుకుంటే అది చేయండని 2002లో ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోడీ చెప్పారని నాడు భజరంగ దళ్‌ జాతీయ సమన్వయ కర్తగా వున్న హరేష్‌ భట్‌ చెప్పిన అంశాలు కూడా వీడియోలో వచ్చాయి. అంబేద్కర్‌ సంఘం లేదా సంఘపరివార్‌ను వ్యతిరేకించే వామపక్షాలు, ఇతర సంస్ధలు అలా చెప్పినట్లు వీడియోలు లేవే . సామాజిక మీడియాలో రోహిత్‌ వీడియోను తిప్పుతున్నవారు గుజరాత్‌ వీడియోను ఎందుకు చేయరు? అలాంటి వీడియోలను చూసిన తరువాత ఎవరైనా కాషాయ ముసుగులో జరిపే దారుణాలను వ్యతిరేకించనందుకు, అసహ్యించుకోనందుకు సిగ్గుపడాలి. వీడియో కనుక నిజమైనదైతే బ్యానర్లను చించి వుండవచ్చు, ప్రాణాలను తీయలేదే, గుజరాత్‌ మాదిరి మారణకాండకు రోహిత్‌ పాల్పడలేదే, ప్రోత్సహించలేదే ! వేలాది మంది ప్రాణాలు తీసిన గుజరాత్‌ మారణకాండలో ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరికీ వురి శిక్ష పడలేదేం ? శిక్షలు పడిన వారికి ఇంటి కంటే జైలు పదిలం అన్నట్లు సకల సౌకర్యాలు కల్పించటం సోషల్‌ మీడియాలోని కొంత మందికి కనిపించటం లేదా ? వారి బాధ ఏమిటి ?

విద్యార్ధులపై చర్యకు వత్తిడి చేయలేదు:బిజెపి నేతలు

    అరచేతిని చూసుకొనేందుకు అద్దం కావాలా? వరుసగా తెరిపి లేకుండా రాసిన లేఖల తేదీలు చూస్తే వత్తిడి చేసిందీ లేనిదీ తేటతెల్లమైంది. నిజంగా ఒక ఎంపీ, ఒక మంత్రి లేఖ రాస్తే ఒక చిన్న విషయం మీద ప్రభుత్వ శాఖలు అంతగా వెంటపడటం ఆశ్చర్యమే. ఎన్నికలలో లోక్‌పాల్‌, నల్లధనం వెలికితీత గురించి తాను లేఖ రాస్తే కనీసం ప్రధాని కార్యాలయం స్పందించి తిరుగు జవాబు కూడా రాయలేదని 18 నెలల తరువాత అన్నా హజారే అంతటి పెద్ద మనిషి వాపోయిన విషయం తెలియదా ? అగస్టు నుంచి లేఖల మీద లేఖలు రెండు మంత్రిత్వశాఖలు రాయటం వత్తిడి కాదా ? వైస్‌ ఛాన్సలర్‌ కొత్తగా వచ్చి విద్యార్ధుల బహిష్కరణ మీద చూపిన శ్రద్ధ, ఆసక్తి అంతకు ముందు విశ్వవిద్యాలయంలో కమిటీలు చేసిన సిపార్సులపై లేదెందుకు?

Share this:

  • Tweet
  • More
Like Loading...

HU VC Responsible for Student’s suicide, book him:CPI(M)

19 Tuesday Jan 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

ABVP, Central University of Hyderabad, CPI(M), RSS, Vemula Rohit, Vice Chancellor

The Polit Bureau of the Communist Party of India (Marxist) has issued the
following statement:

The Polit Bureau of the CPI(M) expresses its deep anguish at the suicide of
a dalit student, Vemula Rohit, in the Central University of Hyderabad.

The four dalit students were on indefinite hunger strike protesting against
the newly-appointed Vice Chancellor’s decision to rusticate them from the
hostels of the University.

Following an alleged altercation between the RSS student wing – ABVP – and
the Ambedkar Students Union, an enquiry was conducted by the University and
the incident appeared to have been settled.

The newly-appointed Vice Chancellor, allegedly, under pressure from the
Minister of the Union Cabinet belonging to Hyderabad and the consequent
direction by the Human Resources Development Ministry, had taken this action
of suspension from the hostels.  The hunger strike was a protest against
this action by the Vice Chancellor.

Under these circumstances, the Polit Bureau of the CPI(M) condemns the Vice
Chancellor’s motivated decision that led to this suicide  and demands that
the Vice Chancellor be booked under the SC Prevention of Atrocities Act
immediately.

The Central government must conduct a thorough enquiry into this incident in
this prestigious Central University that was established by law by the
Parliament of India.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Rohith Vemula wanted to reach for the stars, but his bid to break barriers killed him

19 Tuesday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Readers News Service, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, Ambedkar Students Association (ASA), Apoorvanand, BJP, Dalit, Rohith Vemula, Social Justice, University of Hyderabad (UoH)

Why we all bear responsibility for the young Dalit scholar’s death.
Apoorvanand
Rohith Vemula wanted to reach for the stars, but his bid to break barriers killed him

“I forgot to write the formalities. No one is responsible for my this act of killing myself. No one has instigated me, whether by their acts or by their words to this act. This is my decision and I am the only one responsible for this. Do not trouble my friends and enemies on this after I am gone.”

This is the conclusion of the letter that Rohith Vemula composed before ending his life on Sunday. As anyone who has followed the case has now gathered, Vemula was one of five Dalit students suspended by the University of Hyderabad in August after an alleged altercation with a member of the Bharatiya Janata Party’s student wing, the Akhil Bhartiya Vidyarthi Parishad. Matters escalated after the BJP’s Union minister of labour and employment Bandaru Dattatreya sent a letter to the ministry of human resources, indicating his personal interest in the case.

In the cold hands of lawyers, Vemula’s suicide note could be used to shield the officials of the University of Hyderabad, the ABVP and Dattatreya against charges of aiding and abetting the scholar’s suicide. It could be used with pride by nationalist leaders as evidence of the tolerance of India’s Dalits, who do not blame others for their suffering even if it results in their deaths.

But the young man’s magnanimity in his hour of his death should not shield us from the bitter truth: Rohith Vemula died because of our cowardice. The cowardice of our fellow academics, the administrators at the university, who bowed down to the powers-that-be and ordered Vemula and his companions to be expelled from the hostel and barred from entering the library and common areas of the campus. Though a committee established by the university found no substance in the charge that Vemula and his friends had attacked and injured a member of the ABVP, the authorities decided to overturn the report and expel these five members of the the Ambedkar Students’ Association.

What he doesn’t say

In his note, Vemula chose not to chronicle the events that led him to make his decision to kill himself. He does not say that his group had protested against the hanging of Mumbai blast convict Yakub Memon last year and organised the screening of Muzaffarnagar Baki Hai, a documentary film on the communal violence of Uttar Pradesh. He didn’t mention that these acts had invited the wrath of the ABVP and prompted Dattatreya to write a personal letter to the Union Minister of Human Resource Development Smriti Irani, asking for action against these “anti-national elements”. He does not say that he had been sleeping in the open for the last two weeks.

Instead, he writes: “I am not hurt at this moment. I am not sad. I am just empty. Unconcerned about myself. That’s pathetic. And that’s why I am doing this.” He fails to mention that he felt miserable in a world he wanted to understand but where he found no urgency for things he was desperate to make sense of: love, pain, life and death. He despairs of a world where “the value of a man was reduced to his immediate identity and nearest possibility. To a vote. To a number. To a thing. Never was a man treated as a mind.”

Vemula wanted human beings to be treated as minds, “as glorious things made up of star dust, in every field, in studies, in streets, in life and in death”.

Forging new ties

Vemula aspired to be a science writer and to be a person of the universe of words. He refused to be pinned down to this immediate identity. He did not want to die a Dalit. He wanted to break free of it, to transcend to limitlessness, to travel to stars. Yet, it’s clear that he died precisely because of this striving to cross these limits. As a member of the Ambedkar Students’ Association he had challenged the nationalist consensus and stood by India’s marginal Muslims. This was the final act of his short life: to forge solidarities of new kinds. But the world failed to keep pace with him and he paid for it with his life.

The drama that has played out these past few weeks at the University of Hyderabad is a familiar one. Elements of it are playing out at other campuses across the country. India’s universities no longer offer nesting places for young dreamers like Vemula. They are now populated be self-serving people more interested perpetuating their privileges, who have completely forgotten their duty, which is to give courage to the young to break free of all the confines, to act wild, to stand by them even when society finds them dangerous.

There has been lot of noise about a new aspirational class which is impatient with the politics of the day. Was Vemula not an aspiring young mind? Why then did he have to feel lonely and empty?

( First published by  SCROLL on 18 Januray,2016)

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిందూయిజంపై విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి ?

18 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

criticism against Hinduism, Hinduism, RSS

ఒక యజమాని తన ఫ్యాక్టరీలో ఏ రోజు ఎంత వుత్పత్తి చేయాలో, ఏ వుత్పత్తిని పెంచాలో తగ్గించాలో ఆదేశించినట్లుగా హిందూ మహిళలు ఎంత మందిని పిల్లలన్ని కనాలో చెబుతున్న సంఘపరివార్‌ యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినులు భోగులుగా మారి పదుగురికి ఆదర్శంగా తాము చెప్పిన సంఖ్యలో ఎందుకు పిల్లల్ని కనటం లేదు?

ఎం కోటేశ్వరరావు

      హిందూయిజాన్ని చులకనగా చూస్తున్నారని అనేక మంది వుద్రేకపడిపోతున్నారు. అంతకు ముందు లేని ఆసక్తిని కొందరు ప్రదర్శిస్తున్నారు. అలాగే ఇతర మైనారిటీ మతస్థులలో కూడా దానికి ప్రతి ధోరణి మొదలైంది. ఎవరికి వారు తమ మతచిహ్నాలను ప్రదర్శించుకోవటం ఎక్కువైంది. ఇతర విషయాలలో సమానత్వం, తోటి మనిషిగా చూడకపోయినా పేరు వరకు సమానత్వాన్ని పాటిస్తూ పేరు చివర కులాన్ని సూచించే తోకలను ఆడపిల్లలకూ తగిలించటం పెరిగి పోయింది (ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు పెరిగి పోతున్న కారణంగా ఇతర కులాల వారు ప్రేమించటం, తలిదండ్రులు అంగీకరించకపోవటం గొడవలు ఎందుకని ముందే ఆడపిల్లకు పేరు తగిలిస్తే ఇతర కులాల వారు వారివైపు చూడరని, ఎవరైనా చూసినా తోటి కులం లేదా తత్సమాన కులం వారే పూనుకుంటారనే వుద్ధేశ్యంతో ఇలా పెడుతున్నట్లు ఒక తల్లి వివరణ ఇచ్చింది). ఇది ప్రతి మారు మూల పల్లెలో కూడా కనిపిస్తోంది. ఏ తరానికి ఆ తరంలో తమ పబ్బం గడుపుకొనేందుకు ఆరోగ్యకర రాజకీయాలను వెనుకపట్టు పట్టించి కుల, మత రాజకీయాలను చొప్పించి తమ పబ్బం గడుపుకోవాలనే పాలకవర్గ శక్తుల ఎత్తుగడలు ఫలించిన పర్యవసానమే ఇది. సమాజంలో అస్థిత్వ ధోరణులు పెరగటం కూడా దీనికి తోడైంది.

      ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సి వుంది? ఇతర మతాల మాదిరి హిందూ మతాన్ని ఏ ఒక్కరో స్ధాపించలేదు లేదా ప్రబోధించలేదు. బైబిల్‌,ఖురాన్‌ మాదిరి ఈ మతానికి ఒక ప్రామాణిక గ్రంధం లేదు. అందువలన వేల సంవత్సరాల కాలంలో ఎవరికి అవసరమైన మేరకు వారు కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి నట్లు , ఎలాగంటే గతేడాది జరిగిన గోదావరి పుష్కరాలకు వెళ్లేవారు తలా కాస్త మట్టి తీసుకువెళ్లి స్నానఘట్టాల దగ్గర వేయాలని ఒక పెద్దమనిషి ప్రబోధించినట్లుగా అనేక అంశాలను జొప్పించారు. చొప్పిస్తున్నారు. వేదాలలో కానరాని చాతుర్వర్ణ వ్యవస్ధ, మను ధర్మ శాస్త్రం, మహిళల పట్ల వివక్ష వంటి తిరోగమన అంశాలన్నీ మధ్యలో చొప్పించినవే అనే ఒక బలమైన అభిప్రాయం వుంది. ఒక జీవన విధానంగా హిందూయిజమంటే అందరూ కలసి మెలసి జీవించటం. కానీ జరుగుతోంది అందుకు విరుద్ధం. హిందూత్వ వాదులుగా, హిందూయిజాన్ని పరిరక్షించే వారిగా ఫోజు పెడుతూ ఇప్పుడు రంగంలో వున్న శక్తులు, వ్యక్తులు నిజానికి కుహనా హిందువులు, నిజమైన వారు కాదు. దాయిష్‌(ఐఎస్‌) వుగ్రవాదులు, తాలిబాన్లు నిజమైన ముస్లింలు ఎలా కాదో వీరు కూడా అదే కోవకు చెందినవారు.

     కొంత మంది చెబుతున్నట్లుగా హిందూయిజాన్ని ఎక్కువగా విమర్శిస్తున్నారనే వాదనలో కొంత వాస్తవం కూడా లేకపోలేదు.కుహనా హిందుత్వ వాదులపై ఇంకా తగినంత లేదనేదే ఆందోళన కలిగించే అంశం.అసలు ఈ విమర్శ, ప్రతి విమర్శలకు కారణం ఏమిటి? ఎవరు దీనికి ఆద్యులు ? ఓటు బ్యాంకు రాజకీయాలు. స్ధిరమైన ఓటు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు కాంగ్రెస్‌, ఇతర కుహనా లౌకక పార్టీలు మైనారిటీలను బుజ్జగించేందుకు పూనుకున్నాయని పాడిందే పాడరా అన్నట్లు పాడుతోంది, ప్రచారం ప్రారంభించింది ఎవరు? ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం కింద పనిచేసే దాని అనుబంధ సంస్థలైన బిజెపి, ఏబివిపి, విశ్వహిందూపరిషత్‌ వంటివే కదా ! హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అన్న నినాదం కనిపించని గోడ,ఫ్లెక్సీ, బ్యానర్‌లు ఎక్కడైనా వున్నాయా ? రాజకీయంగా దిగజారటంతో పాటు దేశాన్ని జనాన్ని దివాలా తీయించే ఆర్ధిక విధానాలను అనుసరించిన కాంగ్రెస్‌ పోతున్న తన పట్టును నిలుపుకొనేందుకు అనుసరించని తప్పుడు పద్దతులు లేవు.వాటిలో మైనారిటీలను బుజ్జగించటం ఒకటి అనటం నిస్సందేహం. అంతేనా బింద్రన్‌వాలే వంటి వుగ్రవాదులను పెంచి పోషించిన దుష్ట చరిత్ర కూడా ఆ పార్టీకి వుంది. చివరికి ఆ బింద్రన్‌వాలా దయ్యం పట్టిన వారే ఇందిరా గాంధీని బలితీసుకొనేందుకు సాధనాలయ్యారు. కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) తదితర వామపక్షాలు ఇలాంటి బుజ్జగింపు చర్యలకు వ్యతిరేకం అన్నది చరిత్ర చెప్పిన సత్యం. కాంగ్రెస్‌ మైనారిటీ మతాల వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తే బిజెపి చేసిందేమిటి ? మొదట జనసంఘం అన్నారు, తరువాత దానిని జనతా పార్టీలో కలిపామన్నారు, దాన్నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీని పెట్టామన్నారు. ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ అధికారంలోకి రాకపోవటంతో హిందూమతానికి అన్యాయం జరుగుతోందని ఒకవైపు రెండోవైపు వివాదాస్పద బాబరీ మసీదు, రామజన్మభూమి వివాదాన్ని ముందుకు నెట్టింది. మెజారిటీ మతం వారిని బుట్టలో వేసుకొని అధికార అందలాలెక్కేందుకు ప్రయత్నించింది, అధికారానికి వచ్చిన తరువాత దానిని సుస్ధిరం చేసుకొనేందుకు గుజరాత్‌లో ఎలాంటి దారుణాలకు పాల్పడిందో, ఇప్పుడు దేశంలో ఏ విధంగా వ్యవహరిస్తోందో మనం చూస్తూనే వున్నాం. అందువలన ఆ విమర్శ చేయటానికి బిజెపి లేదా సంఘపరివార్‌కు, వారిని బలపరుస్తూ, కాంగ్రెస్‌ పద్దతులను మక్కీకి మక్కీ అనుసరించే తెలుగుదేశం, తెరాస వంటి ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి నైతిక హక్కు లేదు.

అన్నీ త్యజించి సన్యాసులుగా మారాము, దేశం కోసం లేదా సంఘ్‌ కోసం వివాహాలు మానాము, తత్వం తలకెక్కిన తరువాత తెలియక అంతకు ముందు కట్టుకున్న భార్యనే త్యజించాము, బోధనలే మాకు ముఖ్యం అని చెప్పుకొనే వారికి అధికార, రాజకీయ పదవులు ఎందుకు ? బుద్దుడు, వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాల్సింది సామాన్య జనమేనా వారు కాదా ?

     ఈ దేశం హిందూ దేశమని, మతమార్పిడులు, పిల్లల్ని ఎక్కువ మందిని కనటం ద్వారా ఇతర మతాలు ముఖ్యంగా ముస్లింలు మెజారిటీగా మారేందుకు పెద్ద కుట్ర పన్నారని, హిందూయిజానికి ముప్పు వచ్చిందని ఆధారంలేని, ఊహాజనిత ప్రచారం ఎక్కువ చేసింది, చేస్తున్నదీ ఎవరు ? అది వాస్తవం కాదని చెప్పిన కమ్యూనిస్టులు, ఇతర అభ్యుదయశక్తులన్నింటినీ దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు, విదేశీ సిద్ధాంతాలను పాటించేవారని తన యంత్రాంగం ద్వారా నిత్యం దాడులు చేస్తూ, జనాల బుర్రలను కలుషితం చేస్తున్నది ఎవరు ? సంఘపరివార్‌ కాషాయ కుహనా హిందుత్వ వాదులు కాదా ? ఒక యజమాని తన ఫ్యాక్టరీలో ఏ రోజు ఎంత వుత్పత్తి చేయాలో, ఏ వుత్పత్తిని పెంచాలో తగ్గించాలో ఆదేశించినట్లుగా హిందూ మహిళలు ఎంత మందిని పిల్లలన్ని కనాలో చెబుతున్న సంఘపరివార్‌ యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినులు భోగులుగా మారి పదుగురికి ఆదర్శంగా తాము చెప్పిన సంఖ్యలో ఎందుకు పిల్లల్ని కనటం లేదు? బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ హిందూ మతాన్ని కాపాడేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలంటాడా ?ఈ అంకెల ఆట అంతటితో ఆగలేదు. శ్యామల్‌ గోస్వామి అనే బిజెపి పెద్దమనిషి ఐదుగురు అంటే బదరికాశ్రమం శంకరాచార్య, శ్రీ వాసుదేవానంద సరస్వతి పదికి పెంచారు. మహిళంటే పిల్లల్ని కనే యంత్రాలనుకుంటున్నారా ? హిందూ మతాన్ని కాపాడి తరువాత ఏం చేస్తారు? వీరు పుట్టక ముందు నుంచి హిందూ మతాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఎవరు వీరు ? హిందూయిజానికి ప్రతినిధులమని స్వయంగా నిర్దేశించుకున్నవారే కదా ?చెప్పే వారికి బాధ్యత లేదా ? దేశం కంటే సన్యాసం ఎక్కువా ? లేదు అన్నీ త్యజించి సన్యాసులుగా మారాము, దేశం కోసం లేదా సంఘ్‌ కోసం వివాహాలు మానాము, తత్వం తలకెక్కిన తరువాత తెలియక అంతకు ముందు కట్టుకున్న భార్యనే త్యజించాము, బోధనలే మాకు ముఖ్యం అని చెప్పుకొనే వారికి అధికార, రాజకీయ పదవులు ఎందుకు ? బుద్దుడు, వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాల్సింది సామాన్య జనమేనా వారు కాదా ? యోగులు, సన్యాసుల గురించి వివేకానందుడు చెప్పిందేమిటి ? సన్యాసులకు ఒక మతం వుండకూడదు, అన్ని మతాల నుంచి మంచిని తీసుకోవాలి. ఇపుడు జరుగుతోందేమిటి ?

    నేడు ప్రతి మతంలోనూ తాలిబాన్లు తలెత్తుతున్నట్లు ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం వుండే మన దేశాన్ని కూడా ఆ వైపు నడిపించటానికి పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మతాలపై ముఖ్యంగా హిందూ మతంపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. అది వికటిస్తే పర్యవసానాలు భిన్నంగా వుంటాయి. కొంత మంది ముందుకు తెస్తున్న కొన్ని వాదనలను పరిశీలిద్దాం.

ఇస్లాం వంటి వాటిని విమర్శించటానికి వారికి( హిందూమతాన్ని విమర్శించేవారికి) భయం, వణికిపోతారు.

      మతాలన్నీ ఛాందసత్వంతో కూడుకున్నవే అన్నది ముందు గ్రహించాలి. వాటిలో సంస్కర్తలు మారుతున్న కాలానికి అనుగుణంగా మతాలు, ఆచారాలను వ్యాఖ్యానిస్తుంటే ఛాందసులు వాటిని అలాగే వుంచటం లేదా వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్నారు. కొన్ని దేశాలలో నూటికి 99శాతం ముస్లింలే వుంటారు. అయినా అక్కడ తాలిబాన్లు ఎందుకు పుట్టుకు వచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారేందుకు సిద్ధపడని ఛాందసులు షరియత్‌ పేరుతో మతోన్మాదులుగా మారుతున్నారు. మన సమాజంలో ఎప్పటి నుంచో వున్న ఆచారాల ప్రకారం ఇప్పటికీ దళితులు అంటరానివారే. రాజ్యాంగం దానిని నిషేధించింది. పాటిస్తే శిక్షార్హం అని చెప్పింది. ఆ హక్కును అమలు జరుపుకొనేందుకు ఎక్కడైనా దళితులు ప్రయత్నిస్తే అగ్రకులాలనబడేవారు దాడులకు తెగబడటాన్ని ఏమనాలి? హిందూ మతానికి చెందిన వారు హిందూమతాన్ని విమర్శిస్తే హిందూమతం వారే సహించటం లేదు. అటువంటుపుడు పూర్తిగా వివరాలు తెలియని అన్యమతాలను అన్యమతస్తులు విమర్శించటం సరైనది కాదు, సహేతుకంగా విమర్శించినా సహించే అవకాశం లేనపుడు ఏ మతానికి చెందిన వారు ఆ మతాన్ని విమర్శించటమే సరైనది. దాన్ని అంతవరకే పరిమితం చేయాలి.దీన్ని గురించి చౌకబారు అడ్డుసవాళ్లు విసిరే వారి వలలో పడాల్సిన అవసరం లేదు.దొంగబాబాలు, యోగినుల బండారాల గురించి అనేక సినిమాలలో ఎంతో చక్కగా చూపించారు, చూపుతున్నారు. కానీ ఎవరైనా ఒక బాబా లేదా యోగిని గురించి ప్రత్యక్షంగా విమర్శిస్తే వారిపైకి భౌతికదాడులకు జనాన్ని రెచ్చగొడుతున్న తీరు తెలిసిందే. నిజమైన విమర్శకులు శాంతి భద్రతల పరిస్ధితి తలెత్తాలని కోరుకోరు. మన దేశంలో నూటికి 80శాతం మంది హిందువులే గనక చర్చలలో కూడా ఆ వాటా అలాగే వుంటుంది. అందుకే మొత్తంగా దీనినే విమర్శించినట్లు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు.అమెరికా,ఐరోపా వంటి దేశాలలో హేతువాదుల నుంచి 90శాతం విమర్శలు క్రైస్తవం మీద వుంటాయి తప్ప ఇతర మతాల మీద కాదు, ఇక్కడ కూడా అంతే.

తస్లీమా సస్రీన్‌, సాల్మన్‌ రష్డీలను వారు సహించటం లేదు అలాంటపుడు ఇక్కడ ఎందుకు సహించాలి?

    తస్లీమా, సాల్మన్‌ రష్డీ మొరటు పద్దతులలో మత ఛాందసులను విమర్శించారు కనుక వారు దాడులకు తెగబడుతున్నారు.ఇక్కడ కూడా అదేపని చేస్తామంటారా? అలాంటపుడు వారికీ వీరికి తేడా ఏముంటుంది? ఇతరులను విమర్శించటం లేదని అడిగే హక్కు వారికి వుండదు. అహింస, విమర్శ, సహనం భారతీయ సంప్రదాయం. దాన్ని ముందు మనం కాపాడు కుందాం. ముందు మెజారిటీ జనం వాటిని పాటిస్తే అందుకు భిన్నంగా వ్యవహరించేవారిపై కూడా వత్తిడి పెరుగుతుంది. వారు కూడా తమ వైఖరిని మార్చుకుంటారు. ఇతర మతాల దేవతలు దేవుళ్లపై సద్విమర్శలు చేయటం వేరు, కించపరచటం వేరు. కించపరిస్తే జరిగేది కొట్లాటలే అని అనేక అనుభవాలు తెలిపాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహిళలకు అన్యాయం, వివక్షలో హిందూ-ముస్లిం దొందూ దొందే !!

17 Sunday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Women

≈ 3 Comments

Tags

Discrimination, Hinduthwa, Islam, Religious Fundamentalists

పశువులు పేడ వేస్తూ తిరుగుతున్నా వీధులలో అనుమతించారు తప్ప సాటి మనిషిని అంటరాని వారి పేరుతో వీధులలో తిరగనివ్వకుండా, ఒక వేళ తిరిగినా నోటికి ముంత, నడుములకు చీపుర్లు కట్టించి తిప్పిన రోజులు, వాటికి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం, ఆచారం అనే ముద్దు పేర్లు తగిలించి అమలు జరిపిన రోజులు లేవా ?

ఎం కోటేశ్వరరావు

      సామాజిక మీడియాలో ఇటీవలి కాలంలో మతాలను విమర్శించిన వారిని ముఖ్యంగా హిందూ మతాన్ని విమర్శించిన వారిపై కొందరు విరుచుకు పడుతున్నారు. విమర్శలు చేసే వారు రెండు రకాలు. ఒకటి గత వ్యాసంలో పేర్కొన్నట్లు తర్క బద్దమైన సైద్ధాంతిక విమర్శ, రెండవది ద్వేషంతో లేదా వుద్రేకంలో తెలియకుండానే మరో మతాన్ని కించపరిచే వ్యాఖ్యలతో సాగించే చర్చ. రెండవ తరగతిలో మొదటి వారిని మనం అదుపు చేయలేము. వుద్రేకంతో కించపరిచే వ్యాఖ్యలు చేసే వారు తమకు తెలియకుండానే ద్వేషంతో రెచ్చగొట్టే వారి వలలో పడుతున్నారని గ్రహించాలి. అందువలన వాటికి దూరంగా వుండాలి.

     ప్రపంచంలో మతాల చరిత్రను చూస్తే ప్రతి మతం ప్రజలకు దూరమైనపుడు కొత్త మతాలు పుట్టుకు వచ్చాయి. యూదుమతంపై తిరుగుబాటుతో క్రైస్తవం, దానిపై తిరుగుబాటుతో ఇస్లాం అవతరించింది. వీటిలో కొన్ని వుప శాఖలు వున్నాయి. అందుకే వీటన్నింటినీ కలిపి అబ్రహానిక్‌ మతాలని పిలుస్తారు. ఎందుకంటే ఈ మతాలన్నింటా అబ్రహాం అనే దేవుడు లేదా పాత్ర వుంది. ప్రపంచంలో ఈ మతాలకు చెందిన వారు 54శాతం మంది వున్నారు. ఇతర మతాలకు చెందిన వారు 32శాతం, ఒక సంఘటిత మతం లేదా అసలు మతాన్ని పాటించని వారు 14శాతం వున్నారు. క్రైస్తవం, ఇస్లాం మతాలలో ఒకటి , రెండు స్థానాలలో వున్నాయి. శైవం, వైష్ణవంలో దేవతలు, రూపాలు, పేర్లు వేరైనా ఆదిపురుషుడు ఒకరే అన్నట్లుగా యూదు, క్రైస్తవంలో అబ్రహాం కాస్తా ఇస్లాంలోకి వచ్చే సరికి ఇబ్రహీంగా మారిపోయారు. అలాగే హిందూమతంగా చెప్పబడుతున్న మతాలపై తిరుగుబాటుగా జైనం, బౌద్ధం అవతరించింది.

వేదాలపై వేల సంవత్సరాల నాడే చార్వాకులు విమర్శలు చేశారు. ఒక మతం వునికిలో వుండగా మరొక మతం వచ్చిందంటే పాత మతంపై విమర్శలు , వ్యతిరేకత లేకుండా వుండవు. శైవులు-వైష్ణవులు ఎలా కొట్లాడుకున్నదీ మనకు తెలిసిందే. అందువలన హిందూ మతంపై విమర్శ అన్నది కొత్తగా వచ్చింది కాదు, బయటి వారు లేదా వ్యతిరేకులు, మతంపై విశ్వాసం లేనివారు గానీ ప్రారంభించింది అసలే కాదు

      భోజపురి వంటి అనేక ప్రాంతీయ భాషలు హిందీతో సారూప్యత కలిగి వున్న కారణంగా వాటన్నింటినీ హిందీ అని పిలుస్తున్నట్లుగా హిందూమతంగా చెప్పబడే దానిలో శైవ,వైష్ణవం వంటి ప్రధాన స్రవంతి మతాలతో పాటు ఇతర అనేక చిన్న మతాలు సారూప్యత కలిగిన కారణంగా వాటన్నింటినీ కలిపి హిందూమతంగా లేదా ఇజంగా చెబుతున్నారు.భిన్నమైన విశ్వాసాలు, ఆచారాలున్న ఈ మతాల తత్వశాస్త్రాలపై గతంలో పరస్పరం అనేక విమర్శలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటికి మూలమైన వేదాలపై వేల సంవత్సరాల నాడే చార్వాకులు విమర్శలు చేశారు. ఒక మతం వునికిలో వుండగా మరొక మతం వచ్చిందంటే పాత మతంపై విమర్శలు , వ్యతిరేకత లేకుండా వుండవు. శైవులు-వైష్ణవులు ఎలా కొట్లాడుకున్నదీ మనకు తెలిసిందే. అందువలన హిందూ మతంపై విమర్శ అన్నది కొత్తగా వచ్చింది కాదు, బయటి వారు లేదా వ్యతిరేకులు, మతంపై విశ్వాసం లేనివారు గానీ ప్రారంభించింది అసలే కాదు. రామలీల వుత్సవాలు జరిపేవారు కొందరైతే రావణుడిని అభిమానించేవారు మరికొందరు. దేవతలు-దానవులు ఇలా ఎన్నో భిన్నత్వాలు వున్నాయి.జైన మతం దేవుడిని సృష్టికర్త లేదా విధ్వంసకుడిగా అంగీకరించదు, వాటిన్నింటినీ మన సమాజం అంగీకరించింది. అంటే విమర్శలను సహించింది. భారతీయ సంస్కృతిలో అదొక భాగం. అందువలన విమర్శలపై వుద్రేక పడేవారు ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవటం మంచిది. గతంలో శైవం, వైష్ణవం పేరుతో దెబ్బలాడుకున్నవారు రాజీపడి అసలు మతాలను మొత్తంగా విమర్శించేవారిపై సమైక్యంగా ఇప్పుడు తమ దాడిని మొదలు పెట్టారు. ఈ విషయంలో ఇతర మతాలవారితో జెఎసిని ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదు.

     కుండ కింద మంట పెట్టగానే నీరు ఆవిరి కాదు. వుష్ణోగ్రత పెరిగి వంద డిగ్రీలు దాటిన తరువాతే నీరు తన రూపం మార్చుకొని కొత్త రూపం ధరించి ఆవిరిగా మారుతుంది. అలాగే సమాజ మార్పులకు అనుగుణంగా మతాలు, ఆచారాలు మారనపుడు వాటిలో సంస్కరణలు రావాలని కోరుకుంటారు. వాటిని అడ్డుకుంటే అవి తీవ్రమై కొత్త మతాల ఆవిర్బావానికి నాంది పలుకుతాయి. హిందూమతంలో బాల్యవివాహాలు, కన్యాశుల్కం పేరుతో ఆడపిల్లలను అమ్ముకోవటం, పండు ముదుసలులకు పిన్నవయస్సు బాలికలనిచ్చి వివాహాలు చేయటం సాంప్రదాయంగా లేదా ఆచారంగా ఒక నాడు వున్నాయా లేవా ? పశువులు పేడ వేస్తూ తిరుగుతున్నా వీధులలో అనుమతించారు తప్ప సాటి మనిషిని అంటరాని వారి పేరుతో వీధులలో తిరగనివ్వకుండా, ఒక వేళ తిరిగినా నోటికి ముంత, నడుములకు చీపుర్లు కట్టించి తిప్పిన రోజులు వాటికి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం, ఆచారం అనే ముద్దు పేర్లు తగిలించి అమలు జరిపిన రోజులు లేవా ? చాతుర్వర్ణ వ్యవస్ధ పేరుతో శూద్రులకు విద్యను దూరం చేయలేదా ? ఆచారాలు, సాంప్రదాయాలు, విశ్వాసాలు, మనోభావాల పేరుతో ప్రస్తుతం విమర్శలను కూడా సహించలేక అసహనంతో రగిలి పోతున్నవారు పైన పేర్కొన్నవాటిని కూడా పునరుద్దరించాలని కోరుకుంటున్నారా ?

బాబరీ వివాదంలో కోర్టు తీర్పులను తాము ఖాతరు చేయబోమని తమ విశ్వాసాలే తమకు ముఖ్యమనే వాదనను ముందుకు తేవటానికి షాబోనో కేసులో ముస్లిం మతశక్తుల వైఖరే స్ఫూర్తి.

      తమ మత వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని చెప్పటంలో ఏ ఒక్క మతమూ తీసిపోలేదు. ఒకదాన్ని మరొకదానితో పోల్చి తమ చర్యలను సమర్ధించుకుంటున్నాయి. వుదాహరణకు షా బానో కేసునే తీసుకుందాం. విడాకులిచ్చిన తన భర్త భరణం చెల్లింపు గురించి మధ్యప్రదేశ్‌కు చెందిన షా బానో సుప్రీం కోర్టుకు వెళ్లింది.ఆ కేసులో ఆమె గెలిచింది. ఆ సందర్భంగా ఇస్లాం మత పెద్దలుగా వున్నవారు చేసిన వాదన ఏమిటి ? సుప్రీం కోర్టు తీర్పు ఖురాన్‌లో పేర్కొన్నదానికి అనుగుణంగా లేదు కనుక దానిని మేము అంగీకరించం అన్నారు. ముస్లిం ఛాందసుల వత్తిడికి లొంగిన కాంగ్రెస్‌ నేతలు 1986లో చట్ట సవరణ చేసి సుప్రీం కోర్టు తీర్పును నీరు గార్చారు. జస్టిస్‌ విఆర్‌ కృష్ణయ్యర్‌ ఆ చర్యను విమర్శిస్తూ అది ఖురాన్‌కు వ్యతిరేకమని, చట్ట సవరణ తప్పని ఖండించారు. ముస్లింల సంతృప్తీకరణ చర్యగా బిజెపి దానిపై నానా యాగీ చేసింది. ఆ చట్ట సవరణను వుపయోగించుకొని మెజారిటీ పౌరుల సంతృప్తీకరణతో తానే సరికొత్త ఓట్ల రాజకీయానికి తెరతీసింది. బాబరీ మసీదు ప్రాంతంలోనే రాముడు పుట్టాడన్నది తమ విశ్వాసమని అందువలన బాబరీ మసీదు తాళాలు తీయాలి లేదా తామే పగలగొడతామని తన కనుసన్నలలో పనిచేసే విహెచ్‌పి ఇతర సంస్థలద్వారా ఆందోళనలకు ఆజ్యం పోసింది. బాబరీ వివాదంలో కోర్టు తీర్పులను తాము ఖాతరు చేయబోమని తమ విశ్వాసాలే తమకు ముఖ్యమనే వాదనను ముందుకు తేవటానికి షాబోనో కేసులో ముస్లిం మతశక్తుల వైఖరే స్ఫూర్తి. ఎందుకంటే ఖురాన్‌కు అనుగుణంగా ఆ తీర్పు లేదని వారు వాదించారు. ఇప్పుడు తమ విశ్వాసాలకు, ఆచారలకు, సంప్రదాయాలకు అనుగుణంగా లేనివాటిని అంగీకరించబోమని ఎబుతున్నారు. ఎద్దులను దారుణంగా హింసకు గురిచేసే మొరటు క్రీడ జల్లికట్టుపై సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని వమ్ము చేస్తూ జల్లికట్టు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటానికి, కాంగ్రెస్‌ హయాంలో షాబానో కేసును నీరు గార్చేందుకు చేసిన చట్ట సవరణకు పెద్ద తేడా ఏముంది ? ముస్లిం ఆచారాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదని ఆ మతశక్తులు కోరుతున్నట్లుగానే శబరిమల ఆలయంలో ఎప్పటి నుంచో వస్తున్న మహిళలకు ప్రవేశ నిషేధం కుదరదని కోర్టులు ఎలా నిర్ణయిస్తాయని ఇప్పుడు హిందూ మతశక్తులు ప్రశ్నిస్తున్నాయా లేదా ? అక్కడా అన్యాయానికి గురైందీ మహిళే, ఇక్కడా వివక్షకు గురవుతోందీ మహిళే.

       షాబోనో కేసు తీర్పును నీరు గార్చటానికి కాంగ్రెస్‌ నేతలు చట్టసవరణ చేయటాన్ని నిరసిస్తూ నాడు కేంద్ర మంత్రిగా వున్న ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మంత్రి పదవికి, కాంగ్రెస్‌కూ రాజీనామా చేశారు.నేడు జల్లికట్టు కేసులో అలాంటిదేమీ లేకపోగా జల్లికట్టు క్షత్రియతకు, పౌరుషానికి ప్రతీక అని బిజెపి తమిళనాడు నేత గణేశన్‌ వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం, జయలలిత వదిలే నాలుగు సీట్ల కోసం ఎద్దుల రాజకీయాలు తప్ప పౌరుషం పురుషులకేనా మహిళలకు అవసరం లేదా ? నిజానికి బిజెపికి చిత్తశుద్ధి వుంటే తరువాత తాను అధికారానికి వచ్చినపుడు లేదా ప్రస్తుతం పూర్తి మద్దతు వున్న స్దితిలో గానీ సుప్రీంకోర్టు తీర్పులను నీరుగార్చే అధికార దుర్వినియోగానికి తీసుకున్న చర్యలేమిటి ? కాంగ్రెస్‌ కనీసం పార్లమెంట్‌లో చట్టసవరణ చేసింది, మోడీ సర్కార్‌ ఆప్రజాస్వామిక తతంగం కూడా లేకుండా తన అధికారాన్ని వుపయోగించి జల్లికట్టు తీర్పును వమ్ము చేసేందుకు పూనుకుంది. అది తీసుకున్న నిర్ణయం దానికే పరిమితం అవుతుందా ? బిజెపి, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్న వాదనలు, కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక అంతకంటే పెద్ద కుట్రకు నాంది పలికినట్లు చెప్పవచ్చు. రామజన్మభూమి ఆలయ వుద్యమం సందర్బంగా విశ్వాసం కోర్టులకు అతీతమని వాదించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ముఖమంత్రిగా బిజెపి నాయకుడు కల్యాణసింగ్‌ బాబరీ మసీదును రక్షిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపారు. సంఘపరివార్‌ సేవకుడిగా దానిని వుల్లంఘించి 1992లో బాబరీ మసీదు కూల్చివేతకు సహకరించాడు. ప్రస్తుతం విశ్వహిందూపరిషత్‌ నేతగా వున్న ప్రవీణ్‌ తొగాడియా రామాలయం విశ్వాసానికి సంబంధించిందని, దాని నిర్మాణం కోసం పార్లమెంట్‌ ప్రతేక చట్టం చేయాలని చెబుతుండగా, సుబ్రమణ్యస్వామి వివాదాస్పద స్థలలోనే నిర్మాణం జరగాలని రెచ్చగొడుతున్నాడు. అందువలన ప్రస్తుతం కోర్టులో వున్న బాబరీ మసీదు వివాదంపై తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే దాన్ని వమ్ము చేసేందుకు అవసరమైతే చట్టం చేయాలని హిందూమతశక్తులు బహిరంగంగానే కోరుతున్నాయి. దీనిపై తీవ్రమైన చర్చ జరగాలా లేదా ? రాజ్యాంగానికి కట్టుబడి వుంటారా? దానికి అతీతంగా విశ్వాసాలు, ఆచారాల పేరుతో దాన్ని నీరుగారుస్తారా ?

   అన్యమతాలపై విమర్శ చేసేటపుడు ఎంతో బాధ్యతా యుతంగా వుండాలి.అది వివాదాలు, కొట్లాటలకు దారితీయకూడదు. అందుకే ఇతర మతాలపై వ్యాఖ్యానించటానికి నిజమైన హిందువు బాధ్యతాయుతంగా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు.అదే మతం తప్ప మరొక అజెండా,జెండా లేనివారు మతోన్మాద చితిపై ఓట్లు దండుకోవాలనుకునేవారి మాదిరి వ్యవహరించరు. అంతే తప్ప దమ్ము, ధైర్యమో మరొకటో లేక కాదు. అలాంటి వారికి ముంబై హైకోర్టు మార్గదర్శకాలు మరోసారి గుర్తు చేయకతప్పదు. ఈ దేశంలో నూటికి 80శాతంపైగా హిందువులు వున్నారు. అందువలన చర్చలో అదేమోతాదులో హిందూయిజంపైనే జరుగుతుంది. పరమత సహనం గల దేశంలో ఏ మతం వారు ఆమతం మంచి చెడ్డలను చర్చిస్తే అది సాధికారికంగా, విశ్వసనీయత వుంటుంది. లేకుంటే ముంబై పరమత న్యాయవాది ఇస్లాం, ముస్లింల గురించి రాసిన పుస్తకం నిషేధం, కోర్టుకు ఎక్కినట్లుగా, కోర్టు చెప్పిన అవాంఛనీయ పర్యవసానాలకు దారితీస్తుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రిపబ్లిక్‌ డే రోజున మహిళల దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకుంటామంటున్న సనాతన సంస్థ

16 Saturday Jan 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Women

≈ Leave a comment

Tags

Gender Inequality, Hindu Janjagruti Samiti, Sanatan Sanstha, Shani Shingnapur

మహారాష్ట్రలో శని ఆలయ ఆంక్షలు

ఈ దేవాలయానికి తొలిసారిగా ఒక మహిళను  అధ్యక్షురాలిగా నియమించటం విశేషం.

ఎం కోటేశ్వరరావు

     శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై విధించిన నిషేధం రాజ్యాంగ విరుద్ధమని దేశ అత్యున్నత న్యాయస్ధానం వ్యాఖ్యానించింది. దానిపై తమ వాదనలను వినిపించేందుకు ఆ దేవస్థాన యాజమాన్యం సిద్దం అవుతోంది. దానిపై విచారణ జరిగి అంతిమ తీర్పు ఎలా వస్తుందో తెలియదు. కానీ మహిళలపట్ల వివక్షకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసిన కేసు దరఖాస్తును వుపసంహరించుకోవాలని లేకుంటే చంపివేస్తామని న్యాయవాదులకు వందలాది బెదిరింపులు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా వుండగా మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌లోని శని దేవాలయంలోని దేవత వేదికపైకి తమను అనుమతించాలంటూ ఒక స్వచ్ఛంద సంస్ధ భూమాత బ్రిగేడ్‌ నాయకత్వంలో దాదాపు 400 మంది మహిళలు రిపబ్లిక్‌ దినోత్సవం రోజున దేవాలయ ప్రవేశం చేస్తామని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సనాతన సంస్థ, హిందూ జనజాగృతి సమితి వాటి అనుబంధ మహిళా విభాగం రాణ రాగిణి శాఖ రెండువేల మంది మహిళలతో అడ్డుకుంటామని ప్రకటించి అక్కడ శాంతి భద్రతల పరిస్ధితులను సృష్టించేందుకు పూనుకున్నాయి. ఈ దేవాలయానికి తొలిసారిగా ఒక మహిళను దేవస్థాన అధ్యక్షురాలిగా నియమించటం విశేషం. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని వుల్లంఘించటాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించనని ఆమె ప్రకటించారు.

Embedded image permalink

   దేవస్థాన అధ్యక్షురాలు

 మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్నవారు చెబుతున్న కధనం ప్రకారం శని ప్రభువు వుగ్ర దేవత. దేవత నుంచి వెలువడే ప్రకంపనలు మహిళలకు హాని చేస్తాయి, అందువలన దేవత మండపం దగ్గరకు వారి ప్రవేశాన్ని నిరోధిస్తున్నారు తప్ప దేవాలయ ప్రాంగణంలో ప్రవేశానికి నిషేధం లేదని, లింగ వివక్ష సమస్యతో కాదని వాదిస్తున్నారు. పురుషులను కూడా మండపం ఎక్కటానికి అనుమతించటం లేదని దూరం నుంచే పూజలను అనుమతిస్తున్నామని, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని వుల్లంఘించటమంటే భక్తుల మనోభావాలను గాయపరచటమే అని వాదిస్తున్నారు. ఆధ్యాయాత్మిక కారణాలను చూడకుండా కేవలం ప్రచారం ఎత్తుగడగా కొందరు మహిళలను ప్రోత్సహిస్తున్నారని హిందూ జనజాగృతి సమితి ప్రతినిధి సునీల్‌ ఘన్‌వాట్‌ ఆరోపించారు.

      నవంబరు నెలలో ఒక మహిళ శని దేవాలయ మండపంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా దేవాలయ ట్రస్టీలు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. దీనిపై రాష్ట్రంలోని పలు మహిళా సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆ చర్యకు నిరసనగా డిసెంబరులో పూనా కేంద్రంగా పనిచేసే భూమాత రానరాగిణి బ్రిగేడ్‌ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్‌ నాయకత్వంలో మరో ముగ్గురు మహిళలు ప్రవేశించేందుకు పూనుకోగా ఆలయ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తాము వచ్చే వారం సతారా నుంచి బయలు దేరి రిపబ్లిక్‌ డే నాటికి దేవాలయం వద్దకు చేరుకుంటామని తృప్తి చెప్పారు.అందరికీ సమాన హక్కులు ఇచ్చిన రాజ్యాంగం అమలులోకి వచ్చినందున ఆ రోజును ఎంచుకున్నట్లు చెప్పారు. వివిధ మహిళా సంఘాలు, బృందాలతో సమావేశాలు జరిపి ప్రచారం, చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అడ్డు సవాళ్లు తరువాత, ముందు మతాలలోని వివక్ష, వైరుధ్యాలను అంగీకరిస్తారా లేదా ?

16 Saturday Jan 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Counter Challenges, Hinduism, Hinduthwa, Riddles in Reigions

ఇక హిందూమతాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు అనే వాదన ప్రతి కొత్త తరానికి అది అబ్బ ఏం చెప్పిండు అన్నట్లు కొత్తగా వినసొంపుగా వుండవచ్చుగాని నిజానికి పాతచింతకాయ పచ్చడి.

ఎం కోటేశ్వరరావు

      జల్లి కట్టు లేకపోతే ఎద్దులు అంతరిస్తాయా ? మహిళలను అనుమతిస్తే అయ్యప్ప బ్రహ్మ చర్యం పోతుందా అనే శీర్షికతో నేను రాసిన అంశాలపై పెద్ద సంఖ్యలో ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు నాకు మద్దతు పలికిన వారు కూడా వున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వారు అనేక ప్రశ్నలు సంధించారు. అందువలన వారికి మాయాబజార్‌ సినిమాలో చెప్పినట్లు వీరతాళ్లు వేద్దాం. అయితే వాణిజ్య ప్రకటనలలో చిన్న నక్షత్రం వేసి దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగానే గానే వీరూ ఆ షరతులకు లోబడే వీరతాళ్లు  వేసుకొనేందుకు అర్హులు. నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు చేసిన ఆరోపణ లేదా విమర్శలు ఏమిటి ? హిందూయిజాన్ని సులభంగా విమర్శిస్తారు, ఇతర మతాలు ముఖ్యంగా ఇస్లామును ఏమీ అనలేరు, వారిని విమర్శించటానికి లేదా వారి పేరు ఎత్తటానికి దమ్ము, ధైర్యాలు లేవు, హిందూయిజాన్ని విమర్శించటం ఒక ఫ్యాషన్‌గా మారింది. హిందువులు సహనశీలురు కాబట్టే ఇలాంటి వారి ఆటలు సాగుతున్నాయి, ఇస్లామిక్‌ దేశంలో ఇలా అని బతగ్గలరా ? ఇలా సాగాయి.విమర్శించిన వారందరూ సంఘపరివార్‌ తాలిబాన్‌ హిందూత్వ వాదులు కాదు, వారి వాదనల ప్రభావానికిలోనై ప్రశ్నించినంత మాత్రాన వారిని, కరడు గట్టిన వారినీ ఒకే గాటన కట్టటం లేదు.

       మన దేశంలో అభివృద్ధి చెందిన వాటిలో తర్కశాస్త్రం ఒకటి. ఇది శాస్త్రీయమైనది, దీనిలో గతి తార్కిక విధానం అంటే తర్కము, హేతువు వుండాలి. గతి తార్కిక విధానము అనగానే ఇదేదో కమ్యూనిస్టుల పదజాలం అని కొందరికి తేళ్లు జెర్రులు పాకినట్లు వుండవచ్చు. వారు పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల నాడే భారత సమాజంలో వుంది. అసలు తర్కము, హేతువు నుంచే సమాజం ఇంతగా పురోగమించింది. అవేమీ లేకపోతే మనం ఇంకా ఆకులు చుట్టుకొనే దశలోనో అంతకు పూర్వ దశలోనో వుండే వాళ్లం. తర్కాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు లోకాయతులు. వేదాలను, వైదిక క్రతువులను రెండున్నర-మూడువేల సంవత్సరాల నాడే వ్యతిరేకించి వాటి ప్రామాణికతను సవాలు చేసిన హేతువాదులు వారు . వారిని చార్వాకులు అని కూడా పిలిచారు. వేదాలను సమర్ధించే శక్తులు వారిని భౌతికంగా అంతం చేసి వారి తర్కశాస్త్రాన్ని నాశనం చేసి తరువాతి తరాలకు అందకుండా చేశారు. వారిని తిడుతూ లేక విమర్శిస్తూ రాసిన అంశాలను బట్టి లోకాయతుల గురించి మనకు ఇప్పుడు తెలుస్తున్నది. అందువలన నేను రాసిన దానిని తప్పుపట్టిన వారు ముందు వుద్రేకాన్ని తగ్గించుకొని మన పురాతన గతి తార్కిక పద్దతిలో ఆలోచించాలి. తర్కశాస్త్రంలో ఒకరు ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తితే దాన్ని వుత్తర పక్షం అంటారు. రెండవవారు దానికి సమాధానం చెబితే దానిని పూర్వపక్షం అంటారు. రెండు వాదనలు విని ఏది సరైనదో తేలుస్తారు. అంటే సరైన వాదన చేసిన వారిని రెండోవారు అంగీకరించాలి. ఇటీవలి కాలంలో కొందరు అతి తెలివి ప్రదర్శిస్తూ వాదనలకు దిగి ఓడిపోయి రెండోవారిని అంగీకరించకుండా మీరు ఎన్నయినా చెప్పండి ఇది నా విశ్వాసం, నమ్మకం , మనోభావం దీనిని నేను అంగీకరించను అని అడ్డం తిరుగుతున్నారు లేదా అసలు తర్కానికే సిద్ధం కారు .ఇలాంటి వారు వీరతాళ్లు వేసుకొనేందుకు అనర్హులు. అలాంటి వారితో తర్కించటం కంఠశోష తప్ప శుద్ద దండగ. గాంధీలు పుట్టినపుడు గాడ్సేలు లేకుండా ఎలా వుంటారు అన్నట్లుగా సమాజంలో హేతుబద్దంగా ఆలోచించే వారే మెజారిటీగా వున్నందున వారి కోసమైనా కొన్ని విషయాలను చర్చించుకోవటం అవసరం. వారు వున్నారు కాబట్టే సమాజం ముందుకు పోతోంది.

      ముంబై హైకోర్టు 2010 జనవరి మొదటివారంలో ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఇస్లాం, హిందూ, క్రిస్టియన్‌ ఏ మతాన్ని అయినా భావప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాధమిక హక్కు కింద విమర్శించటం భారత దేశంలో అనుమతించదగినదే అయితే అ విమర్శ చిత్తశుద్దితో లేదా సైద్ధాంతికమైనదిగా వుండాలి తప్ప విద్వేషాన్ని రెచ్చగొట్ట కూదదు అని ఒక పుస్తకంపై తలెత్తిన వివాదం సందర్భంగా కోర్టు చెప్పింది. ఇస్లాం గురించి ముంబై న్యాయవాది ఒకరు రాసిన పుస్తకంలోని అంశాలు అభ్యంతరకరంగా వున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ పుస్తకంపై నిషేధం విధించింది. అది తన భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతమంటూ రచయిత కోర్టులో సవాలు చేశారు. కోర్టు ఆ నిషేధం సరైనదే అని సమర్ధించింది. న్యాయమూర్తులు రంజనా దేశాయ్‌, డివై చంద్రచూడ్‌, ఆర్‌ఎస్‌ మోహిత్‌లతో కూడిన బెంచ్‌ దీనిని విచారించింది. ఆరోగ్యకరమైన విమర్శ ఆలోచనలను రేకెత్తించేదిగా వుండాలి, చర్చను ప్రోత్సహించాలి ఒక నిర్ధారణకు వచ్చేందుకు తోడ్పడాలి, కానీ విమర్శ నిందలు వేసేదిగా వివిధ సామాజిక తరగతుల మధ్య విద్వేషాన్ని సృష్టించేదిగా వుండకూడదు, అది వివేకవంతమైన సంప్రదింపులకు దారితీయాలి అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. రచయిత తాను అనుకుంట్నుది సరైనదని చెప్పవచ్చు, ఒక వేళ అది తప్పయితే దానికి అతనిని శిక్షించకూడదు, కానీ చూడాల్సిందేమంటే ఇస్లాం ఏం చెప్పిందో తెలుసుకోవటానికి, దానిని బయటకు వెల్లడించటానికి రచయిత చిత్తశుద్దితో వ్యవహరించాడా లేదా అనేది చూడాలి. ఈ కేసులో ఇస్లాంపై విమర్శలు మరియు భారతీయ ముస్లింలపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు సైద్దాంతికమైనవి కాదు అని కోర్టు స్పష్టం చేసింది. అభ్యంతరకరంగా వున్న భాగాలను తొలగించాలన్న సూచనలను రచయిత నిరాకరించారు. ఇంటర్నెట్‌ యుగంలో పుస్తకాన్ని నిషేధించటం కాలం చెల్లింది, అర్ధం లేనిది అని రచయిత వాదించటం పూర్తిగా అభ్యంతరకరమని కోర్టు పేర్కొన్నది. భారతీయ ముస్లింలు హిందువులందరినీ మతమార్పిడి చేయాలని చూస్తున్నారని, హిందూ దేవాలయాలు, మహిళలపై దాడులు చేస్తున్నారంటూ రచయిత చేసిన వ్యాఖ్యలు జనాన్ని హింసాకాండకు రెచ్చగొట్టవచ్చు లేదా హింస, శతృత్వాన్ని లేదా ద్వేషాన్ని పెంచవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.

       అందువలన ఎవరైనా ఏమతం గురించైనా చేసే వ్యాఖ్యల వెనుక వున్న వుద్ధేశ్యాలు, లక్ష్యాలు ఏమిటో తెలియనంతటి స్థితిలో సమాజం లేదు. అయితే కొందరు ఒక లక్ష్యంతో చేసే వ్యాఖ్యలను మరికొందరు పర్యవసానాల గురించి ఆలోచించకుండా వాటిని తమ అభిప్రాయాలుగా స్వంతం చేసుకొని మాట్లాడుతున్నారు. విమర్శ చేస్తే వారు సహించరు. అందువలన వారిని కూడా ఎదుటి వారు ఏదో ఒక పక్షంగా భావించాల్సిన పరిస్థితులు నేడు దాపురించాయి. ముందే చెప్పుకున్నట్లు ఇస్లాంను విమర్శించటానికి దమ్ము, ధైర్యం లేదని చేసే వ్యాఖ్యలు, సవాళ్లు ఈ కోవకు చెందినవే. వీరు ముందు ఒకటి స్పష్టం చేయాలి. రాజ్యాంగాన్ని అంగీకరించి దానికి అనుగుణుంగా నడుచుకుంటారా లేదా ? మనది మతరాజ్యం కాదని అంగీకరిస్తారా లేదా ? భిన్నాభి ప్రాయాన్ని సహిస్తారా కుదరదంటారా ? మతరాజ్యాలతో పోల్చుకోవటం అంటే మనం కూడా ఆ బాట పట్టాలని చెబుతున్నారా ? ఏమతానికి చెందిన వారైనా అసలు మతాలలోని చెడు లేదా అవాంఛనీయ పోకడల మీద చేసే విమర్శలను సహిస్తారా లేదా అంగీకరిస్తారా లేదా ? మతాలలోనే అంతర్గతంగా వైరుధ్యాలు, మారాల్సిన అంశాలు వున్నాయని ఒప్పుకుంటారా లేదా ?

      వుదాహరణకు హిందూ మతంలో మహిళల పట్ల వివక్ష వుంది అనే విమర్శ చేస్తే వెంటనే వస్తున్న ప్రతివాదన ఏమిటి ? హిందూ మతం గురించి చెప్పేవారు మహిళలకు మసీదులలో ప్రవేశంపై ఆంక్షల గురించి, క్రైస్తవంలోని అంశాలపై మాట్లాడరెందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఆ మతాల గురించి విమర్శిస్తే మావి మైనారిటీ అసలు నూటికి 80 మందిగా , మా మతాల కంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి వునికిలో వున్న హిందూ మతం గురించి ఆలోచించండి అని వారు అంటారు. వీటన్నింటినీ చూసినపుడు ఏ ఒక్కమతావలంబలకులూ తమ మతంలో వివక్ష వుందని అంగీకరించటం లేదు, వున్న దానిని సమర్ధించటానికి పూనుకుంటున్నారు, తప్పించుకోవటానికి ఇతర మతాల గురించి అడ్డు సవాళ్లు విసురుతున్నారు. ఓట్లకు మతాలను వాడుకోవటం, అందుకోసం చివరికి కొట్లాటలను కూడా సృష్టిస్తున్న ఈ రోజుల్లో ఒక మతానికి చెందిన వారు ఇతర మతాల మంచి చెడ్డల గురించి చెబితే వాటిని సహృదయంతో స్వీకరించే పరిస్థితులు లేవు. అవసరమైతే వివక్ష, మూఢనమ్మకాలు, సంస్కరణల వంటి విషయాల గురించి మనం వాదులాడు కోవద్దు, విమర్శించేవారిపై వుమ్మడిగా దాడి చేద్దాం అని జెఎసి గా ఏర్పడినా ఆశ్చర్యం లేదు. మతం జనం పాలిట మత్తుమందు అని కమ్యూనిస్టులు చెబుతున్నారు. అలా అన్నందుకే కమ్యూనిజం క్రైస్తవానికి, ఇస్లాంకు వ్యతిరేకం అని ఆ మతాలు జనం మెదళ్లలో నూరిపోస్తున్నాయి. మన దేశంలో కూడా మెజారిటీ మతశక్తులూ అదే చేస్తున్నాయి. అందువలన ఇప్పుడున్న స్థితిలో ముందు ఏ మతానికి చెందిన వారు ఆ మతంలోని అవాంఛనీయ పోకడలను ప్రశ్నించాలి. ఏ మతం వారైనా ఇతర మతాలకు చెందిన వారు కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రెచ్చిపోవద్దు. వాటిని కొన్ని శక్తులు దురుద్ధేశ్యాలు, జనం మధ్య సామరస్యతను చెడగొట్టేందుకు , రోజువారీ సమస్యలపై ఐక్యం కాకుండా అడ్డుకొనేందుకు విభజించి పాలించే ఎత్తుగడలలో భాగంగా అనేక అంశాలను ముందుకు తెస్తున్నాయి. అనేక మంది వాటికి ప్రభావితులౌతున్నారు, సామాజిక మీడియాలో అవాంఛనీయ పోకడలు, వ్యాఖ్యలతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు.

      ఇక హిందూమతాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు అనే వాదన ప్రతి కొత్త తరానికి అది అబ్బ ఏం చెప్పిండు అన్నట్లు కొత్తగా వినసొంపుగా వుండవచ్చుగాని నిజానికి పాతచింతకాయ పచ్చడి. అరిగిపోయిన గ్రామఫోను రికార్డు వంటిదే. దాన్ని గురించి తరువాత పరిశీలించుదాం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జల్లికట్టు లేకపోతే ఎద్దులు అంతరిస్తాయా ? మహిళలను అనుమతిస్తే అయ్యప్ప బ్రహ్మచర్యం పోతుందా ?

14 Thursday Jan 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Women

≈ Leave a comment

Tags

feminist, jallikattu, sabarimala ban

ఎం కోటేశ్వరరావు

ఈ వారంలో జల్లికట్టు, శబరిమల ఆలయంలో యువతుల ప్రవేశ నిషేధంపై వెలువడిన కోర్టు తీర్పులు, నిర్ణయాలు సంచలనం కలిగించాయి.కోర్టు తీర్పులపై ఎప్పుడూ ఏకాభిప్రాయం వుండదు. గెలిచిన వాడు న్యాయమైన తీర్పు అంటే ఓడిన వాడు అన్యాయం అని ఆక్రోశిస్తాడు.ఏ తీర్పు అయినా అవి వ్యక్తులు లేదా ఒక సంస్ధ వివాదాలలో అయినా ఇచ్చిన తీర్పులు మెజారిటీ ప్రయోజనాలను కాపాడుతుందా లేదా ? సమాజాన్ని ముందుకు తీసుకుపోయేందుకు దారి చూపుతుందా లేదా అన్నదే గీటురాయిగా వుండాలి. ఆ విధంగా చూసుకున్నపుడు కొన్ని సందర్బాలలో కోర్టు తీర్పులు కూడా తిరోగామిగా వుండవచ్చు. అన్నింటినీ ఒకేగాటన కట్టలేము. అందువలన దేనికి దానిని విడిగా చూడాలి.

ఈ ప్రాతిపదికన చూసినపుడు జల్లికట్టు, శబరిమల కేసులలో నిర్ణయాలను పురోగమనవాదులు హర్షిస్తుండగా తిరోగమనవాదులు చిందులు వేస్తున్నారు. విపరీత భావాలు, ఆచరణ సాధ్యం కాని సంస్ధగా సుప్రీం కోర్టు మారిపోతున్నదని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళలను ఎందుకు రానివ్వటంలేదో చెప్పాలని, నిషేధించటం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు దేవస్ధాన అధికారులను ప్రశ్నించింది. యువ న్యాయవాదులు వేసిన పదేళ్లనాటి ఒక కేసును కోర్టు విచారిస్తున్నది.ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం, ఆచారం, మనోభావాలను గాయపరచినట్లు , వాటిని ఒక్కరాత్రిలో మార్చివేయలేమని చెప్పటం తప్ప ఎలాంటి హేతుబద్దమైన సమాధానం మహిళల నిషేధాన్ని సమర్ధించేవారి వద్ద లేదు.

అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కనుక 10-50 మధ్య వయస్సు వున్న మహిళలు రుతుక్రమంలో వుంటారు కనుక వారిని ఆలయంలోకి అనుమతించటం’పాపం’ అని బోర్డు వాదిస్తున్నది. గతంలో అధికారంలో వున్న సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి దీనికంతటికీ కారణమైందని బోర్టు అధ్యక్షుడు ప్రయార్‌ గోపాల్‌కృష్ణన్‌ ఆరోపించారు. తిరువనంతపురంలోని అట్టుకల్‌ దేవీ ఆలయంలోకి పొంగలా పూజ చేసేందుకు పురుషులను అనుమతించరని, ఇలాగే ప్రతి దేవాలయానికి ఒక్కొక్క ఆచారం వుంటుందని, ఇది లింగవివక్ష సమస్య కాదు, సాంప్రదాయం అని వాదించారు. కోర్టు వీటిని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించిందని విమర్శించారు. మహిళలను అనుమతించాలా లేదా అనేది భక్తులు నిర్ణయిస్తారని, తమ హక్కుల గురించి మహిళలు తేల్చుకుంటారు తప్ప కోర్టులపని కాదనే ఘనులు కూడా తయారయ్యారు. యధాతధ స్థితిని కొనసాగించాలని కోరాలని కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచో వున్న పాత ఆచారాన్ని తాము మార్చబోమని దేవాదాయశాఖ మంత్రి శివకుమార్‌ ప్రకటించారు. విశ్వహిందూ పరిషత్‌ వంటి సంస్ధలు ఇంక సరేసరి.

ఈ సమస్యపై కోర్టు తీరును వామపక్ష ప్రజాతంత్ర కూటమి స్వాగతించింది. దీనిపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని అభిప్రాయ పడింది. తిరువాన్కూరు మాజీ రాజకుటుంబానికి చెందిన మహిళలు దేవాలయాన్ని సందర్శించినట్లు గట్టి ఆధారాలున్నాయని సిపిఎం నాయకుడైన మాజీ దేవాదాయ శాఖ మంత్రి సుధాకరన్‌ చెప్పారు. మహిళలు దేవాలయంలోకి ప్రవేశిస్తే దేవుడి బ్రహ్మచర్యం పోతుందని వాదించటంలో అర్ధం లేదని ఇదొక సామాజిక రుగ్మత అని కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన వారు వాదిస్తున్నారు. గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయంలోకి ఇతర మతాలకు చెందిన వారికి ప్రవేశం లేదు, అయ్యప్పకు అటువంటి నిషేధం లేదు.వావర్‌ స్వామి అనే ఒక ముస్లిం అయ్యప్పకు ఎంతో ఇష్టమైన భక్తుడిగా ప్రాచుర్యంలో వుండటంతో అయ్యప్ప దేవాలయానికి వెళ్లే ముందు వావర్‌ స్వామి మసీదును కూడా భక్తులు సందర్శిస్తారు. హిందువులు పూజించేవారిలో హనుమాన్‌ కూడా ఒకరు. ఆయనా బ్రహ్మచారే. ఆయనకూ దేవాలయాలున్నాయి.వాటిలో మహిళల ప్రవేశంపై ఎలాంటి నిషేధం లేదు, ఆయన బ్రహ్మచర్యం పోయిన దాఖలాలు లేవు. మరి అయ్యప్పకే ఆంక్షలు ఎందుకు?

2006లో కన్నడ సినీనటి జయమాల తాను కుర్రవయస్సులో వున్నపుడు అయ్యప్పస్వామి దేవాలయాన్ని సందర్శించినట్లు ప్రకటించటంతో మహిళలపై నిషేధం వెలుగులోకి వచ్చింది. జయమాల అలాంటి ప్రకటన చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచిందంటూ కేసును దాఖలు చేశారు.ఆమెకు మద్దతుగా అనేక మంది ముందుకు వచ్చారు. ఆ వుదంతం జరిగిన సమయంలోనే దేవాలయ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ యువ న్యాయవాదులు సుప్రీం కోర్టులో కేసును దాఖలు చేశారు. నిషేధం రాజ్యాంగ బద్దం కాదని కోర్టు అభిప్రాయ పడటంతో ఈనెల 18న తమ వాదనలు వినిపిస్తూ దేవస్ధానం బోర్డు, కేరళ ప్రభుత్వం కూడా పిటీషన్లు దాఖలు చేయనున్నాయి.

రెండవ అంశం జల్లికట్టుపై నిషేధం. సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని పూర్వపక్షం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మొరటు క్రీడను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దానిపై సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు కావటంతో జల్లికట్టును అనుమతించరాదని మరోసారి కోర్టు ఆదేశించింది.అయ్యప్ప ఆలయంలోకి మహిళలపై నిషేధం లింగవివక్ష సమస్య కాదని వితండ వాదం చేస్తున్నట్లుగానే జల్లికట్టులో ఎద్దుల పట్ల క్రూరంగా వ్యవహరించటం లేదని, అసలు ఇలాంటి పోటీలు, క్రీడలు లేనట్లయితే మన దేశంలో ఎద్దులను పెంచేవారే వుండరని, అసలా జాతే అంతరించి పోతుందనే అర్ధం లేని వాదనలు ముందుకు తెస్తున్నారు. జల్లికట్టును ఒక సాంస్కృతిక అంశంగా చూడాలని, మానవ ప్రాణాలు ఒక సమస్యగా తయారైతే తప్ప ఇలాంటి అంశాలపై తీర్పులు చెప్పటం కోర్టుల పని కాదని చెబుతున్నారు. ఒక వేళ దీనిని క్రూరమైన చర్యగా పరిగణిస్తే గుర్రపు పందాలలో గుర్రాలు కూడా గాయపడతాయని వాటిని నిషేధిస్తారా, ఇతర జంతు వధలను కూడా నిషేధించాల్సి వుంటుందన్న వాదనలు ముందుకు తెస్తున్నారు. క్రూరత్వ నిరోధ చట్టం మానవులు తయారు చేసింది తప్ప మరొకటి కాదని, రాజ్యాంగంలోని మౌలిక హక్కుల వంటిది కాదని కూడా అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు.కోర్టు వాదనల ప్రకారమైతే స్పెయిన్‌లో ఎద్దులతో యుద్ధాన్ని, అమెరికాలో కృతజ్ఞతల దినం రోజు టర్కీల వధను కూడా నిషేధించాల్సి వుంటుందని చివరికి మాంసం మానేసి పండ్లు, కూరగాయలు తినాల్సి వుంటుందని చెబుతున్నారు.అలాంటి వాదనలను ముందుకు తెచ్చేవారు ముందు వాటిపై తమ అభిప్రాయం ఏమిటో చెప్పకుండా అడ్డు సవాళ్లు విసిరితే కుదరదు. సంప్రదాయం, ఆచారాలు మనోభావాల పేరుతో రెచ్చగొట్టటం గాక ఆరోగ్యకరమైన చర్చ జరిపితే ప్రయోజనం వుంటుంది. జైనులు నడిచేటపుడు తమ కాలికింద పడి జీవులు ఎక్కడ నలిగిపోతాయో అని రోడ్లు వూడ్చుకుంటూ పోయిన తరువాతే నడుస్తారు.మరి వారు మాంసం కోసం జంతువధ చేయటం తమ మనోభావాలను గాయపరచటం కనుక కుదరదు, మా సాంప్రదాయం కాదు అంటే కుదురుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Marxism does not attack religion per se

08 Friday Jan 2016

Posted by raomk in Communalism, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

communalism, CPI(M), Marxism, Marxist philosophy, narayana Guru, SITARAM YECHURY, Sivagiri

Sitaram Yechury

[This text is based on the speech delivered by Sitaram Yechury, General Secretary of CPI(M)  at the valedictory function of the 83rd Sivagiri Pilgrimage Celebrations on January 1, 2016 at Kerala.]

It is, indeed, an honour to be here at Sivagiri. My heartfelt thanks for being invited to share some thoughts with all of you in the concluding session of the 83rd Sivagiri Pilgrimage celebrations. It is, indeed, a very new and an appropriate way to begin the new year. A Happy New Year to all of you.

I belong to a generation that grew up on the values propagated by Srinarayana Guru – `the oneness of humanity’, with no social barriers on the grounds of caste, religion, region etc.  The slogan of `one caste, one religion, one god’ is an elevated expression of humanism which recognizes the value of a human being  as being supreme. A value that recognizes all human beings as being equal, irrespective of all social divisions.  This universality of oneness of humanity, in a sense, crystallizes the finest elements of  rational thought and philosophy that emerged in the course of the advance of human civilization in these lands.  As “different rivers flow through different courses to merge in the ocean”, so do different human beings through the practice of individual beliefs and faith eventually merge with humanity as a whole. This is humanism of the highest variety.

Such humanism has a strong resonance with the Communist philosophy and worldview.  The overriding concern of Marxism is humanism.  In fact, Karl Marx had once said, “Nothing human is alien to me”.  It is the pursuit of the simple question of what constitutes the real freedom of a human being and his consequent liberation, Marx proceeded to reject the Hegelian idea of the revolution of the mind as articulated by Feuerbach, during his time, to come to a conclusion of seminal importance.  This was: consciousness of a human being is determined by the social conditions and not vice a versa. “It is not the consciousness of men that determines their being, but on the contrary their social being that determines their consciousness”.

Marxism’s focus on changing the concrete conditions of material existence, as the basic pre-requisite for human liberation, emerges from this understanding and hence Marx’s own scientific study on the real living conditions of the people and his consequent dissection of capitalism.

It, indeed, sounds as a strange paradox that a practitioner of Marxism, a Communist foot soldier, a confirmed atheist has been invited to be here as a part of these pilgrimage celebrations.  A  great deal of controversy has always existed regarding the Marxist understanding of religion. The popular perception is the normally out of context quotation that “religion is the opium of the people”. In fact, deliberately, the passage in which this statement finds place is never quoted in the full. Marx had stated :”Religious distress is at the same time the expression of real distress and the protest against real distress. Religion is the sigh of the oppressed creature, the heart of the heartless world, just as it is the spirit of the spiritless situation. It is the opium of the people”.

Religion, is the opium in the sense that it is as potent as opium in transporting human beings to an illusory world. For a human being who is oppressed, religion provides the escape for  relief, it provides  a “heart in a heartless world, a spirit in a spiritless situation.” This is the strength and power of religion. It is like opium that the people are fed, to lull themselves into submission, robbing them of their inherent potential to change the real world, and hence, remain in conditions which appear outside of both their comprehension and control.

Marxism does not attack religion per se. It’s attack is on the conditions that give rise to the conditions that perpetuate the hold of religion on the people.  The point is to change the real world; to  transform the comforts of an illusory world into concrete reality. Therefore, as a Communist, we can assure you that the CPI(M) will be the foremost upholder of every individual’s right to his/her choice of their faith and their right to maintain their beliefs and propagate them.  We will defend,  till the last breath, this right of the individual choice and protect the faith of every individual. It, therefore, necessarily follows that we shall also protect everybody against any attempt to interfere into the rights of individual liberty of faith by any body of thought or action.  This is precisely what the communal forces attempt to do today.  The CPI(M)’s opposition to communalism is, hence, integral to both its philosophy and practice.

This growth of rabid communal polarization that we see around us today runs completely in contradiction with the body of thought and action that the Guru has bequeathed to us.   This rich legacy and the philosophical activities that the Guru undertook had heralded a movement for social renaissance in Kerala.  Remember, Swami Vivekananda had once described the Kerala society as a `mad house’ of casteism.  The Guru, through his philosophy of oneness of humanity,  spread the indomitable values of equality and humanism.  Kerala was a society where caste prejudices went beyond even the obnoxious practice of untouchability. In Kerala, there was the practice of unseability. Comrade EMS Namboodiripad used to tell us that in his childhood, it was not unusual to see some `unfortunate’ human beings carrying a bell around their neck whose sound would warn the  upper castes, to take a different path!

It was the social renaissance heralded by the Guru, amongst others, that has transformed this society into one with the most progressive values in the country today. In the process, Kerala society has achieved such advances in its human development indices that it matches and, in some cases, outstrips the standards existing in the developed capitalist countries today. In the field of literacy, education, gender equality and other social parameters, Kerala proudly stands at the top on the  rest of India.

The Guru used spirituality as a propelling force for upward social mobility of the people. In this process, he developed a unique combination of materialism and spiritualism, propagating The Buddha’s preachings of the control over the Body, Word, Mind, Food and Deed.   The consecration of the Shiva Lingam in 1888 – the Aruvippuram Prathishta – remains a landmark that has gone way beyond being a symbolic gesture.

Yet another resonance with Marxist philosophy is the Guru’s emphasis on “freedom through education, strength through organisation, economic independence through industry”.  In a sense, this brings me to the point of urging all of you to explore further a thought: Spiritualism is  not to be confined within the boundaries of religion or religiosity.  Of course, there is religious spiritualism which could also be call Theistic spiritualism. On the other hand, there is also an Atheistic spiritualism. Here, spiritualism is understood as the elevation of human  consciousness to the levels of refined humanism.  Such elevation of human consciousness can be achieved as much by a materialist philosophy as it can be through a Theistic theology.  (This is a tautological term, but I am using it only to emphasise the point.)

The Guru’s philosophy spread far and wide beyond the confines of Kerala. I am told that Mahatma Gandhi came here thrice during our freedom movement.  Gurudev Rabindranath Tagore came to meet the Guru in 1922. This surely was a meeting of minds.  Tagore had by then penned the Nobel Prize winning immortal lines to awaken India: “Where the mind is without fear and the head is held high; Where knowledge is free; Where the world has not been broken up into fragments by narrow domestic walls;”.

The Guru’s teachings and personal example appear to be not merely relevant but more necessary to meet the challenges before us today.  On the one hand, the material basis of  existence for the vast mass of our people and the country, as a consequence of embracing the neo-liberal policy trajectory by the Indian ruling classes, is deteriorating. Unless material needs are satisfied, the growth of spiritualism leading to social renaissance and, therefore, to cultural renaissance would be simply impossible.  The economic policies followed  by the current government at the Centre and, to a large extent, by the government in Kerala, only buttress such material regression of our people’s lives.  These policies need to be resisted and reversed.  This is one focus of CPI(M)’s activities today.

On the other hand, the CPI(M)’s other focus is against the growing communal polarization and the vicious pursuit of consolidating the Hindutva  communal vote bank politics which is leading to severe ruptures in our society that can well destroy the unity and integrity of India.  Under the present Central government, both these aspects of anti-people economic reforms and communal polarization constitute its singular agenda.  In the process, the communal forces even make an attempt to forcibly appropriate the Guru’s philosophy and legacy.

This, simply, cannot be allowed. Such efforts, in particular, have to be defeated in order to carry ourselves to higher levels of social and material existence as envisaged and propagated by the Guru.  The efforts to replace the  rich Indian history with Hindu theology and the evolution of the syncretic Indian philosophy with a monolithic Hindu theology will have to be resisted and defeated.

I wish the Srinarayana Guru Mutt all success in its efforts to relentlessly continue to propagate the Guru’s philosophy  and vision of the `oneness of humanity’ and not permit any effort at hijacking this rich legacy to serve the narrow ends of communal forces.

Thank you once again for giving me this honour of sharing some of my thoughts at this sacred Srinarayana Guru Mutt.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పోప్‌ ఏ కులంలో పుట్టాలనుకుంటున్నారో చెబితే సంతోషం

31 Thursday Dec 2015

Posted by raomk in Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Face book, Hinduthwa, misuse of facebook, pope, religions

పేర్లకీ, పుకార్లకీ కేంద్రంగా ఫేస్‌బుక్‌

ఎంకెఆర్‌

ఈ మధ్య ఫేస్‌బుక్‌లో ‘ పోప్‌ సంచలన వ్యాఖ్యలు…’అనే శీర్షిక కింద ఒకరు ఒక పోస్టు పెట్టారు. దానిలో ఇలా వుంది.’ నాకు ఏసుక్రీస్తు మీద నమ్మకం లేదు, కేవలం ఈ సుఖానికి బానిసలా గడుపుతున్నాను, మళ్లీ జన్మంటూ వుంటే భారతీయుడిగా హిందువుగా పుట్టాలని వుంది….పోప్‌, పోప్‌ వ్యాఖ్యల్ని సమర్ధించిన బ్రిటన్‌ ప్రధాని, తాను కూడా అదే కోరుకుంటున్నానని వెల్లడి ‘

దీనికి సంబంధించిన ఆధారాల న్యూస్‌ లింక్‌ తెలియచేయమని,లేనట్లయితే పోస్టు పెట్టిన వారిని హైదరాబాద్‌ ఎర్రగడ్డ లేదా విశాఖ ఆసుపత్రులలో చికిత్సకోసం చేర్చాల్సి వుంటుందని వ్యాఖ్యానించాను. దానికి సదరు వ్యక్తి ఇంక వేరే చోట్ల పిచ్చాసుపత్రులు లేవా, నేను ఈ పోస్టు పెట్టటానికి కారణం నేను ఏ మతానికీ మద్దతు ఇవ్వటం లేదు అని చెప్పటానికే అని ప్రత్యుత్తర మిచ్చారు. పిచ్చి ముదిరి రోకలిని తలకు చుట్టమన్నాడట వెనకటి కెవడో . ప్రశ్నకు సమాధానానికి ఏమైనా పొంతన వుందా ? ఫేస్‌బుక్‌, వాట్సప్‌ సామాజిక మాధ్యమం ఏదైనా కానివ్వండి ఎలాంటి ఆధారాలు, హేతువు లేకుండా సమాచారం పేరుతో ఏదిబడితే దానిని పోస్టు చేస్తున్నారు.చాకుతో నోటిని తీపి చేసే మామిడి కాయలు కోసుకోవచ్చు,జీవితాలను అంతం చేసే మెడకాయలనూ వుత్తరించవచ్చు. సామాజిక మీడియాను కూడా ఇలాగే దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం పతాకశీర్షికను చూసి లైక్‌ లేదా షేర్‌ చేయటం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.

నేను ఏ మతానికీ మద్దతు ఇవ్వటం లేదని చెప్పటానికి ఈ పోస్టు అన్న సమాధానం తప్పించుకోవటానికి ఆపద్ధర్మంగా ఏదో ఒకటి చెప్పటం తప్ప దానిలో నిజాయితీ లేదు.ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారంలో పెట్టేది మతోన్మాదులు తప్ప మరొకరు కాదు. అది మెజారిటీ లేదా మైనారిటీ ఎవరైనా కావచ్చు. పోప్‌, బ్రిటన్‌ ప్రధాని వంటి పెద్దల పేరుతో ఇలాంటి ఆధారం లేని అభూత కల్పనలు ఆపాదించి చౌకబారు ప్రచారాలు చేస్తున్నారు. మతం,కులం, ప్రాంతం వంటి కొన్ని అంశాలు వుద్రిక్తతలను రెచ్చగొట్టటానికి జనం మెదళ్లను కలుషితం చేయటానికి గాను పని గట్టుకొని ప్రచారం చేయటానికి మతశక్తులు పెద్ద యంత్రాంగాలనే నిర్వహిస్తున్నారు. వాటిని గమనించలేకపోతే సామాజిక మీడియాలో తమపేరు పదే పదే చూసుకోవాలి లేదా కనిపించాలని కోరుకొనే వారు పోప్‌ వ్యాఖ్యల వంటి అవాస్తవాన్ని బాధ్యతా రహితంగా లేదా తమకు తెలియకుండానే మండుతున్న మంటకు ఒక చితిని చేర్చటం తప్ప మరొకటి కాదు. దీనివలన ప్రజలకు ఒక ఆయుధంగా వున్న ఈ మీడియాకు ఇప్పటికే విస్వసనీయత తగ్గిపోయింది. ఫేస్‌బుక్‌ అంటే గర్ల్‌ఫ్రెండ్స్‌తో పిచ్చాపాటీ, పోసుకోలు కబుర్ల వేదికగా మారిందనేది అనేక మంది అభిప్రాయం, అలాంటివారందరూ క్రమంగా తమ ఖాతాలను మూసివేస్తున్నారు.ఎదుటివారి మీద బురదచల్లేందుకు , తప్పుడు సమాచారాన్ని ప్రచారంలో పెట్టాలనుకొనే ప్రమాదకర శక్తులు దీనిని వుపయోగించుకొనేందుకు ఎక్కువగా ముందుకు వస్తున్నాయి. అందువలన ఆధారంలేని పోస్టులు పెట్టి ప్రజల ఆయుధాన్ని పనికిరాకుండా చేయ వద్దని , బాధ్యతా యుతంగా వుండాలని మనవి.

పోప్‌కు ఆపాదించిన వ్యాఖ్యల విషయానికి వస్తే హిందూయిజం లేదా హిందూ మతాన్ని దుర్వినియోగం చేస్తున్న శక్తులు కేంద్రంలో అధికారంలో తిష్టవేశాయి. హిందూమతం పేరుతో వేల సంవత్సరాలుగా వునికిలోకి తెచ్చిన ఆచారాలు, నియమాలు, నిబంధనలన్నీ వర్తమాన కాలానికి తిరోగమనం తప్ప పురోగమనం కాదు. మన సమాజానికి అవి చేసిన హాని అంతా ఇంతా కాదు.అన్నీ వేదాల్లోనే వున్నాయష అంటూ కొత్త విషయాలకు దూరం చేశారు. అది ఘనీభవింపచేసిన కుల వ్యవస్ధ కర్ణుడు, ఏకలవ్యుల వంటి ఎందరో ప్రతిభావంతులను తెరమరుగు చేసింది. సమాజంలో శాస్త్రీయ ఆలోచనను మొద్దుబారచేసింది. పర్యవసానంగా పారిశ్రామిక విప్లవానికి దరిదాపుల్లో కూడా మన సమాజం లేకపోయింది.కులాల నిచ్చెన మెట్లతో అగ్ర, అధమ కులాలంటూ తోటి మానవులను పశువులకంటే హీనంగా ఇప్పటికీ చూస్తున్న ఈ దేశంలో నిజంగా పోప్‌ వంటి వారు పుట్టాలనుకుంటే ఆయన ఏ కులాన్ని కోరుకుంటారు? ఆవును వధిస్తే అంతం చూస్తాం అని వూగిపోతున్న అగ్రకులాల వారు అది ముసలిదయ్యో, జబ్బుచేసో చస్తే దాన్ని తీసి గోతిలో పాతిపెట్టటానికి మాత్రం ముందుకు రారు. తరతరాలుగా ఆ పనిచేస్తున్న దళితులు, గిరిజనులు ఎక్కడైనా మేం అలాంటి పని చెయ్యం అని నిరాకరిస్తే చచ్చిన ఆవు కోసం కూడా దాడులు చేసే అగ్రకులాల్లోనా వారి దాడులకు, అత్యాచారాలకు నిత్యం బలౌతున్న దళితుల, గిరిజనుల కడుపులోనా ? అటు దరి చేరనివ్వని అగ్రకులాలతో చెట్టపట్టాలు వేసుకోలేక ఇటు అనేక అంశాలలో తమకు దగ్గరగా వుండే దళితులు, గిరిజనులతో మమేకం కాలేక అటూ ఇటూ గాకుండా వుండే బీసీల్లోనా ? ఎక్కడ పుట్టాలనుకుంటున్నారో కూడా చెబితే సంతోషం. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్నట్లుగా వివేకానందుడి పేరును వుపయోగిస్తూ ఆచరణలో ఆయన స్ఫూర్తికి, ఆచరణకు పూర్తి భిన్నంగా వ్యవహరించే నేటి కుహనా హిందూత్వ నాయకుల మాటలు, చేష్టలను విన్న కన్నవారెవరూ భారత దరిదాపులకే రారు, అలాంటిది తిరోగమన హిందువుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ?

ఇక్కడ మరొక విషయాన్ని చెప్పుకోకపోతే అపార్ధం చేసుకొనే అవకాశం వుంది. మతాల చరిత్రను పరిశోధిస్తే,, పరిశీలిస్తే రోసిపోయిన ప్రతి మతంపై తిరుగుబాటుగానే కొత్త మతాలు వచ్చాయి. హిందూమతాన్ని వ్యతిరేకించి బౌద్ధం, క్రైస్తవాన్ని వ్యతిరేకించి ఇస్లాం పుట్టుకు వచ్చిన విషయం దాస్తే దాగదు. ప్రతి తిరుగుబాటు మతం ప్రారంభంలో పూర్వం వున్నదానికంటే అభ్యుదయంగానే వున్నకారణంగానే జనాలు ఆదరించారు.కొన్నాళ్లకు అవి కూడా పాత మతాల మాదిరే తిరోగమన స్వభావాన్ని సంతరింపచేసుకున్నాయి. జనానికి మత్తుమందు మాదిరి తయారై పురోగతికి ఆటంకంగా మారుతున్నాయి.

నాకు ఏసుక్రీస్తు మీద నమ్మకం లేదు, కేవలం ఈ సుఖానికి బానిసలా గడుపుతున్నానని పోప్‌ చెప్పినట్లుగా కూడా పైన పేర్కొన్న పోస్టులో పెట్టారు. పోప్‌ అలా మాట్లాడినట్లు ఆధారం లేదు కనుక దాన్ని పక్కన పెడదాం. ఈ రోజు అది హిందు, క్రైస్తవం, ఇస్లాం, బౌద్దం ఏమతాధికారి అయినా ఆ మతాలు చెప్పినట్లు చిత్తశుద్దితో సాదా సీదాగా గడుపుతున్న పెద్దను ఒక్కరినైనా ఎవరైనా చూపగలరా ? ప్రతి మత లేదా మతం పేరుతో జనం ముందుకు వచ్చే బాబా, స్వామీజీ, ఫాదర్‌లు, ముల్లా పేరు ఏదైతేనేం ఒక్కొక్కరు ఒక్కొక్కొ కుంభకోణానికో మరొక అక్రమానికో కేంద్రంగా మారుతున్నారా లేదా ? అందువలన దయచేసి ఇప్పటికే మన దేశం మతోన్మాద చిచ్చుతో మగ్గిపోతోంది. దానికి మరింత ఆజ్యం పోసే, రెచ్చగొట్టే పోస్టులు పెట్టి లేదా వాటిని అభిమానించి, పంచుకొని (లైక్‌లు, షేర్‌లు) ఆ చిచ్చును పెంచవద్దని మనవి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d