• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: BJP

ఏం చెప్పారు మోడీజీ వహ్వా ! వహ్వా !!

30 Wednesday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

BJP, Farm prices, Farmers, MSP, Narendra Modi, Narendra Modi Failures, narendra modi namo mantra, Narendra Modi sarkar

యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది

ఎం కోటేశ్వరరావు

     2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయటానికి ఏడు సూత్రాల పధకాన్ని రూపకల్పన చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.గతంలో రైతుల ఆదాయాల గురించి కాకుండా వ్యవసాయ వుత్పత్తులు పెరగటానికి ప్రాధాన్యత ఇచ్చారు. నేను దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాను, కేవలం సవాలే కాదు మంచి వ్యూహాన్ని కూడా రచించాను, పకడ్బందీగా రూపొందించిన కార్యక్రమాలు, తగినన్ని వనరులు, అమలులో సుపరిపాలన కారణంగా ఈ లక్ష్యాన్ని సాధించగలం అన్నారు. బ్లూమ్‌బెర్గ్‌ ఇండియా ఆర్ధిక

వేదిక కార్యక్రమంలో ప్రధాని ఈ విషయాలను చెప్పారు.ఆ ఏడు సూత్రాలు ఏవంటే

1. ఒక చుక్కనీటికి ఎంతో పంట లక్ష్యంగా సాగునీటి పధకాలకు భారీ బడ్జెట్‌

2. ఆహార ప్రక్రియ ద్వారా అదనపు విలువ చేకూర్చటం

3. 585 కేంద్రాలలో ఎలక్ట్రానిక్‌ ఫ్లాట్‌ ఫారాల ద్వారా ఒకే విధంగా వుండేట్లు చూడటం, జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు

4. ప్రతి పొలం భూసారాన్ని బట్టి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు

5. భారీ పెట్టుబడులతో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటు ద్వారా పంట చేతికి వచ్చిన తరువాత నష్టాల తగ్గింపు

6.చెల్లించగలిగిన ధరలలో కొత్త పంటల బీమా పధకం

7. వ్యవసాయానికి అనుబంధంగా కోళ్లు, తేనెటీగలు, చేపల పెంపకాలకు ప్రోత్సాహం

    ఈ చర్యల ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఎంతో విశ్వాసంతో వున్నట్లు ప్రధాని చెప్పారు. తన ప్రభుత్వ విధానాలు రైతుల కేంద్రంగా, నూతన ఆదాయ మార్గాలుగా వున్నాయని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌ స్వయంగా తనకు లేఖ రాసినట్లు ప్రధాని చెప్పారు.

     ప్రధాని త్వరలో అధికారానికి వచ్చిన రెండో వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. నిజానికి ఒక చొక్కా విప్పి రెండో చొక్కా తగిలించుకున్నట్లుగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏకంగా ప్రధాని అయ్యారు. ఆందువలన ఆయనకు అనుభవం ప్రత్యేకంగా అవసరం వుందని ఆయనా అనుకోలేదు,జనం కూడా భావించలేదు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలలో రైతులకు వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వుండేట్లు చూస్తామని బిజెపి తన ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్నది. అది అమలులోకి రావాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల, ఆ మేరకు అవసరమైతే ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దింపటం. రైతాంగానికి ఆ మేరకు ధరలు పెంచటానికి పార్లమెంటుతో పని లేదు, ప్రతిపక్షాల మద్దతు అంతకంటే అవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్‌ ఆ దిశగా యాభైశాతం ఒక్కసారిగా పెంచకపోయినా ఐదు సంవత్సరాలలో యాభై శాతం పెరిగేట్లుగా ఏటా పదిశాతం చొప్పున ఎందుకు పెంచలేదు. అంటే ప్రధాని మన్‌కి బాత్‌ వుపన్యాసం వినమని చెప్పటం తప్ప ఎదురు చూస్తున్న కిసానోంకి బాత్‌ గురించి చివరికి దేశానికి దిగివచ్చిన దేవదూత నరేంద్రమోడీ అని స్త్రోత్ర పారాయణం చేసిన మన వెంకయ్యనాయుడు కూడా ఎక్కడా సమాధానం చెప్పినట్లు మనకు తెలియదు.

     ప్రణాళికా సంఘం స్ధానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌కు వ్యవసాయంపై సలహాదారుగా వున్న అశోక్‌ గులాటీ ‘దేశంలో వున్న పరిస్థితి తీవ్రతను ఎన్‌డిఏ ప్రభుత్వం పూర్తిగా గ్రహించినట్లు లేదు, కొన్ని రాష్ట్రాలలో 20శాతం వరకు ఆహార ధాన్యాల వుత్పత్తి పడిపోయింది. ప్రభుత్వం నిరంతరం రైతాంగాన్ని ఆదుకొనే వ్యవస్ధను ఏర్పాటు చేయనట్లయితే 1960 దశకంలో మాదిరి ఆహార కొరత ఏర్పడే అవకాశం వుంది’ అని కొద్ది నెలల క్రితం వ్యాఖ్యానించారు.ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారమే అనేక వ్యవసాయ వుత్పత్తులకు రైతులు తక్కువ ధరలను పొందారు. గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు వ్యవసాయ ఖర్చుల మరియు ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రకారం ఏ ఒక్క వుత్పత్తి ధర యాభైశాతం కాదు కదా ఆ సమీపంలో కూడా లేదు. అనేక రాష్ట్రాలలో ఆ ధరలు అమలు కాని స్ధితి కూడా వుంది. అసలు ఖర్చుల లెక్కింపు విధానమే లోపభూయిష్టం. జిడిపి లెక్కింపు విధానం, దారిద్య్రరేఖ ఎంత వుండాలి వుండకూడదు అని తర్జభర్జనలతో మార్పు గురించి ఆసక్తి చూపిన కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే వ్యవసాయ ఖర్చుల లెక్కింపు విధానంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ప్రధాని తన మనసులోని మాటలో గానీ ఇతర చోట్లగానీ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపరు ? తాజాగా ఆయన చెప్పిన ఏడు సూత్రాలలో కూడా ముఖ్యమైన ఈ అంశం చోటు చేసుకోలేదు. గతేడాది మన ప్రభుత్వం గోధుమలకు ఇచ్చిన ధర టన్నుకు 226 డాలర్లయితే ఇదే సమయంలో పాకిస్థాన్‌ చెల్లించిన ధర 320 డాలర్లు.

    రైతాంగానికి కనీస మద్దతు ధరలను పెంచకపోవటానికి కారణాలు ఏమిటి ? రైతులకు మద్దతు ధరలు పెంచితే వినియోగదారులకు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది కనుక పెంచవద్దని ప్రభుత్వ ఆర్ధికవేత్తలైన అరవింద్‌ సుబ్రమణ్యం, పంగారియా వంటి వారు జారీచేసిన హెచ్చరికలకు లొంగిపోయింది మోడీ సర్కార్‌.పోనీ ద్రవ్యోల్బణం పెరగ కుండా స్ధిరంగా వుందా అంటే ఆరునెలలకు ఒకసారి వుద్యోగులకు పెంచుతున్న కరువు భత్యమే లేదనేందుకు పక్కా నిదర్శనం. పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో 2012-13నుంచి 2017-18 మధ్య కాలంలో సగటున ఏడాదికి నాలుగు శాతం వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇంతవరకు వాస్తవంలో రెండుశాతానికి మించలేదు. కొత్త బడ్జెట్‌లోగానీ, నరేంద్రమోడీ ఎన్నికల సభలు, రైతుల సభలలో గానీ ఎక్కడా తమ ఎన్నికల వాగ్దానం గురించి కనీస ప్రస్తావన కూడా చేయకుండా ఆరు సంవత్సరాలలో ఆదాయం రెట్టింపు గురించి చెబుతున్నారు. అసలు విషయం ఏమిటి ?

     గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ప్రభుత్వం వాగ్దానం చేసిన వ్యవసాయ ఖర్చులపై 50శాతం లాభం చేకూర్చేవిగా లేవంటూ రైతు సంఘాల కూటమి గతేడాది సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దానికి వివరణ ఇస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది. అందుకే వ్యవసాయంతో పాటు కోళ్లు,చేపలు, తేనెటీగలు పెంచుకోండని నరేంద్రమోడీ వుచిత సలహాలు ఇస్తున్నారు. ఆయన పుట్టక ముందునుంచే రైతాంగం ఆ పని చేస్తున్నది.

    రోడ్లు వేసేందుకు విదేశాల నుంచి తెచ్చుకున్న అప్పులు చెల్లించేందుకు లేదా ఆ కంపెనీలు నిర్వహిస్తున్న టోల్‌ టాక్సును ద్రవ్యోల్బణం ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. విదేశీ అప్పులను మన రూపాయల్లో కాకుండా డాలర్లలో చెల్లిస్తున్నారు. వుద్యోగులకు ఆరునెలలకు ఒకసారి ద్రవ్యోల్బణం ప్రాతిపదికన కరువు భత్యం చెల్లిస్తున్నారు. అదే విధంగా అమలు జరిపినా లేకపోయినా పారిశ్రామిక కార్మికులు, ఇతరులకు కూడా ద్రవ్యోల్బణ ప్రాతిపదికన కరువు భత్యం నిర్ణయిస్తున్నారు. రూపాయి విలువ పతనమైతే రైతాంగం కొనే డీజిల్‌, పెట్రోలు, ఎరువులు, పురుగుమందులు ధరలు ఎప్పటికపుడు పెరుగుతాయి. విద్యుత్‌, బొగ్గు, వుక్కు వంటి సంస్ధల వుత్పత్తులకు కనీస లాభాలను నిర్ణయించే విధానం వుంది. కానీ రైతాంగం విషయానికి వచ్చే సరికి అడ్డగోలు వ్యవహారం తప్ప ఒక నిర్ణీత విధానం, ప్రాతిపదిక లేదు. ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పెట్రోలు,డీజిల్‌ ధరలను సవరిస్తున్న కేంద్రం రైతాంగ వుత్పత్తులకు కొన్నింటికి అసలు మద్దతు ధరల నిర్ణయ విధానమే లేదు. వున్నవాటికి కూడా ఏడాదికి ఒకసారి నిర్ణయిస్తారు. అవి అమలు జరగనపుడు అమలు జరిపే యంత్రాంగం లేదు.ఎందుకీ పరిస్థితి?

    2015లో వార్షిక ఇంక్రిమెంట్లు గాక వుద్యోగులకు 13శాతం కరువు భత్యం పెరిగింది.అదే ధాన్యం కనీస మద్దతు ధర 3.25శాతం, గోధుమలకు 5.2శాతం పెరిగింది. విజయ మాల్య, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటి వారి కంపెనీలు బకాయిలు చెల్లించకుండా వున్నపుడు ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అనో పరిశ్రమలను ఆదుకొనే పాకేజి పేరుతోనో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ఆదుకుంటున్నాయి. మరి వరుసగా కరువుల పాలవుతున్న రైతులకు ఇలాంటి పాకేజీలు ఎందుకు వుండవు?

    పప్పు ధాన్యాల ధరలు పెరిగాయని జనం గగ్గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని దిగుమతి చేసుకొనేందుకు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీన్నే అప్పు చేసి పప్పుకూడు అంటారు. అదే మన రైతాంగానికి చెల్లిస్తే కావలసినన్ని పప్పులు పండించరా ? విలువైన మన విదేశీమారక ద్రవ్యం మిగులు తుంది, మనరైతుల జేబుల్లో నాలుగు డబ్బులు వుంటాయి. వాటిని ఇతర వస్తువుల కొనుగోలుకు వుపయోగిస్తారు కనుక, పరిశ్రమలు, వాణిజ్యాలు కూడా పచ్చగా వుంటాయా లేదా ? ఆ పని ఎందుకు చేయరు?

   పన్నెండవ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి లక్షా యాభైవేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు గొప్పగా చెప్పుకుంటారు. న్యూఢిల్లీ విమానాశ్రయ లావాదేవీలలో లక్షా 62వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్‌ పేర్కొన్నది . అరవై కోట్ల మంది రైతుల కుటుంబాల కంటే కొన్ని లక్షల మంది ప్రయాణించే విమానాశ్రయానికి ప్రాధాన్యత ఎక్కువ వున్నట్లు స్పష్టం కావటం లేదూ ? గత ప్రభుత్వ విధానాలతో పోల్చితే నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని మార్చిందేమీ లేదు. గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది. మరి తాజాగా నరేంద్రమోడీ ప్రకటించిన ఏడు సూత్రాలు ఈ సంఖ్యను తగ్గిస్తాయా?పెంచుతాయా? తగ్గించాలనే కోరుకుందాం .

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేన్ని సహించాలి? దేన్ని సహించకూడదు ?

28 Monday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

ANTI NATIONAL, BJP, Intolerance, NATIONAL, RSS, Tolerance, what is tolerable

 ముందు మీరు దేశభక్తులో కాదో తేల్చుకోండి, వీలైతే ఒక సర్టిఫికెట్‌ కూడా సంపాదించండి. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డున్నా లేకపోయినా దేశభక్తి కార్డు లేకపోతే రోజులు గడిచేట్లు లేవు. ఎందుకొచ్చిన తిప్పలు, రేపు పొద్దున్నే ఎవరైనా వచ్చి ఏ ఇంట్లో ఎంత మంది దేశభక్తులున్నారో వ్యతిరేకులున్నారో లెక్కలు తీసే రోజులు

ఎంకెఆర్‌

    తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ! మళ్లీ అదే, మళ్లీ మళ్లీ అదే !! నిర్మొహమాటంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచాన్ని వూపివేస్తున్న వినిమయదారీ తత్వం నేటి తరాలకు నేర్పుతున్నది అదే. మనకు తెలియకుండానే దీనిలో పడిపోతున్నాం. దీని ఒక లక్షణం ఏమంటే ప్రశ్నించేతత్వాన్ని మొదట అది నాశనం చేస్తుంది. ఇప్పుడు ప్రతి వారి చేతిలో కనిపించే సెల్‌ ఫోన్నే తీసుకుందాం. మనకు అంత వెల వున్న సెల్‌ఫోన్లు అవసరమా అని ఆలోచించేవారెందరు? ఫీచర్లు తక్కువ వున్న సెల్‌ ఫోన్‌ ఎవరి చేతుల్లో అన్నా చూస్తే వారిని పాతకాలం వారనుకుంటున్నామా లేదా ?

    ఇలాంటి స్థితిలో ఏ దేవుడు లేక దయ్యం వలన బుద్ధి పుట్టిందో గానీ కొంత మంది సైద్ధాంతిక యుద్ధానికి తెరలేపారు. యుద్ధం అంటే ముందు బలయ్యేది నిజం. వాస్తవాలు అడుగు దూరం ప్రయాణించేలోపు అవాస్తవాలు వంద అడుగులు వెళ్లి కొత్త రూపంలో మనదగ్గరకే తిరిగి వచ్చి మనలను కూడా అనుమానంలో పడేస్తాయి. మహాభారత, రామాయణాలు మనకు చెప్పినది అదే. అందువలన సైద్ధాంతిక యుద్ధంలోని ఒక పోరులో తాము విజయం సాధించామని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించేశారు. అలా వాదించకపోతే ఆయన ప్రముఖ లాయర్‌ ఎలా అవుతారు. హత్య చేసిన వ్యక్తి తరఫున వాదించటానికే పేరు మోసిన లాయర్లు అవసరం. మా కక్షిదారు ఎలాంటి వాడు అంటే అసలు కత్తి అనేదే తెలియని అమాయకుడు, అలాంటి వ్యక్తి ఆ రోజు అసలు అక్కడ లేడు, ఈ హత్య చేయలేదు అని బల్లచరిచి మరీ వాదిస్తాడు. సైద్దాంతిక పోరులో విజయం సాధించామని ఏకపక్షంగా ప్రకటించుకోవటంలో మతలబు అదే.

     చిత్రం ఏమంటే రెండు సంవత్సరాల క్రితం బిజెపి ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక, చేసిన వాగ్దానాలు, ప్రసంగాలలో ఎక్కడా దేశంలో తాము సైద్దాంతిక యుద్ధాన్ని ప్రారంభిస్తామని చెప్పలేదు. నల్లధనాన్ని వెనక్కు తెచ్చి ప్రతి ఒక్కరికీ పదిహేనులక్షల వరకు పంచుతామని, రైతాంగానికి రెట్టింపు ఆదాయాలు సమకూర్చుతామని, ధరలు తగ్గిస్తామని, అన్నింటికీ మించి మేకిండియా పేరుతో ప్రపంచం మొత్తానికి వస్తువులను ఇక్కడే తయారు చేసి ఇక్కడి నుంచే సరఫరా చేస్తామని, ఆ విధంగా వుద్యోగ కల్పన చేస్తామంటూ ఎన్నోఎన్నో వాగ్దానాలు చేశారు.జౌరంగజేబును ఆదర్శంగా తీసుకొని జనం మీద చెత్తపన్ను వేశారు. అదేం చిత్రమో గాని పన్ను వసూలు చేస్తున్నారు గానీ చెత్తను తీయటం లేదు. వాటి అమలుకు అసలు ప్రయత్నమే లేదు గానీ చెప్పని అంశంలో మాత్రం విజయం సాధించారట !

    మీ పిచ్చిగానీ ఇవన్నీ ఎవరికి పట్టాయి. ముందు మీరు దేశభక్తులో కాదో తేల్చుకోండి, వీలైతే ఒక సర్టిఫికెట్‌ కూడా సంపాదించండి. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డున్నా లేకపోయినా దేశభక్తి కార్డు లేకపోతే రోజులు గడిచేట్లు లేవు. ఎందుకొచ్చిన తిప్పలు, రేపు పొద్దున్నే ఎవరైనా వచ్చి ఏ ఇంట్లో ఎంత మంది దేశభక్తులున్నారో వ్యతిరేకులున్నారో లెక్కలు తీసే రోజులు వచ్చాయని ఒక మిత్రుడు చలోక్తి విసిరాడు.

      మా పక్కింటి పెద్దాయన కూడా రోజులు బాగాలేవు సార్‌, సర్దుకు పోవాలి అన్నాడు. అదేంటి సార్‌ మరి ఆటు, పోట్లను ఎదుర్కొని నిలవటమే జీవితం అని కదా పెద్దలు చెప్పారు? ఆటు పోట్లను ఎదుర్కోవటం అంటే సాధారణ అర్ధంలో కష్ట సుఖాలు అని, అలాగాక నిజమైన అర్ధం ప్రకారం వాటికి ఎదురు నిలవమని కాదు. ఎవరైనా అలా నిలబడితే సముద్రం మింగేస్తుంది. ఆటు, పోట్లు వచ్చినపుడు వెనక్కి వంగి తప్పించుకోవాలి తప్ప ఎదురు నిలబడి నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోమని కాదు అన్నారు.(పోటు అంటే సముద్రం మీద నుంచి లేచే అలలు తీరానికి రావటం, ఆటు అంటే తీరానికి వచ్చిన అలలు తిరిగి సముద్రంలోకి పోవటం, కొన్ని సందర్భాలలో అవి చాలా తీవ్రంగా వుంటాయి. వాటికి ఎదురు నిలబడితే ప్రాణాలకే ముప్పు)

     ఇటీవలి కాలంలో దాదాపు అన్ని రంగాలలో ఎలాంటి సైద్ధాంతిక, మేథో,విద్యాపరమైన చర్చలు మృగ్యమైన కారణంగా ప్రతి ఒక్కరూ బి పాజిటివ్‌ అన్నట్లుగా వుంటున్నారు. ఏదైనా ఒక విషయంపై ఒక అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా, విమర్శనాత్మకంగా చెప్పినా, చెప్పేందుకు ప్రయత్నించినా మీ రెందుకు ప్రతిదానికీ బస్తీమే సవాల్‌ అంటారు, కావాలంటే మీ అభిప్రాయాలు మీరు వుంచుకోండి, మాకు చెప్పండి, భరించక తప్పదు కదా, ఇతరులు ఏది నమ్మితే మీకెందుకు, వారిష్టం వచ్చినట్లు వారుంటే మనకు నష్టమేమిటి ? అని కుటుంబ సభ్యులే వెనక్కు లాగుతారు. ఇంకా కొందరు మనకెందుకులే దుష్టుడికి దూరంగా వుండాలన్నట్లు వినీ వినట్లు తప్పించుకుంటారు.

      అంటే దీని అర్ధం ఏమిటీ ఎక్కడ ఏం జరిగినా, ఎవరేం చెప్పినా మనం ఆలోచించకూడదు, బుర్రకు పని పెట్ట కూడదు, దేనినీ పట్టించుకోకూడదు, మన అభిప్రాయాలు వెల్లడించకూడదు, మనం అసలు మాట్లాడ కూడదు, ఏదైనా వుంటే మనలోనే అణచివేసుకోవాలి. అప్పుడే అంతా మనతో బాగుంటారు, మనమూ బాగుంటాము. ప్రతిదానికీ ఇతరులతో దెబ్బలాటలకు దిగటం ఎందుకు ? కానీ గత చరిత్ర అంతా అలా లేదే. పోరాటాల మయం ! ముందుకే మున్ముందుకే !! కౌరవులు దుష్టులు మన కెందుకులే వారి పాపాన వారు పోతారులే అని కృష్ణుడు వూరుకుంటే బకుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, కంసుడు మొదలైన వారందరిదీ పై చేయి వుండేది. ప్రపంచంలో తనకు ఎదురు లేదు అని విర్రవీగిన అలెగ్జాండర్‌ను పురుషోత్తముడు అడ్డగించకపోతే, ఫాసిస్టు హిట్లర్‌ను కమ్యూనిస్టు స్టాలిన్‌ అడ్డుకొని వుండకపోతే ప్రపంచ పరిణామాలు ఎలా వుండేవి? చచ్చిన చేప వరదలో కొట్టుకుపోతుంది. బతికి వున్న చేప ఎదురు ఈదుతుంది. మనం ఎవరిగా వుండాలి?

    మహాభారతంలో సహనం, సంయమనం గురించి ఎన్నో పాఠాలు వున్నాయి.కంసుడి వంద తప్పుల వరకు కృష్డుడు సహించి సంయమనం పాటించాడు. అందువలన దేన్ని సహించాలి,దేన్ని సహించకూడదు అని ఈ రోజు మనం కొత్తగా ఆలోచించనవసరం లేదు. చరిత్రే మనకు నేర్పింది. పులి మనుషులకు హాని చేయనంతవరకు దాని మానాన దాన్ని అరణ్యంలో తిరగనివ్వాలి. అది జనారణ్యంలోకి వస్తే బోనులో బంధించి తిరిగి అడవిలో వదలి వేయాలి. అదే అదుపు తప్పితే ఏం చేయాలో చెప్పనవసరం లేదు.

    మీరు ప్రజల నమ్మకాలను గౌరవించాలి అంటారు. నిజమే ! భక్తితో అగ్ని గుండం మీద నుంచి నడిస్తే ఏమి కాదు అన్నది ఒక నమ్మకం. అది హిందువులు, ముస్లింలలోనూ వున్న ఒక మూఢనమ్మకం అని చెప్పేందుకు హేతువాదులకు హక్కు వుందా లేదా? అలాగాక మా విశ్వాసాన్ని, మనో భావాలను దెబ్బతీస్తున్నారని ఎవరైనా దెబ్బలాటలకు వస్తే సహించాలా ? ఎదుటివారి అభిప్రాయాలను విను, సబబనిపిస్తే అంగీకరించు లేకుంటే అనుభవించు అని ముగించటం తప్ప చేసేదేముంది? హేతువాదుల మాటలను ఖాతరు చేయకుండా గతేడాది కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఒక కాళికాంబ ఆలయం దగ్గర బసవన నడక పేరుతో అగ్ని గుండంలో నడిచిన ఒక పూజారి గుండంలో పడిపోయి ఆరు రోజుల తరువాత దుర్మరణం చెందాడు. అందువలన మరొకరు అలాంటి పని చేస్తే వద్దని వారించకుండా వుండాలా, పోతే పోతాడు లెమ్మని చూస్తూ వూరుకోవాలా, పశువులకూ మనకూ తేడా ఏముంటుంది? అయితే వారికి ఎలా చెప్పాలి. చాలా మంది అలా నడుస్తున్నారు కదా వారికెందుకు ప్రాణాల మీదకు రాలేదు అనే వారిని ఒకరికైనా ఎందుకు వచ్చిందో, విశ్వాసం ఎందుకు కాపాడలేకపోయిందో చెప్పమనాలి.

    ఎవరైనా అలాంటి మూఢనమ్మకాలు కలిగి వుంటే బాబూ మంచిది కాదు అని చెప్పాలి. కాదు నా యిష్టం అంటే , నీ మనోభావాలను ఎందుకు దెబ్బ తీయాలి, ఎలాంటి అభిప్రాయాలు కలిగి వుండాలన్నది నీ హక్కు అంటూ దానిని గౌరవించటం తప్ప మరొక పద్దతి లేదు.వాటిని ఇతరులకు శాంతియుత పద్దతుల్లో వెల్లడించటాన్ని కూడా మనం గౌరవించాలి, సహించాలి.

    కానీ నీకు దేవుడి మీద నమ్మకం లేదు, మన కాలనీలో నువ్వుండటం వల్లనే ఈ ఏడాది వర్షాలు పడలేదు, నువ్వు మంచోడివి కాదు అనే ఎదుటి వారి నమ్మకాన్ని గౌరవించాలా ? వారి అభిప్రాయాన్ని వారిని వ్యక్తం చేయనివ్వండి, నష్టం లేదు, దానితో అంగీకరించాల్సిన అవసరం లేదు. సమాజంలో కొంత మంది చేత బడి చేస్తున్నారనే ఒక మూఢనమ్మకం వుంది. దానికి విరుగుడు పేరుతో లెక్కలేనన్ని పూజలు కూడా వున్నాయిగా నమ్మకం వున్న వారిని చేయించుకోనివ్వండి, డబ్బులు వదిలించుకోనివ్వండి. కానీ చేతబడి చేస్తున్నారనే పేరుతో ఎవరిమీదైనా దాడులు చేస్తే, చంపటానికి ప్రయత్నిస్తే సహించకూడదు. ఇలాంటి దాడులకు గురవుతున్నవారెరు. ఎక్కువ మంది దళితులు, ఇతర బలహీన వర్గాల వారే. నిజానికి వారికి అలాంటి శక్తులే గనుక వుంటే వారిపై దాడులు, అత్యాచారాలకు పాల్పతున్నవారిని ఎప్పుడో రిమోట్‌ కంట్రోలు మాదిరి తమ గుడిసెల్లో వుండే మట్టుబెట్టి వుండేవారు.

    కానీ వాస్తవానికి డబ్బున్నవారు, ధనికులు, డబ్బు లేక పోతే లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ బాబాలు, చేతులు, కాళ్లు చూసే జ్యోతిష్కుల వంటి రకరకాల వ్యక్తుల చేత క్షుద్రపూజలు, హోమాలు చేయిస్తున్నారా లేదా ? చేతబడికి, వాటికీ తేడా ఏమిటి? చేతబడి అంటే భయపడతారు, హోమం, పూజలు అంటే చేతులు కట్టుకు ప్రణమిల్లుతారు. మరి అలాంటి వాటిని గౌరవించాలా? అవసరం లేదు. అయితే అవి చేసే వారితో తగాదా తెచ్చుకోనవసరం లేదు.

    సహనం, అసహనం, దేశభక్తి, దేశ ద్రోహి, మాత, పిత వంటి అంశాలు సమాజంలో ఎప్పటి నుంచో వున్నాయి. అవి ఎప్పుడు వెలుగులోకి వస్తాయంటే ఏదైనా ఒక పరిణామం సంభవించినపుడు దాని స్వభావాన్ని బట్టి ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. వుదాహరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ , అది 1925లోనే ఒక స్వచ్చంద సంస్ధగా ఏర్పడింది. అయితే దానిలో ఒకప్పుడు సభ్యుడిగా వున్న గాడ్సే 1948 జనవరి 30న మహాత్మా గాంధీని హత్య చేసినపుడే దాని భావజాలమేమిటో దేశానికి తెలిసింది. తరువాత సుప్రీం కోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వం దానిపై విధించిన నిషేధాన్ని తొలగించారు. అప్పుడు సుప్రీంకోర్టు విధించిన షరతు ప్రకారం దేశ రాజ్యాంగానికి బద్దులమై వుంటామని, త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా గౌరవిస్తామని రాతపూర్వంగా ఆర్‌ఎస్‌ఎస్‌ విధేయత పత్రాన్ని అందచేయాలి.ఈ విషయాలను బహిరంగంగా ప్రకటించాలి.ఆ మేరకు 1949 ఏప్రిల్‌ 11న నాటి అధిపతిగా వున్న ఎంఎస్‌ గోల్వాల్కర్‌ ఒక ముసాయిదా ఆర్‌ఎస్‌ఎస్‌ నిబంధనావళిని కేంద్ర ప్రభుత్వానికి అందచేశారు. దానిని పరిశీలించి అంగీకరిస్తూ అదే ఏడాది జూలై 11న నిషేధాన్ని ఎత్తివేశారు.అంటే స్వాతంత్య్రం వచ్చిన రెండు సంవత్సరాల వరకూ ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వాతంత్య్రం లేదు, రాజ్యాంగం, త్రివర్ణ పతాకం పట్ల గౌరవం లేదు, ఇవేవీ లేకపోయిన తరువాత వారి దేశభక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది. దేశంలో అనేక సాంస్కృతిక సంస్ధలున్నాయి. ఏది కూడా ఇలా రాజకీయాలు చేయలేదు. పోనీ స్వాతంత్య్రానికి ముందు తమది స్వచ్చంద సంస్ధ అని చెప్పుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ త్రివర్ణ పతాకం బదులు కాషాయ పతాకాన్ని జాతీయ జండాగా ఆమోదించాలని తన పత్రిక ఆర్గనైజర్‌లో 1947 జూలై 17న రాసింది. అదే నెల 22న రాజ్యాంగ పరిషత్‌ జాతీయ పతాకాన్ని ఆమోదించింది. తరువాత స్వాతంత్య్రానికి ఒక రోజు ముందు ఆగస్టు 14 ఆగస్టు సంచికలో ఆర్గనైజర్‌ జాతీయ జెండా గురించి విషం కక్కింది. కాషాయ పతాకం వెనుక రహస్యం అనేపేరుతో రాసిన వ్యాసంలో ‘ ప్రారబ్దం కొద్దీ అధికారానికి వచ్చిన వారు మన చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పెట్టి వుండవచ్చు, కానీ దానిని హిందువులెవ్వరూ గౌరవించరు, స్వంతం చేసుకోరు. మూడు అంటేనే కీడు, మూడు రంగులు కలిగిన ఒక జెండా అనివార్యంగా దేశంపై మానసికంగా తీవ్రమైన చెడు ప్రభావాన్ని , వుపద్రవాన్ని కలిగిస్తుంది.’ అని పేర్కొన్నది. పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవ రోజైన 1947 ఆగస్టు 14న, 1950 జనవరి 26న ఆర్‌ఎస్‌ఎస్‌ నాగపూర్‌లోని తన ప్రధాన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. తరువాత నిలిపివేసింది. 2001లో రాష్ట్రప్రేమీ యువదళ్‌ పేరుతో వున్న ఒక సంస్ధకు చెందిన బాబా మెంధే, రమేష్‌ కుమార్‌ కాలంబే, దిలీప్‌ చట్టానీ అనే వారు రిపబ్లిక్‌ దినోత్సవం రోజున నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం వద్ద బలవంతంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు, పదకొండు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన తరువాత 2013లో విడుదలయ్యారు.ఆ వుదంతం తరువాత 2002 నుంచి అంటే స్వాతంత్య్రం వచ్చిన 50 సంవత్సరాల తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ తొలిసారి తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసింది.రాజ్యాంగం, జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని రాతపూర్వంగా రాసి ఇచ్చిన సంస్ధ దేశభక్తి ఇది.

     ఇలాంటి వారు ఇప్పుడు రాజ్యాంగంలో లేని భారత మాతాకు జై అంటేనే దేశ భక్తి అని అనని వారు వారు దేశద్రోహులు అని చిత్రిస్తున్నారు. దాన్నొక సైద్ధాంతిక యుద్ధంగా వర్ణించి దానిలో తాము తొలి విజయం సాధించామని చెప్పుకుంటున్నారు. చరిత్ర పట్ల, జనం జ్ఞాపక శక్తి పట్ల ఎంత చిన్న చూపు.వుల్లికి మల్లికి తేడా తెలియనంత అమాయకంగా జనం వున్నారనుకుంటున్నారా ? మల్లె తోటలో నాటి నంత మాత్రాన వుల్లి మల్లి అవుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

27 Sunday Mar 2016

Posted by raomk in AP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Telangana

≈ Leave a comment

Tags

BJP, KCR, police attack, Rohith Vemula, University of Hyderabad (UoH), UoH

ఎం కోటేశ్వరరావు

    ‘రోహిత్‌ చనిపోతే నేను వెళ్లలేదు… రకరకాల నేతలు పరామర్శకు వచ్చారు, నేను వెళ్లటం మంచిదా అన్న మీమాంసలో మౌనంగా వుండాల్సి వచ్చింది. ఏ సిఎం కూడా ఇలా జరగాలని కోరుకోడు’ :ముఖ్యమంత్రి కెసిఆర్‌

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

    ఇంతకీ ఇన్ని రోజుల తరువాతైనా మీ మాంస తీరిందా? కొనసాగుతోందా? కొత్తది తలెత్తిందా ? అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా పాడు పొట్టకు అన్నమే వేతామురా , పోయినోడు ఎలాగూ పోయాడు, కేంద్రంలో బతికి వున్నవారితో తగాదా ఎందుకు ? పోనందుకు విమర్శలు ఎలాగూ రానే వచ్చాయి. నిండా మునిగిన వాడికి చలేమిటి ?

    ‘రోహిత్‌ వేముల మరణం దురదృష్టకరం ‘:ముఖ్యమంత్రి కెసిఆర్‌

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

     రోహిత్‌ మరణానికి కారకడని విద్యార్ధులు వేలెత్తి చూపుతున్న వైస్‌ ఛాన్సలర్‌, అతగాడిపై ఎస్‌సిఎస్‌టి అత్యాచారాల చట్టం కింద పెట్టిన కేసుపై ఇంతవరకు ఏ చర్యా తీసుకోకపోవటానికి…. తస్సాదియ్యా ఇంకా పెద్దమ్మలా పట్టుకున్న మీ మాంస కొనసాగటమే కారణం, దొడ్డిదారిన వచ్చి విద్యార్ధులను రెచ్చగొట్టిన వ్యక్తికి ప్రాణహాని తలెత్తిందనే సాకుతో విద్యార్ధులను చావబాదటం, బెయిలు రాని కేసులు పెట్టటం పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం ! ఎలాంటి శషభిషలు లేకుండా పోలీసు చర్యలను సమర్ధించటం ఏ ముఖ్యమంత్రికైనా పూర్వజన్మ సుకృతం !

    ‘ విసి ఛాంబర్‌ వద్దకు విద్యార్ధులు పోయినపుడు వారిని ఆపితే ఒక పంచాయతీ, ఆపకుంటే ఒక పంచాయతీ. విద్యార్ధుల దాడిలో విసి చనిపోతే పరిస్థితి ఏంటంటూ పోలీసులు పరిస్థితిని వివరించారు’:ముఖ్యమంత్రి కెసిఆర్‌

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

   నిజమే వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు మీద విద్యార్ధులు ఎస్‌ఎసిఎస్‌టి చట్టం కింద పెట్టిన కేసులో ముందుకు పోతే నరేంద్రమోడీతో ఒక పంచాయతీ, పోకపోతే విద్యార్ధులతో మరొక పంచాయతీ.  కేంద్రంతో సఖ్యత కోరుకుంటున్నపుడు అందరూ అనుకుంటున్నట్లుగా విసిపై చర్య తీసుకుంటే పరిస్థితి ఎలా అని సలహాదారులు పరిస్థితిని వివరించి వుంటారు. లాఠీలు తీయటం వుత్తమం అని చెప్పి వుంటారు.

    అసలు అప్పారావు ఆకస్మికంగా విశ్వవిద్యాలయానికి రాత్రిపూట రానేల? వచ్చెను పో పోలీసులకు ముందుగా ఎందుకు తెలియచేయలేదు, తెలియచేయలేదు పో అప్పారావు వస్తే మూగి వాడి ముందు ముక్కు గీరినట్లుగా వుంటుందని పోలీసులకు తెలియదా ? తెలిసెను పో ముందస్తు చర్యలు తీసుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? తోమెను పో విద్యార్ధులపై అంతగా విరుచుకుపడాలా? అంతగా నోరు పారవేసుకోవాలా ? పారవేసుకుంటిరి పో తరువాత అయినా పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు తరువాత విద్యార్ధులు, ప్రొఫెసర్లపై బెయిలు రాని కేసులు పెట్టనేల, పెట్టెను పో నిండుపేరోలగములో కేంద్రప్రభుత్వ పాలకులకు నొప్పి తగల కుండా ఎలాంటి వెరపు లేకుండా సమర్ధించనేల…….అకటా ????

   ‘భారత మాతాకీ జై అనని వ్యక్తి విద్యార్ధుల గురించి మాట్లాడటమా ?’: ఎన్‌విఎస్‌ ప్రభాకర్‌(బిజెపి ఎంఎల్‌ఏ)

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

     అవధానంలో అప్రస్తుత ప్రసంగం అంటే ఇదే. చర్చ భారత మాత మీద కాదు. ప్రతిదానిని భారత మాత మీదకు మళ్లించే అజెండాలో భాగమైతే చెప్పండి నో ప్రాబ్లమ్‌. అసలింతకూ మీరు మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తిస్తున్నారా లేక గాడ్సేను దేశభక్తుడిగా గుర్తిస్తున్నారా ? జాతిపితగురించి రాజ్యాంగంలో పేర్కొనలేదు అంటారా? భారత మాత కూడా అంతే కదా .మేకిండియా మీద కేంద్రీకరించకుండా బ్రేకిండియాపై కేంద్రీకరించారు. ఇదే అసలైన దేశ భక్తా? మర్చిపోయాను హైదరాబాదు విశ్వవిద్యాలయంలో జరిగిన దానికి అసలు కారకులు మీరే అని కదా విద్యార్ధి లోకం కోడై కూస్తున్నది.

   ‘భారత మాతాకి జై అనకపోయినా కొంత మందితో జై హింద్‌ అనిపిస్తున్నామంటే సైద్ధాంతిక పోరు మొదటి రౌండులో బిజెపి విజయం సాధించినట్లే ‘: అరుణ్‌ జైట్లీ

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

   అవునులే భారత మాత దాస్యశృంఖలాలతో వుంటే ఆంగ్ల మాతను ఆరాధించిన మీరు రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే వైఫల్యాల బాట పట్టి దాన్ని దృష్టి మళ్లించేందుకు సైద్ధాంతిక పోరు ప్రారంభించారన్నమాట. భక్తి శివుడి మీద చిత్త చెప్పుల మీద అంటే ఇదేనా ! అవున్లే బ్రిటీష్‌ వారికి సావర్కర్‌ రాసిన లొంగుబాటు లేఖ కారణంగా స్వాతంత్య్ర వుద్యమ కాలంలో మీనోట స్వాతంత్య్రం మాట రాలేదు, భారత మాత దాస్యశృంఖలాలు మీకు కనపడలేదు. ఆ మాతను విముక్తి రాలిని చేసేందుకు ప్రాణత్యాగం చేసిన వారిలో మీ పూర్వీకులెవరూ లేరు. భరత మాత ముద్దు బిడ్డ సుందరయ్య అని కమ్యూనిస్టులు నిత్యం పాట పాడటం ఎప్పుడూ జెట్లీ విని వుండలేదేమో. భరత మాత అనే పదాన్ని తామే సృష్టించినట్లు దాని పేటెంట్‌ హక్కు కోసం పోరు జరిపినట్లు భలే బిల్డప్‌ ఇస్తున్నారులే. జైట్లీ మాదిరే పాతికేళ్ల క్రితం సోషలిజంపౖౖె పోరులో విజయం సాధించాం అని అమెరికా గర్వంగా చెప్పుకుంది. ఇప్పుడా అమెరికాలోనే ఎక్కడబడితే అక్కడ అవును మేం సోషలిస్టులం అని ప్రతి మూల నుంచీ యువకులు వస్తుండటంతో విజయం సాధించిన వారందరూ కమ్యూనిస్టులతో పెట్టుకొని తప్పు చేశామా అని తలలు పట్టుకుంటున్నారు. జైట్లీగారూ మీరు ప్రారంభించిన ఈ పోరులో తొలి విజయం సాధించినట్లు మీరు చెప్పుకుంటే దాన్ని స్వంత డబ్బా అంటారు. ఏమైనా దేశం ముందు సైద్దాంతిక యుద్ధాన్ని తెచ్చి ఎవరు ఎటో తేల్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. అందుకు మీకు అభినందనలు చెప్పక తప్పదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన కేంద్ర సాంస్కృతిక మంత్రి గురించి తెలుసుకోండి !

26 Saturday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Good Friday "greetings", GoodFriday

ఎం కోటేశ్వరరావు

     పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలపటాన్ని కూడా మైనారిటీలను బుజ్జగించటంగా చిత్రించిన బిజెపి ఇప్పుడు అదే పని చేసి నవ్వుల పాలైంది. కడుపులో వుండాలి గాని కావిలించుకుంటే వస్తుందా అని పెద్దలు వూరికే చెప్పలేదు. గుడ్‌ ఫ్రైడే సందర్భంగా ఏకంగా ఐదుగురు కేంద్ర మంత్రులు, బిజెపి అధికార ప్రతినిధి క్రైస్తవులకు ‘శుభాకాంక్షలు’ తెలిపారు. వీటిని చూసి బిజెపిలోని క్రైస్తవులకు నవ్వాలో ఏడవాలో తెలియక తలలు పట్టుకున్నారు. గుడ్‌ ఫ్రైడే అంటే ఏసుక్రీస్తుకు శిలువవేసిన రోజు కనుక వుత్సవం జరుపుకోరు. ఆ రోజు సంతాపంగా క్రైస్తవులు ప్రార్ధనలు జరుపుతారు. అలాంటి రోజున శుభాకాంక్షలు తెలిపిన వారిలో మన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్‌ శర్మ , మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా కూడా వుండటం సిగ్గు చేటు. శర్మతో పాటు రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, మరో మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, బిజెపి అధికార ప్రతినిధి షా నవాజ్‌ హుస్సేన్‌ శుభాకాంక్షలు తెలిపిన వారిలో వున్నారు. అయితే వెంటనే తీవ్రమైన విమర్శలు, స్పందనలు రావటంతో వాటిని వుపసంహరించుకొని సందేశాలను సవరించి పంపారు.తమది సాంస్కృతిక సంస్ధ అని చెప్పుకొనే సంఘపరివార్‌ తన నేతలకు ఇతర మతాల గురించి ఎలాంటి సంస్కృతి పాఠాలను బోధిస్తున్నదో ఈ వుదంతం వెల్లడించింది.

   ఇలాంటి సందేశాలను పంపటంలో బిజెపి నేతలే కాదు, ప్రతి సందర్భాన్ని సొమ్ము చేసుకోవాలని చూసే వ్యాపార సంస్ధలు కూడా కక్కుర్తి పడ్డాయి. ఫర్నిచర్‌ కంపెనీ అర్బన్‌ లాడర్‌, స్నాప్‌డీల్‌,మైంత్రా సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. తరువాత ఇవి క్షమాపణలు చెబుతూ తమ ఆఫర్లను వారాంతపు బహుమతులుగా మార్చాయి.

    కేంద్రమంత్రులు,బిజెపి నేతల ఈ చర్యపై క్రైస్తవ సంఘాలు, సంస్ధలు సంయమనం పాటించాయి.గుడ్‌ ఫ్రైడే రోజును క్షమా దినంగా కూడా పరిగణిస్తార కనుక అలాంటి శుభ సందేశాలు పంపిన వారి పట్ల తమకెలాంటి కోపం లేదని, అయితే బిజెపికి మైనారిటీ మతాల వారి గురించి కనీస పరిజ్ఞానం కూడా లేదనటానికి ఇది ఒక నిదర్శనమని కొందరు వ్యాఖ్యానించారు. షా నవాజ్‌ హుస్సేన్‌కు క్రైస్తవం గురించి తెలియకపోతే కనీసం ఖురాన్‌ చదివి వున్నా తేడా తెలిసి వుండేదని ముస్లిం మత పెద్దలు వ్యాఖ్యానించారు.

  మంత్రుల నిర్వాకంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.మంత్రులందరూ మోడీ విశ్వవిద్యాలయంలో పట్టాలు పుచ్చుకున్నారని వ్యంగ్య వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. వెనుకటికి ఒక మోతుబరి బండిలో ప్రయాణిస్తూ వెనుక నడిచే సేవకులకు జాగ్రత్తలు చెబుతూ ఏవైనా పడితే తీసి బండిలో వేయమని చెప్పాడట. ఏం పడినా వేయమన్నారు కనుక విశ్వాససాత్రులైన సేవకులు యజమానితో పేచీ ఎందుకని ఎద్దులు వేసిన పేడను కూడా తీసి బండిలోకి విసిరారట. అలాగే షానవాజ్‌ హుస్సేన్‌ శుభాకాంక్షల ట్వీట్‌ చేయగానే సిద్ధంగా వున్న ఆయన అభిమానులు అదే శుభాకాంక్షలను పెద్ద సంఖ్యలో తమ అనుచరులకు పంపారు. అంటే వారికి కూడా కనీస ఆలోచన లేకపోయింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సావర్కర్‌ గురించి గాంధీ మాటలు కూడా నకిలీవేనా ?

25 Friday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

BJP, fake, Gandhi, RSS, RSS game, Savarkar

bhagat-singh-martyr-vs-vd-savarkar-traitor

ఎం కోటేశ్వరరావు

నువ్వొకందుకు పోస్తే నే ఒకందుకు తాగా అన్నట్లుగా సంఘపరివార్‌ ఎందుకు ప్రారంభించినప్పటికీ దేశానికి ఒక విధంగా మంచే జరుగుతోంది. దాని నాయకుల నిజరూపాలు దేశం ముందుంచటానికి మరొక అవకాశం ఇచ్చారు. కొలిమిలో ఇనుము బాగా కాగినపుడే దెబ్బ వేయాలన్నట్లుగా దేశంలో దేశ భక్తి, దేశద్రోహుల గురించి జరుగుతున్న చర్చ అనేక మందికి కొత్త విషయాలు తెలియచేస్తోంది. వీడియోలను ఎలా మార్చివేస్తారో అవగతం అయింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ ఎంతటి సాదాసీదా మనిషో అని జనంలో సానుభూతి పెంచటానికి మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న నరేంద్రమోడీ అంటూ ఒక ఫొటోను సామాజిక మీడియాలో పెట్టారు. 1988లో ఆయనొక సాధారణ వ్యక్తిగా వున్నపుడు రైల్వే స్టేషన్‌లో చాయ్‌ అమ్ముకున్నంత సేపు అమ్మి, మిగిలిన సమయాలలో చీవుర్లు పట్టి ఇళ్లను కూడా శుభ్రం చేసిన కష్టజీవి అని బిజెపి మద్దతుదార్లు ఆ చిత్రాన్ని దేశం మీదకు వదిలారు. అసలు వాస్తవం ఏమంటే అదే ఏడాది ఆయన గుజరాత్‌ రాష్ట్ర బిజెపి కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నరేంద్రమోడీ మీద వున్న మోజులో ఆభిమానులు వుబ్బితబ్బుయ్యారు. భక్తులు పులకరించి పోయారు. అప్పుడే అనేక మంది ఆ చిత్రం గురించి ప్రశ్నించినా మోడీ గాలిలో ఎవరూ ఖాతరు చేయలేదు. అహమ్మదాబాదుకు చెందిన ఒక సమాచార హక్కు కార్యకర్త అడిగిన ప్రశ్నతో ఆ ఫొటో నకిలీ అని దానిలో వున్న వ్యక్తి నరేంద్రమోడీ కాదని, ఫొటోను మార్చి అలా తయారు చేశారని తేలింది.

Selection_24_03_2016_003

ఇప్పుడు మరొక అంశం బయటకు వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ భగత్‌ సింగ్‌-ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సావర్కర్‌ చిత్రాలను పక్కపక్కనే పెట్టి అమరజీవులు- విద్రోహులు అనే శీర్షికతో సామాజిక మాధ్యమంలో విడుదల చేసింది. బ్రిటన్‌-భారత్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. రెండవది మేం దానిలో పాల్గొన్నాం అందువలన మేము యుద్ధ ఖైదీలం అని బ్రిటీష్‌ ప్రభుత్వానికి భగత్‌ సింగ్‌ రాసిన చివరిలో పేర్కొన్న అంశాన్ని భగత్‌ సింగ్‌ పొటో కింద పెట్టారు. బ్రిటీష్‌ ప్రభుత్వం తనకు క్షమాభిక్ష పెట్టాలని, దాను ఆంగ్లేయులకు విధేయతతో వుంటానని సావర్కర్‌ రాసిన లేఖాంశాలను ఆయన ఫొటో కింద పెట్టారు. దాని మీద నిక్కర్ల బదులు పాంట్లు తొడుక్కోవాలని కొత్తగా నిర్ణయించుకున్న ‘స్వదేశీ’ (పాంట్లు భారతీయ దుస్తులా,ఏ చక్రవర్తీ వేసుకున్నట్లు మనకు కనిపించదు) సంఘపరివార్‌ యంత్రాంగం మా నేతను ఇంత మాట అంటారా అంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ‘ అతను తెలివి గలవ్యక్తి, అతను ధైర్యశాలి, అతను ఒక దేశ భక్తుడు, వర్తమాన ప్రభుత్వ వ్యవస్థ రూపంలో దాగి వున్న దుష్టశక్తిని నేను గుర్తించటానికి చాలా ముందే ఆయన గుర్తించారు.ఆయన ప్రేమించిన దేశం బాగుండాలని కోరుకున్నందుకు అండమాన్‌ వెళ్లాల్సి వచ్చింది. న్యాయమైన ప్రభుత్వంలో అయితే ఆయనొక వున్నతమైన పదవిలో వుండే వారు’ అని మహాత్మాగాందీ పేర్కొన్నట్లు చాలా కాలంగా సంఘపరివార్‌ ప్రచారంలో పెట్టింది. ఈ మాటలు 1921జూన్‌ 18వ తేదీ యంగ్‌ ఇండియా పత్రికలో రాసినట్లు బిజెపి తన చిత్రాలలో పెట్టింది. అయితే దీని మీద అనుమానం వచ్చిన ప్రతీక్‌ సిన్హా అనే గుజరాత్‌ జర్నలిస్టు పరిశీలించి అసలు ఆ తేదీతో యంగ్‌ ఇండియా సంచికే లేదని 1921 జూన్‌ ఒకటి, ఎనిమిది, పదిహేను, ఇరవై రెండు, ఇరవై తొమ్మిదవ తేదీలతో ఐదు సంచికలు వున్నట్లు పేర్కొన్నారు. తాను 15, 22వ తేదీ సంచికలను చూశానని తనకెక్కడా సావర్కర్‌ గురించి ప్రస్తావన గానీ, ))ఆ మాటలు కనపడలేదని తెలిపారు. మహాత్మాగాంధీకి ఆపాదించిన ఈ మాటల గురించి ఇంటర్నెట్‌లో గూగులమ్మను అడగ్గా రెండు ఫలితాలు కనిపించాయని అవి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా హిందూత్వ ప్రచార సైట్లని సిన్హా పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత మాతపై రెండు ఫత్వాలు

24 Thursday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

AIMIM, bharat-mata-ki-jai-row, BJP, Bjp nationalism, MIM, Narendra Modi, RSS, RSS Double game

చిత్రం ఏమంటే ఈ రెండు శక్తులూ విడదీసేవి, విద్వేషాన్ని రెచ్చగొట్టేవి తప్ప మన స్వాతంత్య్ర వుద్యమంతో గానీ, దేశాన్ని, సమాజాన్ని ఐక్య పరిచే కృషిలో భాగస్వాములైనవి కాదు, హిందూ,ముస్లింలకు అధికార లేదా ఏకైక ప్రతినిధులూ కావు.

ఎం కోటేశ్వరరావు

    భారత మాతపై రెండు ఫత్వాలు జారీ అయ్యాయి. మెజారిటీ మతోన్మాదులు, మైనారిటీ మతోన్మాదులు ఎవరు చేసినా ఇవి రెండూ ఇప్పటికే సమాజంలో వున్న చీలికలు, అపోహలను మరింత గట్టిపరుస్తాయి. దేశానికి నష్టదాయకం. ప్రధాని నరేంద్రమోడీ బిజెపి జాతీయ సమావేశంలో వికాస మంత్రాన్ని జపిస్తే అదే సమావేశంలో పార్టీ మాత్రం దాని కంటే భారత మాతకు జై అనని వారు రాజ్యాంగాన్ని గౌరవించనివారిగా పరిగణించబడతారు అంటే దేశద్రోహుల కిందే లెక్క అన్న విడగొట్టే తీర్మానం చేసింది. దీన్నే మరో విధంగా ఆ పార్టీకి తెలిసిన భాషలో చెప్పాలంటే ఫత్వా జారీ చేసింది. దీనంతటికీ కారణం భారత మాతాకీ జై అనే నినాదాన్ని దేశభక్తిగా యువతరానికి బోధించాల్సిన అవసరం వుందని బిజెపి మాతృమూర్తి సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధిపతి మోహన్‌ భగత్‌ చిచ్చు రాజేశారు. దానికి ప్రతిగా మజ్లిస్‌ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తాను అలా నినదించను అని ప్రకటించి ఆజ్యం పోశారు. చిత్రం ఏమంటే ఈ రెండు శక్తులూ విడదీసేవి, విద్వేషాన్ని రెచ్చగొట్టేవి తప్ప మన స్వాతంత్య్ర వుద్యమంతో గానీ దేశాన్ని, సమాజాన్ని ఐక్య పరిచే కృషిలో భాగస్వాములైనవి కాదు, హిందూ,ముస్లింలకు అధికార లేదా ఏకైక ప్రతినిధులూ కావు. అధిపతి చెప్పిన తరువాత అనుచర గణం వూరికే ఎలా వుంటుంది? ఏకంగా బిజెపి సమావేశంలో తీర్మానం చేసింది. ఇదే సమయంలో హైదరాబాదుకు చెందిన అల్‌ మహద్‌ అల్‌ అలాలీ అల్‌ ఇస్లామీ, జామియా నిజామియా అనే మత సంస్థలు దీనికి ప్రతిగా భారత మాతకు జై అనటానికి ముస్లింలకు అనుమతి లేదని ఒక ఫత్వా జారీచేశాయి. దేశాన్ని ఒక మాతగా కొలవటానికి లేదని అవి పేర్కొన్నాయి. ప్రతి ముస్లిం తన దేశాన్ని ప్రేమిస్తారు, అందుకోసం ఎంత త్యాగమైనా చేస్తారు, ఇది వేరే విషయం, పూజించాల్సి వచ్చినపుడు అల్లాను తప్ప మరొకరిని ఇస్లాం అంగీకరించదని, రెండింటినీ కలగా పులగం చేయవద్దని ఆ సంస్ధలు చెబుతున్నాయి. భారత్‌కు జై, జై హింద్‌, హిందుస్తాన్‌ జిందాబాద్‌ అనటానికి తమకు ఇబ్బంది లేదని భారత మాత అంటే ఒక దేవతకు ప్రతిరూపంగా వున్నందున తాము జై కొట్టలేమని ముస్లిం నాయకులు ప్రకటించారు. ఇప్పుడు శిరోమణి అకాలీదళ్‌(అమృతసర్‌)కు చెందిన సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ కూడా సిక్కులు ఏ రూపంలోనూ మహిళలను పూజించరని అందువలన తాము భారత మాతాకి జై అనేది లేదని ప్రకటించారు. ‘దీని గురించి నేను వ్యాఖ్యానించాలనుకోవటం లేదు, ఇదొక వృధా వివాదం’ అని బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ విలేకర్లు అడిగిన దానికి బదులిస్తూ బుధవారం నాడు అహమ్మదాబాద్‌లో వ్యాఖ్యానించారు. భారత మాతాకీ జై అని ప్రతి ఒక్కరూ అనే విధంగా, గోవధను రాజ్యాంగంలో చేర్చాలని యధాప్రకారం బాబా రాందేవ్‌ డిమాండ్‌ చేశారు.

   హిందువుల అభ్యున్నతి కోసం (అది చెప్పే హిందూ అంటే భారత్‌ , భారత్‌ అంటే హిందూ అనే వ్యాఖ్యానానికి అర్ధం అదే) పని చేస్తున్నట్లు చెప్పుకొనే భారతీయ జనతా పార్టీ విరుద్ధ ముఖాలను ఎందుకు ప్రదర్శిస్తున్నట్లు ? నరేంద్రమోడీ అంటే ‘గుజరాత్‌ మోడల’్‌ తప్ప రాజ్యాంగం గురించి అంతగా తెలిసిన వ్యక్తి కాదనుకోవచ్చు, మరి అరుణ్‌జైట్లీ వంటి సుప్రసిద్ద లాయర్లు వుండి కూడా అలాంటి తీర్మానాలు ఎందుకు చేయిస్తున్నట్లు ? నిద్ర పోయే వారిని లేపవచ్చు తప్ప నటించే వారిని లేపలేము అన్నట్లే ఇదంతా ఒక పధకం ప్రకారమే జరుగుతోందని అనేక మంది భావించటంలో ఆశ్చర్యం లేదు. భారత మాతకు జై అనేందుకు నిరాకరించిన మహారాష్ట్ర శాసనసభలో మజ్లిస్‌ పార్టీ సభ్యుడిని వర్తమాన సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. చట్ట సభలు చేసిన నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించటానికి వీలు లేదనే తీర్పులు వెలువడుతున్న తరుణంలో అది కోర్టు పరిధిలోకి రాదు. కానీ బయట ఎవరైనా భారత మాతకు జై అనను అంటే అలాంటి వారిపై చర్య తీసుకోవటం కుదరదు, ఎవరైనా అలాంటి పిచ్చిపనిచేస్తే అది కోర్టులో చెల్లదు.ఎందుకంటే మన రాజ్యాంగంలో భారత్‌ అనే పదం వుంది తప్ప భారతమాత లేదు.అయినా సరే బిజెపి తన తీర్మానంలో ఇలా పేర్కొన్నది.’మన రాజ్యాంగం ఇండియాను భారత్‌ అని కూడా వర్ణించింది.భారత్‌ విజయం గురించి నినదించకపోవటం మన రాజ్యాంగాన్నే అగౌరవపరచటంతో సమానం’ అని పేర్కొన్నది. భారత స్వాతంత్య్ర వుద్యమంతో గానీ, రాజ్యాంగంతో గాని ఎలాంటి బీరకాయ పీచు సంబంధం కూడా లేని బిజెపి రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్దంగా వ్యవహరించటంలో ఆశ్చర్యం ఏముంది ?

   నినాదాలు చేయటం ద్వారా జాతీయ వాదాన్ని తయారు చేయలేమని వాజ్‌పేయి ప్రధానిగా వున్న కాలంలో అటార్నీ జనరల్‌గా పనిచేసిన సోలీ సోరాబ్జీ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఆయనే మరొక విషయాన్ని కూడా తెలిపారు. విజయ్‌ ఇమ్మాన్యుయెల్‌-కేరళ రాష్ట్ర వివాదంలో 1986లో మైలురాయిగా పేర్కొన దగిన తీర్పును సుప్రీం కోర్టు జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి ఇచ్చారు.యెహోవా విట్‌నెస్‌ అనే క్రైస్తవ తెగకు చెందిన వారు జాతీయ గీతం పాడేటపుడు గౌరవసూచకంగా లేచి నిలబడతారు తప్ప దానిని పాడకూడదని అందువలన తాము జాతీయ గీతాన్ని పాడలేదని విద్యార్ధులు చేసిన వాదనపై వివాదం కోర్టుకు ఎక్కింది.ఆ విద్యార్ధుల చర్యను సమర్ధిస్తూ ‘ మన సంప్రదాయం సహనాన్ని బోధిస్తున్నది, మన తత్వశాస్త్రం సహనాన్ని బోధిస్తున్నది, మన రాజ్యాంగం సహనాన్ని ఆచరిస్తున్నది, మనం దాన్ని నీరు గార్చవద్దు’ అని న్యాయమూర్తి చిన్నప రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారంటూ సహనాన్ని స్పష్టంగా నిర్ధారించిన తీర్పు అని సొరాబ్జి వ్యాఖ్యానించారు.

   సీనియర్‌ న్యాయవాది ఆర్యమ సుందరం రాజ్యాంగంపై బిజెపి పూర్తిగా తప్పుడు వైఖరి తీసుకున్నది అని వ్యాఖ్యానించారు. కేరళ విద్యార్ధి కేసునే వుదాహరిస్తూ జాతీయ గీతాన్ని పాడనందుకు విద్యార్ధులను స్కూలు నుంచి బహిష్కరించారు. వారు దేశం లేదా జాతీయ పతాకం పట్ల ఎలాంటి అగౌరవాన్ని ప్రదర్శించలేదని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్నారు.అందువలన వర్తమాన వివాద పూర్వరంగంలో ఒక వ్యక్తి ఎవరైనా ఇతర విధాలుగా దేశాన్ని అగౌరవపరిస్తే తప్ప కొన్ని నినాదాలను నేను చేయను అంటే అది మొత్తంగా అగౌరవ పరిచినట్లు కాదని సుందరం చెప్పారు. దేన్నయినా నినదించాలా లేదా అనేది అతనికి లేదా ఆమెకు సంబంధించిన విషయం. రాజ్యాంగం ప్రకారం భారత మాతాకీ జై అని నినదించకపోవటం దేశాన్ని అగౌరవపరచటంగా నేను అంగీకరించను, ఇదంతా పూర్తిగా అనవసరమైన చీలికలను సృష్టిస్తున్నది. ఎవరైనా దేశాన్ని లేదా జాతీయ పతాకాన్ని అగౌరవ పరిస్థే చర్య తీసుకోవాలని నేను కూడా నమ్ముతాను, ప్రస్తుతం అలాంటిదేమీ నాకు కనిపించటంలేదు.అలాంటి చర్యలు చీలికలను మరింత గట్టిపరుస్తాయి అని సుందరం అన్నారు.

   ‘ రాజ్యాంగ ప్రకారం భారత మాతాకు జై అని జనం అనాల్సిన అవసరం లేదు,ఎక్కడా దాని గురించి చర్చించలేదు. బిజెపి తీర్మానం తప్పుడు వ్యాఖ్యానం. ఇండియా అంటే భారత్‌ అని మాత్రమే రాజ్యంగం చెప్పింది.అది భారత మాత గురించి పేర్కొనలేదు. కాబట్టి అలాంటి నినాదం చేయటం ప్రతి పౌరుడి ప్రాధమిక విధి కాదు,మనం అందరం దేశాన్ని ప్రేమిస్తాము, గౌరవిస్తాము, కానీ దానిని మన మీద రాసుకొని తిరగము’ అని మరో సీనియర్‌ న్యాయవాది కామినీ జైస్వాల్‌ అన్నారు.’ బిజెపి వారు అనవసరంగా ఒక వివాదాన్ని సృష్టించారు. ఎవరూ కోరుకోని దానిని వారు సృష్టించబోతున్నారు. వారు జనాన్ని విభజించేందుకు పూనుకున్నారు, ఈ సమస్యలను రేకెత్తించకూడదు’ అని కూడా ఆమె చెప్పారు.మహా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పూర్తిగా తప్పుడు నిర్ణయం, ఎవరైనా దానిని సవాలు చేయాలి’ అని కూడా అన్నారు.

    ముంబైకి చెందిన న్యాయవాది అబ్దుల్‌ మజీద్‌ మెమన్‌ మాట్లాడుతూ ‘ ఈ సమస్య మీద ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు బిజెపి అలాగే మజ్లిస్‌ రెండూ తప్పు చేస్తున్నాయి. రాజకీయాలు చేస్తున్నారు. నా వరకు భారత మాతాకి జై అనటం ఒక సమస్య కాదు. ఆ నినాదమిస్తే ఏం హాని జరుగుతుంది.అసెంబ్లీ నుంచి వారిస్‌ పఠాన్‌ను సస్పెండ్‌ చేయటం అతి ప్రతిస్పందన అనుకుంటున్నాను. నినదించటం తప్పుకాదని నమ్ముతున్నట్లు నేను అతనితో టీవీ చర్చలో కూడా చెప్పాను, అయితే బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ వత్తిడి చేసిన కారణంగా తానా పనిచేయనని అతను అన్నాడు. దీంతో ఆ సమస్య అక్కడితో ముగిసి వుండాల్సింది’ అన్నారు.

   ‘మజ్లిస్‌ మొత్తం ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహించేది కాదని నేను ప్రతి ఒక్కరికీ గుర్తు చేయదలచాను. వారి చర్యలతో వాతావరణాన్ని కలుషితం కానివ్వరాదు.ఈ సమస్యను అనవసరంగా రేకెత్తించారని నేను కూడా భావిస్తున్నాను. హైదరాబాదుకు చెందిన ఒక మత పెద్ద భారత మాతాకి జై అనటాన్ని అభ్యంతర పెట్టినట్లు నేను చదివాను. గత అరవై సంవత్సరాలుగా వారికి సమస్య లేదు. ఇప్పటికీ వారికి భారత్‌ లేదా జై అనటానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ సమస్య ఎక్కడంటే మాత లేదా తల్లి అని చెప్పటంలోనే. మాతృదేశం అన్న భావనలో ఇప్పుడు తప్పేమిటి ? భారత మాత అంటే మదర్‌ ఇండియా వంటిదే. కానీ ఒక ముస్లిం మెహబూబ్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన మదర్‌ ఇండియా అవార్డు వచ్చిన సినిమా, దానిలో మరొక ముస్లిం అయిన నర్గీస్‌ దత్‌ ప్రధాన పోత్ర పోషించారు, దానితో ఎవరికీ ఇబ్బంది రాలేదు. కానీ అసలు సమస్య ప్రతిసారీ ముస్లింలు తమ విదేయత, దేశభక్తిని నిరూపించుకోవటంలో అలసి పోయారు. అందుకోసం వారికి ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బిజెపి నుంచి సర్టిఫికెట్‌ అవసరం లేదు’ అని మెమెన్‌ స్పష్టం చేశారు. మరొక సుప్రీం కోర్టు లాయర్‌ రాజు రామచంద్రన్‌ కూడా జాతీయ గీతాన్ని ఆలపించకపోవటం అనుమతించదగినదే అని కేరళ విద్యార్ధుల కేసు స్పష్టం చేసింది. కొంత మంది డిమాండ్‌ చేసినంత మాత్రాన ఒక నినాదాన్ని పలకనంత మాత్రాన అది రాజ్యాంగాన్ని అగౌరవపరచినట్లు ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. ‘తన తీర్మానంలో బిజెపి ఈ విధంగా ప్రస్తావించటం దురదృష్టకరం, ఒక న్యాయవాదిగా నాకు అరుణ్‌ జైట్లీ అంటే గౌరవం వుంది, పార్టీ తీర్మానంలో రాజ్యాంగాన్ని ఈ విధంగా తప్పుడు వ్యాఖ్యానం చేయటాన్ని నిరోధించేందుకు ఆయన అయినా ప్రయత్నించి వుండాల్సింది’ అని మరో సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వ్యాఖ్యానించారు.

   భారత మాతాకీ జై అన్న నినాదం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కంటే ముందే స్వాతంత్య్ర వుద్యమంతో ముడిపడి వున్నదని, భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌ ఆ నినాదాలతోనే వురి కంబం ఎక్కారు, ఇప్పుడు ఆ నినాదం గురించి చర్చించటమే ఒక విద్రోహం అని బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా తన పార్టీ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యా నించారు. నిజమే ఆంగ్లేయులు మన దేశాన్ని అక్రమించినందున దాస్యవిముక్తి చేయటానికి అనేక మంది దేశ భక్తులు జాతీయ వాదంలో భాగంగా అనేక నినాదాలు ఇచ్చిన మాట వాస్తవం. అదే భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజగురు ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అని కూడా అన్నారు. మరి దాన్ని నినదించాలని సంఘపరివార్‌ లేదా బిజెపి ఎందుకు కోరటం లేదు. అన్నింటి కంటే భగత్‌ సింగ్‌ ఆ నినాదం చేస్తున్న తరుణంలో సంఘపరివార్‌ నేత సావర్కర్‌ ఆంగ్లమాతాకు జై అని నినాదాలు ఇస్తామని,తెల్ల దొరలకు సేవలు చేసుకుంటామని, బొలో స్వాతంత్య్ర భారత్‌కు జై అనే నినాదం మా నోట వెంట రానివ్వబోమని జైలు నుంచి బ్రిటీష్‌ వారికి లేఖలు రాసిన పచ్చినిజాన్ని కాదంటారా ? ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనటానికి ఏ మతానికి లేదా మరొకరికి అభ్యంతరం లేదు దాన్ని వదలి పెట్టి వివాదాస్పద అంశాలనే ఎందుకు అమ్ముల పొదిలోంచి బయటకు తీస్తున్నట్లు ?

  వందేమాతరం అన్నందుకు నాడు బ్రిటీష్‌ పాలకులు స్వాతంత్య్ర సమర యోధులను జైల్లో పెట్టారు. ఇదే నినాదాన్ని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో అసందర్భంగా చేసినందుకు రాజీవ్‌ యాదవ్‌ అనే లాయర్‌ను న్యాయమూర్తులు మందలించటంతో అతను కోర్టుకు క్షమాపణ చెప్పాడు. అంటే దీని అర్ధం జడ్జీలకు దేశభక్తి లేదనా ? జాతీయ వాదులు కాదనా ? వందేమాతర గీతం, నినాదం ఒక వివాదాస్పద అంశం. స్వాతంత్య్ర వుద్యమ కాలంలోనే ముస్లింలు, సిక్కులు దానిని పాడేందుకు నిరాకరించారు.అంత మాత్రాన స్వాతంత్య్ర వుద్యమం వారిని దేశద్రోహులుగా లేక జాతి వ్యతిరేకులుగా పరిగణించలేదు. అక్కున చేర్చుకుంది. ఎందరో ముస్లింలు, సిక్కులు వందేమాతరం అనకుండానే తమ తమ పద్దతుల్లో స్వాతంత్య్ర వుద్యమంలో ఎన్నో త్యాగాలు చేయలేదా ? వారు దేశభక్తులు కాలేదా ?

   బిజెపి కనుక దేశభక్తి, జాతీయ వాదాలపై చట్టాలను సవరించి వాటిని గతం నుంచి వర్తింపచేయాలని గనుక నిర్ణయిస్తే జనగనమణ గీత రచయిత రవీంద్రనాధ ఠాగూర్‌ కూడా దేశద్రోహి వర్గీకరణకిందికే వస్తారు. ఒక గీతం జాతిని ఐక్య పరచాలి తప్ప విడదీయకూడదంటూ వందేమాతర గీతాన్ని రవీంద్రుడు తిరస్కరించారు. ‘ఈ అంశంపై బెంగాలీ హిందువులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు, కానీ ఇది ఒక్క హిందువులకు మాత్రమే సంబంధించింది కాదు. రెండు వైపులా బలమైన భావనలు వున్నాయి. సమతుల్యమైన న్యాయం అవసరం. మన రాజకీయ లక్ష్యాల వుద్యమంలో మనం శాంతి, ఐక్యత, మంచితనం కోరుకుంటున్నాం, ఒక వర్గం చేసిన డిమాండ్లకు ప్రతిగా మరొక వర్గం చేసే డిమాండ్లతో అంతంలేని ఎదురుబొదురు బలప్రదర్శనలు తగదు.’అని రవీంద్రుడు సుభాస్‌ చంద్రబోస్‌కు రాసిన లేఖలో సూచించారు. చివరకు కాంగ్రెస్‌ వందేమాతర గీతంలో హిందూ దేవత దుర్గకు సంబంధించిన భాగాలు మినహా మిగతా భాగాన్ని ఆమోదించింది. చివరకు మన రాజ్యాంగసభలో కూడా ఇది వివాదాస్పదమైంది. 1950 జనవరి 24న రాజ్యాంగసభకు అధ్యక్షత వహించిన బాబూ రాజేంద్ర ప్రసాద్‌ జనగన మణను జాతీయ గీతంగానూ , స్వాతంత్య్ర వుద్యమంలో చారిత్రక పాత్ర వహించిన వందేమాతర గీతాన్ని గౌరవిస్తూ దానికి కూడా జాతీయ పాటగా సమాన స్థాయిని కల్పించాలని అంతిమంగా ఆ వివాదానికి స్వస్తి పలికారు.

   తరువాత 2006లో వందేమాతరం 125వ వార్షికోత్సవం సందర్భంగా దానిని విధిగా ఆలపించాలా లేదా అన్న వివాదం ఏర్పడింది.ముస్లింలలోనే భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. సిక్కులు దానిని ఆలపించవద్దని సిక్కు గురుద్వారా ప్రబంధక్‌ కమిటి(ఎస్‌జిపిసి) కోరింది. వందేమాతరం గీతాలాపన స్వచ్చందం తప్ప విధికాదని పార్లమెంట్‌లో 2006 ఆగస్టు 22న ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్బంగా అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా వుండగా విధిగా వందేమాతర గీతాన్ని ఆలపించాలని వుత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను బిజెపి సమర్ధించిందని, అయితే విధిగా చేయనవసరం లేదని నాడు వాజ్‌పేయి స్పష్టత ఇచ్చారని కాంగ్రెస్‌ పార్టీ ఆ నాడు పేర్కొన్నది.

  అందువలన ఇప్పుడు భారత మాతాకి జై అనటమే దేశభక్తికి, జాతీయతకు నిదర్శనం, చిహ్నమని బిజెపి వత్తిడి చేయటం దాని అజెండా ప్రకారం దేశం నడవాలని ఏకపక్షంగా నిర్ణయించటం నిరంకుశ ధోరణులకు నిదర్శనం తప్ప మరొకటి కాదు. తమ ప్రధాని మేకిండియా నినాదమిచ్చి దేశాన్ని ముందుకు తీసుకుపోతానంటుంటే బిజెపి మాత్రం బ్రేకిండియా నినాదాలతో దేశాన్ని విచ్చిన్నం చేయ చూస్తున్నది. ఎవరిది కుహనా జాతీయ వాదం,ఎవరు దేశభక్తులు? ఏది అభివృద్ధి పధం ? ఇదా దేశాన్ని ముందుకు తీసుకుపోయే మార్గం? దీన్నా నరేంద్రమోడీకి ఓటు వేసి జనం కోరుకున్నది ?

గమనిక: ఈ వ్యాసంలోని న్యాయవాదుల అభిప్రాయాలు ది వైర్‌.ఇన్‌లోని గౌరవ్‌ వివేక్‌ భట్నాగర్‌ వ్యాసం నుంచి స్వీకరించబడినవి. రచయితకు కృతజ్ఞతలు

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి సమావేశాలలో నరేంద్రమోడీ భజన

21 Monday Mar 2016

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, BJP National executive meet, Congress, Modi, narendra modi namo mantra

సత్య

   న్యూఢిల్లీలో శని, ఆదివారాలలో రెండు రోజుల పాటు జరిగిన బిజెపి జాతీయ కార్యనిర్వాహకవర్గ సమావేశం జాతీయ వాదం, భారత మాతాకీ జై, అభివృద్ధి గురించి జపం చేసిందన్నది మీడియా వార్తల సారాంశం. అభివృద్ధి, అభివృద్ధి, మరింత అభివృద్ధి మీద కేంద్రీకరించాలి తప్ప ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ఇతర అంశాల జోలికి పోవద్దని ప్రధాని నరేంద్రమోడీ నొక్కి వక్కాణించినట్లు సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించిన హోంమంత్రి రాజనాధ్‌ సింగ్‌ చెప్పారు. గత ఇరవై రెండు నెలల బిజెపి కేంద్ర పాలన తీరును చూస్తే అభివృద్ధి గురించి చెప్పుకొనేందుకు బిజెపికి ఏమైనా వుందా ? ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల సందర్భంగా ఈ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ ఐదు చోట్లా బిజెపికి ఎక్కడా అవకాశాలు లేవన్నది స్పష్టం. పార్లమెంట్‌ ఎన్నికలలో అసోంలో అది పొందిన ఓట్లను బట్టి అక్కడ పెద్ద పార్టీగా అవతరించవచ్చని కొంతమంది వూహాగానాలు చేస్తున్నారు, బిజెపి కూడా అదే ఆశతో వున్నట్లు కనిపిస్తోంది. చిత్రం ఏమిటంటే అక్కడ మోడీని ముందు పెడితే ప్రయోజనం లేదనుకుందో ఏమో ముందుగానే ముఖ్య మంత్రి అభ్యర్ధిని ప్రకటించింది. దీని వలన ఫలితం ఎలా వున్నా ఏ విధంగా అయినా భాష్యం చెప్పుకోవచ్చు. మోడీని ముందు పెడితే ప్రతికూల ఫలితాలు వస్తే మరింత పరువుపోవటం ఖాయం కనుక ఇలా చేశారని చెబుతున్నారు.

  భావ ప్రకటన స్వేచ్ఛ రాజకీయ విమర్శలను తాము అంగీకరిస్తామని కానీ స్వేచ్ఛ పేరుతో జాతీయ వ్యతిరేక కార్యకలాపాలను అంగీకరించేది లేదని రాజనాధ్‌ సింగ్‌ రాజకీయ తీర్మానం గురించి వివరించారు.భారత మాతాకి జై అంటేనే జాతీయ వాదం, దేశ భక్తి అనే విధంగా జాతీయ వాదానికి బిజెపి తాజా వ్యాఖ్యానం చెప్పటం జర్మనీలో హిట్లర్‌ను గుర్తుకు తెస్తున్నది.

   బిజెపి జాతీయ కార్యవర్గంలో నిజంగా ఏం చర్చించారో, ఎవరు ఏం మాట్లాడారో మిగతావారు వినలేదా ? అంటే సమాధానం చెప్పటం కష్టం. రాజకీయ తీర్మానాన్ని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు ప్రవేశపెట్టారు.దాని గురించి మరో మంత్రి ఆరుణ్‌ జైట్లీ విలేకర్లకు వివరించారు. వెంకయ్య నాయుడు ప్రవేశపెట్టారన్న సమాచారం తప్ప ఆయనేం మాట్లాడారనే అంశాన్ని కనీస ప్రస్తావన కూడా చేయలేదు. అంతకు ముందే వెంకయ్య నాయుడు తన ప్రసంగంలోని అంశాలంటూ మీడియాకు ఇమెయిల్‌ ద్వారా పంపారు. దానిలో ప్రధాని నరేంద్రమోడీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తారు. ఇదే విషయం గురించి హోం మంత్రి రాజనాధ్‌ సింగ్‌ను అడగగా వెంకయ్యగారు చెప్పిన వాటితో అంగీకరించటానికి గానీ కాదనటానికి గానీ తానసలు వెంకయ్య వుపన్యాసం వినలేదని భట్టిప్రోలు పంచాయతీ తీర్పు చెప్పారు.

    ఇంతకీ వెంకయ్య ఏం చెప్పారు? ఆయన మీడియాకు పంపిన ఇమెయిల్‌ ప్రకారం ‘మోడీ దేశానికి ఒక వరం, దేవుడు పంపిన పేదల రక్షకుడు, మోడీ పేరు ప్రతిష్టలు నూతన స్ధాయికి చేరాయి.లండన్‌లోని మాడమే టుస్సాడ్స్‌లో మోడీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. కోటీ ఎనభైలక్షల మంది ట్విటర్‌ అనుచరులు, మూడు కోట్ల ఇరవైలక్షల మంది ఫేస్‌బుక్‌ లైక్‌లతో ప్రపంచ స్థాయిలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి నాయకుడు మోడీ. అభివృద్ధి చెందుతున్న భారత్‌ను రూపాంతరం(మోడి ఫయర్‌) చెందించిన వ్యక్తి. ఇలా సాగింది వెంకయ్య గారి మోడీ స్త్రోత్రం. మోడీ పేదలకు బదులు పెట్టుబడిదారుల రక్షకుడని కాంగ్రెస్‌ ఎత్తి పొడిచింది.

   ఈ పొగడ్తల గురించి మీడియా ముందు జెట్లీ లేదా రాజనాధ్‌ సింగ్‌ చెప్పరని వెంకయ్యకు బాగా తెలుసు.అందుకే తన మీడియా మేనేజ్‌మెంట్‌ పద్దతులలో ప్రసంగ అంశాలను మీడియాకు ముందే పంపారు.ఈ భజన చూస్తే అత్యవసర పరిస్థితి సందర్భంగా ఇందిరే ఇండియా ఇండియా ఇందిర అని కాంగ్రెస్‌ నేత డికె బారువా చేసిన పొగడ్తలు గుర్తుకు వస్తున్నాయి. దాని గురించి ఆ నాడు జనసంఘంగా వున్న నేటి బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేశారు. నేడు వెంకయ్య పొగడ్తలు అంతకు తక్కువేమీ కాదు.

   మోడీని వ్యతిరేకించే ఎల్‌కె అద్వానీ ప్రియశిష్యుడిగా పేరు పొందిన వెంకయ్య నాయుడు పార్టీలో నరేంద్రమోడీ ప్రాభవం పెరగ్గానే ఇటువైపు ఫిరాయించారు. తన స్వామి భక్తిని నిరూపించుకొనేందుకు మోడీని పదే పదే పొగడటంలో వెంకయ్య పేరు మోశారు. తాజా సమావేశాలలో ఆయన పొగడ్తల గురించి రాజనాధ్‌ సింగ్‌ గాలి తీయటం, దానిని జాతీయ మీడియా ప్రముఖంగా పేర్కొని వ్యాఖ్యానాలను రాయటం బహుశా వెంకయ్య నాయుడు వూహించి వుండరు. నరేంద్రమోడీ మోడీని పొగడటంలో కేంద్ర మంత్రులు పోటీ పడుతున్నారు.

    ఈ సమావేశాలకు ముందు రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజ్జు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో నరేంద్రమోడీ 2026 వరకు ప్రధానిగా పదవిలో కొనసాగుతారని 1555లోనే ఫ్రెంచి జోస్యుడు నోస్ట్రాడామస్‌ చెప్పారని ఒక పోస్టును పెట్టాడు. మోడీ భారత్‌ను స్వర్ణయుగంలో ప్రవేశపెడతారని, అనేక దేశాలకు రక్షణ కల్పించే దేశంగా భారత్‌ ఎదుగుతుందని పేర్కొన్నాడు. ‘ 2014 నుంచి 2026 వరకు మధ్య వయస్కుడైన ఒక వ్యక్తి భారత్‌కు నాయకత్వం వహిస్తాడని, ఆయనను తొలుత జనం ద్వేషించినా, తరువాత ఎంతగానో ప్రేమిస్తారని దేశ దశ, దిశను ఆయన మారుస్తాడని, ఆయన నాయకత్వంలో భారతదేశమే గాక మొత్తం ప్రపంచం స్వర్ణయుగంలో ప్రవేశించటమే గాక ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహిస్తుందని ‘ జోస్యం చెప్పినట్లు రిజు పేర్కొన్నారు.

   సాధించిన విజయాలేమీ లేనపుడే ఇలాంటి పోసుకోలు కబుర్లతో నాయకత్వాన్ని పొగుడుతూ కాలక్షేపం చేయటం అన్ని పాలకవర్గ పార్టీలలో వున్న ఒక వుమ్మడి లక్షణం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేశం ఎటు పోతోంది ! ఏం జరుగుతోంది !!

17 Thursday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Agriculture, BJP, Bjp nationalism, black money, cbi, INDIA, indirect subsidies, JNU, JNU ROW, lalit modi, Modi, Narendra Modi, subsidies, vijay mallya

 సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది

ఎం కోటేశ్వరరావు

     కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పూర్తి బడ్జెట్లు ప్రవేశ పెట్టింది. వాటి ద్వారా తాము చేసిన వాగ్దానాలపై ఫలానా నిర్ధిష్ట చర్య తీసుకున్నట్లు జనానికి నమ్మకం కలిగించలేకపోయింది. తన ఎన్నికల ప్రణాళికలో ఇతర పార్టీల మాదిరిగానే అనేక మంచి అంశాలు చెప్పింది. గత ప్రభుత్వంతో పోల్చుకొని జనం గణనీయంగా దానికి ఓట్లు వేశారు. మన ఎన్నికల విధానంలో వున్న ఒక తీవ్రలోపం, ప్రతిపక్ష ఓట్లు చీలటం,వివిధ కారణాలతో దానికి వచ్చిన ఓట్ల కంటే సీట్లు ఎక్కువగా వచ్చాయి. దాంతో ఎలాంటి భయం లేకుండా చేసిన వాగ్దానాలను అమలు జరుపుతుందని జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చిత్రం ఏమంటే ఎన్నికల ప్రణాళికలోలేని అనేక అంశాలను అది అమలు జరుపుతోంది. ఏ కాంగ్రెస్‌ విధానాలనైతే తెగనాడిందో అవే విధానాలను మరింత ఎక్కువగా అమలు జరుపుతోంది. గత రెండు బడ్జెట్లలో వుద్యోగులు తీవ్ర ఆశాభంగానికి గురైనట్లుగానే సమాజంలోని అన్ని తరగతుల వారిలో రోజు రోజుకూ తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది. ఇతర పార్టీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే అవకాశం లేకుండా స్వంతంగా మెజారిటీ సీట్లు వున్నప్పటికీ ఒక్క కీలకాంశంపైనా అది ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదు.

    నల్లధనాన్ని వెనక్కు తీసుకురావటంలో కాంగ్రెస్‌ ఎందుకు విముఖత చూపుతోంది? ఎందుకంటే అది ఎవరిదో వారికి తెలుసు కనుక, విదేశాల్లో దాచుకున్న ప్రతి పైసాను ఎన్‌డిఏ వెనక్కు తీసుకు వస్తుంది. దాన్ని పంచితే ఒక్కొక్కరికి 15-20లక్షల రూపాయలు వస్తాయి అని ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ట్వీట్లు చేసి జనానికి స్వీట్ల ఆశచూపారు. పార్టీ అధ్యక్షుడిగా వున్న రాజనాధ్‌ సింగ్‌ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో నల్లధనాన్ని తీసుకువచ్చి దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు అమలు జరుపుతామని చెప్పారు.తీరా అధికారానికి వచ్చిన తరువాత బిజెపి అధ్యక్షుడు ఎన్నికల సమయంలో అనేకం చెబుతుంటాం అవి అమలు జరుగుతాయా మీ పిచ్చిగానీ అన్నట్లు మాట్లాడారు.

    నల్లధనాన్ని తీసుకు వస్తామన్న పెద్దమనిషి గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తన పాలనలో ఇప్పుడెవరూ నల్లధనాన్ని బయటకు తీసుకు వెళ్లటానికి సాహసించటం లేదు అని చెప్పారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంది ? గతేడాది సెప్టెంబరు వరకు తమ ప్రభుత్వం విధించిన గడువులోగా నల్లధనాన్ని తెల్లదిగా మార్చుకొనే పధకంలో 6,500 కోట్లు వస్తాయని ప్రధాని చెప్పారు. చివరికి అంది పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరిగా తయారైంది. తమ ప్రభుత్వ పధకం ప్రకారం 638 మంది రు 4,147 కోట్లను వెల్లడించారని రెవెన్యూ కార్యదర్శి చెప్పారు.మరి 6500 కోట్ల సంగతేమిటని అడిగితే అబ్బే అబ్బే ఇది మా పధకం ద్వారా కాదు హెచ్‌ఎస్‌బి దర్యాప్తు ద్వారా స్వాధీనం చేసుకున్న మొత్తం అని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ చెప్పారు.తీరా ప్రభుత్వ పధకం ద్వారా వెల్లడైంది కేవలం 2,488 కోట్లు మాత్రమే అన్నారు. తరువాత ఇది కూడా జనాన్ని తప్పుదారి పట్టించే సమాచారమే అని తేలింది.

     స్విడ్జర్లాండ్‌ బ్యాంకులలో దాచుకున్న డబ్బు గురించి 2011లోనే 1,195 మంది పేర్లతో 25,420 కోట్ల రూపాయలు వున్నట్లు బయటకు వచ్చింది. అయితే మోడీ సర్కార్‌ ఇంకా 628 పేర్లనే పట్టుకు వేలాడుతోంది.హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో దాచుకున్న సొమ్ము గురించి కూడా తెలిసింది చాలా పరిమితమే.ఆ బ్యాంకులో అక్రమంగా సొమ్ముదాచుకున్నవారి వివరాలు బయటపడటంతో ఫ్రాన్స్‌ 110 కోట్ల డాలర్లు, అమెరికా 190 కోట్లు, స్విడ్జర్లాండ్‌ 4.3 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆ బ్యాంకుకు జరిమానా వేశాయి. మరి మన దేశం ఎంత జరిమానా వేసింది ? అయినా మన జెట్లీ గారు తాజా బడ్జెట్‌ ప్రసంగంలో పెద్ద రంకెలే వేశారు తప్ప ఆచరణ లేదు.

    క్రికెట్‌ అసోసియేషన్‌లో వందల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అభియోగాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ చేపట్టగానే లలిత్‌ మోడీ బిజెపి ముఖ్యమంత్రిగా వున్న వసుంధరరాజె, సుష్మస్వరాజ్‌ తదితరుల సహకారంతో దేశం వదలి పారిపోయాడు. అతగాడితో కుమ్మక్కు కానట్లయితే భారత్‌కు రప్పించేందుకు మోడీ సర్కార్‌ చేసిన ప్రయత్నాలేమిటి. ఇది ఇలా వుండగా కింగ్‌ పిషర్‌ విజయ మాల్య తొమ్మిదివేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి, తన వ్యాపారాలను ఇతర కంపెనీలకు అమ్మివేసి లండన్‌కు పారిపోయి ఇప్పుడప్పుడే తాను భారత్‌కు రానని చెప్పేశాడు. చిన్న చేప లలిత్‌మోడీనే పట్టుకోలేనివారు పెద్ద చేప మాల్యను పట్టుకుంటారా అని జనం అడుగుతున్నారు. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం పేరుతో ప్రవేశ పరీక్షలలో జరిగిన కుంభకోణం నిజాలను నిగ్గుతేల్చేందుకు విచారణ చేపట్టిన సిబిఐ ఇంతవరకు చేసిందేమీ లేదు. అలాంటిది దేశం వదలి పారిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్న ఆ సంస్ధపై జనానికి విశ్వాసం ఎలా వుంటుంది. తొలుత విదేశాలకు వెళుతుంటే నిర్బంధించమని లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసిన సిబిఐ తరువాత ఒక నెలలోపే దానిని సవరించి వెళుతున్నట్లు తెలియ చేస్తే చాలని ఎందుకు మార్చినట్లు ? ప్రధాని పర్యవేక్షణలోని ఈ సంస్ధ నిర్వాకం గురించి ఇంతవరకు ఎవరూ నోరు విప్పరేం?

     వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభంలో వుంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొనసాగుతున్న ఆత్మహత్యలే అందుకు తిరుగులేని నిదర్శనం. వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వచ్చేట్లు చూస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళిక చెప్పింది. ఇప్పటికే పరిమితంగా వున్న ఎరువుల సబ్సిడీని కూడా దుర్వినియోగం అవుతోందనే పేరుతో ఇంకా కోత పెట్టేందుకు పూనుకుంది. యాభై శాతం కాదు కదా అందులో సగమైనా దక్కేందుకు ఇంత వరకు నిర్ధిష్ట పధకం ఏమి లేకపోగా స్వాతంత్య్ర దేశ చరిత్రలో తమ ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎవరూ సాయపడలేదని ఇటీవల బిజెపి రైతు సభలలో ప్రధాని చెప్పుకున్నారు.

   ధరల పెరుగుదలను అరికట్టటంలో వైఫల్యం గురించి తమకు పెరుగుతున్న కరువు భత్యమే పెద్ద సాక్ష్యమని వేరే చెప్పనవసరం లేదు. రెండు నెలలపాటు వుల్లిపాయలను బ్లాక్‌ మార్కెట్‌ చేసి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను జనం నుంచి గుంజిన వ్యాపారులపై తీసుకున్న చర్యలేమిటి ? అదే విధంగా కంది పప్పు. దాని కంటే చేపలు, కోడి మాంసం చౌక అయిందా లేదా ? ఇక ధరల తగ్గింపు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రయివేటు వర్తకులు అడ్డగోలు పద్దతుల్లో ధరలు పెంచారంటే అదొక దారి. వాగ్దానాలు చేయని వాటిని అమలు జరుపుతున్నదని ముందే చెప్పుకున్నాం. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు లీటరు పెట్రోలుపై రు.9.48 పైసలు ఎక్సైజ్‌ డ్యూటీ వుండేది. దానిని ప్రస్తుతం రు.21.48 పైసలకు పెంచారు. రూపాయి విలువను డాలరుకు రు.62.12 నుంచి ( ఫిబ్రవరి ఒకటిన సగటు రేటు) రు.67.68కి పతనం గావించారు. దీంతో చమురు వినియోగదారులకు అటు గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లుగా ప్రపంచ మార్కెట్లో ధరలు పతనమైనా మన దేశంలో వాటి ప్రభావం పెద్దగా లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పోల్చితే నా రూటే సపరేటు అని బిజెపి చెప్పుకుంది. నిజమే అనుకున్నారు జనం. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక్క మెతుకు పట్టుకున్నా చాలని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్‌ విధానాలను అంతకంటే ఎక్కువగా అమలు జరుపుతున్నదనటానికి దిగువ వివరాలు చూడండి.

   సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పత్రాలలో అధికారికంగా రాసినవే. ఇన్ని రాయితీలు ఇచ్చిన కేంద్రం వుద్యోగులకు పన్ను మినహాయింపు విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపుతోంది. పన్ను రాయితీలు అక్కరలేదు, ధరల పెరుగుదలను కూడా స్ధంభింప చేయండి చాలు అని అనేక మంది అంటుంటారు, పోనీ అదైనా చేస్తోందా లేదే. జనం దగ్గర గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ ప్రోత్సాహక పధకాల పేరుతో ఇస్తున్న పరోక్ష రాయితీల మొత్తం పెరుగుతున్నది. అయినా సరే కార్పొరేట్‌, ఇతర బడా కం పెనీలు, పెద్దలు తీసుకున్న రుణాల ఎగవేత కూడా ఏటేటా పెరుగుతున్నది. మరోవైపు మరి ఈ రాయితీల సొమ్మంతా ఎటు పోతున్నట్లు ? గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న రాయితీల మొత్తం ఇలా వుంది. (కోట్ల రూపాయలలో)

2012-13 5,66,234.7

2013-14 5,72,923.3

2014-15 5,54,349.04

2015-16 6,11,128.31

    కేవలం నాలుగు సంవత్సరాలలోనే 22 లక్షల కోట్ల రూపాయలు వివిధ రాయితీల కింద ఇచ్చారు. నిజంగా కాంగ్రెస్‌ విధానాల నుంచి వైదొలిగితే చాయ్‌ వాలా హయాంలో ఈ సబ్సిడీలు తగ్గాలి కదా, చాయ్‌ రేటు కూడా పెరిగిపోయిందా లేదా ? అవే దివాళా కోరు ఆర్ధిక విధానాలు, అంతకంటే ఎక్కువగా అమలు. అందుకే రెండేళ్లలోనే వైఫల్యాల బాట.

    దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్న సామెత తెలిసిందే. అలాగే తమ విధానాలు వైఫల్యం చెందుతాయని నరేంద్రమోడీకి, ఆయనకు మార్గదర్శకంగా వున్న సంఘవపరివార్‌కు తెలియని విషయమేమీ కాదు. అందుకే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నరేంద్రమోడీ మౌన వ్రతం పూనారు. ఏ ఒక్క కీలక సమస్యపైనా మాట్లాడరు. మరోవైపు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనేక అంశాలను ముందుకు తెస్తున్నారు.

   వాటిలో స్వచ్చభారత్‌ ఒకటి. నిజమే దీనితో విబేధించాల్సిన అవసరం లేదు. దీని గురించి కొండంత రాగం తీశారు.ఎక్కడ చూసినా అశుభ్రం తప్ప మరొకటి కనపడటం లేదు. చరిత్రలో ఔరంగ జేబు అనేక పన్నులు చివరికి తల పన్ను కూడా విధించాడని చదువుకున్నాం. ఈ ఆధునిక ఔరంగజేబు మురికి పన్ను విధించేందుకే ఇంత ప్రచారం చేశారనేది ఇప్పుడు రుజువైంది. రెండవది అనధికారిక ఎజండాగా గో సంరక్షణ అంశాన్ని ముందుకు తెచ్చారు. దీని గురించి ఎవరి నమ్మకాలు వారికి వున్నాయి. రోజూ గోమూత్రం తాగే వారు కూడా వున్నారు. తాగనివ్వండి, అనారోగ్యం పాలు కానివ్వండి, కార్పొరేట్‌ అసుపత్రులకు లక్షల రూపాయలు సమర్పయామి చేసుకోమనండి. అది వేరే విషయం.

   మన దేశంలో ఆస్తికులతో పాటు నాస్తికులు కూడా సహజీవనం చేశారన్నది పదే పదే చెప్పుకోనవసంర లేదు. ఆరేడు వందల సంవత్సరాల నాడే యోగి వేమన గొప్ప హేతువాది, నాస్తికుడు. అంతకు ముందు చార్వాకులు,లోకాయతులు వున్నారు. అలా భిన్నఅభిప్రాయం వుండటమే, సహన భావమే మన భారతీయ సంస్కృతి. లేకుంటే భిన్న ఆచారాలు, ఆలోచనలు,తత్వ శాస్త్రాలు మనుగడలో వుండేవే కావు. ఆ పరంపరలోనే కర్ణాటకలో కలుబుర్గి అనే రచయిత అనేక రచనలు చేశాడు. వాటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా ఇచ్చింది. ఆయన రచనలు హిందుత్వకు వ్యతిరేకం అంటూ హిందూ తాలిబాన్లుగా పరిగణిస్తున్నవారు ఒక రోజు కాల్చి చంపారు. తన అవార్డు పొందిన ఒక రచయిత దారుణ హత్యకు గురైతే కనీసం ఖండించటం కనీస సంస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ ఆ పని చేయకపోగా తిరస్కరించింది. అనేక మంది అవార్డు గ్రహీతలు తమ అవార్డులను తిరిగి ఇచ్చి నిరసన తెలిపిన తరవాత గానీ మొక్కుబడిగా ఖండించలేదు. దీని గురించి కూడా కేంద్రం స్పందించలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని హిందూతాలిబాన్లు రెచ్చిపోతున్న స్థితి దేశంలో తలెత్తింది. దీనికి కారణం ఏమిటి కేంద్రంలో తమకు అనుకూలమైన సర్కార్‌ వుందనే ధీమా తప్ప మరొకటి కాదు. ఢిల్లీలో యుమునా నది ఇప్పటికే కాలుష్యమైంది. అలాంటి దానిని మరింత కాలుష్యం చేసే విధంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ 35లక్షల మందిని సమీకరించే ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. అందువలన పర్యావరణానికి మరింత హాని జరుగుతుందని అనేక మంది పర్యావరణ సంరక్షణ కోరుకొనే వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారి వాదన సబబే అని కోర్టు కూడా ఐదు కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. అలాంటి సభలకు పశ్చిమ దేశాలలో అనుమతి ఇవ్వరని వేరే చెప్పనవసరం లేదు. కానీ దానికి అభ్యంతర పెట్టటమే తప్పు దేశద్రోహం అన్నట్లుగా విమలేందు ఝా అనే కార్యకర్తపై ఓంజీ అనే ఒక స్వామి రెచ్చిపోతూ హేతువాది నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, కలబర్గిల మాదిరే నిన్ను హత్య చేస్తాం, నువ్వొక సిఐఏ ఏజంట్‌,ద్రోహివి, జాతి వ్యతిరేకివి అంటూ కెమెరాల ముందే బెదిరింపులకు దిగాడు. వీరు స్వాములా ? గూండాలా ? ఏ దమ్ము చూసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు?

   ఒక ముస్లిం కుటుంబం పండుగ సందర్భంగా గొడ్డు మాంసం తెచ్చుకొని వండుకోవటమేమిటి? అది గో మాంసం అని కొందరు దేవాలయ మైకులో ప్రకటించటం, వందలాది మంది ఆ ఇంటిపై దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేయటం మధ్య యుగాలలోనో అంతకు ముందు ఆటవిక యుగంలో చేసే పని తప్ప మరొకటి కాదు. తీరా అది గోమాంసం కాదని తేలింది. దేశమంతటా దాని గురించి ఆవేశకావేషాలను రెచ్చగొట్టింది ఎవరు ? ఆ సామూహిక హత్యకు పాల్పడిన నేరగాళ్లను అరెస్టు చేస్తే దానికి వ్యతిరేకంగా బిజెపి వారు రంగంలోకి రావటాన్ని బట్టి దీని వెనుక వారి పధకమే వుందని జనం అనుకున్నారు.దేశమంతటా చర్చనీయాంశం అయింది, దాని గురించి మాట్లాడవయ్యా అంటే మోడీ నోరు విప్పరు.

   అప్జల్‌ గురు అనే వుగ్రవాది నాయకత్వంలో పార్లమెంట్‌పై దాడి జరిగిందని కోర్టు తీర్పు చెప్పి వురి శిక్ష విధించింది. అసలు వురిశిక్షలనే వ్యతిరేకిస్తున్నవారు మన దేశంలో వున్నారు. వురి శిక్ష పడిన ఎవరైనా క్షమా భిక్ష కోసం దరఖాస్తు చేసుకోవటానికి చట్టం అవకాశం ఇచ్చింది. వారు వుగ్రవాదులా మరొక దారుణం చేసిన వారా అనేది ఎక్కడా లేదు. ఆ విధంగా చూసినపుడు అప్జల్‌ గురుకు తగిన అవకాశం ఇవ్వకుండా తొందరపాటుతో వురి తీశారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అదే అభిప్రాయంతో హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో కొందరు విద్యార్ధులు సభ పెట్టారు. ఆ వురిని ఖండించారు.అలాంటి సభలు కాశ్మీర్‌లో, దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక జరిగాయి. ఇష్టం వున్న వారు పాల్గొన్నారు. లేనివారు లేదు. కానీ అలాంటి సభ జరపజరపటం దేశ ద్రోహం, విశ్వవిద్యాలయ దేశ ద్రోహ కార్యకలాపాలకు నిలయంగా మారింది చర్యలు తీసుకోండంటూ ఇద్దరు కేంద్రమంత్రులు లేఖలు రాయటం వారిని మెప్పించేందుకు ఐదుగురు దళిత విద్యార్ధులపై చర్యలు తీసుకోవటం, వారిలో ఒకరైన వేముల రోహిత్‌ ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. తీరా అది కేంద్ర ప్రభుత్వం, బిజెపి మెడకు చుట్టుకోవటంతో ఆ సమస్యను పక్కదారి పట్టించేందుకు అసలు రోహిత్‌ దళితుడు కాదు బిసి అని బిజెపి అనుబంధ ఎబివిపి వారు ఒక తప్పుడు ప్రచారం ప్రారంభించారు.

    అప్జల్‌గురు వురితీయటం సరైంది కాదు అన్న అభిప్రాయం వ్యక్తం చేయటమే దేశద్రోహమైతే అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటమే కాదు, గురు అస్తికలను కాశ్మీర్‌కు అందచేయాలని కోరిన కాశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పిడిపి)తో కలసి బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసింది? అది దేశ ద్రోహం కాదా ? కాశ్మీర్‌లో వేర్పాటు వాదానికి గురైన ప్రతి ఒక్కరూ అప్జల్‌ గురు వురిని వ్యతిరేకిస్తారు.అందరినీ దేశద్రోహులు కింద జమకట్టి చర్యలు తీసుకుంటారా ?

   ఈ వుదంతం సద్దుమణగ ముందే ఢిల్లీలోని జెఎన్‌యులో మరో చిచ్చు రేపారు. అక్కడ కూడా అప్జల్‌ గురు వురి మీదే కొంత మంది సాంస్కృతిక కార్యక్రమం పేరుతో ఒక సభను ఏర్పాటు చేశారు. దానికి విశ్వవిద్యాలయ అధికారులు అనుమతించారు. చివరి నిమిషంలో ఏబివిపి జోక్యం చేసుకొని అ సభ జరగటానికి వీల్లేదు అంటూ అభ్యంతర పెట్టింది. దాని వత్తిడికి లొంగి పోయిన అధికారులు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో సభ నిర్వాహకులు విశ్వవిద్యాలయంలోని ఇతర విద్యార్ధి సంఘాలు, విద్యార్ధి యూనియన్‌ నాయకులను కలసి సభ జరుపుకొనేందుకు తమకు సహకరించాలని సాయం కోరారు. ఈ రోజు ఏబివిపి వత్తిడితో ఈ సభ అనుమతిని రద్దు చేసిన వారు రేపు తమ సభలనైనా అడ్డుకుంటారనే భయంతో అన్ని సంఘాలు ఏకమైన ముందు ఇచ్చిన అనుమతి ప్రకారం సభ జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వాలని వత్తిడి తెచ్చాయి. దాంతో లౌడ్‌ స్పీకర్లు లేకుండా సభ జరుపుకోవచ్చని అధికారులు

  షరతులతో అనుమతి ఇచ్చారు. అయితే ఆ సభను అడ్డుకోవాలని ఎబివిపి నిర్ణయించి తమ మద్దతుదార్లను సమీకరించటంతో సభ ప్రాంగణంలో మిగతా విద్యార్ధి సంఘాల కార్యకర్తలు కూడా అక్కడే వున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. జెఎన్‌యు వివిధ భావజాలలను స్వేచ్చగా చర్చించుకొనేందుకు అనువైన వాతావరణం ఒక నిజమైన ప్రజాస్వామిక కేంద్రం. ఇక్కడ వామపక్ష వాదులు, నక్సలైట్లు, వేర్పాటు వాదులు, అరాజకవాదులు, ఇతర అన్ని రకాల భావజాలంతో వుండే విద్యార్ధులు వున్నారు. అలాంటి వారిలో కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని సమర్దించే నక్సలైట్లు, ఇతరులు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సభను ఏర్పాటు చేశారు. ఆ విషయం విశ్వవిద్యాలయ అధికారులకూ తెలియందేమీ కాదు. వారి భావజాలాన్ని, కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించే ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ ఆ సభకు ఎందుకు వెళ్లారని అనేక మంది అడగవచ్చు.వివాదాస్పద అంశాలపై సభలు జరగటం అక్కడ కొత్త కాదు. అసలు అధికారులు లేదా శాంతి భద్రతల సమస్య తలెత్త వచ్చని నిఘావర్గాలు హెచ్చరించినపుడు తొలుత అనుమతి నిరాకరించి వుంటే వుంటే అది నిర్వాహకులు- అధికారుల మధ్య సమస్యగా వుండేది. ఏబివిపి రంగ ప్రవేశంతోనే అసలు సమస్య వచ్చింది. షరతులతో కూడిన సభ జరిగింది. దానిలో చేసిన వుపన్యాసాలు, వాటిలోని అంశాలతో మిగతా విద్యా ర్ధి సంఘాలకు ఎలాంటి ప్రమేయం ఏకీభావం లేదు. దానిని ఎబివిపి అడ్డుకోవటంతో అక్కడ గొడవ జరిగింది. కొంత మంది బయటి నుంచి వచ్చిన వారు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇదీ జరిగింది. కానీ చివరికి అది ఎలా మారిపోయింది?

     విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య, ఇతర విద్యార్ధి సంఘాల నాయకులు అక్కడ చేరి దేశ వ్యతిరేక నినాదాలు చేశారని, అందువల వారిపై దేశద్రోహం నేరం కింద పోలీసులు కేసు బనాయించారు. అనేక మంది విద్యా ర్ధులకు నోటీసులు ఇచ్చారు. వారిలో కొందరు సభా నిర్వాహకులు కూడా వున్నారు.ఇక్కడ చిత్రమేమంటే నిజంగా నినాదాలు ఇచ్చిన వారిలో ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకోలేదు.వీడియోను మార్ఫింగ్‌ చేసి నినాదాలు చేయని వారు చేసినట్లు తయారు చేసిన నకిలీ వీడియోల ఆధారంగా కేసులు బనాయించి కన్నయ్యను అరెస్టు చేశారు. తీరా అవి నకిలీవి, అతను ఆ నినాదాలు చేయలేదని తేలటంతో ఆరునెలల బెయిలు ఇచ్చారు. కన్నయ్యను కోర్టులో హాజరు పరిచినపుడు బిజెపి ఎంఎల్‌ఏ, లాయర్ల ముసుగులో వున్న కొందరు కన్నయ్య మీద, వార్తలను కవర్‌ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుల మీద దాడులకు దిగారు. కన్నయ్య అరెస్టును ఖండించిన వారందరినీ దేశద్రోహులుగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. దాడులను రెచ్చగొట్టారు. మహిళా జర్నలిస్టులను మానభంగం చేస్తామని బెదిరించారు. అన్నింటికంటే దారుణం జెఎన్‌యులో రోజుకు మూడు వేల కండోమ్‌లను వినియోగిస్తారని, మందుతాగుతారని స్వయంగా బిజెపి ఎంఎల్‌ఏ తప్పుడు ప్రచారానికి దిగాడు. అక్కడ చదివే వారిలో ఎబిపివి చెప్పే భారత మాత పుత్రికలు, పుత్రులు కూడా వున్నారని అది వారికి కూడా వర్తిస్తుందనే జ్ఞానం సదరు నేతకు లేకపోయింది. వీటిపై కూడా నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు.అందుకే దేశంలో ఏం జరుగుతోంది, ఎటు పోతోంది అని ప్రతివారూ ఆలోచించాల్సిన తరుణం ఇది. బిజెపి పూర్వీకులు స్వాతంత్య్ర వుద్య మ సమయంలో బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి లొంగిపోయి లేఖలు రాసిన చరిత్ర కలిగిన వారు. అందుకే భగత్‌ సింగ్‌, రాజగురు,సుఖదేవ్‌లను వురితీసినపుడు వారెక్కడ వున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అలాంటి వారు దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందువలన ఏది దేశభక్తి, ఏది దేశ ద్రోహం అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చర్చించాలి. విదేశీ కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇవ్వటం, మన సొమ్మును విదేశాలకు తరలించుకుపోనివ్వటం ప్రభుత్వ విధానంగా వుంది.ఇది దేశద్రోహమా దేశ భక్తా ?ఈ విధానాన్ని ఎవరైనా విమర్శిస్తే ఇప్పుడున్న బ్రిటీష్‌ కాలం నాటి చట్ట ప్రకారం దేశద్రోహ నేరం కింద జైల్లో పెట్ట వచ్చు.జర్మనీలో హిట్లర్‌ కూడా దేశ భక్తి, జాతీయ వాదంతోనే రెెచ్చగొట్టి తనను వ్యతిరేకించిన వారిని మారణకాండకు బలిచేశాడు. ఇప్పుడు మనదేశంలో కూడా నేను చెప్పిందే దేశభక్తి కాదని కాదన్న వారిని ఖతం చేస్తా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు మనకేమీ ముప్పులేదులే అని ఎవరైనా అనుకుంటే మనదాకా వచ్చినపుడు అయ్యో పాపం అనేవారుండరు .

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు విదేశీ కత్రోచి స్వదేశానికి ! నేడు స్వదేశీ మాల్యా విదేశాలకు !!

11 Friday Mar 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, cbi, defaulter, ottavio quattrocchi, vijay mallya

 

సత్య

అబ్బ దేశభక్త అరుణ్‌ జెట్లీ బలే చెప్పిండు కదా ! జనం సొమ్ము ప్రతి పైసాకు జవాబుదారీగా వుంటా, అవినీతి పరుల భరతం పడతా, చీల్చి చెండాడుతా అని వీర, శూర ప్రతిజ్ఞలు చేసిన నరేంద్రమోడీ గత రెండు సంవత్సరాలుగా తమ పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా అవినీతిని చూపమని సవాలు చేస్తున్నారు. అవినీతి అంటే ఫలానా రూపు రేఖలు వుండేదే అని ఎక్కడా నిర్దిష్టంగా నిర్వచించలేదు. ప్రధాన మంత్రి ఇంకే మాత్రం తమది శుద్ధమైన పాలన అని చెప్పుకోవటానికి లేదు. ఇంతవరకు ఒక్క అవినీతి పరుడిని, నల్లధనం దాచుకున్న వారిని శిక్షించిన లేదా అందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు.అన్నింటికీ మించి తొమ్మిదివేల కోట్ల రూపాయల సొమ్ము ఎగవేసిన విజయ మాల్యా విదేశాలకు పారిపోయేందుకు అవకాశం ఇవ్వటాన్ని అవినీతి అని గాక దేశభక్తి అని చెబుతారా ?

మాల్యా అంటే దేశద్రోహ నిందలు మోపి కేసులు బనాయించిన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్ధులు దేశం విడిచి తప్పించుకోకుండా కనిపిస్తే నిర్బంధించమని జారీ చేసిన నోటీసుల(అవుట్‌లుక్‌) విషయం గుర్తుకు వచ్చింది ! వారి కోసం పోలీసులు జెఎన్‌యు గేట్ల ముందు పడిగాపులు కాశారు. వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ మాల్యా అనే పైలా పచ్చీసు దేశం విడిచి వెళ్లే కేంద్రాలలో కనిపిస్తే నిర్బంధించండని తొలుత నోటీసులు జారీ చేసిన సిబిఐ కొద్ది రోజుల్లోనే ఎక్కడికి వెళ్లేది తెలియచేస్తే చాలని సవరించింది. ఇదంతా జరిగింది ఎప్పుడు ? 2015 అక్టోబరు 16, నవంబరు మాసాలలో, అదీ మోడీ పాలనలోనే ! దీని భావమేమి తిరుమలేశా !

ప్రభుత్వాన్ని ఇరకాటం నుంచి తప్పించేందుకు విజయ్‌ మాల్య విదేశీ పర్యటన గురించి తమకు తెలుసునని, గతంలో కూడా వెళ్లాడని, తిరిగి రాకపోతే ఏం చేయాలో కూడా తెలుసునని సిబిఐ అనధికారికంగా మీడియాకు చెప్పింది. ఇక్కడే చిన్న తిరకాసు వుంది. లలిత్‌ మోడీ అనే పెద్ద మనిషి కూడా పారిపోతే ఏం చేశారో చెబితే బాగుండేది. పార్లమెంట్‌ సభ్యులెవరైనా పది రోజుల పాటు సమావేశాలకు హాజరు కాలేని పరిస్ధితులలో సభాధ్య్ష స్ధానం నుంచి అనుమతి తీసుకోవాలి. మాల్య మార్చి ఒకటవ తేదీన రాజ్యసభకు హాజరయ్యాడు.ఈనెల 16న సమావేశాలు వాయిదా పడతాయి. అంటే సరిగ్గా పదిరోజులు జరుగుతాయి. అయినా ఎలాంటి అనుమతి తీసుకోకుండా లండన్‌ వెళ్లాడు. అంతే కాదు ఎంపీలు ఎవరైనా విదేశీ పర్యటనలు జరపదలచుకుంటే ఆ విషయాన్ని విదేశాంగశాఖకు తెలియచేయాలని కూడా సలహా వుంది. ఇవేవీ పాటించలేదు, తాను విదేశాలకు వెళుతున్నట్లు అటు రాజ్యసభ అధ్యక్ష స్ధానానికి, విదేశాంగశాఖకు, నోటీసు జారీ చేసిన సిబిఐకి కూడా చెప్పలేదు. తీరా అది వివాదం అయిన తరువాత గతంలో చాలాసార్లు వెళ్లాడు, తిరిగి వచ్చాడు, పిలిచినపుడు వచ్చి మాకు సహకరించాడు, అతను వాణిజ్యవేత్త కనుక ప్రతి ఏడాది కనీసం 183 రోజులకు పైగా విదేశాలలో వుంటారు అనే కాకమ్మ కబుర్లు చెబుతోంది సిబిఐ.

మొత్తం మీద జరిగిన పరిణామాలన్నింటినీ చూస్తుంటే సదరు మాల్యా దేశం విడిచి పోవటానికి నవంబరులోనే మోడీ సర్కార్‌ దోవ చూపిందన్నమాట. తనకు రావాల్సిన బకాయి వసూలుకు గాను మాల్యాను దేశం విడిచి వెళ్లకుండా చూసేందుకు ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని బెంగలూరులో ఎస్‌బిఐ పిటీషన్‌ దాఖలు చేసిన రోజే , మార్చినెల రెండవ తేదీనే సరిగ్గా మాల్యా కూడా దేశం నుంచి తప్పించుకున్నాడు. అంటే ముందే వుప్పందకుండా అది ఎలా సాధ్యం? ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్‌ బ్యూరో వారు మాల్యా విమానాశ్రయానికి రాగానే వెంటనే సిబిఐకి తెలియచేసినప్పటికీ అయితే ఓకే అన్నట్లుగా సిబిఐ అధికారులు వ్యవహరించారు. ఎప్పుడూ నలుగురైదుగురు రంగీలాలను వెంట వేసుకు తిరిగే మాల్యా లండన్‌ వెళుతూ తన వెంట ఒక యువతితో సహా ఏడు పెద్ద సూట్‌కేసులు తీసుకు వెళ్లాడని వెల్లడైంది. ఇది వాణిజ్యం కోసం వెళ్లినదిగా లేదని అనేక మంది చెబుతున్నారు.

ఈ విషయాలేవీ తెలియనట్లు, అపర దేశభక్తుడైన మన ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ అరే మాల్యా దేశం విడిచి వెళ్లాడా? ఎప్పుడు ? అని ఆశ్చర్యం నటించి వెంటనే కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగి మీ హయాంలో బోఫోర్సు కుంభకోణంలో నిందితుడు కత్రోచీ దేశం విడిచి తప్పించుకుపోయిన విషయాన్ని మర్చిపోవద్దు, అయినా మాల్యాకు కాంగ్రెస్‌ హయాంలోనే కదా రుణాలు ఇచ్చారు అని చెప్పటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఆ పెద్దమనిషి రెండవ సారి రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినపుడు బిజెపి ఓట్లతోనే విజయం సాధించాడు. ఏ బంధంతో బిజెపి ఓట్లు వేసింది. కింగ్‌ ఫిషర్‌ విమానాల కంపెనీ బండారం 2012లోనే బయట పడింది. మరుసటి ఏడాది మూత పడే సమయానికి దాని మొత్తం నష్టం 16వేల కోట్ల రూపాయలు దాటిందన్నది జగమెరిగిన సత్యం. అలాంటి కంపెనీకి అన్నివేల కోట్ల రూపాయల అప్పులిచ్చారు? ఎలా వసూలు చేస్తారని ప్రతిపక్షంగా బిజెపి ఇతర అనేక సందర్బాలలో చీటికి మాటికి ఆందోళన చేసిన పార్టీ ఎప్పుడైనా పార్లమెంట్‌ను స్ధంభింప చేసిందా? ఎందుకు చేయలేదు?మాల్యా తమకు సాయం చేసే దేశభక్తుడనా ? బోఫోర్సు కుంభకోణంలో లబ్దిదారులు కాంగ్రెస్‌ వారు కనుక విదేశీ కత్రోచీని స్వదేశానికి పంపినదానికి బదులు తీర్చుకొనేందుకు మీరు స్వదేశీ మాల్యాను విదేశాలకు పంపినట్లా ? కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన రుణాలను వసూలు చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదా ?

కేంద్ర దర్యాప్తు సంస్ధ సిబిఐ మాల్య కనిపిస్తే నిలిపివేయండని తొలుత ఇచ్చిన నోటీసును ఎక్కడికి వెళ్లేది తెలియచేస్తే చాలని ఎందుకు సవరించినట్లు ? సవరించింది పో, మార్చి రెండవ తేదీన మాల్యా లండన్‌ వెళ్లే విమానం ఎక్కినట్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలియ చేసిన తరువాత మాల్యా విదేశాలకు పారిపోయినట్లు వార్తలు వచ్చిన వెంటనే ఆ విషయం తమకు తెలుసని సిబిఐ ఎందుకు ప్రకటించలేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండగా ఇంత ముఖ్యవిషయం మంత్రులకు కూడా వెంటనే తెలపలేదా ? లేక తెలిసి కూడా కావాలనే దాచి పెట్టారా ? పార్లమెంట్‌లో ఈ విషయాలను ఎందుకు ప్రకటించలేదు? వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగితే కుదరదు.

పరారీ గురించి దేశంలో, పార్లమెంటులో గగ్గోలు చెలరేగిన తరువాత శుక్రవారం నాడు తాను దేశం విడిచి పారిపోలేదని మాల్య ట్విటర్‌ ద్వారా తెలిపాడు, ఎక్కడున్నదీ వెల్లడించలేదు. మీడియా తనను వేధిస్తున్నదని, తన నుంచి సాయం పొందిన ఛానల్స్‌ యజమానులు దానిని మరిచిపోవద్దని, ఛానల్స్‌ రేటింగ్‌ను పెంచుకొనేందుకు అవాస్తవాలు చెబుతున్నారని, వారికేం చేసిందీ తన దగ్గర రికార్డులు వున్నాయని మాల్యా పేర్కొన్నాడు. తనకు రుణాలు ఇచ్చిన బ్యాంకులపై కూడా ధ్వజమెత్తాడు.

మాల్యా తనపై వచ్చిన వార్తలను వక్రీకరణలని ఆరోపించటమే కాదు, తాను పారిపోవటం లేదని ఇంతకు ముందు కూడా వివరణ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో తాను లండన్‌లో తన పిల్లల దగ్గర ఎక్కువ సమయం గడిపేందుకు వెళుతున్నానని చెప్పినదానిని లండన్‌లో స్ధిరపడేందుకు అన్నట్లుగా రాశారని, క్రమంగా వ్యాపారాన్ని తగ్గించుకోవటం తన వుద్ధేశ్యమన్నాడు.డియాజియో సంస్ధకు తన లిక్కర్‌ కంపెనీని పూర్తిగా అమ్మివేసి తనకు రావాల్సిన సొమ్మును కూడా తీసుకున్నాడు.

బ్యాంకులు తన ఆస్తులను వెల్లడించమని కోరుతున్నాయని, తనకేమి వున్నాయో తెలియకుండా వున్నాయా అంటూ తనకున్న ఆస్తులేమిటో తాను రాజ్యసభకు రెండు సార్లు ఇచ్చానని కావాలంటే చూసుకోవచ్చని చెప్పాడు. వాటి ప్రకారం మాల్యాకు ఆస్తులు, అప్పులు లేవు. అంటే స్వాధీనం చేసుకొనేందుకూ కూడా ఏమీ లేకుండా ముందే జాగ్రత్త పడినట్లే.

మరోవైపు మాల్యా తీసుకున్న అప్పుల కంటే ఎక్కువ ఆస్తులున్నాయని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహతగి సుప్రీం కోర్టుకు తెలిపారు. పాస్‌పోర్టుతో సహా దేశానికి తిరిగి రావాలని నోటీసు జారీ చేయాలని సోమవారం నాడు సుప్రీ ం కోర్టు వుత్తరువు జారీ చేసింది.అయితే ఆ నోటీసు ఎప్పుడిస్తారో తెలియదు. మొత్తం మీద సరళీకరణ విధానాలతో ప్రభుత్వ బ్యాంకులను ఎలా వాడు కోవచ్చో, కొల్లగొట్టవచ్చో విజయమాల్య వుదంతం వెల్లడించింది. ఇవే కాదు, నిరర్ధక ఆస్తుల పేరుతో బ్యాంకులు చెబుతున్న లక్షల కోట్ల పారుబకాయిలన్నీ ఇలా ముంచినవే. ఒకవైపు ఆర్ధిక వ్యవస్థ బ్రహ్మాండంగా వుందంటారు. మరోవైపు బ్యాంకులను ముంచని, ప్రజల ఆస్తులను కొల్లగొట్టని బడా ప్రయివేటు సంస్ధ ఒక్కదానిని కూడా మనం చూడలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జెఎన్‌యు ఘటనల్లో మీడియా విశ్వసనీయతను దెబ్బ తీసిన కొన్ని సంస్ధలు

08 Tuesday Mar 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, Bjp nationalism, credibility, JNU, JNU ROW, journalists, Media, media credibility, nationalism

జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

ఎం కోటేశ్వరరావు

    చదువరులను చంపటానికి రచయిత తన పెన్నును గన్నుగా వుపయోగిస్తాడని ఒక పెద్దమనిషి చెప్పాడు.టీవీలు తలుచుకుంటే విద్యార్ధుల జీవితాలను అంతం చేయటానికి, విద్యా సంస్ధల పరువు ప్రతిష్టలను గంగలో కలపటానికి నకిలీ వీడియోలను వీక్షకుల ముందుంచుతాయని తాజాగా ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు) వుదంతాన్ని చూసిన తరువాత ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.కొన్ని టీవీ ఛానల్స్‌ ప్రసారం చేసిన రెండు వీడియోలు నకిలీవని తిమ్మిని బమ్మిని చేశారని హైదరాబాద్‌లోని ట్రూత్‌ లాబ్‌ వెల్లడించింది. దీంతో మొత్తం మీడియా పరువు కాలుష్య గంగలో కలిసింది . ఏప్రిల్‌ ఒకటవ తేదీన చదువరులను, వీక్షకులను ఫూల్స్‌ చేయటానికి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు చేసేవిన్యాసాలలో అలాంటి ట్రిక్కులను ప్రయోగిస్తాయి, చివరిలో ఏప్రిల్‌ ఫూల్స్‌ డే సందర్భం అని చెబుతాయి. కానీ ఇప్పుడు అటువంటి దానికి అవకాశం లేకుండా పోయింది. వాటిని చూసి ఎవరైనా దాడులకు దిగినా ఆశ్చర్యం లేదు. అంతగా మీడియా విశ్వసనీయత కోల్పోయిందంటే అతిశయోక్తి కాదు.

   మీడియా నిష్పాక్షికంగా వుండదని తెలుగు నేలలో జనానికి 1940,50 దశకాలలోనే తెలుసు.కమ్యూ నిస్టులకు వ్యతిరేకంగా, మహత్తర తెలంగాణా సాయుధ పోరాటాన్ని దెబ్బతీసేందుకు కట్టు కధలకు మీడియా పుట్టినిల్లని అవగతమైంది.తరువాత నాలుగు దశాబ్దాల క్రితం అత్యవసర పరిస్ధితి సమయంలో కొన్ని పత్రికలు నిరంకుశత్వాన్ని, నియంతలను కూడా ఎలా బరపరుస్తాయో దేశమంతా చూసింది. బాబరీ మసీదు విధ్వంసం సందర్భంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు కూడా మీడియా వెనుకాడదని ఆ సమయంలో మరి కొన్ని పత్రికలు, టీవీలు రుజువు చేశాయి. కొన్ని రాజకీయ పార్టీలు టీవీ, పత్రికలను స్వయంగా ఏర్పాటు చేసుకుంటే, మరికొన్ని పార్టీలు స్వతంత్రముసుగులో పనే చేసే వాటిని తమ బాకాలుగా మలుచుకోవటమూ తెలిసిందే. ఇప్పుడు జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

     ప్రతి కీలక సమయంలోనూ మీడియా రెండు తరగతులని వెల్లడి అవుతూనే వుంది. స్వాతంత్య్రానికి ముందు ప్రధాన స్రవంతి మీడియా రెండు రకాలు. ఒకటి స్వాతంత్య్రాన్ని కోరుకున్న దేశ భక్త తరగతి, రెండవది బ్రిటీష్‌ వారి పాలన కొనసాగాలని పాటుపడిన రాణీగారి ప్రతిపక్ష తరగతి. ఇప్పుడు కూడా మీడియా ఒకటిగా లేదు. ప్రజా వుద్యమాలు, ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిచ్చే ప్రచార మీడియా . మిగతా వాటిలో ఎన్నో వుప తరగతులున్నాయి. అన్నింటినీ ఒకే గాటన కట్టలేము. కొన్ని పెట్టుబడులతో నడిచేవే అయినప్పటికీ లౌకిక, వుదారవాద విలువలకు కట్టుబడుతున్నాయి. మరికొన్ని కుల, మతోన్మాద శక్తులకు , తిరోగమన భావాలకు పెద్ద పీట వేస్తున్నాయి. వీటి గురించి లోతైన విశ్లేషణ జరగాల్సి వుంది. ప్రస్తుతం జెఎన్‌యు సంబంధిత వ్యవహారాల సందర్బంగా మీడియా ఎలా వ్యవహరించింది అన్నదానికే పరిమితం అవుదాము.

   జెఎన్‌యు పరిణామాలను చూసిన అనేక మంది భారత్‌లో ఏదో అవాంఛనీయ పరిణామం జరగబోతోందని భయపడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. వర్షం రాబోయే ముందు మట్టికి ప్రత్యేక వాసన వస్తుంది. అది మధురంగా వుంటుంది. కానీ జెఎన్‌యు పరిణామాల సందర్భంగా కొన్ని మీడియా సంస్ధలు వ్యవహరించిన తీరు అశుభాన్ని సూచించింది. ఇక్కడ శుభం-అశుభాల గురించి విశ్వాసం సమస్య కాదు. ఒక ప్రమాదకర, ఏకపక్ష భావజాలానికి అనుగుణంగా ఒక వర్గం మీడియా తన వంతు నృత్యం చేయటం నిజంగా భారత ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచిక అని చాలా మంది భావిస్తున్నారు. ఇటువంటి ధోరణులు గతంలో లేవా అంటే బాబరీ మసీదు విధ్వంసం, గుజరాత్‌ మారణహోమం, అనేక ప్రాంతాలలో జరిగిన మత దాడులు, ఘర్షణల సందర్భంగా కూడా వెల్లడైంది. దానితో పోల్చి చూసినపుడు ఇది మరింత ప్రమాదకరం.బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను ఎదిరించేందుకు మన దేశంలో ముందుకు వచ్చిన జాతీయ వాదానికి, ప్రపంచ ఆక్రమణకు హిట్లర్‌ ఎంచుకున్న జాతీయ వాదానికి తేడా వుంది. దానిని గుర్తించితే ఇప్పుడు దేశంలో ముందుకు తీసుకు వస్తున్న జాతీయ వాదం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. హిట్లర్‌ జాతీయ వాదంలోని కొన్ని ప్రమాదకర లక్షణాలు కాషాయ మార్కు జాతీయ వాదంలో వున్నాయి. పాకిస్ధాన్‌ వ్యతిరేకతే అసలైన దేశభక్తిగా , కొన్ని సమస్యలపై తమ వైఖరితో ఏకీభవించని వారందరినీ దేశద్రోహులుగా చిత్రించి, వారిపై రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోంది. హిట్లర్‌ నాడు యూదు వ్యతిరేకతను రెచ్చగొడితే నేడు ముస్లిం వ్యతిరేకతను ముందుకు తెస్తున్నారన్నది ఒక అభిప్రాయం. నాడు అనేక మంది హిట్లర్‌ ప్రచారానికి ప్రభావితులై రాగల ప్రమాదాన్ని చూసేందుకు నిరాకరించి ఒక చివరకు వెళితే అదే జర్మనీలో నేడు హిట్లర్‌ పేరును పలకటానికి కూడా జనం ఇచ్చగించకుండా వుండం, జాతీయ వాదం అంటేనే ఆమడ దూరం పోవటం చూస్తుంటే చరిత్ర పునరావృతం అవుతుందా అనిపిస్తోంది. అయితే జర్మన్‌ జాతీయ వాదం ప్రపంచాన్ని ఎంతగా నాశనం చేసిందో, మన దేశంలో ముందుకు తెస్తున్న కుహనా జాతీయ వాదం అదే స్దాయిలో నష్టాలను కలిగించవచ్చు.

      ఈ పూర్వరంగంలో చరిత్ర పాఠాలు తీసుకోవాల్సిన బాధ్యత మన జర్నలిస్టుల మీద లేదా ? వాస్తవాలకు విరుద్దంగా యాజమాన్యాల మనసెరిగి వార్తలనుమలచటం జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారందరికీ కొట్టిన పిండే.అది నైతికమా కాదా అన్న చర్చ వచ్చినపుడు వెల్లడౌతున్న ధోరణులేమిటి? మనకు వేతనాలిచ్చి పనిచేయించుకుంటున్నపుడు యజమానులు చెప్పినట్లు నడుచుకోకపోతే వుద్యోగాలు వుండవు కదా అన్నది ఒకటి. యజమానుల ఆదేశాలు ఎక్కడా రాతపూర్వకంగా లేదా సాక్ష్యాలకు ఆధారాలు లేకుండా వుంటాయి కనుక, వుద్యోగం కావాలంటే వారు చెప్పిన తప్పుడు పనులు చేయటం సర్వసాధారణంగా జరుగుతోంది. ప్రతి పదికిలోల బియ్యానికి ఒక కిలో మట్టి పెడ్డలు కలపమని మిల్లు యజమాని ఒకసారే చెపుతాడు. ఎప్పుడైనా పట్టుపడ్డారనుకోండి, కార్మికులే సరిగా మట్టి పెడ్డలను తొలగించలేదని జనం ముందు కేకలు వేస్తాడు, కేసులు వస్తే ఒకరో ఇద్దరో చిరుద్యోగులను బలి చేస్తాడు. అలాగే మీడియా సంస్ధలు కూడా తయారయ్యాయంటే అతిశయోక్తి కాదు. అందువలన వార్త పవిత్రమైనది కాదు. తెనాలిరామకృష్ణ సినిమాలో నియోగి అంటే ఎలా కావాలంటే అలా వినియోగ పడేవాడు అని భాష్యం చెప్పినట్లుగా ఇప్పుడు వార్త వున్నది. కనుక ఎవరైనా మేము పక్షపాత రహితంగా వార్తలు ఇస్తున్నాము అని చెప్పుకుంటున్నారంటే అనుమానించాల్సిందే. జాగ్రత్తగా పరిశీలించాల్సిందే. ఇటీవల మన కళ్ల ముందే జరిగిన రిలయన్స్‌ కంపెనీ గ్యాస్‌ దొంగతనానికి పాల్పడటం గురించిన వార్త అందరికీ ప్రాముఖ్యత కలిగినదే, కానీ కొన్ని పత్రికలు, టీవీలు ప్రముఖంగా ఇస్తే మరికొన్ని ఆ ఏదో జరిగిందటలే అన్నట్లు ఇచ్చాయి. ఏ కోర్టులైనా జోక్యం చేసుకొని సిగిరెట్‌ పాకెట్లు, మద్యం సీసాలపై చట్టబద్దమైన హెచ్చరికల మాదిరి మా వార్తలు మా యజమానుల ఆలోచనలకు లోబడే వుంటాయి అని ఆదేశిస్తే ప్రతివార్తకూ కాకపోయినా ప్రతి పేజీలో పాఠకులకు కనపడేట్లు, టీవీలలో అయితే కింద స్క్రోలింగ్‌ వేసుకోవాలి. అలాంటి హెచ్చరికలు వున్నా మద్యం, సిగిరెట్లు తాగే వారు లేరా అంటే ఆ విషయం ఆదేశించిన వారికీ తెలుసు.

    ఇప్పుడు అలా చేయటం లేదు అంతా నిఖార్సయిన పక్కా నిజమైన వార్తల పేరుతో నడుస్తోంది. అవి వివాదాస్పదం అయినపుడు లేదా కొందరికి కోపకారణమైనపుడు బలౌతున్నది జర్నలిస్టులు తప్ప యజమానులు కాదు. వేతనాలు తీసుకొని పని చేస్తున్నంతమాత్రాన తప్పుడు పనులు చేయాలని లేదు.మనం నాగరికులం, దేశ పౌరులం, మనకూ బాధ్యతలు కూడా వున్నాయని గుర్తించాలా లేదా ? జెఎన్‌యు వుదంతంలో ‘ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా వ్యవహరిస్తూ అనేక మంది విద్యార్ధుల కలలు,ఆశలూ, ఆకాంక్షలూ జీవితాలను నాశనం చేసేందుకు పూనుకున్న వైఖరికి నిరసనగా తన వుద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు జీ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ విశ్వదీపక్‌ తన లేఖలో పేర్కొన్నాడు. తనకు మరొక సంస్ధ వుద్యోగం ఇవ్వదని కూడా చెప్పాడు. వర్తమాన మీడియా పరిస్ధితులపై ఇంతటి తీవ్ర విమర్శ, వుద్యోగ భద్రత, స్వతంత్ర అభిప్రాయాలను సహించలేని యాజమాన్యాల ధోరణిపై విమర్శ, నిరసన ఇంతకు ముందు వెల్లడి కాలేదేమో. టీవీ ఛానల్స్‌ జబ్బు పడ్డాయని ఎన్‌డిటీవీ ఎడిటర్‌ రవీష్‌ కుమార్‌ తన నిరసన లేదా ఆవేదన వ్యక్తం చేసేందుకు తన కార్యక్రమాన్ని మొత్తంగా చీకట్లోనే నిర్వహించి మీడియాలో జీవితాలను నాశనం చేసే వారే కాదూ కాపాడాలని కోరుకొనే వారూ కూడా వున్నారని, అందుకు సహకరించే యాజ మాన్యాలు కూడా లేకపోలేదని లోకానికి తెలియ చెప్పారని అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. నలభై సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని విధించటానికి నిరసనగా కొన్ని పత్రికలు తొలి రోజులలో సంపాదకీయాల స్ధానాన్ని ఖాళీగా వుంచి పాఠకులకు అందించాయి. ఇప్పుడు జెఎన్‌యు విద్యార్దుల వ్యవహారంలో పోలీసులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నాటి పరిస్థితులను తలపిస్తున్నదని గానీ లేదా మీడియాలో కొందరి హానికరమైన పోకడలను ఎత్తి చూపేందుకు గానీ ఎన్‌డిటివీ ఇలా చేసి వుండవచ్చని వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఏమైనా ఇది హర్షణీయమే. ఈ చర్యపై కూడా విరుచుకుపడుతున్నవారు లేకపోలేదు. కొన్ని వుదంతాలను పేర్కొని అప్పుడు అలా ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చేసినది సరైనదే అని ముందు వారు అంగీకరిస్తే తరువాత గతంలో ఎందుకు చేయలేదు అని అడగటానికి వారికి నైతికంగా హక్కు వుంది. కానీ వారి తీరు అలా లేదు.అయినా ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కావాలా లేదా ? చర్చ జరగనివ్వండి.

     జెఎన్‌యుపై దాడి చేయటానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అక్కడ జరిగిన ఘటనలతో కేంద్ర ప్రభుత్వానికి ఒక సాకును సమకూర్చేందుకు తిమ్మిని బమ్మిని చేసి వీడియోలను తయారు చేశారు.వాటిలోని అంశాలు కొన్ని ఛానల్స్‌లో ప్రసారమయ్యాయి. అసలు వాటిని ఎవరు తయారు చేశారు, ఏ ప్రయోజనాల కోసం తయారు చేశారు అన్నది బయటకురావాల్సి వుంది. పోలీసులు జీ న్యూస్‌లో ప్రసారమైనదానిని బట్టి కేసు నమోదు చేశారు, అలాంటి వీడియో గురించి ఆ న్యూస్‌ అవుట్‌పుట్‌ ఎడిటర్‌ నిరసన తెలుపుతూ రాజీనామా చేయటాన్ని బట్టి జీ న్యూస్‌ పాత్ర వుందా అన్నది అనుమానం. తాను దోషిని కాదని, దానిలో తన పాత్ర లేదని అది నిరూపించుకోవాల్సి వుంది. ఢిల్లీ ప్రభుత్వం నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేయనున్నదని వార్తలు వచ్చాయి. నిజంగా చేస్తుందా, చేస్తే ఏం జరుగుతుంది అన్నది చూడాల్సిందే.

    ఆ వీడియోలను ప్రసారం చేయటం ఒక ఎత్తయితే మీడియా యాంకర్లు జెఎన్‌యు విద్యార్ధులను దేశద్రోహులుగా సంబోధించటం, అలాంటి వారికి ఆ సంస్ధ ఆలవాలంగా వుందని చిత్రించటం, వారిపైకి జనాన్ని వుసిగొల్పేలా వ్యవహరించటం తీవ్రమైన అంశం. దేశ ద్రోహం, లేదా దేశ వ్యతిరేకి అని కేసులు పెట్టే పోలీసులే నిందితుడు అని పేర్కొంటారు తప్ప నిర్ధారణగా రాయరు. అలాంటిది మీడియాలో పనిచేసేవారు అలా ఎలా చెబుతారు.ఎవరి మెప్పుకోసం ఈ పనిచేశారు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వుంది. టైమ్స్‌ నౌ ఛానల్‌లో దానిని ప్రసారం చేశారు.దాని గురించి సీనియర్‌ జర్నలిస్టు సిద్ధార్ద వరదరాజన్‌ తన వ్యాసంలో ప్రస్తావించారు. తామసలు ఆ వీడియోను ప్రసారం చేయలేదని తమపై అభాండాలు వేసిందుకు క్షమాణలు చెప్పాలని ఆ ఛానల్‌ కోరింది.తొలుత బుకాయించిన సదరు ఛానల్‌ తరువాత చూసుకోకుండా ప్రసారం చేశామని చెప్పుకుంది. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేతను ఆ వీడియోను ప్రదర్శించమని టైమ్స్‌ నౌ యాంకర్‌ గోస్వామి పదే పదే కోరటం, దానిని అధికారిక వీడియోగానే పరిగణించినట్లు చర్చను నడపటాన్ని చూస్తే జర్నలిస్టులు నిష్పక్షపాతంగా , విమర్శనాత్మకంగా వున్నట్లు ఎవరైనా ఎలా అనుకుంటారు? కొన్ని ఛానల్స్‌ అసాధారణరీతిలో జెఎన్‌యు వుదంతాన్ని పదేపదే ప్రసారం చేయటం యాదృచ్ఛికమా, ఒకపధకం ప్రకారం జరిగిందా అన్న అనుమానం ఎవరికైనా కలిగితే దానికి కారకులు ఎవరు ? రాజకీయ నేతలు లేదా సాంస్కృతిక సంస్ధగా చెప్పుకుంటూ రాజకీయాలు నడుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధల వారు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు మీడియా వారికి తేడా లేకుండా పోయిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. యావన్మంది దీని గురించి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసు,జడ్జి , తలారి పాత్రలను మీడియా పోషించుతోందన్న అభిప్రాయం మీడియాలో పనిచేస్తున్నవారికి ప్రయోజనకరమా, హాని కరమా ?

    తాము ప్రసారం చేసిన వీడియో సాధికారమైనదా కాదా అన్నది సరి చూసుకోలేదని టైమ్స్‌ నౌ యాంకర్‌ ఆర్నాబ్‌ గోస్వామి తప్పిదాన్ని తప్పించుకొనేందుకు చెప్పారని అనేక మంది భావిస్తున్నారు.కొత్త గనుక అనుభవం లేక చేశామంటే అర్ధం చేసుకోవచ్చు, కానీ ఎలక్ట్రానిక్‌ మీడియా మన దగ్గర కొత్తగా వచ్చింది కాదు. గోస్వామి చిన్నవాడూ కాదు, అనుభవం లేని యాంకర్‌ కాదు. దీని గురించి బిబిసిలో నకిలీ వీడియోలను ఏరివేసే విభాగంలో పనిచేస్తున్న మార్క్‌ ఫ్రాంకెనెల్‌ ఏమంటారంటే ఏది నకిలీ ఏది పక్కా అని తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఇలాంటి సమస్యలు ప్రతి చోటా వున్నందున ప్రతి ఛానల్‌ ఒక పద్దతిని పాటించి తనిఖీ చేసిన తరువాతే వాటిని ప్రసారం చేస్తుంది. పక్కా వీడియోలో ధంబ్‌నెయిల్‌ చిత్రాలు వుంటాయి, నకిలీ వీడియోలలో వాటిని తుడిపి వేస్తారు. దాన్ని బట్టి అది తిమ్మిని బమ్మిని చేసిందా కాదా అని తేలిపోతుంది. బడా మీడియా సంస్ధలు తమ స్వంత సిబ్బంది రూపొందించే వీడియోలతో పాటు వార్తా సంస్ధలు, జర్నలిస్టులు కాని పౌరులు పంపే వీడియోలను కూడా స్వీకరించి వుపయోగిస్తాయి. అందువలన అవి నకిలీవా, కాదా అనేది ప్రతిదాన్నీ తనిఖీ చేయాలి.ముఖ్యంగా బయటి నుంచి తీసుకున్న వాటి విషయంలో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని ఫ్రాంక్‌నెల్‌ చెప్పారు. మరి దీనిని మన మీడియా సంస్ధలు ఎందుకు పాటించటం లేదు.లేదా కాకపోతే ఖండిస్తారు, మనకు మరో వార్త వస్తుంది, సంచలనంతో రేటింగ్‌ పెరుగుతుంది అని చూసీ చూడనట్లు వూరుకుంటున్నాయా ?అదే అయితే మీడియాకు జవాబుదారీ తనం లేదా అన్న ప్రశ్న వెంటనే తలెత్తుతుంది.

   అనేక దేశాలలో దీని గురించి తీవ్ర చర్చ జరుగుతోంది.అయితే ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నట్లుగా ఎవరికి వారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అయితే మొత్తంగా చూసినపుడు పాలక వర్గ ప్రయోజనాలు కాపాడేందుకే అంతిమంగా పెట్టుబడితో ముడిపడిన మీడియా పని చేస్తుందన్నది మనకు కనిపిస్తుంది. సామాన్య ప్రజా ప్రయోజనాలు, ఆ సంస్ధలలో పనిచేసే సిబ్బంది ప్రయోజనాలకంటే యజమానులే ఆ సంస్ధలకు ముఖ్యం. వారి ప్రయోజనాలకు భంగం కలగనంత వరకే స్వేచ్ఛను అనుమతిస్తారు.అన్నీ అలాంటి సంస్ధలేనా అంటే ఎప్పుడూ కొన్ని మినహాయింపులు వుంటాయి.అవెప్పుడూ మైనారిటీగా, పరిమిత సంఖ్యలో వుంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d