• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: AP NEWS

నాస్తిక వాదం గురించి ఆస్థికులు ఆవేదన చెందటం చిత్రమే మరి !

08 Sunday May 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, Opinion, RELIGION, Religious Intolarence

≈ 3 Comments

Tags

ATHEISM, athists, believers, Communists

ఎం కోటేశ్వరరావు

    నాస్తిక వాదం నలిగిపోతోందా అనే శీర్షికన మే ఐదవ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో గీతాంజలి మూర్తి కొన్ని అంశాలను లేవనెత్తారు.నిరతంతరంగా జరిగే నాస్తిక, ఆస్థిక వాదం చర్చలో అనేక మంది లేవనెత్తుతున్న పాత విషయాలే అవి. నాస్తికులైన తండ్రుల బిడ్డలు ఆస్థికులుగా ఎందుకు మారుతున్నారు? అంటూ అక్కినేని నాగేశ్వరరావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, శ్రీశ్రీ, చలం, కవిరాజు త్రిపురనేని రామస్వామి వంటి పేర్లను ప్రస్తావించారు.తరిచి చూస్తే వారి ప్రశ్నలోనే సమాధానం వుంది. పైన పేర్కొన్న ప్రముఖ నాస్థికుల తలిదండ్రులందరూ మామూలు ఆస్థికులు, ఆ కుటుంబాలలో అంతకు ముందేమీ పండిత చర్చలు జరిగిన దాఖలాలు లేవు. అటువంటపుడు వారి బిడ్డలు ప్రముఖ నాస్థికులుగా ఎలా మారారు, మూర్తిగారు స్వయంగా హేతువాది అయిన ఆస్థికుడిని అని చెప్పుకున్నారు, వారి తలిదండ్రులు ఏ భావజాలంతో వుండేవారో తెలియదు. మరి ఆయనెందుకు అలా మారారు? ఎందుకు అని ప్రశ్నించుకొని సరైన సమాధానం పొందేవరకు వదలని తత్వం నాది అని మూర్తిగారు అన్నారు కను సమాధానం ఏం పొందారో కూడా ఆయనే చెప్పి వుండాల్సింది.లేక నాస్థికుల నుంచి సమాధానం వచ్చే వరకు వదలను అని చెబుతున్నారా ? ఆయన చెప్పినట్లు నిజంగా హేతువాదే అయి వుంటే ఆస్థికుడిగా వుండే వారే కాదు, ఒక వరలో రెండు కత్తులు ఇమడవు.

   ఆస్థిపాస్తులకు, భావజాలానికి వారసత్వం వుంటుంది. కానీ రెండింటికీ మౌలిక తేడా వుంది. తలిదండ్రుల ఆస్థులపై బిడ్డలకు లేదా దాయాదులకు వారసత్వం హక్కుగా వస్తుంది. కానీ భావజాలం కొనసాగింపు బిడ్డల, ఇతర కుటుంబ సభ్యుల హక్కు లేదా బాధ్యత, విధి కాదు. ఎలా అంటే మూర్తిగారు నాస్థికులను సమర్ధిస్తూనో, విమర్శిస్తూనో ఒక పెద్ద గ్రంధం రాస్తే దాని ప్రచురణపై ఆయన వారసులకు కాపీ రైట్‌ చట్ట ప్రకారం హక్కు వుంటుంది. అంతమాత్రాన దానిలో పేర్కొన్న భావజాలానికి వారు కట్టుబడి వుండాలని లేదు. ఆ పుస్తకం అచ్చువేస్తే వచ్చే డబ్బుకు మాత్రమే వారసులు, కానీ దానిలోని భావజాలానికి నిబద్దులైన ఇతరులు వారసులు అవుతారు.

   కారల్‌ మార్క్స్‌ తంaడ్రి లాయర్‌ ,తన బిడ్డను కూడా లాయర్‌ను చేయాలనుకున్నాడు. కానీ ప్రపంచగతినే మార్చే ఒక అపూర్వ తత్వశాస్త్రానికి ఆద్యుడు అయ్యాడు. మార్క్స్‌తో పాటు విడదీయరాని మేథావి ఎంగెల్స్‌. ఆయనొక పెట్టుబడిదారుడి తనయుడు. కానీ ఆ పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చేందుకు తన ఫ్యాక్టరీ నుంచే పాఠాలు తీసుకున్నాడు. కారల్‌ మార్క్స్‌ను వివాహం చేసుకున్న జెన్నీ రాజకుటుంబాల నుంచి వచ్చిన యువతి. మార్క్స్‌ను వివాహం చేసుకొని జీవితాంతం అష్టకష్టాలను ఎందుకు అనుభవించింది? మధ్యలోనే విడాకులిచ్చి మరొక ధనవంతుడిని వివాహం ఎందుకు చేసుకోలేదు? ఇలాంటి వన్నీ ఎందుకు జరుగుతాయో మూర్తి వంటి వారు అర్ధం చేసుకుంటే ఆయన లేవనెత్తిన అంశాలకు సమాధానం కూడా దొరుకుతుంది.

     భాగవతాన్ని నమ్మటమా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం. దానిలో పేర్కొన్న హిరణ్యకశ్యపుడు విష్ణు ద్వేషి. కుమారుడు విష్ణు భక్తుడు. వారికి ఆస్థి, రాచరికం దగ్గర పేచీ రాలేదు, విష్ణువును కొలవటమా లేదా అన్న భావజాలం దగ్గరే వచ్చింది. అందువలన ఆస్థికుల పిల్లలు నాస్తికులుగా మారినా, అటుదిటు అయినా, పెట్టుబడిదారుల కొడుకులు కార్మికవర్గ పక్షపాతులైనా, లేదా ఏమీ లేని వారు పెట్టుబడిదారులుగా మారి ఆ భావజాలాన్ని అనుసరించినా ఆయా కాలాల్లో వుండే అనేక పరిస్థితులు, ముందుకు వచ్చిన అంశాల ప్రభావం వారిపై పడుతుంది.ఏది ఎక్కువ ప్రభావం చూపితే ఆ భావజాలాన్ని అలవరుచుకుంటారు. త్రిపురనేని రామస్వామి నాస్తికుడిగా, హేతువాదిగా మారిన సమయంలో ఆంధ్రదేశంలో, కృష్ణా.గుంటూరు జిల్లాలలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా వున్నా ఆయన కమ్యూనిస్టుగా మారలేదు. అదే సమయంలో అనేక మంది నాస్తికులు కమ్యూనిస్టులుగా మారారు. అంత మాత్రాన ఇతర భావజాలాలు అంతరించినట్లో నలిగిపోయినట్లో అవుతుందా ? తమిళనాడులో డిఎంకె నేతలు గుడులు,గోపురాలకు వెళ్లినంత మాత్రాన నాస్తికత్వ వాదం నశిస్తుందనుకుంటే అంతకంటే అమాయకత్వం వుండదు.

    మనది వేద భూమి అంటారు కొందరు. వేదాలు వునికిలోకి వచ్చినపుడే వాటిని వాటిని తిరస్కరించిన హేతువాదులు కూడా ఇక్కడే పుట్టారు, అందువలన హేతు భూమి అని కూడా ఎందుకు పిలవకూడదు? బుద్దుడు కూడా ఇక్కడే పుట్టినందున కొందరు బుద్ధ భూమి అనటం లేదా ? వేద ప్రమాణాన్ని తిరస్కరించిన చార్వాకులు, లోకాయతులను భౌతికంగా అంతం చేయటమే కాదు, వారి రచనలను కూడా ధ్వంసం చేశారు. అయితేనేం తరువాత వేమన అవతరించలేదా, ఆ చార్వాక, లోకాయత, వేమన్నవాద భావజాల వారసులు దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారా లేదా ? వేదాలను నమ్మేవారు ఎక్కువ, నాస్తికులు, హేతువాదులు తక్కువ ఎందుకు వున్నారు అని ఎవరైనా అడగొచ్చు. వేదాలు కొన్ని దేశాలు, ప్రాంతాలకే పరిమితం, అన్ని రకాల మతాలను,దేవుళ్లను వ్యతిరేకించే నాస్తికులు, హేతువాదులు ప్రపంచవ్యాపితంగా వున్నారు. గరిటెడైనను చాలు గంగిగోవు పాలు అన్న వేమన్న సమాధానం వుండనే వుంది. ఎవరూ విత్త కుండానే వర్షాలు పడి, రుతువు రాగానే అనేక మొక్కలు మొలుస్తాయి, వాటిలో పనికిరాని కలుపు , ప్రయోజనం చేకూర్చే మంచి మొక్కలూ వుంటాయి. అదే వర్షాలు లేకపోతే ఆ విత్తనాలు అలాగే భూమిలో వుండిపోతాయి. అలాగే ఏ భావజాల వ్యాప్తికైనా పరిస్థితులు దోహద పడాలి. అది ఎంతకాలం అంటే ఎవరు చెబుతారు.మూర్తిగారే అన్నట్లు హిందూ మత పూర్వ వైభవం తెచ్చుకోవటానికి ఎంత కాలం పడుతుందో ఎవరినైనా చెప్పమనండి !

     హేతువాదుల ఇండ్లలో ఇతర కుటుంబ సభ్యులు పూజలు, పునస్కారాలు చేయటం గురించి ప్రస్తావించారు.తమ కుటుంబ సభ్యులనే మార్చటంలో ఎందుకు విఫలమయ్యారు అని ప్రశ్నించారు. ఇది వినటానికి ఇంపుగానే వుంటుంది. మొదటి విషయం నాస్థికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు మిగతావారికంటే అత్యంత ప్రజాస్వామిక వాదులు. తమ భావాలను కుటుంబ సభ్యులతో సహా ఇతరులపై రుద్దరు. మోతీలాల్‌ నెహ్రూ మితవాది, ఆయన కుమారుడు జవహర్‌లాల్‌ కాంగ్రెస్‌లో అతివాది అయ్యాడు. కమ్యూనిస్టు దిగ్గజం సుందరయ్య భూస్వామిక కుటుంబంలో, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ పచ్చి మితవాద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.లోకసభ స్పీకర్‌గా,సిపిఎం అగ్రనేతగా వున్న సోమనాధ్‌ చటర్జీ తండ్రి ఒక పెద్ద లాయర్‌, హైకోర్టు జడ్జి. అంతకు మించి ఆయన హిందూ మహాసభ నాయకుడు. సుందరయ్య,నంబూద్రిపాద్‌, సోమనాధ్‌లు కమ్యూనిస్టులు కాకుండా చేయటంలో వారి కుటుంబ పెద్దలు ఎందుకు విఫలమయ్యారు?

    మతం కూడా ఒక భావజాలమే. ప్రముఖ బిజెపి నాయకులు, సంఘపరివార్‌ పెద్దలు ముస్లింలు లవ్‌ జీహాద్‌ పేరుతో హిందూ యువతులను వివాహమాడి, మతమార్పిడి చేస్తున్నారంటూ ముస్లిం మత భావజాలానికి వ్యతిరేకంగా నిరంతరం గగ్గోలు పెడుతుంటారు.అద్వానీ, అశోక్‌ సింఘాల్‌, తొగాడియా,సుబ్రమణ్యస్వామి అలాంటి ఎందరో ప్రముఖులు తమ కుటుంబ సభ్యులు ముస్లింలను వివాహం చేసుకుంటుంటే ఎందుకు ఆపలేకపోయారు? ఇతరులకు ఎందుకు నీతులు చెబుతున్నారు? అందుకని చర్చను అలాంటి వైపు తిప్పితే ప్రయోజనం లేదు. ఏ వాదంలో అయినా దాని మంచి చెడ్డలను చర్చించటం మంచిది.

     భారత దేశాన్ని మొగలాయీలు ఆక్రమించినపుడు స్వాతంత్య్రం కావాలన్న వాంఛ దేశ ప్రజలలో పుట్టలేదు, బ్రిటీష్‌ వారు ఆక్రమించిన తరువాత కూడా చాలా కాలం వరకు కలగలేదు. ప్రధమ స్వాతంత్య్ర పోరాటం తరువాత కూడా దేశంలో అంతగా జ్వాల రగలలేదు. అంత మాత్రాన 1857 తిరుగుబాటు విఫలమైనట్లు కాదు. కాంగ్రెస్‌ ఏర్పడిన వెంటనే జనం కుప్పలు తెప్పలుగా వుద్యమంలో పాల్గొనలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా చాలా కాలం వరకు బ్రిటీష్‌ వాడి పాలనే బాగుందని చెప్పిన వారు మనకు ఎందరో తెలుసు. అందువలన ఒక భావజాలాన్ని మెజారిటీ అంగీకరించి అనుసరించనంత మాత్రాన అది విఫలమైనట్లు , మెజారిటీ ఆమోదించిన భావజాలాలన్నీ సఫలమైనట్లూ కాదు. హిందూమతంపై తిరుగుబాటుగానే బౌద్దం అవతరించింది. అది మన దేశంలో ఆదరణ పొందలేదు, అంత మాత్రాన అది విఫలమైనట్లా ? తరువాతనే మన దేశంలోకి ఇస్లాం, క్రైస్తవం వచ్చాయి.ఎందరో బలహీనవర్గాల వారు ఆ మతాలపట్ల ఆకర్షితులయ్యారు. మెజారిటీగా వున్న హిందూమతం లేదా దానిని కాపాడాలని కంకణం కట్టుకున్న పెద్దలు ఎందుకు ఆ పరిణామాన్ని నివారించలేకపోయారు?

    నాస్తికత్వం, హేతువాదం, భౌతిక వాదం వీటన్నింటినీ కొంతమంది ఒకే గాటన కడుతున్నారు. వాటిలో అనేక అంశాలు ఒకటిగా వుండటం ఒక కారణం. ఈ మూడు వాదాలతో ప్రభావితులైన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కానీ కమ్యూనిస్టులు ఈ మూడు అంశాలను కలిగి వుంటారు. వాటిని జనంలో కలిగించటానికి నిరంతరం ప్రయత్నిస్తారు. కమ్యూనిస్టులుగా వుండి మూఢనమ్మకాలను, తిరోగమన భావాలను ప్రోత్సహిస్తే తప్పు. అయితే కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా చేరటానికి ఈ అంశాలను షరతులుగా పెట్టటం లేదన్నది తెలుసుకోవాలి.అంటే పార్టీలో ఆస్థికులు,నాస్థికులూ అందరూ వుంటారు. ఎవరైనా దేవాలయం, మసీదు, చర్చికో వెళుతూ మరోవైపు దోపిడీ లేని సమసమాజం కావాలని కోరుకుంటే అలాంటి వారిని ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా సభ్యులుగా వద్దంటే అంతకంటే పిచ్చిపని మరొకటి వుండదు. మా మతం కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని వ్యతిరేకించమని చెప్పింది అంటేనే పంచాయతీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మతాలు పుట్టినపుడు కమ్యూనిస్టు సిద్ధాంతమే లేదు.అందువలన మతాలు కమ్యూనిజాన్ని వ్యతిరేకించే అవకాశం ఎక్కడుంది? తప్పుడు వ్యాఖ్యానాలు చేసే అలాంటి వారిని పార్టీలు అంగీకరించవు. పార్టీ సభ్యులుగా చేరిన తరువాత వేల సంవత్సరాలుగా వచ్చిన అనేక అన్యవర్గ ధోరణులను పోగొట్టటానికి ప్రయత్నిస్తారు. అయితే అది అన్ని చోట్లా, అందరూ ఒకే విధంగా చేయకపోవచ్చు. అలాంటివి ఏవైనా వుంటే సద్విమర్శలు చేయాలి. ఒక కమ్యూనిస్టు సంస్మరణ సభలో కొందరు వక్తలు బొట్లు పెట్టుకొని జోహార్‌ కామ్రేడ్‌ అనటం చూసి అవాక్కయ్యానని మూర్తిగారు రాశారు. సంస్మరణ సభ కనుక ఇతరులు ఎవరైనా వచ్చి అలా చేసి వుండవచ్చు.దానికి అవాక్కవ్వాల్సిందేముంది. ఎవరైనా బొట్టుపెట్టుకో కూడదని కమ్యూనిస్టుపార్టీ ఎక్కడైనా చెప్పిందా ? సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాండ్రైన బృందాకరత్‌, సుభాషిణీ అలీ పెద్ద బొట్లు పెట్టుకోవటం లేదా ? మతాలు, మతాచారాలు మాత్రమే అలాంటి ఆంక్షలు విధిస్తున్నాయి.

     అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు అన్నట్లు దైవశక్తి ఆస్థికుల అనుభవంలోకి రావటాన్ని నాస్తికవాదులు ఎన్నిరాసినా అడ్డుకోలేరు అని ఒక నిర్ధారణ చేశారు. ఆస్థికులలో కూడా మేథావులు వున్నారని మరువరాదు అన్నారు. మొదటి విషయం, ఆస్థికులలో మేథావులు వుండరని నాస్తివాదం చెప్పలేదు. కొద్ది మందిగా వున్న నాస్థిక, హేతువాద మేథావుల వైఫల్యం గురించి మూర్తిగారు సంతోష పడుతున్నారు ఓకే. వేల సంవత్సరాలనాడే వుద్భవించిన నాస్థిక వాదం ఇప్పటికీ వునికిలో వుందంటే అత్యధికులుగా వున్న ఆస్థిక మేథావులు, పండితులు, మతాధికారులు, వారి రాజపోషకులు, కొత్తగా టాటా , బిర్లావంటి పెట్టుబడిదారీ పోషకుల వైఫల్యం కనపడటం లేదా ? హిందూమతాన్ని సంస్కరించాలని ప్రయత్నించిన అనేక మంది ఆస్థిక మేథావులు ఎందుకు విఫలమయ్యారు. వీధికొక దొంగబాబా పుట్టుకు వచ్చి మతం పేరుతో దండుకుంటుంటే ఎందుకు నివారించలేకపోయారు ? వెర్రి మొహాలు వేసుకొని ఎందుకు చూస్తున్నారు? ఇది వైఫల్యం కాదా ?

    శంకరాచార్యుడు తన వాదనా పటిమతో అనేక మందిని బౌద్ధం నుంచి మళ్లించి హిందూ మతానికి పూర్వ వైభవం తెచ్చారు అని మూర్తిగారు చెప్పారు. ఇది ఘర్‌ వాపసీ ప్రచార ప్రభావంగా కనిపిస్తోంది. ఆ శంకరాచార్యుడు పుట్టిన కేరళలో దేశంలో ఎక్కడా లేని విధంగా అంత మంది క్రైస్తవులు, ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు? దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎందుకు ఆ మతాలవారు విస్తరించారు? ఇప్పటికీ దేశంలో ఏదో ఒక మూల అనేక మంది హిందూ నుంచి ఇతర మతాలకు ఎందుకు మారిపోతున్నారు? ఆస్థికులు అంటే ఒక్క హిందువులే కాదు, దైవాన్ని, దైవదూతలను నమ్మే ఇతర మతాల వారు కూడా ఆస్థికులే. వారు మార్చుకొనేది మతం తప్ప ఆస్తికత్వాన్ని కాదు, అయినా ఎందుకు ఆ మార్పిడులపై ఎందుకు అంత రగడ చేస్తున్నారు? ఆస్థికులలో ప్రజాస్వామ్యం లేదా ?

     చివరగా ఒక్క మాట నాస్థికులు,హేతువాదులు, భౌతిక వాదులు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు వేల సంవత్సరాల నుంచి మా విశ్వాసం, మనోభావాలు అంటారు తప్ప సరైన సమాధానం చెప్పటంలో ఆస్థికులు విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో తమ వ్యతిరేక భావాలను,చర్చలు, వాదనలను కూడా సహించటం లేదు. దబోల్కర్‌, పన్సారే,కులుబుర్గి వంటి నాస్థిక,హేతువాదుల్ని హతమార్చారు. ఇంకా అనేక మందిని అదే చేస్తామని బెదిరిస్తున్నారు. వారి హత్యలను ఆస్థికులుగా వున్న ప్రముఖులు ఏ మతం వారైనా ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకంటే వారి వాదనలు ఆస్థికవాద మూలాలనే ప్రశ్నిస్తున్నాయి, అహాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇది ఈనాటిది కాదు, చార్వాకులు,లోకాయతుల నుంచి జరుగుతున్నదే. హిందూ మతానికి ఒక సాధికార కేంద్రమే లేదు. అందువలన హిందూమతావలంబకులు, దానిని కాపాడాలనుకొనేవారు, ముందు ఎవరు సాధికారులో తేల్చుకొని విశ్వాసం, మనోభావాలను కాసేపు పక్కన పెట్టి ఆ పండితులు, మతాధిపతులతో శాస్త్రీయమైన పద్దతులలో చర్చలు జరిపి నాస్థికవాదం తరతరాలుగా ‘ఎందుకు’ వునికిలో వుంటున్నదో, ఇప్పటి వరకు హిందూ మతం పేరుతో జరిగిన తప్పులను, ఇప్పటికీ కొనసాగుతున్న అస్పృశ్యత, వివక్ష, వంటి సవాలక్ష అవలక్షణాలను, మతం పేరుతో బాబాలు,యోగులు,యోగినులు భారీగా ఆస్థులను పోగేసుకోవటాన్ని ఎలా అరికట్టాలో తేల్చి ప్రకటించాలి.మనుషులను మనుషులుగా చూస్తారనే భరోసా కలిగించాలి. అప్పుడే జనానికి మతం మారాలన్న ఆలోచన వుండదు. మతాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు ఆ పని చేస్తామంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అది ఏమతం అయినా కావచ్చు, జనం ఇతర మతాలోక్లి మారుతున్నారన్న దుగ్దకంటే మన మతంలోకి ఇతరులను ఎలా ఆకర్షించాలనే విషయంలో అన్ని మతాలూ పోటీ పడటం ఆరోగ్యకర లక్షణం.అలాగాక దాడులకు దిగటం బలహీనత, అనాగరిక లక్షణం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రుల చెవిలో ‘ప్రత్యేక ‘పువ్వు – చంద్రన్న ముందున్న మార్గాలు

06 Friday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Chandrbabu, special status to Andhrapradesh, tdp

ఎం కోటేశ్వరరావు

    పేరు మోసిన అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగి మరణించిన తరువాత కూడా సొమ్ము చేసుకొనేందుకు వెంటిలేటర్‌లు పెట్టి బంధువులను మోసం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హోదా పరిస్థితి వుంది. తేడా ఏమంటే అక్కడ డబ్బు రాబట్టుకోవటం కోసం అయితే, ఇక్కడ జనం మద్దతు పోగొట్టుకోకుండా వుండటం కోసం. ప్రత్యేక హోదా ఇవ్వటం నిబంధనల రీత్యా సాధ్యం కాదని తెలిసినా నాడు కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఐదు కాదు పది అంటూ పెద్ద రాయితీని రాబట్టినట్లు బిజెపి పెద్ద నాటకం ఆడింది. తీరా బిల్లు విషయానికి వచ్చే సరికి అటు కాంగ్రెస్‌ దానిని దానిలో చేర్చలేదు, ఇటు బిజెపి, తెలుగుదేశం పార్టీ కూడా నోరు మెదపలేదు.ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం మోపి తప్పుకొనేందుకు చూస్తున్నాయి. మొత్తం మీద రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు, ప్రత్యేక హోదా రాయితీల నాటకంతో బిజెపి, అందరూ కోరుతున్నారు, కలిసి వస్తున్నారు కదా తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు కాంగ్రెస్‌ వారు వారందరితో కుమ్మక్కయి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. నిబంధనలు అంగీకరించవని తెలియనంత అమాయకంగా ఈ పార్టీలలో తలలు పండిన పెద్దలు వున్నారా ?

     అటు కేంద్రం-ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న పార్టీలు రెండు సంవత్సరాల పాటు ఆశ పెట్టాయి. ఇంకెంత మాత్రమూ మోసం చేయలేవు.మరణించిన రోగిని వెంటిలేటర్‌పై పెట్టిన కార్పొరేట్‌ ఆసుపత్రి యాజమాన్యం అసలు విషయం చెప్పదు, చేయాల్సిందంతా చేస్తున్నాం అని మాత్రమే చెబుతుంది. రోగి బతికి బట్ట కట్టే ఆశ చచ్చి, అంతకు మించి వెంటిలేటర్‌ ఖర్చు భరించలేక బంధువులకు ఏం చేయాలో తెలియదు. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అలానే వుంది.

    పార్లమెంట్‌లో మంత్రి అరుణ్‌ జైట్లీ సీనియర్‌ లాయర్‌ కనుక కేసు గెలుస్తామని గానీ ఓడిపోతామని గాని చెప్పకుండా నర్మగర్బంగా అసలు కేసే లేదు అని చెప్పేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రులు, ఇతరులు అందరితో మాట్లాడుతున్నా అని చెబుతున్నారు. ఆయన మాట్లాడటం లేదని ఎవరూ అనటం లేదు. దేన్ని గురించి, ఏం మాట్లాడుతున్నారో జనానికి తెలియాలి కదా? కనీసం ఆయనను వెన్నంటి వుండే లేదా మేనేజిమెంట్‌లో వుండే మీడియా కూడా లీకుల కధనాలు కూడా ఇవ్వకపోవటంతో వాటికి అలవాటు పడిన వారు మత్తుకు బానిసలైన వారు గంజాయి దొరక్క పోతే ఎలా విలవిల్లాడి పోతారో అలా జుట్టు పీక్కుంటున్నారు.

    గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు పరిస్థితి వేరు. కారణాలేమైనా కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు అలా కాదే. ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడి మాదిరి మీడియా సంస్ధలు అటు కేంద్రంలోని బిజెపి- ఇటు రాష్ట్రంలోని తెలుగు దేశం పార్టీ మధ్య వున్నాయి. ప్రత్యేక హోదా గురించి ఎవరికీ నొప్పి లేదా రాజకీయంగా నష్టం జరగకుండా తమ ప్రావీణ్యాన్ని వుపయోగించి ఏం రాస్తాయో, ఎలా చూపుతాయో తెలియదు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల గడువు వుంది. చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పుల్లుగా వాగ్దానాలు చేసి, రంగుల కలలను జనం ముందుంచారు. ఏ రంగంలో చూసినా ఎదురుగాలి తప్ప మరొకటి కనపడటం లేదు. గత ఎన్నికల ఫలితాల గురించి చంద్రబాబు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. కేంద్రంలో తనపై ఆధారపడే ప్రభుత్వం వుంటుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. రాజ్యసభలో తనకు తగినంత బలం లేదు కనుక బిజెపి కూడా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీతో సంబంధాలను కొనసాగిస్తున్నది. మరొక మార్గం లేదు కనుక తెలుగుదేశం కూడా అధికారాన్ని పంచుకొని, తాను కూడా పంచి ఇచ్చింది.

    గత రెండు సంవత్సరాల అనుభవం చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది పిడికెడు మట్టి, ముంతెడు నీళ్లు అని అమరావతి శంకుస్ధాపన సభలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తేల్చి చెప్పారు. అందుకే చంద్రబాబు ముందు చూపుతో శాశ్వత రాజధానిని పక్కన పెట్టి తాత్కాలిక రాజధానిని తెరమీదకు తెచ్చారు. ప్రత్యేక తరగతి హోదా రాదని చంద్రబాబుకు ఎప్పుడో అవగతం అయినా దానిని అంగీకరిస్తే రాజకీయంగా నష్టం కనుక. సాధ్యమైన మేరకు దాని ప్రస్తావన, దానిపై ఘర్షణ రాకుండా చూసుకుంటున్నారు.అసలు ప్రస్తావించకపోతే అదీ నష్టమే కను తద్దినం మాదిరి స్మరించారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర పెద్దలు గత ఏడాది కాలంగా పరోక్షంగా చెబుతూ లీకులను వదులుతూనే వున్నారు. ఇక లాభం లేదని గత వారంలో చిన్న మంత్రుల ద్వారా పెద్ద విషయాన్ని చెప్పించారు.

    ఈ పూర్వరంగంలో గత వారం రోజులుగా చంద్రబాబుకు పాలుపోవటం లేదు. స్పందన ఎలా వుంటుందో తెలుసుకొనేందుకు కింది స్థాయి నాయకులతో విమర్శలు చేయిస్తున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకుంటే రాజకీయంగా ఒంటరి పాటు కావటంతో పాటు కేంద్రం నుంచి ప్రతి రోజూ అధికారికంగా తలనొప్పులే. సఖ్యంగా వున్న ఇపుడే వుదయం సాయంత్రం ఢిల్లీ ప్రభువుల దర్శనం చేసుకున్నా ఫలితం వుండటం లేదని తేలిపోయింది. ఇటు రాష్ట్రంలో చూస్తే రాజకీయంగా కలసి వచ్చే స్నేహితులు కనిపించటం లేదు. గత ఎన్నికలలో తోడ్పడిన సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అదేదో సినిమాలో చెప్పినట్లు వీలైతే నాలుగు మాటలు, కాఫీ, ఆశకు పిసినారి తనం ఎందుకన్నట్లు వీలైతే ముఖ్యమంత్రి పదవి కోసం దారి వెతుక్కుంటున్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడపుడే కోలుకొనే పరిస్థితి కనిపించటం లేదు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి మార్గం అగమ్యగోచరం. వైఎస్‌ కుటుంబంతో వున్న ఆర్ధిక లావాదేవీలు పరిష్కారం కాని వారు అవి తేలేంత వరకు అదే పార్టీలో కొనసాగవచ్చు.ఆ బాదర బందీ లేనివారు, తెలుగు దేశం పార్టీతో సర్దుబాటుకు వచ్చిన వారు ఇప్పటికే ఫిరాయించారు, రానున్న రోజుల్లో మరికొందరు రావచ్చు.

    తెలుగు దేశం పార్టీ పరిస్థితి కూడా అంత సజావుగా, వుత్సాహంతో, వుద్వేగంతో వురకలు వేసే పరిస్థితి వుండదు.కేంద్రంతో ముడిపడిన వ్యాపార లావాదేవీలు వున్నవారు దానితో వైరం తెచ్చుకొనేందుకు సుతరామూ అంగీకరించరు. రెండవది చంద్రబాబు నాయుడు అప్పుచేసి పప్పుకూడు అన్న పద్దతుల్లో రాజధాని అమరావతిని కూడా అప్పులతో నిర్మించేందుకు చూస్తున్నారు. అది సాధ్యం అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేము. ఇంతవరకు ఏ రాష్ట్ర రాజధాని నిర్మాణం కూడా అలా జరగలేదు.ఒక వేళ ఆ ప్రాంత భూములన్నీ తాకట్టు పెట్టి లేక భారీ రాయితీలు ఇచ్చో విదేశీ సంస్దల నుంచి అప్పు తెచ్చుకోవాలంటే కేంద్రం అనుమతులు తప్పనిసరి. లక్షల వుద్యోగాలు సృష్టించలేకపోయినా కనీసం రాజధాని నిర్మాణం చేయకుండా వచ్చే ఎన్నికలలో ఓటర్ల ముందుకు పోలేరు. చంద్రబాబు మరొకసారి విశ్వసనీయత సమస్యను ఎదుర్కోవటం స్పష్టంగా కనిపిస్తోంది.

     ఈ పూర్వరంగంలో ఏదో ఒక దారి లేదా సాకు వెతుక్కొని బిజెపి, కేంద్రంతో సర్దుకు పోదాం లెండి అన్నట్లు ఎన్నికల ముందు వరకు లొంగి పోవటం ఒక మార్గం. చంద్రబాబును అపర చాణక్యుడు అంటారు కనుక అప్పటి పరిస్థితిని బట్టి ఏదారి పట్టాలో నిర్ణయించుకోవటం ఒకటి.లేదూ తెగేదాకా లాగితే తెలుగు దేశం పార్టీ సంగతి తేల్చటానికి బిజెపి వెనుకాడదు. కాంగ్రెస్‌ బాటలోనే అది ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు వెనుకాడదు అని ఇప్పటికే రుజువు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ ఫిరాయింపు జనాలతో నిండి వుంది. అలాంటి వారికి మరొక జంప్‌ చేయటం కష్టం కాదు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చాం.అది సాధ్యం కాదని తేలిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కోసం బిజెపికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పటానికి ఎలాంటి జంకూ గొంకూ వుండదు. తొలిసారి తప్పు చేసినపుడు సిగ్గు పడతారేమో గాని తరువాత అలవాటుగా మారిపోతుంది. అధికారానికి బానిసలుగా మారితే ఎంతకైనా తెగిస్తారు.

     చంద్రబాబు ముందున్న మరొక మార్గం జనానికి వాస్తవాలు చెప్పి విశ్వసనీయత కల్పించుకొని వారి మద్దతు పొందటానికి ప్రయత్నించటం. చంద్రబాబు చాణక్యంలో ఇంతవరకు అలాంటి అధ్యాయం లేదు. చిత్రం ఏమంటే ఏది జరిగినా చంద్రబాబు, తెలుగుదేశం బలహీనపడే పరిస్థితులను స్వయంగా సృష్టించుకున్నారు. రెండో మార్గాన్ని అనుసరించితే కనీసం కొంత మంది సానుభూతి అయినా పొందవచ్చు.

      రాష్ట్రంలో బిజెపి కూడా మునుపటి మాదిరి లేదు. కేంద్రంలో ఎవరి దయా దాక్షిణ్యాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తప్ప రాష్ట్రంలో బలపడటానికి దానికి మరొక మంచి అవకాశం లేదు, రాదు. ఇప్పటికే రెండు సంవత్సరాలు వృధా అయిందనే తొందర వారిలో కనిపిస్తోంది. ఆ పార్టీలో సాంప్రదాయ ఆర్‌ఎస్‌ఎస్‌ రక్త సంబంధీకులే కాకుండా, కొత్తగా కాంగ్రెస్‌ రక్తం కూడా కలిసింది. వుపయోగించుకోవటం, లాభం లేదనుకున్నపుడు వదలి వేసిన గత అనుభవాల రీత్యా చంద్రబాబు నాయుడు వారికి నమ్మదగిన స్నేహితుడు కాదు. అన్నింటికీ మించి మర్రి చెట్టు నీడన మరొక మొక్క ఎదగదు అన్నట్లు తెలుగు దేశం నీడలో బిజెపి పెరగటం అసాధ్యం అని రెండు సంవత్సరాల అనుభవం వారికి నేర్పింది. అందువలన తమకు లొంగిపోయి అధికారంలో మరింత వాటా పెడితే సరి లేకపోతే తెలుగుదేశం మూలాలను దెబ్బతీయటానికి ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. అధికారం ఎంతపని అయినా చేయిస్తుంది. మొత్తానికి ప్రత్యేక హోదా ప్రత్యేక రాజకీయ పరిస్థితులకు నాంది పలికింది. ఇది ఏ మలుపు తిరుగుతుందో, రాష్ట్ర రాజకీయాలను ఎటు మళ్లిస్తుందో , ఏ ప్రస్తానానికి దారితీస్తుందో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబుకు ఓ అభిమాని బహిరంగ లేఖ

03 Tuesday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Modi, Narendra Modi, special status to Andhra pradesh, YS jagan

బాబు గారూ మీరు మెతక మనిషని ఎవరన్నారు ?

      చంద్రబాబు నాయుడు అంటే రాజకీయంలో అపర చాణుక్యుడు, సర్దార్‌ పటేల్‌ కంటే గట్టి పిండం, గ్రీకు వీరుడు హెర్క్యులస్‌ను మించిన బలశాలి అనుకుంటున్న మీ అభిమానులను ఒక్కసారిగా నాగలోకం నుంచి నక్కల మధ్య పడేశారు. సందేహ సముద్రంలో ముంచేశారు. నేను మెతక మనిషినేం కాదు, ధృడచిత్తంతో వున్నాను అని స్వయంగా మీరు చెప్పటంతో మా చిత్తాలు చిత్తడి అయిపోతున్నాయి. బాబు గారూ అసలు మీరు మెతక మనిషని ఎవరన్నారు ? మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటారు ? వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పోటీ పడి వస్తున్నా మీ కోసం పేరుతో మీరు చేసిన పాదయాత్ర మెతక మనుషులకు సాధ్యమా ? బిజెపి, నరేంద్రమోడీ పట్ల ఒకసారి కఠినంగా మరోసారి మెతకగా వున్నట్లు మీపై విమర్శలు వస్తే వచ్చి వుండవచ్చుగాక, అవి రాజకీయాలు, నిరంతరం మీరు కలలు కనే రాష్ట్రం కోసం తప్ప మీ మెతక తనానికి నిదర్శనాలు ఎలా అవుతాయి ? మామ అని కూడా చూడకుండా ఎన్‌టి రామారావు పట్ల కూడా ఎంత కఠినంగా వ్యవహరించారో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసిన మాకు మీరు మెతక మనుషులని అనుకోవటానికే ఏదోగా వుంది.

    అసలు మీకు ఏమైంది ? మీరు ఏనుగు వంటి వారు. ఒక వేళ ఎప్పుడైనా ఎవరైనా రాజకీయ ప్రత్యర్ధులు మీ వెనుక ఏదో అంటే మిమ్మల్ని సమర్ధించటంలో మీ మంత్రులు సరిగా వ్యవహరించనందుకు మందలించారని పత్రికల్లో వార్తలు వచ్చాయి గానీ మా వంటి అభిమానులు ఎక్కడైనా తగ్గినట్లు విన్నారా? మేం ఎన్నడైనా అంగీకరించామా? లేదే ! అటువంటిది నేను మెతక మనిషిని కాదు అని బేలగా, జాలిగా మీరు అనటం ఏమిటి బాబూ ! మేం ఏం కావాలి ? కష్టపడటం నా తప్పా అని మీరు అంటుంటే చివరికి మనప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌సిపికి, జగన్‌కు సైతం ఇలాంటి పరిస్థితి రాకూడదురా బాబూ అన్నట్లు మా కడుపు తరుక్కు పోతోంది.

   మిమ్మల్ని (మనల్ని )నమ్ముకొని అనేక మంది తమ నియోజకవర్గాలను కూడా తెల్లారేసరికి సింగపూరో, మలేషియానో, జపానో, అమెరికాగానో మార్చేద్దామనే కదా వైసిపినుంచి ఎంఎల్‌సీలు, ఎంఎల్‌ఏలు, కాంగ్రెస్‌ నుంచి గాదె వెంకట రెడ్డి వంటి నేతలు సైతం పార్టీకిలోకి ప్రవాహాలుగా వస్తున్నారు.నేను మెతక మనిషిని కాదు అన్న మాట ఏ వుద్ధేశ్యంతో అన్నారో గానీ లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య సామెతను గుర్తుకు తెస్తోందని ప్రతిపక్ష పార్టీల వారు అంటుంటే అటు కాదనలేక ఇటు అవుననలేక మేం మెత్తపడక పడక తప్పటం లేదు. రెండు సంవత్సరాలు చూశాం కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించటం తప్ప రాష్ట్రానికి ఏం పనులు జరిగాయి, ఏం పీకారు అంటుంటే వెర్రి మొహాలు వేసుకొని ఇంకా ఎంతకాలం సమర్ధించాలో అర్ధం కావటం లేదు. దీనికి తోడు పార్టీ అధికారానికి వస్తే గడ్డ పెరుగు ముక్కల మాదిరి తిందామని అనుకుంటుంటే ఎదుటి పార్టీల నుంచి ఎందరు వస్తే అంత మందినీ కలుపుకోండని, అంతా మనమంచికే అని చెబుతున్నారు. మీకేం బాబూ ! మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది. గత ఎన్నికలలో ఎంత ఖర్చు చేశామో మీకు తెలియనిది కాదు. ఇది ఎప్పుడూ వుండేదే . కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుంది. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి, ఎన్నికల సమయంలో వున్న కార్యకర్తల కంటే తరువాత ఫిరాయించిన వారు ముద్దు , ఓడమల్లయ్య బోడి మల్లయ్య వంటి ఈ విషయాల గురించి తరువాత మరోసారి విన్నవించుకుంటా.

    మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి ప్రధానికి సరైన సమాచారం అందుతోందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు చదివాం. బాబు గారూ మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. మీరు బాగానే చేస్తున్నా మంత్రులు, అధికారులు సక్రమంగా లేరని మన శ్రేయోభిలాషుల మాదిరి వుండే కొందరు జర్నలిస్టులు రాసిందానిని నిజమే అని గతంలో నమ్మారని ఇప్పుడూ అనుకుంటున్నారని వింటున్నాం. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమంటే అదే జర్నలిస్టులు ఇటు మిమ్మల్ని, అటు కేంద్రంలో అంతకంటే ప్రధాన మంత్రిని ఎక్కువగా సమర్ధిస్తున్నారు. అందువలన కేంద్ర అధికారులు ప్రధానికి సరిగా తెలియచేయటం లేదనే పాట మీ కోసం కాదేమో చూడండి. లేక ప్రధాని మీద మాట పడకుండా మిమ్మల్ని ‘సంతృప్తి ‘ పరుస్తున్నారా? బిజెపికి సంతృప్తి రాజకీయాలు గిట్టవని తెలుసు కదా ! జర జాగ్రత్త, జనం నమ్మేట్లు లేరు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కేంద్ర మనోగతం ఏమిటో అర్ధం కావటం లేదు, కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారా లేక సమస్య తీవ్రత తెలియక పట్టించుకోవటం లేదా అన్నది అర్ధం చేసుకోలేకపోతున్నాం. వెళ్లి కలిసినపుడు బాగా మాట్లాడుతున్నారు, కాని ఫలితం రావటం లేదు అన్నారు.

   ముందు మన శాసన మండలి, అసెంబ్లీ తీర్మానాలు చేయటమేనా, అసలు వాటిని మన అధికారులు కేంద్రానికి పంపారా ? అన్న అనుమానం కలుగుతోంది. మరి పంపితే వాటికి వచ్చిన సమాధానాలు ఏమిటి , మన మంత్రులు, ఎంపీలు కలిసినపుడు ఏం చెప్పారు. మన అధికారులు వచ్చిన వర్తమానాలను పూర్తిగా చూపటం లేదా అన్న సందేహం తలెత్తుతోంది. పార్లమెంట్‌లో సమాధానాలు, ఇతర లోగుట్టు కధనాల పేరుతో రాసిన వార్తలు తప్ప మాకు నిజం తెలియటం లేదు. రాష్ట్రం పంపిన తీర్మానాలేమిటి ? వాటికి కేంద్రం నుంచి వస్తున్న సమాధానాలు ఏమిటో అధికారికంగా తెలియచేస్తే అభిమానులం మేం కూడా ఒక పట్టు పడతాం కదా? అదేం వుండటం లేదు. అసలూ మనకు కేంద్రంలో ఇద్దరు మంత్రులు, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధులు కూడా వున్నారు. వారు రోజూ కేంద్రంతో సంప్రదించవచ్చు. మరి వారేమి చేస్తున్నట్లు ? మీరు అనేక సార్లు ప్రధాన మంత్రిని కలిశారు. మీకేమో గుజరాతీ, హిందీ రాదు, ఆయనకేమో తెలుగు రాదు. అందువలన అసలు మీరు ఏ భాషలో మాట్లాడుకున్నారు అన్న అనుమానం కలుగుతోంది. ఆవో బాబూ ఆవో మై హూనా కాఫీ, చాయ్‌ పానీ పీనేకే బాద్‌ తుమ్‌ ఏపి జావో, బాద్‌మే అచ్చే దిన్‌ ఆ రహా హయ్‌ అంటే మీరు మంచిగా మాట్లాడుతున్నట్లు అనుకుంటున్నారా ఏమిటి ? ఇలా అయితే మీరు మరో 30 సార్లు ఢిల్లీ వెళ్లినా ఇదే జరుగుతుందన్న నీరసం వస్తోంది మాకు. మీరు నిరాశగా మాట్లాడటం చూస్తుంటే ఏదో దాస్తున్నట్లు , చెప్పుకోలేని బాధ, కేంద్రంలో మీకు అవమానం జరిగిందేమో అన్న అనుమాన బీజం మాలో పడింది.

    కేంద్రంలో వున్న మన వెంకయ్య నాయుడు గారేమో తాను రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ ఒక సమస్య పరిష్కారమో, కొత్త పధకమో తెస్తున్నట్లు చెబుతారు.ప్రధాని ఆయన ఎంత చెబితే అంత అంటారు. మీరేమో ప్రధాన మంత్రి దృష్టిపెడితే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయంటున్నారు.అంటే మీరు ప్రధాని దృష్టిని, కనీసం తోటి వెంకయ్య నాయుడి దృష్టిని సైతం ఆంధ్రప్రదేశ్‌పై మళ్లించటంలో రెండు సంవత్సరాలుగా విఫలమయినట్లేనా అన్న వూహనే తట్టుకోలేకపోతున్నాము.

    ఇంతవరకు జరిగిందానిని బట్టి, అనేక రాష్ట్రాలలో జరుగుతున్నదానిని బట్టి మన వంటి వారిపై ఆధారపడే కంటే స్వంతంగా బలపడాలని, అందుకు గాను వచ్చే ఎన్నికల నాటికి బిజెపిని మరింత బలపరుచుకోవాలన్నది మోడీ లక్ష్యంగా కనిపిస్తోంది.ఎదుటి పార్టీ వారిని ఆకర్షించటం మాకూ చేతనవును అని అనేక రాష్ట్రాలలో చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మీకు అర్ధం అయ్యేట్లు చేయాలని బిజెపి నేతలకు అర్ధం అయింది. ఈ విషయం మీకు అర్ధం అయినా మరొక దారి లేక బింకాలు పోతున్నారని జనం చెవులు కొరుక్కుంటున్నారు.

    బిజెపి రాష్ట్ర నేతలు కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తున్నది అనే ప్రచారం క్రమంగా పెంచుతున్నారు. కేంద్రం సహకరించినా దానిని వినియోగించుకోవటంలో బాబు గారు విఫలమయ్యారు కనుక ఒక అవకాశం మాకే ఇవ్వండి అని వారు ముందుకు వస్తారా ? వస్తే మన పార్టీలో ఎందరు మిగులుతారు అన్నవి ప్రస్తుతానికి వూహా జనిత ప్రశ్నలే కావచ్చు కానీ, ప్రస్తుతం మన వంటి పార్టీల నేతలు డొల్లుపుచ్చకాయల వంటి వారు, ఎటైనా దొర్ల వచ్చు. ఇంతకు ముందు మన పార్టీలో కాంగ్రెస్‌ రక్తం ఎంత వ్యతిరేక రక్తం ఎంత అని కొలిచేవారు, ఇప్పుడు కాక్‌టెయిల్‌ మందు మాదిరి, ఏది ఎంతో తెలియటం లేదు.

   చివరగా ఒక్క మాట. అధికారంలో లేనపుడు అభిమానుల సూచనలు పట్టించుకుంటారని, అధికారం వచ్చిన తరువాత ఇతరుల మాటలు వింటారని మీ గురించి గిట్టని వారూ, గిట్టే వారు కూడా చెబుతుంటారు. ఈ సంవత్సరం కూడా నవ నిర్మాణ దీక్ష చేపడతామని ప్రకటించారు.ఏదో తొలి ఏడాది దీక్ష అంటే అర్ధం వుంది, ప్రతి ఏడాదీ దీక్షలేమిటంటే ఏం చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు దీక్షలు చేయటం అంటే అర్ధం వుంది. అధికారంలో వున్నవారు దీక్షలు చేస్తే చాలా బాగోదు. బరువు తగ్గటానికైతే ఓకే. ప్రత్యేక తరగతి రాష్ట్ర హోదా, రైల్వే జోన్‌, లోటు బడ్జెట్‌ పూడ్చేందుకు సాయం వంటి వాటిపై దీక్ష చేస్తేనన్నా ప్రధాని రాష్ట్రం వైపు దృష్టి పెడతారేమో చూడండి బాబు గారూ.ప్రావిడెంట్‌ ఫండ్‌ వుపసంహరణ, వడ్డీ తగ్గింపుపై కార్మికుల తడాఖాను చూసిన తరువాతే ప్రధాని వాటిపై దృష్టి సారించారు.వెనక్కు తగ్గారు. కేసుపోయినా మన ప్లీడరు గట్టిగా వాదించాడు అని వచ్చే ఎన్నికలలో మేమంతా చెప్పుకోవటానికి దారులు వెతుక్కోవటం మంచిదేమో చూడండి మరి.

    వుంటా బాబూ ! రెండు సంవత్సరాల నుంచి మన రాష్ట్రం, మన అమరావతి , మన ఇటుకలు, మన మట్టి, మన నీరు అంటూ వుత్సాహంతో, వుద్వేగంతో ఎంతో అభిమానంతో ఎదురు చూసిన మా వాడు జాబు గురించి హైదరాబాదో, బెంగలూరో పోవాలంటున్నాడు. దాని సంగతేదో చూడాల, మన అమరావతిలో జాబులు వచ్చినపుడు వాడిని ఇక్కడికే రప్పిస్తాలే, అప్పటి దాకా వుంచుకోలేకం కదా ! ఎంతైనా పెళ్లి కావాల్సిన పిల్లాడు కదా !

మీ అభిమాని

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ- చంద్రబాబు ప్రత్యేక హోదా రాజకీయ క్రీడలో అమాయక ఆంధ్రులు

01 Sunday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Narendra Modi, pavan kalyan, special status, YS jagan, ysrcp

ఎం కోటేశ్వరరావు

   మూడు ఆకర్షణలు-ఆరు ఫిరాయింపులుగా లాహిరి లాహిరిలో ఓ హో జగ(నే)మే వూగెనుగా వూగెనుగా అంటూ ఆనందంతో తేలియాడుతున్నపుడు అంతరాయం కలిగిస్తే ఎవరికైనా ఎలా వుంటుంది? వున్న రెండు కళ్లలో ఒకదానిని పొడుస్తున్నా ఎంతో సహనంగా అదీ మనమంచికే అన్నట్లు ,తాపీగా కుమారుడు లోకేష్‌కు అధికార పదవిని ఎలా, ఎపుడు కట్టబెట్టాలా అని చూస్తున్న చంద్రబాబుకు మధ్యలో అంతరాయం కలిగిస్తే చిరుకోపం కూడా రాకుండా వుంటుందా ? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి రాష్ట్రహోదా గురించి మరిచి పొమ్మని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి స్పష్టం చేసిన తరువాత ‘ ఏ మాటలవి ‘ అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అంటూ తమలపాకుతో చంద్రబాబు నాయుడు చిరుకోపం ప్రకటించారు. మామ వాగ్దానం నెరవేర్చనందుకు కాదు, తోడల్లుడు కిసుక్కు మన్నందుకు అన్నట్లు ఇంతకాలం ఏమీ చేయకపోగా దాని గురించి మరిచిపోండి అన్న నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని వదలి కేసుల కోసం తప్ప ఏనాడైనా జగన్‌ రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్లారా అని చంద్రబాబు ఆగ్రహించారు. జగన్‌ తన కేసుల కోసమే తిరుగుతున్నారనుకుందాం. అందులో తప్పేముంది? కేంద్రంలో వున్న చంద్రబాబు మిత్ర పక్షం, స్వయంగా తెలుగు దేశం మంత్రులు కాబినెట్‌లో వున్నారు. అందువలన జగన్‌ ఢిల్లీ వచ్చి తన కేసుల గురించి ఏం పైరవీలు చేసుకుంటున్నారో, వాటిని తామెలా ఎదుర్కొంటున్నారో చెబితే వుపయోగం. కేవలం తిరుగుతున్నారంటే అర్ధం లేదు.

      నిజమే చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పినట్లు రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే 30 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చినా అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో వున్న రాష్ట్రంపై అదనపు భారం మోపే దారి ఖర్చులు దండగతప్ప అదనంగా సాధించిందేమిటి అన్నది అసలు ప్రశ్న. పదహారు వేల కోట్ల రూపాయల లోటుకు కేవలం 2,800 కోట్లు మాత్రమే కేంద్రం సాయంగా అందించిందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. అంటే ఆ మిగతా మొత్తం కూడా రాదన్నది స్పష్టం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి అలా పదే పదే ఢిల్లీ తిరగటం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాట్టు పెట్టిన గత పాలకులు, పాలనను గుర్తు చేయటం లేదా ?వారికీ వీరికీ వున్న తేడా ఏమిటి ? తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి లోక్‌ష్‌ గానీ వీటికి సమాధానాలు చెప్పాలి. అలాగాకుండా రోజంతా జగన్‌ భజన చేస్తూ వుంటే సామాన్య జనానికే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులకు కూడా విసుగు పుడుతుంది. 1978లో జనతా పార్టీ ఎంఎల్‌ఏలను కాంగ్రెస్‌ పూర్తిగా తనలో చేర్చుకున్నట్లుగా మరికొద్ది రోజుల్లో మిగిలిన వైఎస్‌ఆర్‌సిపి ఎంఎల్‌ఏలను కూడా ‘అభివృద్ధి’ ముసుగులో తెలుగుదేశంలోకి ఆకర్షిస్తారు.ఆ తరువాత చెప్పుకోవటానికి ఏమీ వుండదు.

    రాష్ట్ర తాత్కాలిక రాజధాని నిర్మాణంలో ఇటుక ఇటుకనూ పేరుస్తూ నిమగ్నమైన చంద్రబాబుకు కేంద్రంపై ఆగ్రహం కలిగించటానికి తప్పితే తెలంగాణాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ప్రయివేటు బిల్లుపెట్టటం ఏమిటి ? పెట్టెను పో దాని మీద చర్చ జరగనీయటం ఏమిటి? జరిగెను పో ఆంధ్రకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తుంది, కావాలంటే ఇంకా అదనంగా కూడా ఏం కావాలంటే అది చేస్తాం అని లాలీపప్‌ సమాధానం చెప్పటం గాక వాటి గురించి మరిచి పోండి అని కేంద్ర మంత్రి కట్టెవిరిచినట్లు మాట్లాడటం ఏమిటి ? మోడీ బాబా నోరు విప్పకుండా శిష్యులతో ఇలాంటి ప్రకటనలు చేయించటం కావాలని చంద్రబాబుకు ఇబ్బంది కలిగించటం కాదా ?

   తానొవ్వ, ఇతరులను నొప్పించక సజావుగా సాగిపోవాలనుకుంటున్న తనకు మధ్య మధ్యలో తలనొప్పి కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడికి తీయని కోపం వస్తోందా? అది శ్రీకృష్ణుడి మీద సత్యభామకు వచ్చినటువంటిదేనా ? తాను ఏం చెప్పినా, ఏం చేసినా ప్రశ్నించేవారు వుండకూడదు, అలా వుండాలంటే చంద్రబాబుకు ప్రతిపక్షం లేకుండా పోవాలి, అది జరగాలంటే అన్ని పార్టీల వారూ తన పార్టీలో చేరి నోర్మూసుకోవాలి.అందుకే ఇతర పార్టీల వారికి గాలం.లొంగని వామపక్ష పార్టీల వారిపై కేసులు, దమనకాండ, దాడులు.

    ప్రత్యేక రాష్ట్ర హోదా చర్చ తలెత్తినపుడల్లా ఇబ్బంది పడుతున్నవారిలో చంద్రబాబుతో పాటు పవన్‌ కల్యాణ్‌ ఒకరు. కాంగ్రెస్‌ మాదిరి తప్పు చేయవద్దని బిజెపికి సలహా ఇస్తూ ట్వీటర్‌లో తన అభిప్రాయం వెల్లడించారు. బిజెపిలో చేరిన కామెడీ హీరో శివాజీ వంటి వారికి కూడా కోపం వస్తోంది.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా రాదని నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడికీ తెలిసినంతగా మరొకరికెవ్వరికీ తెలియదు.

    ప్రత్యేక తరగతి రాష్ట్ర హోదా పొందాలంటే అందుకు ఎలాంటి పరిస్థితులు వుండాలో అసలు ప్రత్యేక రాష్ట్ర లేదా ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశం ఎజండాలో లేక ముందే నిర్ణయించారు. అననుకూల పరిస్ధితులు వున్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించి, పన్నుల రాయితీలు కల్పించాలని ఐదవ ఆర్ధిక సంఘం చేసిన సిఫార్సుల మేరకు 1969తో జమ్ము-కాశ్మీర్‌, అస్సాం, నాగాలండ్‌ను ఈ తరగతిలో చేర్చారు. తరువాత అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, మణిపూర్‌, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, హిమచల ప్రదేశ్‌, వుత్తరా ఖండ్‌కు కూడా దానిని వర్తింప చేశారు. 1. కొండలూ,లోయలతో సంచరించటానికి కష్టంగా వుండే ప్రాంతాలు, 2. జనాభా సాంద్రత తక్కువ లేదా గణనీయ సంఖ్యలో గిరిజనులు వుండటం, 3. పొరుగు దేశాల సరిహద్దులతో వుండి వ్యూహాత్మక ప్రాంతాలలో వుండటం, 4.ఆర్ధిక, మౌలిక వసతుల విషయంలో వెనుకబడి వుండటం, 5. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు గిట్టుబాటు కాకపోవటం వంటి లక్షణాలున్న రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి(ఎన్‌డిసి) ఆమోదం మేరకు ఈ హోదా కల్పిస్తారు.

    ఈ హోదాను పొందిన రాష్ట్రాలకు నిధులు ఎలా కేటాయించాలన్నదానిపై కూడా మార్గదర్శక సూత్రాలు వున్నాయి. ప్రణాళికా సంఘం సాయాన్ని మూడు తరగతులుగా విభజించింది. 1.సాధారణ కేంద్ర సాయం(ఎన్‌సిఏ), 2. అదనపు కేంద్ర సాయం(ఎసిఏ) 3.ప్రత్యేక కేంద్ర సాయం(ఎస్‌సిఏ). కేంద్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రాలకు కేటాయించే సాధారణ కేంద్ర సాయం 100 అనుకుంటే ప్రత్యేక తరగతి రాష్ట్రాలకు 30, మిగతా వాటికి 70 అందచేస్తారు.ప్రత్యేక రాష్ట్రాలకు కేటాయించే నిధుల కేటాయింపునకు ప్రత్యేక నిబంధనలు వుంటాయి. సాధారణ సాయం ఈ రాష్ట్రాలకు 90శాతం గ్రాంటు, పదిశాతం రుణంగా వుంటుంది. అదే సాధారణ రాష్ట్రాలకు 30,70 శాతాలుగా వుంటుంది. సాధారణ రాష్ట్రాలకు కేటాయించే నిధులలో నిధులు 100 అనుకుంటే వాటిలో జనాభా మాషాకు 60, తలసరి ఆదాయాన్ని బట్టి 25, ఆర్ధిక వ్యవస్ధ పనితీరును బట్టి, ప్రత్యేక సమస్యలుంటే ఏడున్నర శాతం చొప్పున కేటాయిస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో ప్రత్యేక ప్రాతిపదికలేమీ లేవు. మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే నిధులలో 2010-11 లెక్కల ప్రకారం సాధారణ కేంద్ర సాయం కేవలం ఐదుశాతం మాత్రమే వుంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలలో కొండ ప్రాంతాలు, గిరిజన వుప ప్రణాళికలు, సరిహద్దు వుండేట్లయితే ఆ రాష్ట్రాలు ప్రత్యేక సాయం అందుకుంటాయి. ఈ సదుపాయాలు కాకుండా ఈ రాష్ట్రాలు కేంద్రం నిర్ణయించిన విధంగా ఎక్సయిజ్‌, కస్టమ్స్‌, ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్ను రాయితీలు పొందుతాయి. విదేశీ నిధులతో ఏర్పాటయ్యే పధకాలు, కేంద్ర ప్రభుత్వ పధకాల సాయం కూడా పొందుతాయి.

      నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రణాళికా సంఘం స్ధానంలో నీతి ఆయోగ్‌ వునికిలోకి వచ్చింది. అదింకా పూర్తిగా కుదుట పడలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం తెలివిగా నీతి ఆయోగ్‌కు బాధ్యతను అప్పగించింది. అది ఇంకా పరిశీలిస్తూనే వుంది. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశ పెట్టిన సందర్బంగా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మౌఖికంగా హామీ ఇచ్చింది తప్ప ప్రత్యేక హోదా కల్పించే విషయాన్ని బిల్లులో చేర్చలేదు. దీనిని బిజెపి లేదా తెలుగు దేశం పార్టీలు అప్పుడు మౌనంగా వుండి ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం వేస్తున్నాయి. నిజానికి వాటికి చిత్త శుద్ధి వుంటే ఇప్పుడైనా విభజన చట్టానికి సవరణలు చేయవచ్చు. అయితే విభజన కారణంగా ప్రత్యేక హోదాలు కల్పించేట్లయితే అనేక కొత్త సమస్యలు వస్తాయి. వాటితో నిమిత్తం లేకుండానే ఒడిషా వంటి రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా కల్పించమని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపాయి. నిజానికి ఈ విషయాలు విభజన బిల్లు సమయంలో కాంగ్రెస్‌, బిజెపిల పెద్దలతో పాటు తెలుగు దేశం నేతలకు కూడా తెలియనివి కావు. అప్పుడు మాకు తెలియ లేదన్నా లేదా తెలుసన్నా జనంలో అభాసుపాలు కావాల్సి వస్తుంది కనుక రాజకీయంగా కాంగ్రెస్‌ మీద నెపం వేస్తున్నారు. దానికి వాస్తవాలు చెప్పుకోలేని పరిస్థితి. తెలంగాణా రాష్ట్రం ఇచ్చింది తామే అనుకున్నా ఇక్కడా జనం ఓడించారు, రాష్ట్రాన్ని చీల్చారనే కోపంతో ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా దానికి శాసనసభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్‌ జనాన్ని ఈ పార్టీలన్నీ బకరాలుగా చేసి వాడుకున్నాయి, ఇప్పుడు రాజకీయంతో ఆడుకుంటున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Andhra Pradesh first state in the country to become Open Defecation Free in urban areas

30 Saturday Apr 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, Open Defecation, urban areas

UD Secretary reviews progress of Swachh Bharat Mission with all 110 Municipal Commissioners

Andhra Pradesh is set to become the first State in the country to make all of its urban areas ‘Open Defecation Free’ by October 2nd this year, marking the two years of the launch of Swachh Bharat Mission by Prime Minister Shri Narendra Modi.

The State officials gave this assurance during a review of progress of Swachh Bharat Mission in all the 110 municipalities of Andhra Pradesh by Shri Rajiv Gauba, Secretary(Urban Development) at Visakhapatnam today. Shri Gauba went to the port city for review of progress of urban missions like Smart city Mission, Atal Mission for Rejuvenation and Urban Transformation (AMRUT) and Swachh Bharat Mission. He held extensive discussions with the Collectors of all the 13 districts and Municipal Commissioners of all the 110 urban local bodies in Andhra Pradesh on their action plans for ensuring sanitation.

During the review, it emerged that Andhra Pradesh which has been in the forefront of construction of toilets in urban areas can make all 100 municipalities Open Defecation Free by October 2 this year as per the action plans in progress.

As against the Mission target of construction of 1,94,336 individual household toilets in urban areas of Andhra Pradesh, work has started in respect of 1,53,779 and construction of 1,04,732 toilets has already been completed.

In addition to the central assistance of Rs.4,000 per toilet, Andhra Pradesh Government is extending assistance of an additional Rs.11,000 per toilet giving a big boost for the programme.

Regarding Community and Public Toilet seats, as against the mission target of 4,614 seats, work has started on 3,887 seats and 1,952 seats have already been constructed.

In respect of Solid Waste Management, out of the total wards of 3,458 in 110 municipalities, 100% door-to-door collection and transportation of such waste is being done in 3,072 wards i.e 89% of total urban wards in the state.

The State Governments has also awarded works for construction of 10 Waste to Energy Plants for generating 63 MW of power from the 6,440 tonnes of municipal waste being generated per day in the state. Shri Gauba was informed that these plants would be commissioned during 2017-18.

Shri Gauba complimented the State Government and all concerned officials for good progress under Swachh Bharat Mission in urban areas and for becoming the first state to make all urban areas open defecation free much ahead of the target this year.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబ్బ మైసూరా రెడ్డి బలే చెప్పిండు కదా !

28 Thursday Apr 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, Others

≈ Leave a comment

Tags

CHANDRABABU, Mysoora Reddy, YS jagan, ysrcp

ఎం కోటేశ్వరరావు

     తెలుగు రాష్ట్రాలలో ఫిరాయింపు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సినిమాలకు పంచ్‌ డైలాగులు అందించే విధంగా పాలక రాజకీయ పార్టీల నేతలు తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ మారుతున్నా అని గతంలో చెప్పేవారు. కార్యకర్తలు తప్ప ఓటర్ల తీర్పును పట్టించుకోరా అన్న విమర్శలు రావటంతో నియోజక వర్గ అభివృద్ది కోసమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇంకా గట్టిగా గతంలో తిట్టిన పార్టీలోనే ఇప్పుడు ఎందుకు చేరుతున్నావంటే అప్పుడు మా నాయకుడు ప్రత్యర్ధులను తిట్టమన్నారు గనుక తిట్టాను తప్ప నిజానికి నా కలాంటి అభిప్రాయం లేదని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఇప్పుడు సీనియర్‌ నేత కనుక మైసూరా రెడ్డి మరో పెద్ద ముందడుగు వేశారు.

   తనకు ఈ వయస్సులో పార్టీలు మారి చెడ్డ పేరు తెచ్చుకోకూదని వుందని, రచనా వ్యాసంగం పెట్టుకోవాలని అనుకుంటున్నానని చెబుతున్నా మధ్యవర్తులు వైఎస్‌ జగన్‌ ఇంటికి వుదయం ఫలహారానికి తీసుకు వెళ్లారట. వెళ్లీ వెళ్లగానే తన ప్రమేయం లేకుండానే ఘటనలు జరిగాయట. వెళుతుండగానే టీవీలలో వార్తలు రావటం, వెళ్లగానే కండువా కప్పటం, ఆ వెంటనే తెలుగు దేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేయటం అన్నీ జరిగిపోయాయట. తుదకు మానవతా దృక్పధంతో సర్దుకొని వైఎస్‌ఆర్‌సిపి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారట. ఇంత కాలం తరువాత తెలిసో తెలియకో వేసిన తప్పటడుగు వెనుకకు తీసుకుంటే గౌరవ ప్రదంగా వుంటుందని అనుకున్నారట. అందుకే రాజీనామా చేశారట. ఈ వార్తలను చూసిన తరువాత మైసూరా రెడ్డిలో అవసరాలకు అనుగుణంగా సర్దుకు పోయే పక్కా అధికార రాజకీయ నాయకుడే గాక మంచి సినిమా కథకుడు కూడా దాగి వున్నట్లు వెల్లడైంది.

   బట్ట తొలిగితే సరి చేసుకో అని ఎవరైనా చెబుతారు, అసలు బట్టలు లేకుండా తిరిగే వారికి చెప్పేందుకు ఎవరు ముందుకు వస్తారు. మహాకవి శ్రీశ్రీ బతికి వున్నా, మరో రూపంలో జన్మించినా

పదండి ముందుకు పదండి తోసుకు

కనపడలేదా అధికార గద్దెలు, వినపడలేదా రా రమ్మని బాబు పిలుపులు

సిగ్గు ఎగ్గులు, నీతి నియమాలూ, ఫిరాయింపు నిరోధ చట్టాలు,

వయస్సులు, వంకాయలా మనకడ్డంకి పదండి ముందుకు పదండి తోసుకు

పోదాం పోదాం అధికార పార్టీలోకి

   అంటూ మహాప్రస్తానాన్ని తిరిగి రాసి వుండేవారు. ఒకసారి పార్టీ మారిన తరువాత మరోసారి ఫిరాయించటానికి కూడా తటపటాయింపులు వుంటాయని మైసూరా చెప్పటం వింతలలో వింత. పదవి వస్తుందా రాదా, పది కోట్లు సంపాదించుకుంటామా లేదా అన్నది తేలలేదు అంటే మెరుగ్గా వుండేది.

    కాంగ్రెస్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన మైసూరా అక్కడ పూర్తిగా అధికారాన్ని, ఫ్యాక్షన్‌ రాజకీయాలను అనుభవించారు. తాను తీవ్రంగా వ్యతిరేకించే రాజశేఖరెడ్డి తిరుగులేని నేతగా ఎదగటంతో కాంగ్రెస్‌ నుంచి బయట పడి తెలుగు దేశంలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. తరువాత వైఎస్‌ జగన్‌కు పరిస్థితులు అనుకూలంగా వున్నట్లు కనిపించటంతో వైఎస్‌ఆర్‌సిపిలో చేరారని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటున్నారు. భవిష్యత్‌లో పార్టీ మారే వారికి మరొక మహత్తర అస్త్రాన్ని అందిస్తున్నాననే విషయం బహుశా ఆయనకు తెలియకుండానే జరిగి వుంటుంది.అదే మంటే తాను అయోమయంలో వున్న స్థితిలో టిఫిన్‌కు తీసుకు వెళ్లి కండువా కప్పారన్న భయంకర పచ్చి నిజాన్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో పార్టీ ఫిరాయించిన వారిని ఎందుకు మారారు అంటే ఆ బలహీన క్షణంలో ఏం జరిగిందో తెలియలేదు, లేచి చూస్తే పరాయి పార్టీ కండువా కప్పి వుండటం కనిపించింది. పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు ఇష్టం లేకపోయినా దానిలోనే వుండాల్సి వచ్చింది. ఆ పార్టీ యజమాని ఏదో మానవత్వం లేనివాడే అనుకున్నా మానవతా వైఖరితో అక్కడే కొనసాగా గానీ ఇంత మానవత్వం లేని వాడని తెలిసిన తరువాత అక్కడ వుండటం మానవత్వానికే మచ్చ అని బయటకు వచ్చా అని అమాయకంగా చెప్పవచ్చు, సానుభూతి పొందవచ్చు. ఇప్పటికే ఫిరాయింపుల పర్వంలో వున్న వారూ, రాబోయే తరాలకూ ఇది ఒక హెచ్చరిక వంటిది కూడా. ఎప్పుడూ అయోమయంలో, లేదా తెలియని మైకంలో వుండ కూడదని, వుంటే ఎవరైనా తీసుకుపోయి కండువాలు కప్పేస్తారని గ్రహించాలి. లేదా తెలిసినా తెలియనట్లు నటించాలి.

    రచనలు చేయాలనుకున్నారు మైసూరా ఆందోళన చెందనక్కర లేదు. అయితే రాయలసీమ ఫ్యాక్షన్‌ గురించి ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. ఇదే సమయంలో తెలుగు సినిమాలకు అసలే కధల కొరత వుంది. తమ కోసం పైరవీలు చేస్తే తప్ప వ్యాసాలు రాస్తే తెలుగు పత్రికలు డబ్బులు ఇవ్వవని మైసూరా రెడ్డికి చెప్పనవసరం లేదు. టీవీ ఛానల్స్‌ రేటింగ్‌లు పెంచే సంచలనాలు బయట పెట్టేందుకు ఆయన దగ్గర అలనాటి జ్ఞాపకాలు వున్నా ఆ వ్యక్తులు లేరు కనుక ఇప్పుడు చెప్పినా ప్రయోజనం వుండదు. పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోయింది కనుక అదీ వృధా ప్రయాసే.ఏ మాటకామాటే చెప్పుకోవాలి. మైసూరా రెడ్డి వంటి నేతల రాజకీయ జీవితాలన్నీ తెరిచిన పుస్తకాలే. రాబోయే తరాలు కొత్తగా తెలుసుకోవాల్సింది, అనుసరించాల్సిన ఆదర్శాలేమి వున్నాయి గనుక. దాని బదులు దర్శక, నిర్మాతలకు తన సరికొత్త పిట్ట కథలను వినిపిస్తే డబ్బుకు డబ్బు పేరుకు పేరు వస్తుందేమో ఆలోచిస్తే మంచిది.

     చంద్రబాబు నాయుడు తనకు తరువాత తన కుమారుడికీ, మనవడికీ రాజకీయంగా ప్రతిపక్షం లేకుండా చేయాలనే విజన్‌ 2030,2050తో పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు గాను ఎవరు వస్తే వారికి పచ్చ కండువాలు కప్పుతున్నారు. గతంలో పార్టీలు మారిన వారు తన దగ్గరకు రావటమే తడవుగా అభివృద్ధి ముద్రవేస్తున్నారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసిన పచ్చి నిజం ఇలాంటి వారి గురించి చంద్రబాబుకు తెలియక కాదు.ముందు మైండ్‌ గేమ్‌తో ఎదుటి వారిని దెబ్బతీయాలి. అందుకు ఎవరినైనా ఆకర్షించు, అందుబాటులోకి వస్తే వాడుకో, అవసరం తీరగానే వదిలెయ్‌. చంద్రబాబు నాయుడు విద్యార్ధిగా రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఈ సిద్ధాంతాన్నే నమ్ముకున్నారని, తు.చ తప్పకుండా ఆచరిస్తున్నారని చెబుతారు. ఇలాంటి వారి లక్షణం ఏమంటే ఎవరినీ ఒక పట్టాన నమ్మరు. విస్వసనీయత సమస్యను ఎదుర్కొంటారు. ఒక మంచి వ్యక్తి పార్టీ నుంచి బయటకు పోయే పరిస్థితి వస్తే సమర్ధించుకోవటం కష్టం. అదే నాలుగు పార్టీలు మారిన అవలక్షణం వున్న వారు పోతే వారికి తాను ఎంత చేసినా పార్టీ మారారని తేలికగా ఒకమాటతో తుడిచి వేసుకోవచ్చు.

     ఇక వైఎస్‌ఆర్‌సిపి విషయానికి వస్తే ఆ దుకాణంలో ఎందరుంటారో లేదో తెలియదు. ఫిరాయించిన వారెవరి సభ్యత్వమూ పోకుండా స్పీకర్లు కాపాడగలరని రెండు తెలుగు రాష్ట్రాలే గాక దేశమంతటా రుజువైంది.అధికార రాజకీయాలలో ఎవరూ అంటరాని వారు, శాశ్వత శత్రువులు వుండరు, బొబ్బిలి , విజయనగరం రాజాలే ఒక ఒరలో ఇమిడిపోయినపుడు మిగతావారి పౌరుషాలు ఏపాటి? అందువలన రాబోయే రోజుల్లో ఎవరైనా పార్టీలో మిగిలితేనే ఆశ్చర్యం. తెలుసు కోవాల్సిన నీతి ఏమంటే ఎలుకలు అన్న తరువాత కలుగుల్లోకి పోకుండా వుంటాయా అధికార పార్టీలన్న తరువాత జనం పార్టీలు మారకుండా వుంటారా అనే వైరాగ్యం అలవరచుకుంటే మంచిది. అంతకు మించి ఎవరూ ఏమీ చేయలేరు. కొందరు మట్టివాసన పసిగట్టి వర్షం వస్తుందని గ్రహిస్తారు. అలాగే ఎన్నికల సమయం వచ్చినపుడు అధికారం వచ్చేట్లు వుంటే పసిగట్టిన వారు తిరిగి వస్తారు, నిజంగానే అధికారం వస్తే నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని మిగిలిన వారూ కాళ్ల ముందు వాలతారు. ఎలాగూ ప్రజా సమస్యల మీద చేసే పనేమీ లేదు. చేయాలనే దృష్టీ లేదు కనుక 2019 వరకు కోర్టు కేసులను చూసుకుంటూ, గతంలో వెనకేసుకున్నదానిని కాపాడుకుంటూ వచ్చే ఎన్నికలలో పెట్టుబడులు లాభాల గురించి ఇప్పటి నుంచే కసరత్తు చేయమని కొత్త ఆడిటర్లను నియమించుకుంటే మంచిది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గారికి బహిరంగ లేఖ

13 Wednesday Apr 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 2 Comments

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, jana sena party, pavan kalyan, special status to Andhra pradesh

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గారికి

    మీ అభిమాని ఎం కోటేశ్వరరావు  వ్రాయు బహిరంగ లేఖ. అన్నా ఇలా రాస్తున్నందుకు మీరు అన్యధా భావించవలదు. ఎంతో బిజీగా వుంటారు కనుక లేఖలను మీరు చూసే అవకాశం వుండదు. మీ సిబ్బంది కూడా అభిమానుల లేఖలన్నింటినీ పూర్తిగా చదువుతారో లేదో అనే అనుమానంతో ఇలా రాయాల్సి వస్తోంది. మీరేమీ అనుకోరని అనుకుంటున్నా.

    మీ అభిమానులందరం రాజా గబ్బర్‌ సింగ్‌ కోసం ఎదురు చూస్తూ సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా చూస్తూ ఆనందిస్తున్నాం. అన్నదానాలు, ఇతర కార్యక్రమాలు చేస్తున్నాం. మీ (మా) సినిమా విడుదల సందర్బంగా ప్రమోషన్‌లో భాగంగా వివిధ టీవీ చానల్స్‌ , పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో 2019 ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించి ఖుషీ కలిగించి అభిమానులలో వున్న అనుమానాలను తొలగించారు. గత రెండు సంవత్సరాలుగా లేస్తే మనిషిని కాను అన్న కుంటి మల్లయ్య మాదిరి మీ పీకె మాటలు తప్ప ఇంతవరకు పీకిందేమీ లేదని అంటుంటే ఎంత గుడ్డి అభిమానులమైనా అడ్డగోలుగా మిమ్మల్ని సమర్ధించలేక, కాదని ఖండించలేక చచ్చిపోతున్నాము. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని మీకు తెలుసు. రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఎవరు ఏమి అన్నా పడాల్సిన పరిస్థితి.ఎన్నికలలో మీ పోటీ ప్రకటన తరువాత ఇప్పటిదాకా మనకు అత్తారింటికి దారేదో చూపిన మీ పవర్‌ స్టార్‌ ఇప్పుడు తన పదవికి మార్గమేదో వెతుక్కుంటున్నాడని కొంత మంది వ్యంగ్యంగా అంటున్నారు. పదవి కోసం పాకులాడని వాడెవడు, అదేపని మా పీకే చేస్తే తప్పేమిటి అని ఎదురుదాడి చేస్తున్నాం. ఇంకా అవసరమైతే వుధృతం చేస్తాం మీరు ఫికరు పడకండి.

   గతంలో తెలుగు దేశం పార్టీ వారు తాము పార్టీ పెట్టిన ఎనిమిది నెలలో అధికారానికి వచ్చామని గొప్పగా చెప్పుకున్నారు. అదొక పెద్ద గొప్పేంటి మే మసలు అధికారానికి వచ్చిన తరువాతే పార్టీ పెట్టామని(జనతా) మరొకరు బదులిచ్చారు. మన ప్రత్యేకత ఏమిటన్నా ? మీరు గత అసెంబ్లీ , పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు పార్టీని ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామంటున్నారు. ఇది చాలా చిత్రంగా వుందన్నా.

    ఈ మధ్య కాలం ఐదు సంవత్సరాలో ఏం పీకారంటే ఏం చెప్పాలన్నా ! ఎన్నికలపుడు చెప్పుకోవటానికి ఏదైనా వుండాలి కదన్నా. జరిగిందేదో జరిగి పోయింది. ఇప్పటికైనా పార్టీ కార్యక్రమాలు ప్రారంభించితే మంచిది. అన్నా మనలో మాట, హైదరాబాదులో వున్నన్ని రోజులు మరొకచోట ఎక్కడా జీవించలేదని మీరు ఒక మాట అన్నారు. ఇంతకీ మన పార్టీ ఏ రాష్ట్రంలో పోటీ చేస్తుందన్నా, రెండు తెలుగు రాష్ట్రాలలోనా ? ఒక్క ఏపిలోనేనా ? వైఎస్‌ఆర్‌ సిపి, తెలుగుదేశం పార్టీ పాట్లు చూసిన తరువాత జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మంచిదన్నా.

     ఏపికి ప్రత్యేక హోదా ఇతర విషయాల గురించి మీకింకా గుర్తుందని చెప్పినందుకు ఒకవైపు సంతోషంగా వున్నా మరో వైపు మాత్రం విచారంగా వుందన్నా. పేదరాసి పెద్దమ్మ కథలలో చెప్పే రాజహంస ఎంతో అందంగా వుంటుంది గానీ దానిని ఎవరూ చూసిన వారు లేరన్నా, ఏపికి ప్రత్యేక హోదా కూడా అలాంటిదే అంటున్నారు. అది రాదని మీకు ఎన్ని సార్లు చెప్పాలి పదే పదే అడుగుతారు ఒకసారి చెబితే అర్ధం కాదా అంటూ కేంద్ర మంత్రులు విసుక్కుంటున్నారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తద్దినం రోజు తప్ప మిగతా రోజులలో విస్మరించే మాదిరి పట్టించుకోవటం లేదు. జనం కూడా దాని గురించి మరిచి పోయి అంతకంటే మంచి రోజులు వస్తాయని సర్దుకు పోతున్న రోజులలో అదింకా గుర్తుందని మీరెందుకన్నా చెప్పటం.మీరేమైనా అనుకోండి ఇది అశుభ సూచకం అన్నా. జనానికి పట్టని దాన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, నిబంధనలు మారిన కారణంగా ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదని అందరికీ అర్ధమైనా మీ పీకెకు అర్ధం కాలేదా, కాదా అని ఎవరైనా అడిగితే మీరేమో గానీ మేం ఇబ్బంది పడాల్సి వస్తుందన్నా. ఇంతవరకు లేదు అని కేంద్రం చెప్పలేదు కనుక మాట్లాడటం లేదుతప్ప మరొకటి కాదని మీరు చెప్పారు.

     అన్నా ! కాదని కేంద్రం ఎప్పుడు చెప్పేను మీరు ఎప్పుడు నోరు విప్పేను ! అది జరిగేది కాదన్నా ! ఆంధ్రప్రదేశ్‌ అంటే కేవలం ప్రత్యేక హోదా ఒక్కటే కాదన్నా. జనానికి సంబంధించిన సమస్యలు అనేకం వున్నాయి. దేశమంటే మట్టి కాదోయ్‌ మనుషులోయ్‌ అని ఎన్నో పుస్తకాలు చదివిన మీకు మేం చెప్పాలా అన్నా ! రాజకీయ పార్టీలు ముఖ్యంగా మీరు చెప్పిన నిబద్దతగా వుండే కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగతావి ఏనాడన్నా ఫలానిది చేయం అని ఎప్పుడైనా చెప్పాయా అన్నా ? మీకెందుకన్నా ఆ పార్టీల మీద అంత భ్రమ ? లేదు తమ్ముడూ నిజం చెప్పాలంటే మన దగ్గర చెప్పేందుకు ఇప్పుడేమీ లేదు, ఏం చెప్పాలో ఎటు పోవాలో తెలియటం లేదు అందుకే అలా చెప్పి కాలం గడుపుదాం అంటే అభిమానులంగా మేం సరే అనక చస్తామా అన్నా ? అన్నో ! అసలు విషయం మరొకటి వుంది !

    ఇంటర్వ్యూలలో మీకు ఖర్చులు ఎక్కువని, తగినంత ఆదాయంలేక రోజులు గడవటం కష్టంగా వుందని చెప్పారు. పార్టీ కోసం కూడా డబ్బు లేదన్నారు. డబ్బులేనోడు డుబ్బుకు కొరగాడని తెలియనిదేముందన్నా ! అలా అయితే మన పార్టీ వెనుక ఎవరు చేరతారన్నా ? లేదా మీరు చెప్పినట్లు చెప్పిన దానికి కట్టుబడి వుండే కమ్యూనిస్టు పార్టీల మాదిరి సమస్యలపై పని చేసి జనం దగ్గరకన్నా వెళ్లాలి. మీరది చెయ్యరు ఇది చెయ్యకుండా డబ్బు లేదంటే కష్టం అన్నా. తమ్ముడు తనోడు కావచ్చు కాని న్యాయం న్యాయమే అన్నట్లుగా చిరంజీవి మా అన్న కావచ్చు గానీ ఆయన కాంగ్రెస్‌లో వున్న కారణంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించను అని చెప్పారు. అదేంటన్నా ఆలూలేదు చూలు లేదు అన్నట్లు అప్పుడే దారులు మూసేస్తే ఎలా ? ఏ పార్టీ వాసన అంటని వీర భోగ వసంతరాయుళ్లు మన పార్టీకి దొరుకుతారంటావా అన్నా ? మీ దగ్గర డబ్బూ లేక మీ అన్న వంటి వారిని దరిచేరనీయక వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానంటే జనం నమ్మరేమో అన్నా. ఎందుకంటే గతంలో లోక్‌సత్తా జయప్రకాష్‌ నారాయణ వచ్చే ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ పై ఎన్నికలలో కేంద్రంలో పదవి చేపట్టటం నా లక్ష్యం అని చెప్పారు. చివరకు లోక్‌సత్తా దుకాణాన్నే ఎత్తివేశారు. మన పార్టీ పరిస్ధితి అలాకాకుండా చూడండన్నా, ఒకవేళ అదే జరిగితే మీరు తిరిగి సినిమాల్లోకి పోతారు, మేం ఏం కావాలో అలోచించండన్నా ? రాజకీయాలలోకి వచ్చి ఎన్నికలలో పోటీ చేసిన తరువాత ఇంక సినిమాలు చేయను అంటున్నారు, వినటానికి బాగానే వున్నా అలాంటి ప్రకటనలు మంచివి కాదేమో, అటూ ఇటూ కాకుండా పోతారేమో చూసుకోండన్నా ?

    ఇక పోటీ విషయానికి వస్తే స్వంతంగా చేస్తారా? బిజెపితో కలుస్తారా ? తెలుగుదేశంతో దోస్తీ చేస్తారా అని వూహాగానాలు మొదలయ్యాయి. కొందరేమో మీకు కులముద్ర వేసి కులానికి పరిమితం చేయాలని చూస్తున్నారు. గత ఎన్నికలలో తెలుగు దేశం, బిజెపికి మీరు అలాగే వుపయోగపడ్డారని అందరూ అనుకుంటున్నారు. ఇపుడు పార్టీల ఫిరాయింపులు, ఎత్తులు, జిత్తులు చూస్తుంటే కుల సమీకరణల చుట్టూ తిరుగుతున్నట్లే కనిపిస్తోంది. తోక, తోరెలు అధికార, ప్రతిపక్ష పార్టీలవైపు సమీకరణయ్యారని, తోకా లమద్దతు ఎవరు పొందితే వారికి వచ్చేసారి అధికారం ఖాయం అన్నట్లుగా లెక్కలు వేసుకుంటున్నారు.(తోక అంటే తోటి కమ్మ, తోరె అంటే తోటి రెడ్డి, తోకా అంటే తోటి కాపు, ఇలా ప్రతి కులానికి ఒక సాంకేతిక నామం) రాబోయే ఎన్నికలలో సినిమా రంగాన్ని కూడా తమవైపు తిప్పుకొనేందుకు పార్టీల ప్రయత్నాలు ప్రారంభమైనట్లు కనిపిస్తున్నాయి అన్నా. చివరిగా మరొక విషయం అన్నా. ప్రతి ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్‌ మధ్య రష్యాలోని సైబీరియానుంచి వలస పక్షులు వచ్చి వెళతాయి. అలాగే ఎన్నికలపుడు మాత్రమే కనిపించేవారిని ఎన్నికల పక్షులని పిలుస్తారన్నా. మీరు ఆ పేరు తెచ్చుకోకుండా జాగ్రత్త పడటం అవసరం అన్నా. వుంటా మరి మరోసారి మరో లేఖ రాస్తా

మీ అభిమాని

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆనందం-విషాదం

16 Wednesday Mar 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CHANDRABABU, Narendra Modi sarkar, NDA, special status to Andhra pradesh, Ycp, ycp jagan

ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్థితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

ఎం కోటేశ్వరరావు

     ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో ప్రభుత్వం మీదా, శాసన సభాపతి మీదా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను చాకచక్యంగా తిప్పి కొట్టగలిగామని తెలుగుదేశం పార్టీలు శ్రేణులు చంకలు కొట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదూ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా అరటి పండు వలిచి అరచేతిలో పెట్టినట్లుగా చెప్పటంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం ఆవిరై నీరు గారి పోతున్నారు. ప్రత్యేక హోదా లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అడుగుతూ విసిగిస్తున్నారు అర్ధం కాదా మీకు ముందు బయటకు పొండి అన్న రీతిలో కేంద్ర మంత్రి అరుణ్‌ జెట్లీ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంపీలతో మాట్లాడినట్లు తెలుగు దేశం పార్టీకి అనుకూలమైన పత్రికలోనే వార్తలు వచ్చాయి. హాస్యాస్పదం, విచారకరం ఏమంటే అది జరిగిన మరుసటి రోజే అలా మాట్లాడితే ఎలా దొరా మంచి మనసు చేసుకొని మా సంగతి చూడండి, మరొక మాట చెప్పండి అన్నట్లుగా విభజస సమయంలో తమకు ఇచ్చిన హామీలు అమలు జరపాలని అధికార తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కంద్రానికి మరోసారి విన్నవించుకుంది. ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్ధితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

     ముందుగా ఆనందం గురించి చూద్దాం. ఒకసారి నీతి తప్పిన తరువాత ఎన్నిసార్లు తప్పినా ఒకటే అని తెలుగు దేశం పార్టీ గత రెండు రోజులలో రుజువు చేసింది. తొలిసారి పడితే సిగ్గు. ప్రతిసారీ పడితే అది ఎబ్బెట్టుగా వుంటుంది. కనుక అసలు తొలిసారే సిగ్గు పడనివారు దాని స్థానంలో పండుగ చేసుకోవటంలో ఆశ్చర్యం ఏముంది. గతంలో కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీలు చేసినా ఇప్పుడు తెలుగుదేశానికి అయినా అది వర్తిస్తుంది. కాకపోతే సందర్భం తెలుగుదేశం పార్టీ గనుక దాని గురించి ముచ్చటించుకోక తప్పదు. ఇతర పార్టీల అజెండా,గుర్తులపై ఎన్నికైన వారు పార్టీ మారాలనుకుంటే తాము ఎన్నికైన స్థానానికి రాజీనామా చేసి ఇష్టమొచ్చిన పార్టీలో చేరవచ్చు. చేర్చుకొనే వారికి కూడా అభ్యంతరం వుండనవసరం లేదు. ఆ నీతికి కట్టుబడి వుంటే అయినట్లే అని వారూ వీరు అనుకోవటం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో చేరిన ఎనిమిది మంది వైసిపి సభ్యులను పార్టీలో చేర్చుకోవటమే రాజ్యాంగం, స్ఫూర్తికి కూడా విరుద్దం. వారిపై ఫిరాయింపు నిరోధక చట్టం వేటు పడకుండా వుండాలంటే అవిశ్వాస తీర్మానాలపై ఓటింగ్‌ సందర్బంగా వారు ఎన్నికైన పార్టీ విప్‌ జారీ చేయకుండా వుండేందుకు తగిన వ్యవధి లేకుండా తక్షణమే అనుమతించి ఓటింగ్‌ కూడా పెట్టి తీర్మానం వీగి పోయిందని సంతోషించారు. వెంటనే సభాపతిపై పెట్టిన అవిశ్వాసంపై అంతకంటే దారుణంగా ముందుగా అసలు నిబంధనలనే ఎత్తివేసి ఓటింగ్‌ పెట్టి రెండోసారి ‘ఘనవిజయం’ సాధించారు. మొదటిది చాణక్యం అనుకుందాం, మరి రెండవది ?

     ఒక తప్పుడు సాంప్రదాయం లేదా పద్దతికి తెరతీశారు. ఇలాంటి చర్య వలన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు గౌరవం పెరగదు. గాంధీ పేరు గుర్తున్నంత కాలం గాడ్సే కూడా వుంటాడన్నట్లు పార్లమెంటరీ వ్యవస్ధలో చెడు సాంప్రదాయంతో గట్టెక్కిన స్పీకర్‌గా చరిత్రకు ఎక్కారు. స్పీకర్లు పాలక పార్టీకి చెందిన వారిగానే వుంటారు, పైకి ఏం చెప్పినా, నిబంధనలు ఎలా వున్నా పాలకపార్టీని కాపాడటానికి స్పీకర్లు తమ స్థానాలను వుపయోగిస్తున్నట్లు దాదాపు అన్ని శాసనసభల, పార్లమెంట్‌ అనుభవం. అందుకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ అతీతం కాదు. గతంలో తెలుగుదేశం అధికారంలో వుండగా స్పీకర్‌ ప్రవర్తన, దానిపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ రాజశేఖరెడ్డి ఎలా వ్యవహరించారో తెలియంది కాదు. తెలుగుదేశం ప్రతిపక్షంలో వుండగా కూడా అదేపని చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై దాడిలో భాగంగా ఆ పార్టీకి చెందిన స్పీకరుపై ప్రతిపక్ష వైసిపి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు అదే ఎత్తుగడలను వుపయోగిస్తోంది. వుత్తమ, చెడు సాంప్రదాయాల గురించి భవిష్యత్‌లో జరిగే చర్చలో అప్పుడు ఇప్పుడూ స్పీకర్‌గా ఎవరున్నారో వారిని ప్రస్తావిస్తారు తప్ప అలాంటి తప్పుడు సలహాలు చెప్పిన వారిని కాదు.

     నిజానికి తెలుగు దేశం పార్టీకి స్పీకరు స్థానాన్ని, దానిలో వున్న గౌరవనీయ సభ్యుడిని ఫణంగా పెట్టాల్సిన అవసరం వుందా ? ఫిరాయించిన వారి మద్దతు లేకపోతే ప్రభుత్వం నిలబడే స్థితి లేదా అంటే అలాంటిదేమీ లేదు. పాలకపార్టీలో లుకలుకలున్నాయా అంటే అదీ లేదు. అంతా సర్దుబాటే తప్ప కుమ్ములాట బాట అవసరం ఏముంది. ఎక్కడ అధికారం వుంటే అక్కడ అనుభవించి తరువాత ఎవరు అధికారానికి వస్తే అభివృద్ది పేరుతో ఆ పార్టీలో చేరటానికి, చేర్చుకోవటానికి తలుపులు బార్లా తెరిచి వుంటాయి గనుక భవిష్యత్‌కూ ఢోకా వుండదని ఫిరాయింపుదార్లు రుజువు చేశారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టటం అన్నది పార్లమెంటరీ చరిత్రలో ప్రతిపక్షానికి వున్న ఒక హక్కు, అవకాశం. ప్రస్తుతం శాసనసభలో వున్న బలాబలాల రీత్యా వైసిపి పెట్టిన తీర్మానాలు ఓడిపోతాయని ఆ పార్టీకి తెలుసు, పాలకపక్షానికి తెలుసు. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ఎండగట్టటానికే ఈ అస్త్రాన్ని వాడతారు. అక్రమంగా పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వాలను కాపాడే క్రమంలో ప్రతిపక్ష పార్టీకి మరొక అస్త్రాన్ని అందించటంతప్ప ఇంత అప్రతిష్ట మూటగట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా వుత్తమ సాంప్రదాయలను నెలకొల్పాలని లేదా ముందుకు తీసుకుపోవాలని కోరుకొనే వారికి తప్ప ఈక్షణం గడిచిందా లేదా ప్రత్యర్ధిపై దెబ్బతీశామా లేదా అని చూసే వారికి విమర్శలు పట్టవు.

     ఇక రెండో అంశం విషాదం. చంద్రబాబుపై అవిశ్వాసం, స్పీకర్‌పై అవిశ్వాసంలో విజయ తెలుగుదేశం పార్టీకి ఆనందం, వైసిపి విషాదం క్షణ భంగురాలు. ప్రత్యేక హోదా గురించి మరింత వివరణ,స్పష్టత వచ్చింది కనుక తమ అవిశ్వాస తీర్మానాలు ఓడిపోయాయని, తమ పార్టీ జంప్‌ జిలానీలపై వేటు వేసే అవకాశం చేజారిందని వైసిపి నేతలు విషాదంలో మునగనవసరం లేదు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యోగం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదారాదని, ప్రత్యేకంగా నిధులు కూడా రావని చంద్రబాబుకు, వెంకయ్య నాయుడికి తెలియని విషయం కాదు. ఆ విషయం తాము చెప్పకుండానే జనం గ్రహించాలని, తమపై ఎలాంటి ఆగ్రహం ప్రదర్శించకుండా చెవుల్లో పూలు పెట్టుకొని తలలాడించాలని వారు కోరుకుంటున్నారు. రాష్ట్ర విభజనే ఒక రాజకీయం. ప్రత్యేక హోదా మరొక రాజకీయం, ప్రతిదీ రాజకీయమే, ఒక్క సిపిఎం తప్ప ఎవరికి వారు ఈ రాజకీయంలో తమ వంతు పాత్రను రక్తి కట్టించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తప్పుదారి పట్టించారు. మంగళవారం నాటి పార్లమెంట్‌ చర్చలో విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా మోసం చేసిందని వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎదురుదాడికి దిగారు. నిజమే కాంగ్రెస్‌ మోసం చేసింది. ప్రత్యేక హోదా ఐదు కాదు పది సంవత్సరాలు కావాలని కోరిన వెంకయ్య అది చట్టంలో పొందుపరచలేదనే విషయాన్ని అప్పుడు ఎలా మరిచి పోయారు ? ఆ సమయంలో బిజెపి, తెలుగు దేశం ఎంపీలు ఏ గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారు? చిన్న పిల్లలేం కాదే, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం చెప్పారే తప్ప ఒక కన్నును పొడుస్తుంటే ఎందుకు వూరుకున్నారు? పోనీ తరువాత అయినా చట్టాన్ని సవరించి ప్రత్యేక హోదాను చేర్చటానికి ఏ పార్టీ అడ్డుచెప్పింది? ఎందుకు ఆపని చేయలేదు. ఇప్పటికైనా చట్టసవరణ చేయవచ్చు కదా ?

    ఎందుకు గతంలో చేయలేదు, ఇపుడు చేయటం లేదంటే. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనే 14వ ఆర్ధిక సంఘం ముసాయిదా తయారైంది. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించటాన్ని నిలిపివేయాలనే సిఫార్సు చేసే ఆలోచనలో వుంది. ఒక వేళ కాంగ్రెస్‌-బిజెపిలు ఆంధ్రప్రదేశ్‌ విషయంలో చట్టంలో చేర్చినా తరువాత వెలువడే ఆర్ధిక సంఘం సిపార్సులకు అది వ్యతిరేకం కనుక ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పినా, కోర్టుకు వెళ్లినా అది చెల్లదు. అందుకనే తెలివిగా దాని ప్రస్తావన లేకుండా చట్టం చేశారు. బిజెపి తెలిసి కూడా మౌనం దాల్చింది. తరువాత ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవకాశం లేకుండా ఆర్ధిక సంఘం సిపార్సులు అమలులోకి వచ్చాయి. అందువలన రాజకీయాలు తప్ప చట్ట సవరణ చేసే అవకాశం లేదు. ఒక వేళ చేస్తే అనేక రాజ్యాంగ సమస్యలు వస్తాయి. అందుకే ఎవడికి పుట్టిన బిడ్డరా అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పట్ల వ్యవహరిస్తున్నారు.

    బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోప్రత్యేక హోదా అమలుకోసం కేంద్రాన్ని అర్ధిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు ఎంతో వినమ్రతతో తన బాడీ లాంగ్వేజ్‌ను సవరించుకొని మాట్లాడారు. బిజెపి సభ్యుడు విష్ణుకుమార్‌ రాజు తమ కేంద్ర ప్రభుత్వాన్ని, అన్నింటికీ మించి తమ వెంకయ్య నాయుడిని జనం ఎక్కడ అపార్ధం చేసుకుంటారో అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం లక్షా 40వేల కోట్ల రూపాయల పాకేజి ఇచ్చిందని , ఏ విద్యా సంస్ధకు ఎన్ని వందల కోట్లు ఇచ్చిందో లెక్కలు చెప్పారు. ఆ మాటలు విన్నవారికి ఎవరికైనా అత్యాశ కాకపోతే ఇంకా ఎక్కడి నుంచి కేంద్రం ఇస్తుందనే భావం లుగుతుంది. అందుకే వెంటనే చంద్రబాబు నాయుడు చర్చమధ్యలో జోక్యం చేసుకొని అన్ని విద్యాసంస్థలకు కలిపి ఇప్పటికి ఇచ్చింది 172 కోట్లేనని, విష్ణుకుమార్‌ రాజు చెప్పే మొత్తాలు అవి పూర్తయ్యే నాటికి వస్తాయని అసలు విషయం చెప్పారు. అందువలన ఇప్పటివరకు చేసిన సాయం లేదా ప్రకటించిన సాయం గురించి అటు చంద్రబాబు ఇటు బిజెపి రెండూ కూడా అంకెల గారడీ చేస్తున్నాయి తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. ఇలాంటి తీర్మానాలు ప్రతి రోజూ పంపినా అవి నరేంద్రమోడీ చెత్తబుట్ట నింపటానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అదనపు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం వుండదన్నది స్పష్టం. అందుకే రాష్ట్ర విభజన, ఆ సందర్భంగా ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్‌ యువతకు పెద్ద విషాదం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబ్బ ! ఎంత బాగా చెప్పిండో కదా !

04 Friday Mar 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Amaravathi, CHANDRABABU, land scam, tdp, YS jagan, ysrcp

సత్య

   అబ్బో ఆ భూములన్నీ వారే దగ్గరుండి కొనిపించినట్లు, రిజిస్టర్‌ చేయించినట్లు రాశారే అని అమరావతి ప్రాంతంలో అధికారపక్ష నేతలు భూములు కొనుగోలు గురించి వచ్చిన వార్తలను చూసి ఒక వ్యక్తి వ్యాఖ్య.

   నిజమే, వైఎస్‌ఆర్‌సిపి నేత జగన్‌ మోహన్‌ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు అక్రమంగా సంపాదించారని ఇప్పటికీ తెలుగు దేశం వారు చెబుతున్నారు. అంటే జగన్‌ ఆ డబ్బంతా తీసుకుంటున్నపుడు వారంతా దగ్గరుండి చూశారా, లేక వారే ఇప్పించారా అని తాపీగా మరొకరి ప్రశ్న.

     వాస్తవం ఏమిటి ?ఎంతో కొంత రెండూ నిజమే. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.అసలు అవినీతి పాల్పడని వారు ఎవరు అని జనం అనుకొంటున్న స్ధితిలో ఎవరూ అక్రమంగా సంపాదించటానికి వెనుకాడటం లేదు. సిగ్గు పడటం అసలే లేదు, ఆడామగా తేడా, వయస్సు బేధం లేదు, సంపాదించకపోతే జనమే అసమర్ధులంటారు కదా !

    అమరావతి ప్రాంతంలో ఎవరి డబ్బు పెట్టి వారు భూములు కొంటే తప్పేంటి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అమాయకంగా, ఎంతో ప్రజాస్వామ్య యుతంగా అడుగుతున్నారు. ఎవరో భూములు కొనుక్కుంటే అది మాకు అనవసరం, నాకు కావలసింది నిబంధనలు పాటించారా లేదా అన్నదే అని కూడా చెప్పారు. నిజమే కదా తప్పేముంది !

    జగన్‌ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు ముఖ విలువ కంటే ఎన్నో రెట్లకు వాటిని కొనుగోలు చేసినట్లు ,ఆ రూపంలో అక్రమంగా లంచాలు సమర్పించినట్లు తెలుగుదేశం వారు విమర్శించారు. వారి డబ్బు వారిష్టం ఒక రూపాయి వస్తువును వందరూపాయలు పెట్టి ఎందుకు కొన్నారంటే అది వారిష్టం అని జగన్‌ మద్దతుదార్లు సమర్ధించారు.అదీ చట్టబద్దంగానే జరిగింది, రికార్డులలో వున్నది కావాలంటే చూసుకోండి అన్నారు. చిత్రంగా వుందే అదీ నిజమే కదా ! కాదంటారా ?

    అప్పుడు జగన్‌ కంపెనీ రికార్డులను చూపి అవినీతి జరిగిందని తెలుగు దేశం వారు విమర్శించారు.ఇప్పుడూ అదే పద్దతుల్లో దస్తావేజులను చూసి చూపి జగన్‌ మీడియా లేదా మద్దతుదార్లు బదులు తీర్చుకున్నారు. కాదంటారా ? అవునంటారా ?

   పక్కవారిపై బురదజల్లి తుడుచుకోమన్నట్లు నిజం నిరూపించుకో అంటున్నారు ఎక్కడైనా అవినీతి వుంటే చర్యలు తీసుకోవచ్చు అన్నారు చంద్రబాబు.

   లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్‌పై ఆరోపించి కాదని రుజువు చేసుకోమన్నపుడు చంద్రబాబుకు ఆయన సైనికులకు ఈ తర్కం బహుశా గుర్తులేదేమో కదా !

    జగన్‌ లేదా రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు ఆ మాటకు వస్తే అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ నాయకుడు, నాయకురాలూ, వారి వారసులూ అవినీతికి పాల్పడలేదని ఎవరూ అనటం లేదు, అవి తేలే వరకు ఆరోపణలు, అంతవరకు నిందితులు మాత్రమే.

     అప్పుడూ-ఇప్పుడూ జరుగుతున్న అవినీతి అక్రమాలు అన్నీ చట్ట ప్రకారమే జరుగుతున్నాయి. అదే నేటి ప్రత్యేకత. ఎవరూ అతీతులు కాదు.

     జగన్‌ పత్రిక ఇష్టానుసారం రాసిందని, ఆ రాతలతో అమరావతి ఇమేజ్‌కు పెద్ద డామేజ్‌ చేయటమే లక్ష్యమని, ఆ పత్రిక రాసిన రాతలు నిరూపించకపోతే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది ప్రతి భారత పౌరుడికీ వున్న హక్కు. వుపయోగించండి, మరొకరు ఇలా రాయకుండా చేయండి.

     ఇక్కడ మరో సమస్య అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్‌ ఇమేజ్‌ను ఎవరు ఎంత డామేజ్‌ చేశారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. పది సంవత్సరాల పాటు రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులపై పదేళ్లపాటు ప్రతిపక్ష నాయకుడిగా, కుడి ఎడమల ఢాల్‌ కత్తుల మాదిరి రెండు పత్రికలు, రెండు టీవీ ఛానల్స్‌ మద్దతుతో చేసిన ఆరోపణలతో రాష్ట్ర ఇమేజ్‌ డామేజ్‌ కాలేదా ? అక్కడకు వెళితే మా కెంత ఇస్తారు అని పీక్కు తింటారని విదేశీ కంపెనీలు అనుకోలేదా ? అందువలన ఇప్పుడు అమరావతి కుంభకోణాల గురించి రాయటంతో కొత్త వారు వచ్చినా ఇంతే కదా అని ఎవరూ రారని కదా చంద్రబాబు లబలబలాడి పోతున్నారు. ఇక్కడొక పాయింటు వుంది, గతంలో ఇలాంటి డామేజ్‌ను ఎదుర్కొన్నవారు దాన్ని తొలగించలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు తన చాణక్య నీతితో దాన్ని సరిచేయలేరా ? అవి కేవలం ఆరోపణలే వాస్తవాలు ఇవీ అని టెక్‌ బాబు డిజిటల్‌ టెక్నాలజీతో నిరూపించలేరా ?

     కానీ కొన్ని విషయాలు సామాన్యులకు అర్ధం కావటం లేదు. భూములు కొన్నది ఎవరో ప్రయివేటు వ్యక్తులైతే వారి గురించి చర్చ, బయట పెట్టాల్సిన అవసరం లేదు.అవి కూడా వాస్తవానికి రహస్యమైనవి కాదు. ఎవరైనా ఆసక్తి ప్రదర్శిస్తే వాటి వివరాలు తెలుసుకోవచ్చు. అలాంటి దారిలోనే కదా జగన్‌ కంపెనీల వివరాలన్నీ చంద్రబాబు లేదా ఆయన మద్దతుదారులు తెలుసుకోగలిగింది. అసలు అమరావతి ప్రాంతం, గ్రామాలు కూడా ఎక్కడుంటాయో తెలియని వారు కోట్లు పెట్టి స్ధలాలు కొనటం దగ్గరే అసలు సమస్య వచ్చి పడింది. డబ్బున్న వారు స్దలాలు కొనటం కొత్త విషయమేమీ కాదు, అధికారంలో వున్న పెద్దలందరూ కూడబలుక్కున్నట్లు అమరావతి ప్రాంతంలోనే ఎలా కొన్నారన్నది సమస్య. మిగతా వారంతా వేరే చోట ఎందుకు కొన్నారు, అమరావతి ప్రాంతంలో కొన్న వారంతా మంత్రులు, అధికార పక్ష శాసనసభ్యుల బినామీలన్నది విమర్శ. దస్తావేజుల వివరాలతో సహా ఒక పత్రిక ప్రచురించింది. అవే రుజువులని, చెబుతోంది. అంతకంటే ఇంకా ఏమి రుజువులు ఇవ్వాలి. ఒక వేళ అవి నకిలీ దస్తావేజులైతే సదరు పత్రిక యాజమాన్యం మీద, వాస్తవమే అయితే తన మంత్రులు, ఎంఎల్‌ఏల మీద ముఖ్యమంత్రి చర్య తీసుకుంటారా లేదా ? అధికారంలో వున్నవారికి ఆ మాత్రం కనీస బాధ్యత కూడా లేదా, ఎవరికీ ఇవ్వని అవకాశం తనకు ఇచ్చారని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు కదా? అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతగా వారందరూ ఎదురు చూస్తున్న వాస్తవాలను బయట పెట్టి అవసరమైతే తాటతీసి తన నిజాయితీని వెల్లడించుకోవచ్చు కదా ! లేకపోతే తన ఇమేజ్‌ను తానే డామేజ్‌ చేసుకున్నట్లు అవుతుందేమో ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కొడదామంటే కడుపుతో వుంది-తిడదామంటే అక్కకూతురై పోయింది !

01 Tuesday Mar 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

Amaravati, ANDHRA PRADESH, Andhrapradesh new Capitol, AP CM, Central budget 2016, tdp, Telangana, trs

 

ఎం కోటేశ్వరరావు

   సాంకేతికంగా చూస్తే రెండోదే కావచ్చు గానీ నరేంద్రమోడీ గారీ ముచ్చటైన మూడో బడ్జెట్‌ రెండు తెలుగు రాష్ట్రాల సారధులకు పెద్ద ఇబ్బందే తెచ్చి పెట్టింది. అందరికీ తెలిసిన సామెత ‘కొడదామంటే కడుపుతో వుంది, తిడదామంటే అక్క కూతురై పోయింది’ అన్నట్లుగా ఇద్దరు చంద్రుల పరిస్ధితి తయారైంది. జనం ముందు ఎలా కనిపించినా తగిలిన ఎదురు దెబ్బలతో వెనక్కు తిరిగి గుడ్ల నీరు కుక్కుకుంటున్నారు. బడ్జెట్‌ అంటే నిబంధనల ప్రకారం రూపొందించేది. మనం ప్రజాస్వామ్యంలో వున్నాం. మహారాజులు, పాదుషాల హయాం కాదిది. ఒక రాష్ట్రానికి ఒక రూపాయి అదనంగా కేటాయించాలన్నా ఏదో ఒక ప్రాతిపదిక, వాటికి సవాలక్ష నిబంధనలు వుంటాయి.వాటిని దాచి పెట్టి కేంద్రం దగ్గర తమ కెంతో పలుకుబడి వుందని చూపుకొనేందుకు కబుర్లు చెప్పటం ఒక ఫ్యాషనై పోయింది.

   హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి సీట్లేమీ రావని చంద్రబాబుకు ముందే తెలుసని ఆయన అంతరంగంగా అందరూ పరిగణించే ఒక మీడియా వ్యాఖ్యాత ఫలితాలు వెలువడిన తరువాత ఒక పెద్ద రహస్యాన్ని వెల్లడించారు. దీన్ని బట్టి ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ల పాటు వున్న కాలంలో చంద్రబాబు జోతిష్య శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసి వుండాలి. తాను అభివృద్ధి చేసిన పరాయి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తన జనం తనకు ఒక్కటంటే ఒక్కటే కార్పొరేటర్‌ సీటను కట్టబెడతారని ముందే తెలుసుకున్నపుడు తన స్వంత రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా మోడీ ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిధులు ఇవ్వరని చంద్రబాబుకు తెలియకుండా ఎలా వుంటుంది. అందుకే తాత్కాలిక సచివాలయం పేరుతో కధ నడిపించేందుకు పూనుకున్నారా ? ఏపికి ప్రత్యేక హోదారాదని ముందే నిర్ధారణ అయినందున అసలు అలాంటి ఒక ప్రతిపాదన వుందని కూడా ఎరగనట్లుగా అమాయకత్వం నటిస్తున్నారు.తొలి రోజుల్లో ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనం కల్పిస్తారని కట్టుకధలు ప్రచారం చేశారు. వాటిని ఎంతో కాలం చెప్పలేరు కదా. దాంతో ఇప్పుడు లీకుల్లో గానీ చెప్పేవాటిలో గానీ దాని ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

    పైసా పైసాను ఒకటికి రెండుసార్లు లెక్కలు వేసుకోవాల్సిన రీతిలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న మాట తిరుగులేని నిజం. చంద్రబాబు నాయుడి ఇరవై నెలల పాలన చూస్తే అసలు విషయాలను దాచిపెట్టి ఏదో ఒకదానిపై జనం దృష్టిని మళ్లించి తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ స్థితిలో చంద్రబాబు అభివృద్ధి ఆకర్షణకు తట్టుకోలేక ఆ పార్టీలో చేరుతున్నామని చెప్పిన లేదా రేపు చెప్పబోయే వైసిపి ఎంఎల్‌ఏలలో కొందరికి మంత్రి పదవులు, కొందరికి పైరవీలు తప్ప దక్కేది మరేమీ వుండవు, వచ్చే ఎన్నికలలో మరో పార్టీ కండువా కప్పుకునేందుకు ఇప్పటి నుంచే ఆలోచన చేయటం కూడా అవసరమేమో ? ఎంత లేదనుకున్నా తొలిసారి మారటానికి కాస్త సిగ్గూ బిడియం, మాన,మర్యాదల గురించి జంఝాటం వుంటుంది. ఒకసారి అలవాటు పడి అదొక జీవన విధానం అయినపుడు మారేవారు , చేర్చుకొనే వారు సిగ్గుపడితే పనులెలా అవుతాయి? రాజకీయాల్లో కిక్కేముంటుంది?

     అమరావతి శాశ్వత రాజధానికి నిధులు ఇచ్చే విషయంలో కేంద్ర బడ్జెట్‌ మౌనం దాల్చింది. నూతన రాజధానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని లేదా నిర్మించాలని చంద్రబాబు విభజన సమయంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. నాలుగు వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది కావాలని చంద్రబాబు కోరారు. ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. పెద్ద ఎత్తున వందల కోట్లు ఖర్చు చేసి రాజధాని శంకుస్తాపన పేరుతో నిధులు తగలేశారు. దాన్ని పక్కన పెట్టి తాత్కాలిక సచివాలయానికి ఖర్చు చేస్తామని చెబుతున్న మూడు లేదా నాలుగు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల జేబులు నింపుతాయి . జనం సొమ్ము కాంట్రాక్టర్ల పాలు కావటమే. ఇప్పటికే రెవెన్యూ ఆర్ధిక లోటు రు.13,779 కోట్లు వుండగా ఒకటి తాత్కాలికంగా, మరొకటి శాశ్వత రాజధాని నిర్మాణానికి వుదారంగా ఖర్చు చేసే డబ్బు ఎక్కడుంది? ఎవడబ్బ సొమ్మని రామచంద్రా ఈ ఖర్చు ? వుమ్మడి రాజధానిగా మరో ఎనిమిది సంవత్సరాలపాటు హైదరాబాదులో వున్న వసతులను వుపయోగించుకోవటానికి అవకాశం వుండగా తాత్కాలిక సచివాలయం పేరుతో మూడు లేదా నాలుగు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయటం ఏ జవాబుదారీతనం కిందికి వస్తుంది ? వాటినే శాశ్వత సచివాలయ నిర్మాణానికి ఎందుకు వుపయోగించరు? ఈ ప్రశ్న వస్తుందని గ్రహించే తాత్కాలిక సచివాలయ భవనాన్ని కూడా భవిష్యత్‌లో వుపయోగించుకుంటామని చంద్రబాబు చెప్పారు. అదే వాస్తవం అయితే తన మకాం విజయవాడకు మార్చే సమయంలోనే హైదరాబాదులోని తన కార్యాలయ సుందరీకరణకు పదుల కోట్లు ఎందుకు వెచ్చించినట్లు ? ఆ తరువాత ఒక్క రోజైనా ఆఫీసును వుపయోగించుకున్నారా ? ఇప్పటికే మంత్రులు, అధికారులు పనీ పాటా లేకుండా విజయవాడ-హైదరాబాదు చుట్టూ తిరుగుతూ అనవసరంగా జనం సొమ్మును ఖర్చు చేస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది.

     కేంద్ర నిబంధనలు అంగీకరించవని తెలిసి కూడా అడుక్కోవటంలో పిసినారితనం ఎందుకన్నట్లుగా రాజధాని పరిసరాల్లో పెట్టబోయే పరిశ్రమలకు నూటికి నూరుశాతం పన్ను రాయితీలు ఇవ్వాలన్న కోరికను కేంద్రం అసలు పట్టించుకోలేదు. విజయవాడ మెట్రోకు రెండువేల కోట్లు అడిగితే వంద కోట్లు ప్రకటించారు. అంతకంటే పెద్ద దైన విశాఖ మెట్రోకు మాత్రం మొండిచేయి చూపారు.అసలే అవి గిట్టుబాటు కావన్న అభిప్రాయం వుండగా ఇలాంటి కేటాయింపులతో నిర్మాణ భారం పెరిగిపోతే వాటిని జనం నెత్తిమీదే కదా రుద్దేది? ఇక కేంద్రం ప్రకటించిన విద్యా సంస్ధల భవన నిర్మాణాలకు కూడా విదిలింపులే తప్ప గణనీయమొత్తాలను కేటాయించలేదు. దీని వలన అరకొర అద్దె లేదా వసతులు లేని భవనాలలోనే వాటిని దీర్ఘకాలం కొనసాగించాలన్నమాట.

      తెలంగాణా పరిస్ధితి కూడా ఇంతకంటే మెరుగ్గా లేదు. ఆ మధ్య ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన జరిపి మోడీ పాదుషా గారిని ఖుషీ చేసేందుకు ముఖస్తుతి చేసి వచ్చినట్లు ,ఎంతో ఆత్మీయంగా, చొరవగా మాట్లాడినట్లు మీడియా కధనాలు వచ్చాయి. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా మోడీ ఈ బడ్జెట్‌లో స్పష్టం చేశారు.మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరధ వంటి పధకాలకు 30వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని, కొన్నింటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని ఢిల్లీ ప్రభువులకు కెసిఆర్‌ పెద్ద జాబితానే ఇచ్చి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన 30వేల కోట్ల పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేశామని చెబుతున్న బకాయిలను కూడా పూర్తిగా చెల్లించని కేంద్రం గతేడాది మాదిరే ఈ ఏడాది కూడా వంద కోట్లు కేటాయించింది.ఈ లెక్కన ఆ ప్రాజెక్టు 150వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి గాని పూర్తి కాదేమో ?అలాంటపుడు అలూచూలూ లేని తెలంగాణా ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇస్తుందా?

     బడ్జెట్‌ ప్రతిపాదనల తీరుతెన్నులను చూసినపుడు గత యుపిఏ పాలనకూ, గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటికీ వర్తింప చేస్తామన్న నరేంద్రమోడీ పాలనకూ ఇంతవరకు పెద్ద తేడా ఏముంది? కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను పెంచారు. ఇది హర్షణీయమే. ఇదే సమయంలో కొన్ని పధకాల అమలు బాధ్యతను రాష్ట్రాలపై మోపటం ద్వారా ఆ పెంపుదల కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లుగా అయింది తప్ప వేరు కాదు. కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాని పర్యవసానం రానున్న సంవత్సరాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి, సంక్షేమ పధకాలపై తీవ్రంగా పడుతుందని వేరే చెప్పనవసరం లేదు.నిధులకు ఎంత కటకట ఏర్పడితే పాలకులు కబుర్లు అంత ఎక్కువగా చెబుతారు.అంతగా జనం మోసపోతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d