• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: COUNTRIES

పార్లమెంట్‌లోనూ ఆధిపత్యం- వెనెజులా సంక్షోభాన్ని మదురో నివారిస్తారా !

15 Tuesday Dec 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Nicolás Maduro, Socialists United of Venezuela (PSUV), Venezuela Elections 2020


ఎం కోటేశ్వరరావు


మూడు వందల మంది అంతర్జాతీయ పరిశీలకులు 34దేశాల నుంచి వచ్చారు, దేశీయంగా వివిధ పార్టీలు, సంస్ధలకు చెందిన వారు వెయ్యి మంది పరిశీలకులు ఉన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పారు. అయినా సరే డిసెంబరు ఆరున జరిగిన వెనెజులా పార్లమెంట్‌ ఎన్నికలను తాము గుర్తించేది లేదని అమెరికా, ఐరోపా ధనిక దేశాల నేతలు ప్రకటించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ వారసులు అంతకంటే ఏమి చెబుతారు ! వెనెజులా జాతీయ అసెంబ్లీ( పార్లమెంట్‌)లోని 277 సీట్లకు గాను దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురో నాయకత్వంలోని వామపక్ష కూటమి 253 స్ధానాలను గెలుచుకుంది. దీనిలో ఐక్య సోషలిస్టు పార్టీ ప్రధాన పక్షం కాగా మరో తొమ్మిది చిన్న పార్టీలు ఉన్నాయి. ఎన్నికలలో పాల్గొన్న ప్రతిపక్షాలకు 21, మరోమూడు స్ధానాలు స్ధానిక తెగలకు వచ్చాయి. ఈ ఫలితాలు అమెరికా కుట్ర విఫలం అయిందనేందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. గత ఎన్నికల వరకు అధికార సోషలిస్టు పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ తాజా ఎన్నికలలో విడిగా పోటీ చేసి 2.73శాతం ఓట్లు, ఒక స్ధానాన్ని పొందింది.ఈ ఎన్నికలలో 107 పార్టీలు, 14వేల మంది అభ్యర్దులు పాల్గొన్నారు. పోటీ చేసిన 107లో మదురోను వ్యతిరేకించే పార్టీలు 97 ఉన్నాయి.


మదురో నాయకత్వంలోని కూటమిని అధికారంలోకి రాకుండా చేసేందుకు గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా నాయకత్వంలోని శక్తులు చేయని కుట్ర లేదు. మదురో ప్రభుత్వాన్ని ఇప్పటికీ గుర్తించటం లేదన్న విషయం తెలిసిందే. అమెరికా మద్దతుతో ఉన్న ప్రతిపక్షం తాజా ఎన్నికలలో తమకు ఓటమి తప్పదని ముందే గ్రహించి ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.ఫలితాలను తాము గుర్తించేది లేదని చెప్పింది. డిసెంబరు తొమ్మిదిన అమెరికా దేశాల సంస్ద (ఓయేఎస్‌) సమావేశంలో వెనెజులా ఎన్నికలను గుర్తించరాదని బ్రెజిల్‌ ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికా, కెనడా, చిలీ, ఈక్వెడోర్‌ తదితర దేశాలు సమర్దించగా అర్జెంటీనా, మెక్సికో, బొలీవియా దూరంగా ఉన్నాయి.
లాటిన్‌ అమెరికాలోని వెనెజులా, తదితర దేశాలలో వామపక్ష శక్తులు గత రెండు దశాబ్దాల కాలంలో సంక్షేమ చర్యలను అమలు జరిపి విజయాలతో పాటు వాటికి ఉన్న పరిమితుల కారణంగా తలెత్తే అసంతృప్తి వలన పరాజయాలను చవిచూస్తున్నాయి. తమ దోపిడీ నిరాఘాటంగా కొనసాగేందుకు అమెరికా తదితర ధనిక దేశాలు లాటిన్‌ అమెరికా సమాజాల మీద మిలిటరీ, నిరంకుశ శక్తులను రుద్దాయి. వాటికి వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమాల్లో ఆ శక్తులను వ్యతిరేకించే కమ్యూనిస్టు, వామపక్ష, ఇతర శక్తులన్నీ ఏకమైన కారణంగానే అడ్డుకోగలిగాయి. ఆ క్రమంలోనే ఎన్నికల విజయాలు పొందాయి. జనానికి అనేక ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో వరుస విజయాలు సాధించాయి. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులు, వామపక్ష శక్తుల హర్షామోదాలు పొందాయి. వాటిని కూడా అమెరికా ఇతర పెట్టుబడిదారీ దేశాల వెన్నుదన్ను ఉన్న కార్పొరేట్‌ శక్తులు సహించలేదు. అందుకే ఆ ప్రభుత్వాలను కూలదోసేందుకు చేయని యత్నం లేదు. ఆ క్రమంలో ఛావెజ్‌ వంటి వారు ఆ కుట్రలకు వ్యతిరేకంగాలాటిన్‌ అమెరికాలో కలసి వచ్చే శక్తులన్నింటినీ కూడగట్టేందుకు ప్రయత్నించి కొంత మేర సఫలం అయ్యారు.


అయితే ఛావెజ్‌ లేదా ఇతర దేశాల్లోని నాయకత్వం అమలు జరిపిన చర్యలన్నీ నయా ఉదారవాద విధానాల పునాదుల మీద నిర్మితమైన పెట్టుబడిదారీ వ్యవస్ధల పరిధిలోనే అన్నది గమనించాలి.వాటికి ఉన్న పరిమితుల కారణంగా జనంలో తలెత్తే అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు, దాని ప్రాతిపదికగా జనాన్ని రెచ్చగొట్టేందుకు అమెరికా పెద్ద ఎత్తున వామపక్ష వ్యతిరేకశక్తులకు అన్ని విధాలా సాయం అందించింది. గతంలో మాదిరి మిలిటరీ నియంతృత్వాన్ని రుద్దే అవకాశాలు లేకపోవటంతో అధికారానికి వచ్చిన మితవాదశక్తులు వామపక్ష, ప్రజాతంత్ర పాలకుల కంటే మెరుగైన చర్యలు తీసుకోవటంలో విఫలం కావటంతో అర్జెంటీనా వంటి చోట్ల తిరిగి వామపక్ష శక్తులు అధికారానికి రాగలిగాయి. బొలీవియాలో ఎన్నికైన సోషలిస్టు ఇవోమొరేల్స్‌ను పదవి చేపట్టకుండా అడ్డుకొని అంతం చేస్తామని బెదిరించి విదేశాలకు వెళ్లేట్లు చేశారు. అయితే అధికారాన్ని ఆక్రమించుకున్న శక్తులు ఏడాది పాలనలో మొరేల్స్‌ కంటే మెరుగైన పాలన అందించలేవని రుజువు కావటంతో జనం తిరిగి మొరేల్స్‌ నాయకత్వంలోని ‘మాస్‌’ పార్టీకి పట్టం కట్టారు.

వెనెజులాలో కూడా అదే జరిగినట్లు కనిపిస్తోంది. మదురో ఏలుబడిలో అనేక తీవ్ర సమస్యలను జనం ఎదుర్కొంటున్నా, ప్రతిపక్ష మితవాద శక్తులు అధికారానికి వస్తే తమపరిస్ధితి మరింత దిగజారుతుందనే భయం జనంలో ఉంది. గత ఎన్నికల్లో పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లు పొందిన ప్రతిపక్ష పార్టీ నేత జువాన్‌ గురుడో 2018లో జరిగిన ఎన్నికలలో విజేత అయిన మదురోను తాను గుర్తించనని, పార్లమెంట్‌ తననే అధ్యక్షుడిగా ఎన్నుకున్నదని 2019లో ప్రకటించుకున్నాడు. అతగాడి ప్రవాస ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు అమెరికా మరికొన్ని దేశాలు ప్రకటించాయి. అనేక రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడినా జనంలో ఎలాంటి మద్దతు కనిపించలేదు. మరింత పరాభవం తప్పదని గ్రహించిన కారణంగానే ఈ నెలలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేయకుండా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.


ఈ ఎన్నికలలో పోలింగ్‌ 30.5శాతం అని అధికారికంగా ప్రకటించారు. మదురో నాయకత్వంలోని సోషలిస్టు పార్టీ కూటమికి 277కు గాను 253, డెమోక్రటిక్‌ యాక్షన్‌ పార్టీకి 11, మరో రెండు పార్టీలకు మూడేసి చొప్పున ఒక పార్టీకి రెండు, కమ్యూనిస్టు పార్టీ, మరొక పక్షానికి ఒక్కొక్కటి వచ్చాయి.ఓటర్లు ఇంత తక్కువగా ఎందుకు పాల్గ్గొన్నారనేది ఒక ప్రశ్న. ఓటర్లలో ఉత్సాహం లేకపోవటానికి ఒక ప్రధాన కారణం ప్రతిపక్షం బహిష్కరణ ప్రకటనతో ఎలాగూ గెలిచేది అధికార పక్షమే అన్న నిర్లిప్తత ఒకటి. దీనితో పాటు మదురో సర్కార్‌ మీద అసంతృప్తి కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. అయితే దేశంలో పరిస్ధితి ఆర్ధికంగా దిగజారటంలో లక్షలాది మంది దేశం వదలి వెళ్లారు. వారి పేర్లు కూడా జాబితాలో ఉంటాయి. మొత్తంగా చూసినపుడు తాత్కాలికంగా అయినా సామ్రాజ్యవాదుల కుట్రలు విఫలం అయ్యాయి.అమెరికా కుట్రలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే మదురోను హత్య చేసిన వారికి 15మిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా సంస్ధలు ప్రకటించాయి. ఈ కారణంగా తాజా ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఆయన ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకొనేదీ రహస్యంగా ఉంచారు.

ఎన్నికలు సక్రమంగా జరగలేదనేందుకు ఓటర్లు తక్కువగా పొల్గొనటమే నిదర్శనమని సాకులు చెబుతున్నారు. వెనెజులా తరువాత రోజు జరిగిన ఎన్నికలలో రుమేనియాలో 33, ఇటీవలి కాలంలో ఇతర దేశాలలో ఈజిప్టులో 28, మాలీ 35, జమైకా 38, జోర్డాన్‌ 30, జార్జియాలో 26శాతం చొప్పున నమోదైంది. వీటికి లేని అభ్యంతరం వెనెజులాకు ఎందుకు ? 2005 వెనెజులా పార్లమెంట్‌ ఎన్నికల్లో కనిష్టంగా 25శాతమే నమోదైన రికార్డు ఉంది. అంతెందుకు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఎన్నడూ నలభై శాతానికి అటూఇటూగానే ఉంటున్నది. వెనెజులాలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉంటే 50లక్షల మంది(నాలుగోవంతు) జనం కనీస సౌకర్యాలు లేక విదేశాలకు వెళ్లారని గతంలో చెప్పారు. అది కూడా ఓటింగ్‌ తగ్గటానికి ఒక ప్రధాన కారణమే కదా !


ఈ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకు విడిగా పోటీ చేసిందన్న సందేహం సహజంగానే కలుగుతుంది. దాని మంచి చెడ్డల చర్చను పక్కన పెట్టి కమ్యూనిస్టు పార్టీ మాటల్లోనే కొన్ని అంశాలను చూద్దాం. డిసెంబరు 14వ తేదీ పార్టీ పత్రిక ” పాపులర్‌ ట్రిబ్యూన్‌ ”లో కొన్ని ముఖ్య అంశాల సారాంశం ఇలా ఉంది. వెనెజులాలో ప్రజాబాహుళ్య విప్లవ ప్రత్యామ్నాయ నిర్మాణ లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ, ఇతర రాజకీయ, సామాజిక శక్తులతో కలసి కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో పోటీ చేసింది. ప్రత్యామ్నాయ విధానాలను జనం ముందుంచటానికే ప్రాధాన్యత ఇచ్చింది.2018లో అధ్యక్ష ఎన్నికల సమయంలో మదురో నాయకత్వంలోని ఐక్య సోషలిస్టు పార్టీ-కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత ఒప్పందం జరిగింది. దాని ప్రకారం తదుపరి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఒక కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి దాని ప్రాతిపదికగా పోటీ చేయాలన్నది సారాంశం. అయితే ఆ ఒప్పందంలోని అవగాహన అంశాలకు విరుద్దంగా మదురో ప్రభుత్వం వ్యవహరించింది. యజమానులతో కార్మికులు చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వ ఉత్తరువు ద్వారా రద్దు చేసింది. దాంతో కార్మికులు అనేక సంక్షేమ చర్యలను కోల్పోయారు. కార్మిక సంఘాలు నిరసన తెలిపటాన్ని నేరంగా పరిగణించి చర్యలు తీసుకుంటున్నారు. అణచివేత చర్యలకు అనుమతించారు. ప్రయివేటీకరణలకు పెద్ద పీటవేశారు. భూములను యజమానులకు తిరిగి ఇచ్చివేశారు. రైతులను భూముల నుంచి తొలగించి యజమానులకు అనుకూలంగా కేసులలో ఇరికిస్తున్నారు. ఈ నేపధ్యంలో కార్మికులు-రైతాంగ ప్రయోజనాల రక్షణకు పోరాడేందుకుగాను పాలక సోషలిస్టు పార్టీ కూటమితో విడగొట్టుకొని కమ్యూనిస్టు పార్టీ ఈ ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేసింది.అనేక అననుకూలతలు, అధికార మీడియాలో తగిన అవకాశాలు ఇవ్వకపోవటం, ప్రయివేటు మీడియాలో, ఇతరంగా ప్రచారానికి నిధుల కొరత వంటి సమస్యలను కమ్యూనిస్టు పార్టీ ఎదుర్కొన్నది. పోలైన ఓట్లలో 2.73శాతం పొందింది. సీట్ల కోసమే కమ్యూనిస్టు పార్టీ పని చేసినట్లయితే సోషలిస్టు పార్టీ కూటమిలో ఉంటే ఎక్కువ సీట్లు పొంది ఉండేవారమని,వాటికోసం ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టదలచ లేదని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. దామాషా ప్రాతికన సీట్లు కేటాయించే పద్దతి అవలంభించి ఉంటే 277 స్ధానాల్లో ఇప్పుడు వచ్చిన ఒకటికి బదులు తమకు ఏడు లేదా ఎనిమిది వచ్చి ఉండేవని, అధికార సోషలిస్టు పార్టీ 69శాతం ఓట్లు తెచ్చుకొని 91శాతం సీట్లు పొందిందని కమ్యూనిస్టు పార్టీ వ్యాఖ్యానించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ ఫిగేరా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

పార్లమెంట్‌ ఎన్నికలను గుర్తించేది లేదని ప్రకటించిన అమెరికా, దాని నాయకత్వంలోని దుష్ట కూటమి రాబోయే రోజుల్లో ఎలాంటి కుట్రలకు తెరలేపనుందో చూడాల్సి ఉంది. అమెరికా దాని మిత్ర దేశాలు వెనెజులాను ఇబ్బందుల పాలు చేస్తున్నది వాస్తవం. దాని వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ కుట్రలను అధిగమించే క్రమంలో గత పార్లమెంటులో ప్రతిపక్షం మెజారిటీలో ఉండి అనేక చర్యలకు ఆటంకాలు కలిగించింది. ఇప్పుడు సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించినందున మదురో జనానికి ఉపశమనం కలిగించే చర్యలు ఏ మేరకు తీసుకుంటారు, పరిస్దితిని ఎలా చక్కదిద్దుతారు అన్నది ఆసక్తి కలిగించే అంశం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల ఆందోళన – వెనక్కు తగ్గేది లేదంటున్న బిజెపి !

10 Thursday Dec 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

Farmers agitations, indian farmers


ఎం కోటేశ్వరరావు


పద్నాలుగు రోజుల పాటు ఉద్యమాన్ని అణచేందుకు, నీరుగార్చేందుకు ప్రయత్నించిన తరువాత ఇంటా బయటా వత్తిడి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రైతుల ముందు రాతపూర్వక ప్రతిపాదనలు ఉంచింది.రైతు సంఘాలు వాటిని తిరస్కరించి సవరించిన చట్టాలను పూర్తిగా ఎత్తివేయాలని, ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, దానిలో భాగంగా డిసెంబరు 12న టోల్‌ ప్లాజాల్లో, 14న ఉత్తరాది రాష్ట్రాల నుంచి చలో ఢిల్లీ, మిగిలిన చోట్ల జిల్లా కేంద్రాల్లో కొత్త ఆందోళనను ప్రకటించారు. ఎప్పుడు ఏమి జరగనుందనే ఆసక్తి పెరుగుతోంది. ముందు రైతుల పట్ల మోడీ సర్కార్‌ తీరుతెన్నులు, ప్రపంచంలో స్పందన అంశాలను చూద్దాం.

రాజనీతిజ్ఞుడి ప్రతిభ ఒక పెద్ద సమస్య వచ్చినపుడు వ్యవహరించేతీరు తెన్నుల మీద ఆధారపడి ఉంటుంది. దేశాధినేత ప్రధాని. రైతులు ఆందోళనకు దిగినపుడు దానిని పరిష్కరించే బాధ్యతను మంత్రులకు అప్పగించారు, ఓకే. వారు దాన్ని ఏదో ఒక దరి చేర్చక ముందే ప్రధాని రైతులను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. వ్యూహకర్తలు సరిగా పని చేస్తున్నారా ? లెక్కచేయాల్సిన అవసరం లేదనే పెడసరపు ధోరణికి లోనయ్యారా అన్న అనుమానం వస్తున్నది. కొద్ది రోజుల క్రితం రైతుల ఉద్యమం వెనుక ఖలిస్తానీలు ఉన్నారన్న బిజెపి పెద్దలు ఇపుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్యమం వెనుక చైనా-పాక్‌ హస్తం ఉందని కేంద్ర మంత్రి రావు సాహెబ్‌ దనవే నిందించారు. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ని తప్పించి హౌ మంత్రి అమిత్‌ షాను రంగంలోకి దించారు. ఫలితం లేదు. తిరిగి రైతులకు విజ్ఞప్తి చేసేందుకు తోమర్‌ను నియమించారు. ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది.


నవంబరు 27 నుంచి రైతులను ఢిల్లీ శివార్లలో నిలిపివేశారు. వారు నగరంలోకి రాకుండా శత్రుసేనలను ఎదుర్కొనే మాదిరి రోడ్ల మీద కందకాలు తవ్వారు, ఇతర ఆటంకాలను ఏర్పాటు చేశారు, భద్రతా దళాలను మోహరించారు. అనేక దేశాల్లో జనం వివిధ సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమించారు గానీ ఎక్కడా ఇలా కందకాలు తవ్వటాన్ని చూడలేదని అంతర్జాతీయ మీడియా, వివిధ దేశాల నేతల నోళ్లలో నానటం నరేంద్రమోడీ పరువును పెంచుతుందా ?


చైనా అంతర్భాగమైన హాంకాంగ్‌లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న ప్రదర్శనల గురించి మన దేశం ఐక్యరాజ్యసమితి మానవహక్కుల వేదిక మీద ఆందోళన వ్యక్తం చేసింది.ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కాదా అంటే కాదు కాదు హాంకాంగ్‌లో భారతీయ పౌరులు ఉన్నారు గనుక అని మన ప్రతినిధులు సమర్ధించుకున్నారు. హాంకాంగ్‌ చైనాకు చెందినదే అయినప్పటికీ పూర్తిగా విలీనం అయ్యేందుకు 2049వరకు గడువు ఉంది. అక్కడ విదేశీయుల మీద ఎలాంటి దాడులు జరగలేదు. సంవత్సరాల తరబడి ప్రదర్శనలు చేస్తున్నా, రెచ్చగొడుతున్నా అక్కడి పోలీసులు రెచ్చి పోలేదు.అయినా మన దేశం ” ఆందోళన ” వ్యక్తం చేసింది.


కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ గురునానక్‌ జయంతి సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని మన ప్రభుత్వం ఆ దేశరాయబారిని పిలిచి నిరసన తెలిపింది. మన దేశంలోని 543 సభ్యులుండే లోక్‌సభలో పదమూడు మంది సిక్కు సామాజిక తరగతికి చెందిన వారు ఎంపీలుగా ఉన్నారు. అదే కెనడాలోని 338 మంది సభ్యులున్న దిగువ సభలో 18 మంది సభ్యులు, ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు.కెనడా-పంజాబ్‌-భారత్‌లోని సిక్కుల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి తెలిసిందే. ప్రస్తుత ఉద్యమంలో సిక్కులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున కెనడా ప్రధాని మౌనంగా ఉండగలరా ?

లక్షలాది మంది రోజుల తరబడి ఎముకలు కొరికే చలిలో రోడ్ల మీద ఆందోళన చేస్తున్న కారణంగానే రాజకీయాలతో నిమిత్తం లేని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. శాంతియుతంగా ప్రదర్శనలు చేసుకొనేందుకు జనానికి హక్కు ఉన్నదని చెప్పారు.కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌, బ్రిటన్‌, అమెరికా ఎంపీలు అనేక మంది అప్పటికే రైతుల ఆందోళన గురించి ప్రస్తావించారు. వివిధ పార్టీలకు చెందిన 36 మంది బ్రిటన్‌ ఎంపీలు అదేశ విదేశాంగమంత్రి డొమినిక్‌ రాబ్‌కు లేఖ రాస్తూ తమ ఆందోళనను భారత ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని, ఆ ఆందోళన అనేక మంది బ్రిటీష్‌ సిక్కులు, పంజాబీలను ప్రభావితం చేస్తున్నదని పేర్కొన్నారు.

ఒక్క బ్రిటీష్‌ ఎంపీలే కాదు అమెరికన్లు కూడా ఉన్నారు. మరోసారి డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ రాబోతున్నదంటూ ఎన్నికలలో నరేంద్రమోడీ మద్దతు పలికిన విషయం తెలిసిందే. సదరు ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ కాలిఫోర్నియా ఎంపీ డగ్‌ లామాలఫా, డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జోష్‌ హార్డర్‌ రైతులకు మద్దతు తెలిపారు. ఫలవంతమైన చర్చలు జరపాలని మోడీని కోరారు. మరికొందరు ఎంపీలు కూడా ఇదే హితవు చెప్పారు. ఆండీలెవిన్‌ వంటి వారు ఉద్యమం తమకు ఉత్తేజమిచ్చిందని చెప్పారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్లు రైతుల ఉద్యమం గురించి పెద్ద ఎత్తున వార్తలు, వ్యాఖ్యలు చేశాయి. ఏ దేశంలో అయినా లక్షలాది మంది ఉద్యమంలోకి దిగినపుడు మానవతా పూర్వకంగా ఆందోళన వ్యక్తం చేయటం, సమస్యలను పరిష్కరించాలని హితవు పలకటం జరుగుతున్నదే. అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో నరేంద్రమోడీ స్నేహితుడైన డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి, దేశాధ్యక్షుడి మీద తిరుగుబాటు చేసేందుకు పోలీసులు, మిలిటరీని ఎలా ప్రోత్సహించిందీ తాజాగా బొలీవియాలో చూశాము. వెనెజులాలో ప్రతిపక్ష నేతను దేశాధినేతగా గుర్తించటం వంటి వ్యవహారాలకు – ఉద్యమాలకు మద్దతు ప్రకటించటానికి ఉన్న తేడాను గుర్తించాలి. రైతుల ఉద్యమం మోడీ సర్కార్‌ మీద తిరుగుబాటు కాదు, అలా మారే అవకాశాలూ లేవు.


అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదతర దేశాల్లో ఉన్న అనేక మంది భారతీయులు రైతులకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. అమెరికాలోని ఓక్లాండ్‌ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ కాన్సులేట్‌ కార్యాలయానికి ప్రదర్శన చేశారు. న్యూయార్క్‌, చికాగో, వాషింగ్టన్‌ డిసి వంటి ఇంకా అనేక చోట్ల చిన్నా, పెద్ద ప్రదర్శనలు జరిగాయి. లండన్‌లోని భారత హైకమిషనర్‌ కార్యాలయం ముందు వేలాది మంది భారత ప్రభుత్వానికి నిరసన, రైతులకు మద్దతు తెలిపారు. ఈ ప్రదర్శనను భారత వ్యతిరేక వేర్పాటు వాదులు జరిపారని హైకమిషన్‌ ఆరోపించింది. కెనడాలోని టోరొంటోలో ఉన్న భారతకాన్సులేట్‌ కార్యాలయం ముందు వందలాది మంది ప్రదర్శన జరిపారు. ఇంకా ఇతర అనేక చోట్ల ప్రదర్శనలు, వాహన ర్యాలీలు జరిగాయి.ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్‌బెన్‌, కాన్‌బెర్రా తదితర పట్టణాల్లో ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల నుంచి ఆన్‌లైన్‌లో పిటీషన్ల మీద సంతకాల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.


రైతాంగం పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసన తెలుపుతూ అనేక మంది క్రీడా ప్రముఖులు డిసెంబరు ఏడున రాష్ట్రపతి భవన్‌కు ప్రదర్శన జరిపారు. ప్రభుత్వం మొండిగా ఉంటే తాము సాధించిన అవార్డులను తిరిగి ఇచ్చివేస్తామని హెచ్చరించారు. తమతో పాటు 35 అర్జున, ద్రోణాచార్య, పద్మశ్రీ, ధ్యానచంద్‌అవార్డులను వారు తీసుకు వెళ్లారు. ఇలాంటి పరిణామాలు రావటానికి కారకులు కేంద్ర పాలకులు.ఇప్పుడు రైతులు, రాబోయే రోజుల్లో తమను దెబ్బతీసే విధానాలను ముందుకు తెచ్చినందున వాటికి వ్యతిరేకంగా కార్మికులు కూడా రంగంలోకి రాబోతున్నారు. నవంబరు 26వ తేదీ సమ్మె దానికి ఒక హెచ్చరిక.


రైతులు ఆందోళన చేయటం ఇప్పుడే ప్రారంభమైందా ? ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరటం మన దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక మన ప్రభుత్వం దాన్నుంచి వైదొలగాలని రైతు సంఘాలు, వామపక్షాలు, దాదాపు అన్ని పార్టీలు కోరాయి. అయినా ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన హామీ రాలేదు. ఇదే సమయంలో పారిశ్రామిక, వాణిజ్య వర్గాల నుంచి కూడా అనుకూలంగానూ వ్యతిరేకంగానూ తీవ్రమైన వత్తిడి వచ్చింది. ఊగిసలాటలో ఉన్న ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు 2019 నవంబరు నాలుగున రైతులు ప్రదర్శనలు కూడా చేశాయి. ఎవరి వత్తిడి ఎంత పని చేసిందీ అన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు వెనక్కు తగ్గింది, ఆమేరకు అందరూ హర్షించారు.
ఆర్‌సిఇపిలో చేరిక గురించి ఎనిమిది సంవత్సరాలు తర్జన భర్జన పడిన ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రతికూల మార్పులు తెస్తాయని భయపడుతున్న వ్యవసాయ చట్టాల మార్పుల గురించి మేథోమధనం చేయకుండా ఆర్డినెన్స్‌ రూపంలో తేవాల్సినంత అత్యవసరం ఏముంది ? పోనీ తెచ్చారు, బిల్లును పార్లమెంట్‌ కమిటీకి నివేదించాలన్న ప్రజాస్వామ్యయుతమైన డిమాండ్‌ను తోసి పుచ్చి చర్చలను ఒక ప్రహసనంగా మార్చి ఆమోద ముద్ర ఎందుకు వేయించుకున్నట్లు ? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కొన్ని మార్పులు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తే ప్రయోజనం ఏముంది? కరోనా వైరస్‌ నివారణకు పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుందని ఒక ముఖ్యమంత్రి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే చాలు అన్న మరొక ముఖ్యమంత్రి చిట్కాల మాదిరి రైతుల ముందు కేంద్రం ఉంచిన ప్రతిపాదనలు ఉన్నాయి. అందుకే రైతులు తిరస్కరించారు.


చర్చలు కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పి)కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటనల మీద ప్రకటనలు చేయటం తప్ప రైతుల డిమాండ్‌ను పట్టించుకోవటం లేదు. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తూ, వాటి నిర్ణయానికి సమగ్ర వ్యవస్దను ఏర్పాటు చేయాలన్న న్యాయమైన కోర్కెను కేంద్రం ఎందుకు అంగీకరించటం లేదు అన్నది చాలా మందికి అంతుబట్టటం లేదు. అమలు జరుపుతామంటున్నారు కదా దాన్నే చట్టబద్దం చేస్తే పోయేదేమిటి అని హర్యానా బిజెపి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న జననాయక్‌ జనతా పార్టీ(జెజెపి) నేతల హితవును కూడా పట్టించుకోలేదు. ఎంతసేపటికీ అమలు జరుపుతామని చెబుతున్నాం కదా అన్నదానికి మించి ఒక్క ముక్క చెప్పటం లేదు. వ్యవసాయ చట్టసవరణలకు-కనీస మద్దతు ధరలకు అసలు సంబంధం లేదని వాదిస్తున్నారు తప్ప చట్టబద్దం చేసేందుకు ఆటంకం, అభ్యంతరం ఏమిటో చెప్పరు.


డిసెంబరు తొమ్మిదిన కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ ఒక లేఖ రూపంలో పంపిన ప్రభుత్వ ప్రతిపాదనలు రైతాంగాన్ని సంతృప్తిపరచేవిగా లేవని తిరస్కరించారు. వాటిలో ఉన్న అంశాలేమిటి ?1. ప్రస్తుతం ఉన్న ఎంఎస్‌పి వ్యవస్దను అలాగే కొనసాగిస్తాము, పంటల సేకరణ కూడా కొనసాగుతుంది. రైతులు ఏమంటున్నారు ? ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలి, రైతు ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మరింత శాస్త్రీయంగా ధరల నిర్ణాయక వ్యవస్ధను ఏర్పాటు చేసి సాధికారత, చట్టబద్దత కల్పించాలన్న రైతుల డిమాండ్‌కు దీనికి అసలు పొంతనే లేదు. 2. ప్రభుత్వ (నోటిఫైడ్‌) మార్కెట్‌-స్వేచ్చా మార్కెట్‌ అన్న తేడా లేకుండా పన్నులు, సెస్‌లను అన్నింటికీ ఒకే విధంగా వర్తింప చేస్తాము. రైతుల వాదన ఏమిటి ? మార్కెట్‌ యార్డుల పరిధులను కుదించి అసలు ఆ వ్యవస్ధనే నామమాత్రం చేయటాన్ని వ్యతిరేకిస్తున్నాం. అవి ఉపయోగం లేకుండా పోయిన తరువాత కార్పొరేట్‌ చేతుల్లో రైతులు ఇరుక్కుంటారు గనుక మార్కెట్‌ యార్డుల్లోనే ఎవరైనా కొనుగోళ్లు జరపాలి. 3.నియంత్రణలేని మార్కెట్లలో లావాదేవీలు జరిపేవారు నమోదు చేసుకొనే విధంగా సవరణలు తెస్తాము. రైతుల అభ్యంతరం ఏమిటి ? నియంత్రణలు లేని మార్కెట్లుంటేనే రైతులకు రక్షణ ఉండదు, నమోదు అన్నది నామమాత్రమే.కంటితుడుపే ! 4.నగదు బదిలీకి బదులు సబ్సిడీ వర్తించే విధంగా రైతులను విద్యుత్‌ బిల్లుల నుంచి మినహాయిస్తాము. రైతులు అంటున్నదేమిటి ? అసలు ఉచిత విద్యుత్‌ పధకాలను ఎత్తివేసే విధంగా, సబ్సిడీని గరిష్టంగా 20శాతానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదన అమలు జరిగితే ఉచిత విద్యుత్‌ పధకాలకు ఎసరు వస్తుంది. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసి పారిశ్రామిక, వాణిజ్యవర్గాలకు మేలు చేకూర్చేందుకే ఈ ప్రయత్నాలు.


కనీస మద్దతు ధరల విధానాన్ని, భారత ఆహార వ్యవస్ధ కార్యకలాపాలను పరిమితం చేసి ధాన్య సేకరణ బాధ్యతను వదలించుకొనేందుకు కేంద్రం పావులు కదుపుతోందనే అనుమానాలు కూడా రైతులకు కలుగుతున్నాయి. వీటికి ఆధారాలు లేవా ? స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు జరుపుతున్నామని చెబుతున్న పాలకులు కీలకమైన వాటిని పక్కన పెట్టారు. ఉదాహరణకు మార్కెట్‌ యార్డులను మరింత పటిష్టపరచాలని చెబితే వాటిని పరిమితం చేసేందుకు చట్ట సవరణ చేశారు. కనీస మద్దతు ధరల నిర్ణాయక అంశాలలో భూమి కౌలును పరిగణనలోకి తీసుకోవటం లేదు.ఇంకా ఇలాంటివే ఉన్నాయి.

భారత ఆహార సంస్ధను నిర్వీర్యం చేస్తారా, సేకరణ మొత్తాలను తగ్గిస్తారా ? ప్రపంచ వాణిజ్య సంస్ద(డబ్ల్యుటివో) నిబంధనల ప్రకారం ఎఫ్‌సిఐ సేకరించిన బియ్యాన్ని అంతర్గత వినియోగానికి విక్రయించవచ్చు తప్ప విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు లేదు.ఈ ఏడాది సెప్టెంబరు ఒకటవ తేదీ నాటికి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎఫ్‌సిఐ వద్ద బియ్యం నిల్వలు 135లక్షల టన్నులు ఉండాలి, వాస్తవ నిల్వలు 222లక్షల టన్నులు ఉన్నాయి. తరువాత సేకరణ తరుణం ప్రారంభం అయినందున నిల్వలు పెరిగి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 2020-21లో 150లక్షల టన్నుల గోధుమలు, 50లక్షల టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే 2015-16 నుంచి 2019-20 సంవత్సరాలలో గోధుమలు కనిష్టంగా 14.21లక్షల టన్నులు గరిష్టంగా 81.84 లక్షల టన్నులు, బియ్యం 4.9-17.77లక్షల టన్నులు మాత్రమే విక్రయించారు. బీహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉత్పత్తి అయ్యే కోటీ60లక్షల టన్నులలో కేవలం 30లక్షల టన్నులను మాత్రమే సేకరిస్తామని చెప్పింది. మిగిలిన ధాన్యాన్ని రైతులు కనీస మద్దతు ధరల కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది.


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఆర్టికల్‌ 13లోని సంధి నిబంధన ప్రకారం దేశీయంగా, ఎగుమతులకు సబ్సిడీలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే అది ఆయా దేశాల ఉత్పత్తి విలువలో పదిశాతం కంటే ఆ మొత్తాలు మించకూడదు. ఈ నిబంధన కూడా 2004 జనవరి ఒకటి నుంచి రద్దయింది. ఈ కారణంగానే అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఇస్తున్న సబ్సిడీలను వర్ధమాన దేశాలు సవాలు చేసేందుకు వీలు కలిగింది. అదే ఇప్పుడు చర్చలు ప్రతిష్ఠంభనలో పడటానికి కారణం అయింది. అయితే 2013లో జరిగిన బాలి సమావేశంలో తాత్కాలిక సంధి నిబంధనను రూపొందించారు. దాని ప్రకారం అప్పటికి అమల్లో ఉన్న ఆహార భద్రత పధకాల కింద ఇస్తున్న సబ్సిడీలు నిర్ణీత పదిశాతానికి మించినా ఏ సభ్యదేశమూ సవాలు చేసేందుకు లేదు. తరువాత తెచ్చిన పధకాలకు సబ్సిడీలు ఇవ్వటానికి వీలులేదు. మన దేశం ఆహారభద్రతా చట్టాన్ని 2013లో తెచ్చారు కనుక సబ్సిడీలు కొనసాగించవచ్చు. అయితే ఈ నిబంధన ఎంతకాలం అన్నది స్పష్టత లేదు.2017నాటికి సంధి నిబంధనలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించారు. అయితే అప్పటికీ కుదరకపోతే కుదిరేంతవరకు తాత్కాలిక నిబంధన కానసాగుతుంది.2018-19లో ప్రపంచ వాణిజ్య సంస్దకు మన దేశం అందచేసిన సమాచారం ప్రకారం దేశంలో ఉత్పత్తి అయిన బియ్యం విలువ 43.67 బిలియన్‌ డాలర్లని, ఐదు బిలియన్‌ డాలర్లు సబ్సిడీగా ఇచ్చామని పేర్కొన్నది. ఈ మొత్తం పదిశాతం కంటే ఎక్కువ. సంధి నిబంధనలు ఎంతకాలం కొనసాగుతాయో తెలియదు. ఎలా రూపొందిస్తారో స్పష్టత లేదు. సబ్సిడీలను తగ్గించాలని ఒక వైపు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్ల్యుటివో వత్తిడి తెస్తున్నాయి. ఈ కారణంగానే వ్యవసాయానికి ఇచ్చే ఎరువుల సబ్సిడీ గత ఏడు సంవత్సరాలుగా 70వేల కోట్ల రూపాయలకు అటూఇటూగా ఉంది. ఇది మినహా పెరిగిన ధరలను రైతులే భరించాల్సి వస్తోంది. ఇలాంటి పరిమితులనే విద్యుత్‌, ఆహార తదితర వ్యవసాయ సంబంధ సబ్సిడీలకు అమలు జరపబోతున్నారు.
మన దేశంలో ఉత్పత్తి అవుతున్న బియ్యం, గోధుమ ఎగుమతులకు అంతర్జాతీయంగా తీవ్ర పోటీ ఎదురవుతోంది. కొన్ని దశాబ్దాలలో తొలిసారిగా మన దేశం నుంచి చైనా తాజాగా బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నది అనే వార్తలు వచ్చాయి. నిజానికి 2006లో మన బియ్యం దిగుమతికి చైనా అనుమతి ఇచ్చినప్పటికీ నామ మాత్రంగా తప్ప పెద్ద మొత్తంలో దిగుమతి లేదు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్నప్పటికీ చైనా పదివేల టన్నుల దిగుమతికి నిర్ణయించింది. దీనిలో పక్కా వాణిజ్యం తప్ప ఎలాంటి రాజకీయాలు లేవు. థారులాండ్‌, వియత్నాంల నుంచి దిగుమతి చేసుకొనే బియ్యంతో పోల్చితే మన దేశం టన్నుకు వందడాలర్ల తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకు రావటమే కారణం. ధరలు పెంచినా, చైనాలో తిరిగి ఉత్పత్తి పెరిగినా ఎగుమతులు అనుమానమే.

భారత్‌ 25శాతం బియ్యం రకం టన్ను ధర 2019 నవంబరులో 357.4 డాలర్లు ఉంటే 2020 నవంబరులో 342.8లో ఉన్నట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్ధ సమాచారం వెల్లడించింది. ఇదే రకం థారు బియ్యం ధర 415.4 నుంచి 479.5డాలర్లకు, వియత్నాం బియ్యం 323.6 నుంచి 472.5 డాలర్లకు పెరిగింది. అయితే థారులాండ్‌, వియత్నాంలో సాగు సమస్యలతో బియ్యం ఉత్పత్తి తగ్గటంతో ఎగుమతుల మీద ఆంక్షలు కూడా ఉండటంతో చైనాకు మన బియ్యం ఎగుమతులకు అవకాశం వచ్చింది. మిగతా దేశాలకూ తక్కువ ధరలకే విక్రయిస్తున్నాం.


ప్రపంచ మార్కెట్లో పోటీ తట్టుకోవాలంటే మన దేశంలో ధాన్యం ధర తక్కువగా ఉండాలని, కనీస మద్దతు ధరలను పెంచుకుంటూ పోతే తమకు గిట్టుబాటు కాదనీ ఎగుమతి వ్యాపారులు వత్తిడి తెస్తున్నారు. ఈ పరిణామాలు, వాటి పర్యవసానాలను చూసిన తరువాత రైతాంగానికి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పాలకుల మాటలు విశ్వసనీయత సమస్యను ముందుకు తెస్తున్నాయి. ఇప్పటి వరకు రైతాంగానికి-వినియోగదారులకు ఎదురైన అనుభవాలు చూస్తే అధికారంలో ఎవరున్నా బడా వ్యాపారులకు అనుకూలమైన విధానాలు తప్ప రైతులు-జనానికి ఉపయోగపడే చర్యలు లేవు. పాలకులు చెప్పిన అనేక మాటల నీటి మూటలయ్యాయి.మేక పిల్లల వంటి రైతాంగాన్ని తోడేళ్ల వంటి బడా సంస్దలకు అప్పగిస్తాము గానీ అవి తినకుండా రక్షణ చర్యలు తీసుకుంటామన్నట్లుగా కేంద్ర వైఖరి ఉంది. అసలు తోడేళ్లను రప్పించటం ఎందుకు అన్నది మేకల ప్రశ్న.


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శేకాదు, యావత్‌ ప్రపంచం ముక్త కంఠంతో రైతులకు మద్దతు తెలిపినా ఏమౌతుంది ? వారంతా ఢిల్లీ వచ్చి మా ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయం ముందు ధర్నా చేస్తారా ? చేయమనండి చూస్తాం ! ఇది ఒక బిజెపి మిత్రుడి ప్రయివేటు సంభాషణ సారం. నిజమే ! ఏమౌతుంది ? మహా అయితే ప్రపంచనేత అని భుజకీర్తులు తగిలించుకున్న నరేంద్రమోడీ పరువు పోతుంది, అంతకు మించి పోయేదేమీ ఉంటుంది ? ఇప్పటికే ప్రపంచ వ్యాపితంగా చర్చ జరుగుతోంది. రైతుల ఆందోళన గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పలేక అది భారత-పాక్‌ వ్యవహారం అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎంతకాలం తప్పించుకుంటారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాకమ్మ కథలు ఆపి నరేంద్రమోడీ ఇప్పటికైనా అభివృద్ధి చర్యలు తీసుకుంటారా ?

26 Thursday Nov 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China BRI, China goods boycott, narendra modi cock and bull stories, RCEP INDIA


ఎం కోటేశ్వరరావు


ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి) నుంచి భారత్‌ వైదొలగటం సముచితమా కాదా అన్న చర్చ ఇప్పుడు ఇంటా బయటా ప్రారంభమైంది. జపాన్‌ తదితర దేశాలు కోరుతున్నట్లు దానిలో చేరితే ఒక సమస్య లేకపోతే మరొకటి కనుక ఆ గుంజాటనతో ఎంతకాలం గడుపుతారు ? అంతా నెహ్రూయే చేశారు అన్న సుప్రభాతం మాని నరేంద్రమోడీ సర్కార్‌ తాను చెప్పిన ముఖ్యంగా మేకిన్‌ ఇండియా లేదా ఆత్మనిర్భరత కార్యక్రమాలతో దేశాన్ని ఆర్ధికంగా ఎలా ముందుకు తీసుకుపోనుంది అన్నది కీలకం. మరో దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకో కూడదనే వ్రతం చెడి తాను మద్దతు ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ పరాజయం పాలయ్యాడు. అధికారానికి వచ్చిన జో బైడెన్‌ను సంతృప్తి పరచేందుకు లేదా ఆర్‌సిఇపి చర్చ నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు గానీ కేంద్ర ప్రభుత్వం మరోసారి చైనా ఆప్‌ల మీద డాడి చేసిందని భావించవచ్చు. రాబోయే రోజుల్లో మరికొన్నింటి మీద కూడా నిషేధం విధించవచ్చు. చైనా మీద వత్తిడి పెంచి బేరమాడే ఎత్తుగడ కానట్లయితే ఆప్‌లన్నింటినీ ఒకేసారి ఎందుకు నిషేధించటం లేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది. వాటి వలన చైనాకు తగిలిన దెబ్బ-మనకు కలిగిన ప్రయోజనం ఏమిటన్నది వేరే అంశం. ఆర్దిక వ్యవస్ధ లావాదేవీలను ఆప్‌లు సులభతరం చేస్తాయి తప్ప సంపదలను సృష్టించవు. అందువలన నిషేధాలను పట్టించుకోకుండా కరోనా కారణంగా తగిలిన దెబ్బలను మాన్చుకొని చైనా ముందుకు పోతుంటే తగిలిన దెబ్బలు ఎంత లోతుగా ఉన్నాయో ఇంకా తేల్చుకోలేని స్ధితిలో మనం ఉన్నామంటే అతిశయోక్తి కాదు.


ఆర్‌సిఇపిలో చేరాలా వద్దా ?
ఆర్‌సిఇపి నుంచి వైదొలగటం సరైన నిర్ణయమని కొందరు చెబుతుంటే కాదని మరికొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. దీనిలో చేరితే భాగస్వామ్య దేశాల నుంచి పారిశ్రామిక, వ్యవసాయ, పాడి ఉత్పత్తులు వెల్లువెత్తి నష్టం కలిగిస్తాయని మన పారిశ్రామికవేత్తలు, రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ రంగాలలో తలెత్తిన తీవ్ర సమస్యల నేపధ్యంలో 2019లో ఒప్పందం నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు మన ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి మనం ఏ క్షణంలో అయినా చేరేందుకు అవకాశం కల్పిస్తూ మిగిలిన దేశాలన్నీ 2020 నవంబరులో సంతకాలు చేశాయి. ఏ ఒప్పందం అయినా అందరికీ ఖేదం, మోదం కలిగించదు. ఇప్పుడు ఖేదం అనుకున్న లాబీ చేరకపోవటం సరైనదే అని చెబుతున్నది. మోదం పొందాలనుకున్న వారు వచ్చిన అవకాశం జారిపోయిందే అని ఎంత తప్పు చేశామో అని వాదిస్తున్నారు. నరేంద్రమోడీ సర్కార్‌ మీద ఎవరి వత్తిడి ఎక్కువగా ఉంటే రాబోయే రోజుల్లో అది అమలు జరుగుతుంది. అందువలన ఈ అంతర్గత పోరు ఎలా సాగుతుందో చూడాల్సి ఉంది.
ఒప్పందంలో చేరకపోవటం ద్వారా తక్షణ ప్రమాద నివారణ జరిగిందే తప్ప ముప్పు తొలగలేదని గ్రహించాలి. ఒక వైపు ప్రపంచీకరణ, మరింత సరళీకరణ, సంస్కరణలు అంటూ నరేంద్రమోడీ సర్కార్‌ కార్మికులు-కర్షకుల ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్యలను రుద్దుతున్నది. విదేశాల నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తుల దిగుమతులను నివారించిందన్న సంతోషం రైతాంగంలో ఎక్కువ కాలం నిలిచేట్లు లేదు. సర్కార్‌ మరోవైపు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కనీస మద్దతుధరలు, సేకరణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకొనేందుకు రైతాంగాన్ని స్వదేశీ-విదేశీ కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదలివేసే చర్యలకు సంస్కరణల ముసుగువేసి పార్లమెంట్‌లో చట్టసవరణలు చేసింది.


కబుర్లు కాదు, నిర్దిష్ట చర్యలేమిటి ?
చైనాతో సహా 15దేశాలు ఆర్‌సిఇపి ద్వారా ముందుకు పోతున్నాయి. లడఖ్‌ సరిహద్దు వివాదం జరగక ముందే ఆర్‌సిఇపి చైనాకు అనుకూలంగా ఉంటుంది, దాని వస్తువులన్నీ మరింతగా మన దేశానికి దిగుమతి అవుతాయి అన్న కారణంతో మనం దానిలో చేరలేదని ప్రభుత్వం చెబుతున్నది. దానితో ఎవరికీ పేచీ లేదు. అయితే ఎప్పుడూ ఆ కబుర్లే చెప్పుకుంటూ కూర్చోలేముగా ! చైనాతో పోటీ పడి మన దేశం ముందుకు పోయేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలేమిటి అన్నది సమస్య. మనం తయారు చేసే వస్తువులను వినియోగించే శక్తిని మన జనానికి కలిగించే చర్యలేమిటి ? విదేశాలకు ఎగుమతి చేసేందుకు వ్యూహం ఏమిటి ?
చైనాకు సానుకూల హౌదా ఎందుకు రద్దు చేయటం లేదు ?

లడక్‌ ప్రాంతం గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతం తరువాత చైనాకు బుద్ధి చెప్పాలి, ఆర్ధికంగా దెబ్బతీయాలన్నట్లుగా ప్రభుత్వ చర్యలు, నేతల మాటలు ఉన్నాయి. పుల్వామా దాడి ఉదంతం తరువాత పాకిస్ధాన్‌కు అత్యంత సానుకూల హౌదా(ఎంఎఫ్‌ఎన్‌)ను మోడీ సర్కార్‌ రద్దు చేసింది. అంతకంటే ఎక్కువగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నా చైనాకు ఆ హౌదాను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని మోడీ సర్కార్‌ చెప్పింది. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. చైనాతో అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బ తగల కూడదు, అదే సమయంలో చైనా వ్యతిరేకతను రెచ్చ గొట్టి జనంలో మంచి పేరు కొట్టేయాలన్న యావ తప్ప మరేమిటి ?
ప్రాంతీయ అభివృద్ధి అవకాశాలకు దూరంగా గిరిగీసుకున్న భారత్‌ అనే శీర్షికతో ఈ నెల 23వ తేదీన, అంతకు ముందు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రెండు విశ్లేషణలను ప్రచురించింది. వాటితో ఏకీభవించటమా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టి వాటి సారాంశాన్ని చూద్దాం. ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మాసాల మధ్య భారత్‌ చేసుకున్న మొత్తం దిగుమతులలో చైనా ఉత్పత్తుల వాటా 18.3శాతం ఉందని, గతేడాది ఇదే కాలంలో 14.6శాతమే అని భారత వాణిజ్యశాఖ వివరాలు వెల్లడించాయి. ఆత్మనిర్బర పేరుతో చైనా నుంచి దిగుమతులను తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయం, ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య నెలకొన్న వివాద నేపధ్యంలో ఇది జరిగింది.(చైనా వస్తుబహిష్కరణ వ్రతం ఏమైనట్లు ?) ఆర్‌సిఇపి నుంచి వైదొలిగిన భారత్‌ రక్షణాత్మక చర్యల నేపధ్యంలో అది సిపిటిపిపి లేదా అమెరికా, ఐరోపాలతో ఒప్పందాలు చేసుకోవటం ఇంకా కష్టతరం అవుతుంది. తనకు తాను గిరి గీసుకుంటున్న భారత్‌ భవిష్యత్‌లో అవకాశాలను జారవిడుచుకుంటుందని ఆ పత్రిక పేర్కొన్నది.


చైనా ఎఫ్‌డిఐ ఆంక్షల నుంచి మోడీ సర్కార్‌ వెనక్కు తగ్గుతోందా
ఇటీవల హౌం,వాణిజ్య, పరిశ్రమల శాఖల సంయుక్త బృందం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) నిబంధనలను సడలించాలని ప్రధాని నరేంద్రమోడీకి ఒక ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. మన దేశంతో భూ సరిహద్దులున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను కొన్ని రంగాలలో 26శాతం వరకు ప్రభుత్వ తనిఖీతో నిమిత్తం లేకుండా అనుమతించాలన్నదే దాని సారాంశం. అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఈ సడలింపు అమల్లోకి వస్తే చైనా నుంచి పెట్టుబడులను అడ్డుకొనేందుకు గతంలో కొండంత రాగం తీసి చేసిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవటమే. ఈ ప్రతిపాదనను ఎందుకు చేసినట్లు ? ముందుచూపు లేదా పర్యవసానాల గురించి ఆలోచించకుండా జనాల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నవారికి ఇది ఎదురు దెబ్బ అవుతుంది. చైనాను వ్యతిరేకిస్తే అమెరికా, ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తాయని కలలు కన్న, చైనా మీద వీరంగం వేసిన వారికి అవి కనుచూపు మేరలో కనిపించకపోవటమే అసలు కారణం. ఏటికి ఎదురీదాలని ఉత్సాహపడేే ఎవరైనా ముందు తమ సత్తా, పరిస్ధితులు ఏమిటో ఒకసారి పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత భారత-చైనా వాణిజ్యం బాగా పెరిగింది. చైనా నుంచి దిగుమతులతో పాటు పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఆకస్మికంగా చైనా దిగుమతులను ఆపివేయలేని విధంగా మన పరిశ్రమలు చైనా మీద ఆధారపడ్డాయంటే అతిశయోక్తికాదు. రాజకీయ కారణాలతో ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే అమెరికా, ఐరోపా ఇతర ఆసియా దేశాల నుంచి అధిక ధరలకు వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోతుండగా ఉత్పత్తి ఖర్చు మరింతగా పెరిగితే పరిస్ధితి ఇంకా దిగజారుతుంది. మన ఆర్ధిక పరిస్ధితి దిగజారుతున్న నేపధ్యంలో చైనాతో వివాదం ప్రారంభమైంది. దీన్ని మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు సహిస్తారా ?


ప్రపంచీకరణ జపం ఆచరణలో ఆంక్షలు !
చైనా మాదిరి మన దేశం ఎగుమతి కేంద్రంగా మారాలంటే రక్షణాత్మక చర్యలను విరమించి స్వేచ్చా వాణిజ్య పద్దతులను అనుసరించాలన్నది ఒక వాదన. దాని సారాంశం ఏమిటో చూద్దాం. గతంలో విఫలమైన విధానాలను తిరిగి అమలు జరిపితే లక్ష్యాలను చేరుకోలేము.2014 నుంచీ మోడీ సర్కార్‌ అనేక మార్లు దిగుమతి ఆంక్షలు, సుంకాలను, లైసన్సులు తీసుకోవాల్సిన చర్యలను పెంచింది. ఇది తిరిగి లైసన్సు రాజ్యం వైపు వెళ్లటమే. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం గురించి ఒక వైపు చెబుతారు, మరోవైపు అది అమలుకు అడ్డుపడే చర్యలు తీసుకుంటారు. దీనికి అవసరమైన సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలను పెంచారు.కొన్ని ఐఫోన్ల ధరలను చూస్తే విమానాల్లో దుబారు వంటి చోట్లకు వెళ్లి అక్కడ కొనుగోలు చేసి తెచ్చుకోవటం చౌక అని చెబుతున్నారు. అనేక వస్తువుల దిగుమతికి లైసన్సు తీసుకోవాలని నిర్ణయించారు. రక్షణాత్మక చర్యల వలన మన వస్తువుల నాణ్యత పెంచేందుకు, చౌకగా అందించేందుకు మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు చర్యలు తీసుకోరు. పాత పద్దతులనే కొనసాగించి లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. గతంలో ఇదే జరిగింది, ఇప్పుడూ అదే జరగబోతోంది. రూపాయి విలువను పడిపోయేట్లు చేయటం ద్వారా మన వినియోగదారులు దిగుమతి చేసుకొనే వస్తువుల ధరల పెరుగుదలకు, మన వస్తువులను విదేశీయులు చౌకగా పొందేందుకు వీలు కలిగిస్తున్నారు.
స్వయం సమృద్ధి లేదా మన కాళ్ల మీద మనం నిలిచే విధానాలకు ఎవరూ వ్యతిరేకం కాదు. అందుకు అనువైన విధానాలను అనుసరించే చిత్త శుద్ది లేదనేదే విమర్శ. ప్రపంచానికి తన తలుపులు తెరిచే ఉంటాయని చైనా చెబుతోంది, అయితే అది తాను చెప్పినట్లు జరగాలని అది కోరుకుంటోంది అని తాజాగా అమెరికా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన ఒక వ్యాసశీర్షిక సారం. తన కాళ్ల మీద తాను నిలిచి ఇతరులు తమ మీద ఆధారపడేట్లు చేసుకొనే వ్యూహాన్ని చైనా అధినేత గ్జీ జింపింగ్‌ అనుసరిస్తున్నారని దానిలో పేర్కొన్నారు. అదే విధంగా ఇతర ఆర్ధిక వ్యవస్ధలతో సంబంధాలను తెంచుకోవటం లేదని గ్జీ చెబుతున్నారు గానీ చైనా అడుగులు చూస్తే అదే మార్గంలో పడుతున్నాయి అంటూ వ్యాసకర్తలు భాష్యంచెప్పారు. మన నరేంద్రమోడీ కూడా ఆ విధానాన్నే ఎందుకు అనుసరించరు ?


ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది !
ప్రతి దేశం ప్రపంచ రాజకీయాల్లో తన పాత్ర పోషిస్తోంది. అమెరికా, జపాన్‌, మన దేశంతో కలసి క్వాడ్‌ పేరుతో చైనాకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా కూటమి కడుతోంది. మరోవైపు అదే చైనాతో కలసి ఆర్‌సిఇపిలో భాగస్వామిగా చేతులు కలిపింది. చైనాతో వాణిజ్య మిగులులో ఉన్న ఆస్ట్రేలియన్లు మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో చైనా తన ఆయుధాలను బయటకు తీస్తోంది. వరుసగా బొగ్గు, మద్యం,బార్లీ, పత్తి వంటి ఉత్పత్తుల దిగుమతులను ఆస్ట్రేలియా నుంచి క్రమంగా తగ్గిస్తోంది. ఇది వత్తిడి పెంచి అమెరికా నుంచి విడగొట్టే ఎత్తుగడలో భాగమే అన్నది స్పష్టం. దీనికి ప్రధాన కారణం దాని ఆర్ధికశక్తే. ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 38శాతం చైనాకే జరుగుతున్నాయి, అమెరికా వాటా నాలుగుశాతమే. మన దేశం చైనా నుంచి ఒక శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటుంటే మన ఎగుమతుల్లో మూడుశాతం చైనాకు ఉన్నాయి. అందువలన చైనాకు మన తలుపులు మూస్తే నష్టం ఎవరికో చెప్పనవసరం లేదు. ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది.
రక్షణాత్మక చర్యల ద్వారా మన ప్రగతికి మనమే అడ్డుపడటమే గాక ప్రపంచ భాగస్వామ్యాలను కూడా దెబ్బతీసినట్లు అవుతోందన్నది కొందరి అభిప్రాయం. ఇది విదేశీ కంపెనీలకు అవకాశాలు కల్పించాలనే లాబీల నుంచి కూడా వచ్చే మాట అన్నది స్పష్టం. పన్నుల విధింపు, నిబంధనలు ఎక్కువగా ఉండటం వంటి చర్యల వలన ప్రపంచంలో భారత్‌ తన ఆర్ధిక వ్యవస్ధను తెరవటం లేదనే అభిప్రాయానికి తావిస్తుందన్నది సారాంశం. నిజానికి అమెరికా సంస్ధలైన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ మన దేశంలోని ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్కెట్లో 70శాతం వాటాను చేజిక్కించుకున్నాయి.
ప్రతిష్ట, పలుకుబడి పెంచామన్నారు, ఫలితేమిటి ?
మేకిన్‌ ఇండియా పిలుపుతో ఆర్భాటం, ప్రపంచంలో దేశానికి ఎన్నడూ లేని ప్రతిష్టను, పలుకుబడిని పెంచానని చెప్పటం తప్ప వాటితో గత ఆరున్నర సంవత్సరాలలో మోడీ సర్కార్‌ సాధించిందేమిటో, చేసిందేమిటో తెలియదు.ఆచరణలో కనిపించకపోతే గప్పాలు కొట్టుకోవటం అంటారు. ఆర్‌సిఇపిలో చేరకూడదని ఏడాది క్రితమే నిర్ణయించిన కేంద్రం మన సరకులకు విదేశీ మార్కెట్ల కోసం చేసిందేమీ లేదు. మరోవైపున ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన తరువాత 26దేశాలు, వాణిజ్య కూటములతో చైనా 19 స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని తన వాణిజ్య విలువను 27 నుంచి 35శాతానికి పెంచుకుంది. దీన్ని విస్తరణవాదంగా చిత్రించి పబ్బంగడుపుతున్నారు. ఇలాంటి ఒప్పందాలు లేకుండా మన దేశంలో తయారు చేస్తామని చెబుతున్న సరకులను ఎక్కడికి ఎగుమతి చేస్తారు ? ఆర్‌సిఇపి ఒప్పందంలోని మిగిలిన 14భాగస్వామ్య దేశాలతో చైనా విదేశీ వాణిజ్యంలో 2019లో మూడోవంతు ఉంది, చైనాకు వస్తున్న మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఆ దేశాల వాటా పదిశాతం ఉంది. ఈ దిశగా నరేంద్రమోడీ ఇంతవరకు చేసిందేమిటి ? మన ఇరుగుపొరుగు దేశాలతో కూడా వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోలేదు, అవి చైనాతో సంబంధాలను పెంచుకున్నాయి.


మనం ప్రత్యామ్నాయ బిఆర్‌ఐని ఎందుకు రూపొందించలేదు ?
చైనా వాణిజ్య విస్తరణలో మరొక ప్రధాన అంశం బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బిఆర్‌ఐ). 2049లో (అప్పటికి చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చి వంద సంవత్సరాలు అవుతాయి) పూర్తయ్యే ఈ పధకం ద్వారా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలలో పెట్టుబడులు, వాణిజ్య విస్తరణకు చైనా పూనుకుంది. దీనిలో రోడ్డు, సముద్ర మార్గాలు ఉన్నాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలోనే ఇది రూపుదిద్దుకుంది. అదేమీ రహస్యం కాదు, అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉన్న మోడీ ఇలాంటి పధకాన్ని ఎందుకు రూపొందించలేకపోయారు ? చైనా గ్జీ జింపింగ్‌కు ఉన్న తెలివితేటలు మోడీకి లేవా ? నెహ్రూ అలా చేశారు, ఇలా చేశారు అని రోజూ అంతర్గతంగా ఆడిపోసుకోవటం, ఆర్‌సిఇపి, బిఆర్‌ఐ వంటి చర్యల ద్వారా చైనా విస్తరించటాన్ని అడ్డుకోవాలంటూ అమెరికా ఇతర దేశాలతో చేతులు కలిపేందుకు తాపత్రయం తప్ప మన దేశమే అలాంటి పధకాలను రూపొందించాలనే దూరదృష్టి ఎందుకు కొరవడింది?
చైనా లేదా మరొకటి మరొక దేశాన్ని ఆక్రమించుకుంటే దాన్ని వ్యతిరేకించాల్సిందే, అందరూ కలసి అడ్డుకోవాల్సిందే. గతంలో అలా ఆక్రమించుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలన్నీ వెనక్కు తగ్గి స్వాతంత్య్రం ఇవ్వకతప్పలేదు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత వలసలు, ఆక్రమణలు లేవు. ఏదో ఒక సాకుతో అమెరికా, దానికి మద్దతు ఇస్తున్నదేశాలే ఇటీవలి కాలంలో ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌లను ఆక్రమించుకుని తమ తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పరోక్షంగా పెత్తనం చేస్తున్నాయి తప్ప చైనా అలాంటి చర్యలకు ఎక్కడా పాల్పడలేదు. వాణిజ్యం, పెట్టుబడుల విషయానికి వస్తే ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) 1995లో ఉనికిలోకి రాక ముందు 1948 నుంచి పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం(గాట్‌) అమల్లో ఉంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు దానిలోకి చైనాను ప్రవేశించనివ్వలేదు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే తమ ప్రాబల్యంలో ఉన్న ప్రపంచ మార్కెట్‌లోకి చైనా ప్రవేశించకుండా అడ్డుకున్నాయి.(1971వరకు అసలు చైనాకు ఐక్యరాజ్యసమితిలో గుర్తింపే ఇవ్వలేదు.చైనా తిరుగబాటు రాష్ట్రమైన తైవాన్‌లో ఉన్న తొత్తు ప్రభుత్వమే అసలైన చైనా ప్రతినిధి అని దానికే ప్రాతినిధ్యం కల్పించాయి) 2001లో సభ్యత్వమిచ్చాయి.
మనం గమనించాల్సిన అంశం ఏమంటే చైనా ప్రారంభించిన సంస్కరణల్లో భాగంగా అది తన అపార మార్కెట్‌ను తెరిచింది.దానిలో ప్రవేశించాలన్నా, లబ్ది పొందాలన్నా చైనాను డబ్ల్యుటిఓలో భాగస్వామిని చేయకుండా సాధ్యం కాదు. అందుకే గతంలో అడ్డుకున్న అమెరికా వంటి దేశాలే ఐరాసలో, డబ్ల్యుటిఓలో చేరనిచ్చాయి. ఆ అవకాశాన్ని వినియోగించుకొని చైనా నేడు ఒక అగ్రశక్తిగా ఎదిగి ధనిక దేశాలను సవాలు చేస్తోంది. తమకు పోటీగా తయారైన చైనాను సహించలేని అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన దేశం పోటీలో ఉండే విధంగా ప్రోత్సహిస్తాయా ? సహిస్తాయా ? చైనాను వ్యతిరేకిస్తే పశ్చిమ దేశాలు మనకేదో తవ్వితలకెత్తుతాయనే భ్రమల్లో ఉన్న మోడీ సర్కార్‌ అయినా ఎండమావుల వెంట పరుగెత్తినట్లుగా వాటిని నమ్ముకొని ఉంది తప్ప తాను చేయాల్సింది చేయటం లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అసలే లేదు.2025 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపిని సాధించటం లక్ష్యంగా చెప్పింది తప్ప దానికి అనువైన పరిస్దితుల కల్పనకు పూనుకోలేదు. కరోనాతో నిమిత్తం లేకుండానే ఆర్ధిక వ్యవస్ధ దిగజారింది.

గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ధి జాడెక్కడ ?
ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐఎంఎఫ్‌) ప్రధాన ఆర్దికవేత్తగా ఉన్న గీతా గోపీనాధ్‌ మరో ఆర్ధికవేత్త ఇక్బాల్‌ దహలీవాల్‌తో కలసి 2014 మేనెలలో దేశ ఆర్ధిక వ్యవస్ధ గురించి ఒక విశ్లేషణ చేశారు. ప్రస్తుతం భారత్‌ యవ్వనదశలో ఎదుగుతున్న మార్కెట్‌గా ఉంది. దీని అర్ధం రానున్న ఐదు సంవత్సరాలలో ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండానే అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు. అదే జరిగింది, దానికి తోడు చమురు ధరలు పడిపోవటం ఎంతో ప్రయోజనం చేకూర్చింది. నరేంద్రమోడీ సర్కార్‌ ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేమీ లేకుండానే అభివృద్ధి జరిగింది. తదుపరి చర్యలు లేకపోవటంతో ఐదేండ్ల తరువాత దిగజారింది. జిడిపిలో పరిశ్రమల విలువ వాటా 25శాతం దగ్గర అప్పటికే ఆగిపోయింది. తనకు అధికారమిస్తే గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ది దేశమంతటా అమలు చేస్తానని నరేంద్రమోడీ నమ్మబలికారు. ఐదు సంవత్సరాల తరువాత చూస్తే ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం పరిశ్రమల వాటా 24.88శాతానికి పడిపోయింది. ఈ కాలంలో మెజారిటీ రాష్ట్రాలలో బిజెపిదే పాలన అన్న విషయం తెలిసిందే. ప్రయివేటు పెట్టుబడుల మీద ఆశలు పెట్టుకున్న సర్కార్‌కు కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో మూటలు కట్టుకోవటం తప్ప వాటిని పెట్టుబడులుగా పెట్టి పరిశ్రమలను స్ధాపించటం లేదు. విదేశీ మదుపుదార్లు మన కార్పొరేట్ల వాటాలను కొనుగోలు చేయటం తప్ప కొత్త పరిశ్రమలు పెట్టటం లేదు. అభివృద్ధి లేకపోవటానికి ఇదొక ప్రధాన కారణం.
చైనాలో ఉత్పాదక ఖర్చులు పెరుగుతున్నాయని, అంతర్జాతీయ సంస్ధలు ప్రత్యామ్నాయ ఉత్పాదక దేశాల కోసం చూస్తున్నాయని ఈ అవకాశాన్ని భారత్‌ వినియోగించుకుంటే పారిశ్రామిక వృద్ధి సాధించవచ్చని గీతా గోపినాధ్‌ చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆరు సంవత్సరాల తరువాత కూడా నరేంద్రమోడీ అండ్‌కో అదే కబుర్లు చెబుతూ చైనా నుంచి ఉత్పాదక కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని చెబుతున్నది, భ్రమలు కల్పిస్తున్నది. 2013లో సులభతర వాణిజ్య సూచికలో మన దేశం 134వ స్ధానంలో ఉండగా 2020లో 63కు ఎదిగినా చైనా నుంచి, మరొక దేశం నుంచి కంపెనీలు వస్తున్న సూచనలేమీ లేవు. ఇప్పటికైనా చైనా గాకపోతే మరొక దేశాన్ని చూసి అయినా అభివృద్ధికి బాట వేస్తారా ? కాకమ్మ కబుర్లు చెబుతూ కాలం గడుపుతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా సైనికకూటములలో భారత్‌ చేరవద్దు !

20 Friday Nov 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Indo-China standoff, the Quad, US-India Military Alliance


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


”సామాజిక అభ్యున్నతి కార్యక్రమాల కంటే సైనిక రక్షణ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న దేశం ఆధ్యాత్మిక మరణానికి చేరుకుంటుంది” – మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌.
నవంబరు 6 న చుషుల్‌ లో జరిగిన 8 వ విడత కోర్‌ కమాండర్‌ స్ధాయి చర్చలలో, సరిహద్దులోని ఉద్రిక్తతలను తొలగించి, సైనిక ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు భారత-చైనా దేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం. మరొక పక్క రెండో దఫా మలబార్‌ సైనిక విన్యాసాలు నవంబరు 17 నుండి జరుగుతున్నాయి. అమెరికా నాయకత్వాన జరుగుతున్న ఈ విన్యాసాలలో భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలు పాల్గొంటున్నాయి. జపాన్‌ కొన్ని దీవుల విషయంలో చైనాతో వివాద పడుతోంది. అయితే వాటికోసం యుద్దానికి దిగేస్థితి లేదు. మరోవైపు అమెరికా ప్రభావం నుంచి బయటపడి స్వతంత్రశక్తిగా ఎదిగేందుకు, మిలిటరీశక్తిగా, మారాలని చూస్తోంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే అమెరికా అనుంగు దేశంగా మలబార్‌ సైనిక విన్యాసాలలో పాల్గొంటున్నది.

చైనాను చుట్టుముట్టాల
మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో చైనా కొత్త దారులను తొక్కి అమెరికా తో సహా ప్రపంచప్రజలందరికీ కావలసిన వినియోగ వస్తవులను, ఎలక్ట్రానిక్‌ సామానులనుతయారుచేసి తక్కువ ధరలకు అందిస్తున్నది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ ద్వారా రవాణాసౌకర్యాలను అభివ ధి చేసి ఆఫ్రికా, యూరప్‌ లతో తన వాణిజ్య వ్యాపారాలలో పైచేయిసాధింటానికి అమెరికా తో పోటీపడుతోంది. ప్రత్యర్ధి ఆర్ధిక శక్తిగానే కాక సైద్దాంతిక శత్రువుగా కూడా అమెరికా పరిగణిస్తున్నది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సైనికంగా దిగ్బంధించాలని ప్రయత్నం చేస్తున్నది. అందుకు మన దేశాన్ని క్రమేపీ సైనిక కూటమిలో చేర్చుకోవటానికి కుట్ర పన్న్నుతోంది. సైనిక విన్యాసాలని, వాతావరణ, ప్రదేశిక సమాచారాన్ని పంచుకు నే ” బెకా ”అని రకరకాల ఒప్పందాలలో ఇరికించే ప్రయత్నాలలో వుంది.
1998 లో భారత దేశం అణుపరీక్షలు నిర్వహించటం , అమెరికాకు కోపం తెప్పించింది, ఆర్ధిక ఆంక్షలను విధించింది. సంవత్సరాల చర్చలు, సర్దుబాట్లు, ఒప్పందాలు, లొంగుబాట్ల వలన 2005 సం,లోఆంక్షలను క్రమంగా సడలించారు. పది సంవత్సరాల రక్షణ వ్యవహార సంబంధాల వ్యూహానికి సంబంధించిన ఫ్రేమ్‌ వర్క్‌ ను భారత-అమెరికాలు ఏర్పరచుకొని 2013 లో రక్షణ వ్యవహారాల సహకారం పై సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. . 2015 లో రక్షణ వ్యవహారాల వ్యూహ ఫ్రేమ్‌ వర్క్‌ ను మరో పదేళ్ళు పొడిగించారు.
2000 సం లో 20 బిలియన్‌ డాలర్లున్న భారత- అమెరికా వాణిజ్యం 2018 నాటికి 140 బిలియన్లకు చేరుకుంది .2005 సం . వరకు రక్షణ పరికరాలు 400 మిలియన్‌ డాలర్ల నుండి 18 బిలియన్‌ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

సోవియట్‌ పతనంతో అంతరిస్తున్నఅలీన విధానం ,

భారత ప్రభుత్వం 1947 నుండి 1991 వరకు అలీన విధానం కొనసాగించింది. ఆసియా, ఆఫ్రికా దేశాల విముక్తిపోరాటాలకు అలీన ఉద్యమం సహాయాన్నందించింది.పంచవర్ష ప్రణాళికలకు సోవియట్‌ సహాయం అందించింది.భారీ పరిశ్రమలైన ఉక్కు ఫ్యాక్చరీలకు, భారత మందుల పరిశ్ఱమలకు నిస్వార్ధంగా సహాయాన్నిందించింది. 1971 లో ఇందిరా గాంధీ తోశాంతి, స్నేహం, సహకార ఒప్పందం చేసుకుని సోవియట్‌కు దగ్గరయింది. అలీన ఉద్యమం బలహీన పడటం, అలీనోద్యమ నాయకులైన నెహ్రూ, నాజర్‌, టిటో, కాస్ట్రో, సిరిమావో లు అంతరించటం అమెరికా అనుకూల భావజాలానికి అడ్డు తొలగింది. సోవియట్‌ రష్యాను విచ్చిన్నం చేయటంలో అమెరికా సఫలమయ్యింది. సాంకేతికంగా ఆధునిక టెక్నాలజీని సొంతం చేసుకున్న అమెరికా సైనిక బలంలోనూ తన అధిపత్యాన్ని నిరూపిస్తూ ఏకధ వ ప్రపంచానికి నాయకత్వం వహించింది. కార్పోరేట్‌ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే, ఆర్ధిక సంక్షోభాలను నివారించలేకపోయింది.అమెరికా దేశం అప్పులలో మునుగుతూంది. 906 బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ ట్రెజరీ సెక్యూరిటీలు చైనా చేతిలో వున్నాయి., జపాన్‌ 877, ఆయిల్‌ ఎగుమతిదారులు213 బిలియన్‌ డాలర్ల ట్రెజరీ సెక్యూరిటీలనుస్వంతం చేసుకున్నారు.

సోషలిజం, కమ్యూనిజం చర్చలోకివచ్చింది

అమెరికాలో నిరుద్యోగం, అసమానతలు పెరిగిపోవటంతో సోషలిజం, కమ్యూనిజం . సోషల్‌ డెమోక్రసీ చర్చలోకివచ్చింది.ఆర్ధిక సంక్షోభాల సుడిగుండాలనుండి బయటపడటానికి మార్కెట్ల కోసం వెతుకులాటలో వుంది. అమెరికా విదేశాంగ విధానం ముఖ్యంగా మిలిటరీ రీత్యా ఘోరంగా విఫలమయింది. ఇరాక్‌, ఆఫ్గనిస్ధాన్‌ లలో ఎదురైన పరాజయంతో ప్రత్యక్షయుద్ధానికి వెనుకాడుతోంది. జనవరి3, 2020 న ద్రోన్‌ ద్వారా ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిమ్‌ సొలేమాన్‌ని బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద దొంగదెబ్బతీసి హతమార్చింది. భారతలాంటి దేశాలను తన వైపు చేర్చుకోవటానికి చైనాతో సరిహద్దు తగాదాను ఒక మంచి అవకాశంగా మలుచుకుంటున్నది. బిగుసుకుంటున్న బంధం ధ్రుతరాష్ట్ర కౌగిలి ని గుర్తుచేస్తున్నది. ప్రేమ నటిస్తూ దగ్గరకు తీసుకుంటూ ప్రాణాలుతీసే ప్రయత్నాన్ని ధ్రుతరాష్ట్ర కౌగిలి అంటారు.


ఇండో-పసిఫిక్‌ పాలసీ
ఇండో-పసిఫిక్‌ పాలసీ ని ముందుకు తెచ్చింది ట్రంప్‌ కాదు. ఒబామా , బిడెన్‌ అధికారంలో వుండగానే ఈ విధానాలకు శ్రీకారం చుట్టారు. చైనా ప్రభావాన్ని ఆసియా దేశాలపై నివారించటానికి 2015 లో ఢిల్లీలో ఒబామా భారత-అమెరికా ల విజన్‌ స్టేట్‌ మెంట్‌ పై సంతకం చేశారు. అదే విధానాలను ట్రంప్‌ కొనసాగించాడు.
నాటో సైనిక కూటమి మాదిరి క్వాడ్‌ సైనిక కూటమి
దక్షిణచైనా సముద్రాన్ని మరొక సైనిక కూటమికి కేంద్రంగా చేయాలని 1992 నుంచి కొనసాగుతున్న అమెరికా వ్యూహం ఫలించిందనే చెప్పాలి. ఆమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడాలంటే ఆయుధాలను అమ్ముకోవాలి. మలబార్‌ సైనిక విన్యాసాలు తొలిదశలో భారత-అమెరికా నౌకాదళాల శిక్షణాకార్యక్రమాలకు మాత్రమే పరిమితమని ప్రచారంచేశారు. 2015లో జపాన్‌ చేరింది. కొత్తగా ఆస్ట్రేలియాను భయపెట్టి, బతిమిలాడి చతుష్టయ కూటమిలోకి చేర్చుకొన్నారు. 2015 సం.లో జరిగిన మలబార్‌ విన్యాసాలకు భారత్‌ నౌకాదళం రెండు యుద్దనౌకలను మాత్రమే పంపింది, ఇపుడు 2020 లో విమానవాహక యుద్ద నౌక, సబ్‌ మెరైన్‌ లను కూడా పంపింది. బంగాళాఖాతంలో నవంబర్‌ 3న మలబార్‌ -2020 పేరున సైనిక విన్యాసాలు ప్రారంభించాయి.అరేబియా సముద్రంలో 17 వ తేదీనుండి 20వ తేదీ వరకు ఈ విన్యాసాలు జరిగాయి. చైనా ను చుట్టుముట్టి నిలవరించాలనే పధకం 2007లో నే మొదలయింది.అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ, అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబే ఈ పధకాన్ని ఆమోదించి ”చతుష్టయాన్ని” ఏర్పాటుకు ప్రయత్నం చేశారు. అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని జాన్‌ హౌవర్డ్‌, భారత ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ దీనిని ఆమోదించారు.

ప్రశాంత సముద్రజలాలలో బలప్రదర్శనలు
చైనా ను నివారించ్చాలన్న అమెరికా ప్రయత్నాలకు మనం ఎందుకుసహకరించాలన్నదే ముఖ్యమైన అసలుప్రశ్న. చైనాలో ఆర్ధిక అభివ ద్ధి జరిగిన స్థాయి లో ఆ దేశ సైనిక ,భౌగోళిక, రాజకీయ శక్తీ పెరగలేదు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఇప్పటికీ అమెరికా దే పైచేయి. సైనిక బడ్జెట్‌, సైన్యం, అణ్వస్త్రాలు, విదేశాల్లో సైనికస్తావరాలు మొదలైన వాటిలో ఏ దేశమూ అమెరికా దరిదాపుల్లోకూడా లేదు. చైనా బలమైనఆర్ధిక శక్తిగా ఎదగడం, ఇరుగు పొరుగు దేశాలలో పలుకుబడి పెరగటంవలన ఆసియా-పసిఫిక్‌ లో అమెరికా అధిపత్యానికి భంగం కలిగింది.అమెరికా భధ్రతకు ముప్పు లేకపోయినా సవాలు మాత్రం ఎదురైంది. దక్షిణచైనా సముద్రంలో అమెరికాకు ఉపయోగపడే నిఘాకు భారతదేశం అంగీకరించింది. సైనిక వ్యూహంలో భాగంగా అండమాన్‌ నికోబార్‌ దీవులను కీలక మిలిటరీ కేంద్రంగా చేస్తున్నారు. చైనా సముద్ర వాణిజ్య మార్గంలో కీలకంగా వుండే మలక్కా జలసంధికి అండమాన్‌ దీవులు సమీపంలో వున్నాయి. చైనా వ్యతిరేక సైనిక వ్యూహంలోఅండమాన్‌ దీవులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.ప్రశాంత సముద్రజలాలలో బలప్రదర్శనలు చేయటానికి మనదేశం అంగీకరించినందువలన సైనిక కూటములలో ప్రత్యక్షభాగస్వాములౌతున్నాము.
సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవటానికి ఉన్నత రాజకీయ , దౌత్య స్ధాయిలో చైనా తో భారత ప్రభుత్వ చర్చలు కొనసాగించటం వలన దాదాపు 40 సంవత్సరాలు భారత-చైనా దేశాలు తమ అభివ ద్ధిపై కేంద్రీకరించగలిగాయి.భారత-చైనా దేశ ప్రజల విశాల ప్రయోజనాల ద ష్ట్యా ఇరు దేశాల నాయకులు ఉన్నత స్ధాయిలో రాజకీయ నిర్ణయాలు తీసుకుని సరిహద్దు సమస్యను పరిష్కరించాలి. బయటి వారెవరూ సైన్యాన్ని మనకు సహాయంగా పంపరు. ఆయుధాలను మనకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఆయుధపోటీని పెంచుతారు. అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ చెప్పినట్లుగా అమెరికాను మిలిటరీ – ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌ పరిపాలిస్తున్నది. అమెరికా లాగా మనం సైనిక-రక్షణ రంగ పరిశ్రమల (మిలిటరీ -ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌) పరిపాలనలోకి వెళ్ళరాదు. మిలిటరీ-ఇండిస్టియల్‌ కాంప్లెక్స వలన పెరుగుతున్నప్రమాదాల గురించి హెచ్చరించాడు.కానీ ఆయుధ రేసు ను నివారించలేకపోయాడు.

” తయారైన ప్రతి తుపాకీ, ప్రతి యుద్ధ నౌక, ప్రయోగించిన ప్రతి రాకెట్‌ -ఆకలి బాధతో ఉన్నవారినుండి దొంగిలించినవే. ధరించటానికి దుస్తులు లేనివారుండగా ఆయుధాలకు డబ్బు మాత్రమే ఖర్చు చేయటంలేదు. ఆయుధాల తయారీలో కార్మికుల చెమట, శాస్త్రవేత్తల మేధావితనంతోపాటు మన పిల్లల ఆశలు కూడా ఖర్చు చేస్తున్నాము.” అని ఐసెన్‌ హౌవర్‌ చెప్పాడు.

ఈ యుధాలు ఎవరికోసం ?
రక్షణ పరిశ్రమలు నడవటంకోసం యుద్ధాలుకావాలి. ఆధునిక ఆయుధాలను తయారు చేయటానికి ప్రపంచంలోని మేధావులను , సైంటిస్టులను అమెరికా ఆహ్వానించి ఆధునిక సౌకర్యాలను, అవకాశాలను, పని చెసే వాతావరణాన్ని స ష్టిస్తున్నది. కొత్తకొత్త ఆయుధాలను తయారుచేసి ఇరుపక్షాలకు ఆయుధాలను అమ్ముకుంటున్నది. సోవియట్‌ పతనం తరువాత అమెరికా కు కొత్త శత్రువు అవసరం వచ్చింది. ఆ వెతుకులాటలో ఇరాన్‌, ఇరాక్‌,లిబియా, సిరియా, ఆఫెనిస్ధాన్‌ లు కొంత పని కల్పించాయి. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాన్ని తమ తదుపరి కార్యక్షేత్రంగా ఎంచుకుని పావులు కదుపుతున్నారు.

అమెరికాతో సైనిక ఒప్పందాలు
భారత్‌ దేశాన్ని అమెరికాకు రక్షణ భాగస్వామి గా చేసుకోవటం వలన భారత సైనిక స్ధావరాలను అమెరికా యుద్దవిమానాలు, యుద్దóనౌకలు వినియోగించుకోవచ్చు. అమెరికాలో ఆయుధాలు ఉత్పత్తి చేసే వారి నుండి భారత్‌ నేరుగా ఆయుధాలు కొనవచ్చు. అమెరికా తన రక్షణ భాగస్వాములతో నాలుగు ”ప్రాధమిక ” ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. ఈ ఒప్పందాలు ”భాగస్వామి-దేశాలతో సైనిక సహకారాన్ని పెంపొందించుకోడానికి అమెరికా ఉపయోగించే సాధారణ సాధనాలు” అని పెంటగాన్‌ అంటుంది. మనం ప్రాధమిక స్ధాయి ఒప్పందాలన్నీ చేసుకున్నాము.
ఈ నాలుగు ఒప్పందాలలో మొదటిది, జనరల్‌ సెక్యూరిటీ ఆఫ్‌ మిలిటరీ ఇన్ఫర్మేషన్‌ అగ్రిమెంట్‌, 2002 లో భారత అమెరికాలు సంతకం చేసిన ఒప్పందం ఇది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సైనిక సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. రెండవ ఒప్పందం, లాజిస్టిక్స్‌ ఎక్సేóంజ్‌ మెమోరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌ , 2016 ఆగస్టు 29 న ఇరు దేశాలు సంతకం చేశాయి. పునఃసరఫరాలు చేయడానికి, మరమ్మతు చేయడానికీ ఇతరుల స్థావరాలను ఉపయోగించడానికి ఇరు దేశాల సైన్యానికి వీలు కలుగుతుంది.
మూడవ ఒప్పందం, కమ్యూనికేషన్స్‌ ఇంటర్‌ ఆపరబిలిటీ అండ్‌ సెక్యూరిటీ మెమోరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ చైనా మరియు పొరుగు ప్రాంతాలపై నిఘా ఉంచడానికి, అమెరికా మిలిటరీ పరికరాలను కొనటానికి, టెక్నాలజీని ఇవ్వటానికి , ఆయుధాలను భారతదేశానికి అమ్మటానికి ద్వైపాక్షిక సదస్సులో సంతకాలు చేసారు.
నాల్గవ ఒప్పందం బేసిక్‌ ఎక్సేóంజ్‌ అండ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బీకా). ఇది జియోస్పేషియల్‌ ఉత్పత్తులు, టోపోగ్రాఫికల్‌, నాటికల్‌, ఏరోనాటికల్‌ డేటా, యుఎస్‌ నేషనల్‌ జియోస్పేషియల్‌-ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (ఎన్జిఎ) ఉత్పత్తులు సేవలను మార్పిడి చేయడానికి అనుమతిస్తుంది.

లండన్లోని కింగ్స్‌ కాలేజీలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్‌ హర్ష్‌ వి. పంత్‌ అమెరికా వ్యూహాత్మక ప్రణాళికలో భారతదేశపు ప్రాముఖ్యతను ఎత్తిచూపాడు: ”ఇండో-పసిఫిక్‌ లో శక్తి సామర్ధ్యాల సమతుల్యతకు అమెరికాకు భారతదేశం కీలకం. వనరుల పరిమితంగా ఉన్న ఈ సమయంలో, చైనా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో తన విశ్వసనీయతను పెంచుకోడానికి అమెరికాకు భారతదేశం వంటి భాగస్వాములు అవసరం.” ఈ ఒప్పందాలన్నిటిలో భారత్‌ చేరింది. ఐరోపా లోని భాగస్వామ్యదేశాలన్నీ ఈ విధంగా సంతకాలు చేసి నాటో సైనిక కూటమి లో చేరి ఇరుక్కు పోయి తీవ్రంగా నష్టపోయాయని గ్రహించాలి.

చైనానుండి, చైనా కమ్యూనిస్టుపార్టీ దోపిడీ, అవినీతి నుండి దేశాల ప్రజల రక్షణ కోసం క్వాడ్‌ ఏర్పడిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ,టోక్యో లో బాహాటంగా ప్రకటించాడు. అమెరికా లో కమ్యూనిస్టువ్యతిరేకతను రెచ్చగొట్టిన ఘనత రిపబ్లికన పార్టీ సెనేటర్‌ మెకార్ధీకే దక్కుతుంది. ప్రభుత్వం లోవున్నప్రజాస్వామికవాదులందరినీ కమ్యూనిస్టులన్నాడు. సోవియట్‌ ఏజెంట్లు అంటూ వారందరిపై పై దాడి చేశాడు.వారిని పదవులనుండి తొలగించేదాకా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేశాడు. అమెరికన్‌ ప్రజలలో కమ్యూనిస్టలంటే భయాన్ని, వ్యతిరేకతలు స ష్టించాడు. అతను కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నిజమైన సాక్ష్యాలను చూపించటంలేదని అందరికూ తెలుసు. అయినా అతని అబద్ద ప్రచారాన్ని ఆపడానికి ఐసెన్‌ హౌవర్‌ లాంటి వారు కూడా భయపడ్డారు.” నేను ఆ వ్యక్తితో గొడవపడను” అని వెనక్కితగ్గాడు. 1950 లో ప్రారంభమయిన కమ్యూనిస్టు వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే వుంది. కమ్యూనిజాన్నినివారించాలనే పేరుతో కొరియా, వియత్నాం యుధాలనుండి ఇండో-పసిఫిక్‌ క్వాడ్‌ కూటమి వరకూ సైనిక కూటములను ఏర్పరుస్తున్నారు.
స్నేహంతో జీవించవలసిన ఇరుగు పొరుగు దేశాలమధ్య చిచ్చు పెట్టి ఇద్దరికీ ఆయుధాలను, ఫైటర్‌ విమానాలను, సబ్‌ మెరైన్లను అమ్ముకోవటమేకాకుండా ప్రపంచ ప్రజలనందరినీ పేదరికం లోకి నెట్టి అసమాన అభివ ద్ధిని స ష్టిస్తోంది. అమెరికా దేశం సంవత్సరానికి 732 బిలియన్‌ డాలర్లను , చైనా 261 బిలియన్‌ డాలర్లను, ఇండియా 71 బిలియన్‌ డాలర్లను మిలిటరీకి, ఆయుధాలకు ఖర్చు పెడుతున్నాయి.

చైనా మనను జయించలేదు. మనం చైనాను జయించలేము.
చైనా మనను జయించలేదు. మనం చైనాను జయించలేము. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో ఆయుధాలను ప్రయోగించి ,అత్యంత శక్తివంతమైన అమెరికా ఏదేశంలోనూ విజయం సాధించలేదు. 2001 సెప్టెంబరు 11 న ప్రపంచవాణిజ్యసంస్ధపై దాడి జరిగినప్పడినుండీ 20 సంవత్సరాలుగా , ఆసియాలో ప్రతీకారయుధాలను అమెరికా సాగిస్తుంది. ఈ యుధాలకు 6.4 లక్షల కోట్ల డాలర్లు ( 475 లక్షల కోట్ల రూపాయలు ) ఖర్చయిందని అంచనా. గత 20 సంవత్సరాలుగా అమెరికా సాగించిన యుధాలలో చనిపోయిన వారి సంఖ్య 8,01,000. అందులో 3,35,000 మంది నిరాయుధ పౌరులన్నది మరింత బాధాకరం. కొరియా, వియత్నాం లలో చావు దెబ్బతిన్న అమెరికా పాఠాలు నేర్చుకోకుండా మిలిటరీ -ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌ అడ్డుపడింది. ప్రత్యక్షంగా సైనికులను ఆకాశంనుండి క్యూబా లో దించి అవమానాల పాలయ్యింది.ఇరాక్‌ లో సద్దామ్‌ హుస్సేన్‌, చిలీ లో అలెండీ, లిబియాలో కల్నల్‌ గద్దాఫీ, ఇరాన్‌ జనరల్‌ క్వాసిమ్‌ సొలేమాన్‌ లను దారుణంగా హత్య చేసింది. క్యూబా అధినేత ఫిడేల్‌ కాస్ట్రోను చంపటానికి 638 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. అటువంటి చరిత్ర కలిగిన అమెరికా ను నమ్ముకుని యుద్ధ కూటములలో చేరితే మన దేశం ఆర్ధికంగా నష్టపోయి అరబ్‌ దేశాలు, లాటిన్‌ అమెరికా, ఆసియా.ఆఫ్రికా దేశాలలోలాగా అభాసుపాలవుతాము. కుక్క తోక పట్ట్టుకుని గోదావరి ఈదటం సాధ్యంకాదు.
రాబోయే కాలానికి భారత-చైనా దేశాలే సాంకేతిక అభివ ధికి చిహ్నంగా వుంటాయని నిరూపించుకుంటున్నారు. అటువంటి సమయంలో సరిహద్దు ఘర్షణలు జరగటం అవాంఛనీయం. వలసరాజ్యాలువదిలి వెళ్ళిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించకోలేకపోవటం భారత – చైనాదేశాల రాజకీయ వైఫల్యం. భారత చైనాలు చిరకాలం శత్రుత్వంతో వుండలేవు. వేలాది సంవత్సరాల మైత్రిలో తగాదాపడిన కాలం చాలా తక్కువ. పరిష్కరించుకోలేని సమస్యలు లేవు. అతి పెద్ద దేశాలైన భారత- చైనా లతోనే ప్రపంచ ప్రజల సుస్ధిర శాంతి సౌభాగ్యాలు ముడిపడివున్నాయి. సైనిక కూటములలో చేరవలసిన అవసరం వున్నదా లేదా అని మనం ఆలోచించాలి. సైనిక కూటములలోచేరి చితికిపోయిన దేశాల చరిత్రను మరువరాదు. ఉన్నత స్ధాయిలో రాజకీయ నిర?యాలు తీసుకుని సరిహద్దు సమస్యను పరిష్కరించాలి.

వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, భారత-చైనా మిత్రమండలి, ఆంధ్రప్రదేశ్‌, మాజీ అధ్యక్షుడు. (1982-1997)

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌సిఇపి ఒప్పందం – అమెరికాకు భంగపాటు !

17 Tuesday Nov 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

#RCEP, RCEP, RCEP China, RCEP INDIA, RCEP Trade Pact, Regional Comprehensive Economic Partnership (RCEP)


ఎం కోటేశ్వరరావు


ఎనిమిది సంవత్సరాల సంప్రదింపుల అనంతరం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని పదిహేను దేశాలు ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)పై నవంబరు 15వ తేదీన సంతకాలు చేశాయి. ఇదొక చారిత్రక పరిణామంగా భావిస్తున్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఆయా దేశాల చట్ట సభలు ఆమోదం తెలిపిన తరువాత ఇది అమల్లోకి వస్తుంది. ప్రపంచంలో దాదాపు సగం జనాభా, మూడోవంతు జిడిపి ఉన్న దేశాలు కుదుర్చుకున్న ఈ ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి నుంచి ఈ ఒప్పంద చర్చలలో ఉన్న భారత్‌ తాను వైదొలుగుతున్నట్లు గతేడాది నవంబరులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న ఏడాది కాలంలో అనేక అనూహ్య పరిణామాలు సంభవించాయి. ప్రపంచీకరణలో భాగంగా అనేక సంస్కరణలు చేపడతామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ మరోవైపు రక్షణాత్మక చర్యలు తీసుకోవటాన్ని మిగతా దేశాలు ఎలా చూస్తాయి ? అయితే భారత్‌ కోరుకుంటే ఎప్పుడైనా చేరవచ్చని, నిబంధనలను కూడా సడలిస్తామంటూ భాగస్వామ్య దేశాలు తలుపులు తెరిచే ఉంచాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల రక్షణ చర్యల్లో భాగంగా, ఇతర కారణాలతో మన దేశం ఈ ఒప్పందంలో చేరలేదు. చైనా కారణంగా దూరంగా ఉన్న అమెరికా కూడా దీనిలో చేరవచ్చనే ఆశాభావాన్ని జపాన్‌ వ్యక్తం చేసింది.


ఆస్ట్రేలియా,బ్రూనే, కంపూచియా, చైనా, ఇండోనేషియా, జపాన్‌, లావోస్‌, మలేషియా, మయన్మార్‌, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా,థారులాండ్‌,వియత్నాం సభ్యులుగా ఉన్న ఈ ఒప్పందం ద్వారా ప్రతిదేశమూ లబ్ది పొందటంతో పాటు ప్రపంచ జిడిపి పెరుగుదలకూ దోహదం చేస్తుందని భావిస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా అవతరిస్తున్న చతుష్టయ కూటమిలో ఉన్న జపాన్‌, ఆస్ట్రేలియా దీనిలో భాగస్వాములు. దక్షిణ కొరియాతో సహా రాజకీయ అంశాలలో అవి అమెరికాకు మద్దతు ఇస్తూనే ఆర్ధిక రంగంలో చైనాతో సంబంధాలతో మరింత ముందుకు పోవాలనే నిర్ణయించాయంటే ఆర్ధిక అంశాలే ప్రధాన చోదకశక్తిగా ఉన్నాయన్నది స్పష్టం. ఈ ఒప్పందంతో చైనాకు ఎగుమతి అవుతున్న జపాన్‌ పారిశ్రామిక ఎగుమతులలో 86శాతం, దక్షిణ కొరియా నుంచి ఎగుమతి అవుతున్నవాటిలో 92శాతంపై పన్నులు రద్దువుతాయి. జపాన్‌ ఆటోవిడిభాగాల తయారీ పరిశ్రమ ప్రధానంగా లబ్ది పొందుతుంది. ఆస్ట్రేలియా కూడా ఇదే అంచనాతో ఒప్పందానికి సిద్దపడింది. చైనాతో వాణిజ్య సంబంధాలలో ఈ మూడు దేశాలూ మిగులులో ఉన్నాయి.


అనేక ఆసియన్‌ దేశాల వస్తూత్పత్తి చైనానుంచి చేసుకొనే కొన్ని వస్తువుల దిగుమతుల మీద ఆధారపడి ఉంది. ఒప్పందానికి అమెరికా, భారత్‌ దూరంగా ఉన్నాయి. చైనాను పక్కన పెట్టాలన్న అమెరికా ఆదేశాలు లేదా విధానాలకు అనుగుణ్యంగా నడవటానికి తాము సిద్దంగా లేమనే సందేశం ఈ ఒప్పందం పంపినట్లయింది. ఒక వైపు ప్రపంచీకరణ తమకు నష్టదాయకంగా మారిందని బహిరంగంగా చెప్పకపోయినా అమెరికాతో సహా అనేక పెట్టుబడిదారీ రాజ్యాలు రక్షణాత్మక చర్యలను నానాటికీ పెంచుకుంటూ పోతున్నాయి. ప్రపంచవాణిజ్య సంస్ధతో నిమిత్తం లేకుండా ద్విపక్ష ఒప్పందాలు చేసుకుంటున్నాయి.ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాలేని ఈ అతిపెద్ద ఒప్పందం కుదరకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ జరిగాయి.పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను చక్రబంధంలో బిగించాలని చూసిన ట్రంప్‌ యంత్రాంగానికి ఇది పెద్ద వైఫల్యం. అమెరికాకు అగ్రతాంబూలం అన్న వైఖరిని అనుసరిస్తున్న వైఖరితో ఆసియా దేశాల్లో తలెత్తిన అనుమానాల కారణంగా కూడా ఆర్‌సిఇపి ఉనికిలోకి రావటానికి దోహదం చేసింది.
కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ కుదేలవుతున్నాయి. ఇదే సమయంలో చైనా, తూర్పు ఆసియా దేశాలు అమెరికాాఐరోపాలతో పోల్చితే కరోనాను అదుపు చేశాయి. ఆర్దిక రంగంలో పురోగమనంలో ఉన్నాయి. మరోపది సంవత్సరాల వరకు వినిమయం ఎక్కువగా ఉండే మధ్యతరగతి ప్రజానీకం పెరుగుదల చైనా, ఆసియాలోనే ఉంటుందని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.ఆర్దికంగా పెద్ద రాజ్యాలలో ఒక్క చైనా వృద్ది మాత్రమే పురోగమనంలో ఉంది. అమెరికా, ఐరోపా దేశాలు కరోనా కట్టడితో పాటు ఆర్ధికంగా కూడా తీవ్ర సమస్యలతో ఉన్నాయి.

ఫసిపిక్‌ ప్రాంత దేశాల భాగస్వామ్యం(టిపిపి) పేరుతో అమెరికా ముందుకు తెచ్చిన ప్రతిపాదనలో చైనాతో సహా అనేక ఆసియా దేశాలకు అవకాశం లేకుండా చూశారు. ఈ ఒప్పందంపై 2016లో సంతకాలు చేసిన అమెరికా మరుసటి ఏడాది డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి రాగానే ఉపసంహరించుకుంది. దాంతో అది అమల్లోకి రాలేదు. దీనికి ప్రతిగా చైనా, మరికొన్ని దేశాలు ముందుకు తెచ్చిందే ఆర్‌సిఇపి. దీనిలోపి టిపిపిలో ఉన్న ఆసియా దేశాలు భాగస్వాములయ్యాయి. అమెరికాను కూడా తమతో చేరాలని కోరాయి.టిపిపి వెనక్కు పోయిన తరువాత అమెరికా తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇండో-పసిఫిక్‌ వ్యూహం పేరుతో చైనాకు వ్యతిరేకంగా సరికొత్త సమీకరణకు పూనుకుంది. ఆర్‌సిఇపి నుంచి మన దేశం వైదొలగటానికి ఒక కారణం మన పారిశ్రామిక, వ్యవసాయ రంగాల నుంచి వెల్లడైన తీవ్ర వ్యతిరేకత అన్నది స్పష్టం. ఆ నష్టాల గురించి ప్రారంభం నుంచీ చర్చలలో ఉన్న మన ప్రతినిధులకు తెలియనివేమీ కాదు. అయినా ఆరు సంవత్సరాల పాటు ముందుకు పోయి 2019లో వెనక్కు తగ్గటానికి పైకి వెల్లడించని ఒక ప్రధాన కారణం ఈ కాలంలో అమెరికాతో పెనవేసుకున్న బంధం అన్నది స్పష్టమే. దానికి చక్కటి ఉదాహరణ ఇరాన్‌తో మనకు ఎలాంటి విబేధాలు లేవు. అయినా అమెరికా వత్తిడి మేరకు అక్కడి నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము.


ఆర్‌సిఇపిలోని 15దేశాలలో ప్రపంచంలోని 47.7శాతం మంది జనాభా, మూడోవంతు జిడిపి ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 29.1, పెట్టుబడులలో 32.5శాతం వాటాను ఈ దేశాలు కలిగి ఉన్నాయి. ఇక దేశాల వారీగా చూస్తే కలిగే ప్రయోజనాలు కొన్ని ఇలా ఉన్నాయి. జిడిపి పెరుగుదల పసిఫిక్‌ ప్రాంతంలో 2.1, ప్రపంచంలో 1.4, చైనాకు 0.55, దక్షిణ కొరియాకు 0.41నుంచి 0.62, జపాన్‌కు 0.1శాతం చొప్పున పెరుగుదల ఉంటుందని అంచనా. చైనా వ్యవసాయ ఉత్పత్తులపై జపాన్‌ 56శాతం, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 49, ఇతర దేశాల ఉత్పత్తులపై 61శాతం పన్నులు తగ్గుతాయి. కొన్ని వస్తువుల విషయంలో వెంటనే పన్నులు తగ్గినా, మొత్తంగా ఒప్పందంలో అంగీకరించిన మేరకు తగ్గుదలకు పది సంవత్సరాలు పడుతుంది. ప్రాంతీయ సరఫరా వ్యవస్ధ స్దిరపడుతుంది. ఆయా దేశాలకు కలిగే ఆర్ధిక ప్రయోజనాలు ప్రపంచ రాజకీయాల్లో వాటి వైఖరుల మీద కూడా ప్రభావం చూపుతాయి. ఈ ఒప్పందంతో పాటు చైనా, జపాన్‌, దక్షిణ కొరియాల మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.ఈ దిశగా మూడు దేశాలు పన్నులను తగ్గించేందుకు పూనుకోవచ్చు. చైనాాఅమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య పోరు కారణంగా తలెత్తిన నష్టాలలో ఈ ఒప్పందం కారణంగా చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలకు 150 నుంచి 200 బిలియన్‌ డాలర్ల మేరకు తగ్గవచ్చని అంచనా. ఇది అమెరికా మీద వత్తిడి పెంచుతుంది.


ఒప్పందం కుదిరినంత మాత్రాన అంతా అయిపోయినట్లు భావించరాదు. దాన్ని దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.ఈ ఒప్పందం బహుపక్ష వాదానికి చారిత్రక విజయం, ప్రాంతీయ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలకు పెద్ద సహాయకారి అవుతుందని భావిస్తున్నారు.టిపిపి నుంచి అమెరికా తప్పుకున్న తరువాత దీనిని పసిఫిక్‌ ప్రాంత సమగ్ర మరియు పురోగామి భాగస్వామ్య ఒప్పందంగా(సిపిటిపిపి) సవరించారు.టిపిపి ఒప్పందంలో వాణిజ్యానికి పెద్ద పీట వేస్తే దీనిలో పెట్టుబడుల వంటి వాటిని కూడా చేర్చారు.అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ఆర్‌సిఇపి ఒప్పందాన్ని అతిగా చూపి చైనా ముప్పు పేరుతో టిపిపిని మరోసారి ముందుకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే ఇది అంత తేలిక, వెంటనే జరిగేది కాదు. సిపిటిపిపిలో చేరి దాన్ని ఆర్‌సిఇపికి వ్యతిరేకంగా తయారు చేసేందుకు పూనుకోవచ్చు.

మన దేశం విషయానికి నరేంద్రమోడీ యంత్రాంగం ఆలోచనా ధోరణులు ఇలా ఉన్నాయని చెప్పవచ్చు. ట్రంప్‌ రెండో సారి కచ్చితంగా అధికారానికి వస్తాడు(ఈ కారణంగానే ప్రధాని నరేంద్రమోడీ అమెరికా వెళ్లి హౌడీమోడీ సభలో అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని ఎన్నికల ప్రచారం చేశారు). చైనాతో వాణిజ్య యుద్దాన్ని మరింత తీవ్రతరం చేస్తాడు. అది మేకిన్‌ ఇండియా కార్యక్రమం విజయవంతం కావటానికి దోహదం చేసే పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తుంది. చైనా నుంచి ఇతర దేశాల సంస్దలు మన దేశానికి తరలివస్తాయి. తద్వారా త్వరలో ఎగుమతుల్లో చైనాను అధిగమించవచ్చు. ఇలాంటి భ్రమలకు గురైన కారణంగానే అమెరికా కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని, ముఖ్యమంత్రులందరూ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు సిద్దంగా ఉండాలని మోడీ చెప్పిన విషయం తెలిసిందే.
అమెరికా ఇచ్చిన ప్రోత్సాహంతో చైనా మీద ఆధారపడిన సరఫరా వ్యవస్దకు ప్రత్యామ్నాయంగా జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి నూతన వ్యవస్దను ఏర్పాటు చేయాలని మన దేశం ప్రతిపాదించి చర్చలు జరుపుతోంది. అవి ఒక కొలిక్కి రాకముందే ఆ చైనాతోనే వాటితో పాటు మరికొన్ని దేశాలు ఆర్‌సిపి ఒప్పందం చేసుకొని అమలుకు ముందుకు పోతున్నాయి. జపాన్‌ వంటి దేశాలు మనల్ని, రెండవ పెద్ద ఆర్దిక వ్యవస్ద ఉన్న చైనాను కూడా ఉపయోగించుకోవాలని చూస్తాయి తప్ప కేవలం మన మీదనే ఆధారపడే అవకాశాల్లేవని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి.


ఏ నాయకత్వమైనా తమవైన స్వంత పద్దతులలో దేశాన్ని అభివృద్ధి చేయటానికి పూనుకోవచ్చు. అవి విజయవంతమౌతాయా లేదా అన్నది వేరే అంశం. కానీ మరొక దేశం మీద ఆధారపడి అంచనాలు రూపొందించుకోవటం మబ్బులను చూసి ముంతలో నీరు ఒలకపోసుకోవటం, గాలిమేడలు కట్టటం తప్ప మరొకటి కాదు. అనూహ్యంగా కరోనా వైరస్‌ సమస్య వచ్చింది. ట్రంప్‌ ఓడిపోయాడు. బైడెన్‌ చైనాతో వాణిజ్య యుద్దాన్ని కొనసాగిస్తాడో, రాజీపడతాడో తెలియదు. ట్రంప్‌ మాదిరి దూకుడు మాత్రం ఉండదు అంటున్నారు. అవి తేలేంతవరకు మేకిన్‌ ఇండియాను మన మోడీగారు ఏమి చేస్తారు ? వాయిదా వేస్తారా ? అనేక ఆసియా దేశాలు గతంలోనూ, ఇప్పుడు ఎగుమతి ఆధారిత విధానాలతోనే వేగంగా వృద్ధి చెందాయి. ఇప్పుడు ఆర్‌సిఇపి ద్వారా మన పొరుగునే ఒక పెద్ద స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఏర్పడింది. దాన్ని విస్మరించి రక్షణాత్మక చర్యలు తీసుకొంటున్న మన దేశం వైపు పెట్టుబడులు వస్తాయా ? వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయా ? అసలు అమెరికా కూడా వాటిని అంగీకరిస్తుందా ? మన పారిశ్రామిక, వ్యవసాయ రంగ రక్షణ చర్యలు తీసుకోకపోతే పాలక పార్టీ పారిశ్రామికవేత్తలు, రైతాంగానికి దూరం అవుతుంది. వీటిని ఫణంగా పెట్టి ప్రపంచ కార్పొరేట్లు, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ద, ప్రపంచ వాణిజ్య సంస్ధలు వత్తిడి తెస్తున్న ప్రపంచీకరణ గొలుసుకు మన దేశాన్ని కట్టకపోతే వాటికి కోపం వస్తాయి ? నరేంద్రమోడీ ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫిరాయింపుల మీద డోనాల్డ్‌ ట్రంప్‌ ఆశపెట్టుకున్నాడా ?

15 Sunday Nov 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#2020 US Elections, 2020 United States presidential election, Donald trump, Joe Biden, Trump eye on faithless electors


ఎం కోటేశ్వరరావు


కీలకమైన రాష్ట్రాలలో ఓటమి ఖరారు అయిన తరువాత కూడా డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఓటమిని అంగీకరించలేదు. తమ నేత రెండవ సారి పదవీ బాధ్యతలు చేపడతారు, అందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రంప్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో చెప్పారు. కోర్టుల విచారణలో ఉన్న కేసులు, విజేతలకు ఇంకా ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవటం, పోస్టల్‌ బ్యాలట్ల వివాదం వంటి అంశాలలో తమకే అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నారు. మరో వైపు ట్రంప్‌ మద్దతుదారులు వాషింగ్టన్‌ డిసిలో అతనికి మద్దతుగా ప్రదర్శనలు చేశారు. రక్షణశాఖలో ట్రంప్‌ తనకు అనుకూలమైన వారిని నియమిస్తూ ఎన్నికల ఫలితాలు స్పష్టమైన తరువాత నిర్ణయం తీసుకున్నారు. జనవరిలో జార్జియాలో జరగాల్సిన రెండు సెనెట్‌ స్దానాలను ఎలాగైనా సాధించి ఎగువ సభలో మెజారిటీ నిలుపుకొనే ఎత్తుగడలో భాగంగా అక్కడి ఓటర్లను ప్రభావితం చేసేందుకు తానే విజయం సాధించాననే ఎత్తుగడతో ముందుకు సాగుతున్నట్లు పరిపరి విధాలుగా వార్తలు వస్తున్నాయి. ఇవేనా ఇంకా ఏమైనా కుట్రలు న్నాయా అన్న అనుమానాలు సహజంగానే ముందుకు వస్తున్నాయి. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నందున వాటిలో ఒకటి ఫిరాయింపులను పోత్సహించి తీర్పును తారు మారు చేసే ఎత్తుగడను కూడా కొట్టి పారవేయలేము.


ఎన్నికలు జరిగిన పది రోజుల తరువాత అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జోసెఫ్‌ రోబినెట్‌ బైడెన్‌ జూనియర్‌ అలియాస్‌ జో బైడెన్‌ ఖరారు అయ్యారు. ఎలక్ట్రరల్‌ కాలేజీలోని 538కి గాను 306 ఓట్లతో ముందుండగా మెజారిటీకి అవసరమైన 270 తెచ్చుకోలేని డోనాల్డ్‌ ట్రంప్‌ 232తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికలలో ట్రంప్‌కు 306 రాగా హిల్లరీ క్లింటన్‌కు 232 వచ్చాయి. డిసెంబరు 14న అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక జరగనుంది, జనవరి 20న పదవీ బాధ్యతలను చేపడతారు. ఇప్పటికీ ఓటమిని అంగీకరించేందుకు మొరాయిస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ నూతన అధ్యక్షుడికి అధికారాన్ని అప్పగించేందుకు రాకపోయినా పదవీ స్వీకార ప్రమాణం ఆగదు. అధికారంలో ఉండి ఓడిపోయిన అధ్యక్షుల జాబితాకు ఎక్కిన ట్రంప్‌ అధికార మార్పిడికి సహకరించపోతే మెడపట్టి గెంటించుకున్న వ్యక్తిగా చరిత్రకు ఎక్కనున్నాడు.


ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో మెజారిటీకి అవసరమైన 218కి గాను డెమోక్రాట్లు 224 సీట్లు తెచ్చుకోగా రిపబ్లికన్లు 211 పొందారు. డెమోక్రాట్లు ఎనిమిది సీట్లు కోల్పోయారు. ఎగువ సభ సెనేట్‌లోని వంద స్ధానాలలో మెజారిటీకి 51రావాల్సి ఉండగా రిపబ్లికన్లు గతంలో ఉన్న 53కు గాను 50 తెచ్చుకోగా డెమోక్రాట్లు 45 నుంచి 46కు పెంచుకున్నారు. వారికి మరొక ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతు ఉంది. మరో రాష్ట్రమైన జార్జియాలోని రెండు సీట్లకు జనవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎగువ సభలో మెజారిటీకి రిపబ్లికన్లు ఒక సీటు దూరంలో ఉండగా డెమోక్రాట్లు రెండూ తెచ్చుకుంటే సమాన బలం కలిగి ఉంటారు. ఇది రాసిన సమయానికి దేశవ్యాపిత ఓట్లలో 97శాతం లెక్కింపు పూర్తయింది. విజేత బైడెన్‌కు 7,86,06,350(50.8శాతం) రాగా ట్రంపుకు 7,36,69,853(47.2శాతం) వచ్చాయి. ఎన్నికలకు ముందు సర్వేలలో వెల్లడైన దాని కంటే ట్రంపుకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. 1990 తరువాత రికార్డు స్ధాయిలో ఈ ఎన్నికల్లోనే ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా లెక్కింపు కొనసాగుతున్నందున 66.2 నుంచి 72శాతం మధ్య ఖరారు కావచ్చు. గత ఎన్నికలలో డోనాల్డ్‌ ట్రంప్‌ మెజారిటీ ఖరారైన ఒక రోజులోనే చైనా అధ్యక్షుడు జింపింగ్‌ అభినందనలు తెలిపాడు. ఈ సారి బైడెన్‌కు మెజారిటీ ఖరారు అయ్యేందుకు వ్యవధి ఎక్కువ తీసుకోవటం, మరోవైపు తానే ఎన్నికైనట్లు ట్రంప్‌ ప్రకటించుకున్న నేపధ్యంలో పది రోజుల తరువాత చైనా అధికారికంగా జో బైడెన్‌కు అభినందనలు తెలిపింది. భారత్‌తో సహా అనేక దే శాలు వెంటనే అభినందనలు తెలిపాయి.
అధికారికంగా డిసెంబరు 14న అధ్యక్ష ఎన్నికజరగాల్సి ఉంది. అనేక చోట్ల రిపబ్లికన్లు కోర్టులలో వేసిన కేసుల కారణంగా ఇది రాస్తున్న సమయానికి ఎలక్ట్రరల్‌ కాలేజీ విజేతలకు సర్టిఫికెట్ల జారీ ప్రక్రియముగియ లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని డోనాల్డ్‌ ట్రంప్‌ తానే గెలిచినట్లు వాదన ఇంకా చేస్తూనే ఉన్నాడు. రెండోసారి పదవీ బాధ్యతల స్వీకరణకు సిద్దం అవుతున్నట్లు మద్దతుదారులతో ప్రకటనలు చేయిస్తున్నాడు. రక్షణశాఖలో తనకు అనుకూలంగా ఉండే అధికారుల నియామకం చేశాడు. జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేసే వరకు పూర్తి అధికారాలను కలిగి ఉన్నందున ట్రంప్‌ తాను చేయదలచుకున్నది చేసేందుకు పూనుకున్నట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి.


సాధారణంగా అమెరికాలో ఫిరాయింపుల గురించి పెద్దగా జనానికి తెలియదు. దానికి కూడా అవకాశం లేకపోలేదు.2016 ఎన్నికలలో ట్రంప్‌కు 306, హిల్లరీ క్లింటన్‌కు 232 వచ్చినట్లు తెలిసిందే. అయితే ఎలక్ట్రరల్‌ కాలేజీలో ఎన్నిక సమయంలో ఏడుగురు సభ్యులు ఫిరాయించి వారికి ఓట్లు వేయలేదు. దాంతో వారి ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. ట్రంప్‌కు ఇద్దరు, హిల్లరీకి ఐదుగురు ఓటు వేయలేదు. నవంబరు 3వ తేదీ ఎన్నికలలో విజేతలకు అనేక రాష్ట్రాలలో ఇంకా ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదు. అటువంటి చోట్ల ఆయా రాష్ట్రాల చట్టసభలు ఎలక్ట్రరల్‌ కాలేజీ ప్రతినిధులను నియమించుకోవచ్చు. రిపబ్లికన్లు అధికారంలో ఉండి చోట్ల డెమోక్రాట్లు గెలిచిన చోట ట్రంప్‌ ఇలాంటి అక్రమాలకు పాల్పడవచ్చని తద్వారా తనకు అవసరమైన 270 ఓట్లను సాధించి అధికారంలో కొనసాగాలనే పధకంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు అవకాశం లేదని కొందరు చెబుతున్నప్పటికీ అది జరిగితే ఏమిటన్నది ప్రశ్న. ఒక వేళ ట్రంప్‌ ఫిరాయింపులతో గట్టెక్కాలంటే పన్నెండు శాతం మంది అంటే బైడెన్‌కు వచ్చిన 306 ఓట్లలో పన్నెండు శాతం అంటే 38 మంది ఫిరాయిస్తేనే చెల్లుబాటు అవుతుందని కొన్ని వార్తలు సూచించాయి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చట్టం ఉన్నందున అదే జరిగితే చట్టబద్దమైన వివాదం కూడా తలెత్తవచ్చు.
అమెరికాలో ఫిరాయింపులకు సంబంధించి దేశమంతటికీ వర్తించే ఒకే చట్టం లేదు. గతంలో ఫిరాయింపులు జరిగిన ఉదంతాలు ఉన్నప్పటికీ అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేయలేదు. ఇప్పటి వరకు 165 ఉదంతాలలో ఫిరాయింపులు చోటు చేసుకున్నాయి.1836లో 23 మంది వర్జీనీయా రాష్ట్ర ప్రతినిధులు అధ్యక్ష ఎన్నికలో తమ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్దికి ఓటు వేసి ఉపాధ్యక్ష ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొనలేదు. దాంతో తొలిసారిగా సెనెట్‌ ద్వారా ఎన్నుకోవాల్సి వచ్చింది. 1872లో పార్టీ అభ్యర్ధి ఎన్నికల తరువాత ఎలక్ట్రరల్‌ కాలేజీ సమావేశం జరగముందే మరణించాడు. దాంతో 63 మంది వేరే పార్టీకి ఓటు వేశారు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం 33 రాష్ట్రాలు, కొలంబియా జిల్లాలో గెలిచిన పార్టీకే ఎలక్ట్రరల్‌ కాలేజీ ప్రతినిధులు ఓటువేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ కేవలం 14 రాష్ట్రాలలో మాత్రమే ఫిరాయింపులు చేస్తే అనర్హత వేటు వేసే అవకాశం ఉంది.నిర్ధిష్టమైన చట్టాలేవీ లేవు.


మరోవైపు విజయం ఖాయం కావటంతో డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులు రంగంలోకి దిగారు. అధ్యక్ష స్ధానంలో విజయం సాధించినప్పటికీ ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ తగ్గటానికి, సెనెట్‌లో మెజారిటీ సాధించలేకపోవటానికి డెమోక్రటిక్‌ పార్టీలోని పురోగామి విధానాలు లేదా సోషలిజానికి మద్దతే కారణమని ఆ పార్టీలోని మితవాదులు, కార్పొరేట్ల ప్రతినిధులు సూత్రీకరణలు ప్రారంభించారు. వామపక్ష నినాదాలు, విధానాలను ముందుకు తెస్తే జనవరిలో జార్జియాలో జరిగే సెనెటు ఎన్నికలలో ఓటమి తప్పదని డెమోక్రటిక్‌ పార్టీలోని కార్పొరేటటు శక్తులు అప్పుడే సన్నాయి నొక్కులు ప్రారంభించాయి.వాటిని డెమోక్రటిక్‌ సోషలిస్టుగా ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ నేత బెర్నీ శాండర్స్‌ తిరస్కరించారు. అందరికీ వైద్య సదుపాయం,నూతన హరిత ఒప్పందానికి మద్దతు ఇవ్వటం వల్లనే దిగువ సభలో సీట్లు తగ్గాయని పార్టీలోని మితవాదులు విమర్శిస్తున్నారు. అయితే ఆ నినాదం లేదా విధానాలకు మద్దతు ఇచ్చిన వారెవరూ ఈ ఎన్నికల్లో ఓడిపోలేదు. అందరికీ వైద్యం అందించాలన్న తీర్మానాన్ని బలపరిచిన 112 మందికి గాను అందరూ ఈ ఎన్నికల్లో గెలిచారు. నూతన హరిత ఒప్పంద తీర్మానాన్ని బలపరిచిన 98 మందిలో ఒక్కరు మాత్రమే ఓడిపోయారు. కోట్లాది మంది జనాల జీవితాలను మెరుగుపరచాలన్న పురోగామి విధానాలను కార్మికులుగా ఉన్న అన్ని సామాజిక తరగతులకు చెందిన ఓటర్లు ఆమోదించారని, వారందరూ సాయం కోసం ఎదురు చూస్తున్నందున దానికి అనుగుణ్యంగా స్పందించాలని బెర్నీ శాండర్స్‌ చెప్పారు.

కీలక పాత్ర పోషించిన పోస్టల్‌ కార్మికులు
ఎన్నికల్లో కార్మికులు కీలక పాత్ర పోషించగలరా ? అవును. అమెరికా ఎన్నికలలో పోస్టల్‌ కార్మికులు పోషించిన కీలక పాత్ర విస్మరించరానిది. నిజానికి అమెరికా ప్రజాస్వామ్యం నిలిచిందంటే వారి పాత్ర లేకుండా సాధ్యమయ్యేది కాదంటే అతిశయోక్తి కాదు. 2016తో పోల్చితే రెట్టింపైన ఆరున్నర కోట్ల పోస్టల్‌ బ్యాలట్లను ఆరులక్షల 30వేల మంది కార్మికులు సకాలంలో అధికారులకు అందచేసేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. తపాలా సేవలను ప్రయివేటీకరించాలన్న ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమకు మద్దతు ఇచ్చే శక్తులు అధికారంలో ఉండాలన్న చైతన్యం ఆ కార్మికులను దీనికి పురికొల్పిందని చెప్పవచ్చు. పోస్టల్‌ బ్యాలట్లలో తనకు వ్యతిరేకంగా ఎక్కువ పడినట్లు గ్రహించిన ట్రంప్‌ వాటిని సకాలంలో అందకుండా చేసేందుకు పన్నిన కుయుక్తులను కూడా కార్మికులు వమ్ముచేశారు.
ట్రంప్‌ తన మద్దతుదారైన లూయీస్‌ డెజోరును ఎన్నికలకు ఎంతో ముందుగానే పోస్టు మాస్టర్‌ జనరల్‌గా నియమించాడు. దీని వెనుక మూడు లక్ష్యాలు ఉన్నాయి. తపాలాశాఖను ప్రయివేటీకరించాలంటే ముందు అది అసమర్దంగా తయారైందని జనానికి చెప్పాలి. తపాలా అందచేతను ఆలశ్యం గావించి వినియోగదారుల ముందు సిబ్బందిని దోషులుగా నిలపటం, ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలట్లను సకాలంతో డెలివరీ చేయకుండా చూడటం ఇతర అంశాలు. గడచిన మూడు అధ్యక్ష ఎన్నికలను పరిశీలించినపుడు పోస్టల్‌ బ్యాలట్లలో అత్యధిక ఓట్లు డెమోక్రటిక్‌ పార్టీకే పడ్డాయి. ఈ అంశం గమనంలో ఉంది కనుక ఈ సారి కరోనా కారణంగా వాటి సంఖ్య మరింతగా పెరుగుతుందని ట్రంప్‌ యంత్రాంగం ముందుగానే ఊహించింది. పోస్టు మాస్టర్‌ జనరల్‌ డెజోరు తన పధకాలను వెంటనే అమలు చేశాడు.


పోస్టు మాస్టరు జనరల్‌ కుట్రను పసిగట్టిన ఒక యూనియను ఒక స్ధానిక కోర్టులో దాఖలు చేసిన పిటీషనుపై నిర్ణీత గడువులోగా తపాలా బ్యాలట్లను బట్వాడా చేయాలని న్యాయమూర్తి ఆదేశించాడు. దాన్ని అమలు చేసేందుకు అధికారులు తిరస్కరించారు. మూడు లక్షల బ్యాలటు కవర్లు ఎక్కడున్నాయో తెలియటం లేదని అధికారులు కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చారు. సకాలంలో ముద్రపడిన బ్యాలట్లను వెతికి మరీ ఎన్నికల తరువాత కూడా అందచేయాలని న్యాయమూర్తి ఆదేశించాడు. అయినా అధికారులు అనేక చోట్ల బాలట్ల బట్వాడాను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.


ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు డోనాల్డు ట్రంపు పాల్పడని తప్పుడు పని లేదు.చైనా, కమ్యూనిస్టు బూచిని చూపి ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించటం వాటిలో ఒకటి. దానిలో భాగంగానే జో బైడెను కమ్యూనిస్టు అని, అమెరికాను చైనాకు తాకట్టుపెడతాడు అని ప్రచారం చేశాడు. నిజానికి బైడెను పక్కా కార్పొరేటు మనిషి. గతంలో బరాక్‌ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పని చేసిన సమయంలో చైనాకు ప్రత్యేకమైన అనుకూలతను ఎక్కడా వ్యక్తం చేయలేదు. ట్రంప్‌ మితవాది, ఫాసిస్టుశక్తులకు మద్దతుదారు, శ్వేతజాతి దురహంకారి, కార్మిక వ్యతిరేకి కనుక శ్వేతజాతీయులైన సాధారణ కార్మికులతో సహా అనేక మంది తక్కువ ప్రమాదకారి అనే భావనతో బైడెన్ను బలపరిచారు. వారిలో కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. అనేక శక్తులు బైడెను మీద అభిమానం కంటే ట్రంపు మీద ఉన్న వ్యతిరేకత కారణంగా డెమోక్రాట్లకు ఓటువేశారు. ఈ శక్తులన్నీ ఉన్నాయి కనుకనే పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధ్యమైంది. అయితే గడచిన కాలంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కార్పొరేట్లకే సేవ చేశారు, కార్మికులను విస్మరించారు. డెమోక్రటిక్‌ పార్టీలో ఇటీవలి కాలంలో పురోగామిశక్తులు సంఘటితం అవుతున్నాయి. అనేక స్ధానిక ఎన్నికలలో కార్పొరేట్‌ అనుకూల శక్తులను వెనక్కు నెట్టి పోటీకి దిగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎన్నికలు ముగిసిన వెంటనే తమ అజెండా అమలుకు వత్తిడి తేవాలని కూడా నిర్ణయించాయి.

బైడెన్‌ వచ్చినంత మాత్రాన జరిగిన అన్యాయాలన్నీ సరిదిద్దుతారని చెప్పలేము. మన యువతకు హెచ్‌1బి వీసాల గురించి ట్రంప్‌ ఎంత ప్రతికూలంగా వ్యవహరించిందీ చూశాము. నిజానికి ఆ వీసాలు మన మీదో మరొక దేశం మీదో ప్రేమతోనో ఇస్తున్నవి కాదు. అక్కడి కార్పొరేట్‌ కంపెనీలకు చౌకగా పని చేసే కార్మికులు అవసరం కనుక ఇస్తున్నారు. ఎన్నికలలో నిరుద్యోగుల ఓట్ల కోసం ట్రంప్‌ జిమ్మిక్కులు చేశాడు. ఇప్పుడు బైడెన్‌ ముందూ నిరుద్యోగం సమస్య ఉంది. అయినప్పటికీ వీసాల విషయంలో కార్పొరేట్ల వత్తిడి మేరకు సడలింపులు ఇస్తారని భావిస్తున్నారు. ఇస్తారా లేదా, చైనా ఇతర దేశాల పట్ల ట్రంపు అనుసరించిన దూకుడు ధోరణి మార్చుకుంటారా లేదా వంటి అనేక సమస్యల మీద జనవరి మూడవ వారంలోగానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ ఘోర పరాజయం – నరేంద్రమోడీకి చెప్పుకోలేని దెబ్బ !

08 Sunday Nov 2020

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Donald Trump defeat, Joe Biden, Narendra Modi, US Election 2020


ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడిగా డెమోక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ ఎన్నికను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఓట్ల లెక్కింపు తీరుతెన్నులను బట్టి విజేతగా ఇప్పటికే ఖరారయ్యారు. ఎలక్ట్రరల్‌ కాలేజీలోని 538 ఓట్లకు గాను బిడెన్‌కు 306 ఓట్లు వస్తాయని మీడియా విశ్లేషణలు తెలిపాయి. ఈ కారణంగానే మన ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక దేశాల నేతలు అభినందనలు పంపుతున్నారు.అమెరికా నగరాలలో డెమోక్రాట్ల విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి. అమెరికా మిత్ర రాజ్యాలు లేదా అది శత్రువులుగా పరిగణిస్తున్న దేశాలూ బిడెన్‌ ఏలుబడిలో సంబంధాలు, సమస్యలూ ఎలా ఉంటాయా అన్న మధనంలో పడ్డాయి.ప్రపంచీకరణ, అందునా ఏకైక అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రతి పరిణామ పర్యవసానాలూ ప్రపంచం మీద ఉంటాయి కనుక ఇది సహజం.
అమెరికా చరిత్రలో అధికారంలో ఉండి ఓడిపోయిన వారిలో 11వ వ్యక్తిగా డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్ర పుటలకు ఎక్కాడు. ఈ ఎన్నికల గురించి ప్రపంచంలో చెప్పుకోలేని చోట దెబ్బతగిలింది ఎవరికయ్యా అంటే అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ (ఈసారి ట్రంప్‌ సర్కార్‌ ) అని నినాదమిచ్చిన ప్రధాని నరేంద్రమోడీ, దాని మీద ఎలాంటి అభ్యంతరమూ తెలపని సంఘపరివార్‌ లేదా బిజెపికి అన్నది స్పష్టం. గతంలో మన పాలకులు ఎవరూ మరొక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. అంతర్గతంగా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఏ దేశం ఎలా జోక్యం చేసుకున్నప్పటికీ అదంతా లోగుట్టు వ్యవహారం. బహిరంగంగా జోక్యం చేసుకొని ఒక పక్షానికి మద్దతు పలికింది నరేంద్రమోడీ మాత్రమే. అందువలన ఇబ్బంది పడేది కూడా మోడీ అండ్‌ కో మాత్రమే. ట్రంప్‌ మీద జోకులేసే వారు మోడీని కూడా కలిపి ఆడుకున్నా చేయగలిగిందేమీ లేదు.
అనేక సార్లు బిజెపి ఐటి విభాగం అభాసుపాలైంది. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. 2014 సెప్టెంబరులో ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన జరిపిన సందర్భంగా ఇచ్చిన విందులో నాడు ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్‌ – మోడీ కలుసుకున్న ఫొటోను ఇప్పుడు విడుదల చేసి బైడెన్‌తో మోడీకి ఎంత సాన్నిహిత్యం ఉందో చూడండి అని జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా పర్యటనకు నిరాకరించింది కూడా అదే బిడెన్‌, అదే పార్టీకి చెందిన బరాక్‌ ఒబామా అన్న విషయం తెలిసిందే. అయితే మోడీ ప్రధాని అవగానే బరాక్‌ ఒబామా స్వాగతం పలికారు. దానికి చూశారా మా మోడీ తడాఖా అని బిజెపి మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో ఎగిరెగిరి పడ్డారు. అక్కడ ఆహ్వానం నరేంద్రమోడీకి కాదు, భారత ప్రధానికి అన్నది అసలు వాస్తవం. ఇప్పుడు ప్రత్యేక పరిస్దితి తలెత్తింది. గుజరాత్‌లో జరిపిన మారణకాండలో మోడీ మీద వచ్చిన విమర్శల కారణంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒబామా సర్కార్‌ అనుమతి ఇవ్వలేదు. తరువాత పరిస్ధితి మారింది కనుక ఒక దేశాధినేతగా ఆహ్వానం పలికారు. తాజా ఎన్నికలలో బైడెన్‌కు వ్యతిరేకంగా,ట్రంప్‌కు మద్దతుగా ప్రధాని హౌదాలో అమెరికా వెళ్లి మరీ ప్రచారం చేయటాన్ని ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది.
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన తీరులో మోడీ ప్రవర్తన చౌకబారుగా ఉందా, రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించారా అన్నది వేరే అంశం. ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకం, ప్రమాదకరమైన పోకడ. బిజెపి ఐటి విభాగపు నేత అమిత్‌ మాలవీయ ఒక ట్వీట్‌ చేస్తూ వామపక్ష శక్తులు ఆశాభంగం చెందుతారని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నికైతే ఆయన ఏది చెబితే అది వినాల్సి రావటం మోడీకి పెద్ద దెబ్బ అవుతుందనే భ్రమల్లో దుష్ట వామపక్ష శక్తులు ఉన్నాయి, వారు చివరికి ఆశాభంగం చెందుతారు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. బైడెన్‌ అయినా మరొకరు అయినా చక్రం తిప్పేది అమెరికా అధ్యక్షుడు తప్ప ప్రస్తుత పరిస్ధితిలో మోడీ లేదా మరొక దేశనేత కాదు.
మన భుజం మీద తుపాకిపెట్టి చైనాను కాల్చాలన్నది ట్రంప్‌ ఎత్తుగడ. అదే బైడన్‌ కూడా అనుసరిస్తే, ఆలోచన లేకుండా మనం భుజం అప్పగిస్తే ఉపయోగించుకుంటారు. చైనా మార్కెట్‌ను పూర్తిగా తమకు అప్పగించాలని, ప్రపంచంలో ఎక్కడా చైనా పోటీకి రాకూడదని అమెరికా కోరుకుంటోంది.అందుకు ఎవరు ఉపయోగపడితే వారిని ఉపయోగించుకుంటున్నది. గతంలో మన మార్కెట్‌ కోసం మనకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ను ఎగదోసి మన మీద వత్తిడి తెచ్చింది. మన పాలకులు లొంగిపోవటంతో ఇప్పుడు పాక్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఈ లోగా చైనా ఆర్ధికంగా ఎదుగుతుండటంతో దానికి వ్యతిరేకంగా మనలను ప్రయోగించేందుకు చూస్తున్నది. అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీటవేస్తారు. అందువలన తమ అవసరం కోసం బిడెన్‌ కూడా మోడీని మరింతగా కౌగలించుకోవచ్చు, ట్రంప్‌ ఇచ్చిన దేశపిత మాదిరి మరొక అపహాస్యపు బిరుదును ఇవ్వవచ్చు. దాన్ని గమనించకుండా మన అవసరం అమెరికాకు ఉంది, ఇదే మన గొప్ప అని మన భుజాలు మనం చరుచుకుంటే నగుబాట్లు పాలుకావటం తప్ప మరొకటి ఉండదు. ట్రంప్‌కు మద్దతు ప్రకటించినపుడు చూపిన హావభావాలనే రేపు బిడెన్‌తో కౌగిలింతలలో కూడా నరేంద్రమోడీ ఎలా ప్రదర్శిస్తారు ? అప్పుడు అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ నినాదం గుర్తుకు రాదా? వారు మానవ మాత్రులు కాదా?
ఈసారి ట్రంప్‌ ప్రభుత్వం అని చెప్పారు తప్ప ట్రంప్‌కు ఓటు వేయమని కోరలేదుగా అని బిజెపి నేతలు వాదించవచ్చు. హూస్టన్‌ నగరంలో హౌడీమోడీ కార్యక్రమం తరువాత ట్రంప్‌ చేసిన ట్వీట్‌లు ఏమిటి ? అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రధాని నరేంద్రమోడీ సమ్మతి పొందారు.హూస్టన్‌లో 50వేల మందికి పైగా ఉన్న భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు, ట్రంప్‌తో చేతులు కలిపి నడిచారు అని ట్రంప్‌ పత్రికా కార్యదర్శి మెకెనీ ట్వీట్‌ చేశారు. తెలివిగా మద్దతు ప్రకటించామని మోడీ మద్దతుదారులు సంతోష పడ్డారు. ట్రంప్‌కు తన సమ్మతి ఉందని భారత అమెరికన్లకు చెప్పిన భారత ప్రధాని అన్న అర్ధం వచ్చే శీర్షికతో బ్లూమ్‌బెర్గ్‌ రాసింది. దానికి ఇద్దరూ కౌగలించుకున్న ఫొటోను సాక్ష్యంగా ప్రచురించింది. హూస్టన్‌లో ఇచ్చిన నినాదం మీద విమర్శలు తలెత్తటంతో అహమ్మదాబాద్‌లో మోడీ నోటి వెంట అబ్‌కీ బార్‌ అనే నినాదం వెలువడలేదు గాని అంతకంటే ఎక్కువ పొగడ్తలతో నింపివేశారు.భారతలో ట్రంప్‌ ఎన్నికల సభమాదిరిగా నిర్వహించారు.ఈ సభ వీడియోలను కూడా ట్రంప్‌ అమెరికన్‌-భారతీయులలో ప్రచారానికి వినియోగించుకున్నారు. అన్నింటికీ మించి హూస్టన్‌ సభకు పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరుకావటాన్ని చూసి ఇంకేముంది అమెరికన్‌-భారతీయుల మీద కూడా మోడీ ప్రభావం ఎలా పడిందో చూడండి అంటూ ఊదరగొట్టారు.
రెండు శిబిరాలుగా చీలిన అమెరికాలో ఒక శాతం ఓట్లు కూడా ఫలితాలను తారు మారు చేస్తాయి. అందువలన తన ఓటమిని ముందుగానే ఊహించిన ట్రంప్‌ భారతీయ ఓటర్లను ఆకట్టుకొనేందుకు నరేంద్రమోడీ పలుకుబడిని ఉపయోగించుకోవాలని చూశాడు కనుకనే పై వ్యవహారాలన్నీ నడిచాయి. ట్రంప్‌ ఎత్తుగడలకు ప్రతిగా భారత-ఆఫ్రికా వారసత్వం కలిగిన కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష స్ధానానికి నిలిపి డెమోక్రాట్లు దెబ్బతీశారు.ఎన్నికలకు కొద్ది వారాల ముందు జరిపిన ఒక సర్వేలో 72శాతం మంది భారత సంతతి డెమోక్రాట్లకు, 22శాతం ట్రంప్‌కు ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నారని తేలింది. ఎన్నికలు జరిగిన తరువాత వెల్లడైన వార్తలను చూస్తే తటస్ధంగా ఉన్న ఓటర్లు కూడా డెమోక్రాట్ల వైపే మొగ్గినట్లు కనిపిస్తోంది. అమెరికన్‌ భారతీయలలో నరేంద్రమోడీ తన పలుకుబడిని ఎక్కువగా ఊహించుకున్నారన్నది స్పష్టం. అందుకే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. మెజారిటీ భారతీయులు ట్రంప్‌కు ఓటు వేయలేదు, మొత్తంగా పరాజయం, అంటే నరేంద్రమోడీకి రెండు దెబ్బలు అని చెప్పవచ్చు.
కాశ్మీరు, సిఎఎ, ఎన్‌ఆర్‌సి సమస్యల మీద డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీలు మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. కాశ్మీరీలు ఒంటరిగా లేరు,మేమందరం చూస్తున్నాము, అవసరం అయితే జోక్యం చేసుకోవాలి అని తాజాగా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన కమలా హారిస్‌ గతంలో చెప్పారు.డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ ప్రమీలా జయపాల్‌ గతంలో నరేంద్రమోడీ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. గతేడాది డిసెంబరుల్లో ఆమె సభ్యురాలిగా ఉన్న పార్లమెంటరీ బృందం భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆమెను మినహాయించాలని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ కోరగా అమెరికా నిరాకరించింది. దాంతో ఆ బృందంతో జరగాల్సిన సమావేశాన్ని మంత్రి రద్దు చేసుకున్నారు. ఇప్పుడు తిరిగి ఆమె పెద్ద మెజారిటీతో గెలిచారు. అలాంటి ఎంపీలు నరేంద్రమోడీ సర్కార్‌ గురించి ఇప్పుడు మౌనంగా ఉంటారా ? అదే ట్రంప్‌ విషయానికి వస్తే అహమ్మదాబాద్‌ పర్యటన సందర్భంగా విలేకర్ల సమావేశంలో సిఎఎ గురించి మాట్లాడేందుకు నిరాకరించాడు. కాశ్మీరు విషయంలో మధ్యవర్తిత్వం జరుపుతానన్నాడు. నరేంద్రమోడీ విధానాలకు మద్దతు పలికాడు. మన దేశాన్ని బెదిరించటం, కంపు దేశమని నోరు పారవేసుకోవటం గురించి మోడీ మౌనం దాల్చినా దేశ ప్రజలు తీవ్రంగానే స్పందించటాన్ని చూశాము.
బైడెన్‌ గెలుపు మన దేశానికి లాభమా నష్టమా అన్న చర్చ ప్రారంభమైంది. ఒకటి స్పష్టం అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా అమెరికన్‌ కార్పొరేట్ల ప్రయోజనాలే వారికి ముఖ్యం. మీ ఇంటికొస్తే మాకేం పెడతారు, మా యింటి కొస్తే మాకేం తెస్తారు అన్నట్లుగా ఉంటుంది. డెమోక్రాట్లు అందరికీ ఆరోగ్యం అనే ఎన్నికల వాగ్దానం చేశారు. దాన్ని ఆచరణలో పెడితే మన ఔషధ పరిశ్రమకు మరింత ఉపయోగం అని కొందరు లెక్కలు వేస్తున్నారు. అదే విధంగా హెచ్‌1బి వీసాలు మరిన్ని ఇవ్వొచ్చని కొందరు ఆశపడుతున్నారు. అమెరికా కార్పొరేట్‌ సంస్ధలకు చౌకగా పని చేసే వారు కావాలి. ఎన్నికల్లో ఓట్ల కోసం ట్రంప్‌ స్ధానిక యువతను ఆకట్టుకొనేందుకు విదేశీయులకు వీసాలు బంద్‌ అన్నట్లు హడావుడి చేశారు. నిజంగా అలాంటి ఆంక్షలను అమలు జరిపితే అక్కడి కార్పొరేట్లు సహించవు.
చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్‌ రెండు సంవత్సరాలు దాటినా సాధించిందేమీ లేదు. ఒక వేళ బైడెన్‌ దాన్ని కొనసాగించినా ఒరిగేదేమీ లేదు. ట్రంప్‌ ప్రచారం చేసినట్లు బైడెన్‌ కమ్యూనిస్టు కాదు, పక్కా కార్పొరేట్ల ప్రతినిధి. బరాక్‌ ఒబామా హయాంలో కూడా అమెరికా యుద్దాలు చేసిన విషయం మరచి పోకూడదు. అందువలన ట్రంప్‌ మాదిరి దురహంకారం, నోటి దురుసుతనం ఉండకపోవచ్చు తప్ప అమెరికా మౌలిక విధానాల్లో మార్పు వచ్చే అవకాశం లేదు. చైనాతో వైరం కంటే రాజీయే లాభం అనుకుంటే దూకుడు తగ్గించి, కొంత ఆలస్యం చేయవచ్చు తప్ప అమెరికా పెత్తందారీ వైఖరిలో మౌలిక మార్పు ఉండే అవకాశాలు లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ ఓటమిని అంగీకరించకపోతే ఏమి జరగనుంది !

03 Tuesday Nov 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Democratic party, Donald trump trade war, Joe Biden, Republican party, US Election 2020


ఎం కోటేశ్వరరావు


ప్రపంచమంతా ఆసక్తితో ఎదురు చూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఫలితాల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. పెద్ద సంఖ్యలో పోస్టల్‌, మెయిల్‌ ఓట్లు పోలు కావటంతో లెక్కింపు పూర్తి కావటం ఆలస్యం కావచ్చు. తాను ఓడిపోతే కోర్టుకు ఎక్కుతానని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించిన నేపధ్యంలో ఏమి జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్‌ ఓడిపోతే ట్రంప్‌ మద్దతుదారులు అనేక చోట్ల వీధులకు ఎక్కటానికి సిద్ధం అవుతున్నారు. దానికి ప్రతిగా కార్మికులు కూడా సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలని పిలుపులు వెలువడ్డాయి.


చివరి ఎన్నికల సర్వేలను బట్టి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జోబిడెన్‌కు 52శాతం ఓట్లు, ప్రస్తుత అధ్యక్షుడైన రిపబ్లికన్‌ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌కు 43శాతం వస్తాయని వెల్లడైంది. కీలక రాష్ట్రాలుగా పరిగణిస్తున్న చోట కూడా బిడెన్‌ స్వల్ప మెజారిటీలో ఉన్నట్లు సమాచారం. మొత్తం ఓట్లలో మెజారిటీ బిడెన్‌కు వచ్చినా విజేత నిర్ణయం 538 మంది ఉండే ఎలక్ట్రొరల్‌ కాలేజీలో మెజారిటీ (270) తెచ్చుకున్నవారే పీఠమెక్కుతారు. అయితే గత ఎన్నికలలో మెజారిటీ ఓట్లు హిల్లరీ క్లింటన్‌కు ఎలక్ట్రొరల్‌ కాలేజీలో మెజారిటీ ట్రంప్‌కు వచ్చాయి. ఈ సారి కూడా అదే పునరావృతం అవుతుందన్నది ట్రంప్‌ శిబిరపు ప్రచారం. ఈ విశ్లేషణ పాఠకులకు చేరే సమయానికి పోలింగ్‌ చివరి దశలో ఉంటుంది. వెంటనే ఓట్లు లెక్కింపు ప్రారంభించినా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం లేదు.


ఇది రాసిన సమయానికి ముందస్తుగా వేసిన ఓటర్లు 9.95 కోట్ల మంది ఉన్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా అందే పోస్టల్‌, మెయిల్‌ ఓట్లను కలుపుకుంటే పది కోట్లు దాట వచ్చని అంచనా.ఇంకా 2.82 కోట్ల మెయిల్‌ బాలట్లు రావాల్సి ఉంది. అందువలన సరికొత్త రికార్డు నమోదు కానుంది. గత ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లతో పోలిస్తే ఇప్పటికే 73శాతం మంది ఓటు చేశారు. మొత్తం 15 కోట్ల మంది ఓటు హక్కువినియోగించుకోవచ్చని అంచనా. మంగళవారం నాడు వేసిన ఓట్లను తొలుత లెక్కిస్తారు. తరువాత ముందస్తు, పోస్టల్‌ ఓట్లను తీసుకుంటారు. ఇవి పెద్ద సంఖ్యలో ఉన్నందున లెక్కింపు పూర్తి కావటానికి చాలా రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు. తొలి ఓట్ల లెక్కింపులో మెజారిటీ వస్తే తాను గెలిచినట్లే అని వెంటనే ప్రకటిస్తానని, పోస్టల్‌ బ్యాలట్లను పరిగణనలోకి తీసుకోనని, లేనట్లయితే ఫలితాలను న్యాయస్ధానంలో సవాలు చేసేందుకు వెంటనే న్యాయవాదులతో సమావేశమౌతానని ట్రంప్‌ ప్రకటించాడు. ఓటర్ల తీర్పును మీరు గౌరవిస్తారా అంటే ముందుగా తాను ఆమాట చెప్పలేనని సెప్టెంబరులోనే ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ఒక పెద్ద కుంభకోణమని, పోస్టల్‌ బ్యాలట్లలో అక్రమాలు జరుగుతాయని పదే పదే చెప్పాడు. ఓడిపోతే వివాదాన్ని రేపాలనే ఆలోచన ట్రంప్‌కు ముందు నుంచి ఉన్నట్లు స్పష్టం. ప్రజాతీర్పును వమ్ము చేసే పక్షంలో సమ్మెకు దిగేందుకు సిద్దంగా ఉండాలని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన కార్మిక సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. అనేక చోట్ల ట్రంప్‌ మద్దతుదారులు అల్లర్లు,ఘర్షణలకు పాల్పడాలనే యత్నాల్లో కూడా ఉన్నారనే వార్తలు వచ్చాయి. అందువలన ఫలితం తేలటం ఒకటైతే దాని పర్యసానాల గురించి యావత్‌ ప్రంచం ఎదురు చూస్తోంది. ఇలాంటి పరిస్ధితి గతంలో అమెరికాలో తలెత్తినట్లు లేదు.


ఒక వేళ ట్రంప్‌ ఓటమిని అంగీకరించకపోతే ఏమిటన్న ప్రశ్న ముందుకు వచ్చింది. కరోనా కారణంగా పోలింగ్‌ తేదీన ఓటు వేయటానికి వచ్చేవారికంటే ముందుగానే ఓటు వేసే వారు ఎక్కువగా ఉంటారని ట్రంప్‌ ముందే గ్రహించాడు. కరోనాతో నిమిత్తం లేకుండా గత మూడు ఎన్నికల సర్వేలను చూసినపుడు ముందుస్తుగా ఓట్లు వేసిన వారిలో డెమోక్రాట్లకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ సారి కూడా వారిదే పైచేయి అని వార్తలు వచ్చాయి. అందుకే పోస్టల్‌ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని ట్రంప్‌ చెబుతున్నాడు. పోలింగ్‌ రోజు వేసినవే అసలైన ఓట్లు అంటున్నాడు.అయితే పోలింగ్‌ తరువాత అందిన పోస్టల్‌ ఓట్లను కూడా పరిగణించాలని సుప్రీం కోర్టు చెప్పింది. వీటిని పరిగణలోకి తీసుకోవటాన్ని రిగ్గింగ్‌ అని ట్రంప్‌ ఆరోపిస్తున్నాడు.
ట్రంప్‌ గనుక ఓడిపోతే పలుచోట్ల హింసాకాండ తలెత్తే అవకాశం ఉందని పది రోజుల ముందు ఒక నివేదిక వెలువడింది. పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగాన్‌, విస్కాన్సిన్‌, ఓరేగాన్‌ రాష్ట్రాలలో మితవాద మిలిటెంట్‌, సాయుధ గ్రూప్‌లనుంచి ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించింది. ఆ గ్రూప్‌లు ఇప్పటికే ఆందోళనలు, దాడులు ఎలా చేయాలో, ఎలా పోలీసులను తప్పించుకోవాలో శిక్షణ ఇచ్చాయి. మొత్తం 80 అలాంటి బృందాలను గుర్తించినట్లు నివేదికను తయారు చేసిన సంస్ధలు పేర్కొన్నాయి. వారు ఓటర్లను బెదిరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి శక్తులు అడ్డుకున్న కారణంగానే శుక్రవారం నాడు టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో డెమోక్రాట్‌ అభ్యర్ధి జోబిడెన్‌ ప్రచారం రద్దయింది. రిపబ్లికన్ల కంచుకోటగా చెప్పుకొనే ఇక్కడ ట్రంప్‌ స్వల్ప మెజారిటీతో ఉన్నాడని సర్వేలు వెల్లడించటంతో మద్దతుదారులు తెగబడ్డారు. బిడెన్‌ ప్రయాణిస్తున్న బస్‌, ఇతర వాహనాలను సాయుధులైన వ్యక్తులు చుట్టుముట్టారు. మరోవైపు ట్రంప్‌ ప్రచార పతాకాలతో ఉన్న అనేక వాహనాలు కూడా చుట్టుముట్టాయి. పోలీసులు జోక్యంతో బిడెన్‌ ముందుకు సాగాల్సి వచ్చింది. ఈ ఉదంతాల వెనుక ట్రంప్‌ కుమారుడు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న డెమోక్రాట్‌ అభ్యర్ధి కమలా హారిస్‌ ప్రచారం సందర్భంగా ట్రంప్‌ మద్దతుదారులందరూ రావాలని అతగాడు ముందురోజు పిలుపునిచ్చాడు. టెక్సాస్‌ ఇప్పటికీ ట్రంప్‌ కంచుకోట అని రుజువు చేయాలన్నాడు. బిడెన్‌ను అడ్డుకున్న వీడియోను ట్వీట్‌ చేస్తూ ఐ లవ్‌ టెక్సాస్‌ అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అంతకు ముందు ఒక ఆస్ట్రేలియన్‌ టీవి బృందాన్ని కూడా ట్రంప్‌ మద్దతుదారులు బెదిరించారు.
ట్రంప్‌ శ్వేతజాతి దురహంకారి మాత్రమే కాదు, మహిళా వ్యతిరేకి కూడా. విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని కెనోషా ఎన్నికల సభలో డెమోక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష పదవి అభ్యర్ధి కమలా హారిస్‌ గురించి మాట్లాడుతూ ఈ అద్బుతమైన మహిళ దేశ తొలి మహిళా అధ్యక్షురాలు కావాలని కోరుకొంటోది. అది జరుగుతుందని నేను అనుకోను. అందుకే మీరు అలసి నిద్రపోయే జోబిడెన్‌ కూడా ఓటు వేయవద్దు అని నోరుపారవేసుకున్నాడు.


ప్రతి పార్టీ తన స్వంత ఎన్నికల పరిశీలకులను ఏర్పాటు చేసుకోవటం తెలిసిందే. అయితే పరిశీలకుల పేరుతో ఏర్పాటు చేసే అనధికార శక్తులు ముఖ్యంగా అమెరికాలో మిలిటెంట్స్‌ బృందాలను ట్రంప్‌ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు. వారంతా ఎన్నికలను క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా పిలుపునిచ్చాడు. పరోక్షంగా డెమోక్రాట్‌ మద్దతుదార్లను అడ్డుకోమని చెప్పటమే. అలాంటి బృందం ఒకటి మిషిగన్‌ రాష్ట్ర డెమోక్రటిక్‌ పార్టీ గవర్నర్‌ వైట్‌మర్‌ను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించి అరెస్టయింది. పోలింగ్‌ బూత్‌లలో ఆయుధాలతో ప్రవేశాన్ని నిషేధించటమే దీనికి కారణంగా చెప్పారు. అయితే కోర్టు ఆయుధాలకు అనుమతి ఇచ్చింది.
పోలింగ్‌ కొద్ది సేపట్లో ప్రారంభం కానుండగా సిఎన్‌ఎన్‌ చివరి జోశ్యంలో బిడెన్‌కు 279, ట్రంప్‌కు 163 ఎలక్ట్రోరల్‌ ఓట్లు వస్తాయని పేర్కొన్నది. ఆరు రాష్ట్రాలలోని 96ఎలక్ట్రోరల్‌ ఓట్ల విషయంలో పోటాపోటీగా ఉన్నట్లు పేర్కొన్నది. ఎన్నికలను విశ్లేషించే వెబ్‌సైట్లలో ఒకటైన 538 చెప్పిన జోశ్యంలో బిడెన్‌కు విజయావకాశాలు నూటికి 89శాతం, ట్రంప్‌కు పదిశాతం ఉన్నట్లు పేర్కొన్నది. సెనెట్‌లో డెమోక్రాట్స్‌ మెజారిటీ సాధిస్తారని తెలిపింది. ప్రముఖ పత్రిక ఎకనమిస్ట్‌ అంచనా ప్రకారం బిడెన్‌కు 96శాతం విజయాకాశాలు ఉన్నాయని, 350 ఎలక్ట్రొరల్‌ కాలేజీ ఓట్లు వస్తాయని తెలిపింది.


భారతీయ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు ఝామున(నాలుగవ తేదీ) 5.30కు తూర్పు రాష్ట్రాలైన జార్జియా, ఇండియానా, కెంటకీ, వర్జీనియా, సౌత్‌ కరోలినా, వెర్‌మౌంట్‌లో పోలింగ్‌ ముగుస్తుంది. పశ్చిమ తీరంలోని రాష్ట్రాలలో 9.30కు పూర్తి అవుతుంది.అలాస్కా, అడక్‌ వంటి చివరి చోట్ల తరువాత పూర్తి అవుతుంది. ఆ తరువాతే లెక్కింపు ప్రారంభం అవుతుంది.
మైనే,నెబరస్కాలలో మినహా మిగిలిన రాష్ట్రాలలో మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధికి ఆ రాష్ట్రానికి నిర్దేశించిన అన్ని ఎలక్ట్రరల్‌ ఓట్లు వస్తాయి. ఉదాహరణకు కాలిఫోర్నియాకు ఉన్న 55 ఓట్లు అక్కడ మెజారిటీ ఓట్లు తెచ్చుకున్నవారికే మొత్తం జమ అవుతాయి. 2000 ఎన్నికలలో అల్‌గోర్‌, 2016లో హిల్లరీ క్లింటన్‌ దేశం మొత్తం మీద మెజారిటీ ఓట్లు తెచ్చుకున్నా ఎలక్ట్రరల్‌ ఓట్లు తెచ్చుకోవటంలో విఫలం కావటంతో ఓడిపోయారు.నవంబరు మూడున ఎన్నికలు జరిగిన తరువాత డిసెంబరు 14న ఎలక్ట్రరల్‌ కాలేజీ సభ్యులు అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. జనవరి ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు పార్లమెంట్‌ సమావేశమై ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన చేస్తుంది. జనవరి 20న నూతన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన వారు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.


తాను ఓడిపోయినట్లయితే అధికార మార్పిడి చేస్తానన్న హామీ ఇవ్వలేనని సెప్టెంబరు నెలలో ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసినదే. ఒక వేళ అదే జరిగితే ఏమిటి అన్న ప్రశ్న తలెత్తింది. ట్రంప్‌ ప్రకటన వివాదాస్పదం కావటంతో అధ్యక్ష భవనం పత్రికా అధికారి ఒక ప్రకటన చేస్తూ స్వేచ్చగా, న్యాయంగా జరిగిన ఎన్నికలను ట్రంప్‌ ఆమోదిస్తారు అని పేర్కొన్నది. డెమోక్రాట్లు మోసంతో మాత్రమే గెలుస్తారని ట్రంప్‌ పదే పదే ఆరోపించటం వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. ఓటమిని తిరస్కరిస్తే, దానికొనసాగింపుగా నూతన అధ్యక్ష పదవీ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తే నిజానికి ఏమీ కాదు. దిగిపోతున్న అధ్యక్షుడు చివరి ఉపన్యాసం చేయటం ఒక సాంప్రదాయం తప్ప నిబంధనేమీ కాదు. అవినీతి జరిగిందని ఆరోపించిన వారు ప్రతి ఒక్క ఓటూ అక్రమంగా పడిందని నిరూపిస్తే అది అప్పుడు ఎన్నికల ఫలితాలు మారతాయి తప్ప ప్రకటనలతో జరిగేదేమీ ఉండదు. అయితే రిపబ్లికన్లు అధికారంలో ఉన్నచోట ఫలితాలను కోర్టుల్లో సవాలు చేయటం తప్ప చేసేదేమీ ఉండదని చెబుతున్నారు. ఒక వేళ ఫలితాన్ని ప్రకటించే పార్లమెంట్‌ ఉభయ సభలు ఆపని చేయకపోతే వివాదం సుప్రీం కోర్టు ముందుకు వెళుతుంది.అది జరుగుతుందా ? అలాజరిగిన ఉదంతం గతంలో లేదు. అదే జరిగితే గనుక ఆసక్తికరమనే చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత నావను నరేంద్ర మోడీ ఎటు నడిపిస్తున్నారు ? ఏమి కానుంది ?

02 Monday Nov 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BECA, BECA agreement, Narendra Modi, Quadrilateral Security Dialogue, R&D China and India


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ అత్యధికంగా అమెరికాను ఆరుసార్లు సందర్శిస్తే ఫ్రాన్స్‌,రష్యా, చైనా ఐదుసార్లు వెళ్లారు. చైనా అధినేత గ్జీ జింపింగ్‌ను పద్దెనిమిది సార్లు కలిసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు అదే చైనా తన ప్రధమ శత్రువు అన్నట్లుగా ఇంటా బయటా కనిపించేందుకు తాపత్రయ పడుతున్నారు. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తా వ్యాఖ్యలను చూస్తే దేశాన్ని మరింతగా ఇబ్బందుల్లోకి నెడుతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. రాజకీయంగా భవిష్యత్‌ ఏమిటన్నది మోడీ, బిజెపికి సంబంధించిన అంశాలు. కానీ వాటితో యావత్‌ దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టటమే ఆందోళన కలిగించే అంశం. కొందరికి మోడీ, బిజెపి చర్యల్లో ఆకాశమంత దేశభక్తి, వాటిని విమర్శించే వారిలో పాతాళమంత దేశద్రోహం కనిపించవచ్చు. సామాజిక మాధ్యమంలో కాషాయ తాలిబాన్లు, వారి ప్రచారానికి ప్రభావితులైన వారిలో యుద్దోన్మాదం కనిపిస్తోంది. చలి కాలం వచ్చింది గానీ లేకపోతేనా…. అన్నట్లు కబుర్లు చెబుతారు. చైనా, పాకిస్ధాన్‌ మీద ఒకేసారి పోరాడి విజయం సాధించగల సత్తాను నరేంద్రమోడీ దేశానికి సమకూర్చారన్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో భావోద్వేగాలకు గురికాకుండా కొన్ని అంశాలను పరిశీలించుదాం.


సామాజిక మాధ్యమాల్లో కొంత మంది కౌటిల్యుడు లేదా చాణక్యుడు చెప్పాడంటూ కొన్ని అంశాలను చెబుతుంటారు. సన్‌ జు చైనా కౌటిల్యుడిగా పరిగణిస్తారు. ఎవరితో, ఎలా , ఎప్పుడు యుద్దం చేయాలి అన్న ప్రశ్నకు – ఇరు పక్షాలూ సమంగా ఉంటే మనం యుద్దానికి సై అనవచ్చు. మన సంఖ్య తక్కువగా ఉంటే శత్రువుకు దూరంగా ఉండాలి, ఏ విధంగా చూసినా తక్కువే అయితే మనం అతన్నుంచి దూరంగా పోవాలి. శత్రువు గురించి తెలిస్తే నీ గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి, ఒక వంద యుద్దాల ఫలితాల గురించి నువ్వు భయపడాల్సిన పనిలేదు. నీ గురించి నీకు తెలిసినా శత్రువు గురించి తెలియకపోతే నువ్వు సాధించిన ప్రతి విజయం వెనుక ఒక పరాజయం వస్తుంది. నీ గురించి నీకు , శత్రువు గురించి తెలియకపోయినా ప్రతి పోరులోనూ ఓటమే. పోరు సలపకుండానే శత్రువును అదుపులోకి తీసుకోవటం ఉన్నతమైన యుద్ద కళ.నువ్వు అన్ని యుద్దాలలోనూ పోరాడటం, గెలవటం కాదు, ఎలాంటి పోరు లేకుండానే శత్రువు ప్రతిఘటనను దెబ్బతీయటం ఉన్నత మేథాశక్తికి నిదర్శనం.- అన్నది సన్‌ జు నీతి సారాంశం.

కౌటిల్యుడు చెప్పిందేమంటే -శత్రువు బలవంతుడు అయితే అతని సలహాలను అనుసరించవచ్చు, అతను బలహీనుడు అయితే దెబ్బతీయాలి.ఒక వేళ సమానుడు అయితే బలంతో లేదా స్నేహంతో అతన్ని అదుపులో ఉంచాలి. దాడి చేసే వారు తన, శత్రువు బలం,బలహీనతలు, లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి, ముందుకు సాగబోయే ముందు నిర్దారించుకోవాలి. తరువాత పూర్తి స్ధాయిలో ముందుకు పోవాలి, లేనట్లయితే మౌనంగా ఉండాలి. ద్వేషం తర్కబద్దమైన ఆలోచననను అంతం చేస్తుంది,కనుక శత్రువు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అతన్ని ప్రేమించేందుకు ప్రయత్నించు. సంధించిన బాణం ఎదుటి వ్యక్తిని సంహరించవచ్చు, లేకపోవచ్చు. తెలివిగల వాడి తంత్రం గర్భంలో ఉన్నవారిని కూడా అంతం చేస్తుంది. నేనయితే సాయుధ పోరును సూచించను, లక్ష్య సాధనకు కుట్ర, తంత్రం, మోసం వంటి సైనికేతర చర్యలన్నింటినీ ప్రయోగించవచ్చు. చైనా ఏం చేస్తోందన్నది ముఖ్యం కాదు, మనం కౌటిల్యుడు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామా ?


చైనా పెట్టుబడులు, అమెరికా మిలిటరీ ఆయుధ సంపత్తి, ప్రాంతీయ శక్తి – మూడింటిని కలిగి ఉండటం మోడీకి సాధ్యమేనా అనే శీర్షికతో యూరేసియా టైమ్స్‌ పత్రిక ఒక విశ్లేషణను ప్రచురించింది. దాని సారాంశం ఇలా ఉంది. సరిహద్దులలో చైనాతో ఘర్షణలను ప్రపంచమంతా ఆసక్తితో చూస్తోంది. భారత్‌ గనుక వెనుకా ముందాడుతుంటే చైనా విస్తరణ చర్యల అజెండాను నిలిపివేసేందుకు జరిపే ప్రయత్నాలకు హాని మరియు నష్టం జరుగుతుందని అర్ధం చేసుకోవాలని అమెరికా నేతలు భారత్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాతో భారత్‌ వాణిజ్యం కొనసాగుతూనే ఉంది. ఎగుమతులు- దిగుమతులపై లడఖ్‌ వివాదం పరిమితంగా లేదా అసలేమీ ఉన్నట్లు కనిపించటం లేదు. ఆ ఉదంతం తరువాత చైనా వస్తువులను బహిష్కరించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో రసాయనాలు, ఎలక్ట్రికల్‌ మరియు వైద్య పరికరాల దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. మోడీ సర్కార్‌ అనేక చైనా యాప్‌లను నిషేధించినప్పటికీ అవి కేవలం పరువు కాపాడుకొనే చర్యలు మాత్రమే. అనేక రంగాలలో బిలియన్ల డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. వేలాది అంకుర సంస్ధలు చైనా పెట్టుబడులతో విజయాలు సాధిస్తున్నాయి. సరిహద్దు వివాదం కొనసాగుతున్నప్పటికీ ఆయుధాలు తప్ప దాదాపు అన్నింటికీ చైనా మీద ఆధారపడుతున్నది.
నరేంద్రమోడీ చైనా విధానాన్ని చూస్తే ఒక మార్గంలో పయనిస్తున్నట్లు కనిపించటం లేదు, తరువాతేమి చేస్తారో అంచనాకు అందటం లేదు. ఇది నరేంద్రమోడీకి ఒక విచిత్రమైన పరిస్ధితిని తీసుకు వచ్చింది. చైనాతో సంబంధాలను పూర్తిగా బహిష్కరించలేరు లేదా యుద్ధాన్ని ఎంచుకోలేరు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించేందుకు చైనా కరాఖండిగా తిరస్కరించటం భారత ప్రభుత్వానికి విషయాలను కష్టతరంగా మార్చింది. ఈ వివాదాన్ని తొలుత భారతే ప్రారంభించిందని, ఆర్టికల్‌ 370 , కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించటమే రెండు దేశాల మధ్య వివాదాంశంగా కనిపిస్తున్నది. చైనాతో ఘర్షణ పడటం లేదా సంబంధాలను మెరుగుపరచుకోవటమా అన్నది మోడీ సర్కార్‌ తేల్చుకోవాలి. ఇటు చూస్తే గొయ్యి అటు చూస్తే నుయ్యి అన్నట్లుగా ప్రభుత్వం మధ్యలో ఇరుక్కుపోయింది. చైనా డిమాండ్లకు అంగీకరించితే అంతర్గతంగా పరువు పోతుంది. ఒప్పుకోకపోతే వివాదం మరింత దిగజారే ముప్పు ఉంది. అమెరికా కూటమితో మరింతగా దగ్గరయ్యే క్రీడను నరేంద్రమోడీ ఆడుతున్నందున భారత్‌కు విషయాలు మరింత సంక్లిష్టం కావటం తప్ప మరొకటి జరగదు. ఈ విపత్కర పరిస్ధితి నుంచి మోడీ భారత్‌ను ముందుకు నడిపించగలరా ?


అదే యూరేసియా టైమ్స్‌ మరో విశ్లేషణలో మూడు సంవత్సరాల క్రితం డోక్లాంలో అత్యంత శక్తివంతమైన చైనాకు భారత్‌ చిల్లు పెట్టింది లేదా గాలి తీసింది అన్నది ఒక అవాస్తవం అని అమెరికా గూఢచార నివేదిక నిర్ధారించింది అని పేర్కొన్నారు. భూటాన్‌లోని డోక్లాం ప్రాంతంలో 2017లో రెండు దేశాల సేనలు 75 రోజుల పాటు ముఖాముఖీ తలపడిన విషయం తెలిసిందే. దుందుడుగా వ్యవహరించిన చైనా మిలిటరీకి షాక్‌ తగిలే విధంగా భారత్‌ వ్యవహరించిందని విశ్లేషకులు అప్పుడు పేర్కొన్నారు. అయితే డోక్లాం ఉదంతంలో గట్టి పాఠం నేర్చుకున్న చైనా ఆ ప్రాంతంతో పాటు వాస్తవాధీన రేఖ సమీపంలో అదనపు మిలిటరీ నిర్మాణాలను చేపట్టిందని భూ రాజకీయ గూఢచార వ్యవహారాల మీద అధ్యయనం చేసే అమెరికా సంస్ధ స్ట్రాట్‌ఫర్‌ వెబ్‌ సైట్‌ ఒక విశ్లేషణలో పేర్కొన్నది. గత మూడు సంవత్సరాలలో భారత సరిహద్దులో చైనా తన వైమానిక స్ధావరాలు, వైమానిక రక్షణ కేంద్రాలు, హెలిపోర్టులను రెట్టింపు చేసింది. కొత్తగా పదమూడు మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా మూడు వైమానిక స్ధావరాలు, ఐదుశాశ్వత వైమానిక రక్షణ కేంద్రాలు, ఐదు హెలిపోర్టుల నిర్మాణం ప్రారంభించింది. లడఖ్‌ ఘర్షణ ప్రారంభమైన తరువాతే నాలుగు హెలిపోర్టుల నిర్మాణం ప్రారంభమైనట్లు అంతరిక్ష చిత్రాలు, ఇతర సమాచారం తెలుపుతున్నది. దక్షిణ చైనా సముద్రంలో చైనా శాశ్వత మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేయటం ద్వారా తన స్దానాన్ని పటిష్ట పరచుకుంది. ఇదే వ్యూహాన్ని భారత సరిహద్దులో కూడా అనుసరిస్తున్నదని విశ్లేషకుడు పేర్కొన్నారు.


చైనా, ఇతర ఇరుగు పొరుగుదేశాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకొనేందుకు, ఇతర అవసరాల కోసం అమెరికాతో మన దేశం అనేక ఒప్పందాలు చేసుకున్నది. అదేమీ ఉచితం కాదు. ఆ రంగంలో మనం ఉంటే అమెరికాతో ఒప్పందంతోనే పని లేదు, కనుక మూల్య రూపం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సరిగ్గా ఇదే సమయంలో చైనా అలాంటి సమాచారాన్ని సేకరించేందుకు మూడు స్వంత మిలిటరీ యావోగాన్‌ ఉపగ్రహాలను ప్రారంభించింది. యావోగాన్‌ పేరుతో ఉపగ్రహాల ప్రయోగం 2006 నుంచి జరుగుతోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా, దాని మిత్ర దేశాల కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నౌకల నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణుల వ్యవస్ధలను దెబ్బతీసేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని చైనా సమకూర్చుకుంటోంది. సముద్రాలలో ఉన్న యుద్ద నౌకలు విడుదల చేసే రేడియో, ఎలక్ట్రానిక్‌ సంకేతాల(సిగల్స్‌)ను పసిగట్టటంతో పాటు అవి వెలువడుతున్న ప్రాంతాలను స్కాన్‌ చేసి యుద్ద నావల సంచారాన్ని పసిగడతాయి. ఈ ఉపగ్రహాల ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించి శత్రు యుద్ద నావల మీద క్షిపణులతో ఏ లక్ష్యంపై అయినా కేవలం 40 నిమిషాల్లో దాడి చేయవచ్చని చైనా నిపుణులు చెబుతున్నారు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ఒక వేళ అమెరికా అందచేసిన ఆయుధాలతో కవ్వింపులు, దాడులకు తెగబడితే దానికి మద్దతుగా దక్షిణ చైనా సముద్రంలో సంచరించే అమెరికా యుద్ద నౌకలను ముందుగా అడ్డుకోవాలన్నది చైనా ఎత్తుగడ. గత ఏడాది అక్టోబరు నాటికి అంతరిక్షంలో యావోగాన్‌-30 రకం ఉపగ్రహాలు పదిహేను ఉన్నాయి. తాజాగా ప్రయోగించినవి దాదాపు ప్రపంచమంతటినీ చుట్టి సమాచారాన్ని సేకరిస్తాయి. ఇలాంటి సమాచారాన్ని తాము భారత్‌కు అందచేస్తామని అమెరికా చెబుతోంది. ఇటీవల దానితో సంతకాలు చేసిన బెకా ఒప్పంద సారం అదే.


గాల్వాన్‌ లోయ ఉదంతం తరువాత తూర్పు సరిహద్దులో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌కు 160 కిలోమీటర్ల దూరంలో టిబెట్‌లోని చామడో బంగడా విమానాశ్రయాన్ని చైనా విస్తరిస్తున్నట్లు ఉపగ్రహచిత్రాలు చూపుతున్నాయి. ఈ చిత్రాలను పొరుగు సేవల పద్దతిలో సొమ్ము చెల్లించి ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఇటీవలి కాలంలో మన మీడియాలో వస్తున్నవి అవే. సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో ఉన్న బంగడా విమానాశ్రయంలో రెండు రన్‌వేలు ఉన్నాయి. ఒకదానిలో రాకపోకలు నడుస్తున్నాయి, విదేశీ పౌరులకు వాటిలో ప్రవేశం లేదు. రన్‌వేకు ఒక వైపు మిలిటరీ తరహా నిర్మాణాలు ఉన్నట్లు , గాల్వాన్‌ ఉదంతం తరువాతే ఇవి ఏర్పాటయినట్లు మీడియా విశ్లేషకులు రాస్తున్నారు. అరుణాచల్‌ సరిహద్దులో కనీసం నాలుగు చోట్ల ఆగస్టు-సెప్టెంబరు నుంచి చైనా మిలిటరీ మోహరింపు కనిపిస్తున్నదని చైనా నిపుణుడు కలపిట్‌ ఏ మనికికార్‌ చెప్పారు. సరిహద్దుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో చైనా మిలిటరీ ఉందని, భారత్‌ మీద వత్తిడిని పెంచే ఎత్తుగడ కావచ్చని అన్నారు.
అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌ దక్షిణ ప్రాంతమని చైనా చెబుతున్నది. 1962 యుద్దంలో ఆ ఏడాది అక్టోబరు 20న చైనా మిలిటరీ అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది, వాటిలో తవాంగ్‌ పట్టణం ఉంది, అసోంలోని తేజ్‌పూర్‌ పట్టణం వరకు చైనా సేనలు వచ్చాయి. అయితే నవంబరు 20 తరువాత చైనా తనంతట తానే వెనక్కు తగ్గి వాస్తవాధీన రేఖ వెనక్కు వెళ్లిపోయింది. చైనా ఇప్పటికీ అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని గుర్తించటం లేదు. ఈ కారణంగానే దలైలామా తవాంగ్‌ పట్టణాన్ని సందర్శించేందుకు నిర్ణయించుకున్నపుడు అభ్యంతరం తెలిపింది.

ప్రతి దేశం చిన్నదా పెద్దదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఇప్పుడున్న స్ధితిలో రక్షణ ఏర్పాట్లు చేసుకోవటం అవసరం. దానికి మన దేశం మినహాయింపు కాదు. దానికి హడావుడి, రాజకీయ ప్రచారం చేసి ఇతర దేశాలను రెచ్చగొట్టాల్సిన, మనలను అనుమానించే స్ధితిని కల్పించాలని కౌటిల్యుడు చెప్పలేదు. రెండవ ప్రపంచ యుద్దంలో అవసరం లేకపోయినా జపాన్‌పై అణుబాంబులు వేశారు. అమెరికన్లు ప్రపంచాన్ని భయపెట్టి లొంగదీసుకొనేందుకు అమలు జరిపిన యుద్ద తంత్రం తప్ప మరొకటి కాదు. తరువాత మనతో సహా అనేక దేశాలు అణ్వాయుధాలను తయారు చేశాయి. అణువిద్యుత్‌ కేంద్రాలు కలిగిన ప్రతి దేశం అణుబాంబుతయారీకి దగ్గరలో ఉన్నట్లే లెక్క.


చాణుక్యుడు, సన్‌ జు చెప్పినట్లు ఎన్ని దేశాలు వ్యవహరిస్తున్నాయి ? నీ శత్రువు శత్రువు నీకు మిత్రుడు అన్న నీతి తెలిసిందే. ఆ మేరకే చైనాకు వ్యతిరేకంగా అమెరికా, ఇతర దేశాలతో మనం చేతులు కలుపుతున్నట్లు సమర్ధించుకోవచ్చు. దానిద్వారా వచ్చే లాభాలతో పాటు నష్టాలు, సమస్యలను కూడా బేరీజు వేసుకోవాలి. చాణుక్యుడు చెప్పింది అదే. కాశ్మీర్‌ను ఆక్రమించిన కారణంగా పాకిస్ధాన్‌ మనకు శత్రువుగా మారింది. అలీన విధానం అనుసరిస్తూ అంతర్జాతీయ పరిణామాల్లో అనేక విషయాల్లో మనం అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకున్నాం. దానికి ప్రతిగా పాకిస్ధాన్‌న్ను ప్రోత్సహించి మన దేశం మీద అమెరికా ఎన్నికుట్రలు చేసిందీ, కాశ్మీర్‌, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఎంత నష్టపరచిందీ చూశాము. ఎప్పుడైతే మనం అమెరికాకు దగ్గర అయ్యామో, విస్తారమైన మన మార్కెట్‌ను ఎప్పుడు తెరిచామో, దాని ఆయుధాలను -ఇటీవలి కాలంలో చమురును సైతం – కొనటం ఎప్పుడైతే ప్రారంభించామో దానికి పాక్‌తో పని లేదు. కానీ జరిగిందేమిటి ? తమను ఉపయోగించుకొని వదలివేసిందన్న దుగ్ద పాక్‌లో తలెత్తి చైనాకు దగ్గర అయింది.

శత్రువులను పెంచుకున్న వారు తెలివైన రాజనీతిజ్ఞులు కాదు. అమెరికా అండ చూసుకొని మన యుద్ద ప్రేలాపనలు ఎంతవరకు పోయాయంటే ఒకేసారి రెండున్నర యుద్దాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సైనికాధికారి బిపిన్‌ రావత్‌ లడఖ్‌ ఉదంతాలకు ఎంతో ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా వంటి అగ్రరాజ్యమే బస్తీమే నిరంతరం ఎక్కడో ఒక చోట యుద్దం చేసింది తప్ప ఒకేసారి అనేక యుద్దాలు చేయలేదు.రెండున్నర యుద్దాలు అంటే చైనా, పాకిస్ధాన్‌, ఉగ్రవాదుల మీద అని అర్ధం.ఉగ్రవాదాన్ని అణచేందుకే కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చామని, మిలిటరీకి అధికారాలు ఇచ్చామని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఏడాది కాలంలో ఉగ్రదాడుల్లో 54 మంది పౌరులు మరణించగా కేంద్రపాలనలోకి వచ్చిన ఏడాది కాలంలో 45 మంది మరణించారు. దీన్ని బట్టి ఏం జరుగుతోందో ఎవరికి వారు అంచనా వేసుకోవచ్చు.


రామ-రావణ యుద్దంలో లంకకు వారధి నిర్మాణంలో ఉడుత సాయం కథ తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్నదేమిటి ? మన ఇరుగుపొరుగున ఉన్న దేశాలో నేపాల్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక ఒక్కటీ మనకు స్నేహంగా లేదు. అమెరికా అండ చూసుకొని ఈ దేశాలను విస్మరించాము. తద్వారా వాటిని చైనాకు దగ్గర చేయటం రాజనీతా, తెలివిగల వ్యవహారమా ? పశ్చిమాసియాలో సైనికంగా బలమైన దేశాల్లో ఇరాన్‌ ఒకటి. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా అది చైనా వైపు మొగ్గింది. దాంతో అమెరికా ఆంక్షలను మరింత పెంచి మనలను కూడా బెదిరించగానే దాన్నుంచి చమురు కొనటం ఆపేశాము. దాంతో వారు చైనాకు మరింత దగ్గరయ్యారు, అసలేమి చేస్తున్నామో, పర్యవసానాలేమిటో అర్ధం అవుతోందా ? బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ఇరాన్‌, పాకిస్ధాన్‌, శ్రీలంక, మయన్మార్‌, బంగ్లాదేశ్‌ ఏవీ మనకు మిత్రదేశాలుగా లేవు.

మనం ఫ్రాన్స్‌ నుంచి రాఫెల్‌ యుద్ద విమానాలు తెచ్చుకున్నాం. అవి అధిక ధరలకా, దానిలో ముడుపులున్నాయా లేదా అన్నది- ఉంటే ఏదో ఒక రోజు బయటపడకపోదు- కాసేపు పక్కన పెడదాం. మరోవైపు వాటితో సమంగా లేదా కాస్త ఆధునికమైన విమానాలను స్వంతంగా తయారు చేసుకొనే స్ధితిలో చైనా ఉంది. మనం ఆ రంగంలో ఎంతో వెనుకబడి ఉన్నాం కనుకనే మనకు విమానాలు అమ్మే దేశాలన్నీ చైనాకు వ్యతిరేకంగా మనలను ఎగదోస్తున్నాయి. భారత్‌ గనుక తాను తయారు చేస్తున్న 114 ఎఫ్‌ 21 రకం విమానాలను కొనేందుకు అంగీకరిస్తే ఇతర దేశాలకు వాటిని విక్రయించబోనని అమెరికా లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ చెప్పింది. ఎంతకాలం ఇలా విదేశాల మీద ఆధారపడి ఆయుధాలు కొనగలం? ఇక్కడ సమస్య మనం విమానాలను ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం అన్నది. పరిశోధన-అభివృద్దికి నిధులు కేటాయిస్తే ఏదీ అసాధ్యం కాదు. మనకేమీ నిపుణులు తక్కువ లేరు. యాభై ఏండ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసిన తప్పిదాలన్నింటినీ ఐదేండ్లలో తాను సరి చేశానని నరేంద్రమోడీ దళం చెప్పుకుంటుంది. మరి పరిశోధనా-అభివృద్ధి రంగంలో చేసిందేమిటి ?


యునెస్కో సమాచారం ప్రకారం 1996-2018 మధ్య మన దేశంలో పరిశోధన-అభివృద్ధికి చేసిన ఖర్చు జిడిపిలో 0.639 – 0.65 శాతం మధ్య ఉంది. మధ్యలో 2008లో 0.859 శాతానికి పెరిగి క్రమంగా దిగజారింది. దీనికి కారణం నరేంద్రమోడీ తప్ప నెహ్రూ కాదు కదా ! ఇదే కాలంలో చైనా కేటాయింపు 0.563 శాతం నుంచి 2.186శాతానికి పెరిగింది. 2017-18 ఆర్ధిక సర్వేలో పరిశోధన రంగానికి నిధులు రెట్టింపు చేయాలని పేర్కొన్నారు. ఆ జాడలు ఎక్కడా లేవు. ప్రపంచంలో పరిశోధన-అభివృద్ధికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్న దేశాలలో అమెరికా తరువాత చైనా ఉంది. 2020 నాటికి తన జిడిపిలో రెండున్నర శాతం ఖర్చు చేయాలన్న లక్ష్యానికి 2.23శాతంతో చైనా దగ్గరలో ఉంది. అమెరికా 2018లో 2.83శాతం ఖర్చుచేసింది. ఓయిసిడి దేశాల సగటు ఖర్చు 2.38, ఇజ్రాయెల్‌ 4.9, దక్షిణ కొరియా 4.5శాతం ఖర్చు చేశాయి.
చైనా గత రెండు ద శాబ్దాలుగా ఖర్చు చేసిన ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నది. అన్ని రంగాలలో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో ధీటుగా ఉంది. గతంలో ఆయుధాలను దిగుమతి చేసుకొనేదిగా ఉన్న దేశం నేడు తొలిసారి ఎగుమతులను ప్రారంభించింది. సైంటిఫిక్‌ జర్నల్స్‌లో ఆయా దేశాలకు చెందిన వారు సమర్పించిన పత్రాల సమీక్షలో చైనా 19.9శాతంతో ప్రధమ స్ధానంలో ఉండగా అమెరికా 18.3శాతంతో ద్వితీయ స్ధానంలో ఉంది. 2016-18 సంవత్సరాల మధ్య చైనా సగటున ఏడాదికి 3,05,927, అమెరికా 2,81,487 శాస్త్ర పత్రాలను ప్రచురించగా 67,041 పత్రాలతో (4.4శాతం) జర్మనీ మూడవ స్ధానంలో ఉంది. నల్లమందు భాయీలని ప్రపంచంలో ఒకనాడు అవమానాలు పొందిన చైనీయులు ఇప్పుడు నవతరం భాయీలని రుజువు చేసుకుంటున్నారు.


పరిశోధన-అభివృద్ధి రంగంలో పెడుతున్న భారీ ఖర్చు కారణంగా 2018లో ప్రపంచ వ్యాపితంగా పేటెంట్లకు దరఖాస్తు చేసిన వారిలో చైనీయులు 49శాతం ఉన్నారు. గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పరిశోధన గురించి కబుర్లు చెప్పటం తప్ప తీసుకుంటున్న చర్యలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయి. వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. మన సంస్కృత గ్రంధాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మొత్తం నిక్షిప్తమై ఉందని చెబుతారు. వాటిని చదివే అమెరికా నాసా, ఇతర సంస్దలు పరిశోధనల్లో ముందున్నాయని, చివరికి కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ను కూడా రాస్తున్నాయనే పోసుకోలు కబుర్లతో వాట్సాప్‌ను నింపివేస్తున్నారు. అదేపని మనం ఎందుకు చేయటం లేదు ?


చైనా విజయాల గురించి నమ్మని వారిని ఏమీ చేయలేం. సంస్కృత గ్రంధాల్లో అన్నీ ఉన్నాయని చెప్పే పండితులు వాటిని వెలికి తీసి దేశానికి ఎందుకు మేలు చేయరు, ఎంతో డబ్బు మిగులుతుంది, ప్రయోజనం కలుగుతుంది కదా ? గోమూత్రం తాగే వారిని తాగనిద్దాం-దేశానికి నష్టం లేదు. గోమూత్రంలో బంగారం దాగుందని, పేడకు ఆరోగ్యం అంటుకొని ఉందని చెప్పే వారిని వారి లోకంలోనే ఉండనిద్దాం. శాస్త్రీయ ఆలోచనలను అణగదొక్కవద్దు. మేలు చేయకపోయినా కీడు చేయకూడదు ! గతంలో జరిగిందాన్ని పునరావృతం కానివ్వొద్దు. దేశాన్ని, సమాజాన్ని మరింతగా వెనక్కు నెట్టే యుద్దం అసలే వద్దు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత్‌ బెకా ఒప్పందం – అమెరికా కూటమికి గ్జీ జింపింగ్‌ హెచ్చరిక !

27 Tuesday Oct 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

BECA, BECA agreement, Quad, Quadrilateral Security Dialogue, Xi Jinping warning to US and its allies


ఎం కోటేశ్వరరావు


ఉపగ్రహాల ద్వారా సేకరించే భౌగోళిక, ఇతర సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకొనేందుకు ఉద్దేశించిన -బెకా- ఒప్పందం మీద భారత్‌- అమెరికాలు సంతకాలు చేశాయి. రెండు దేశాల మిలిటరీ, ఇతర సంబంధాలలో దీన్నొక మలుపుగా పరిగణిస్తున్నారు. సులభ భాషలో చెప్పాలంటే ఇప్పటి వరకు అమెరికా మనకు అనధికారికంగా అందచేస్తున్న సమాచారాన్ని మరింత వివరంగా అధికారికంగా అంద చేయనుంది. లడఖ్‌ సరిహద్దుల్లో చైనా కదలికల గురించి ఇప్పటి వరకు మీడియాకు అందచేసిన సమాచారం, చిత్రాలు, భాష్యాలు అన్నీ కూడా అమెరికా సంస్ధలు అందచేసినవే అన్నది తెలిసిందే. ఏదీ ఊరికే రాదు అన్నట్లుగా అమెరికా నుంచి పొందే సమాచారానికి మనం ఏ రూపంలో ప్రతిఫలం లేదా మూల్యం చెల్లించాల్సి ఉంటుందో వెల్లడికావాల్సి ఉంది. బెకా ఒప్పందం గురించి చాలా కాలంగా రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో అమెరికాతో మన మిలిటరీ బంధానికి మరో ముడి పడుతుంది.

మాతో పెట్టుకుంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ తీస్తాం జాగ్రత్త. ఇదీ చైనా అధినేత గ్జీ జింపింగ్‌ చేసిన తాజా హెచ్చరిక. పరస్పర ప్రయోజనాలు ఇమిడి ఉన్న నౌకా సంబంధ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యల సమన్వయం, సజావుగా సాగే సరఫరా వ్యవస్ధలు, మానవతా పూర్వక మరియు ప్రళయాలు సంభవించినపుడు సాయం కోసం అనే పేరుతో అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా, భారత్‌ ఒక చతుష్టయ లేదా చతుర్భుజ (క్వాడ్‌) కూటమిగా మరింత ముందుకు పోయేందుకు నిర్ణయించుకున్న నేపధ్యంలో గ్జీ ఈ హెచ్చరిక చేశారు. ఒక దేశం పేరు పెట్టి అనకపోయినా నాలుగుదేశాలు, ప్రత్యేకించి అందరినీ కూడగడుతున్న, రెచ్చగొడుతున్న అమెరికా గురించి అన్నది స్పష్టం.


ఏదో ఒక సాకుతో చైనాను రెచ్చగొడుతున్న అమెరికా దక్షిణ చైనా సముద్రంలో తన యుద్ద నౌకల విన్యాసాలు జరుపుతున్నది. ఇటీవలి కాలంలో చైనా మీద నెపం మోపేందుకు లడఖ్‌లో జరిగిన పరిణామాలను పదే పదే ఉదహరించటం తప్ప మరొకటి లేదు. మీరు చైనా మీదకు దూకండి మీ వెనుక మేము ఉన్నాం అంటూ మన దేశాన్ని పురికొల్పుతున్నది. నాలుగుదేశాల కూటమిని మిత్ర చతుష్టయంగా పిలుస్తున్నారు. అయితే ఇది దుష్ట చతుష్టయం అని చైనా పరిగణిస్తున్నది. బహుశా ఆప్రచార ప్రభావం లేదా అంతర్గతంగా జరుగుతున్న చర్చల సారం కావచ్చు ఉత్తర ప్రదేశ్‌ బిజెపి అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ పాకిస్ధాన్‌, చైనాలతో యుద్దానికి ప్రధాని నరేంద్రమోడీ తేదీని కూడా ఖరారు చేశారని చెప్పినట్లు సాక్షాత్తూ ఆర్నాబ్‌ గోస్వామి రిపబ్లికన్‌ టీవీ పేర్కొన్నది. అతగాడేమీ గల్లీ నేత కాదు, ఆ వార్తను ప్రసారం చేసిన టీవీ బిజెపి అనధికారవాణి తప్ప మరొకటి కాదు. సామాజిక మాధ్యమంలో కాషాయ దళాల యుద్ద ప్రేలాపనల గురించి చెప్పనవసరం లేదు.

కొరియా ఆక్రమణకు పూనుకున్న అమెరికన్లను ఎదిరించి చైనా సాధించిన విజయానికి 70 ఏండ్లు నిండిన సందర్భంగా అక్టోబరు 23వ తేదీన బీజింగ్‌ గ్రేట్‌ హాల్‌ సభలో సుత్తి లేకుండా సూటిగానే పరోక్షంగా అమెరికా కూటమిని గ్జీ హెచ్చరించాడు. సరిగ్గా అదే సమయంలో తమ భూ భాగమైన తైవాన్‌ గగన తలం మీద అమెరికా గూఢచార విమానం సంచరించినట్లు రుజువైతే తమ మిలిటరీ జట్లను పంపుతామని చైనా హెచ్చరిక చేసింది. అబ్బే ఆ వార్తల్లో నిజం లేదని 24వ తేదీన అమెరికా పసిఫిక్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రజా సంబంధాల అధికారి లెప్టినెంట్‌ కల్నల్‌ టోనీ విక్‌మాన్‌ ప్రకటన చేశాడు.


ఏ చిన్న ఉదంతం జరిగినా పరిణామాలు ఏ విధంగా మారతాయో తెలియని స్ధితి ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్నదని చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు. ఒక వేళ ఆ ఉదంతం జరిగితే ఎంత తీవ్ర పరిణామాలు జరుగుతాయో అమెరికా, దానితో చేతులు కలిపిన తైవాన్‌ యంత్రాంగం గ్రహించిదనేందుకు చిహ్నం అమెరికా ప్రకటన. ప్రధాన భూభాగంలో తైవాన్‌ విలీనం శాంతియుతంగా జరగాలితప్ప సైనిక బలంతో కాదని, తొలి తూటా పేలుడు తమ వైపు నుంచి ఉండదన్నది ఏడు దశాబ్దాలుగా చైనా ప్రభుత్వ వైఖరి. అయితే అమెరికన్లు తైవాన్‌లో తిష్టవేసి రచ్చ చేస్తే అవసరమైతే సైనిక చర్య తప్పదని చైనా హెచ్చరిస్తున్నది. అమెరికా విమానం తైవాన్‌ గగన తలం మీదుగా ఎగిరిందా లేదా ఆ వార్త కల్పితమా నిజమా అన్నది నిర్దారణ కాలేదు. ఒక వేళ ఎగిరితే అది చైనా సార్వభౌమత్వాన్ని ధిక్కరించటమే. అదే జరిగితే అమెరికా విమానాలను తరిమేందుకు చైనా మిలిటరీ జట్లు సిద్దంగా ఉంటాయి. తైవాన్‌ దీవి చైనా ప్రధాన భూ భాగానికి తూర్పున 161కిలోమీటర్ల దూరంలో దక్షిణ చైనా సముద్రంలో ఉంది. కొద్ది వారాల క్రితం చైనా ఆ ప్రాంతంలో నౌకా విన్యాసాలు జరపటంతో పాటు తూర్పు తీరంలో తైవాన్‌ వైపు గురిపెట్టి అనేక ఆధునిక క్షిపణులను చైనా మిలిటరీ మోహరించింది.


కొరియా యుద్దంలో చైనా విజయానికి 70 ఏండ్లు నిండిన సందర్భంగా గ్జీ చేసిన హెచ్చరిక ఒక్క అమెరికాకు మాత్రమే కాదు, తమకు వ్యతిరేకంగా కూటమి కడుతున్న దేశాలన్నింటికీ అన్నది స్పష్టం. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో కొరియాను జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆక్రమించారు. దాన్ని విముక్తం చేసేందుకు నాటి సోవియట్‌ సేనలు ఒక వైపు నుంచి మరో వైపు నుంచి అమెరికన్‌ సేనలు కదిలాయి.38వ అక్షాంశరేఖకు ఉత్తర వైపున ఉన్న కొరియా ప్రాంతం సోవియట్‌, దక్షిణ ప్రాంతం అమెరికా ఆధీనంలోకి వచ్చాయి. యుద్దం ముగిసిన తరువాత రెండు ప్రాంతాలను ఐక్యం చేయాలన్నది ఒప్పందం. ఉత్తర కొరియా కమ్యూనిస్టుల పాలనలోకి, దక్షిణ కొరియా మిలిటరీ పాలనలోకి వెళ్లాయి. అయితే దక్షిణ కొరియాలోనే తిష్టవేసి చైనాకు, అదే విధంగా ఇండోచైనా ప్రాంతంలోని వియత్నాం తదితర దేశాలను అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా తన సైన్యాన్ని అక్కడే ఉంచింది.1950లో ఉత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు ఐక్యరాజ్యసమితి శాంతిసేనల ముసుగులో ఉన్న అమెరికా మిలిటరీ ప్రయత్నించటంతో పక్కనే ఉన్న చైనా జోక్యం చేసుకొని తన వలంటీర్ల సైన్యాన్ని పంపింది.1953 జూలైలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దాని మీద నాటి దక్షిణ కొరియా పాలకులు సంతకాలు చేయలేదు. విలీన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా అమెరికా ఇప్పటికీ తన సైన్యాన్ని అక్కడే ఉంచి అడ్డుపడుతోంది.

1950 నాటికి చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అనేక చోట్ల ప్రతిఘటనను ఎదుర్కొంటూ కుదుట పడలేదు. అయితే సరిహద్దులోకి అమెరికా సేనల ప్రవేశం చేసిన తరువాత అక్కడికే పరిమితం గావు చాంగ్‌కై షేక్‌కు మద్దతుగా చైనాలో ప్రవేశించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆ పరిస్ధితిని ఎదుర్కొనేందుకు సిద్దమైంది. ఇదే సమయంలో దక్షిణ కొరియా మిలిటరీ, అమెరికన్ల దురాక్రమణను ఎదుర్కొనేందుకు సాయపడవలసిందిగా ఉత్తర కొరియా ప్రభుత్వం 1950 అక్టోబరు 19న చైనా ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే లక్షలాది మంది స్వచ్చంద సైనికులు యాలూ నదిని దాటి కొరియాలో ప్రవేశించారు. 1951అక్టోబరు 25న చైనా సైనికులు దక్షిణ కొరియా మిలిటరీపై తొలి విజయం సాధించారు. ఆ యుద్దంలో రెండు లక్షల మంది చైనా సైనికులు మరణించారు. యుద్దం ముగిసిన తరువాత ప్రతి ఏటా అక్టోబరు 25ను విజయోత్సవంగా జరపాలని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం త్యాగం పేరుతో ఒక సినిమాను కూడా నిర్మించి విడుదల చేశారు.1950 అయినా 2020 అయినా చైనా విషయాల్లో ట్రంప్‌ లేదా భవిష్యత్‌లో మరొక నేత అయినా పెత్తందారీ పోకడలకు పోతే తగిన జవాబు ఇస్తామని గ్జీ స్పష్టం చేశారు. పశ్చిమ పసిఫిక్‌, ఆసియాలో ప్రస్తుత పరిస్ధితి 1950లో యుద్దానికి ముందున్నట్లుగా ఉందని చైనా విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌ లేదా జో బిడెన్‌ ఎవరు అధికారానికి వచ్చినా చైనా వ్యతిరేకులకు విధాన నిర్ణయాన్ని అప్పగిస్తే అమెరికా తీవ్రంగా నష్టపోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
చైనా పౌరులు నేడు సంఘటితంగా ఉన్నారని, వారిని తక్కువగా చూడవద్దని గతంలో మావో చెప్పిన అంశాన్ని గ్జీ పునరుద్ఘాటించారు. బెదిరింపులు, అడ్డుకోవటం వంటి వత్తిళ్లు పని చేయవని స్పష్టం చేశారు. గతంలో సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ఐరోపాలో నాటో కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనాను అడ్డుకునేందుకు ఆసియాలో క్వాడ్‌ పేరుతో అలాంటి కూటమి ఏర్పాటుకు పూనుకున్నారు. దానిలో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ ఉన్నాయి. ఆసియా ముఖ్యంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని దేశాలతో వాటిని విస్తరించాలనే యత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే చైనాతో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఈ నాలుగు దేశాల్లో అన్ని అంశాలపైనా ఏకీభావం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. చతుష్టయంలో అమెరికా, భారత్‌తో చైనా వాణిజ్యం మిగుల్లో ఉండగా జపాన్‌,ఆస్ట్రేలియాలతో తరుగులో ఉంది. అంటే చైనాతో లడాయి కొని తెచ్చుకోవటం అంటే ఇవి తమ వాణిజ్య అవకాశాలను ఫణంగా పెట్టాల్సి ఉంది. అందువలన అమెరికా వత్తిడికి తట్టుకోలేక చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ జపాన్‌, ఆస్ట్రేలియా దూకుడును ప్రదర్శించటం లేదన్నది ఒక అభిప్రాయం. చైనాకు ఎన్నిహెచ్చరికలు చేసినా మన ప్రధాని నరేంద్రమోడీ అధికారికంగా చేసిన ప్రకటనలో మన భూభాగంలోకి చైనా కొత్తగా ప్రవేశించలేదని అఖిలపక్ష సమావేశంలో చెప్పటం చైనాతో తెగేదాకా లాగేందుకు ఇంకా నిర్ణయించుకోలేదనేందుకు నిదర్శనంగా భావిస్తున్నారు.


అమెరికాతో జతకడితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని స్వతంత్రంగా ఎదగాలని చూస్తున్న మన దేశ కార్పొరేట్‌ శక్తులు వత్తిడి చేస్తున్నాయి. గతంలో అమెరికా-సోవియట్‌ మధ్య సాగిన ప్రచ్చన్న యుద్దకాలంలో మన కార్పొరేట్‌ శక్తులు ఆ విబేధాన్ని వినియోగించుకొని లబ్దిపొందేందుకు, తామే స్వతంత్ర శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నించాయి. గతంతో పోల్చితే ఇప్పుడు మన కార్పొరేట్‌ శక్తులు మరింతగా బలపడ్డాయి. వివిధ కారణాలతో అమెరికా మునుపటి స్ధాయిలో లేదు. కొనుగోలు శక్తి పద్దతి(పిపిపి)లో లెక్కించినపుడు చైనా నేడు ప్రపంచంలో ఆర్ధిక అగ్రరాజ్యం, అమెరికా ద్వితీయ స్ధానంలో ఉంది. సాధారణ పద్దతిలో చూస్తే ప్రధమ స్దానంలో ఉన్న అమెరికాను త్వరలో చైనా అధిగమించనుందనే అంచనాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య అంతరం ప్రతి ఏటా తగ్గుతున్నది. ఈ నేపధ్యంలో అమెరికా పాటలకు మన కార్పొరేట్‌ శక్తులు నృత్యాలు చేస్తాయా అన్నది సమస్య.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దంలో భాగంగా ఐరోపాలోని అనేక దేశాలకు సోవియట్‌ నుంచి ముప్పు, కమ్యూనిజాన్ని వ్యాపింప చేస్తారనేే భయాన్ని రేపి నాటో కూటమిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చైనా నుంచి అలాంటి ముప్పు ఏదేశానికీ లేదు. మన దేశంతో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ అది మరోసారి యుద్దానికి దారితీసే అవకాశం లేదు.1962 యుద్దం నాటికి సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమయ్యాయి. యుద్దంలో మనదేశానికి సోవియట్‌ యూనియన్‌ అండవుంటుందనే ఒక పొరపాటు అంచనాకు నాటి మన నాయకత్వం వచ్చిందని చెబుతారు. ఇప్పుడు ఆ సోవియట్‌ లేదు. సిరియా రష్యా నేతలు చైనాతో వివాదపడకపోగా స్నేహబంధాన్ని మరింతగా పెంచుకొనేందుకు నిర్ణయించినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఒక వేళ మన దేశం-చైనా మధ్య యుద్దమంటూ వస్తే వారూ మనం చావో రేవో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్ముకొని అమెరికా లబ్ది పొందుతుంది తప్ప మనకు ఒరిగేదేమీ ఉండదు. జపాన్‌, ఆస్ట్రేలియాల పరిస్ధితీ అదే. జపాన్‌ కొన్ని దీవుల విషయంలో చైనాతో వివాద పడుతోంది. అయితే వాటికోసం యుద్దానికి దిగేస్థితి లేదు. మరోవైపు అమెరికా ప్రభావం నుంచి బయటపడి స్వతంత్రశక్తిగా ఎదిగేందుకు, మిలిటరీశక్తిగా మారాలని చూస్తోంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే అలాంటి సమస్య లేదు. అయితే అమెరికా అనుంగు దేశంగా వ్యతిరేకించటం తప్ప మరొక కారణం లేదు.


దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దీవుల గురించి చైనా – ఆప్రాంత దేశాల మధ్య వివాదం ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ దేశానికి చెందిన నౌకలనూ అడ్డుకోలేదు, అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇక క్వాడ్‌ను ఆసియా నాటోగా మార్చి పెత్తనం చేయాలని అమెరికా చూస్తోంది. ఇదే సమయంలో జపాన్‌ రాజ్యాంగాన్ని మార్చాలని అక్కడి కార్పొరేట్‌ శక్తులు ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ తొమ్మిది ప్రకారం అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి మిలిటరీని వినియోగించటం నిషేధం, అంతే కాదు త్రివిధ దళాలను నిర్వహణను కూడా అనుమతించదు. ఈ కారణంగానే ఆత్మరక్షణ పేరుతో జపాన్‌ పరిమితంగా తన దళాలను నిర్వహిస్తున్నది. ఈ స్ధితి నుంచి బయట పడేందుకు అమెరికా అంగీకరిస్తుందా ? ఆసియా ప్రాంతీయ మిలిటరీ శక్తిగా తిరిగి ఎదగటాన్ని అనుమతిస్తుందా ?


ఆసియా నాటో కూటమిని ఏర్పాటు చేసి దానిలో మన దేశం చేరాలంటే దానికోసం మనం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దున్న-ఎద్దు వ్యవసాయం ఎలాంటి సమస్యలను తెస్తుందో తెలిసిందే. ప్రస్తుతం మనం అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ రష్యన్‌ ఆయుధాలదే అగ్రస్ధానం. అందువలన సగం రష్యా, సగం అమెరికా ఆయుధాల నిర్వహణ కుదరదు. అన్నింటికీ మించి తన ఆయుధాల కొనుగోలును మనం నిలిపివేస్తే రష్యా చూస్తూ ఊరుకోదు. అమెరికా ఉచితంగా ఆయుధాలు ఇవ్వదు. ఐరోపాలో నాటో నిర్వహణ తమకు కష్టంగా మారిందని, నిర్వహణ ఖర్చును ఐరోపా దేశాలు మరింతగా భరించాలని అమెరికా వత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. అలాంటి స్దితిలో అమెరికా కోసం మనం చేతి చమురు వదిలించుకోవాల్సిన అవసరం ఏముంది ?
అధ్యక్ష ఎన్నికల నేపధ్యం, చైనా నుంచి మరిన్ని రాయితీలు పొందేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ ముందుకు తెచ్చిన చతుష్టయంతో తెల్లవారేసరికి అద్బుతాలు జరుగుతాయని అనుకుంటే పొరపాటు. నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగా అన్నట్లుగా ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. నిజానికి ఈ ప్రతిపాదన 2004లో ప్రారంభమైంది. మధ్యలో మూలనపడి 2017లో మరోసారి కదలిక ప్రారంభమైంది. ట్రంప్‌ ఓడిపోతే కొంతకాలం పాటు దూకుడు తగ్గవచ్చు. ఒక వేళ గెలిచినా మన వంటి దేశాలను ముందుకు నెట్టటం తప్ప తన ఆర్దిక పరిస్ధితి మెరుగుపడేంతవరకు ట్రంప్‌ కూడా ఏదో ఒక పేరుతో కాలక్షేపం చేయవచ్చు.


అమెరికా, ఐరోపాలోని కొన్ని దేశాలు నాటో కూటమిని రష్యా ముంగిటికి తీసుకు వస్తున్నాయి. దాన్ని ఎదుర్కొనేందుకు రష్యా తనవంతు సన్నాహాలు చేస్తున్నది. మరోవైపు క్వాడ్‌ పేరుతో ఆసియా నాటో ఉనికిలోకి వస్తే అది చైనాకే కాదు రష్యాకూ సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ నేపధ్యంలోనే చైనాతో కూటమి ఏర్పాటు గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సూచన ప్రాయంగా ప్రస్తావించాడు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఇప్పటి వరకు చైనా మరో దేశానికి వ్యతిరేకంగా మూడో దేశంతో ఎలాంటి సైనిక కూటమిని ఏర్పాటు చేయలేదు. అమెరికాకు మరింత దగ్గరగా భారత్‌ వెళుతున్నప్పటికీ దాయాదిగా ఉన్న పాకిస్ధాన్‌తో, మిత్రదేశంగా ఉన్న నేపాల్‌తో చైనా మిలిటరీ ఒప్పందాలు చేసుకోలేదని అంతర్జాతీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అయితే దేనికైనా కొన్ని పరిమితులుంటాయని గమనించాలి. అమెరికా మరింత దూకుడుగా చైనా వ్యతిరేక అజెండాను ముందుకు తీసుకువస్తే చైనా తన వైఖరిని పున:పరిశీలించుకోవచ్చు. తన ఆర్దికశక్తితో చైనా చిన్న దేశాలను నియంత్రిస్తున్నదని విమర్శించే వారు ఇరాన్‌ పట్ల అమెరికా, మోడీ అనుసరించిన వైఖరి ఆర్ధికపరమైనదిగాక మరేమిటో చెప్పాలి. అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఆర్ధికపరమైనవి కావా, దానిలో భాగంగానే కదా ఇరాన్‌ నుంచి మనం చమురు కొనుగోలు నిలిపివేసి ఆమేరకు అమెరికా నుంచి తెచ్చుకుంటున్నది. అమెరికా పుణ్యమా అంటూ ప్రధాని నరేంద్రమోడీ మన మిత్రదేశంగా ఉన్న ఇరాన్‌ను తీసుకు వెళ్లి చైనాకు అప్పగించారు.ఈ చర్యతో మనకు ఒరిగిందేమీ లేకపోగా మిత్ర దేశంగా ఉన్న ఇరాన్‌ను తీసుకు వెళ్లి చైనాకు అప్పగించాము. అమెరికా బెదిరింపులు, అదిరింపులతో మన చుట్టూ ఉన్న అనేక దేశాలు చైనా అందిస్తున ఆర్దిక స్నేహ హస్తాన్ని అందుకుంటున్నాయి. మన పాలకులకు అమెరికా కౌగిలింతలు తప్ప చుట్టుపట్ల ఏమి జరుగుతోందో పట్టటం లేదు. ఇది తెలివి తక్కువ వ్యవహారమా తెలివిగలదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d