• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Current Affairs

నోటి తుత్తర నేతలు -బిజెపి ద్వంద్వ ప్రమాణాలు !

25 Wednesday Apr 2018

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP double standards, BJP motor mouths, motormouths, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

నోటి తుత్తరతో సమస్యలు తీసుకురావద్దని ప్రధాని నరేంద్రమోడీ తన పార్టీ అనుచరగణానికి చెప్పాల్సి రావటం ఆ పార్టీ ఎలాంటి సంకట స్ధితిని ఎదుర్కొంటోందో తెలియచేస్తోంది. జర్నలిస్టుల ప్రత్యక్షంగా మాట్లాడకుండా మౌన దీక్షపూని ఒక ప్రపంచ రికార్డు ఇప్పటికే సృష్టించిన మోడీ త్వరలో ఐదో సంవత్సరంలో ప్రవేశించబోయే వుత్సవంతో కలిపి దాన్ని కూడా ఒక విజయంగా జరుపుకుంటారు. ఒకవైపు నేత నిక్కచ్చిగా వుంటే మరోవైపు అందుకు విరుద్ధంగా పండ్లుతోముకోవటమైనా మానతారేమోగాని బిజెపి నాయకులు మీడియా ముందు మాట్లాడకుండా ఒక్కరోజు కూడా గడపలేని స్ధితికి వచ్చారు. అయితే మోడీ ఇప్పుడెందుకు హెచ్చరించారనేదే అందరినీ ఆలోచింపచేస్తున్న అంశం. ఊరందరిదీ ఒక దారయితే వులిపికట్టెది మరొక దారి అన్నట్లుగా కథువా(అసిఫా) అత్యాచార వుదంతంపై దేశ మంతటా ఆగ్రహం, విచారంతో నిరసన వ్యక్తం చేస్తుంటే, పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలు జరిగినపుడు నిందితులకు వురి శిక్ష విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ చారిత్రాత్మకమైనది కనుక పండుగ చేసుకోవాలని బిజెపి నేతలు పిలుపునిచ్చారు.

వైపరీత్యం ఏమంటే ఎనిమిదేండ్ల అసిఫాపై అత్యాచారం జరిపి హత్య చేశారని కొందరిపై అభియోగం మోపారు. నిందితులు నిర్దోషులని, హిందువులను గబ్బు పట్టించటానికి ఇదంతా చేస్తున్నారంటూ వీధులకు ఎక్కి ప్రదర్శనలు చేసిందీ, కేసు నమోదుచేయకుండా పోలీసులను అడ్డుకున్న బిజెపి అనుకూల లాయర్ల, నేతలు,కార్యకర్తల తీరు తెన్నులు చూసి దేశం ఇంకా దిగ్బ్రాంతి నుంచి ఇంకా కోలుకోలేదు.Û గతంలో గోరక్షకుల మంటూ ఆవులను రక్షించటానికి ముందుకు వచ్చిన వారే ముక్కుపచ్చలారని పసి పిల్లపై అత్యాచారం చేసిన నిందితులకు మద్దతుగా రేపిస్టు రక్షకులుగా ముందుకు వస్తారని ఎవరూ వూహించి వుండరు. దాన్నుంచి దృష్టిమళ్లించటానికి తెచ్చిన ఆర్డినెన్స్‌పై పండుగ చేసుకోవాలని పిలుపివ్వటం గుండెలు తీసిన బంట్లకు తప్ప అన్యులకు అసాధ్యం. బిజెపి అభిమానులు దీన్ని ఎలా జీర్ణించుకుంటున్నారో అనూహ్యం. తమదాకా వచ్చినపుడు గాని వారికి తెలియదని సరి పెట్టుకోవటం తప్ప ఇంకేం చేయగలం. అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలపై వేగంగా నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్‌ దీనిపై ఎందుకు తాత్సారం చేసిందని, అదీ ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సినంత అగత్యం ఏమిటని అడగటం పాచిపోయిన పాత పాట ‘దేశద్రోహం’ అవుతుందేమో !

పన్నెండు సంవత్సరాల లోపు బాలికలపై అత్యాచారం జరిగితే మరణశిక్ష, 12ా16 సంవత్సరాల మధ్యవారిపై జరిగినపుడు పది నుంచి ఇరవై సంవత్సరాలకు పెంచాలని మోడీ సర్కార్‌ తెచ్చిన ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. బిజెపి అధికార ప్రతినిధి మీనాక్షీ లేఖీ మాట్లాడుతూ దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ను నేటికి నెరవేర్చారని, ఈ రోజు చారిత్రాత్మకం అన్నారు. మహిళాసాధికారత పెంపుదలకు, గొడ్డుచాకిరీని తగ్గించేందుకు మోడీ సర్కార్‌ తీసుకున్న సానుకూల చర్యల గురించి చర్చించాల్సిన దినమిదన్నారు. అంతటితో వూరుకుంటే కిక్కేముంది. సమాజంలో వున్న కొంతమంది వున్మాదుల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు తీసుకున్న చర్యలతో ఇది పండుగ చేసుకోవాల్సిన సందర్భమని అన్నారు.అసిఫా వుదంతంపై దేశమంతటా, విచార,మౌన, నిందుతులను వెనుకేసుకు వచ్చిన బిజెపి నేతలపై ఆగ్రహ ప్రదర్శనలు చేస్తుంటే ఈమె గారికి పండుగ చేసుకోవాల్సిన అవసరం కనిపించింది.

గత చరిత్రను చూసినపుడు బిజెపిలో నోటి దురుసుతనం లేదా తుత్తర ఎంత ఎక్కువగా వుంటే అంత త్వరగా వారు అధికార ప్రతినిధులుగా, పదవులు పొందుతారని వెల్లడైంది. దానికి కారణం మత, సామాజికరీత్యా విద్వేషభావాలను, ప్రచారాలను రెచ్చగొట్టటం, వదరుబోతుతనం తమకు ప్రయోజనకరమని ఆ పార్టీ వ్యూహకర్తలు భావించటమే. అదుపు తప్పిన నోళ్లు ఎప్పుడు ఏంమాట్లాడతాయో తెలియదు. అది రాజకీయంగా నష్టం కలిగించటం, తమ తెలివితక్కువ తనంతో ఓహో ఈ పార్టీ ఇలాంటివారితోనే నిండి వుందనే సందేశం ఇటీవలి కాలంలో అనేక మందికి అవగతం అవుతుండటంతో నోళ్లను అదుపులో పెట్టుకోవాలని మోడీ చెప్పాల్సి వచ్చింది.

‘ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితే ఏమైంది, దానికే అన్ని వైపుల నుంచి నానా యాగీ చేయటం న్యాయం కాదు’ అంటూ కేంద్ర కార్మిక, వుపాధిశాఖల మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ స్వయంగా వ్యాఖ్యానించాడు. ఇలాంటి వ్యాఖ్యలు బిజెపి కార్యకర్తలకు మంచి వుత్సాహాన్నిచ్చి సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా స్పందించిన వారి మీద విరుచుకుపడేట్లు చేస్తాయి. అసలు విషయాన్ని జయప్రదంగా పక్కదారి పట్టిస్తాయి.’ ప్రతి సమస్య మీద విశ్లేషణ చేసే ఒక సామాజిక శాస్త్రవేత్తగానో లేక పండితులుగానో భావించుకొని టీవీ కనపడిన ప్రతిసారీ ఒక ప్రకటన చేసేందుకు తొందరపడవద్దు ‘ అని నమో ఆప్‌ ద్వారా నరేంద్రమోడీ తన సహచరులను మందలించారు. గత నాలుగు సంవత్సరాలలో అనేక మంది బిజెపి నేతలు మసాలా వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఒక బిజెపి నేత ఏర్పాటు చేసిన నైట్‌క్లబ్‌ను ప్రారంభించి మీడియాలో గబ్బుపట్టగానే నాకు అది క్లబ్బు అని చెప్పకుండా మోసం చేశారంటూ చేతులు దులుపుకున్న సాధువైన పార్టీ ఎంపీ గిరిరాజ్‌ సింగ్‌ ‘ ఒక వేళ రాజీవ్‌ గాంధీ ఒక నైజీరియన్‌ మహిళను పెళ్లి చేసుకొని వుంటే, ఆమెకు తెల్లతోలు లేకపోయి వుంటే కాంగ్రెస్‌ ఆమె నాయకత్వాన్ని ఆమోదించి వుండేదా ?’ అని వ్యాఖ్యానించారు. తరుణ్‌ విజయ్‌ అనే మరో ఎంపీ ‘ మేము జాత్యహంకారులమే అయితే మొత్తం దక్షిణ భారత్‌లో మేము ఎందుకు వుండేవాళ్లం. తమిళనాడు మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్‌ మరియు కేరళ మీకు తెలుసు, వారితో మేము జీవిస్తున్నాం, మా చుట్టూరా నల్ల వారున్నారు’ అని సెలవిచ్చిన విషయం తెలిసిందే. ‘డార్విన్‌ సిద్ధాంతం తప్పు ఎందుకంటే కోతులు మనుషులుగా మారటాన్ని ఎవరూ చూడలేదు’ అన్న సత్యపాల్‌ సింగ్‌, ‘మహాభారతంలో అంధుడైన ధృతరాష్ట్రుడికి సంజయుడు యుద్ధరంగంలో ఏం జరుగుతున్నదీ చెప్పగలిగాడంటే ఆ రోజు ఇంటర్నెట్‌ మరియు సాంకేతిక పరిజ్ఞానం వుండబట్టే ‘ అన్న త్రిపుర బిజెపి ముఖ్యమంత్రి విప్లవకుమార్‌ చెప్పిన మాటలతో బిజెపి నవ్వులపాలైంది. అయితే కొద్ధి సంవత్సరాల క్రితం ఇలాంటి మాటలను స్వయంగా నరేంద్రమోడీయే చెప్పినపుడు మీడియా వాటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. వాటిని సమర్ధించేందుకు అనేక మంది సమర్ధకులు బయటకు వచ్చారు. ఇప్పుడా సీన్‌ లేదు. అధికారానికి వచ్చిన ఆరునెలలకు 2014 అక్టోబరులో వైద్యులు,శాస్త్రవేత్తలు పాల్గన్న ఒక సమావేశంలో నరేంద్రమోడీ మాట్లాడుతూ మహాభారత సమయంలోనే జెనెటిక్స్‌ శాస్త్రంలో భారత్‌ ప్రావీణ్యం సంపాదించిందని, వినాయకుడికి ఏనుగుతలను అంటించటం ఆ సమయంలో మనకు ప్లాస్టిక్‌ సర్జన్స్‌ వున్నారనేందుకు ప్రత్యక్ష రుజువు అని సెలవిచ్చారు. అంతటి పెద్దమనిషే అలా అన్నతరువాత అనేక మంది తరువాత ఎన్నో అశాస్త్రీయ, కేవలం నవ్వులాటకు పనికి వచ్చే, మన దేశ పరువు తీసే అంశాలను ముందుకు తెచ్చి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వీటిని ప్రవచించిన పెద్దలందరూ నిజంగా వాటిని గట్టిగా విశ్వసించబట్టే చెప్పారు. ఎందుకంటే ఈ దేశంలోని తిరోగమన వాదులు బిజెపి పుట్టకముందే వేదాల్లోనే అన్నీ వున్నాయష అంటూ చేసిన ప్రచారాన్ని చిన్న తనం నుంచి తలకెక్కించుకున్నవారెందరో వున్నారు. వారిలో కాషాయ కుటుంబానికి చెందిన వారు అగ్రస్ధానంలో వుంటారు.

విద్వేష పూరిత ప్రసంగాలు చేసే నోళ్లు కూడా చిన్నవేమీ కాదు, తక్కువేమీ లేవు. వారు ఒక హిందువును చంపితే మేము వంద మంది ముస్లింలను చంపుతామన్న యోగి ఆదిత్యనాధ్‌, ఇంట్లో ఆవు మాంసం వుందంటూ దాద్రిలో దాడి చేసి ఇంటి యజమాని మహమ్మద్‌ అఖ్లాక్‌ను హత్యచేసిన తరువాత నిందితులను బదులు మాంసం కలిగి వున్నందుకు ఆ కుటుంబాన్ని అరెస్టు చేయాలన్న ఎంఎంల్‌ఏ సంగీత్‌ సోమ్‌, మన దేశాన్ని హిందుస్తాన్‌ అని పిలుస్తారు, అంటేదాని అర్ధం ఇది హిందువులది, గతంలో ఒక పద్దతి వుండేది ఎంత పెద్ద గడ్డం వుంటే అంత ఎక్కువ లబ్ది కలిగించేవారు అన్న ఎంఎల్‌ఏ విక్రమ్‌ సైనీ వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ విషయంలో నరేంద్రమోడీ ఏమీ తక్కువ తినలేదు. ముఖ్యమంత్రిగా వున్నపుడే ముస్లిం కాందిశీక శిబిరాలన్నీ పిల్లలను పుట్టించే ఫాక్టరీలని, వుత్తర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఖబరస్తాన్‌(ముస్లింల శ్మశానవాటిక) ఏర్పాటు చేసినపుడల్లా ఒక శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందే అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. బిజెపి మిత్ర పక్షం శివసేన నాయకులూ ఈ విషయంలో బిజెపితో పోటీపడతారు. అలాంటి పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం బిజెపి ప్రజాప్రతినిధుల బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు బాధ్యత ప్రధానిదే అని దాడి చేసింది. ఈ బిజెపి రాజ్యంలో ప్రధాని మోడీని చూసి వుత్తేజం పొందే పార్టీ మంత్రుల నోటికి అదుపుండదు అని పేర్కొన్నది.

పోనీ ఇలా నోరు అదుపులేని నేతల పట్ల బిజెపి గతంలో ఎలా వ్యవహరించింది? 2008లో ముంబై వుగ్ర దాడుల సందర్భంగా నాటి హోం మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ నోరు జారారు. పెద్ద పట్టణాలలో ఇలాంటి చిన్నచిన్న అంశాలు జరుగుతుంటాయి అన్నందుకు గాను నానా యాగీ చేసిన బిజెపి ఆయన రాజీనామా చేసే వరకు వూరుకోలేదు. మరి ఇప్పుడు దేశమంతటినీ కుదిపివేసి వున్నావ్‌ అత్యాచార వుదంతంపై ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితే ఏమైంది, దానికే అన్ని వైపుల నుంచి నానా యాగీ చేయటం న్యాయం కాదు అన్న కేంద్ర మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ను కనీసం అదే బిజెపి మందలించను కూడా లేదు, ద్వంద్వ ప్రమాణాలు అంటే ఇవే.

ఒక అత్యాచారం జరగ్గానే చేసిన వాడిని వురి తీయాలి, వాడి అంగాన్ని నరికివేయాలంటూ ఆగ్రహం తీవ్ర స్ధాయిలో వ్యక్తం చేయటం సహజం. హత్య నేరమే కొన్ని కేసులలో యావజ్జీవ శిక్ష పడుతుంది, కొన్నింటిలో వురి శిక్ష కూడా వేశారు. ఎందుకీ తేడా ? ఏదైనా హత్య హత్యేకదా ? వుద్రేకంలోనో, అసంకల్పిత ప్రతీకార చర్యలోనో మరొక కారణంతో జరిగితే అది సాధారణ హత్య. అలాగాక కుట్ర చేసి లేదా హత్యలు చేయటమే పనిగా పెట్టుకొని లేదా, వున్మాదంతో చేసేవి దారుణ హత్యలు. అందుకే శిక్షల్లో తేడా. వురి శిక్ష వేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అంటే అనేక దేశాలు, మన దేశ అనుభవం చూసినా అలాంటి వాటి వలన ఫలితమేమీ కనపడటం లేదు. అందువలన సిపిఎం వంటి పార్టీలు, కొన్ని సంస్ధలు వురి శిక్షలు వద్దు ఇతర శిక్షలు వద్దని చెబుతున్నాయి. వద్దన్నవారిని దుండగులను ప్రోత్సహించేవారుగానూ, కావాలన్నవారిని నిరుత్సాహపరిచేవారుగానూ అనేక మందికి కనిపిస్తారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులలోనూ, ఇతరత్రా చూసినపుడు అవాంఛనీయ శక్తులు ఇతర పార్టీలలనే ఎక్కువగా వున్నట్లు ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది.

సరే బిజెపి వారు అనేక చారిత్రకాంశాలకు ఆద్యులమని చెప్పుకుంటున్నారు గనుక వారు చెప్పుకున్నట్లు పన్నెండు సంవత్సరాల లోపు వయస్సు వున్న బాలికలపై అత్యాచారం చేసిన వారికి వురి శిక్ష విధిస్తూ , అంతకంటే కాస్త పెద్దవారిపై అత్యాచారం జరిగితే శిక్షను పది నుంచి 20కి పెంచుతూ శిక్షాస్మృతిని సవరిస్తూ తొలిసారిగా ఆర్డినెన్స్‌ తెచ్చిన ఆ ఖ్యాతిని కూడా వారి ఖాతాలోకే వేద్దాం. దాంతో పాటే మరొకదానిని కూడా వేయాలి. ఒక పన్నెండేళ్లలోపు బాలికపై అత్యాచార కేసులో నిందితులు నిర్దోషులంటూ హిందూ ఏకతా మంచ్‌ పేరుతో జరిపిన ప్రదర్శనలో బిజెపి మంత్రులు పాల్గనటం కూడా ఇదే ప్రధమం కనుక దీన్ని కూడా ఆ ఖాతాకే జమచేయటం న్యాయం.ఇక బేటీ బచావో నినాదం ఇచ్చిన ఖ్యాతి కూడా నరేంద్రమోడీ ఖాతాలోనే వేయాలి. దేశంలో అత్యాచారాలు ఈనాటివి కాదు. కొత్తగా బిజెపిలో ప్రారంభంగాని మాట నిజం.2016 లెక్కల ప్రకారం మొత్తం రేప్‌ కేసులు 39068,రోజుకు 107, గంటకు 4.46, ప్రతి 14ని నిమిషాలకు ఒక అత్యాచారం జరిగింది.

ఇక వివరాల్లోకి వస్తే ఆరేండ్ల లోపు అభాగినులు 520,6ా12 ఏండ్ల మధ్య వారు 1596,12ా18 ఏండ్ల మధ్య వయస్కులు 8656, మిగిలిన 22205 మందిలో 57 మంది అరవై సంవత్సరాల పైబడిన వారు కూడా వున్నారు. పన్నెండు సంవత్సరాల లోపు వారు 1114 మంది వున్నారు.2016లెక్కల ప్రకారం నాలుగో వంతు మైనర్‌ బాలికలపై జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల నాడు ఇంత మందిపై జరిగాయి, తరువాత సంవత్సరం కూడా ఎంతమంది బలయ్యారో లెక్కలు వారికి అందుబాటులో వుంటాయి కనుక కేంద్రంలోని పెద్దలకు తెలియకపోదు. అలాంటపుడు ఆర్డినెన్స్‌లోని శిక్ష మంచిదో చెడ్డతో అన్న మీమాంసను పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు తేలేదు, ఇన్నాళ్ల తరువాత తెచ్చిందానిని చారిత్రకం అని ఎందుకు డబ్బా కొట్టుకుంటున్నారు. దీన్ని కూడా ఓట్లకోసం వాడుకుంటారా? 2013 ఆగస్టు ఒకటిన ఆశారామ్‌ బాపు అనే ఒక బాబా దయ్యం వదలగొట్టే నెపంతో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు బాబా నిర్దోషి అంటూ సమర్ధించిన వారిలో బిజెపి నేతలున్నారు. ఇప్పుడు ఆ కేసులో తీర్పు వెలువడనుండగా శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చుననే భయంతో పోలీసులను మోహరించాల్సిస దుస్ధితి వచ్చిందంటే బాబా భక్తులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చినట్లు ? ఆ కేసులో బాబాపై పోస్కో చట్టంతో పాటు షెడ్యూలు కులాలు, తెగలపై అత్యాచార నిరోధ చట్టం కింద కూడా అభియోగాలను మోపారు.కోర్టు బాబాను దోషిగా తేల్చి యావజ్జీవ శిక్షవిధించింది. అదే కేసులో మరో నలుగురికి జోధ్‌పూర్‌ కోర్టు శిక్షలు వేసింది. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల క్రితం ముంబయ్‌లో శక్తి మిల్స్‌లో సామూహిక అత్యాచారానికి గురైన ఫొటో జర్నలిస్టు కేసును పరిశీలించటం సముచితం. ఇది శ క్తి మిల్స్‌ కేసుగా కూడా పిలుస్తారు. ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం కేసులో 2014 మార్చి 20న ఇచ్చిన తీర్పులో ఐదుగురు నేరగాండ్లలో ముగ్గురికి మరణశిక్ష, ఒకడికి జీవిత ఖైదు విధించింది. అప్రూవర్‌గా మారినవాడిని వదిలేసింది. అదే మిల్స్‌ ఆవరణలో జరిగిన మరొక అత్యాచార వుదంతంలో ఒక మైనర్‌ బాలుడు నిందితుడు. వాడికి మూడు సంవత్సరాల శిక్ష విధించారు. చట్ట ప్రకారం అంతకంటే ఎక్కువ లేదు.

వదిలేద్దాం, ఓట్ల కోసం దేన్నయినా వాడుకోగల దిట్టగా బిజెపి ఆరితేరిందని దాని ఘనతను కీర్తిద్దాం. ఇప్పటికే వున్న చట్టాల ప్రకారం దారుణమైన నేరాలకు వురి శిక్ష విధించటానికి అవకాశం వుంది. ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్క బాలిక వుదంతంలో కూడా కోర్టులు ఎందుకు వురి శిక్ష విధంచలేదు. న్యాయమూర్తులలో స్పందన లోపించిందా? అసాధారణ రేప్‌ కేసులలో వురి శిక్ష విధించాలని, అయితే తమ పార్టీ సూత్రప్రాయంగా వురిశిక్షకు వ్యతిరేకమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అభిప్రాయం చెప్పారు. అది నచ్చని వారు తప్పు పట్టవచ్చు, కానీ కొందరు రేపిస్టులను సిపిఎం సమర్ధిస్తోందంటూ దాడులకు దిగారు. అసలు కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు ఇప్పుడు రావటానికి కారణం ఏమిటి? కాశ్మీర్‌లోని కథువా ఎనిమిదేండ్ల బాలిక అసిఫా వుదంతంలో నిందులపై కేసు పెట్టకుండా అడ్డుకోచూసింది బిజెపి మద్దతుదారులైన లాయర్లు, నిందితులకు మద్దతుగా హిందూ ఏకతా మంచ్‌పేరుతో మతోన్మాదులు జరిపిన ర్యాలీలో పాల్గన్నది బిజెపి మంత్రులు, దీనిపై తీవ్ర విమర్శలు రావటంతో వారిని వుద్యోగాల నుంచి వూడగొట్టింది బిజెపి. గోరక్షక్‌ నుంచి రేపి స్ట్‌ రక్షక్‌ మారిందనే పేరు వచ్చింది. ఇంత పరువు పోయాక ఆ నష్ట నివారణ చర్యలో భాగం తప్ప ఆర్డినెన్స్‌లో నిజాయితీ ఎక్కడుంది? ఆర్డినెన్స్‌ తెచ్చినందుకు అభినందించుకోండి, వూరూరా తిప్పి సన్మానాలు చేయించి నీరాజనాలు పట్టండి, సమర్ధించని వారిని విమర్శించాల్సినంత సీన్‌ బిజెపి వారికి లేదు. చిత్రం ఏమిటంటే అసిఫా అత్యాచారాన్ని ఇంతవరకు ఖండించేందుకు నోరు రాని బిజెపి వారందరూ ఒక్కసారిగా ఇప్పుడు ఆర్డినెన్స్‌పై ఎక్కడలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో దారుణ అత్యాచారానికి గురైన నిర్భయ పేరుతో ఒక చట్టాన్ని చేశారు. ఇప్పుడు పేరు ఎలాగూ బయటకు వచ్చింది కనుక తెచ్చిన ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చేటపుడు బిజెపి వారికి ఏమాత్రం నిజాయితీ వున్నా ఆసిఫా చట్టం అని పేరుపెడతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మే డే అంటే ఎర్రజెండాల పార్టీల వ్యవహారం కాదు

24 Tuesday Apr 2018

Posted by raomk in Current Affairs, employees, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

communist, communist parties, may day, Trade Union Movement in India

ఎం కోటేశ్వరరావు

మే డే అంటే ఎర్రజెండాల పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. ప్రపంచంలో కమ్యూనిస్టులు, పార్టీలు పుట్టక ముందే కార్మికులు, వారిని దోపిడీ చేసే వ్యవస్ధ వునికిలోకి వచ్చింది. ఒక్కసారి అవలోకిస్తే కార్మిక సమస్యల మీద మన దేశంలో స్పందించిందీ, వారిని సంఘటిత పరచేందుకు ముందుగా ప్రయత్నించింది కమ్యూ నిస్టులు కాదు. అసలు శాస్త్రీయ సోషలిజం భావన వునికిలోకి రాక ముందే అంటే 1848లో కమ్యూనిస్టు మానిఫెస్టో విడుదల కాక ముందు, కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం గాక ముందే ప్రపంచంలో కార్మిక చట్టాలు, ప్రాధమిక రూపంలో కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. మన దేశంలో తొలి జాతీయ కార్మిక సంఘాన్ని(ఏఐటియుసి) ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ నాయకులే. దాని తొలి అధ్యక్షుడు లాలా లజపతిరాయ్‌. తరువాతే కమ్యూనిస్టులు దానిలో చురుకుగా పనిచేసి, మిలిటెంట్‌ కార్మిక పోరాటాలను నిర్వహించారు గనుక తరువాత కమ్యూనిస్టులు నాయకత్వ స్ధానాలలోకి వచ్చారు. స్వాతంత్య్రం తరువాత రాజకీయ పార్టీలు తమ భావజాలానికి అనుగుణంగా జాతీయ కార్మిక సంఘాలను ఏర్పాటు చేశాయి.

ఎప్పుడైతే వస్తూత్పత్తి ప్రక్రియలో యంత్రాలను ప్రవేశపెట్టారో అప్పుడే వాటిపై పని చేసే పారిశ్రామిక కార్మికులు కూడా తయారయ్యారు. ఇది పారిశ్రామిక విప్లవ తొలి పర్యవసానం. దోపిడీ, అసమానతల వంటివి సరేసరి. మన వేదాల్లో అంతులేని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దాగుందని కాషాయ తాలిబాన్లు చెప్పగా వినటం తప్ప మనకు కనపడదు. నిజంగా అదే నిజమైతే పారిశ్రామిక విప్లవం భారత వుపఖండానికి బదులు ఐరోపాలో ఎందుకు ప్రారంభమైంది, పోనీ ఇప్పటికైనా వేద సాంకేతిక పరిజ్ఞానాన్ని బయటకు తీసి మేకిన్‌ ఇండియా పిలుపులో భాగంగా ఎందుకు వుత్పత్తి చేయరు, దిగుమతులను ఎందుకు ఆపరు అన్నది ఒక మౌలిక ప్రశ్న. దాని గురించి వేరే సందర్భంగా చర్చించుకుందాం. పారిశ్రామిక విప్లవం ఐరోపాలోనే జరిగినప్పటికీ దానితో ప్రభావితం గాని దేశం లేదు. మన దేశంలో సంభవించిన పర్యవసానాల గురించి 1853లో న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌ పత్రికలో కారల్‌ మార్క్స్‌రాసిన విశ్లేషణలో ఇలా వుంది.’ భారత చేనేత రంగంలో ప్రవేశించిన బ్రిటీష్‌ చొరబాటుదారుడు నేత ప్రక్రియనే నాశనం చేశాడు. ఐరోపా మార్కెట్లనుంచి భారత వస్త్రాలను బయటకు నెట్టటంతో ప్రారంభించి చివరకు హిందూస్తాన్‌లో తానే చేయితిప్పటాన్ని ప్రారంభించింది ఇంగ్లండు.నేత వస్త్రాలకు నిలయమైన దేశాన్ని తన వస్త్రాలతో ముంచివేసింది.1818-36 మధ్య గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి ఇండియాకు ఎగుమతులు 1:5,200 దామాషాలో పెరిగాయి.1824లో గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి భారత్‌కు కేవలం పది లక్షల గజాలలోపే ఎగుమతి జరగ్గా 1837నాటికి 6.40 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో ఢాకా పట్టణ జనాభా లక్షా 50వేల నుంచి ఇరవై వేలకు పడిపోయింది.ఒక నాడు తమ వస్త్రాలతో పండుగ చేసుకున్న మాదిరి కళకళలాడిన పట్టణాలు దిగజారటం దీని పర్యవసానమే. బ్రిటీష్‌ వారి ఆవిరిశక్తి, సైన్సు హిందూస్దాన్‌ అంతటా వ్యవసాయం-వుత్పాదక పరిశ్రమ మధ్య వున్న సంబంధాన్ని కూకటి వేళ్లతో పెకలించాయి.’

పారిశ్రామిక విప్లవంలో పెరిగిన వస్తూత్పత్తిని అమ్ముకొనేందుకు యజమానులు ఇతర దేశాల మార్కెట్ల వేట సాగిస్తే వారి యంత్రాలపై పని చేసే కార్మికులు దిగజారిన తమ బతుకులను బాగుచేసుకొనేందుకు బతుకుపోరు జరిపారు. పారిశ్రామికీకరణతో వుపాధి కోల్పోయిన చేనేత వృత్తిదారుల నుంచి బ్రిటన్‌లో తొలిసారిగా యాంత్రీకరణకు ప్రతిఘటన కూడా ప్రారంభమైంది. యజమానుల చర్యలు మార్కెట్లకోసం యుద్ధాలు, వలసలు, ప్రపంచీకరణ, అంతులేని దోపిడీకి దారితీశాయి. కార్మికుల బతుకుపోరు మేడే, సోషలిజం, కమ్యూనిజం వంటి దోపిడీలేని నూతన సమాజాల అన్వేషణకు పురికొల్పాయి. ప్రతి ఏడాది మే ఒకటవ తేదీ, దీన్నే అంతర్జాతీయ కార్మిక దినం అని కొన్ని చోట్ల కార్మికదినం అని పిలుస్తారు. కొంత మంది ఆ రోజును దినోత్సవంగా జరుపుతారు, మరి కొందరు దీక్షా దినంగా పాటిస్తారు. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే ఒకటవ తేదీని ఎలా జరపాలన్నది వారి చైతన్యానికి గీటురాయి. కనీస సౌకర్యాలు కూడా లేక చెమటలు కక్కుతూ శారీరక శ్రమను, అధునాతన భవనాలలోని ఎసి గదుల్లో ఆధునిక కంప్యూటర్లపై పని చేస్తూ మేధోశక్తిని అమ్ముకుంటూ ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని పని చేసే ఐటి ఇంజనీరు, కార్యాలయ బంట్రోతు, ప్రభుత్వ వుద్యోగి, కార్మికుడు, గుమస్తా ఇలా ఎవరైనా తెల్ల చొక్కా లేక యూనిఫాం వేసుకున్నా అందరూ కార్మికులే.

మన దేశ కార్మికవర్గ చరిత్రను చూసినపుడు రైల్వేకార్మికులు అగ్రగాములలో ముఖ్యులు. దాని అనుబంధ పరిశ్రమలతో పాటు బగ్గు, పత్తి,జనపనార పరిశ్రమలతో కార్మికులు విస్తరించారు. పారిశ్రామిక విప్లవం జరిగిన ఐరోపాలోగానీ, విస్తరించిన భారత్‌ వంటి దేశాలలోగానీ దుర్భరపరిస్ధితులు, దోపిడీలో ఎలాంటి తేడా లేదు. మన కార్మికవర్గం సామ్రాజ్యవాద పాలన కింద మగ్గటంతో పాటు అటు విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులదోపిడీకీ గురైంది అయింది. అందువలన దోపిడీతో పాటు సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయపోరాటంలో కూడా భాగస్వామి అయింది. అందువలన జాతీయవాదులు, వుదారవాదులే తొలి కార్మికోద్యమ నిర్మాతలుగా వుండటం ఒక సహజపరిణామం. దీని ప్రభావం కార్మికవర్గ అవగాహనమీద కూడా పడింది. కొంత మంది కార్మిక సమస్యల కంటే వారిని సామ్రాజ్యవాద వ్యతిరేకులుగా మార్చటంపైనే కేంద్రీకరించారు. బ్రిటీష్‌ యజమానులు, భారత యజమానుల ఫ్యాక్టరీల పట్ల తేడా వుండాలని చెప్పారు. కార్మిక చట్టాలను గనుక అమలు జరిపితే భారతీయ యజమానుల ఆధ్వర్యంలోని ఫ్యాక్టరీలు పోటీని తట్టుకోలేవని భావించారు.ఈ కారణంగానే 1881,91లో తెచ్చిన ఫ్యాక్టరీ చట్టాలను కొందరు వ్యతిరేకించారు. వర్గ అవగాహనతో కార్మికులను విడదీయవద్దని చెప్పారు. దయాదాక్షిణ్యాలతో కార్మికుల ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచాలని చూశారు.

తొలిసారిగా 1870లో శశిపాద బెనర్జీ కార్మిక క్లబ్బు స్ధాపించి, భారత శ్రమజీవి అనే పత్రికను కూడా ఏర్పాటు చేశారు. సొరాబ్జీ షాపూర్జీ బెంగాలీ చొరవతో 1878లో కార్మికుల పని పరిస్ధితుల మెరుగుదలకు బంబాయి శాసన మండలి ఒక చట్టాన్ని ఆమోదించింది.1880లో నారాయణ్‌ మేఘాజీ లోఖాండే దీన బంధు అనే పత్రికతో పాటు బంబే మిల్‌ అండ్‌ మిల్‌హాండ్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు.1899లో ముంబైలో తొలి రైల్వే కార్మిక సమ్మె జరిగింది. దానికి బాలగంగాధర తిలక్‌ వంటి వారు తమ పత్రికల ద్వారా మద్దతు ప్రకటించారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ధరలు విపరీతంగా పెరిగి కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తింది. అదే సమయంలో రష్యాలో తొలి శ్రామికరాజ్యం ఏర్పడి కార్మికవర్గాన్ని ఎంతగానో వుత్తేజపరచి వుద్యమాలకు పురికొల్పింది. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) కూడా ఏర్పడింది. ఈ పూర్వరంగంలో స్వాతంత్య్ర వుద్య మాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం జాతీయ స్ధాయిలో ప్రజాసంఘాలను నిర్మించటం అవసరమని భావించింది. దాని పర్యవసానమే 1920అక్టోబరు 31ఆలిండియా ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌(ఎఐటియుసి) ఏర్పాటు. ఆ తరువాతే పెద్ద ఎత్తున చెలరేగిన పోరాటాలను అణచివేసేందుకు, ఆంక్షలు విధించేందుకు వీలుగా 1926లో ట్రేడ్‌యూనియన్‌ తరువాత, ఇతర అనేక చట్టాలను తెచ్చారు. వాటన్నింటికి పరాకాష్టగా మీరట్‌, కాన్పూరు కుట్రకేసులను బనాయించి కమ్యూనిస్టులుగా అనుమానం వున్నవారందరినీ వాటిలో ఇరికించి విచారణ జరిపారు.

బ్రిటన్‌లో తొలిసారిగా 1802లో పారిశ్రామిక కార్మికుల చట్టాన్ని తెచ్చారు. ఫ్యాక్టరీల్లో పిల్లలతో ఎన్నిగంటలు, ఎలాంటి పని చేయించాలి, ఏ తరహా సంస్ధలలో ఎలాంటి పరిస్ధితులు వుండాలో దాన్లో పేర్కొన్నారు. ఎవరైనా ఈ చట్టాన్ని వుల్లంఘించితే రెండు నుంచి ఐదు పౌండ్ల జరిమానా విధించాలని కూడా పేర్కొన్నారు. తరువాత ఆ చట్టాన్ని 1819లో సవరించారు.1833లో ఫ్యాక్టరీల తనిఖీ వ్యవస్ధను ప్రవేశపెట్టారు. 1874లో బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీపాలన రద్దయి విక్టోరియా రాణి పాలన మొదలైంది. 1875లో కార్మికుల పని పరిస్ధితులపై అధ్యయనానికి ఒక కమిటీని వేసి దాని నివేదిక ఆధారంగా వంద అంతకంటే ఎక్కువ మంది పని చేసే ఫ్యాక్టరీలలో అమలు చేసే విధంగా 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టం వచ్చింది. అధ్యయన కమిటీ విషయం తెలిసిన కొందరు 1879డిసెంబరులో రఘబా సుఖరామ్‌ అనే కార్మికుడి నాయకత్వంలో సమావేశమై రాతపూర్వకంగా తమ స్ధితిగతులను వివరించారు. దానిపై 578 మంది సంతకాలు చేశారు. భారత కార్మికోద్యమ చరిత్రలో తొలి నేతగా సుఖరామ్‌ నమోదయ్యాడు. తొలి ఫ్యాక్టరీ చట్టంపై నాటి మీడియాలో కొన్ని సమర్ధించగా మరికొన్ని తీవ్రంగా విమర్శించాయి. బ్రిటీష్‌ పాలకులకు విన్నపాలు చేయటం ఏమిటి, మన పని మనం చేసుకుందాం అంటూ కొందరు జాతీయవాదులు పత్రికల్లో రాశారు. బాలగంగాధర తిలక్‌ 1881 మార్చి 13న తన మరాఠా పత్రికలో ఇండియా పాలన ఇండియా కొరకు గాక ఇంగ్లండు ప్రయోజనాలకొరకు జరుగుతోంది.మనది పరాజిత దేశం, ఒక పరాజిత దేశంగానే పరిపాలించబడతామని దేశీయులు తెలుసుకోవాలి’ అని రాశారు. మన దేశంలో పారిశ్రామికీకరణ పందొమ్మిదవ శతాబ్ది మధ్యలో ప్రారంభమైంది. అసోంలో 1839లో తొలి తేయాకు కంపెనీ, 1843లో బెంగాల్‌ బగ్గు కంపెనీ, 1854లో బంబాయిలో తొలి బట్టల మిల్లు, కొలకత్తాలో తొలి జూట్‌మిల్లు ప్రారంభమైంది. ఆ తరువాతే ముడి సరకుల రవాణాకు రైలు మార్గాలను వేశారు. 1890నాటికి వివిధ దేశాలలో పని చేసేందుకు బ్రిటీష్‌ పాలకులు పంపిన భారతీయ కార్మికుల సంఖ్య ఐదులక్షలు కాగా దేశంలో పారిశ్రామిక కార్మికులు సంఖ్య మూడులక్షలు మాత్రమే.

రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటి కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది.దాంతో చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికులను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో అప్పీలులో శిక్షలను ఖరారు చేశారు. 1987 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని ప్రతిపాదించి ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ఖరారు చేస్తూ ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది.

పందొమ్మిదవ శతాబ్ది, ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచ కార్మికవర్గానికి అనేక పాఠాలు నేర్పింది. దుర్భర పరిస్ధితుల నుంచి బయటపడేందుకు కార్మికవర్గం చేసిన పోరాటాల ఫలితమే సాధించుకున్న హక్కులు, చట్టాలు. తొలి చట్టాలు అమలులోకివచ్చి వందసంవత్సరాలు కూడా గడవక ముందే సంస్కరణల పేరుతో వాటికి చెల్లుచీటీ ఇవ్వటం ప్రారంభమైంది. ఫలితంగా నూటయాభై సంవత్సరాల నాటి దుర్భరపరిస్ధితులైన పన్నెండు గంటల పని, తక్కువ వేతనాలు, యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేయటం పునరావృతం అవుతున్నాయి. ఇదంతా స్వేచ్చావాణిజ్యం, ప్రపంచీకరణపేరుతో జరుగుతోంది. వీటినే నయా వుదారవాద విధానాలు అని కూడా అంటున్నారు. కొంత మంది వీటిని వూట సిద్ధాంతంగా వర్ణించారు. దాని ప్రకారం సరిహద్దులు, కరెన్సీ,మిలిటరీ, పోలీసు వంటి అంశాలు తప్ప మిగిలిన అన్నింటినీ ప్రయివేటు రంగాలకు అప్పచెబితే ఆ రంగం నుంచి వచ్చే ఫలితాలు వూట మాదిరి సమాజం అంతటికీ దిగుతాయి. గత మూడున్నర దశాబ్దాల ఈ విధానాల అమలులో వూట ఎలా దిగింది? కేంద్ర ప్రభుత్వ సమాచారం, గణాంకాల ప్రకారం 1980-81లో ఒక వస్తువు తయారీ లేదా సేవ విలువ(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌- జివిఏ)లో వేతనాలు, అలవెన్సులు తదితర రూపాలలో సగటున కార్మికులకు దక్కిన లబ్ది 44శాతం. అది 2012-13 నాటికి 23.6కు పడిపోయింది. ఇదే సమయంలో వడ్డీ చెల్లింపులు 19.8 నుంచి 13.7శాతానికి తగ్గాయి. మరి లాభాల వాటా 15.7 నుంచి 44.1శాతానికి పెరిగింది. 2012 జిడిపి ఆధారంగా గుణిస్తే మన దేశంలో ఒక శ్రామికుడు గంటలో చేసిన వుత్పత్తి విలువ రెండు వందల యాభై రూపాయలు అదే రోజుకు రెండువేలు. వివిధ పరిశ్రమలు, రంగాలలో వున్న కనీస వేతనాల మొత్తాలను చూస్తే కార్మికులు ఎంత దోపిడీకి గురవుతున్నారో చెప్పనవసరం లేదు. అ తక్కువ మొత్తాలను కూడా దశాబ్దాల తరబడి సవరించని ప్రభుత్వాలున్నాయి. ఇవి చట్టాలను నీరుగార్చటమే. అవసరాల మేరకు పెంపుదల సంగతిపక్కన పెడితే అసలు ఏదో ఒక సవరణ కోసం కూడా వుద్యమించాల్సిన రోజులివి. ఈ పూర్వరంగంలో కార్పొరేట్లకు మరింత లబ్ది చేకూర్చేందుకు సంస్కరణల పేరుతో కాంగ్రెస్‌ అమలు జరప ప్రయత్నించిన వాటిని బిజెపి ఆచరించేందుకు పూనుకుంది. ఇది అధికార దుర్వినియోగం కాదా ? దీన్నెవరు ప్రశ్నించాలి, కోర్టు పరిభాషలో చెప్పాలంటే ఈ పరిస్ధితిని ఎలా సరిచెయ్యాలి?

బిజెపి పాలిత రాజస్ధాన్‌ కార్మిక చట్టాల సవరణ ప్రయోగశాలగా తయారైంది.అక్కడి పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో( వుత్పత్తి నెమ్మదించటం) అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు.ఏ కారణంతో వుత్పత్తి తగ్గినా, కార్యకలాపం విఫలమైనా దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు. అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి తిరిగి పూర్వ పరిస్ధితిలోకి నెట్టారు. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను వుల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను వుల్లంఘించిన వుదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. 2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌(క్రమబద్దీకరణ, రద్దు)చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవే శపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన ఘనత బిజెపి ఖాతాలో చేరింది. ఇది దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా రాజస్ధాన్‌లోని 7622 ఫ్యాక్టరీలలో 7252 కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది. యాంత్రీకరణ, రోబోల వినియోగం మరింతగా పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి సవరణలు చేయటం అంటే అత్యధిక ఫ్యాక్టరీలు, సంస్ధలను కార్మిక చట్టాల పరిధి నుంచి తొలగించటమే. అలాంటపుడు కనీసవేతనాలను సవరించినా వుపయోగం ఏముంది? ప్రభుత్వం యజమానులు ఏం చేయాలనుకుంటే అందుకు వారికి అనుమతిచ్చే చర్యలకు ముద్దుగా ‘సంస్కరణలు’ అని పేరు పెట్టింది.

ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులుగా వున్నారు.పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల వుల్లంఘనలపైనే అన్నది స్పష్టం. చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల వుద్యోగాలు పోతున్నాయి. ఇటువంటి పరిస్ధితిని అన్ని రాష్ట్రాలలో రుద్దాలని చూస్తున్నారు. లేదా వున్న చట్టాలను అమలు జరపకుండా వుపేక్షిస్తున్నారు. కార్మికవర్గానికి ఇదొక సవాల్‌.

ప్రపంచవ్యాపితంగా ధనిక దేశాలన్నింటా అప్రెంటిస్‌షిప్‌(నైపుణ్య శిక్షణ) పేరుతో పెద్ద ఎత్తున పర్మనెంటు కార్మికుల స్ధానంలో కార్మిక చట్టాల పరిధిలో లేని కార్మికులను నియమిస్తున్నారు. వారికి తక్కువ వేతనాలు, అలవెన్సులు చెల్లించేందుకు ఇదొక దొంగదారి అన్నది తెలిసిందే. మన దేశంలో కూడా అప్రెంటిస్‌షిప్‌ చట్టాన్ని సవరించి శిక్షణలో వున్న వారు చేయకూడని పనులను కూడా వారితో చేయించేందుకు, పెద్ద ఎత్తున నియామకానికి తెరతీశారు. శిక్షణా కాలంలో అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించేవిధంగా పధకాలు సిద్దం చేశారు. ఇది యజమానులకు మరొక అదనపు రాయితీ.

ే మన సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్న మనువాదుల దృష్టిలో మేడే పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. నిజమే ! మనం చెప్పుకుంటున్న ప్రజాస్వామిక వ్యవస్ధ, భావజాలం సైతం పశ్చిమ దేశాల నుంచి అనుకరించింది కాదేమిటి? అంతెందుకు మన నిత్య జీవితంలో ఇతర దేశాల నుంచి అనుకరిస్తున్నవి, వినియోగిస్తున్నవి ఎన్ని వున్నాయో ఎవరికి వారు ఆలోచించుకోండి. ప్రపంచ మానవుడు ఎక్కడ మంచి వుంటే దాన్ని, ఎవరు జీవనాన్ని సుఖమయం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తే దానిని స్వంతం చేసుకోలేదా ? ఒక దేశం నుంచి ఖండం నుంచి మన దేశం ప్రపంచానికి నాగరికత అంటే ఏమిటో నేర్పిందని కొంత మంది చెబుతారు. మన దాన్ని ఇతరులు అనుసరించినపుడు మే డే వంటి వాటిని దాని వెనుక వున్న పురోగామి భావజాలాన్ని విదేశీ అంటూ మనకు పనికి రాదని పక్కన పెట్టమంటున్నారంటే అర్ధం ఏమిటి? ఏ పదజాలం వెనుక ఏ అర్ధం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే వుంటారని మార్క్సిజాన్ని తొలిసారిగా తమ దేశానికి అన్వయించి తొలి శ్రామికవర్గ రాజ్య స్ధాపనకు నాయకత్వం వహించిన లెనిన్‌ చేసిన హెచ్చరికను తీసుకోవటానికి ఆయన విదేశీయత అడ్డం వస్తుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిశంసన-పత్రికా స్వేచ్చను అడ్డుకొనే యత్నం !

23 Monday Apr 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

CJI impeachment, Free press, freedom of media, India press freedom

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా తీరుతెన్నులపై మీడియాతో మాట్లాడిన నలుగురు సుప్రీం న్యాయమూర్తులు

ఎం కోటేశ్వరరావు

ప్రధాన కార్మదర్శి, నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ (ఎన్‌ఏజె)

ఒక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసిస్తూ లేదా తొలగించాలని కోరుతూ నిబంధనల ప్రకారం ఒక తీర్మానం లేదా పిటీషన్‌ అందచేయటం స్వతంత్రభారత చరిత్రలో తొలిసారిగా జరిగింది. ఇదే సమయంలో ఈ ప్రక్రియకు సంబంధించి వార్తలు ప్రచురించకుండా మీడియాను ఆదేశించాలని ఒక స్వచ్చంద పేరుతో సుప్రీం కోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు కావటం కూడా తొలిసారే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఇలాంటి పిటీషన్‌ అందచేయటం తొలిసారే అయినప్పటికీ గతంలో ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి వి.రామస్వామిపై మొదటిసారి ఒక తీర్మానం అందచేయటం, దానిపై పార్లమెంటు చర్చించటం చరిత్రలో తొలిసారి. దీపక్‌ మిశ్రాపై పిటీషన్‌ రాజకీయ కుట్రలో భాగమే అని, జస్టిస్‌లోయా సహజమరణం చెందారన్న తీర్పు ఇచ్చిన కారణంగానే ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాపై తీర్మానం అందచేశారని న్యాయశాఖ మంత్రి అరుణ్‌ జెట్లీ అన్యాయమైన ఆరోపణ చేశారు. దీపక్‌ మిశ్రాపై తీర్మానానికి లోయా మరణంపై తీర్పుకు సంబంధం లేదు. జనవరి మూడవ వారంలోనే సిపిఎం నేత సీతారాం ఏచూరి తీర్మానం గురించి ఇతర పార్టీలతో సంప్రదిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసినదే. అందువలన దీపక్‌ మిశ్రాను సమర్ధించేందుకు అధికారపక్షం ముందుగానే నిర్ణయించుకున్నట్లు వేరే చెప్పనవసరం లేదు.

అభిశంసన విషయమై మీడియాను కట్టడి చేయాలని సూచన చేస్తూ లా కమిషన్‌ ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చిందని, అభిశంసన ప్రక్రియపై రాయకుండా కట్టడి చేసే అంశం రాజ్యాంగంలో కూడా వుందని, అలా రాయటం వలన న్యాయమూర్తుల విధుల నిర్వహణపై ప్రభావం పడుతుందంటూ పిటీషన్‌ దాఖలు చేసిన స్వచ్చంద సంస్ధతరఫు న్యాయవాది వాదించారు. ఈ అంశంపై రాజకీయ నాయకులు కొంతకాలంగా మాట్లాడుతున్నారని, మీడియా వాటిని నివేదిస్తున్నదని న్యాయమూర్తులు భయపడకుండా తమ విధులు నిర్వర్తించాలంటే మీడియాను కట్టడి చేయాలని కూడా కోరారు.పార్లమెంట్‌ ముందు ఎలాంటి పిటీషన్‌ లేకుండానే రాజకీయ నేతలు ఒక న్యాయమూర్తి తొలగింపు గురించి అన్ని రకాల ప్రకటనలు చేస్తున్నారని, అలాంటి చర్చలు సంబంధిత న్యాయమూర్తి పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని, అందువలన అలాంటి ప్ర కటనలు చేయకుండా వాటిని మీడియా ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎన్‌జీఓ సంస్ధ న్యాయవాది పేర్కొన్నారు.అయితే అటార్నీ జనరల్‌ ఏమి చెపుతారో వినకుండా తామేమీ నిర్ణయించలేమని పేర్కొన్న బెంచ్‌ కేసును మే 7వ తేదీకి వాయిదా వేసింది. ప్రతిపక్ష సభ్యులు గత శుక్రవారం నాడు అందచేసిన తీర్మానంపై తగినంత కసరత్తు లేకుండా రాజ్యసభ అధ్యక్షుడు, వుపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయకుడు సోమవారం నాడు తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించటంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. తీర్మాన తిరస్కరణను సుప్రీం కోర్టులోనే సవాలు చేస్తామని ప్రకటించటంతో ఒక వేళ నిజంగానే పిటీషన్‌ దాఖలైతే దాని విచారణ ఎవరితో కూడిన బెంచ్‌కు అప్పగిస్తారు అన్నది ఆసక్తికరం. ఏ కేసును ఎవరు విచారించాలన్నది ప్రధాన న్యాయమూర్తి విచక్షణే అనటాన్ని కొందరు సీనియర్‌ న్యాయమూర్తులు సవాలు చేసిన పూర్వరంగంలో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఏకంగా తన అభిశంసనపైనే వచ్చే పిటిషన్‌పై ఏం చేస్తారు అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

నిజంగా రాజ్యాంగంలో మీడియాను నియంత్రించాలనే స్పష్టమైన నిబంధన వుంటే లేదా లా కమిషన్‌ సూచనకు చట్టబద్దత వుంటే సుప్రీం కోర్టు ఈ పాటికి నిషేధం విధించి వుండేది. అది లేదు కనుకనే సుప్రీం కోర్టు బెంచి ఎలాంటి వుత్తరువు జారీ చేయకుండా అటార్నీ జనరల్‌ అంటే ప్రభుత్వ సాయం కోరింది. ప్రజాప్రతినిధులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని వ్యాఖ్యానించింది. అభిశంసన ప్రక్రియపై నివేదించకుండా లేదా వ్యాఖ్యానించకుండా చర్యతీసుకోవచ్చని అటార్నీ జనరల్‌ సూచిస్తే సమస్య ఏమిటన్నది ప్రశ్న. ఇప్పటికే కుహనా లేదా నకిలీ వార్తల సాకుతూ జర్నలిస్టుల గుర్తింపును రద్దు చేసేందుకు సమాచార, ప్రసారశాఖ ప్రయత్నించి నిరసనతో వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అంశంపై కూడా జర్నలిస్టులు మౌనం దాల్చితే రేపు ఏం జరిగినా ఆశ్చర్యం లేదు.

నేడు దేశంలో ఏ వ్యవస్ధా విమర్శకు అతీతంగా లేదు. ఏకంగా నలుగు సుప్రీం కోర్టు న్యాయమూర్తులే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీరుతెన్నులను తప్పుపడుతూ మీడియాకు ఎక్కిన తరువాత మీడియాను కట్టడి చేయటమంటే అది మీడియా స్వేచ్చను అడ్డుకోవటం తప్ప వేరు కాదు. రాజ్యాంగంలో న్యాయమూర్తులను తొలగించేందుకు అవకాశం వున్నపుడు, అవసరమని భావించినపుడు ప్రజాప్రతినిధులు దానిని వుపయోగించుకోవటం, మీడియాలో చర్చ జరగటం ప్రజాస్వామిక లక్షణం తప్ప వేరు కాదు. అటార్నీ జనరల్‌ సలహా కోరటమంటే ఇతరుల భుజాలమీద నుంచి కాల్చేందుకు చేసే యత్నమని అనుకొనే అవకాశం లేదా ? రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించాలంటే ఆర్టికల్‌ 124(4) ఆర్టికల్‌ 125(5) మేరకు పార్లమెంట్‌ వుభయ సభలలో హాజరైన సభ్యులలో మూడింట రెండువంతులకు తక్కువ కాకుండా తీర్మానం ఆమోదించినపుడు, అదే సమావేశాలలో అధ్యక్షుడికి అందచేసినపుడు తొలగిస్తూ వుత్తరువు జారీ చేసినపుడు అమలులోకి వస్తుంది.

మన దేశంలో మీడియా స్వేచ్చను అడ్డుకొనేందుకు ఏ అవకాశం దొరికినా ఎవరూ వదలటం లేదు. అదే సమయంలో పలు సందర్భాలలో కోర్టులు దానిని కాపాడేందుకు చేస్తున్న కృషిని కూడా మరువలేము. ప్రతి వ్యవస్ధ అధికారంతో ప్రభావితమౌతున్న పూర్వరంగంలో మీడియా స్వేచ్చ విషయంలో ఎవరు అతీతంగా వుండగలరన్న ఆందోళన వ్యక్తం కావటం సహజం. బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జయంత్‌ షా వ్యాపారలాభం ఇబ్బడి ముబ్బడిగా పెరగటంపై వార్తను ప్రచురించిన ‘వైర్‌’ వెబ్‌సైట్‌పై పరువు నష్టం కేసుదాఖలు చేసిన విషయం తెలిసినదే. ఈ కేసు విచారణ సందర్భంగా మీడియాను వార్తలు ప్రచురించకుండా కట్టడి చేయాలని జయంత్‌ షా తరఫున్యాయవాదులు చేసిన వినతిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా తిరస్కరిస్తూనే మీడియాను తీవ్రంగా విమర్శించారు. ఆధారం లేని వార్తలు ప్రచురిస్తున్నప్పటికీ వాటిని కట్టడి చేస్తూ వుత్తరువు జారీ చేయటం లేదన్నారు. తన అభిప్రాయాలను కొందరు విమర్శిస్తారని, తన తీర్పులు పత్రికా స్వేచ్చ పరిమితులను కుదించాయనే విమర్శలకు వాటికి పెద్ద తేడాలేదన్నారు.’ ఏమి రాయటానికైనా వారికి స్వేచ్చ వుందా ? వారు రాసినవి కొన్ని సందర్భాలలో పూర్తిగా కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయి. బుర్రలోకి ఏది వచ్చినా దానిని రాయటం జర్నలిజం సంస్కృతి కాదని, వారికి కొన్ని స్వంత వెబ్‌సైట్లు వున్నంత మాత్రాన దేన్నిబడితే దానిని వారు ప్రచురించరాదని అన్నారు. 2015లో జస్టిస్‌ మిశ్రా చారిత్రకంగా గౌరవనీయులైన వ్యక్తులపై విమర్శల జోలికి పోకుండా వుండేందుకు ప్రయత్నించాలని, భావ ప్రకటనా స్వేచ్చ, వ్యక్తీకరణకు పరిమితులు వుండాలన్నారు. మరొక కేసులో 2016లో ఆయన నాయకత్వంలోని బెంచ్‌ క్రిమినల్‌ డిఫమేషన్‌ చట్టాన్ని సమర్ధిస్తూ భావ ప్ర కటనా స్వేచ్చ కంటే కీర్తి ప్రతిష్టలు వున్నతమైనవని వ్యాఖ్యా నించింది. సినిమా హాళ్లలో జాతీయగీతాన్ని విధిగా వినిపించాలని, ఆ సందర్భంగా మినహాయింపులున్నవారు తప్ప ప్రతి ఒక్కరూ విధిగా లేచి నిలబడాలని తీర్పు నిచ్చింది కూడా మిశ్రాయే అన్న విషయం తెలిసిందే. ఏడాది తరువాత ఆ వుత్తరువును వుపసంహరించుకున్న అంశమూ ఎరిగినదే.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాను అభిశంసిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన తీర్మానాన్ని వుపరాష్ట్రపతి, రాజ్యసభ వుపాధ్యక్షుడు ఎం వెంకయ్య నాయుడు సోమవారం నాడు త్రోసిపుచ్చారు. తీర్మానంపై సంతకాలు చేసిన వారు తమ వాదనలను సమర్ధించుకొనేందుకు తగినన్ని వాస్తవాలను అందించలేకపోయారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ విలేకర్లతో మాట్లాడుతూ వుపరాష్ట్రపతి నిర్ణయం చట్టవిరుద్దమని, అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించటంపై సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. దీనిని విచారణకు తీసుకోవాలా తిరస్కరించాలా అనే అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని తాము కోరుకుంటున్నామని, కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని సిబల్‌ చెప్పారు. వుపరాష్ట్రపతి ఇంత వేగంగా తీర్మానంపై నిర్ణయం తీసుకోవటాన్ని తప్పుపడుతూ అసలు ఆయనకు తీర్మాన మంచి చెడ్డలను నిర్ణయించే, తిరస్కరించే అధికారమే లేదని, ఇచ్చిన తీర్మానం సరిగ్గా వుందా లేదా తగినంత మంది సంతకాలు చేశారా లేదా చేసిన సంతకాలు నిజమైనవా కాదా అని మాత్రమే నిర్ణయించేందుకు పరిమితం కావాలని సిబల్‌ చెప్పారు.

స్వతంత్ర భారత చరిత్రలో ఇంత వరకు ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీదనే అభిశంసన తీర్మానం వచ్చింది. అది కూడా వీగిపోయింది. తాజాగా దీపక్‌ మిశ్రామీద వచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ వుపాధ్యక్షుడు తిరస్కరించటంతో కొత్త సమస్య తలెత్తింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామస్వామి పంజాబ్‌-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1987నవంబరు 12 నుంచి 1989 అక్టోబరు ఆరువరకు పని చేసి తరువాత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినపుడు ఆయన నివాసం పేరుతో చేసిన దుబారా ఖర్చుల గురించి 1990లో మీడియా రాసింది.1991 ఫిబ్రవరి ఒకటిన సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఒక తీర్మానం చేస్తూ ఆయనను తొలగించాలని, ఎలాంటి న్యాయపరమైన పని అప్పగించవద్దని నాటి ప్రధాన న్యాయమూర్తికి నివేదించింది. నాడు ప్రతిపక్షంలో వున్న బిజెపి, వామపక్ష పార్టీలు కలసి పార్లమెంట్‌కు ఒక అభిశంసన నోటీసు అందచేశాయి.లోక్‌సభ స్పీకర్‌ రబీరే నోటీసులోని ఆరోపణలపై విచారణకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి పిబి సావంత్‌, బోంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిడి దేశాయ్‌, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఓ చిన్నప్పరెడ్డితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రామస్వామిపై వచ్చిన 14లో 11ఆరోపణలు వాస్తవమే అని తేల్చారు. 1993 మే పదవ తేదీన లోక్‌సభ తీర్మానంపై చర్చ జరిపింది.ఓటింగ్‌ నిర్వహించగా అనుకూలంగా 196 ఓట్లు వచ్చాయి. వ్యతిరేక ఓట్లేమీ రాలేదుగానీ 205 మంది కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాల సభ్యులు ఓటింగ్‌కు గైరు హాజరు కావటంతో తగినన్ని ఓట్లు లేక వీగిపోయింది. దీపక్‌ మిశ్రాపై ఇచ్చిన తీర్మానంపై ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటి తీర్మానాలపై చర్చ జరగకుండా మీడియాను కట్టడి చేయాలా లేదా అనే అంశంపై అటార్నీ జనరల్‌ ఏ అభిప్రాయం చెబుతారు, సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, అది మీడియా స్వేచ్చపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనేది యావత్‌ జర్నలిస్టులకే కాదు, మొత్తం సమాజానికి సంబంధించి అంశం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిరియాపై దాడులతో రెచ్చగొడుతున్నడోనాల్డ్‌ ట్రంప్‌ !

18 Wednesday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

chemical weapons, Donald trump, RUSSIA, Syria, UN and OPCW

Image result for syria attack

ఎం కోటేశ్వరరావు

‘ఒక బీరు కొని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో కలసి తాగుతూ స్వయంగా నా అనుభవాలను పంచుకోవాలనుంది. సిరియా పౌరుల కోసం ఏదో ఒకటి చేసేందుకు ఆయన ప్రయత్నించంటం నాకు సంతోషంగా వుంది.’ గత నాలుగు సంవత్సరాలుగా అమెరికాలో ఆశ్రయం పొంది జర్నలిస్టు ముసుగులో సిరియాపై తప్పుడు ప్రచారం సాగిస్తున్న కాశీమ్‌ ఇద్‌ అనే ఒక ఐఎస్‌ఏజంట్‌ గతవారంలో సిరియాపై దాడుల తరువాత సిఎన్‌ఎన్‌ టీవీతో చేసిన వ్యాఖ్య. అమెరికా నాయకత్వంలో ఫ్రెంచ్‌, బ్రిటన్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతర కొన్ని దేశాలు జరిపిన దాడులతో ఐఎస్‌ ఏజంట్ల ఆనందం ఎలా వుందో ఇది తెలుపుతోంది. నేను సైతం తక్కువ తిన్నానా అంటూ నాలుగు సంవత్సరాల క్రితం బరాక్‌ ఒబామా తన వంతుగా ఒక దాడి జరిపితే, నీకంటే పెద్ద వెధవాయను నేను అంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ గతేడాది ఒకసారి ఇప్పుడు మరోసారి దాడులు జరిపించాడు. గతంలో ఐఎస్‌ తీవ్రవాదులను అణచే పేరుతో, ఇప్పుడు ప్రభుత్వమే తన పౌరులపై రసాయనిక ఆయుధాలను ప్రయోగిస్తోందనే ముసుగుతో దాడికి పాల్పడింది. చరిత్రలో ఇంత వరకు నాజీలు తప్ప ఎవరూ రసాయనిక ఆయుధాలతో సామూహిక హత్యలు చేసిన వుదంతాలు కానరావు. తమ దగ్గర ఎలాంటి రసాయన ఆయుధ కార్యక్రమం లేదు కనుక వత్తిడికి తలగ్గిన సిరియా ఏవైనా వుంటే వాటి నిర్మూలనకు అమెరికాతో ఒక ఒప్పందం కూడా చేసుకుంది. దాన్ని అమలు జరపకుండా, అంతర్జాతీయ న్యాయాన్ని వుల్లంఘించి ఎలాంటి చట్టబద్దత లేకుండా జరిపిన దాడి ఇది. అణు జలాంతర్గాములు, అణ్వాయుధాలను మోసుకుపోయే విమానవాహక యుద్ధ నౌకలతో మోహరించి 2003లో ఇరాక్‌ తరువాత జరిపిన పెద్ద దాడి ఇది.ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నారనే వార్తలు ఒకవైపు, రష్యాకు చెందిన ఒక డబుల్‌ ఏజంట్‌, అతని కూతురిపై విష ప్రయోగం జరిపిందనే సాకుతో అనేక మంది రష్యా రాయబార సిబ్బందిని ఐరోపా దేశాల నుంచి బహిష్కరించటం వంటి పరిణామాలను చూస్తే పశ్చిమ దేశాలు గిల్లి కజ్జాలకు పూనుకున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మిలిటీకరణ జరిగింది. ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ధలే అక్కడ ఆయుధాలు తయారు చేస్తాయి. అందువలన వాటికి లాభాలు రావాలంటే ప్రపంచంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల రావణకాష్టం మాదిరి య దానికి ఎక్కడో ఒక చోట యుద్ధాలు, దేశాల మధ్య వుద్రిక్తతలు వుంటే తప్ప జరుగుబాటు వుండదు. మిలిటరీ పరిశ్రమలను మేపేందుకు అమెరికా పాలకవర్గం ఇప్పటికే స్కూళ్ల ప్రయివేటీకరణ, నిధుల కోత, మౌలిక సౌకర్యాల తగ్గింపు, గృహ, వైద్య రంగాల నుంచి తప్పుకోవటం వంటిచర్యల ద్వారా జనజీవితాలను దిగజార్చటంతో పాటు నిరుద్యోగం, దారిద్య్రాన్ని పెంచుతోంది. రెండోవైపు అంతర్జాతీయంగా దాడులకు తలపడుతోంది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలమని ప్రగల్భాలు పలికే పశ్చిమ దేశాలు జరిపిన ఈ దాడిని అనేక దేశాలు, సమాజాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పశ్చిమాసియాలో, తద్వారా ప్రపంచ యుద్ధానికి పశ్చిమ దేశాలు అర్రులు చాస్తున్నాయని అనేక మంది భయపడుతున్నారు.అంతర్గతంగా వైఫల్యాలబాటలో వున్న ట్రంప్‌ వాటిని పక్కదారి మళ్లించేందుకు, నవంబరులో జరగనున్న పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికలలో ఓట్లు పొందేందుకు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వచ్చాయి. సిరియా రసాయక ఆయుధాలను ప్రయోగించిందని ఆరోపించటం కాదు, అంతర్జాతీయ సంస్ధల ద్వారా దర్యాప్తు జరిపించాలి. దాని గురించి ఐక్యరాజ్యసమితిలో చర్చ జరపాలి. ఏ చర్య తీసుకున్నా దాని అనుమతితో, పర్యవేక్షణలో జరపాలి తప్ప అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ నేతలు ముగ్గురూ కూర్చొని సిరియాపై దాడులు చేయటానికి వారెవరు?

Image result for syria attack

సిరియా వద్ద వున్న రసాయనిక ఆయుధాల సామర్ధ్యాన్ని దెబ్బతీసే పేరుతో జరిపిన ఈ దాడులు ప్రపంచాన్ని భయపెట్టేందుకు తప్ప మరొకందుకు కాదు. నిజంగా ఎవరైనా రసాయనిక ఆయుధాలను తయారు చేస్తుంటే గత నాలుగైదు సంవత్సరాలుగా దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికా ప్రకటనల తరువాత కూడా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటారా? వర్తమాన పరిస్ధితుల్లో ఏ దేశానికాదేశం తన రక్షణ కోసం అన్ని రకాల ఆయుధాల తయారీకి పూనుకోవటం బహిరంగ రహస్యం. వాటిలో ఒకటైన జీవ, రసాయన ఆయుధాల్లేని పెద్ద దేశాలేవీ లేవు. కొన్ని బహిర్గతమైతే కొన్ని రహస్యంగా చేస్తుంటాయంతే తేడా. గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం సిరియా 1300 టన్నుల రసాయన ఆయుధాలను నాశనం చేసింది. అయినా సరే దాని దగ్గర ఇంకా ఎక్కడో వున్నాయన్నది పశ్చిమ దేశాల ఆరోపణ. ఐక్యరాజ్యసమితిలోని రసాయనాయుధాల నిషేధ సంస్ధ(ఒపిసిడబ్ల్యు) సిరియా రసాయన ఆయుధాలను ధ్వంసం చేసినందుకు గాను 2013లో నోబెల్‌ శాంతి బహుమతి కూడా పొందింది. మరుసటి ఏడాది సెప్టెంబరు నాటికి 96శాతం ఆయుధాలను నాశనం చేసినందున, తయారీ కేంద్రాల విధ్వంసానికి నిర్ణయించిందని , 2016జనవరిలో మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు ఆ సంస్ధ ప్రకటించింది. నిజానికి అవన్నీ 1970దశకం నుంచి రూపొందించినవి. అలాంటపుడు తిరిగి ఏడాది కూడా గడవక ముందే సిరియా వద్ద రసాయనిక ఆయుధాలు గుట్టలు పడ్డాయని పశ్చిమ దేశాలు ప్రకటించాయంటే ఆధారం ఏమిటి? ప్రతి దేశంలోనూ పారిశ్రామిక అవసరాల కోసం వుపయోగించే క్లోరీన్‌ గాస్‌ను రసాయనికాయుధాల తయారీకి కూడా వుపయోగించవచ్చు. దీనిని చూపే సిరియాపై పశ్చిమ దేశాలు ఆరోపణలకు దిగాయి. తరువాత ఓపిసిడబ్ల్యు, ఐరోసా సంయుక్త దర్యాప్తు వ్యవస్ధను(జిమ్‌) ఏర్పాటు చేశాయి. ఆ జిమ్‌ కొత్తగా సిరియా రసాయనికాయుధాల గురించి ఒక నివేదిక సమర్పించింది. అది అమెరికా అనుకూల తొత్తు నివేదిక అని రష్యా గుర్తించేందుకు నిరాకరిస్తోంది. దాని ఆధారంగా ఎలాంటి చర్య తీసుకోకూడదని రష్యా ఐరాసలో వీటో చేసింది. అందువలన అమెరికా నాయకత్వంలోని కూటమి ఇప్పుడు ఏకపక్షంగా దాడులు చేసింది. ఆనక తీరికగా దర్యాప్తు అంటూ కబుర్లు చెబుతోంది.

అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌ చెప్పినదాని ప్రకారం 105 దీర్ఘకాలిక శ్రేణి క్షిపణులను ప్రయోగించిన పెద్ద దాడి ఇది, ఒక్కసారికే ఇది పరిమితం అని చెప్పినప్పటికీ ప్రపంచ స్పందనను చూసేందుకు చేసిన ఒక ప్రయోగమని చెప్పవచ్చు. తన నూతన, నవీకరించిన ఆయుధాలు ఎలా పని చేస్తాయో పరీక్షించేందుకు గతంలో ఇరాక్‌ మొత్తాన్ని తన యుద్ద ప్రయోగశాలగా మార్చింది. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. కొద్ది రోజుల క్రితం డోనాల్డ్‌ ట్రంప్‌ రష్యాను బెదిరిస్తూ చేసిన ఒక ట్వీట్‌లో కొత్తవి, చక్కని, చిన్నవైన క్షిపణులు వస్తున్నాయి కాచుకోండి అని పేర్కొన్నారు. సిరియా రాజధాని డమాస్కస్‌లోని జీవ, రసాయన ఆయుధాల రూపకల్పన, తయారీ, పరీక్షా కేంద్రం మీద, హామ్‌ అనే పట్టణంలోని రసాయనిక ఆయుధాల గోడవున్‌ మీద, మూడవ దాడి దానికి సమీపంలోనే వున్న ఒక బంకర్‌ మీద క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికన్లు చెబుతున్నారు. అమెరికన్లు చెబుతున్నదే వాస్తవమైతే ఆయుధ గోడవున్లపై బాంబులు వేస్తే అవి పేలి ఈ పాటికి ఎంతో ప్రాణ నష్టం జరిగి వుండాల్సింది. అలాంటి వార్తలేవీ రాలేదు కనుక సిరియా ప్రకటించినట్లు దాని వైమానిక సైనిక కేంద్రాలు, విమానాశ్రయాల మీద మాత్రమే దాడులు జరిగాయని అనుకోవాల్సి వస్తుంది.మరోవైపున ప్రయోగించిన 103లో 71క్షిపణులను సిరియా వైమానిక రక్షణ వ్యవస్ధలు కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. రష్యా వద్ద వున్న అధునాతన క్షిపణి విధ్వంసక వ్యవస్ధలు సిరియాలో ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి.

సిరియా ప్రభుత్వం రసాయనిక ఆయుధాలతో దాడులు జరుపుతోందంటూ ఒక పధకం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ దేశాల మీడియా ప్రచారం చేస్తోంది. అలాంటి దాడులు జరిపింది సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు పశ్చిమ దేశాల సాయంతో దాడులు చేస్తున్న కిరాయి ఐఎస్‌ తీవ్రవాదులు తప్ప మరొకరు కాదని గతంలోనే వెల్లడైంది. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే చివరికది నిజమై కూర్చుంటుందన్న నాజీ గోబెల్స్‌ సిద్ధాంతం ప్రకారం సిరియాపై రసాయనిక ఆయుధాల ప్రయోగ ప్రచారం జరుగుతోంది. 2003లో బుష్‌ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇరాక్‌పై దాడులు చేసేందుకు చేసిన ప్రచారాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. ఆ దేశ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ ప్రత్యర్ధి దేశాలపై దాడులు చేసేందుకు మారణాయుధాలను గుట్టలుగా పోగేశాడంటూ పెద్ద ఎత్తున చేసిన ప్రచారాన్ని, ప్రభుత్వాన్ని కూల్చివేసి, అక్కడి చమురుబావులను స్వాధీనం చేసుకొని, సద్దాంను వురితీసిన తరువాత అలాంటి ఆయుధాలేమీ కనపడలేదని పశ్చిమ దేశాలే ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.

ఆసియా,ఐరోపా, ఆఫ్రికా ఖండాల సంగమ ప్రాంతం వంటి మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా మిలిటరీ రీత్యా వ్యూహాత్మకం, చమురువంటి సహజ సంపదల నిలయమైన ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకొనేందుకు చరిత్రలో ప్రతి సామ్రాజ్యవాదీ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రపంచాన్ని తన గుప్పిటలో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా ఆలోచన నిరంతరం దీని చుట్టూతిరుగుతూనే వుంటుంది. అందుకు గాను గోతికాడ నక్కలా అవకాశాల కోసం వేచి చూస్తుంటుంది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ప్రాంత దేశాల పాలకులపై పెల్లుబికిన అసంతృప్తితో 2010లో ట్యునీసియాలో ప్రారంభమై మధ్య ప్రాచ్యం, వుత్తర ఆఫ్రికాలోని పలు దేశాలకు విస్తరించిన ఆందోళనలను అరబ్‌ వసంతోదయంగా వర్ణించారు. ఆ సమయంలో పనిలో పనిగా అమెరికన్లు తమ అజెండాల్లో వున్న దేశాలలోని పాలకులను తొలగించేందుకు తమ తొత్తులు ఏజంట్లను ప్రయోగించి అక్కడ కూడా తిరుగుబాట్లు ప్రారంభమైనట్లు ఒక పెద్దకుట్రకు తెరతీశారు. దానిలో ఒకటి సిరియా. గోడల మీద ప్రభుత్వవ్యతిరేక నినాదాలు రాసిన విద్యార్దులను అరెస్టు చేసిందనే పేరుతో 2011 మార్చినెలలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు తెరతీశారు.తొలుత అంతర్గత తిరుగుబాటుగా మీడియా చిత్రించింది. కొద్ది నెలల్లోనే వివిధ దేశాల నుంచి ఐఎస్‌ తీవ్రవాదులు, కిరాయి మూకలను సమీకరించి పశ్చిమ దేశాలు అడుతున్న నాటకంగా వెల్లడైంది. ప్రతిగా వారిని అణచివేసేందుకు సిరియా సర్కార్‌ పూనుకుంది. తాము కూడా ఐఎస్‌ తీవ్రవాదులను అణచివేసేందుకు సిద్ధమే, సిరియాకు సాయం చేస్తామంటూ సరికొత్త నాటాకానికి తెరతీసిన పశ్చిమ దేశాలు త్వరలోనే అక్కడి అసాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసే సత్తా ఐఎస్‌ తీవ్రవాదులకు లేదని గ్రహించించాయి. తీవ్రవాదులకు ఆయుధాలు ఇచ్చింది కూడా వారేనని తేలింది. అప్పటి నుంచి తీవ్రవాదుల పట్టులో వున్న ప్రాంతాలను స్వాధీనం చేసుకొనేందుకు రసాయనికి ఆయుధాలను ప్రయోగిస్తోందంటూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. నిజానికి వాటిని ప్రయోగించింది తిరుగుబాటుదారులే అని తేలింది.

2012 ఆగస్టు 20న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక ప్రకటన చేస్తూ సిరియా సర్కార్‌ రసాయన ఆయుధాలను గనుక ప్రయోగిస్తే అమెరికా గీచిన ఎర్ర(హెచ్చరిక అనే బెదిరింపు) గీతను దాటినట్లుగానే భావించాల్సి వుంటుందని బెదిరించాడు.2014లో ఒబామా సిరియా మీద దాడులు చేయించాడు. అయితే ఐఎస్‌,ఆల్‌ఖైదా వుగ్రవాదుల మీద దాడి అంటూనే సిరియా సామర్ధాన్ని దెబ్బతీసేందుకు పెద్ద ప్రయత్నం చేసి బక్కబోర్లాపడ్డాడు. అప్పటి వరకు అంతర్జాతీయ వేదికల మీద రాజకీయ మద్దతు మాత్రమే తెలుపుతున్న రష్యా ప్రత్యక్షంగా 2015 సెప్టెంబరు నుంచి తన మిలిటరీ నిపుణులు, సామగ్రిని సిరియాకు తరలించి తిరుగుబాటుదార్లను అణచేందుకు తోడ్పడుతోంది. అప్పటి నుంచి సిరియాపై దాడులకు పెంటగన్‌ ఎదురు చూస్తోంది. అదే ఏడాది నవంబరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎన్నికైతే ఐఎస్‌పై దాడులకు సిరియాకు పదాతి దళాలను కూడా పంపేందుకు వెనుకాడను అని ప్రకటించాడు. ఎన్నిక తరువాత తిరిగి అదే ప్రకటన చేస్తూ రష్యాతో పోరును కూడా మనం ముగించాల్సి వుంది అని సిరియా అధ్య క్షుడు అసద్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించాడు. గతేడాది ఏప్రిల్‌లో అమెరికా 59 తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులను సిరియాపై ప్రయోగిచింది. సిరియాను ఆక్రమించేందుకు అమెరికన్లు చేస్తున్న తప్పుడు ప్రచారం దాని బలహీనతలనే బయటపెడుతున్నది. నిజంగానే అసాద్‌ ప్రభుత్వం వద్ద రసాయన ఆయుధాలు వుంటే, ఇటీవల కూడా ప్రయోగించినట్లు అమెరికా చెప్పటం అంటే నాలుగు సంవత్సరాలలో జరిపిన మూడు దాడులు ఎలాంటి ప్రభావం చూపలేదన్నది స్పష్టం. అయితే తాజాగా మూడోసారి ఎందుకు జరిపినట్లు అన్నది ప్రశ్న. బ్రిటీష్‌ రక్షణ మంత్రి గవిన్‌ విలియమ్స్‌న్‌ బిబిసితో మాట్లాడుతూ తాము చేసిన దాడి అక్కడి అంతరుద్ద్యంలో జోక్యం లేదా పాలకుల మార్పు కోసం చేసింది కాదు, ఇది ఆప్రాంతంలో వుద్రిక్తతలు మరింతగా పెరగకుండా తీసుకున్న పరిమిత, లక్షిత దాడి అన్నారు. తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డికోసమన్న సమాధానమిది. ఈనెల ఏడవ తేదీన సిరియా మిలిటరీ ప్రయోగించిన క్లోరీన్‌, ఇతర గుర్తు తెలియని గ్యాస్‌ వల్ల అనేక మంది పౌరులు మరణించారన్న కట్టుకథను ఆధారం చేసుకొని పదమూడవ తేదీన దాడి జరిపారు. ముందే చెప్పుకున్నట్లు అమెరికాలో ఆయుధాలను తయారు చేసేది ప్రయివేటు సంస్ధలు. ఇప్పుడు ప్రయోగిస్తున్న తోమహాక్‌ క్షిపణులను రేథియాన్‌ అనే కాంట్రాక్టరు. అంటే వాడికి పని ఇవ్వాలనే ఒప్పందం వుంది గనుక ఏదో ఒక సాకుతో ఎక్కడో ఒకచోట వాటిని ప్రయోగించాలి. ఈక్షిపణికి అమర్చన బాంబు పేలబోయే ముందు గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి నిర్దేశిత లక్ష్యంపై బాంబు వేస్తుంది. నాలుగు దశాబ్దాలుగా ఈ రకం క్షిపణులను వినియోగిస్తున్నప్పటికీ నవీకరించిన తరువాత తొలిసారిగా 900కిలోల బాంబును తాజాదాడిలో దానికి అమర్చి ప్రయోగించారు. అయితే ఇవి ఎంత మేరకు నష్టం చేకూర్చుతున్నాయనేది సందేహమే. గతేడాది సిరియా వైమానిక స్ధావరంపై చేసిన దాడిలో అనేక విమానాలు, రన్‌వే ధ్వంసమైనట్లు అమెరికన్లు వీడియోలద్వారా ప్రపంచానికి చూపారు. అయితే మరుసటి రోజు నుంచే ఆ రన్‌వేను వుపయోగిస్తున్నట్లు బయటపడింది. అంటే అవి నకిలీ వీడియోలన్నది స్పష్టం. తాజా దాడులలో 71క్షిపణులను మధ్యలోనే కూల్చివేసినట్లు రష్యా చెబుతోంది. కొందరు నిపుణుల వాదనల ప్ర కారం ఖండాంతర క్షిపణుల కంటే అమెరికా ఇప్పుడు ప్రయోగించిన క్రూయిజ్‌ క్షిపణులు చాలా తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి కనుక మధ్యలోనే వాటిని కూల్చివేయటానికి అవకాశాలను కాదనలేము. వాటిని కూల్చివేయగల రష్యా ఎస్‌-400 వ్యవస్ధలున్నాయనే అనుమానం వుంటే వాటి పరిధిలోకి పైలట్లతో కూడిన విమానాలను దాడులకు పంపేందుకు అమెరికా దాని మిత్రపక్షాలు భయపడతాయి. ఈ దాడులను రష్యా, చైనాలు ఖండించాయి. ఈ దాడి జరగటం తమ నాయకుడు పుతిన్‌కు అవమానకరం అని రష్యా దౌత్యవేత్తలు వ్యాఖ్యానించినట్లు నిర్ధారణకాని వార్తలు వెల్లడించాయి. ఇవి పుతిన్‌ను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు ప్రచారంలో పెట్టినవి కూడా కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బ్రెజిల్లో లూలా అభ్యర్ధిత్వాన్ని అడ్డుకొనే రాజ్యాంగబద్ద కుట్ర !

11 Wednesday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

Brazil, Brazil elections, judiciary conspiracy, lula da silva, Presidential Candidacy

ఎం కోటేశ్వరరావు

లూలాగా ప్రపంచానికి సుపరిచితమైన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వా ప్రస్తుతం జైలులో ఖైదీ. ఒక కేసులో తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నారు అనేకంటే ఒక పెద్ద కుట్రలో భాగంగా జైలు పాలు చేశారనటం సముచితంగా వుంటుంది. ఆయనేమీ పదవిని అడ్డుపెట్టుకొని వేల కోట్లను వెనకేసుకోలేదు. విదేశీబ్యాంకుల్లో దాచుకోలేదు, వాటినే తిరిగి బినామీ పెట్టుబడులుగా పెట్టలేదు. లూలాపై మోపిన నేరం ఏమిటి? గతంలో అంటే 2003-11 మధ్య అధ్యక్షుడిగా వున్న సమయంలో ఆయన అప్పుడపుడు వచ్చిపోయారని చెబుతున్న ఇంటికి ఒక కంపెనీతో మరమ్మతులు చేయించాడట. అందుకుగాను దానికి ప్రభుత్వరంగ చమురు సంస్ధలో లాభదాయకమైన కాంట్రాక్టులు ఇప్పించాడట. ఇంటి మరమ్మతుల విలువ పన్నెండులక్షల డాలర్లని, దాన్ని వుచితంగా చేయించాడు గనక అంత మొత్తం లంచం తీసుకోవటంతో సమానమే అని గతేడాది జూలై 12న కోర్టు తీర్పు చెప్పింది. ఇదంతా తనపై మోపిన రాజకీయ కుట్ర అంటూ ఆ తీర్పును సవాలు చేస్తూ మరో కోర్టుకు వెళ్లిన లూలాకు అక్కడ తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్షను పన్నెండుకు పెంచి ఖరారు చేశారు. దాంతో శనివారం నాడు ఆయన  జైలుకు వెళ్లారు.

లాటిన్‌ అమెరికా దేశాల నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్న అమెరికా అక్కడి వామపక్ష, ప్రజాతంత్రశక్తులను దెబ్బతీసేందుకు నిరంతరం కుట్రలు పన్నుతోందని వేరే చెప్పనవసరం లేదు. ఏ వంకా దొరకని వారు డొంకను చూపి ఏడ్చారన్నది ఒక సామెత.(గ్రామాలను కలిపే కాలి, బండ్లబాటను డొంకలని పిలుస్తారు) లూలాను బదనాం చేసేందుకు చీకట్లో బాణాలు వేసినట్లుగా అమెరికా సిఐఏ, ఇతర సంస్ధల మద్దతు వున్న రాజకీయ ప్రత్యర్ధులు అనేక ఆరోపణలు చేశారు. ఆయన పాలనా కాలంలో కొందరు అధికారులు లేదా అధికార పార్టీకి చెందిన వారు అవినీతికి పాల్పడలేదనీ చెప్పలేము. లూలా వాటిని వుపేక్షించారని చేస్తున్న ఆరోపణలో ఒకటో అరశాతమో నిజం వుంటే వుండవచ్చు. కానీ లూలాపై చేసిన ఇంటి మరమ్మతు ఆరోపణలో పసలేనప్పటికీ ఈ ఏడాది జరగనున్న ఎన్నికలలో అధ్యక్షపదవికి పోటీ చేయకుండా అనర్హుని గావించేందుకు చేసిన కుట్రలో భాగమే శిక్ష అన్నది స్పష్టం.

లాటిన్‌ అమెరికాలో ఎదురవుతున్న వామపక్ష సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా ఇటీవలి కాలంలో సరికొత్త కుట్రలకు తెరతీసింది.గతంలో మిలిటరీ నియంతలు, వారికి మద్దతుగా మితవాదశక్తులను రంగంలోకి తెచ్చింది. ఇప్పుడు వారి కాలంలో నియమితులైన న్యాయాధికారులతో రాజ్యాంగబద్ద కుట్రలను అమలు జరుపుతోంది. పార్లమెంట్లలో వామపక్ష శక్తులకు మెజారిటీ లేకపోవటం వాటిని అమలు జరపటం సులభమౌతోంది. ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలలో లూలాను అభ్యర్ధిగా ప్రకటించారు. ఆయన విజయం ఖాయం అనే వాతావరణం ఏర్పడటంతో పాతకేసులను రంగంలోకి తెచ్చారన్నది స్పష్టం.లాటిన్‌ అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన 72సంవత్సరాల లూలా పాలనా కాలంలో దారిద్య్రనిర్మూలనకు తీసుకున్న చర్యలు నాలుగు కోట్ల మంది జీవితాలను మెరుగుపరిచాయి. పార్లమెంటులో మెజారిటీ వున్న మితవాదశక్తులు కుట్ర చేసి 2016లో లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీకి చెందిన అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ను పదవి నుంచి తొలగించారు.

తోడేలుామేకపిల్ల కథలో మాదిరి దిల్మా రౌసెఫ్‌ను పదవీచ్యుతురాలిని చేసేందుకు చూపిన కారణం కూడా ఎంతో హాస్యాస్పదమైనదే. అదే ప్రాతిపదిక అయితే ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఎన్నికైన వారి మీద అభియోగం మోపి పదవి నుంచి దించేయవచ్చు. 2014 ఎన్నికలలో దిల్మా రౌసెఫ్‌ను గెలిపించేందుకు బడ్జెట్‌ అంకెలను తారుమారు చేశారని, దిగజారిపోతున్న దేశ ఆర్ధిక వ్యవస్ధ వాస్తవ పరిస్ధితిని మరుగుపరచేందుకు ప్రభుత్వబ్యాంకుల నుంచి నిధులను వుపయోగించారంటూ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానంతో ఆమెను తొలగించారు. ప్రస్తుత అధ్యక్షుడు మైఖేల్‌ టెమర్‌పై అనేక అవినీతి విమర్శలు రావటమే కాదు, 50లక్షల డాలర్లు లంచం తీసుకున్నట్లు గతేడాది ఒక కేసు దాఖలైంది. అయితే సుప్రీం కోర్టు దానిపై విచారణ జరపకుండా, అభిశంసన తీర్మానం పెట్టకుండా పార్లమెంటులోని టెమర్‌ అనుయాయులు అడ్డుపడటాన్ని చూస్తే లూలాపై ఎలాంటి నిర్ధిష్ట ఆరోపణ లేనప్పటికీ విచారణ తతంగం జరిపి శిక్ష విధించటం రాజకీయ ప్రేరేపితంగాక మరేమిటి?లూలా ఎలాంటి నేరానికి పాల్పడని రాజకీయ ఖైదీ మాత్రమేనని ఆయన లాయర్‌ జానిమ్‌ వ్యాఖ్యానించారు. అయన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు అందుబాటులో వున్న అన్ని చట్టబద్దమైన అవకాశాలను వుపయోగిస్తామన్నారు. లూలా నివశించారని చెబుతున్న అపార్ట్‌మెంట్‌కు ఆయనేనాడూ యజమాని కాదని, దాన్ని అద్దెకు తీసుకోవటంలో అక్రమాలకు పాల్పడినట్లు ఎలాంటి రుజువు లేదని అన్నారు.రాజకీయ కారణాలతో లూలాను జైలు పాలు చేయటంలో కుట్రదారులు సఫలమయ్యారు. అయితే అదే సమయంలో ఆయనకు నోబెల్‌ శాంతి బహమతి అవార్డుకు నామినేట్‌ చేసేందుకు మద్దతు తెలపాలన్న నోబెల్‌ బహుమతి గ్రహీత ఆడాల్ఫో పెరెజ్‌ ఎస్కివిల్‌ పిటీషన్‌పై పెద్ద ఎత్తున స్పందన వెల్లడైంది. లక్షన్నర సంతకాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా సోమవారం నాటికి లక్షా ఎనభైవేలు దాటాయి. తమ నేతను జైలు పాలు చేసినప్పటికీ అక్టోబరులో జరిగే ఎన్నికలలో ఆయనే తమ అభ్యర్ధి అని వర్కర్స్‌ పార్టీ అధ్యక్షుడు గ్లెస్సీ హాఫ్‌మన్‌ ప్రకటించారు. వర్కర్స్‌ పార్టీ కేంద్ర నాయకత్వం తమ నేత జైలులో వున్న కర్టీబా నుంచే పని చేస్తుందని, ఆయనను విడుదల చేయించేందుకు వున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని హాఫ్‌మన్‌ చెప్పారు.

బ్రిక్స్‌ కూటమి(బ్రెజిల్‌,రష్యా,ఇండియా,చైనా, దక్షిణాఫ్రికా)లో ఒక ముఖ్యపాత్రపోషించటమేగాక లాటిన్‌ అమెరికాలో అధికార కేంద్రంగా వున్న బ్రెజిల్‌ వామపక్ష వుద్యమాలకు సైతం పట్టుగొమ్మగా వుంది. అందుకే అమెరికా ఈ ప్రాంతంలో ప్రత్యేకించి ఈ దేశంలో మితవాదులు,క్రైస్తవమతవాదులు, అవినీతి శక్తులతో చేతులు కలిపి లూలా నాయకత్వంలోని వర్కర్స్‌పార్టీని అధికారంలోకి రాకుండా చేసేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. గతంలో నియంతపాలన రుద్దిన మిలిటరీని తిరిగి రంగంలోకి తెచ్చేందుకు సైతం వెనకాడటం లేదని జరిగిన పరిణామాలు సూచిస్తున్నాయి. దిల్మా రౌసెఫ్‌ను గద్దె దింపటంలో పార్లమెంట్‌ సభ్యులుగా వున్న మాజీ సైనికాధికారులున్నారు. నగరాల్లోని మురికి వాడల్లో తిష్టవేసిన మాఫియా, గూండా గ్యాంగులను ఏరివేసే పేరుతో మిలిటరీని కూడా దించి తమ ప్రత్యర్ధులుగా వున్న వారిని హతమారుస్తున్నారు. లూలాపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడక ముందు సైనిక కమాండర్‌ ఒకడు బహిరంగ ప్రకటన చేస్తూ శిక్షల నుంచి మినహాయించటానికి స్వస్తి పలకాలని కోరటం ద్వారా లూలాను జైల్లో చూడాలన్న తన కోరికను బయటపెట్టాడు. శనివారం రాత్రి పోలీసులకు లంగిపోయిన లూలాను కర్టిబా జైలుకు తరలించేందుకు పోలీసులు విమానాన్ని సిద్ధం చేశారు. చెత్తను కిటికీ నుంచి అవతలకు పడవేయండి అంటూ పైలట్లతో మిలిటరీ రేడియోలో చేసిన వ్యాఖ్యలు రికార్డయ్యాయి. అవి లూలాను వుద్ధేశించి చేసినవే అన్నది వేరే చెప్పనవసరం లేదు. యాభైలక్షల డాలర్లు లంచం తీసుకున్న టెమర్‌ అధ్య క్ష స్ధానంలో కొనసాగుతుంటే ఇంటి మరమ్మతుల పేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ ఆధారంలేని ఆరోపణలకు గురైన వామపక్ష మాజీ అధ్యక్షుడు జైలు పాలయ్యారు. ఇదీ నేడు బ్రెజిల్‌లో వున్న పరిస్ధితి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహాత్మా, మార్క్స్‌, అంబేద్కర్‌ సంస్కరణల ముసుగులో చట్టాల దుర్వినియోగంపై కర్తవ్యబోధ చేయండి !

09 Monday Apr 2018

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Ambedkar, Gandhi, Government Misuse of acts, Karl Marx

Image result for Gandhi, Karl Marx, Ambedkar

ఎం కోటేశ్వరరావు

కావేరీ జలాలపై ట్రిబ్యునల్‌ వేయాలంటూ వారాల తరబడి వేళ్ల మీద లెక్కించదగినంత మంది సృష్టించిన రభసను అనుమతించిన పాలకపార్టీ పార్లమెంటరీ వేదికలను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటాన్ని చూశాము. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా విషయంలో వాగ్దానభంగం, నమ్మించి మోసం చేసిన బిజెపిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకొనేందుకు పాలకపక్షం ప్రయోగించిన శిఖండి అన్నాడిఎంకె అన్నది ప్రతిఒక్కరికీ తెలిసిపోయింది. ప్రతి నలుగురిలో ఒకరుగా వున్న దళితులు, గిరిజనుల రక్షణకోసం వుద్దేశించిన అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోందంటూ బిజెపి సర్కార్‌ సుప్రీం కోర్టుకు చెప్పటం, అది అందచేసిన సమాచారం, వాదనలకు అనుగుణంగా ఆ చట్టాన్ని నీరుగార్చే విధంగా సుప్రీం కోర్టు తీర్పు చెప్పటం తెలిసిందే. పార్లమెంట్‌లో వున్న దళిత, గిరిజన ఎంపీలు ఆ తీర్పుపై అప్పీలు చేయాలంటూ ఒక్క రోజు కాదు, కనీసం పది నిమిషాలపాటు సభను అడ్డుకొని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఎందుకు తీసుకుపోలేకపోయారన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయమిది. కావేరీ ట్రిబ్యునల్‌ పాటి కూడా ఈ అంశానికి ప్రాధాన్యత లేదని వారు భావించారా? బలహీనవర్గాలకు కొందరికైనా మేలు చేస్తున్న విద్య, వుద్యోగాల రిజర్వేషన్లను తొలగించాలన్న ప్రచారం, డిమాండ్‌ గతం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా వినిపిస్తున్న పూర్వరంగంలో కేవలం పది సంవత్సరాలకు పెట్టిన రిజర్వేషన్లు ఇంకెంతకాలం పొడిగిస్తారంటూ ఎవరైనా సవాలు చేస్తే పునరాలోచించాలని కోర్టులు తీర్పు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు నోరు విప్పని వారు అప్పుడైనా తెరుస్తారని నమ్మటం ఎలా ? ఇలాంటి వారినా జనం గుడ్డిగా ఎన్నుకుంటున్నది, నమ్ముతున్నది అన్న మౌలిక ప్రశ్న ముందుకు వస్తోంది.

మహిళలు, దళితుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచార దాడిని ప్రతిఘటించాల్సిన అవసరాన్ని కొందరైనా గుర్తించారు. కార్యాచరణలో ఏప్రిల్‌ రెండవ తేదీ బంద్‌ ఒక చిన్న అడుగు మాత్రమే. దీన్ని ఎలా కొనసాగించాలన్నది ప్రశ్న. చట్టాల దుర్వినియోగం అనే అంశంలోకి లోతుగా వెళితే ఈ రెండు చట్టాలలో వుందని చెబుతున్న దుర్వినియోగం సముద్రంలో కాకి రెట్ట వంటిది. కార్యనిర్వాహక వ్యవస్ధ, తోటి సమాజం నిర్లక్ష్యం చేసినపుడు, పక్షపాతం చూపినపుడు నిస్సహాయులుగా వున్నవారు కసిగా ఫిర్యాదులు చేసి వుండవచ్చు. కొందరు నిర్దోషులు ఇబ్బందులు పడి వుండవచ్చు. అలాంటివి వేళ్ల మీద లెక్కించగలిగినవే. వాటిని సక్రమంగా విచారించి నిర్దోషులను రక్షించటానికి పోలీసు, న్యాయవ్యవస్ధలకు ఎలాంటి ఆటంకాలు లేవు. అవి తమ బాధ్యతను ‘దుర్వినియోగం’ చేయకుండా సక్రమంగా వ్యవహరించి, అసలు అలాంటి నేరాలకే తావులేని పరిస్ధితిని ఏర్పరచి వుంటే చట్టాల నామమాత్ర దుర్వినియోగ పరిస్ధితే తలెత్తి వుండేది కాదు. వేల మంది లలిత్‌ మోడీలు, విజయ మాల్యలు, నీరవ్‌ మోడీలు లక్షల కోట్లు స్వాహా చేసి కోట్లాది మందికి హాని చేసి పారిపోయినా సహించవచ్చుగానీ ఒక్క జింకను చంపిన వారిలో ఒక్కరిని కూడా వదల కూడదు అన్నట్లుగా వుంది పరిస్ధితి. చట్టాలు, వాటిని అమలు జరపాల్సిన వారు, పని తీరును పర్యవేక్షించేవారు సక్రమంగా పని చేసి, దుర్వినియోగం చేయకుండా వుంటే నేరగాళ్లు తప్పించుకొనేవారా ?

Image result for Gandhi, Karl Marx, Ambedkar

ఇక్కడ ప్రధాన సమస్య, ఆందోళనకరమైనది సక్రమంగా అమలు జరపాల్సిన అధికార యంత్రాంగం నూటికి నూరుశాతం దుర్వినియోగం, జనాల మీద దాడులకు వుపయోగిస్తున్న ఇతర చట్టాల మాటేమిటి? యావత్‌ శ్రామిక సమాజానికి జరుగుతున్న అన్యాయం మాటేమిటి? ఎవరైనా ఒక వ్యక్తి చట్టాన్ని దుర్వినియోగం చేస్తే మరొక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు ప్రభావితులౌతారు. సంస్కరణలనో మరొక పేరుతోనే అదే మొత్తం చట్టాన్ని దుర్వినియోగం చేస్తే, ఎసరుబెడితే జరిగే తీవ్ర నష్టం మాటేమిటి? వుదాహరణకు కార్మిక చట్టాలు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్ధలు సైతం వాటిని నీరుగార్చటం, వుల్లంఘించటంలో ఎలాంటి తేడా కనపడదు. అలాంటిది ప్రయివేటు రంగం సంగతి చెప్పాల్సిన పనేముంది. నరేంద్రమోడీ సర్కార్‌, బిజెపి ఇతర అనేక రాష్ట్రాల పాలకులు(వామపక్షాలు మినహా) సంస్కరణల పేరుతో చేస్తున్న మార్పులు కార్పొరేట్‌ యజమానులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న చేస్తున్న దుర్వినియోగం తప్ప మరొకటి కాదు. వీటి ద్వారా గోడదెబ్బ, చెంపదెబ్బ అన్నట్లు సామాజిక రక్షణ చట్టానికి తూట్లు పడి దళితులు, మొత్తంగా మహిళలు రెండు విధాలుగా నష్టపోవటం లేదా ? ఎగుమతుల పేరుతో సెజ్‌లకు కార్మిక చట్టాల అమలు మినహాయింపులు చట్టదుర్వినియోగమా కాదా ?

నయా వుదారవాద విధానాల పేరుతో అమలు జరుపుతున్న పెట్టుబడిదారీ విధానాలను కొంత మంది దళిత మేధావులతో సహా వామపక్ష భావజాలం లేని వారందరూ వూట సిద్ధాంతం పేరుతో సమర్ధించారు. దాని ప్రకారం సరిహద్దులు, కరెన్సీ,మిలిటరీ, పోలీసు వంటి అంశాలు తప్ప మిగిలిన అన్నింటినీ ప్రయివేటు రంగాలకు అప్పచెబితే ఆ రంగం నుంచి వచ్చే ఫలితాలు వూట మాదిరి సమాజం అంతటికీ దిగుతాయి. గత మూడున్నర దశాబ్దాల ఈ విధానాల అమలులో వూట ఎలా దిగింది? కేంద్ర ప్రభుత్వ సమాచారం, గణాంకాల ప్రకారం 1980-81లో ఒక వస్తువు తయారీ లేదా సేవ విలువ(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌- జివిఏ)లో వేతనాలు, అలవెన్సులు తదితర రూపాలలో సగటున కార్మికులకు దక్కిన లబ్ది 44శాతం. అది 2012-13 నాటికి 23.6కు పడిపోయింది. ఇదే సమయంలో వడ్డీ చెల్లింపులు 19.8 నుంచి 13.7శాతానికి తగ్గాయి. మరి లాభాల వాటా 15.7 నుంచి 44.1శాతానికి పెరిగింది. 2012 జిడిపి ఆధారంగా గుణిస్తే మన దేశంలో ఒక శ్రామికుడు గంటలో చేసిన వుత్పత్తి విలువ రెండు వందల యాభై రూపాయలు అదే రోజుకు రెండువేలు. వివిధ పరిశ్రమలు, రంగాలలో వున్న కనీస వేతనాల మొత్తాలను చూస్తే కార్మికులు ఎంత దోపిడీకి గురవుతున్నారో చెప్పనవసరం లేదు. అ తక్కువ మొత్తాలను కూడా దశాబ్దాల తరబడి సవరించని ప్రభుత్వాలున్నాయి. ఇవి చట్టాలను నీరుగార్చటం కాదా? అవసరాల మేరకు పెంపుదల సంగతిపక్కన పెడితే అసలు ఏదో ఒక సవరణ కోసం కూడా వుద్యమించాల్సిన రోజులివి. ఈ పూర్వరంగంలో కార్పొరేట్లకు మరింత లబ్ది చేకూర్చేందుకు సంస్కరణల పేరుతో కాంగ్రెస్‌ అమలు జరప ప్రయత్నించిన వాటిని బిజెపి ఆచరించేందుకు పూనుకుంది. ఇది అధికార దుర్వినియోగం కాదా ? దీన్నెవరు ప్రశ్నించాలి, కోర్టు పరిభాషలో చెప్పాలంటే ఈ పరిస్ధితిని ఎలా సరిచెయ్యాలి?

బిజెపి పాలిత రాజస్ధాన్‌ కార్మిక చట్టాల సవరణ ప్రయోగశాలగా తయారైంది.అక్కడి పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో( వుత్పత్తి నెమ్మదించటం) అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు.ఏ కారణంతో వుత్పత్తి తగ్గినా, కార్యకలాపం విఫలమైనా దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు. అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి తిరిగి పూర్వ పరిస్ధితిలోకి నెట్టారు. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను వుల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను వుల్లంఘించిన వుదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. యాంత్రీకరణ, రోబోల వినియోగం మరింతగా పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి సవరణలు చేయటం అంటే అత్యధిక ఫ్యాక్టరీలు, సంస్ధలను కార్మిక చట్టాల పరిధి నుంచి తొలగించటమే. అలాంటపుడు కనీసవేతనాలను సవరించినా వుపయోగం ఏముంది? ప్రభుత్వం యజమానులు ఏం చేయాలనుకుంటే అందుకు వారికి అనుమతిచ్చే చర్యలకు ముద్దుగా ‘సంస్కరణలు’ అని పేరు పెట్టింది. శాశ్వత స్వభావం వున్న పరిశ్రమలలో కూడా కాంట్రాక్టు కార్మికులను అనుమతించటాన్ని ఏమనాలి. ఒక సంస్ధలో సిబ్బందిని రిట్రెంచ్‌ లేదా లే ఆఫ్‌ చేయాలన్నా గతంలో ప్రభుత్వ అనుమతి అవసరం, ఇప్పుడు యజమాని చిత్తానికి వదలివేశారు.డెబ్బయిశాతం పరిశ్రమలు, సంస్ధలను కార్మిక చట్టాల పరిధి నుంచి తప్పించారు. తనిఖీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే సాకుతో లేబర్‌ అధికారుల తనిఖీలపై సవాలక్ష ఆంక్షలు విధించి ఆచరణలో లేకుండా చేశారు. పేరుకు కార్మికశాఖ అయినా అది యజమానుల సేవలో మునిగి తేలుతుందని, కార్మిక చట్టాల అమలు కంటే వుల్లంఘనే ఎక్కువ అన్నది కార్మికులకు తెలిసిన నగ్నసత్యం.

ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులుగా వున్నారు.పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల వుల్లంఘనలపైనే అన్నది స్పష్టం. ఇది చట్టదుర్వినియోగం గాక మరేమిటి? ఈ దుర్వినియోగం వెనుక రాజ్యంలోని అన్ని విభాగాలు లేవా ? చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల వుద్యోగాలు పోతున్నాయి. 2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌(క్రమబద్దీకరణ, రద్దు)చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవే శపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన ఘనత బిజెపి ఖాతాలో చేరింది. ఇది దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా రాజస్ధాన్‌లోని 7622 ఫ్యాక్టరీలలో 7252 కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది.

ప్రపంచవ్యాపితంగా ధనిక దేశాలన్నింటా అప్రెంటిస్‌షిప్‌(నైపుణ్య శిక్షణ) పేరుతో పెద్ద ఎత్తున పర్మనెంటు కార్మికుల స్ధానంలో కార్మిక చట్టాల పరిధిలో లేని కార్మికులను నియమిస్తున్నారు. వారికి తక్కువ వేతనాలు, అలవెన్సులు చెల్లించేందుకు ఇదొక దొంగదారి అన్నది తెలిసిందే. మన దేశంలో కూడా అప్రెంటిస్‌షిప్‌ చట్టాన్ని సవరించి శిక్షణలో వున్న వారు చేయకూడని పనులను కూడా వారితో చేయించేందుకు, పెద్ద ఎత్తున నియామకానికి తెరతీశారు. శిక్షణా కాలంలో అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించేవిధంగా పధకాలు సిద్దం చేశారు. ఇది యజమానులకు మరొక అదనపు రాయితీ. ఇలా కార్మికవర్గం, అన్ని తరగతుల వారు గుర్తించాల్సిన, గళమెత్తాల్సిన దుర్వినియోగాలు ఇంకా చాలా వున్నాయి.

స్వాతంత్య్ర వుద్యమ వారసత్వంతో ఏమాత్రం సంబంధం లేని, బ్రిటీష్‌ వారికి లంగిపోయిన భావజాలంతో పని చేసే శక్తుల ఆధిపత్యంలోకి తొలిసారిగా పూర్తిగా మనపాలనా వ్యవస్ధ పోయింది. మహాత్ముడు కన్న కలలు కల్లయ్యాయి. ఆయన వారసులుగా బయలు దేరిన వారు వేరే గాంధీల విధేయులమని చెబుతున్నారు తప్ప అసలు గాంధీని విస్మరించారు. అలాంటి వారిని కనీసం ఒక్కసారి చూసేందుకు కూడా మహాత్మా గాంధీ మనస్కరించరు. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా మహాత్ముడిపట్ల భక్తిని ప్రదర్శిస్తూనే ఆయనను హత్య చేసిన వాడికి జేజేలు పలికే శక్తులు గాంధీ ప్రవచించిన అహింసను, మతసామరస్యాన్ని ఏడునిలువులలోతున పాతిపెట్టి హింసో పరమ ధర్మ: అన్నట్లుగా చెలరేగిపోతున్నాయి. మనుషుల కంటే ఆవు రక్షణ ముఖ్యం అంటూ మనుషుల ప్రాణాలను తీస్తున్నవారిని కాపాడుతున్న రాజ్యం నడుస్తోంది. సాంఘిక, సామాజిక న్యాయం గురించి ఆశపడిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఒక్కసారి వెనక్కు వచ్చి చూస్తే హతాశుడౌతారు. తన అధ్యక్షతన జరిగిన రాజ్యాంగరచన, దాని స్ఫూర్తి, నిబంధనలకు అనుగుణ్యంగా ఆమోదించిన అనేక ప్రజానుకూల చట్టాలకు తూట్లుపొడిచే ప్రయత్నాలను,మనువాదాన్ని మరో రూపంలో తీసుకువచ్చే తీవ్ర యత్నాలను చూసి సంఘటితపడమని మరో పిలుపు ఇవ్వకపోడు. దోపిడీ రహిత సమాజం కోసం తాను ప్రతిపాదించిన దోపిడీ రహిత సమాజం కోసం పోరాడే కార్మికవర్గాన్ని, వారికి వెన్నుదన్నుగా నిలిచే రాజకీయశక్తులను పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైపైకి అంటూ తన స్నేహితుడు ఎంగెల్స్‌తో కలసి కారల్‌ మార్క్స్‌ సందేశమిస్తూనే వుంటాడు. కార్మికుల రక్షణకోసం చేసిన చట్టాల రూపు మార్చి వాటిని యజమానుల ఆయుధాలుగా మారుస్తున్న వారిని కూలదోస్తే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని నిస్సంకోచంగా చెబుతాడు. అందుకే ముగ్గురూ వచ్చి కార్యాచరణ కర్తవ్యబోధ చేయాలని యావత్‌జాతి కోరుతోందంటే అతిశయోక్తి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహిళా చట్టాన్ని నీరు గార్చినపుడే మేలుకొని వుంటే దళితుల వరకు వచ్చేదా ?

06 Friday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Acts Misuse, dalits, SC/ST Atrocities Act, Section 498-A, sexual harassment laws

చట్టాలను నీరు గార్చేందుకే దుర్వినియోగ ఆరోపణ

ఎం కోటేశ్వరరావు

చట్టాల వినియోగం, దుర్వినియోగం గురించి దేశంలో ఇప్పుడు సమాజంలోని కులీన, అట్టడుగు తరగతుల్లో ఒకే అంశంపై చర్చ మొదలైంది. చిత్రం ఏమిటంటే యావత్‌ దేశానికి చట్టాలు చేసే పార్లమెంట్‌ వుభయ సభలను గత ఇరవై ఐదు రోజులుగా దుర్వినియోగం చేయటాన్ని స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా యావత్‌ జాతి గమనించింది. పార్లమెంట్‌ సరిగా నడవని అన్ని రోజులకు ఎన్‌డిఏ ఎంపీలు తమ వేతనాలు, అలవెన్సులను వదులుకుంటారని బుధవారం రాత్రి పార్లమెంటరీ వ్యవహారాల కేేంద్ర మంత్రి అనంతకుమార్‌ ప్రకటించారు. సభను నడిపించాల్సిన అధికారపక్షం అవిశ్వాస తీర్మానాల ప్రహసనంలో అంటించుకున్న గబ్బును కాస్తయినా తగ్గించుకొనేందుకు తాము పెద్ద జవాబుదారీ అంశకు చెందిన వారమని ఫోజు పెట్టేందుకు, సమస్యను పక్కదారి పట్టించేందుకు వేసిన అతి తెలివి ఎత్తుగడ ఇది. సభను నడపాల్సిన వారు సరిగా నడపకపోతే నేనెందుకు వదులుకోవాలి అని బిజెపి సభ్యుడు సుబ్రమణ్యస్వామి గడ్డిపెట్టారనకోండి.

సమాజంలో ఏమాత్రం రక్షణ లేని దళితులు, గిరిజనులు తమ రక్షణ చట్టాన్ని దుర్వినియోగం చేశారని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే సుప్రీం కోర్టుకు నివేదించింది, దాని ఆదారంగానే అది ఆ చట్టంలో మార్పులు చేయాలని కోర్టు ఆదేశించింది.తాము అలవెన్సులు, వేతనా వదులుకుంటామని చెప్పటం అంటే పార్లమెంట్‌ను దుర్వినియోగం చేసినట్లు అంగీకరించటమే. దానికి పరిహారంగా ఆర్ధిక ప్రయోజనాన్ని వదులుకుంటామంటే సరిపోతుందా ? అదంత స్వల్ప దుర్వినియోగమా ? ఈ విషయాన్ని ప్రజాకోర్టు తప్ప మరే కోర్టూ విచారించే అవకాశం లేదు. అటువంటి అవకాశాలే వుంటే అవిశ్వాస తీర్మానంపై నాటకం ఇంత రంజుగా నడిచేది కాదు. అందువలన అన్ని రకాల దుర్వినియోగాలు, వాటికి బాధ్యుల గురించి దేశం తీవ్రంగా చర్చించాల్సిందే.

మహిళలకు రక్షణ కల్పించే శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్‌, ఎస్‌సి, ఎస్‌టిలపై దాడుల నిరోధక చట్టం రెండింటినీ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నప్పటికీ రెండవ అంశం ప్రస్తుతం అనూహ్యంగా ముందుకు వచ్చింది. సాధారణంగా ఇలాంటి పరిస్ధితులు అరుదుగా వస్తుంటాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఒక చట్టాన్ని వినియోగించకుండా నీరుగారుస్తున్నారని జనాభాలో ఒక పెద్ద సమూహం, దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆ సమూహంపై తరతరాలుగా దాడులు చేసేవారు లేదా చేయటాన్ని పరోక్షంగా అయినా సమర్ధించేవారు పరిమితంగానే అయినా వీధుల్లోకి సైతం వచ్చిన వుదంతం ఏప్రిల్‌ రెండవ తేదీన జరిగింది. అనేక అంశాలపై సమ్మెలు, బందులు జరగటం సర్వసాధారణం. తమ రక్షణకు తెచ్చిన చట్టాన్ని నీరు గార్చటానికి లేదా ఎత్తివేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రక్షణ కోసం దళితులు, గిరిజనులు దేశ వ్యాపిత బంద్‌కు పిలుపు ఇచ్చిన వుదంతం ఎన్నడూ జరగలేదు. అది జయప్రదమైందా, విఫలమా, పాక్షికమా అన్న విషయాన్ని పక్కనపెడదాం. మూడు రాష్ట్రాలలో హింసాత్మకంగా మారి పదకొండు మంది వరకు మరణించటాన్ని బట్టి దాని తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఈ బంద్‌ ఒక చైతన్యానికి, పోరాటపటిమకు నిదర్శనం.

Image result for SC/ST Atrocities Act, band

ఎప్పుడూ అనేక అంశాలపై చర్చ జరుగుతూనే వుంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. దళితుల, గిరిజనుల రక్షణ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో దేశంలో వివిధ చట్టాల వినియోగం, దుర్వినియోగం గురించిన చర్చ ముందు పీఠీకి వచ్చింది. తిరోగమన వాదులకు సంకటమైన ఈ చర్చను పురోగమనవాదులు మరింతగా ముందుకు తీసుకుపోవాల్సిన తరుణమిది. ఒక కుక్కను చంపాలనుకుంటే పిచ్చిదని ప్రచారం చేయాలన్నది పాత సామెత. ఒక అవాస్తవాన్ని నిజం చేయాలంటే వందసార్లు చెప్పాలని ఫాసిస్టు గోబెల్స్‌ పాలకవర్గాలకు సరికొత్త ఆయుధాన్ని అందించాడు. తమకు కంటగింపుగా వున్న చట్టాలను నీరుగార్చి, పసలేని వాటిగా చేయాలన్నా, తొలగించాలన్నా అవాస్తవాలతో పాటు వాటిని దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలన్నది నేటి పాలకవర్గాల నీతి. కేంద్రంలో అధికారంలో వున్న పాలకపక్షం బహుశా మొదటిసారిగా తాను అమలు జరుపుతున్న ఒక చట్టాన్ని అందునా సమాజంలో సమాజంలో అట్టడుగున వున్నవారు దుర్వినియోగం చేస్తున్నారని దేశ అత్యున్నత న్యాయ స్ధానానికి నివేదించటం, దానిని ప్రాతిపదికగా తీసుకొని అవును నిజమే అని తీర్పు చెప్పటం నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి సాధించిన ‘ఒక ఘనత’.

భూస్వామ్య శక్తులతో రాజీపడి ఆ వ్యవస్ధను కొనసాగిస్తూనే తమ ప్రయోజనాలకు పెద్ద పీటవేసుకొనే బడా పెట్టుబడిదారుల నాయకత్వంలో నడుస్తున్నది మన దేశం. కాంగ్రెస్‌, ఇతర పార్టీలలో కూడా ఈశక్తులకు ప్రాతినిధ్యం వహించేవారు వున్నప్పటికీ అత్యధికంగా మాజీ రాజులు,రాణులు, జమిందార్లు,దేశముఖులు, భూస్వాములు అదే సమయంలో బడాపెట్టుబడిదారులను కుడి ఎడమల ఢాల్‌ కత్తుల మాదిరి కలిగి వున్న ఏకైక పెద్ద పార్టీ బిజెపి. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలోని చట్టాలపై ద్విముఖ దాడి జరుగుతున్నది. అదిప్పుడు మరింతగా పెరిగింది. ఆ ఖ్యాతి తమదే అని బిజెపి ప్రపంచం ముందుకు వస్తోంది. పారిశ్రామిక సంబంధాలు, చట్టాల సంస్కరణల పేరుతో కార్మికులకు రక్షణ కల్పించే, సంక్షేమ చర్యలను చేపట్టాల్సిన అనేక చట్టాలను నీరుగారుస్తున్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. మరోవైపు మొత్తంగా మహిళలపై సాగించే వరకట్న తదితర వేధింపుల నిరోధక అంశాలు, సామాజికంగా బలహీన వర్గాలుగా వున్న ఎస్‌సి,ఎస్‌టిలపై దాడుల నిరోధక చట్టంపై బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, దాని వాదనలకు అనుగుణ్యంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, దాని పర్యవసానాలు వాటిని నీరుగార్చేందుకు దారితీసేవిగా వున్నాయి.

ఈ తీర్పుపై అనూహ్యరీతిలో దళితులు, గిరిజనుల్లో వెల్లడైన ఆగ్రహాన్ని వూహించని బిజెపి సర్కార్‌ కోర్టులో తీర్పు సమీక్ష పిటీషన్‌ దాఖలు చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు దళితులు, గిరిజనుల మీద బిజెపికి వున్న శ్రద్ధ ఎలాంటిదో, అంతరంగంలో వున్నదేమిటో కళ్లు తెరిపించేవిగా వున్నాయి. దళితులు, గిరిజనులపై దాడుల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతున్నదని గణాంకాలు కూడా సమర్పించింది మీ ప్రభుత్వమే కదా అని జస్టిస్‌ ఏకె గోయల్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కోర్టుకు సాయపడేందుకు గాను అమికస్‌ క్యూరీగా వ్యవహరించిన అమరేంద్ర షరాన్‌ ‘ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సమాచారం అందించి దుర్వినియోగం గురించి విన్నపాలు చేసింది, ఇప్పుడు అదే ప్రభుత్వ తీర్పును సవాలు చేస్తోంది’ అని అభ్యంతరం తెలిపారు.కోర్టుకు అందచేసిన సమాచారం, దాని మీద దుర్వినియోగ వ్యాఖ్యానాలతో వాదనలు చేయటం ఫ్యూడల్‌ వ్యవస్ధకు ప్రతినిధులైన భూస్వాములు, మాజీ జమిందార్లు, రాజాలు, ఆ భావజాలం వున్న ఇతరులను సంతృప్తి పరచేందుకు, ఆ చట్టాన్ని తొలగించేందుకు అన్నది స్పష్టం. దాని మీద ఈ తరగతుల్లో వ్యక్తమైన హర్షాతిరేకాల కంటే బాధితులుగా వుంటున్న దళితులు, గిరిజనుల్లో వెల్లడైన వ్యతిరేకతను చూసి బిజెపి ఎక్కువగా భయపడింది. దీనికి కారణం వచ్చే ఎన్నికల్లో ఓట్ల గురించి తలెత్తిన బెంగ, దాని పర్యవసానమే కోర్టులో సమీక్ష పిటీషన్‌.

బ్రిటీష్‌ వారి విభజించు పాలించు అనే సూత్రాన్ని మన పాలకవర్గం మరింతగా నవీకరించి అమలు జరుపుతోంది. ఏ తరగతికి ఆ తరగతి వారు తమ దాకా వచ్చినపుడు చూసుకుందాంలే అనే వుపేక్షాభావంతో వున్నారు. దళితులు చూపిన చొరవను గతంలో వివిధ చట్టాల సందర్భంగా అందరూ చూపి వుంటే ఇప్పుడీ పరిస్ధితి తలెత్తి వుండేది కాదు. వుదాహరణకు మహిళా రక్షణ చట్టాల విషయమే చూద్దాం. ప్రపంచంలో ఎక్కడైనా ఒక మహిళ చట్టాన్ని వుపయోగించుకుంటే దాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తారు, అదే మన దేశంలో అయితే దుర్వినియోగంతో పాటు సదరు మహిళ చెడునడత కలదని ముద్రవేయటం సర్వసాధారణం. ఏడాది క్రితం కట్న వేధింపుల వుదంతాలలో శిక్షాస్మృతి 498ఏ కింద ఫిర్యాదులు నమోదైనపుడు వాటిని నిర్ధారించుకోకుండా అరెస్టులు చేయరాదని సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. దాని ప్రకారం ప్రతి జిల్లాలో కట్నవేధింపుల కేసుల ఫిర్యాదులను పరిశీలించేందుకు కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాల్సి వుంది. ఇప్పటికే పోలీసు వ్యవస్ధలో కొంత నీరుకారుతుంటే మరొక దొంతర తోడు చేయటమే ఇది. సమాజంలో కట్నకానుకల దురాచారం లేదా దోపిడీ గురించి తెలియని వారు లేరు. వాటికోసం మహిళలను వేధించటం జగమెరిగిన సత్యం. ఎవరైనా తెగించి ఫిర్యాదు చేస్తే చట్టాన్ని దుర్వినియోగం చేశారనే నిందతో సమాజం, పోలీసులు,కోర్టులలో లాయర్ల ప్రశ్నలతో మరో వేధింపు పర్వం ప్రారంభం అవుతుంది. అంతదాకా నిలబడిన మహిళపై చివరకు చెడునడత నింద. సహించలేక ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే వేధింపులు ఆగేందుకు ప్రయత్నం కాకుండా కుటుంబపరువు పోతుందనే పేరుతో అసలు కేసునే వెనక్కు తీసుకొనే ప్రయత్నం అటు పోలీసుల నుంచి ఇటు ఇతరుల నుంచీ జరుగుతుంది. అందుకే వరకట్న వేధింపులు, దళితులు, గిరిజనులపై అత్యాచారాలు, దాడుల కేసులు అత్యధికం విచారణ వరకు రావు, వచ్చినా శిక్షలు పడేది చాలా తక్కువగా వుంటున్నాయి. కారణం విధిలేక రాజీపడేవి కొన్నయితే బలవంతపు రాజీ,ప్రలోభాలతో నీరుగారేవి ఎన్నో. ఈ గణాంకాలను చూపే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం దుర్వినియోగమవుతున్నదని వాదించగా ప్రభుత్వమే సాధికారికంగా దుర్వినియోగం గురించి చెబుతున్నపుడు కోర్టులు అందుకు అనుగుణ్యంగా తీర్పు చెప్పకుండా ఎలా వుంటాయి? కట్నవివాదాలలో అత్తమామలను చేర్చి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అనేక సందర్భాలలో కోర్టులే వ్యాఖ్యానించిన వుదంతాలు వున్నాయి. తమ కుమారుడు కోడల్ని వేధిస్తున్నాడని అత్తమామలు ఫిర్యాదు చేసిన వుదంతం ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవటానికి కారణం ఏమిటి? మనది పితృస్వామిక వ్యవస్ధ ఇలాంటి వాటిలో ఏం చేసినా ఆడది అణగిమణగి వుండాలన్నది తరతరాలుగా వస్తున్న ఆధిపత్య భావజాలమే. దీని అర్ధం చట్టాలు దుర్వినియోగం అవటం లేదని కాదు. తప్పుదారి పట్టేవారు సమాజంలోని ప్రతి తరగతిలో వుంటారు. అలాంటి అనేక వుదంతాలలో గ్రామ కక్షలలో, పట్టణాలలో వివాదాలలో పావులుగా మార్చుకొని ప్రత్యర్ధులపై తప్పుడు ఫిర్యాదులు చేయించేది పెత్తందారులు, అవాంఛనీయ శక్తులే. అలాంటి వారిపై తగు చర్య తీసుకొనేందుకు అవకాశం వున్నప్పటికీ మన వ్యవస్ధలు తమ అధికారం, బాధ్యతలను దుర్వినియోగపరుస్తున్నాయి. మహిళా చట్టాన్ని నీరుగార్చినపుడే తీవ్ర స్ధాయిలో వ్యతిరేకత వ్యక్తమై వుంటే దళితులు తమ రక్షణకోసం చేసిన చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వారిపైనే బిజెపి సర్కార్‌ నెపం మోపే సాహసం చేసి వుండేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పశ్చిమ దేశాల పధకంలో భాగమే ముస్లిం వుగ్రవాదుల తయారీ !

03 Tuesday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, UK, USA

≈ Leave a comment

Tags

Cold War, Saudi crown prince, Spread of Wahhabism

ఎం కోటేశ్వరరావు

తమ విలువైన సంపదలు పశ్చిమ దేశాల కార్పొరేట్‌ సంస్ధల పాలవుతున్నా గుడ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ముస్లిం దేశాల పౌరులున్నారు. మరోవైపు అదే సంస్ధల ఆధీనంలో వున్న మీడియా పని గట్టుకొని చేస్తున్న ప్రచారం, జరుగుతున్న కొన్ని వుదంతాల వలన మానసికంగా గాయపడిన, అవమానభారాలకు, గందరగోళానికి, ఆత్మన్యూనతకు గురి అవుతున్నారు. అలాంటి వారు వూరట పొందేందుకు, వాస్తవాలను అర్ధం చేసుకొనేందుకు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పిన అంశాలు నిస్సందేహంగా తోడ్పడతాయి. అత్యధిక ముస్లిం దేశాలలో పశ్చిమ దేశాలు, వారి ప్రయోజనాలతో ముడిపడి వున్న శక్తులతో సంబంధాలున్న నిరంకుశశక్తులు అధికారంలో వున్నాయి. వారు మిలిటరీ లేదా అవినీతి అక్రమాలకు నిలయంగా వున్నారు. అందువలన తమకు అవసరమైనది తప్ప ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ ఆయా దేశాల జనానికి తెలియకుండా నియంత్రిస్తున్నారు. వారికి అందుబాటులో వున్నదంతా పశ్చిమ దేశాల కృత్రిమ తయారీ సమాచారమే. ఒక అంచనా ప్రకారం గత అర్ధశాతాబ్దంలో దాదాపు కోటి మంది సామాన్య ముస్లింలు పశ్చిమ దేశాల కుట్రలకు బలై ప్రాణాలర్పించారని అంచనా. ఇందుకు కారకులైన దుర్మార్గాలను మరుగుపరచి ముస్లింలందరూ వుగ్రవాదులు గాకపోయినా వుగ్రవాదులందరూ ముస్లింలే అనే పేరుతో అందరినీ అవమానాలకు గురి చేస్తున్నారు. ఇదంతా పశ్చిమ దేశాలు, వాటితో చేతులు కలిపిన తమ దేశాల పాలకవర్గాల పుణ్యమే అని గ్రహించలేని వారెందరో. అలాంటి వారిలో కొందరికైనా సౌదీ పాలకుడు అధికారికంగా అంగీకరించిన అంశం వుపకరిస్తుంది.

ఇస్లామిక్‌ దేశాలలో మతోన్మాదశక్తులు పెరగటానికి అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదశక్తులే కారణం అన్నది ఎప్పటి నుంచో తెలిసిన బహిరంగ రహస్యం. 1960వ దశకంలో ఇండోనేషియాలో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, సోవియట్‌ సేనలపై దాడులకు ముజాహిదీన్‌ లేదా తాలిబాన్ల పేరుతో వున్న మతశక్తులకు ఆయుధాలిచ్చాయి. ఇప్పుడు సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల కిరాయి మూకలుగా వాటిని వుపయోగిస్తున్నారు. ముస్లిం దేశాలు సోవియట్‌ ప్రభావంలో పడకుండా వుండేందుకు గాను పశ్చిమ దేశాల సలహా మేరకు వహాబియిజాన్ని వ్యాప్తి చేసేందుకు తాము పెద్ద మొత్తంలో నిధులు అంద చేస్తున్నట్లు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వెల్లడించారు. గతనెల మూడవ వారంలో అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌ పోస్టు పత్రిక జర్నలిస్టుల ఇష్టాగోష్టి సమావేశంలో పాల్గని అనేక విషయాలు చెప్పారు. ప్రచ్చన్న యుద్ద(కమ్యూనిజంపై సామ్రాజ్యవాదుల దాడికి పెట్టిన పేరు) సమయంలో సోవియట్‌ ప్రభావం (అంటే కమ్యూనిస్టు వుద్యమ) పెరగకుండా చూసేందుకు పశ్చిమ దేశాల సలహా సౌదీ అరేబియా వ్యవహరించిన తీరును వివరించారు. ఇష్టాగోష్టిగా చెప్పినప్పటికీ తరువాత కొన్ని విషయాలను ప్రచురించి, ప్రసారం చేయటానికి సౌదీ రాయబారకార్యాలయం వాషింగ్టన్‌ పోస్టు పత్రికకు అనుమతిచ్చింది.ఆ విధంగా పై వివరాలు బయటకు వచ్చాయి.

ఇస్లామిక్‌ దేశాలలో సోవియట్‌ ప్రభావం విస్తరించకుండా చూసేందుకు ఆ దేశాలలో సున్నీ తెగ ముస్లింల మసీదుల నిర్మాణం, మదార్సాల ఏర్పాటుకు నిధులివ్వాలని ప్రచ్చన్న యుద్ధ కాలంలో తమ దేశాన్ని పశ్చిమ దేశాలు కోరాయని, మధ్యలో కొన్ని సౌదీ ప్రభుత్వాలకు వాటితో సంబంధాలు తెగిపోయినప్పటికీ ఇప్పుడు తిరిగి పునరుద్ధరించుకున్నామని, వాటికి నిధులు ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రధానంగా సౌదీలోని ధార్మిక సంస్ధల ద్వారా అంద చేస్తున్నట్లు యువరాజు వెల్లడించారు. తరువాత కొద్ది రోజుల తరువాత అట్లాంటిక్స్‌ పత్రిక సంపాదకుడితో మాట్లాడుతూ వహాబియిస్టులకు నిధులు ఇస్తున్న మాట వాస్తవమేనని అయితే వహాబియిజం అంటే నిర్వచనం ఏమిటో తనకు తెలియదని వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. ఇస్లామ్‌ను సంస్కరించే పేరుతో 1703-1791 మధ్య సౌదీ ప్రాంతంలో నివశించిన మహమ్మద్‌బిన్‌ అబ్దల్‌ వహాబ్‌ అనే ఇస్లామిక్‌ పండితుడు సున్నీ ముస్లింలు కఠోరనైతికతా వాదంతో ఎలా వుండాలో ప్రవచించిన దానినే వహాబియిజమ్‌ అని వ్యవహరిస్తున్నారు. దానికి పలు వ్యాఖ్యానాలున్నాయి. అయితే ఇప్పుడు తాలిబాన్లు, ఆల్‌ఖైదా, ఐఎస్‌, బోకో హారం పేరుతో వ్యవహరిస్తున్న మత వుగ్రవాద సంస్ధలన్నీ తాము వహాబియిజాన్నే అనుసరిస్తున్నామని, అలాంటి ముస్లిం సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతూ జనం మీద అనేక ఆంక్షలు విధిస్తున్నాయి, అమలు జరపనివారి మీద దాడులు చేస్తున్నాయి. మరోవైపు పశ్చిమ దేశాలతో చేతులు కలపని ముస్లిందేశాల పాలకులందరిని మత ద్రోహులుగా ముద్రవేసి పవిత్రపోరాటం పేరుతో అమెరికా తదితర దేశాలు ఇచ్చిన ఆయుధాలు, డబ్బుతో కిరాయిదాడులకు పాల్పడుతున్నాయి.

జనంలో తంపులు పెట్టటం, తిరోగమన శక్తులను పెంచి పోషించటంలో అందెవేసిన బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు వహాబియిజాన్ని సాధనంగా చేసుకొని తమ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు. తరువాత అమెరికా పెద్దన్న పాత్ర తీసుకొని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. దీనిలో భాగంగానే బిన్‌ లాడెన్‌ వంటి దుష్టశక్తులను పెంచి పెద్ద చేశారు. ఆల్‌ఖైదా తీవ్రవాదులు 2001సెప్టెంబరు 11న న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసినప్పటికీ అమెరికన్లు ఈ మత వుగ్రవాదులకు మద్దతు ఇవ్వటం మానుకోలేదు. దానికి తన ప్రయోజనాలు తప్ప తాను పెంచిన వుగ్రవాదులు తన దేశపౌరులపై దాడులు చేసినప్పటికీ దానికేమీ చీమకుట్టినట్లు లేదని తరువాత పరిణామాలు స్పష్టం చేశాయి. సౌదీలోని పాలకులకు ఈ శక్తులు వెన్నుదన్నుగా వున్నాయి. ఆఫ్రికాలోని ఎమెన్‌ ప్రాంతం మిలిటరీ వ్యూహరీత్యా ఎంతో కీలకంగా వుండటంతో అక్కడ తిష్టవేసేందుకు అమెరికా గత యాభై సంవత్సరాలుగా చేయని దుర్మార్గం లేదు. ఆ కుట్రలు ఫలించకపోవటంతో సౌదీ అరేబియాను ముందు పెట్టి దాని నాయకత్వంలో గత కొద్ది సంవత్సరాలుగా ఎమెన్‌పై దాడులు చేయిస్తున్నారు. కొన్ని లక్షల మందిని చంపివేసినా, కరవు కాటకాలకు, కలరా వంటి వ్యాధులకు గురిచేసినా, లక్షల మందిని దేశం నుంచి తరిమివేసినా దాన్ని స్వాధీనం చేసుకోవటం సాధ్యం కావటం లేదు. అక్కడి సామ్రాజ్యవాద వ్యతిరేకశక్తులు మొక్కవోని ధైర్యంతో ప్రతిఘటిస్తున్నాయి. సౌదీ అరేబియన్‌ పౌరుల రక్షణకు మాత్రమే తాము అక్కడ జోక్యం చేసుకుంటున్నామని సల్మాన్‌ సమర్ధించుకున్నారు.

సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా మతోన్మాద, కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల వలలో పడిన ముస్లిం యువతలో, యావత్‌ ఇస్లామిక్‌ దేశాలలో పురోగామి ఆలోచనలు రేకెత్తించటానికి, సామ్రాజ్యవాదుల కుట్రల పట్ల మరింత అప్రమత్తం కావటానికి సౌదీ యువరాజు వెల్లడించిన అంశాలు తోడ్పడతాయి. కమ్యూనిస్టు వుద్యమం విస్తరించకుండా చూసేందుకు సామ్రాజ్యవాదులు అనుసరించిన వ్యూహంలో ఎన్నో అంశాలున్నాయి. అరబ్‌ సోషలిజం పేరుతో సంస్కరణవాదశక్తులను ప్రోత్సహించారు. దానికి పెద్ద వుదాహరణ బాత్‌ పార్టీ సోషలిజం పేరుతో సద్ధాం హుసేన్‌ రంగంలోకి రావటానికి, సమర్ధించటంలో అమెరికా తోడ్పడింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆ సద్దాంనే ప్రయోగించి యుద్దం చేయించిన వుదంతం మన కళ్ల ముందే వున్నది. అమెరికా కుట్రలను ఎరిగిన సోవియట్‌ యూనియన్‌ అనేక అరబ్బు దేశాలలో సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులకు మద్దతిచ్చి నిలబెట్టింది. అలాంటి వారిలో గడాఫీ ఒకరు. ఇదే సమయంలో సౌదీ అరేబియా వంటి దేశాల పాలకులతో చేతులు కలిపి తాలిబాన్లు,ఆల్‌ఖైదా వంటి ఛాందస వుగ్రవాదుల తయారీని చూశాము. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత తనను వ్యతిరేకించే అరబ్బు జాతీయశక్తులను దెబ్బతీసేందుకు అమెరికా పావులు కదిపింది. ఇరాక్‌ , లిబియాలో జరిగింది అదే. ఇరాన్‌లో విఫలయత్నం చేసింది. సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల పాలకులను మార్చేందుకు ఇప్పటికీ దాడులు కొనసాగిస్తున్నది. తమ చేతికి మట్టి అంటకుండా ఇస్లామ్‌ పునీకరించేపేరుతో మతఛాందసాన్ని మెదళ్లకు ఎక్కించటం, ప్రపంచాధిపత్యంలో భాగంగా అపార చమురు, ఇతర సహజ సంపదలున్న ప్రాంతాలపై ఆధిపత్యం, మిలిటరీ రీత్యా కీలక ప్రాంతాలను తమ చేతుల్లో వుంచుకొనేందకే ఇదంతా చేస్తున్నారు.

సామ్రాజ్యవాదులు కేవలం ఇస్లామిక్‌ సమాజాలు, ఇస్లామిక్‌ దేశాల మీదే కేంద్రీకరించాయనుకుంటే పొరపాటు. అది మతం, ప్రాంతీయం, భాష, వేర్పాటు వాదం ఏదైనా కావచ్చు. వాటి వెనుక సామ్రాజ్యవాదుల హస్తం వుంటుంది. మన దేశంలో హిందూ తాలిబాన్లు,గతంలో పంజాబ్‌ తీవ్రవాదులు, ఇప్పుడు కాశ్మీరులో తీవ్రవాదులు, ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవ వుగ్రవాదులు, ఐరోపా దేశాలలో నయా నాజీ బృందాల వెనుక పశ్చిమ దేశాల హస్తం, డబ్బు లేకుండా ఇంతగా రెచ్చిపోవటం సాధ్యం కాదు. తాము తయారు చేసిన వుగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ కొన్ని చోట్ల తమ అదుపు తప్పటంతో లేదా తమ వ్యతిరేకులైన ఇరాన్‌ ప్రభావంలోకి పోవటం వంటి పరిణామాలతో అవే పశ్చిమ దేశాలు ఒక ఎత్తుగడగా వుగ్రవాద వ్యతిరేక ఫోజుపెడుతున్నాయి. తమతో సంబంధాలలో వున్న వారితో సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల కిరాయి మూకలుగా వుపయోగించుకుంటున్నాయి. నిజానికి వంద సంవత్సరాల క్రితం ముస్లిం తీవ్రవాదం గురించి ప్రపంచానికి తెలియదు, అటువంటి వుగ్రవాద చర్యలు కూడా లేవు. ముస్లిం సమాజం వుగ్రవాదానికి లోనై వుంటే పశ్చిమాసియాలో వారి మెజారిటీగా వున్న ప్రాంతాలకు ప్రపంచంలో వున్న యూదులందరినీ సమీకరించి కొన్ని ప్రాంతాల రూపురేఖలను మార్చివేస్తుంటే సహించి వుండేవారా ? తమ ప్రాంతాల నుంచి తమను వెళ్లగొట్టటం ప్రారంభమైన తరువాతే పాలస్తీనియన్లు ఆయుధాలు పట్టారు తప్ప అంతకు ముందు ఎంతో సౌమ్యంగా వున్న సమాజాలవి. నిజానికి ఇస్లాం ఒక మతమే కాదు, ఒక సంస్కృతి కూడా. ప్రతి సంస్కృతిలో కొన్ని మినహాయింపులున్నట్లే దానికి భిన్నంగా ప్రవర్తించేవారు ఆ సమాజంలో వుండట ఆశ్చర్యమేమీ కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పుతిన్‌ అధ్యక్ష ఎన్నిక ఓ ప్రహసనం!

21 Wednesday Mar 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA

≈ Leave a comment

Tags

president of Russia, vladimir putin's re election

ఎం.కోటేశ్వరరావు

         బద్దకంగా కలలు కనేవారికి నియంతృత్వం కూడా ఒక పాలనా విధానం మాదిరే కనిపించి మాయ చేస్తుంది. వారికి మరొక ప్రత్యామ్నాయం కనిపించదు. ఇది ఆదివారం నాడు జరిగిన రష్యన్‌ ఎన్నికల్లో మరోమారు ఎన్నికైన వ్లాదిమిర్‌ పుతిన్‌ విజయం గురించి ఒక వ్యాఖ్యాత చేసిన వర్ణన వాస్తవానికి ఎంతో దగ్గరగా వుంది. అసలు ఎన్నికలే జరపని నియంతలు కొందరైతే ప్రత్యర్థులకు అవకాశాలు లేకుండా చేసి అప్రజాస్వామికంగా యంత్రాంగాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మలచుకొనే తరగతికి చెందిన వ్యక్తి పుతిన్‌. అందుకే అతగాడు తప్ప మరొకరు విజయం సాధించలేరని, ఎన్నిక లాంఛనప్రాయమే అని పరిశీలకులు ముందుగా వూహించినట్టుగానే ఫలితాలూ వచ్చాయి. ఎన్నికల్లో అవినీతి, అక్రమాల ఆరోపణల మధ్య పుతిన్‌కు 77, కమ్యూనిస్టుపార్టీ బలపరిచిన అభ్యర్థి గ్రడనిన్‌కు 12, మితవాది జిరినోవస్కీకి 5.65శాతం ఓట్లు వచ్చాయి. మరో ఆరేండ్లు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ కొనసాగేందుకు వీలు కల్పించిన ఏకపక్ష ఎన్నికల గురించి నిజానికి ఎవరికీ పెద్ద భ్రమలు లేవు. సోవియట్‌ విచ్ఛిన్నంతో మిగిలిపోయే రష్యా గురించి సామ్రాజ్యవాదులు వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. గత రెండు ప్రపంచ యుద్ధాల్లో ఏదో ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోయి అది బలహీనపడటం చరిత్ర. ఉదాహరణ టర్కీ, బ్రిటన్‌, జపాన్‌, అయితే ప్రచ్ఛన్న యుద్ధంలో సోవియట్‌ యూనియన్ను కూల్చేసిన తరువాత ప్రపంచ రాజకీయ రంగంలో తమకు పోటీదారుగా రష్యా ముందుకు రావటాన్ని సామ్రాజ్యవాదులు వూహించి వుంటే పరిణామాలు మరోవిధంగా వుండేవి. పుతిన్‌ హయాంలో రష్యా ప్రపంచ అగ్రరాజ్యంగా ముందుకు వచ్చింది. తన సత్తా నిరూపించేందుకు నాటో కూటమిని సవాలు చేస్తూ తన పక్కలో బల్లెంగా మారకుండా చూసుకొనేందుకు ఉక్రెయిన్‌లోని క్రిమియాను ఆక్రమించుకుంది. సిరియాలో అసద్‌ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి సామ్రాజ్యవాదుల వెన్నుదన్నుగా వున్న శక్తులను దెబ్బతీయటంలో రష్యా పాత్ర బహిరంగం. ఇదే సమయంలో మొత్తం మీద చూసినప్పుడు సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్థలను కూల్చేసిన సామ్రాజ్యవాద, ధనిక పెట్టుబడి దారీ దేశాలన్నీ తరతమ తేడాలతో అభివృద్ధి గిడసబారటం లేదా తగ్గటం వంటి సంక్షోభాలకు గురయ్యాయి.

     అందువలన ఈ ఎన్నికల్లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయి, వాటి మంచి చెడ్డల గురించి అంతగా విశ్లేషించటం కంటే ఎన్నికలకు ముందు, తరువాత పర్యవసానాల గురించి చర్చించుకోవటం ఉత్తమం. సోషలిస్టు వ్యవస్థను కాలదన్నుకున్న తరువాత రష్యాలో పరిస్థితులు అన్ని రంగాల్లో దిగజారాయి తప్ప ఏ మాత్రం మెరుగుపడలేదు. అయినా సరే రెండు దశాబ్దాలుగా పుతిన్‌ ఎలా అధికారంలో వుండగలుగుతున్నాడు అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. దానిని వేరే సందర్భంలో చర్చించొచ్చు. 2016 ఏప్రిల్‌ 12న బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ అధికారిక అంకెలను పేర్కొంటూ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనాభాలో 13.4శాతం మంది దారిద్య్రరేఖకు దిగువ ఆదాయాలతో బతుకుతున్నారు. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఇది 20శాతం ఎక్కువ. పద్దెనిమిది సంవత్సరాల కిందట ఇది 29శాతం వుంది.
చమురు మార్కెట్లో ధరల పతనం అనేక మందిని దారిద్య్రంలోకి నెట్టింది. అభివృద్ధి రేటు విషయానికి వస్తే 2015లో మైనస్‌ 2.8, 2016లో మైనస్‌ 0.2, 2017లో 1.7, 2018లో 1.7, 2019లో 1.8శాతంగా ప్రపంచబ్యాంకు వెల్లడించింది. 2008 ఆర్థిక సంక్షోభం రష్యాను వదల్లేదు. దాని పర్యవసానాలు అనుభవిస్తున్నది. 2014లో చమురు రేటు పీపా 96డాలర్లు వున్నపుడు రష్యా అభివృద్ధి రేటు 0.7శాతం వుండేది. అది తరువాత కనిష్టంగా 2016లో 43డాలర్లకు పడిపోయింది. ప్రపంచబ్యాంకు అంచనా ప్రకారం ఈ ఏడాది 56, 2019లో 59 డాలర్లకు పెరగొచ్చని అంచనా. అందువలన ఆర్థిక రంగంలో అద్భుతాలను పుతిన్‌ పాలనలో ఊహించలేము. ఇప్పటికీ దానికి వున్న సహజవనరులు, ఆయుధ తయారీ వంటి అంశాలు మిగతా ధనిక దేశాలతో మార్కెట్‌ కోసం పోటీబడేట్టు చేస్తున్నాయి. ఇతర ధనిక దేశాల అభివృద్ధి రేట్లు కూడా ఇదే ధోరణితో వున్నాయి. నాటోను నిలువరించేందుకు ఐరోపాలో చేయాల్సిన అదనపు మిలిటరీ ఖర్చు తప్ప చైనాతో వున్న పెద్ద సరిహద్దులో సాధారణ మిలిటరీ నిర్వహణ రష్యాకు కలసి వచ్చే అంశం.
అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమను సవాలు చేస్తున్న పుతిన్‌ను ఒక విధంగా అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలే రాజకీయంగా నిలబెడుతున్నాయన్నది ఒక అభిప్రాయం. పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా జాతీయవాదా న్ని రెచ్చగొట్టి పుతిన్‌ దానిని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో సిద్ధహస్తుడయ్యాడు. క్రిమియా ప్రాంతాన్ని రష్యాలో విలీనం చేయడం దానిలో భాగమే. గత ఎన్నికల్లో అక్రమాలతో పుతిన్‌ విజయం సాధించాడని అప్పుడు విదేశాంగ మంత్రిగా వున్న హిల్లరీ క్లింటన్‌ చేసిన వ్యాఖ్యకు, 2016 అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకొని హిల్లరీకి వ్యతిరేకంగా డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా వ్యవహరించాడన్నది పుతిన్‌పై పశ్చిమ దేశాల వ్యాఖ్యాతల అభిప్రాయం. ఈ విషయంలో ట్రంప్‌ అవునని, కాదని అనలేక ఏడాది కాలంగా ట్రంప్‌ కొంత మేరకు ఊగిసలాడిన ప్పటికీ ఎన్నికలకు ముందు ట్రంప్‌ తన రాజకీయాన్ని ప్రారంభించాడు. మాజీ రష్యన్‌ గూఢచారి, అతని కుమార్తెపై బ్రిటన్‌లోని శాలిస్‌ బరీలో ప్రాణాంతక గ్యాస్‌ను రష్యా ప్రయోగించినట్టు సరిగ్గా పోలింగ్‌కు మూడు రోజుల ముందు బ్రిటన్‌, ఇతర ఐరోపా దేశాలు చేసిన ఆరోపణలతో అమెరికా గొంతు కలిపింది. 2016 అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు ప్రతీకారంగా అదే రోజు కొంత మంది రష్యన్లపై, కొన్ని సంస్థలపై అమెరికా ఆర్థికశాఖ ఆంక్షలు విధించింది. ఈ చర్యల పట్ల ఆగ్రహం చెందిన రష్యన్లు పుతిన్‌కు ఓటు వేశారని కొందరు సూత్రీకరించారు.
రష్యాలో ఎన్నికల పట్ల జనంలో పెద్ద ఆసక్తి లేదని వార్తలు వచ్చినప్పటికీ 67శాతంపైగా పోలింగు నమోదైనట్టు ప్రకటించారు. పుతిన్‌ రాజకీయ ప్రత్యర్థుల్లో ఒకడైన అలెగ్జీ నవల్నీపై ఒక కేసు వున్న కారణంగా పోటీకి అనర్హుడిగా ప్రకటించారు. దాంతో ఎన్నికలను బహిష్కరించామని అతగాడు పిలుపునిచ్చాడు. అసోసియేటెట్‌ ప్రెస్‌ వార్తా కథనం ప్రకారం అనేక చోట్ల బ్యాలెట్‌ బ్యాక్సులను పుతిన్‌ మద్దతుదారులే ఓట్లతో నింపారు. అనేక చోట్ల ఆ విధంగా వేయించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమంలో పెద్దఎత్తున దర్శనమిచ్చాయి. కొన్ని చోట్ల బలవంతంగా ఓట్లు వేయించారు.
కంపెనీల యజమానులు బలవంతంగా కార్మికులను బస్సుల్లో తరలించి ఓట్లు వేయించారని నవల్నీ విమర్శించాడు. గత ఎన్నికల కంటే ఓటింగ్‌ శాతం తగ్గితే తన బహిష్కరణ పిలుపు ప్రభావమే అని నవల్నీ నోరెత్తకుండా వుండేందుకు వీలుగా అంతకంటే ఎక్కువ శాతం బ్యాలెట్‌ బాక్సుల్లో వేయించే జాగ్రత్త తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. అసలు ఎన్నికలే ప్రహసనమైతే ఇలాంటివి జరగటంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికల్లో సరైన అభ్యర్థులు, నిజమైన పోటీ లేదని, విమర్శనాత్మక గళాలను అణచివేశారని ఐరోపా భద్రత, సహకార సంస్థ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. ఈ ఎన్నిక రోతపుట్టించిందని కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి పావెల్‌ గ్రడనిన్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల గురించి కమ్యూనిస్టు పార్టీ చైర్మెన్‌ జుగనోవ్‌ మాట్లాడుతూ అనేక విశ్వవిద్యాలయాలు, సహకార సంస్థల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థికి 25-30శాతం ఓట్లు పడ్డాయని.. ఇది నిజమైన మద్దతు, భవిష్యత్‌లో ప్రజలు తమ కార్యక్రమాన్ని బలపరుస్తా రని ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. మాకు ఒక కార్యక్రమం వుంది, మా వద్ద సమస్యలకు పరిష్కారాలున్నాయి, అనుభవం వుంది కనుక అధికారంలో వున్న వారు ప్రతిపక్షం చెప్పేది వినాలని జుగనోవ్‌ చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గ్రడనిన్‌ ఎన్నికల రోజున ఒక ప్రకటన చేస్తూ వామప క్ష, దేశభక్త శక్తులు దేశం ముందు 20అంశాల నిర్ధిష్ట కార్యక్ర మాన్ని వుంచాయి. దేశ రాజ్యాంగం ప్రకారం ప్రజలే సర్వశక్తి మంతులు. ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థులు, వారి కార్యక్రమాలు, దేశ భవిష్యత్‌ గురించి వారి అవగాహనను జనానికి తెలియజేయాల్సి వుంది. ఇటువంటి స్థితిలో అభ్యర్థుల చర్చలకు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున సమయాలు నిర్ణయించటం, జనం చూసే చోట్ల నాసిరకంగా కార్యక్రమా లను ప్రసారం చేయటం వంటి పనులు చేశారు. అభ్యర్థుల చర్చలను ప్రత్యక్ష ప్రసారం కాకుండా రికార్డు చేయటంతో సెన్సార్‌కు అవకాశం కలిగింది. ఎక్కువ మంది చూసే సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోటీలో వున్న అభ్యర్థులు, ఎన్నికల సంఘానికి కూడా ఈ మేరకు తాను సూచించానని గ్రడనిన్‌ పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో నిబంధనావళిని ఎలా తుంగలో తొక్కింది వివరిస్తూ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి 70 ఫిర్యాదులు చేసింది. పోటీ చేసే అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించలేదు. కమ్యూనిస్టు అభ్యర్థి గ్రడనిన్‌కు వ్యతిరేకంగా ఒక యుద్ధమే ప్రకటించారు. తప్పుడు, కల్పితాలను గుప్పించారు. తొంభైశాతం సమాచారం అసహ్యంగా, రెచ్చగొట్టే విధంగా వుంది. ఇది ఒక విధంగా బహిరంగంగా వేధించటమే. ఇది 1990దశకం కంటే దిగజారింది. మొత్తం ఎన్నికల ప్రచారమంతా తమ అభ్యర్థిపై బురదజల్లే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమంతో చేసినట్టుగా వుంది అని కమ్యూనిస్టు పార్టీ ఫిర్యాదు చేసింది. ఇప్పటికే 14ఏండ్లు అధికారంలో వున్న పుతిన్‌ అనూహ్య పరిణామాలు, సంక్షోభాలేవీ సంభవించకపోతే 2024వరకు అధికారంలో కొనసాగుతారు. రాబోయే రోజుల్లో రష్యా మనుగడ కోసమైనా పుతిన్‌ పశ్చిమ దేశాల వ్యతిరేక వైఖరిని అనుసరించటం అనివార్యంగా కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టు మానిఫెస్టో కంటే కార్మికులకు మరో ఆయుధమేముంది !

28 Wednesday Feb 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ 1 Comment

Tags

communist, communist manifesto, karal marx, Karl Marx and Friedrich Engels, Raoul Peck, The Young Karl Marx

యంగ్‌ కారల్‌ మార్క్సు దృశ్యం

ఎం కోటేశ్వరరావు

తుపాకి చేతబట్టిన ఒక చెడ్డవాడిని ఆపాలంటే మరో మంచివాడు తుపాకి పట్టటమే ఏకైక మార్గం అని గతంలో సెలవిచ్చిన అమెరికా జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ అధిపతి వేనె లాపిరే తాజాగా మరో మారు రెచ్చి పోయాడు.తుపాకులను అదుపు చేయాలనే వారందరూ కమ్యూనిస్టులని, ఆచర్య స్వేచ్చను అడ్డుకోవటమే అంటూ చిందులేశాడు. ఇటీవల ఫ్లోరిడాలోని ఒక స్కూల్లో 17 మంది విద్యార్దులు, టీచర్లు ఒక దుండగుడి తుపాకి కాల్పులకు బలైన విషయం తెలిసిందే. ఇలాంటి వుదంతాలు పునరావృతం కాకూడదంటే టీచర్లందరికీ తుపాకులు ఇవ్వటమే మార్గం అని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. తుపాకులపై ఆంక్షలు విధించాలనే వారందరూ స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించాలని చూసే కమ్యూనిస్టులు తప్ప మరొకరు కాదని వేనె లాపిరే అన్నాడు. ట్రంప్‌-లాపిరే ఇద్దరూ లాభాల కోసం తుపాకులు తయారు చేసే కార్పొరేట్లకు వంత పాడుతున్నారు తప్ప వాటితో పోయే ప్రాణాల గురించి వారికి ఎలాంటి చింత లేదని నిరూపించుకున్నారు.

‘అమెరికా కాలేజీలలోె ఎక్కువగా ఇచ్చే నియోజిత పఠనం, అధ్యయనాలలో కమ్యూనిస్టు మానిఫెస్టో, ఆర్ధికవేత్తలలో కారల్‌ మార్క్స్‌ వుంటున్నారు. అనేక విశ్వవిద్యాలయాలలో ఇప్పుడు వందకు పైగా అమెరికా యువ ప్రజాస్వామ్య సోషలిస్టు శాఖలున్నాయి. సోషలిస్టు భావజాలాన్ని పెంపొందించుతున్నందుకు విద్యార్ధులు పాండిత్య ప్రదర్శక అభినందనలు కూడా పొందుతున్నారు.మీ పిల్లల్ని పాఠశాలలకు పంపే నిర్ణయం తీసుకోబోయే ముందు దీన్ని గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు. అమెరికా రాజ్యాంగాన్ని పట్టించుకోవటం లేదు, దానికి వక్రభాష్యం చెబుతున్నారు. రెండవ సవరణ ద్వారా ఈ దేశంలో ప్రసాదించిన స్వేచ్చ విస్మరించబడుతోంది. వారు గనుక అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారంటే అమెరికా స్వేచ్చలు పోతాయి, మన దేశం శాశ్వతంగా మారిపోతుంది.సోషలిజం రక్తాన్ని ఇష్టపడుతుంది’. ఇలా సాగింది వెనె లాపిరే వాచాలత్వం.

చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌

పెట్టుబడిదారీ వ్యవస్ధలో వెల్లడవుతున్న అవాంఛనీయ పోకడలను ఎలా సమర్ధించుకోవాలో తెలియని శక్తులు స్వేచ్చా, స్వాతంత్య్రాలపదజాలంతో సోషలిస్టు, పురోగామి శక్తులే కాదు, వాటితో సంబంధం లేని వారి అభిప్రాయాలపై కూడా దాడి చేస్తున్నారు. తుపాకి సంస్కృతికి గోరీ కట్టాలనేందుకు కమ్యూనిస్టులే కానవసరం లేదు. ప్రముఖ చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌ తాజా చిత్రం ”ద యంగ్‌ కారల్‌ మార్క్స్‌ ‘ (యువ కారల్‌ మార్క్స్‌) ఫిబ్రవరి 23న అమెరికాలో విడుదల అయింది. ఆ సందర్భంగా డెమోక్రసీ నౌ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో వెనె లాపిరే వాచాలత్వం గురించి రావుల్‌ పీక్‌ స్పందించారు. గతంలో ఆయన ‘ అయామ్‌ నాట్‌ యువర్‌ నీగ్రో, లుముంబా, డెత్‌ ఆఫ్‌ ఏ ఫ్రాఫెట్‌, హైతీ, ద సైలెన్స్‌ ఆఫ్‌ ద డాగ్స్‌, సమ్‌ టైమ్స్‌ ఇన్‌ ఏప్రిల్‌ ‘ వంటి చిత్రాలను నిర్మించాడు. ‘ నేను స్పందించాల్సి వుంటుందని అనుకోలేదు, ఒక విషయం చెబుతాను. అనేక మంది టీచర్లు, అనేక సంస్ధలు ఆయన చెబుతున్నట్లుగా కారల్‌ మార్క్స్‌ను బోధన ప్రణాళికలో చేర్చుతున్నట్లయితే వారు కొంతమేరకు మంచి చేస్తున్నట్లే భావించాలి. కారల్‌ మార్క్స్‌ అంటే ఎవరు, ఒక గొప్ప తత్వవేత్త, ఆర్ధికవేత్త, ఒక విధంగా చరిత్రగతినే మొత్తంగా మార్చటం గురించి, వర్గం, కార్మికవర్గం, బూర్జువాలు, పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి వంటి ఆయన చుట్టూ వున్న విషయాలు చర్చించటానికి వుపయోగపడుతుంది.

ఆయన ప్రస్తావిస్తున్న పుస్తకం కమ్యూనిస్టు మానిఫెస్టో మొదటి అధ్యాయాన్ని చదివితే ఇప్పుడు జరుగుతున్నదానిని ఎక్కువ తక్కువ లేకుండా వర్ణించటం కనిపిస్తుంది. లాభమే ధ్యేయం గల ఒక వ్యవస్ధగా ఆయన సంస్ద(ఎన్‌ఆర్‌ఏ) జాబితా మొదట్లో వుంటుంది. మీ జీవితంలో ఎప్పుడైతే లాభానిది పైచేయి అయిందంటే దాని అర్ధం తరుణ వయస్కుల్ని చంపటం, దానిని ఇంకా సమర్ధించుకోవటం వంటి అనంగీకృతమైన వాటిని అంగీకరించే స్ధితిలో మీరు వున్నట్లే. ఆ కమ్యూనిస్టు మానిఫెస్టోలో వున్నది అదే. యువతరం దానిని చదవటం ప్రారంభించి, దాని మీద చక్కటి చర్చ చేస్తే అది చాలా మంచిది.’ రావుల్‌ పీక్‌ చెప్పిన ఈ అంశం ఒక్క అమెరికా రైఫిల్‌ అసోసియేషన్‌కే కాదు, యావత్‌ ప్రపంచంలో లాభాలవేటలో వున్న ప్రతి వ్యవస్ధకూ,అన్ని జీవన రంగాలకూ ఇది వర్తిస్తుంది. యంగ్‌ కారల్‌ మార్క్సు అనే పీక్‌ సినిమాలో మార్క్స్‌ ఒక ఫౌండరీ యజమానితో చేసిన సంభాషణ దృశ్యం ఇలా సాగుతుంది.

కారల్‌ మార్క్స్‌ : ఎలా సాగుతోంది మీ పని ?

యజమాని: మిమ్మల్ని కలుసుకోవటం సంతోషంగా వుంది.

నేపధ్య వ్యాఖ్యాత :జునేలాకు ఫ్యాక్టరీలున్నాయి, పిల్లలతో సహా అనేక మందిని కార్మికులుగా నియమించాడు.

మార్క్స్‌ : మీ ఫ్యాక్టరీల్లో బాలకార్మికులున్నట్లున్నారు ?

యజమాని: మాకు వేరే గత్యంతరం లేదు, బాల కార్మికులు లేకపోతే మేం మార్కెట్లో అమ్ముకోలేము.

మార్క్స్‌ : మీ వంటి వారు లేకుండా దోపిడీ లేని ఒక సమాజం ఎక్కడ వుంటుంది, మీరు కూడా పని చేస్తున్నారు, ఇది దుర్భరంగా అనిపించటం లేదా ?

వ్యాఖ్యాత : వ్యవస్ధతో మనం పోరాడాలి, త్వరలో పాత వ్యవస్ధ కూలిపోతుంది.

మార్క్స్‌: రెండు రకాల మనుషులున్నారు. ఒకరు కష్టించి పని చేసే వారు, మరొకరు ఆ కష్టార్జిత ఫలం నుంచి లబ్ది పొందేవారు.

యజమాని : దీన్ని ఆపాల్సిందే, సహించకూడదు, మీరెంత అదృష్టవంతులో చూడండి, నేను మిమ్మల్ని తొలగించలేను.

మార్క్స్‌ : నేను పెద్ద మనుషులను ద్వేషిస్తాను, తృణీకరిస్తాను, కార్మికుల స్వేదంతో బజ్జలు పెంచే పందులు వారు.

యజమాని : మేము చెత్తబుట్టలోకి నెట్టదగిన వారమనేగా మీరు చెబుతోంది.

వ్యాఖ్యాత : ఆయన చెప్పింది విన్నారుగా దయచేయండి. వారు మనల్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారు మన బుర్రలను నిరోధించలేరు.

వ్యాఖ్యాత : కారల్‌ , ఫెడరిక్‌ ఎంగెల్స్‌ను పరిచయం చేసేందుకు నన్ను అనుమతించండి.

ఎంగెల్స్‌ : మీ రచనలను నేను చదివాను, నా వాటిని మీరు చదివారా ? మనకాలపు గొప్ప మేధావులలో మీరు ఒకరు !

వ్యాఖ్యాత : తిరుగుబాటుకు సంతోషం అవసరం !

మార్క్స్‌ : ప్రతిదీ మారుతుంది, ఏదీ శాశ్వతంగా వుండదు, పాత వ్యవస్ధను మనం తోసివేయాలి.

ఎంగెల్స్‌ : మేలుకోవాల్సిన సమయమిది !

మార్క్స్‌ : ఇప్పటి వరకు తత్వవేత్తలు ప్రపంచానికి భాష్యం చెప్పారు. కానీ దాన్ని మార్చాల్సి వుంది.

వ్యాఖ్యాత : బూర్జువాలు, కార్మికులు సోదరులా ?

కార్మికులు : కాదు !

ఎంగెల్స్‌ : కాదు, వారు సోదరులు కాదు, శత్రువులు !

Image result for the young karl marx

తన సినిమా బాక్సాఫీసు వద్ద ఆర్ధికంగా విజయం సాధించటం కంటే ప్రపంచంలో నేడు పెరిగిపోతున్న మితవాద, పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా వున్న రకరకాల వామపక్ష, పురోగామిశక్తుల సమీకరణ కేంద్రంగా తన సినిమా పనిచేస్తే అది పెద్ద విజయమని పీక్‌ భావిస్తున్నారు. ప్రముఖ పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ తన చిత్రం పట్ల ఫ్రాన్స్‌లో వెల్లడైన స్పందనను వివరిస్తూ రాజకీయ విబేదాలతో ఏకీభావం లేని పార్టీల వారందరినీ తన చిత్రం ఒక దగ్గరకు చేర్చిందని, ఇతివృత్తం గురించి చర్చలకు దోహదం చేసిందన్నారు. మార్క్స్‌ పిడివాది కాదు, మీవర్తమాన, చారిత్రక పరిస్ధితులను పున:సమీక్షించుకోవాలని మార్క్స్‌ ఎల్లవేళలా చెప్పేవారని అన్నారు. ‘ నా జీవిత పాఠం, రాజకీయాల అనుభవం కారణంగా ఒక వ్యక్తి ఏ ఒక్కరినీ రక్షించలేరని నేను నమ్ముతాను. అలాంటివి ఎన్నికలలో ప్రజాకర్షణకు బాగుంటాయని మనం చూడవచ్చు, దీని నుంచి బయటపడి నూతన వుమ్మడి సమూహాలను నిర్మించాలి. మీకు ఓటు వేయాలని కొంత మందిని మీరు బలవంతం చేయలేరు. వారిని ఒప్పించాలి. అది చర్చల ద్వారా మీరు చెబుతున్నదానిని రుజువు చేసుకోవాలి. కనుక అది దీర్ఘమైన బాట, దీనిలో రహస్యమేమీ లేదు. ఈ రోజు మనకు అపురూప వ్యక్తి మన ముందు ప్రత్యక్షమైన మనలను వెలుగులోకి తీసుకుపోవాలని వూహించుకోవచ్చు, కానీ అలాంటిదెన్నడూ జరగలేదు, అదొక క్రమం. నేడు సమాజాన్ని అవగాహన చేసుకోవాలనుకొనే వారందరికీ మార్క్స్‌, ఎంగెల్స్‌ వారి సమయంలో అందించిన పరికరాలు – దీర్ఘకాల చరిత్ర అందించిన సూచనలు- ఇప్పటికీ లభ్య మౌతున్నాయి. సినిమా ఒక హీరో కేంద్రంగా నడిచేది కాదు. భావవిప్లవం, సామాజికమార్పు కోసం నూతన రాజకీయ సంఘటనల నిర్మాణం, సుదీర్ఘచర్చలు, ఒక యంత్రాంగ నిర్మాణం, అంతర్గత విభేదాలు, పిలుపులతో కూడిన ఒక వాస్తవం ఆధారంగా సాగింది ‘ అన్నారు.

‘ మెరిసిన జుట్టు పెరిగిన గడ్డం వుండే వృద్ధుడైన రాజకీయవేత్తగా కాదు, ఒక అసాధారణ తత్వవేత్తగా చూపించినప్పటికీ ఒక యువకుడిగా, అప్పులతో ఇబ్బందులు పడిన మార్క్స్‌ను, వుద్యమం నుంచి వుద్భవించిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఎలా వచ్చిందో ఈ చిత్రంలో చూస్తారు. కేటుంబం, ముఖ్యంగా భార్యజెన్నీ, స్నేహితుల మధ్య మార్క్స్‌ ఎలా పెరిగారో చూపటం దీనిలో నా తొలి అంశం. మేం ధనికులం, మేం మధ్యతరగతి లేదా పారిశ్రామిక కుటుంబాలకు చెందినవారం అయినప్పటికీ మా చుట్టూ జరుగుతున్నదానిని మేం అంగీకరించం అని చెప్పిన ముగ్గురు యువకుల జీవితాలను యువతరం చూడాలని కోరుకున్నాను. మానవులుగా వారికి నేనెంతో సన్నిహితం, వారు కేవలం పోరాటం మాత్రమే చేయలేదు, వాటితోనే జీవించారు. తమకు ప్రమాదకరమైన నిర్ణయాలను వారు తీసుకున్నారు, సర్వం కోల్పోయారు. వారు పేదలయ్యారు అయినప్పటికీ వారిది పెద్ద జీవితం, మేథావులుగా తయారయ్యారు.యువకులుగా స్పందించారు, ప్రతిదీ మార్చదగినదిగానే వారికి కనిపించింది. పశ్చిమ దేశాలలో మార్క్సు గురించి మరో చిత్రం లేకపోవటం ఈ చిత్ర నిర్మాణానికి ఒక కారణం.’ అన్నారు పీక్‌.

మార్క్స్‌పై చిత్ర నిర్మాణానికి పీక్‌ పది సంవత్సరాలు పని చేశారు. డబ్బు సమస్యలెదురయ్యాయి.ౖ ‘ నేను మూలాల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను.కమ్యూనిస్టు మానిఫెస్టో వంటి ఒక ముఖ్యమైన పుస్తకం మీరు చదివినపుడు అది సులభమార్గంలో వారి పోరాటాలు, జీవితాలను అర్ధం చేసుకొనేందుకు కార్మికుల కోసం రాసిన ఒక పుస్తకం అని అర్ధం అవుతుంది. దానిలో తొలి అధ్యాయం చదివితే గత మూడుదశాబ్దాలలో జరిగినదానిని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తుంది. పెట్టుబడిదారీవిధాన విస్తరణ, వూహాకల్పన(స్పెక్యులేషన్‌) మీద సంపూర్ణ వెర్రి, మొత్తం భూగోళంపై దాని దాడి. సరిగ్గా అదే జరిగింది, కనుక మన చరిత్రను తెలుసుకోవటం ఎంతో ముఖ్యమైంది. లేనట్లయితే మీకు స్వర్గాన్ని చూపించే తదుపరి ప్రజాకర్షకకులను అనుసరించే ఒక కీలుబమ్మ అవుతావు.’ అని రావుల్‌ పీక్‌ చెప్పారు.

ఈ చిత్రం న్యూయార్క్‌, లాస్‌ ఏంజల్స్‌ నగరాలలో ఫిబ్రవరి 23న విడుదల అయింది. రెండు గంటల నిడివి వున్న ఈ చిత్రాన్ని జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియంలలో చిత్రీకరించారు. కారల్‌ మార్క్స్‌గా అగస్ట్‌ డిహెల్‌, ఎంగెల్స్‌గా స్టెఫాన్‌ కోనార్సకె, జెన్నీగా వికీ క్రిప్స్‌ నటించారు. మార్క్స్‌-ఎంగెల్స్‌ తమ కాలంలో ప్రబలంగా వున్న పలు రాజకీయ, తాత్విక ఆలోచనా ధోరణుల నుంచి శాస్త్రీయ సోషలిజాన్ని ఎలా వేరు పరచారన్నదే ప్రధానాంశంగా ఈ చిత్రంలో వున్నదని కొన్ని సమీక్షలలో పేర్కొన్నారు. చిత్ర దర్శక నిర్మాత రావుల్‌ పీక్‌ బెర్లిన్‌ విశ్వవిద్యాలయంలో నాలుగు సంవత్సరాల అధ్యయనంలో దాస్‌ కాపిటల్‌ ఒక భాగంగా అభ్యసించారు.

ప్రపంచ గతినే మలుపు తిప్పిన కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి ప్రచురణకు 170 ఏండ్లు. ఈగ్రంధ ముద్రణ 1848 ఫిబ్రవరి చివరి వారంలో లండన్‌లోని ఒక అజ్ఞాత ప్రాంతంలో జరిగింది. వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ పేరుతో దానిని ప్రచురించారు. తొలుత దానికి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక అని పేరు పెట్టారు. 2008 ఆర్ధిక సంక్షోభం తరువాత ఈ గ్రంధ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. బ్రిటన్‌లో వాటర్‌ స్టోన్స్‌ అనే విక్రేత 2015 ఫిబ్రవరిలో వారం రోజుల్లోనే 30వేల కాపీలు విక్రయించారు. ప్రత్యేకించి పెట్టుబడిదారీ సంక్షోభం నెలకొని వున్న ప్రస్తుత సమయంలో మార్క్సిజం పట్ల ఆసక్తి తిరిగి రేకెత్తించటానికి, పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించేందుకు ప్రత్యేకించి యువకులకు అది తోడ్పడుతుందని 2012లో బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ పేర్కొన్నది.’మనకు తెలిసిన పెట్టుబడిదారీ వ్యవస్ధ జవాబుదారీతనం లేని పెద్ద ప్రపంచవ్యాపిత బ్యాంకులు, కార్పొరేషన్ల ఆధిపత్యంలో వుంది. అది నాలుగు రోడ్ల కూడలిలో వుంది, దాన్ని సంస్కరించి, నవీకరించాల్సి వుంది’ అని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. బ్రిటన్‌లో పెట్టుబడిదారీ విధానం చితికిపోయింది, దానిని తక్షణమే సంస్కరించటం అవసరం, ఎందుకంటే తలిదండ్రుల కంటే వారి పిల్లలను దుర్భరస్ధితిలో వదలి వేస్తున్నదని టెలిగ్రాఫ్‌ పత్రిక గతేడాది సెప్టెంబరు 5న పేర్కొన్నది.

అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో జనం సోషలిజానికి అనుకూలంగా మాట్లాడేందుకు వీలుగా అక్కడి పరిస్ధితి వుంది. 2016లో యు గవ్‌ అనే సంస్ధ జరిపిన సర్వేలో 32శాతం బ్రిటీషర్లు సోషలిజాన్ని వ్యతిరేకించగా 36శాతం మంది అనుకూలం అని తేలింది. నూతన సహస్రాబ్దిలో పుట్టిన వారిలో 40శాతం అమెరికన్లు సోషలిజానికి అనుకూలంగా వున్నట్లు గతేడాది నవంబరులో జరిగిన సర్వేలో వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే 83శాతం మంది బ్రిటీషర్లు నీటి సరఫరా సంస్దల ప్రయివేటీకరణ బదులు ప్రభుత్వ ఆధీనంలోనే వుండాలని, విద్యుత్‌, గ్యాస్‌ కంపెనీలను తిరిగి జాతీయం చేయాలని 77శాతం, రైల్వేలను తిరిగి ప్రభుత్వఆధీనంలోకి తీసుకోవాలని 76శాతం కోరుతున్నారు. 170 ఏండ్ల నాటి కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి చిత్తు ప్రతితో పాటు, మార్క్స్‌, ఎంగెల్స్‌ల చేతిరాత ప్రతులు అనేక నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ హిస్టరీ(ఐఐఎస్‌హెచ్‌)లో వున్నాయి.’ 1990 దశకంలో మార్క్స్‌ ఇంకేమాత్రం పనికిరాడు అని కొంత మంది చెప్పారు. అమెరికా, ఐరోపాలలో తరువాత సంభవించిన అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం,స్పెక్యులేషన్‌, బుడగలు పేలిపోయిన తరువాత జనాలు ఆకస్మికంగా ఇది గతంలో ఒకసారి జరిగింది, దాన్ని పరిశోధించారు, మరోసారి మార్క్సును చదివితే ఏమౌతుంది, అది ఇప్పటికీ పనికొస్తుందా, అవును ఇది పనికొచ్చేట్లే కనిపిస్తోంది అనే ఆలోచనలో పడ్డారని’ సంస్ద అధిపతి మారియన్‌ వాన్‌డెర్‌ హెజ్డన్‌ వ్యాఖ్యానించారు.

సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎన్ని విధాలుగా కుత్సిత వ్యాఖ్యానాలు చేసినా వాస్తవాన్ని కాదనలేరు. కమ్యూనిస్టు మానిఫెస్టోను రాసిన నాటికీ నేటికీ ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చిన మాట వాస్తవం. దోపిడీ తీవ్రత, ఆర్ధిక అసమానతల్లో ఎలాంటి మార్పు లేదు. దోపిడీ కొనసాగుతూనే వుంది. అందువలన దానిని అంతం చేయాలని కోరిన కమ్యూనిస్టు మానిఫెస్టో కంటే మరొక మెరుగైన సిద్ధాంతం, కార్మికవర్గ అస్త్రం మరొకటి కనిపించటం లేదు. లేదు ఎవరైనా అంతకంటే త్వరగా దోపిడీని అంతం చేసే భావజాలం,అస్త్రాలను కార్మికవర్గానికి అందచేస్తే అంతకంటే కావాల్సింది లేదు. అవి లేకుండా అందుబాటులో వున్న ఆయుధాలు పనికి రావు అని చెప్పటం అంటే కార్మికవర్గాన్ని నిరాయుధం చేసే మోసపు ఎత్తుగడతప్ప మరొకటి కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d