• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Current Affairs

పోప్‌ ఫ్రాన్సిస్‌ కమ్యూనిస్టు పాలనకు పిలుపునిచ్చారా ?

15 Sunday May 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

communist, Communist Government, pope, Pope Francis

ఎంకెఆర్‌

   అవుననే అంటున్నారు బ్రిటన్‌కు చెందిన జర్నలిస్టు జెఫ్‌ బెర్విక్‌. ది మార్కెట్‌ ఒరాకిల్‌ అనే వెబ్‌సైట్‌లో ఈనెల 12న ప్రచురితమైన జెఫ్‌ వ్యాసంలోని కొన్ని అంశాల సారాంశం ఇలా వుంది.’ గతవారంలో చార్లేమాగనే బహుమతి స్వీకరణ సందర్భంగా చేసిన ప్రసంగంలో పోప్‌ ఒక వ్యాఖ్య చేశారు.’ లాభాల కోసం అవినీతిని ఒక సాధనంగా వుపయోగించుకొనేందుకు తయారు చేసిన ద్రవ్య, ఆస్థులతో కూడిన ఆర్ధిక వ్యవస్ధ నుంచి కష్టజీవులకు భూమి, గృహవసతికి హామీనిచ్చే సామాజిక ఆర్ధిక వ్యవస్థకు మనం మారాల్సిన అవసరం వుంది’ అన్నారు. దీని అర్ధం ఏమిటి ? అనిశ్చిత స్ధితి తక్కువ వుండాలి, మరింత అదుపు అంటే ఒక విధంగా అవినీతి మార్గం, తరువాత సామాజిక ఆర్ధిక వ్యవస్ధకు మారాలని అయన కోరారు. దీని అర్ధం సోషలిజం లేదా కమ్యూనిజం. దీని ద్వారా భూమి, గృహవసతికి హామీ వుండాలని కోరుతున్నారు. రాజకీయాలు, ఆర్ధిక విషయాలకు వచ్చినపుడు పోప్‌ మాట్లాడ కూడదని కొందరు ఆగ్రహించవచ్చు, వారు చెప్పేది సరైనది కావచ్చు. కానీ ఆయన 2030 నూతన ప్రపంచ వ్యవస్థ గురించి ఆయన పెద్ద పాత్ర వహిస్తున్నారు. మార్క్సిజం గురించి మాట్లాడితే ప్రపంచ వ్యాపితంగా వందకోట్లకు మించి జనం వింటారు.చార్లెమాగ్నే అవార్డు వుత్సవంలో ఆయన స్పష్టంగా స్వచ్చందవాదం గాక జులుం గురించి మాట్లాడారు.ఆయన ‘హామీ’ గురించి మాట్లాడారు.అంటే ఏదైనా స్వచ్చందగా ఇచ్చేదిగాక హామీగా ఇచ్చేది.’

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీడియా స్చేచ్చకు ముంచుకు వస్తున్న ముప్పు

14 Saturday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

attacks on journalists, journalist, journalistic independence, press, press freedom, Reporters Without Borders

ఎం కోటేశ్వరరావు

    మేనెల మూడవ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్చా దినాన్ని పాటించారు. మీడియా స్వేచ్చ ప్రాధాన్యతను తెలియ చేసేందుకు ప్రతి ఏటా ఈ దినాన్ని పాటిస్తున్నారు. 1991 ఏప్రిల్‌ 29 నుంచి మే మూడవ తేదీ వరకు ఆఫ్రికా ఖండం నైరోబీ దేశంలోని విండ్‌హాక్‌ పట్టణంలో ఆఫ్రికా ఖండ జర్నలిస్టుల సమావేశం పత్రికా స్వేచ్చ సూత్రాల గురించి ఒక ప్రకటనను ఆమోదించింది. తరువాత ఐక్యరాజ్యసమితి ఆ తీర్మానాన్ని తనదిగా స్వీకరించి ఆమోదం పొందిన మూడవ తేదీని ప్రపంచ పత్రికా దినోత్సవంగా ప్రకటించింది.ఈ ఏడాది ఈ ప్రకటనకు పాతికేండ్లు నిండటంతో పాటు ప్రపంచంలో తొలిసారిగా 1776లో స్వీడన్‌ ఆమోదించిన పత్రికా స్వేచ్చ చట్టానికి 250 సంవత్సరాలు నిండటం కూడా ఈ ఏడాదే కావటం విశేషం. ఇంతవరకు 95దేశాలు పత్రికా స్వేచ్చకు సంబంధించి ఏదో ఒక చట్టాన్ని ఆమోదించాయి. ప్రతి ఏటా ఒక దేశంలో మీడియాకు సంబంధించి ఒక ఇతివృత్తంపై ఐరాస మే మూడవ తేదీన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కొలంబియాలో 1986లో తన కార్యాలయం ఎదుటనే మాదక ద్రవ్యాల మాఫియా చేతిలో గ్యూ లెర్మో కనో అనే జర్నలిస్టు హత్యకు గురయ్యాడు. అతని సంస్మరణంగా ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమంలో మీడియా స్వేచ్ఛకోసం పోరాడిన జర్నలిస్టుకు బహుమతి ఇస్తోంది. ఈ ఏడాది అజర్‌బైజాన్‌ జర్నలిస్టు ఖతీజా ఇస్మాయిలోవాకు ప్రకటించారు. ఈ సందర్బంగా వివిధ దేశాలలో వున్న పరిస్థితుల గురించి చర్చలు జరుగుతాయి. ఈ ఏడాది ఫిన్లండ్‌ రాజధాని హెల్సింకీలో ‘అందుబాటులో సమాచారం మరియు ప్రాధమిక స్వేచ్ఛలు ‘ అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. వెయ్యిమందికిపైగా పాల్గొన్న జర్నలిస్టులు విధి నిర్వహణలో హత్యకు గురైన వారికి నివాళులు అర్పించారు. అనేక దేశాలలో ఇదే రోజున పలు కార్యక్రమాలు జరిగాయి.

     పత్రికలు లేదా టీవీ ఛానల్స్‌, ఇంటర్నెట్‌ ఏ మీడియా రంగంలో పని చేస్తున్నప్పటికీ జర్నలిస్టు జీవితం అంత సులభం కాదు. కత్తిమీద సాము వంటిది. నిత్యం ప్రమాదాలు పొంచి వుంటాయి. అవి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, అవినీతి,అక్రమాలు ఏవైనా సరే జర్నలిస్టులను ప్రమాదపు అంచుల వరకు తీసుకు వెళుతున్నాయి. అయినా సరే ఈ వృత్తిని ఎంచుకొనేందుకు నిబద్దులై వుండే యువతీ యువకులు ముందుకు వస్తూనే వున్నారని ఈ సందర్బంగా ప్రపంచ వ్యాపితంగా మరోసారి వెల్లడైంది.

   జర్నలిస్టులు కనిపించగానే నమస్తే చెప్పటం, పక్కకు తిరిగి నోరు బట్టని బూతులు తిట్టటం సర్వసాధారణం. అక్రమాలకు పాల్పడే శక్తులే కాదు, రాజకీయ వేత్తలు, అధికారయంత్రాంగం ఇలా ఒకరని కాదు, తమ ప్రయోజనాలకు భంగం కలిగిందని భావించే ప్రతి వారూ చివరకు భౌతిక దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. జెఎన్‌యు ఘటనల సందర్బంగా భారతమాతాకు జై అంటూ ఒకవైపు నినదిస్తూనే అదే నోటితో మరోవైపు ఆ వార్తలను కవర్‌ చేసేందుకు వెళ్లిన, ఆ ఘటనల పట్ల విమర్శనాత్మక కధనాలు వెలువరించిన, చర్చలు నిర్వహించిన మహిళా జర్నలిస్టులను మాన భంగం చేస్తామని కూడా బెదిరించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే వుద్యోగ భద్రలేమి మరొక ప్రధాన అంశం. అధికారంలో వున్నవారికి నచ్చకపోయినా, యాజమాన్యం ఇచ్చగించకపోయినా బలౌతున్నది జర్నలిస్టులు. మీడియా స్వేచ్చ అన్నది రోజు రోజుకూ పరిమితం కావటంతో పాటు దుర్వినియోగం అవుతున్నది. యాజమాన్యాలు తమ లాభాల కోసం అనుసరిస్తున్న అక్రమ పద్దతుల కారణంగా జర్నలిస్టులు సమిధలుగా మారుతున్నారు.

    సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ(రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌) గతనెలలో విడుదల చేసిన నివేదిక మీడియా స్వేచ్చ అన్ని ప్రాంతాలలో మొత్తం మీద దిగజారుతున్నది. ఈ సంస్ధ 2002 నుంచి ప్రతిఏటా నివేదికలను ప్రకటిస్తూ సూచికలను వెల్లడిస్తున్నది. దాని ప్రకారం గత ఏడు సంవత్సరాలుగా ఫిన్లండ్‌ మీడియా స్వేచ్చలో అగ్రస్ధానంలో వుంటున్నది. రెండు వందల యాభై సంవత్సరాల క్రితం స్విడ్జర్లండ్‌లో భాగంగా ఫిన్లండ్‌ వుండేది. స్వేచ్ఛాయుత ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై రాయటం, ప్రచురించటం మూలస్థంభాలుగా వుండాలని వుదారవాది అయిన ఫిన్నిష్‌ మతాధికారి ఆండెర్స్‌ చైడెనియస్‌ 1765లో ఒక రచనలో తన అభిప్రాయం వెల్లడించారు. జర్నలిజం మంచి చట్టాలు రూపొందించటానికి, అధికార యంత్రాంగ బాధ్యతలు, పరిమితుల గురించి సమాచారాన్ని అందించటంలో రాజ్యానికి సహాయపడుతుందని, దానినే ఒక చట్టంగా రూపొందించాలని పార్లమెంట్‌కు నివేదించాడు. అది లేకపోతే అధ్యయనం, వినయ విధేయతలు అణచివేయబడతాయని, ఆలోచనలో మొరటుతనం చోటు చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు అది చట్టమైంది. అంతకు ముందు ఎక్కడా అలాంటి చట్టాలు వున్నట్లు దాఖలాలు లేకపోవటంతో ప్రపంచంలో తొలి చట్టంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వ పత్రాలు అందరికీ అందుబాటులో వుంచటం ప్రజల హక్కుగా గుర్తించటం దానిలోని ముఖ్యాంశం.ఇది జరిగి రెండువందల యాభై సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పత్రికా స్వేచ్ఛ పూర్తిగా అన్ని దేశాలలో అమలులోకి రాలేదు.

    గత పన్నెండు సంవత్సరాలలో గతేడాది మీడియా స్వేచ్చకు అత్యంత చెడ్డదిగా వుందని ఆర్‌ఎస్‌ఎఫ్‌ సూచిక వెల్లడించింది. ప్రపంచ వ్యాపితంగా మీడియా స్వేచ్ఛ ఆందోళనకరంగా వుందని, అనేక మంది ప్రపంచ నేతలు నిజమైన జర్నలిజం పట్ల ఒక విధమైన మానసిక రుగ్మతకు గురి అవుతున్నారని, భయ పూరిత వాతావరణం చర్చలు జరిపేందుకు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు విముఖులను చేస్తోంది. గతం కంటే ఎక్కువగా ప్రభుత్వాలు మీడియా అణచివేతకు పాల్పడుతున్నాయి. ప్రయివేటు వ్యక్తుల యాజమాన్యాలలో వున్న మీడియాలలో రిపోర్టింగ్‌ వ్యక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా మలచబడుతున్నది.’ అని ఆర్‌ఎస్‌ఎఫ్‌ సెక్రటరీ జనరల్‌ క్రిస్టోఫీ డెలోయిర్‌ వ్యాఖ్యానించారు. తాజా సూచికలో ప్రధమ స్ధానంలో ఫిన్లండ్‌, నెదర్లాండ్‌, నార్వే తదుపరి స్ధానాలలో వున్నాయి.

     ఖండాల వారీగా చూస్తే ఐరోపా సూచిక 19.8,ఆఫ్రికా 36.9, వుత్తర, దక్షిణ అమెరికా ఖండాలు 37.1, ఆసియా 43.8గా వుంది. ప్రాంతాల వారీగా చూస్తే తూర్పు ఐరోపా, మధ్య ఆసియా 48.4, వుత్తర ఆఫ్రికా , మధ్యప్రాచ్యం 50.8 పాయింట్లతో అధమ స్ధానంలో వుంది. 2013తో పోల్చితే మొత్తం మీద సూచిక 13.6శాతం పతనమైంది. గతేడాది 3,857 పాయింట్లు వుంటే తాజాగా 3,719కి పడిపోయింది. మతపరమైన అంశాలతో సహా దీనికి అనేక కారణాలు వున్నాయి. ప్రపంచ వ్యాపితంగా కార్పొరేట్‌ శక్తులు మీడియా రంగంలో ప్రవేశిస్తూ ప్రభుత్వాలపై వత్తిడిని పెంచుతున్నాయి. కొన్ని దేశాలలో ఇంటర్నెట్‌ను అందుబాటులో లేకుండా చేయటానికి, పత్రికా ముద్రణను అడ్డుకోవటానికి కూడా వెనుకాడటం లేదు. గత మూడు సంవత్సరాలలో ఈ సూచిక 16శాతం దిగజారింది. స్వల్ప కారణాలను సాకుగా చూపి జర్నలిస్టులను శిక్షించటానికి వీలుగా చట్ట సవరణలు కూడా ఈ కాలంలో పెరిగాయి. అధ్యక్షుడు, ప్రధానిని అమానించారనో, మత వ్యతిరేక ప్రచారానికి పాల్పడ్డారని, వుగ్రవాదులకు తోడ్పడటం వంటి కారణాలను వాటిలో పొందుపరుస్తున్నారు.

      మిగతా ప్రాంతాలతో పోల్చితే ఐరోపా జర్నలిస్టులు ఎక్కువ స్వేచ్చాయుత వాతావరణంలోనే పని చేస్తున్నారు, అయితే అక్కడ కూడా పరిస్థితి దిగజారుతోంది. పోలాండ్‌లో కొత్త ప్రభుత్వానికి విధేయులుగా లేరనే సాకుతో ప్రభుత్వ రేడియో, టీవీ సర్వీసులనుంచి 135 మంది జర్నలిస్టులకు వుద్వాసన పలికారు. జర్నలిస్టుల వార్తా వనరుల విషయంలో పోలీసులు నిబంధనలను వుల్లంఘించిన కారణంగా బ్రిటన్‌ రేటింగ్స్‌ పడిపోతున్నాయి. టర్కీ అధ్యక్షుడిపై ఒక వ్యంగ్య పద్యాన్ని ప్రచురించినందుకు ఆదేశం కోరిక మేరకు ఒక కమెడియన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఆదేశించారు. మీడియా స్వేచ్చ సూచికలో 180 దేశాలలో టర్కీ స్ధానం 151 అంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా వున్నాయో వూహించుకోవచ్చు. పత్రికా స్చేచ్చలో అగ్రగాములుగా వున్న దేశాలలో ఒకటైన స్వీడన్‌లో జర్నలిస్టులపై బెదిరింపుల కారణంగా దాని సూచిక ఐదు నుంచి ఎనిమిదికి పడిపోయింది. ‘ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు, ఇంటర్నెట్‌ మీడియాలో వ్యాఖ్యల విభాగాలను ఎత్తివేస్తున్నాయి.అనేక మంది జర్నలిస్టులు స్వయం సెన్సార్‌ విధించుకుంటున్నట్లు చెబుతున్నారని స్వీడిష్‌ జర్నలిజం ప్రొఫెసర్‌ ఇంగెలా వాడ్‌ బ్రింగ్‌ తెలిపారు. పనామా పత్రాలతో సంబంధం వున్న సమాచారాన్ని పన్నులు, పోలీసు అధికారులకు అందచేయాలని ఫిన్లండ్‌ ఆర్ధిక మంత్రి హుకుం జారీ చేశారు. ఇది ప్రమాదకర సంప్రదాయం అవుతుందంటూ ప్రభుత్వ మీడియా సంపాదకులు తిరస్కరించారు. హెల్సింకీలో ప్రపంచ మీడియా స్వేచ్చా పరిరక్షణ దిన సదస్సు జరుగుతుండటంతో మంత్రి తాత్కాలికంగా వెనక్కు తగ్గాడు.

    మన దేశం విషయానికి వస్తే తాజా సూచికలో 133వ స్థానంలో వున్నందుకు తల దించుకోవాలి. గతేడాది కంటే మూడు ర్యాంకులు తగ్గిందన్న మాటే గానీ ఇదేమీ గౌరవ ప్రదమైంది కాదు. వుగ్రవాదులనుంచి జర్నలిస్టులకు ఎదురవుతున్న బెదిరింపుల పట్ల ప్రధాని నరేంద్రమోడీ నిర్లిప్తంగా వున్నారని, జర్నలిస్టులను రక్షించేందుకు క్రియా విధానం లేదని,ఎప్పుడు అవకాశం వచ్చినా మీడియాను అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆర్‌ఎస్‌ఎఫ్‌ నివేదిక పేర్కొన్నది. మన పొరుగు దేశాల సూచికలు ఇలా వున్నాయి. చైనా 176, పాకిస్థాన్‌ 147, బంగ్లాదేశ్‌ 144, శ్రీలంక 141, ఆఫ్ఘనిస్తాన్‌ 120, నేపాల్‌ 105, భూటాన్‌ 94. ఇదే సమయంలో స్వేచ్చా ప్రపంచంగా చెప్పుకొనే అమెరికా 44, కమ్యూనిస్టు ఇనుప తెరలను బద్దలు కొట్టామని చెప్పుకుంటున్న రష్యా 148వ స్థానంలో వుంది. ఈ నివేదికలో లోపాలు వున్నాయని అభిప్రాయం కూడా వుంది.

     అక్రమ గనుల తవ్వకాల గురించి పరిశోధించిన సందీప్‌ కొథారి అనే జర్నలిస్టును మధ్యప్రదేశ్‌లో హత్య చేశారు.ఈ సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతున్న శక్తులు కొద్ది వారాలలోనే చేసిన రెండవ హత్య ఇది. ఇసుక, మాంగనీస్‌ మాఫియా గురించి రాయటమే ఆ జర్నలిస్టు చేసిన ‘తప్పిదం’. స్నేహితుడితో కలిసి మోటార్‌ సైకిల్‌పై వెళుతున్న అతనిని కారుతో ఢీకొట్టించి తరువాత కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. అంతకు ముందు వుత్తర ప్రదేశ్‌లో జగేంద్ర సింగ్‌ అనే జర్నలిస్టును అతని ఇంటి వద్దే పోలీసులు సజీవ దహనం చేశారు. దేశంలో వుత్తర ప్రదేశ్‌ అత్యంత ప్రమాదకర రాష్ట్రాలలో ఒకటని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొన్నది. జర్నలిస్టుల హత్యలను నేర సమాచారంలో ప్రత్యేకంగా పరిగణించటం లేదని హోంమంత్రి తెలిపారని, 2014లో దేశంలో ప్రతి మూడు రోజులకు ఒక జర్నలిస్టు దాడులకు గురైనట్లు పేర్కొన్నది.

    ఆర్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ వ్యాపితంగా అన్ని ప్రాంతాలకు, అన్ని భాషలకు చెందిన మీడియా నుంచి సమాచారాన్ని సేకరించటం లేదు. ముఖ్యంగా మన వంటి ప్రాంతీయ భాషల మీడియా రంగంలో జరుగుతున్న దాడులను కూడా నివేదికలలో చేరిస్తే సమగ్రంగా వుంటుంది. మన రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పలు చోట్ల జర్నలిస్టులపై బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. పోలీసులు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించటం కొత్త పరిణామం. దీనిపై మీడియాలో పనిచేస్తున్న వారు మేల్కొనకపోతే మరొక మెక్సికో, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాల మాదిరి పరిస్థితులు తయారయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు.

జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల తీరు తెన్నులు

    ప్రపంచ పత్రికా స్వేచ్చా దినం సందర్బంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్ధ కొన్ని వుదంతాలలో జర్నలిస్టులు ఎలా దాడులకు గురైందీ తెలిపింది. జర్నలిస్టులు తమ విధులను నిర్వహించినందుకు తప్ప వారిని వేధించటానికి మరొక కారణాలేమీ లేవని పేర్కొన్నది.’ ప్రపంచ వ్యాపితంగా జర్నలిస్టులను ఏకపక్షంగా అరెస్టు చేస్తున్నారు. పార్టీ విధానాలకు అనుగుణం లేకుండా అధికారంలో వున్న వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగినందుకు గాను వారిని జైలు పాలు చేస్తున్నారు, చివరకు చంపేందుకు కూడా వెనుకాడటం లేదని సంస్ధ పరిశోధనా విభాగపు సీనియర్‌ డైరెక్టర్‌ అన్నా నెయిస్టాట్‌ వ్యాఖ్యానించారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సేకరించిన వందలాది కేసులలో కొన్నింటి వివరాలు సంక్షిప్తంగా ఇలా వున్నాయి.

1.మహమ్మద్‌ అబు జైద్‌ అలియాస్‌ షకవాన్‌ ఓ ఫొటో జర్నలిస్టు. కైరోలో నిరసనల సందర్బంగా భద్రతా దళాలు సాగించిన హింసాకాండను చిత్రాలలో బంధించినందుకు మూడు సంవత్సరాల పాటు జైలులో వున్నాడు.అతనిని చిత్రహింసలు కూడా పెట్టారు.మరణశిక్ష పడటానికి వీలు కలిగించే సెక్షన్లతో బనాయించిన కేసులను అతను ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు.ఈజిప్టులో నిర్బంధించిన 20 మంది జర్నలిస్టులలో అతను ఒకడు.

2.ఆఫ్రికాలోని కామెరూన్‌లో బాబా వామె, రోడ్రిగ్‌ టోంగ్‌, ఫెలిక్స్‌ ఎబోల్‌ బోలా అనే ముగ్గురు జర్నలిస్టులు భద్రతా దళాలు- ఒక సాయుధ బృందం కుమ్మక్కై ఒక పట్టణంపై చేసిన దాడి గురించి వారు పరిశోధించారు.వారు సేకరించిన సమాచారం దేశ భద్రతకు ముప్పుతెచ్చే దంటూ వారికి అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ ప్రభుత్వం వారిపై కేసులు బనాయించింది. వార్త వనరులను చెప్పేందుకు వారు నిరాకరించారు.

3.ఖతీజా ఇస్మాయిలోవా అజర్‌బైజాన్‌లో దేశాధ్యక్షుడి కుటుంబంతో సహా అనేక మంది అక్రమాల చిట్టాను బయట పెట్టిన జర్నలిస్టు. ఆమె నోరు మూయించేందుకు అన్ని రకాలుగా బెదిరించినా ఆమె లొంగలేదు. చివరకు తప్పుడు అభియోగాలు మోపి విచారణను బూటకంగా మార్చివేసి ఏడున్నర సంవత్సరాల శిక్ష వేసి జైలులో పెట్టారు.

4. ఆఫ్రికాలోని బురుండీలో ఒక వున్నత సైనికాధికారిని హత్య చేసిన వుదంతంలో ఫొటోలు తీసినందుకు గాను ఎడ్రాస్‌ దికుమానా అనే జర్నలిస్టును అరెస్టు చేశారు.చిత్రహింసల పాలు చేశారు. ప్రస్తుతం అతను ప్రవాసంలో వున్నాడు. తమ పట్ల విమర్శనాత్మకంగా వున్నారనే దుగ్దతో పాలకపార్టీ జర్నలిస్టులు,ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడింది. గతేడాది ఒక తిరుగుబాటు సందర్బంగా నాలుగు ప్రయివేటు రేడియోస్టేషన్లను పోలీసులు ధ్వంసం చేశారు.

5. అనాబెల్‌ ఫ్లోరెస్‌ సలజార్‌, మెక్సికోలో ఒక పత్రిక క్రైమ్‌ రిపోర్టర్‌.ఆమెను ఈ ఏడాది ఫిబ్రవరిలో హత్యచేశారు. సాయుధులైన వ్యక్తులు ఆమెను ఇంటి నుంచి తీసుకు వెళ్లి చంపివేశారు. గత ఆరు సంవత్సరాలలో మెక్సికోలో 17 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.

6. అంగోలాలో సెడ్రిక్‌ కార్‌వాలో, డోమింగోస్‌ డా క్రజ్‌ అనే ఇద్దరు జర్నలిస్టులను మరో 15 మందితో కలిపి అరెస్టు చేశారు. వారు చేసిందేమీ లేదు ప్రజాస్వామ్యం, స్వేచ్చ గురించి చర్చించుకోవటమే. తిరుగుబాటుకు సన్నాహంగా కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపి నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష వేశారు.

7.థాయ్‌లాండ్‌లో రాజకుటుంబాన్ని విమర్శించే రెండు వ్యాసాలను ప్రచురించినందుకు సోమయోట్‌ అనే సంపాదకుడికి పది సంవత్సరాల జైలు శిక్ష వేశారు.

8. పత్రికలో వచ్చిన రెండు వార్తాకధనాల ద్వారా అధికారిక రహస్యాలను వెల్లడించారనే పేరుతో కంహరియత్‌ పత్రిక సంపాదకుడు కన్‌ దుండర్‌, ఒక విలేకరిని టర్కీ ప్రభుత్వం అరెస్టు చేసింది. సిరియాలోని సాయుధ ముఠాలకు టర్కీ సైన్యం మానవతా పూర్వక సాయం ముసుగులో ఆయుధాలను ఎలా అందించిందన్నదే వాటి సారాంశం.

ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్సు ఫెడరేషన్‌ ఆధ్వర్యాన వెలువడే ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి’ మాసపత్రిక మే నెల సంచిక నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జై నీల్‌- జై లాల్‌ నినాదం అర్థం ఏమిటి ?

12 Thursday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Others, Social Inclusion

≈ 1 Comment

Tags

Ambedkarists, Buddha, caste discrimination, caste system, communist manifesto, Communists, jai lal, jai neel, jyothiba phule, karal marx, sc, scheduled castes, st's

ఎం కోటేశ్వరరావు

   సామాజిక మాధ్యమం అయిన ఫేస్‌బుక్‌, వివిధ గ్రూపులలో సభ్యులు ఒక సమాజం అనుకుంటే దానిలోని మంచి చెడులన్నీ ప్రతిబింబిస్తున్నాయి.బుర్ర తక్కువ పోస్టులు పెట్టే వారి గురించి వదలి వేద్దాం. కొంత మంది సమాజంలో వున్న యథాతథ స్థితిని, వాస్తవాలను ప్రస్తావిస్తున్నారు. తమ అనుభవంలోకి వచ్చిన వాటిని ఆవేదనో, కసి, బాధ, మార్పు రావాలనో ఏదో ఒక భావంతో పెడుతున్నారు. మంచిదే. దేన్నీ దాచుకోవాల్సిన అవసరం లేదు. కారల్‌ మార్క్సు ఒక సందర్భంలో ఇలా చెప్పారు. ‘ హేతువు ఎప్పుడూ వునికిలోనే వుంది, కానీ ఎల్లవేళలా యుక్తమైన రీతిలో లేదు( Reason has always existed, but not always in a reasonable form ) బాధితులు చెప్పే దానిలో ఎప్పుడూ హేతువు వుంటుంది, అయితే అది ఎల్లవేళలా సరైన రీతిలో వ్యక్తం కావటం లేదని చర్చలను జాగ్రత్తగా పరిశీలిస్తే అర్ధం అవుతుంది. ఇది కొందరిని వుద్ధేశించి ప్రతికూలంగా వ్యాఖ్యానిస్తున్నది కాదు, సవరించుకోవాల్సిన అవసరం గురించి సూచించేందుకు మాత్రమే. పెద్దదిగా వున్నప్పటికీ చదవండి, చర్చించండి. సూక్ష్మంలో మోక్షాలు, దగ్గరి దారులు, గోసాయి చిట్కాలు మౌలిక సమస్యలను పరిష్కరించలేవన్నది ఏడుపదుల స్వాతంత్య్ర అనుభవం చెబుతోంది. వాటి గురించి పైపైన కాకుండా లోతుగా చర్చిస్తేనే ప్రయోజనం. కావాల్సింది పాలపొంగు కాదు, మరగటం, మధించటం.

  చరిత్రలో కార్మికులు ఒక దశలో యంత్ర విధ్వంసకులుగా వ్యవహరించినట్లు మనం చదువుకున్నాం. దేశాలను ఆక్రమించుకొనే క్రమంలో ఐరోపాలో నెపోలియన్‌ యుద్ధాలతో సహా అనేక యుద్ధాలు జరిగాయి. పర్యవసానంగా అనేక దేశాలలో ఆర్ధిక పరిస్థితులు దిగజారాయి. అదే సమయంలో పారిశ్రామిక విప్లవంలో భాగంగా పారిశ్రామికవేత్తలు తమ లాభాలను కాపాడుకొనేందుకు నూతన యంత్రాలను ప్రవేశపెట్టారు. వాటిలో బ్రిటన్‌ పవర్‌లూమ్స్‌ పెద్ద మార్పునే తెచ్చాయి. అప్పటి వరకు అక్కడి సాంప్రదాయ నేత కార్మికుల జీవితాలు వీటితో అతలాకుతలమయ్యాయి. యుద్ధాలతో మొత్తంగా కార్మికుల బతుకులూ ఛిద్రమయ్యాయి.ఇటు సంప్రదాయ నేత పని కరువై, అటు ఫ్యాక్టరీలలో సరైన పనిలేక మొత్తం మీద ఏం చేయాలో తెలియని స్థితిలో తమకు కష్టాలు రావటానికి పవర్‌లూమ్స్‌ కారణమని భావించి వాటిని నాశనం చేస్తే పరిష్కారం దొరుకుతుందని భావించి అదే పని చేశారు. వారి ఆవేదనలో హేతువు లేదా వుంది, కానీ యంత్రాల ధ్వంసం పరిష్కారం కాదు. దీంతో 1788లోనే బ్రిటీష్‌ పార్లమెంట్‌ పవర్‌లూమ్స్‌ తదితర యంత్రాల పరిరక్షణకు ఒక చట్టాన్ని తీసుకు వచ్చింది. దాని ప్రకారం ఎవరైనా వాటిని కావాలని ధ్వంసం చేసినట్లు లేదా ధ్వంసం చేసేందుకు అక్రమంగా ప్రాంగణాలలో ప్రవేశించినా, ప్రోత్సహించినా ఏడు నుంచి 14 సంవత్సరాల పాటు ఖైదీల సెటిల్మెంట్లకు ప్రవాసం పంపేవారు. తరువాత యంత్రాలు పనిచేయకుండా కొన్ని భాగాలు లేకుండా చేస్తున్నట్లు గ్రహించి దానిని కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించారు. దాని పర్యవసానమే ఇప్పటికీ కార్మికులు డ్యూటీ దిగి వెళుతుంటే భద్రతా సిబ్బంది తనిఖీ చేయటం. ఆ తరువాత 1788 చట్టాన్ని రద్దు చేసి మరణశిక్షను కూడా చేర్చి 1823లో మరో చట్టం చేశారు. ఈ యంత్ర విధ్వంస కార్మిక తిరుగుబాటును బ్రిటీష్‌ పాలకులు ఎంత తీవ్రంగా అణచివేశారో తెలుసా ? నెపోలియన్‌తో జరిపిన యుద్ధాలలో ఒకటైన లెబెరియన్‌ ద్వీపకల్పాన్ని నిలబెట్టుకొనేందుకు నియోగించిన సైన్యం కంటే ఎక్కువ మందిని దించారు.

  ఆధునిక చరిత్రలో వుగ్రవాద దారి పట్టిన నక్సల్స్‌ ఏ గ్రూపు అన్నది అప్రస్తుతం, అటవీ ప్రాంతాలలో రోడ్లు వేస్తుంటే కాంట్రాక్టర్ల, లేదా ప్రభుత్వ యంత్రాలను విధ్వంసం చేయటం, రోడ్లను, స్కూలు భవనాలను కట్టకుండా చేశారని మీడియాలో అనేక వార్తలను చదివాము. అన్నింటి కంటే ఆధునిక రూపంలో సంఘటిత కార్మికవర్గం కొన్ని సంవత్సరాల క్రిందట కంప్యూటర్ల వినియోగాన్ని అడ్డుకున్నపుడు వారి మీద కూడా అదే విమర్శ వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే కుల వివక్ష రాక్షసికి బలౌతున్న వారు దానికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం ఎలా కొనసాగించాలన్నదే సమస్య. దీనిపై తీవ్రమైన పోరాటాన్ని కొనసాగించాలనటంలో ఎలాంటి రాజీ లేదు. ఎలా సాగించాలన్నదే చర్చ. ఈ మధ్య జైనీల్‌-జైలాల్‌ అనే నినాదం వినిపిస్తోంది. ఇదొక శుభపరిణామం.

     కార్మికవర్గం సమాజంలో 99 శాతం మెజారిటీ. మన దేశానికి వస్తే దళితులా, గిరిజనులా, ముస్లింలా, హిందువులా, మరో మతం వారా, బ్రాహ్మలా, కమ్మా, రెడ్డి, కాపు, కుమ్మరి, కమ్మరి ఇలా అన్ని రకాల కులాల వారు కార్మికులలో వున్నారు, ఒక శాతంగా వుండే దోపిడీ వర్గంలోనూ వీరందరూ వున్నారు. వర్గరీత్యా ఏ వర్గంలో వుంటే వారు తమ ఆర్ధిక సమస్యల మీద ఐక్యం అవుతున్నారు, కార్మికులతో పోల్చితే పెట్టుబడిదారులలో అది ఎక్కువగా వుంది. నిజానికి కార్మికులకు సమాజంలోని పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారుల వంటి ఇతర తరగతుల మద్దతు అవసరమే.వీరికీ వారి మద్దతు అవసరమే.

       మన దేశంలో కొంత మంది దృష్టిలో వర్గం కంటే కుల సమస్య పెద్దది. దానితో మరికొంత మంది ఏకీభవించ వచ్చు, విబేధించవచ్చు. అంత మాత్రాన అది పరిష్కరించాల్సింది కాదు అని అర్ధం కాదు. ఏ సమస్య పరిష్కారానికి అయినా అందుకు కలసి వచ్చే స్నేహితులను ఎంచుకోవాలి. వర్గ సమస్యలో పెట్టుబడిదారుడు- కార్మికులు ముఖాముఖీ తేల్చుకుంటారు. సమస్య ఎక్కడంటే కుల వివక్ష, కులాంతర, మతాంతర వివాహాల వంటి సామాజిక అంశాల దగ్గర వస్తోంది. పెట్టుబడి దారీ విధాన వయస్సు ఐదు వందల సంవత్సరాలు అనుకుంటే ఏ రీత్యా చూసినా రెండు వేల సంవత్సరాలకు పైబడే వుంది. ఇది గిజిగాడి గూడు కంటే సంక్లిష్టమైనది. ఇక్కడ కూడా మార్క్సు మహనీయుడు చెప్పినది, అంబేద్కర్‌ చెప్పిన అంశాలు ఎన్నో వున్నాయి. ‘ తత్వవేత్తలు వివిధ పద్దతులలో ప్రపంచానికి భాష్యం మాత్రమే చెప్పారు, సమస్య ఏమంటే దానిని మార్చటం ఎలాగన్నదే’ దీనిని మనం మన దేశంలో దళిత సమస్యకు ఎందుకు వర్తింప చేసుకోకూడదు. వర్తమానంలో జ్యోతిబాపూలే, అంబేద్కర్‌ మాదిరి కాకపోయినప్పటికీ అనేక మంది ప్రముఖులు మనువాదాన్ని వ్యతిరేకించారు. పూలే,అంబేద్కర్‌ తాము నమ్మినపద్దతులలో పరిష్కారాన్ని చెప్పారు. వారితో ఎవరూ విబేధించనవసరం లేదు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లోనే జ్యోతిబాపూలే జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరగటం, వెంటనే ఆయన తన సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత అంబేద్కర్‌ కొనసాగించారు. అంటే మన దేశంలో ఒక విధంగా చెప్పాలంటే కుల వివక్ష వ్యతిరేక పోరాట బీజం కమ్యూనిజానికంటే ముందే పడింది. వేదాలను విమర్శిస్తూ పూలే కుల వివక్ష సమస్యను జనం ముందు పెట్టారు. దళిత్‌ అనే మరాఠీ పదాన్ని ఆయనే ముందు వుపయోగించారని చెబుతున్న విషయం తెలిసిందే.

    ‘విద్య లేకపోవటం తెలివి తేటల లేమికి దారి తీస్తుంది, అది నైతిక విలువల లేమికి కారణం అవుతుంది, నైతిక విలువలు లేకపోతే ప్రగతి వుండదు, ప్రగతి లేకపోతే జనం దగ్గర డబ్బు వుండదు, డబ్బలేకపోతే దిగువ కులాలపై అణచివేతకు దారితీస్తుంది, చూడండి విద్యలేకపోవటం ఎన్ని అనర్ధాలకు కారణం అవుతుందో ‘ అన్న పూలే అందుకుగాను విద్యాసంస్ధలను స్థాపించటానికి ప్రాధాన్యత ఇచ్చారు. తరువాత అంబేద్కర్‌ కూడా పూలే బాటలోనే విద్యతో దళితుల అభ్యున్నతి సాధించవచ్చని భావించి ఆమేరకు ‘బహిష్కృత్‌ హితకారిణీ సభ ‘ సంస్ధను స్ధాపించారు.అయితే వెంటనే తన పంధా మార్చుకొని అస్పృస్యతకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సమీకరించు, పోరాడు, సాధించు అన్నది అంబేద్కర్‌ నినాద సారాంశం. ఇదంతా భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా వేళ్లూనుకోక ముందే ప్రారంభమైంది.

    మన దేశంలో కుల వివక్ష, కుల నిర్మూలన సంస్కరణలు, పోరాటానికి పూలేతో అంటే 1848లో నాంది పలికారంటే ఇప్పటికి 168 సంవత్సరాలు, మధ్యలో అంబేద్కర్‌ కలిసి 90 సంవత్సరాలు . ఈ మొత్తం కాలంలో దళిత వుద్యమం సాధించిన విజయాలేమిటి? వైఫల్యాలేమిటి అన్నది బేరీజు వేసుకోవాల్సిన అవసరం లేదా? విజయాలను మరింత పటిష్ట పరుచుకోవటం, వైఫల్యాలను అధిగమించటానికి కొత్తదారులు వెతకాల్సిన అవసరం లేదా ? మన దేశంలో కమ్యూనిస్టు వుద్యమం 1920లో ప్రారంభమైంది. పురాణాల ప్రకారం పుట్టుతోనే శ్రీకృష్ణుడు చెరసాల పాలై తరువాత అజ్ఞాతంలో పెరిగినట్లుగా భారత కమ్యూనిస్టుపార్టీ కూడా నిర్బంధాలు, నాయకుల అరెస్టులు,జైలు జీవితంతోనే ప్రారంభమైంది. పుట్టిన పదిహేను సంవత్సరాల తరువాతే బహిరంగంగా పనిచేయటం సాధ్యమైంది. తరువాత మరోసారి నిర్బంధం, నిషేధం. అంటే దాని వయస్సు కూడా తొమ్మిది పదులు. మ్యూనిస్టులు కూడా పూలే-అంబేద్కరిస్టుల మాదిరి తమ విజయాలు,పరాజయాలను సింహావలోకనం చేసుకొని జనసామాన్యాన్ని ఆకర్షించటంలో ఎదురౌతున్న సమస్య లేమిటో అందుకు అనుసరించాల్సిన మార్గాలేమిటో రూపొందించుకోవాల్సి వుంది. రెండు వుద్యమాలు ఒకదానితో ఒకటి విబేధించే అంశాలు వున్నాయి,అంగీకరించేవి వున్నాయి. ఏవి ఎక్కువ ఏవి తక్కువ అన్న వాటిని చర్చించుకోవచ్చు. అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. అది ఎప్పుడు సాధ్య పడుతుందంటే అంగీకృత అంశాలపై కలసి పనిచేసినపుడే.రెండు వుద్యమాల మధ్య వున్నవి మిత్ర వైరుధ్యాలే తప్ప శతృపూరితమైనవి కాదు.ఒక వేళ ఎవరైనా అలా చిత్రించేందుకు ప్రయత్నిస్తే తెలుసుకోలేనంత అమాయకంగా జనం లేరు. అంబేద్కరిస్టులు చెబుతున్న దళిత సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం కాదు, లేదా కమ్యూనిస్టులు చెబుతున్న ఆర్ధిక దోపిడీ అంతం కావాలనటాన్ని పూలే-అంబేద్కరిస్టులు వ్యతిరేకించటం లేదు. అయితే సమస్య ఎక్కడ. కమ్యూనిస్టులలో విలీనం కమ్మని పూలే-అంబేద్కరిస్టులను గానీ లేదా తమ రాజకీయ వేదికను రద్దుచేసుకొని సామాజిక వుద్యమాలలో విలీనం కమ్మని కమ్యూనిస్టులను గానీ ఎవరూ కోరటం లేదు. కమ్యూనిస్టు, వామపక్ష శక్తుల మధ్య సైద్ధాంతిక విబేధాలు వున్నాయి కనుకనే ఆ పార్టీలు విడివిడిగా వుంటూ ఐక్యంగా పోరాడుతున్నాయి.కలసి వచ్చిన చోట లౌకిక శక్తులను తోడు చేసుకుంటున్నాయి.దీనికి కూడా దాన్నే ఎందుకు వర్తింప చేయకూడదు. మనకు స్వాతంత్య్ర వుద్యమం అనేక పాఠాలు నేర్పింది. కాంగ్రెస్‌ సంస్థలోనే ఎన్ని భావజాలాలు వున్నవారు కలసి పని చేయలేదు. వారిలో ఎన్ని విబేధాలు లేవు? అయినా వారిని కలిపి వుంచింది తెల్లవాడిని దేశం నుంచి తరిమివేయాలి అన్న ఏకైక లక్ష్యం ఒక్కటే.

   ముందుగా పరిష్కారం కావాల్సింది దళిత సమస్య అన్నది మొత్తంగా ఇప్పటి వరకు పూలే-అంబేద్కరిస్టులు ముందుకు తెచ్చిన వైరుధ్యం. అర్ధిక దోపిడీ అంతమైతే సామాజిక సమస్యలు పరిష్కారం కావటం సులభం కనుక దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది కమ్యూనిస్టుల వైఖరిగా వుంది. ఇవి ఇలా వుంటే ఇప్పుడు ఈ రెండు శక్తులను దెబ్బతీసి అటు ఆర్ధిక దోపిడీని పెంచే నయా వుదారవాదాన్ని కాంగ్రెస్‌ ప్రారంభిస్తే దానిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు బిజెపి, దానితో చేతులు కలిపిన శక్తులు చూస్తున్నాయి. దీనికి తోడు సామాజిక వివక్షను పెంచి పోషించే మనువాదాన్ని మరింత పటిష్ట పరిచేందుకు కూడా మత శక్తులు మరింత వూపుతో పనిచేస్తున్నాయి. కుల శక్తులు దానికి అనుబంధంగా వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందువలన నయావుదారవాదం, మతోన్మాదం అనే జంట ప్రమాదాలను ఎదుర్కోవటం ఎలా అన్నది సమస్య.

     నయా వుదారవాదం ఇంకా వేగంగా, విస్తృతంగా అమలులోకి వస్తే అమలులో వున్న విద్యా, వుద్యోగ రిజర్వేషన్లు మరింతగా తగ్గిపోతాయి. ఇప్పటికే సామాజిక రంగంలో ఎవరు ఎలా వుండాలో, వుండకూడదో నిర్ణయించేందుకు మతశక్తులు ఎలా ముందుకు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ జంట ముప్పును తప్పించకుండా ఈ వుద్యమాలు ముందుకు సాగవు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీల వైఖరిలో ముఖ్యంగా సిపిఎం వైఖరిలో వచ్చిన మార్పును గత పది హేను సంవత్సరాలుగా వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చూస్తున్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాటానికి ప్రాధాన్యత ఇస్తూ పని చేస్తున్నారు. ఇప్పుడు అఖిలభారత స్థాయిలో కూడా అలాంటి సంస్ధ ఏర్పడి రాష్ట్రాల వుద్యమాలను మరింత ముందుకు తీసుకుపోతున్నది. ఇంకా అనేక సంస్ధలు కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే అలాంటి కృషే చేస్తున్నాయి.అయితే అన్ని వుద్యమాలు,వుద్యమ రూపాలు ఒకే విధంగా వుండటం లేదు. అందుకే ముందే చెప్పినట్లు సామాజిక వుద్యమ సంస్ధలైనా, రాజకీయ పార్టీలైనా అంగీకృత అంశాల మేరకు కలసి పనిచేయాలి. ఈ విషయంలో ఇటీవలి కాలంలో అంబేద్కరిస్టుల వైఖరిలో కూడా మార్పును గమనిస్తున్నాం, రిజర్వేషన్లు అమలు జరగాలంటే అసలు ప్రభుత్వ వుద్యోగాలు, ప్రభుత్వ రంగంలో పరిశమ్రలు వుండాలి. వుద్యోగాలను క్రమంగా రద్దు చేస్తున్నారు, పరిశ్రమలను మూసివేస్తున్నారు, లేదా పొరుగు సేవల పేరుతో పర్మనెంటు వుద్యోగాలను రద్దు చేస్తున్నారు. వీటిని రక్షించుకోవటంతో పాటు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ప్రారంభమైన వుద్యమంలో కూడా వారు భాగస్వాములు కావటం ప్రారంభమైంది.

   ఇక్కడ ఒక విషయంపై స్పష్టత కలిగి వుండటం అవసరం. మహిళల సమస్యలు మహిళలకే తెలుస్తాయి, బీసిల సమస్యలు వారికే తెలుస్తాయి, ఎస్సీ,ఎస్టీల సమస్యలు వారికే తెలుస్తాయి. ఈ అభిప్రాయాలతో ఎవరూ విబేధించాల్సిన అవసరం లేదు. వాస్తవం వుంది. పేచీ ఎక్కడ వస్తుందంటే ఈ తరగతులకు చెందని వారికి ఆ సమస్యలు తెలియవు, అందువలన వారు మాట్లాడకూడదు, వుద్యమాలకు సారధ్యం వహించకూడదు అన్న పెడ ధోరణులకు గురైన స్థితి వుంది. దీనికి గురైన వారు రెండు రకాలు. ఇది నయా వుదారవాద భావజాలం ముందుకు తెచ్చిన విభజించి పాలించు అన్న పాత ఎత్తుగడలకు కొత్తరూపం. తమకు తెలియకుండానే ఇది నిజమే కదా అనుకున్నవారు కొందరు. వీరితో పేచీ లేదు. మంచి చెడులను వివరిస్తే అర్ధం చేసుకుంటారు. రెండో రకం వారు వున్నారు. అన్నీ తెలిసి కూడా ఈ వాదాన్ని ముందుకు తెచ్చేవారు. వీరు కలిగించే హాని అంతా ఇంతా కాదు. అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న కులాలలో పుట్టిన వారు మాట్లాడ కూడదు అంటే రాజ కుటుంబంలో పుట్టిన బుద్దుడు ఎవరు? ఆయన కులతత్వాన్ని వ్యతిరేకించిన వారిలో ఆద్యుడిగా పరిగణించబడుతున్నారా లేదా ? అందువలన ఎవరు ఏ కులంలో పుట్టారు లేదా పేదవాడా, ధనికుడా అని కాదు, ఏం చెబుతున్నారు అన్నది ముఖ్యం. ఒక అగ్రకులంలో పుట్టిన వ్యక్తి కుల తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే అగ్రకులతత్వం వున్న వారి నుంచి దూరమైనట్లే. ఒక కులంలో పుట్టటం అనేది ఒక యాదృచ్చిక ఘటన మాత్రమే.

    మతశక్తులు తమ అజెండాను అమలు జరిపే క్రమంలో తమకు తెలియకుండానే హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు విశ్వవిద్యాలయాలలో వ్యవరించిన తీరుతో కమ్యూనిస్టులు, వామపక్షాలు,అంబేద్కరిస్టులు, సామాజిక న్యాయం కోరుకొనే ఇతర అనేక శక్తులను దగ్గరకు తెచ్చాయి. దాని నుంచి వచ్చిందే జైనీల్‌ -జై లాల్‌ నినాదం.ఎవరి ఎజండాలు వారు కలిగి వుండండి, ఎవరి జండాలను వారు మోసుకోండి. సమస్యలపై కలసి పనిచేయండి, జనానికి మేలు చేయండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాస్తిక వాదం గురించి ఆస్థికులు ఆవేదన చెందటం చిత్రమే మరి !

08 Sunday May 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, Opinion, RELIGION, Religious Intolarence

≈ 3 Comments

Tags

ATHEISM, athists, believers, Communists

ఎం కోటేశ్వరరావు

    నాస్తిక వాదం నలిగిపోతోందా అనే శీర్షికన మే ఐదవ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో గీతాంజలి మూర్తి కొన్ని అంశాలను లేవనెత్తారు.నిరతంతరంగా జరిగే నాస్తిక, ఆస్థిక వాదం చర్చలో అనేక మంది లేవనెత్తుతున్న పాత విషయాలే అవి. నాస్తికులైన తండ్రుల బిడ్డలు ఆస్థికులుగా ఎందుకు మారుతున్నారు? అంటూ అక్కినేని నాగేశ్వరరావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, శ్రీశ్రీ, చలం, కవిరాజు త్రిపురనేని రామస్వామి వంటి పేర్లను ప్రస్తావించారు.తరిచి చూస్తే వారి ప్రశ్నలోనే సమాధానం వుంది. పైన పేర్కొన్న ప్రముఖ నాస్థికుల తలిదండ్రులందరూ మామూలు ఆస్థికులు, ఆ కుటుంబాలలో అంతకు ముందేమీ పండిత చర్చలు జరిగిన దాఖలాలు లేవు. అటువంటపుడు వారి బిడ్డలు ప్రముఖ నాస్థికులుగా ఎలా మారారు, మూర్తిగారు స్వయంగా హేతువాది అయిన ఆస్థికుడిని అని చెప్పుకున్నారు, వారి తలిదండ్రులు ఏ భావజాలంతో వుండేవారో తెలియదు. మరి ఆయనెందుకు అలా మారారు? ఎందుకు అని ప్రశ్నించుకొని సరైన సమాధానం పొందేవరకు వదలని తత్వం నాది అని మూర్తిగారు అన్నారు కను సమాధానం ఏం పొందారో కూడా ఆయనే చెప్పి వుండాల్సింది.లేక నాస్థికుల నుంచి సమాధానం వచ్చే వరకు వదలను అని చెబుతున్నారా ? ఆయన చెప్పినట్లు నిజంగా హేతువాదే అయి వుంటే ఆస్థికుడిగా వుండే వారే కాదు, ఒక వరలో రెండు కత్తులు ఇమడవు.

   ఆస్థిపాస్తులకు, భావజాలానికి వారసత్వం వుంటుంది. కానీ రెండింటికీ మౌలిక తేడా వుంది. తలిదండ్రుల ఆస్థులపై బిడ్డలకు లేదా దాయాదులకు వారసత్వం హక్కుగా వస్తుంది. కానీ భావజాలం కొనసాగింపు బిడ్డల, ఇతర కుటుంబ సభ్యుల హక్కు లేదా బాధ్యత, విధి కాదు. ఎలా అంటే మూర్తిగారు నాస్థికులను సమర్ధిస్తూనో, విమర్శిస్తూనో ఒక పెద్ద గ్రంధం రాస్తే దాని ప్రచురణపై ఆయన వారసులకు కాపీ రైట్‌ చట్ట ప్రకారం హక్కు వుంటుంది. అంతమాత్రాన దానిలో పేర్కొన్న భావజాలానికి వారు కట్టుబడి వుండాలని లేదు. ఆ పుస్తకం అచ్చువేస్తే వచ్చే డబ్బుకు మాత్రమే వారసులు, కానీ దానిలోని భావజాలానికి నిబద్దులైన ఇతరులు వారసులు అవుతారు.

   కారల్‌ మార్క్స్‌ తంaడ్రి లాయర్‌ ,తన బిడ్డను కూడా లాయర్‌ను చేయాలనుకున్నాడు. కానీ ప్రపంచగతినే మార్చే ఒక అపూర్వ తత్వశాస్త్రానికి ఆద్యుడు అయ్యాడు. మార్క్స్‌తో పాటు విడదీయరాని మేథావి ఎంగెల్స్‌. ఆయనొక పెట్టుబడిదారుడి తనయుడు. కానీ ఆ పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చేందుకు తన ఫ్యాక్టరీ నుంచే పాఠాలు తీసుకున్నాడు. కారల్‌ మార్క్స్‌ను వివాహం చేసుకున్న జెన్నీ రాజకుటుంబాల నుంచి వచ్చిన యువతి. మార్క్స్‌ను వివాహం చేసుకొని జీవితాంతం అష్టకష్టాలను ఎందుకు అనుభవించింది? మధ్యలోనే విడాకులిచ్చి మరొక ధనవంతుడిని వివాహం ఎందుకు చేసుకోలేదు? ఇలాంటి వన్నీ ఎందుకు జరుగుతాయో మూర్తి వంటి వారు అర్ధం చేసుకుంటే ఆయన లేవనెత్తిన అంశాలకు సమాధానం కూడా దొరుకుతుంది.

     భాగవతాన్ని నమ్మటమా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం. దానిలో పేర్కొన్న హిరణ్యకశ్యపుడు విష్ణు ద్వేషి. కుమారుడు విష్ణు భక్తుడు. వారికి ఆస్థి, రాచరికం దగ్గర పేచీ రాలేదు, విష్ణువును కొలవటమా లేదా అన్న భావజాలం దగ్గరే వచ్చింది. అందువలన ఆస్థికుల పిల్లలు నాస్తికులుగా మారినా, అటుదిటు అయినా, పెట్టుబడిదారుల కొడుకులు కార్మికవర్గ పక్షపాతులైనా, లేదా ఏమీ లేని వారు పెట్టుబడిదారులుగా మారి ఆ భావజాలాన్ని అనుసరించినా ఆయా కాలాల్లో వుండే అనేక పరిస్థితులు, ముందుకు వచ్చిన అంశాల ప్రభావం వారిపై పడుతుంది.ఏది ఎక్కువ ప్రభావం చూపితే ఆ భావజాలాన్ని అలవరుచుకుంటారు. త్రిపురనేని రామస్వామి నాస్తికుడిగా, హేతువాదిగా మారిన సమయంలో ఆంధ్రదేశంలో, కృష్ణా.గుంటూరు జిల్లాలలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా వున్నా ఆయన కమ్యూనిస్టుగా మారలేదు. అదే సమయంలో అనేక మంది నాస్తికులు కమ్యూనిస్టులుగా మారారు. అంత మాత్రాన ఇతర భావజాలాలు అంతరించినట్లో నలిగిపోయినట్లో అవుతుందా ? తమిళనాడులో డిఎంకె నేతలు గుడులు,గోపురాలకు వెళ్లినంత మాత్రాన నాస్తికత్వ వాదం నశిస్తుందనుకుంటే అంతకంటే అమాయకత్వం వుండదు.

    మనది వేద భూమి అంటారు కొందరు. వేదాలు వునికిలోకి వచ్చినపుడే వాటిని వాటిని తిరస్కరించిన హేతువాదులు కూడా ఇక్కడే పుట్టారు, అందువలన హేతు భూమి అని కూడా ఎందుకు పిలవకూడదు? బుద్దుడు కూడా ఇక్కడే పుట్టినందున కొందరు బుద్ధ భూమి అనటం లేదా ? వేద ప్రమాణాన్ని తిరస్కరించిన చార్వాకులు, లోకాయతులను భౌతికంగా అంతం చేయటమే కాదు, వారి రచనలను కూడా ధ్వంసం చేశారు. అయితేనేం తరువాత వేమన అవతరించలేదా, ఆ చార్వాక, లోకాయత, వేమన్నవాద భావజాల వారసులు దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారా లేదా ? వేదాలను నమ్మేవారు ఎక్కువ, నాస్తికులు, హేతువాదులు తక్కువ ఎందుకు వున్నారు అని ఎవరైనా అడగొచ్చు. వేదాలు కొన్ని దేశాలు, ప్రాంతాలకే పరిమితం, అన్ని రకాల మతాలను,దేవుళ్లను వ్యతిరేకించే నాస్తికులు, హేతువాదులు ప్రపంచవ్యాపితంగా వున్నారు. గరిటెడైనను చాలు గంగిగోవు పాలు అన్న వేమన్న సమాధానం వుండనే వుంది. ఎవరూ విత్త కుండానే వర్షాలు పడి, రుతువు రాగానే అనేక మొక్కలు మొలుస్తాయి, వాటిలో పనికిరాని కలుపు , ప్రయోజనం చేకూర్చే మంచి మొక్కలూ వుంటాయి. అదే వర్షాలు లేకపోతే ఆ విత్తనాలు అలాగే భూమిలో వుండిపోతాయి. అలాగే ఏ భావజాల వ్యాప్తికైనా పరిస్థితులు దోహద పడాలి. అది ఎంతకాలం అంటే ఎవరు చెబుతారు.మూర్తిగారే అన్నట్లు హిందూ మత పూర్వ వైభవం తెచ్చుకోవటానికి ఎంత కాలం పడుతుందో ఎవరినైనా చెప్పమనండి !

     హేతువాదుల ఇండ్లలో ఇతర కుటుంబ సభ్యులు పూజలు, పునస్కారాలు చేయటం గురించి ప్రస్తావించారు.తమ కుటుంబ సభ్యులనే మార్చటంలో ఎందుకు విఫలమయ్యారు అని ప్రశ్నించారు. ఇది వినటానికి ఇంపుగానే వుంటుంది. మొదటి విషయం నాస్థికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు మిగతావారికంటే అత్యంత ప్రజాస్వామిక వాదులు. తమ భావాలను కుటుంబ సభ్యులతో సహా ఇతరులపై రుద్దరు. మోతీలాల్‌ నెహ్రూ మితవాది, ఆయన కుమారుడు జవహర్‌లాల్‌ కాంగ్రెస్‌లో అతివాది అయ్యాడు. కమ్యూనిస్టు దిగ్గజం సుందరయ్య భూస్వామిక కుటుంబంలో, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ పచ్చి మితవాద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.లోకసభ స్పీకర్‌గా,సిపిఎం అగ్రనేతగా వున్న సోమనాధ్‌ చటర్జీ తండ్రి ఒక పెద్ద లాయర్‌, హైకోర్టు జడ్జి. అంతకు మించి ఆయన హిందూ మహాసభ నాయకుడు. సుందరయ్య,నంబూద్రిపాద్‌, సోమనాధ్‌లు కమ్యూనిస్టులు కాకుండా చేయటంలో వారి కుటుంబ పెద్దలు ఎందుకు విఫలమయ్యారు?

    మతం కూడా ఒక భావజాలమే. ప్రముఖ బిజెపి నాయకులు, సంఘపరివార్‌ పెద్దలు ముస్లింలు లవ్‌ జీహాద్‌ పేరుతో హిందూ యువతులను వివాహమాడి, మతమార్పిడి చేస్తున్నారంటూ ముస్లిం మత భావజాలానికి వ్యతిరేకంగా నిరంతరం గగ్గోలు పెడుతుంటారు.అద్వానీ, అశోక్‌ సింఘాల్‌, తొగాడియా,సుబ్రమణ్యస్వామి అలాంటి ఎందరో ప్రముఖులు తమ కుటుంబ సభ్యులు ముస్లింలను వివాహం చేసుకుంటుంటే ఎందుకు ఆపలేకపోయారు? ఇతరులకు ఎందుకు నీతులు చెబుతున్నారు? అందుకని చర్చను అలాంటి వైపు తిప్పితే ప్రయోజనం లేదు. ఏ వాదంలో అయినా దాని మంచి చెడ్డలను చర్చించటం మంచిది.

     భారత దేశాన్ని మొగలాయీలు ఆక్రమించినపుడు స్వాతంత్య్రం కావాలన్న వాంఛ దేశ ప్రజలలో పుట్టలేదు, బ్రిటీష్‌ వారు ఆక్రమించిన తరువాత కూడా చాలా కాలం వరకు కలగలేదు. ప్రధమ స్వాతంత్య్ర పోరాటం తరువాత కూడా దేశంలో అంతగా జ్వాల రగలలేదు. అంత మాత్రాన 1857 తిరుగుబాటు విఫలమైనట్లు కాదు. కాంగ్రెస్‌ ఏర్పడిన వెంటనే జనం కుప్పలు తెప్పలుగా వుద్యమంలో పాల్గొనలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా చాలా కాలం వరకు బ్రిటీష్‌ వాడి పాలనే బాగుందని చెప్పిన వారు మనకు ఎందరో తెలుసు. అందువలన ఒక భావజాలాన్ని మెజారిటీ అంగీకరించి అనుసరించనంత మాత్రాన అది విఫలమైనట్లు , మెజారిటీ ఆమోదించిన భావజాలాలన్నీ సఫలమైనట్లూ కాదు. హిందూమతంపై తిరుగుబాటుగానే బౌద్దం అవతరించింది. అది మన దేశంలో ఆదరణ పొందలేదు, అంత మాత్రాన అది విఫలమైనట్లా ? తరువాతనే మన దేశంలోకి ఇస్లాం, క్రైస్తవం వచ్చాయి.ఎందరో బలహీనవర్గాల వారు ఆ మతాలపట్ల ఆకర్షితులయ్యారు. మెజారిటీగా వున్న హిందూమతం లేదా దానిని కాపాడాలని కంకణం కట్టుకున్న పెద్దలు ఎందుకు ఆ పరిణామాన్ని నివారించలేకపోయారు?

    నాస్తికత్వం, హేతువాదం, భౌతిక వాదం వీటన్నింటినీ కొంతమంది ఒకే గాటన కడుతున్నారు. వాటిలో అనేక అంశాలు ఒకటిగా వుండటం ఒక కారణం. ఈ మూడు వాదాలతో ప్రభావితులైన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కానీ కమ్యూనిస్టులు ఈ మూడు అంశాలను కలిగి వుంటారు. వాటిని జనంలో కలిగించటానికి నిరంతరం ప్రయత్నిస్తారు. కమ్యూనిస్టులుగా వుండి మూఢనమ్మకాలను, తిరోగమన భావాలను ప్రోత్సహిస్తే తప్పు. అయితే కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా చేరటానికి ఈ అంశాలను షరతులుగా పెట్టటం లేదన్నది తెలుసుకోవాలి.అంటే పార్టీలో ఆస్థికులు,నాస్థికులూ అందరూ వుంటారు. ఎవరైనా దేవాలయం, మసీదు, చర్చికో వెళుతూ మరోవైపు దోపిడీ లేని సమసమాజం కావాలని కోరుకుంటే అలాంటి వారిని ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా సభ్యులుగా వద్దంటే అంతకంటే పిచ్చిపని మరొకటి వుండదు. మా మతం కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని వ్యతిరేకించమని చెప్పింది అంటేనే పంచాయతీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మతాలు పుట్టినపుడు కమ్యూనిస్టు సిద్ధాంతమే లేదు.అందువలన మతాలు కమ్యూనిజాన్ని వ్యతిరేకించే అవకాశం ఎక్కడుంది? తప్పుడు వ్యాఖ్యానాలు చేసే అలాంటి వారిని పార్టీలు అంగీకరించవు. పార్టీ సభ్యులుగా చేరిన తరువాత వేల సంవత్సరాలుగా వచ్చిన అనేక అన్యవర్గ ధోరణులను పోగొట్టటానికి ప్రయత్నిస్తారు. అయితే అది అన్ని చోట్లా, అందరూ ఒకే విధంగా చేయకపోవచ్చు. అలాంటివి ఏవైనా వుంటే సద్విమర్శలు చేయాలి. ఒక కమ్యూనిస్టు సంస్మరణ సభలో కొందరు వక్తలు బొట్లు పెట్టుకొని జోహార్‌ కామ్రేడ్‌ అనటం చూసి అవాక్కయ్యానని మూర్తిగారు రాశారు. సంస్మరణ సభ కనుక ఇతరులు ఎవరైనా వచ్చి అలా చేసి వుండవచ్చు.దానికి అవాక్కవ్వాల్సిందేముంది. ఎవరైనా బొట్టుపెట్టుకో కూడదని కమ్యూనిస్టుపార్టీ ఎక్కడైనా చెప్పిందా ? సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాండ్రైన బృందాకరత్‌, సుభాషిణీ అలీ పెద్ద బొట్లు పెట్టుకోవటం లేదా ? మతాలు, మతాచారాలు మాత్రమే అలాంటి ఆంక్షలు విధిస్తున్నాయి.

     అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు అన్నట్లు దైవశక్తి ఆస్థికుల అనుభవంలోకి రావటాన్ని నాస్తికవాదులు ఎన్నిరాసినా అడ్డుకోలేరు అని ఒక నిర్ధారణ చేశారు. ఆస్థికులలో కూడా మేథావులు వున్నారని మరువరాదు అన్నారు. మొదటి విషయం, ఆస్థికులలో మేథావులు వుండరని నాస్తివాదం చెప్పలేదు. కొద్ది మందిగా వున్న నాస్థిక, హేతువాద మేథావుల వైఫల్యం గురించి మూర్తిగారు సంతోష పడుతున్నారు ఓకే. వేల సంవత్సరాలనాడే వుద్భవించిన నాస్థిక వాదం ఇప్పటికీ వునికిలో వుందంటే అత్యధికులుగా వున్న ఆస్థిక మేథావులు, పండితులు, మతాధికారులు, వారి రాజపోషకులు, కొత్తగా టాటా , బిర్లావంటి పెట్టుబడిదారీ పోషకుల వైఫల్యం కనపడటం లేదా ? హిందూమతాన్ని సంస్కరించాలని ప్రయత్నించిన అనేక మంది ఆస్థిక మేథావులు ఎందుకు విఫలమయ్యారు. వీధికొక దొంగబాబా పుట్టుకు వచ్చి మతం పేరుతో దండుకుంటుంటే ఎందుకు నివారించలేకపోయారు ? వెర్రి మొహాలు వేసుకొని ఎందుకు చూస్తున్నారు? ఇది వైఫల్యం కాదా ?

    శంకరాచార్యుడు తన వాదనా పటిమతో అనేక మందిని బౌద్ధం నుంచి మళ్లించి హిందూ మతానికి పూర్వ వైభవం తెచ్చారు అని మూర్తిగారు చెప్పారు. ఇది ఘర్‌ వాపసీ ప్రచార ప్రభావంగా కనిపిస్తోంది. ఆ శంకరాచార్యుడు పుట్టిన కేరళలో దేశంలో ఎక్కడా లేని విధంగా అంత మంది క్రైస్తవులు, ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు? దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎందుకు ఆ మతాలవారు విస్తరించారు? ఇప్పటికీ దేశంలో ఏదో ఒక మూల అనేక మంది హిందూ నుంచి ఇతర మతాలకు ఎందుకు మారిపోతున్నారు? ఆస్థికులు అంటే ఒక్క హిందువులే కాదు, దైవాన్ని, దైవదూతలను నమ్మే ఇతర మతాల వారు కూడా ఆస్థికులే. వారు మార్చుకొనేది మతం తప్ప ఆస్తికత్వాన్ని కాదు, అయినా ఎందుకు ఆ మార్పిడులపై ఎందుకు అంత రగడ చేస్తున్నారు? ఆస్థికులలో ప్రజాస్వామ్యం లేదా ?

     చివరగా ఒక్క మాట నాస్థికులు,హేతువాదులు, భౌతిక వాదులు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు వేల సంవత్సరాల నుంచి మా విశ్వాసం, మనోభావాలు అంటారు తప్ప సరైన సమాధానం చెప్పటంలో ఆస్థికులు విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో తమ వ్యతిరేక భావాలను,చర్చలు, వాదనలను కూడా సహించటం లేదు. దబోల్కర్‌, పన్సారే,కులుబుర్గి వంటి నాస్థిక,హేతువాదుల్ని హతమార్చారు. ఇంకా అనేక మందిని అదే చేస్తామని బెదిరిస్తున్నారు. వారి హత్యలను ఆస్థికులుగా వున్న ప్రముఖులు ఏ మతం వారైనా ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకంటే వారి వాదనలు ఆస్థికవాద మూలాలనే ప్రశ్నిస్తున్నాయి, అహాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇది ఈనాటిది కాదు, చార్వాకులు,లోకాయతుల నుంచి జరుగుతున్నదే. హిందూ మతానికి ఒక సాధికార కేంద్రమే లేదు. అందువలన హిందూమతావలంబకులు, దానిని కాపాడాలనుకొనేవారు, ముందు ఎవరు సాధికారులో తేల్చుకొని విశ్వాసం, మనోభావాలను కాసేపు పక్కన పెట్టి ఆ పండితులు, మతాధిపతులతో శాస్త్రీయమైన పద్దతులలో చర్చలు జరిపి నాస్థికవాదం తరతరాలుగా ‘ఎందుకు’ వునికిలో వుంటున్నదో, ఇప్పటి వరకు హిందూ మతం పేరుతో జరిగిన తప్పులను, ఇప్పటికీ కొనసాగుతున్న అస్పృశ్యత, వివక్ష, వంటి సవాలక్ష అవలక్షణాలను, మతం పేరుతో బాబాలు,యోగులు,యోగినులు భారీగా ఆస్థులను పోగేసుకోవటాన్ని ఎలా అరికట్టాలో తేల్చి ప్రకటించాలి.మనుషులను మనుషులుగా చూస్తారనే భరోసా కలిగించాలి. అప్పుడే జనానికి మతం మారాలన్న ఆలోచన వుండదు. మతాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు ఆ పని చేస్తామంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అది ఏమతం అయినా కావచ్చు, జనం ఇతర మతాలోక్లి మారుతున్నారన్న దుగ్దకంటే మన మతంలోకి ఇతరులను ఎలా ఆకర్షించాలనే విషయంలో అన్ని మతాలూ పోటీ పడటం ఆరోగ్యకర లక్షణం.అలాగాక దాడులకు దిగటం బలహీనత, అనాగరిక లక్షణం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

WHISTLEBLOWING IS NOT JUST LEAKING — IT’S AN ACT OF POLITICAL RESISTANCE

07 Saturday May 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

EDWARD SNOWDEN, SNOWDEN, WHISTLEBLOWING

BY EDWARD SNOWDEN

“I’ve been waiting 40 years for someone like you.” Those were the first words Daniel Ellsberg spoke to me when we met last year. Dan and I felt an immediate kinship; we both knew what it meant to risk so much — and to be irrevocably changed — by revealing secret truths.

One of the challenges of being a whistleblower is living with the knowledge that people continue to sit, just as you did, at those desks, in that unit, throughout the agency, who see what you saw and comply in silence, without resistance or complaint. They learn to live not just with untruths but with unnecessary untruths, dangerous untruths, corrosive untruths. It is a double tragedy: What begins as a survival strategy ends with the compromise of the human being it sought to preserve and the diminishing of the democracy meant to justify the sacrifice.

But unlike Dan Ellsberg, I didn’t have to wait 40 years to witness other citizens breaking that silence with documents. Ellsberg gave the Pentagon Papers to the New York Times and other newspapers in 1971; Chelsea Manning provided the Iraq and Afghan War logs and the Cablegate materials to WikiLeaks in 2010. I came forward in 2013. Now here we are in 2016, and another person of courage and conscience has made available the set of extraordinary documents that are published in The Assassination Complex, the new book out today by Jeremy Scahill and the staff of The Intercept. (The documents were originally published last October 15 in The Drone Papers.)

We are witnessing a compression of the working period in which bad policy shelters in the shadows, the time frame in which unconstitutional activities can continue before they are exposed by acts of conscience. And this temporal compression has a significance beyond the immediate headlines; it permits the people of this country to learn about critical government actions, not as part of the historical record but in a way that allows direct action through voting — in other words, in a way that empowers an informed citizenry to defend the democracy that “state secrets” are nominally intended to support. When I see individuals who are able to bring information forward, it gives me hope that we won’t always be required to curtail the illegal activities of our government as if it were a constant task, to uproot official lawbreaking as routinely as we mow the grass. (Interestingly enough, that is how some have begun to describe remote killing operations, as “cutting the grass.”)

A single act of whistleblowing doesn’t change the reality that there are significant portions of the government that operate below the waterline, beneath the visibility of the public. Those secret activities will continue, despite reforms. But those who perform these actions now have to live with the fear that if they engage in activities contrary to the spirit of society — if even a single citizen is catalyzed to halt the machinery of that injustice — they might still be held to account. The thread by which good governance hangs is this equality before the law, for the only fear of the man who turns the gears is that he may find himself upon them.

Hope lies beyond, when we move from extraordinary acts of revelation to a collective culture of accountability within the intelligence community. Here we will have taken a meaningful step toward solving a problem that has existed for as long as our government.

Not all leaks are alike, nor are their makers. Gen. David Petraeus, for instance, provided his illicit lover and favorable biographer information so secret it defied classification, including the names of covert operatives and the president’s private thoughts on matters of strategic concern. Petraeus was not charged with a felony, as the Justice Department had initially recommended, but was instead permitted to plead guilty to a misdemeanor. Had an enlisted soldier of modest rank pulled out a stack of highly classified notebooks and handed them to his girlfriend to secure so much as a smile, he’d be looking at many decades in prison, not a pile of character references from a Who’s Who of the Deep State.

There are authorized leaks and also permitted disclosures. It is rare for senior administration officials to explicitly ask a subordinate to leak a CIA officer’s name to retaliate against her husband, as appears to have been the case with Valerie Plame. It is equally rare for a month to go by in which some senior official does not disclose some protected information that is beneficial to the political efforts of the parties but clearly “damaging to national security” under the definitions of our law.

This dynamic can be seen quite clearly in the al Qaeda “conference call of doom” story, in which intelligence officials, likely seeking to inflate the threat of terrorism and deflect criticism of mass surveillance, revealed to a neoconservative website extraordinarily detailed accounts of specific communications they had intercepted, including locations of the participating parties and the precise contents of the discussions. If the officials’ claims were to be believed, they irrevocably burned an extraordinary means of learning the precise plans and intentions of terrorist leadership for the sake of a short-lived political advantage in a news cycle. Not a single person seems to have been so much as disciplined as a result of the story that cost us the ability to listen to the alleged al Qaeda hotline.

President Barack Obama walks with U.S. Secret Service agents to Air Force One at Los Angeles International Airport in Los Angeles, Calif., May 8, 2014. Photo: The White House

If harmfulness and authorization make no difference, what explains the distinction between the permissible and the impermissible disclosure?

The answer is control. A leak is acceptable if it’s not seen as a threat, as a challenge to the prerogatives of the institution. But if all of the disparate components of the institution — not just its head but its hands and feet, every part of its body — must be assumed to have the same power to discuss matters of concern, that is an existential threat to the modern political monopoly of information control, particularly if we’re talking about disclosures of serious wrongdoing, fraudulent activity, unlawful activities. If you can’t guarantee that you alone can exploit the flow of controlled information, then the aggregation of all the world’s unmentionables — including your own — begins to look more like a liability than an asset.

Truly unauthorized disclosures are necessarily an act of resistance — that is, if they’re not done simply for press consumption, to fluff up the public appearance or reputation of an institution. However, that doesn’t mean they all come from the lowest working level. Sometimes the individuals who step forward happen to be near the pinnacle of power. Ellsberg was in the top tier; he was briefing the secretary of defense. You can’t get much higher, unless you are the secretary of defense, and the incentives simply aren’t there for such a high-ranking official to be involved in public interest disclosures because that person already wields the influence to change the policy directly.

At the other end of the spectrum is Manning, a junior enlisted soldier, who was much nearer to the bottom of the hierarchy. I was midway in the professional career path. I sat down at the table with the chief information officer of the CIA, and I was briefing him and his chief technology officer when they were publicly making statements like “We try to collect everything and hang on to it forever,” and everybody still thought that was a cute business slogan. Meanwhile I was designing the systems they would use to do precisely that. I wasn’t briefing the policy side, the secretary of defense, but I was briefing the operations side, the National Security Agency’s director of technology. Official wrongdoing can catalyze all levels of insiders to reveal information, even at great risk to themselves, so long as they can be convinced that it is necessary to do so.

Reaching those individuals, helping them realize that their first allegiance as a public servant is to the public rather than to the government, is the challenge. That’s a significant shift in cultural thinking for a government worker today.

I’ve argued that whistleblowers are elected by circumstance. It’s not a virtue of who you are or your background. It’s a question of what you are exposed to, what you witness. At that point the question becomes Do you honestly believe that you have the capability to remediate the problem, to influence policy? I would not encourage individuals to reveal information, even about wrongdoing, if they do not believe they can be effective in doing so, because the right moment can be as rare as the will to act.

This is simply a pragmatic, strategic consideration. Whistleblowers are outliers of probability, and if they are to be effective as a political force, it’s critical that they maximize the amount of public good produced from scarce seed. When I was making my decision, I came to understand how one strategic consideration, such as waiting until the month before a domestic election, could become overwhelmed by another, such as the moral imperative to provide an opportunity to arrest a global trend that had already gone too far. I was focused on what I saw and on my sense of overwhelming disenfranchisement that the government, in which I had believed for my entire life, was engaged in such an extraordinary act of deception.

At the heart of this evolution is that whistleblowing is a radicalizing event — and by “radical” I don’t mean “extreme”; I mean it in the traditional sense of radix, the root of the issue. At some point you recognize that you can’t just move a few letters around on a page and hope for the best. You can’t simply report this problem to your supervisor, as I tried to do, because inevitably supervisors get nervous. They think about the structural risk to their career. They’re concerned about rocking the boat and “getting a reputation.” The incentives aren’t there to produce meaningful reform. Fundamentally, in an open society, change has to flow from the bottom to the top.

As someone who works in the intelligence community, you’ve given up a lot to do this work. You’ve happily committed yourself to tyrannical restrictions. You voluntarily undergo polygraphs; you tell the government everything about your life. You waive a lot of rights because you believe the fundamental goodness of your mission justifies the sacrifice of even the sacred. It’s a just cause.

And when you’re confronted with evidence — not in an edge case, not in a peculiarity, but as a core consequence of the program — that the government is subverting the Constitution and violating the ideals you so fervently believe in, you have to make a decision. When you see that the program or policy is inconsistent with the oaths and obligations that you’ve sworn to your society and yourself, then that oath and that obligation cannot be reconciled with the program. To which do you owe a greater loyalty?

One of the extraordinary things about the revelations of the past several years, and their accelerating pace, is that they have occurred in the context of the United States as the “uncontested hyperpower.” We now have the largest unchallenged military machine in the history of the world, and it’s backed by a political system that is increasingly willing to authorize any use of force in response to practically any justification. In today’s context that justification is terrorism, but not necessarily because our leaders are particularly concerned about terrorism in itself or because they think it’s an existential threat to society. They recognize that even if we had a 9/11 attack every year, we would still be losing more people to car accidents and heart disease, and we don’t see the same expenditure of resources to respond to those more significant threats.

What it really comes down to is the political reality that we have a political class that feels it must inoculate itself against allegations of weakness. Our politicians are more fearful of the politics of terrorism — of the charge that they do not take terrorism seriously — than they are of the crime itself.

As a result we have arrived at this unmatched capability, unrestrained by policy. We have become reliant upon what was intended to be the limitation of last resort: the courts. Judges, realizing that their decisions are suddenly charged with much greater political importance and impact than was originally intended, have gone to great lengths in the post-9/11 period to avoid reviewing the laws or the operations of the executive in the national security context and setting restrictive precedents that, even if entirely proper, would impose limits on government for decades or more. That means the most powerful institution that humanity has ever witnessed has also become the least restrained. Yet that same institution was never designed to operate in such a manner, having instead been explicitly founded on the principle of checks and balances. Our founding impulse was to say, “Though we are mighty, we are voluntarily restrained.”

President Barack Obama talks with Vice President Joe Biden in the Oval Office, April 15, 2015. Photo: The White House

When you first go on duty at CIA headquarters, you raise your hand and swear an oath — not to government, not to the agency, not to secrecy. You swear an oath to the Constitution. So there’s this friction, this emerging contest between the obligations and values that the government asks you to uphold, and the actual activities that you’re asked to participate in.

These disclosures about the Obama administration’s killing program reveal that there’s a part of the American character that is deeply concerned with the unrestrained, unchecked exercise of power. And there is no greater or clearer manifestation of unchecked power than assuming for oneself the authority to execute an individual outside of a battlefield context and without the involvement of any sort of judicial process.

Traditionally, in the context of military affairs, we’ve always understood that lethal force in battle could not be subjected to ex ante judicial constraints. When armies are shooting at each other, there’s no room for a judge on that battlefield. But now the government has decided — without the public’s participation, without our knowledge and consent — that the battlefield is everywhere. Individuals who don’t represent an imminent threat in any meaningful sense of those words are redefined, through the subversion of language, to meet that definition.

Inevitably that conceptual subversion finds its way home, along with the technology that enables officials to promote comfortable illusions about surgical killing and nonintrusive surveillance. Take, for instance, the Holy Grail of drone persistence, a capability that the United States has been pursuing forever. The goal is to deploy solar-powered drones that can loiter in the air for weeks without coming down. Once you can do that, and you put any typical signals collection device on the bottom of it to monitor, unblinkingly, the emanations of, for example, the different network addresses of every laptop, smartphone, and iPod, you know not just where a particular device is in what city, but you know what apartment each device lives in, where it goes at any particular time, and by what route. Once you know the devices, you know their owners. When you start doing this over several cities, you’re tracking the movements not just of individuals but of whole populations.

By preying on the modern necessity to stay connected, governments can reduce our dignity to something like that of tagged animals, the primary difference being that we paid for the tags and they’re in our pockets. It sounds like fantasist paranoia, but on the technical level it’s so trivial to implement that I cannot imagine a future in which it won’t be attempted. It will be limited to the war zones at first, in accordance with our customs, but surveillance technology has a tendency to follow us home.

Here we see the double edge of our uniquely American brand of nationalism. We are raised to be exceptionalists, to think we are the better nation with the manifest destiny to rule. The danger is that some people will actually believe this claim, and some of those will expect the manifestation of our national identity, that is, our government, to comport itself accordingly.

Unrestrained power may be many things, but it’s not American. It is in this sense that the act of whistleblowing increasingly has become an act of political resistance. The whistleblower raises the alarm and lifts the lamp, inheriting the legacy of a line of Americans that begins with Paul Revere.

The individuals who make these disclosures feel so strongly about what they have seen that they’re willing to risk their lives and their freedom. They know that we, the people, are ultimately the strongest and most reliable check on the power of government. The insiders at the highest levels of government have extraordinary capability, extraordinary resources, tremendous access to influence, and a monopoly on violence, but in the final calculus there is but one figure that matters: the individual citizen.

And there are more of us than there are of them.

Originally published by The Intercept

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

Panama Papers source breaks silence, denies being a spy – Sueddeutsche Zeitung

07 Saturday May 2016

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

Mossack Fonseca, panama, panama papers, whistleblowers

A company list showing the Mossack Fonseca law firm is pictured on a sign at the Arango Orillac Building in Panama City in this April 3, 2016 file photo. REUTERS/Carlos Jasso/Files
A company list showing the Mossack Fonseca law firm is pictured on a sign at the Arango Orillac Building in Panama City in this April 3, 2016 file photo.
REUTERS/CARLOS JASSO/FILES

Sueddeutsche Zeitung said on Friday that the source of millions of documents leaked to the German newspaper from Panamanian law firm Mossack Fonseca had sent them a manifesto, saying his motivation was the “scale of injustices” the papers revealed.

The source had never before publicly stated why he leaked the documents, now known as the Panama Papers, said Sueddeutsche Zeitung (SZ), one of Germany’s most reputable newspapers.

In an 1,800 word manifesto published on the SZ website on Friday, the source, calling himself “John Doe”, praised others who have leaked secret and sensitive documents, such as Edward Snowden, who revealed details of the U.S. government’s mass surveillance programme.

“For his revelations about the National Security Agency (NSA), he deserves a hero’s welcome and a substantial prize, not banishment,” the source wrote.

He also said he would be willing to co-operate with law enforcement agencies.

He called on the European Commission, Britain, the United States and other nations to take steps to protect people who reveal private information about such sensitive issues rather than punishing them.

“Legitimate whistleblowers who expose unquestionable wrongdoing, whether insiders or outsiders, deserve immunity from government retribution, full stop,” he said.

The source, who contacted the paper a year ago with an offer of encrypted internal documents from Mossack Fonseca, denied being a spy but said he had recognised the “scale of injustices” described in their contents.

The documents cover a period over almost 40 years, from 1977 until last December, and purport to show that some companies domiciled in tax havens were being used for suspected money laundering, arms and drug deals and tax evasion.

Reuters could not independently verify whether the source was the same person who leaked the original documents. The source’s identity and gender is not known.

Sueddeutsche Zeitung spent more than a year, along with other media outlets and the International Consortium of Investigative Journalists, analysing the huge cache of documents.

On Friday, Sueddeutsche Zeitung introduced the manifesto by saying: “Now ‘John Doe’, the anonymous source, has sent the SZ a manifesto, which can be read as an explanation of his actions – and as a call to action.”

The source welcomed the fact that the leak had triggered a debate on “wrongdoing by the elite” but said not enough action had been taken.

“For the record, I do not work for any government or intelligence agency, directly or as a contractor, and I never have,” he said.

The source was critical of banks, financial regulators, tax authorities, the courts, and the legal profession, as well as the media, saying he had offered the documents to several major media outlets that had chosen not to cover them.

“The collective impact of these failures has been a complete erosion of ethical standards, ultimately leading to a novel system we still call Capitalism, but which is tantamount to economic slavery.”

The source ended the manifesto by saying “inexpensive, limitless digital storage and fast internet connections” should help digitise the revolution against income inequality.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రుల చెవిలో ‘ప్రత్యేక ‘పువ్వు – చంద్రన్న ముందున్న మార్గాలు

06 Friday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Chandrbabu, special status to Andhrapradesh, tdp

ఎం కోటేశ్వరరావు

    పేరు మోసిన అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగి మరణించిన తరువాత కూడా సొమ్ము చేసుకొనేందుకు వెంటిలేటర్‌లు పెట్టి బంధువులను మోసం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హోదా పరిస్థితి వుంది. తేడా ఏమంటే అక్కడ డబ్బు రాబట్టుకోవటం కోసం అయితే, ఇక్కడ జనం మద్దతు పోగొట్టుకోకుండా వుండటం కోసం. ప్రత్యేక హోదా ఇవ్వటం నిబంధనల రీత్యా సాధ్యం కాదని తెలిసినా నాడు కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఐదు కాదు పది అంటూ పెద్ద రాయితీని రాబట్టినట్లు బిజెపి పెద్ద నాటకం ఆడింది. తీరా బిల్లు విషయానికి వచ్చే సరికి అటు కాంగ్రెస్‌ దానిని దానిలో చేర్చలేదు, ఇటు బిజెపి, తెలుగుదేశం పార్టీ కూడా నోరు మెదపలేదు.ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం మోపి తప్పుకొనేందుకు చూస్తున్నాయి. మొత్తం మీద రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు, ప్రత్యేక హోదా రాయితీల నాటకంతో బిజెపి, అందరూ కోరుతున్నారు, కలిసి వస్తున్నారు కదా తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు కాంగ్రెస్‌ వారు వారందరితో కుమ్మక్కయి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. నిబంధనలు అంగీకరించవని తెలియనంత అమాయకంగా ఈ పార్టీలలో తలలు పండిన పెద్దలు వున్నారా ?

     అటు కేంద్రం-ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న పార్టీలు రెండు సంవత్సరాల పాటు ఆశ పెట్టాయి. ఇంకెంత మాత్రమూ మోసం చేయలేవు.మరణించిన రోగిని వెంటిలేటర్‌పై పెట్టిన కార్పొరేట్‌ ఆసుపత్రి యాజమాన్యం అసలు విషయం చెప్పదు, చేయాల్సిందంతా చేస్తున్నాం అని మాత్రమే చెబుతుంది. రోగి బతికి బట్ట కట్టే ఆశ చచ్చి, అంతకు మించి వెంటిలేటర్‌ ఖర్చు భరించలేక బంధువులకు ఏం చేయాలో తెలియదు. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అలానే వుంది.

    పార్లమెంట్‌లో మంత్రి అరుణ్‌ జైట్లీ సీనియర్‌ లాయర్‌ కనుక కేసు గెలుస్తామని గానీ ఓడిపోతామని గాని చెప్పకుండా నర్మగర్బంగా అసలు కేసే లేదు అని చెప్పేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రులు, ఇతరులు అందరితో మాట్లాడుతున్నా అని చెబుతున్నారు. ఆయన మాట్లాడటం లేదని ఎవరూ అనటం లేదు. దేన్ని గురించి, ఏం మాట్లాడుతున్నారో జనానికి తెలియాలి కదా? కనీసం ఆయనను వెన్నంటి వుండే లేదా మేనేజిమెంట్‌లో వుండే మీడియా కూడా లీకుల కధనాలు కూడా ఇవ్వకపోవటంతో వాటికి అలవాటు పడిన వారు మత్తుకు బానిసలైన వారు గంజాయి దొరక్క పోతే ఎలా విలవిల్లాడి పోతారో అలా జుట్టు పీక్కుంటున్నారు.

    గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు పరిస్థితి వేరు. కారణాలేమైనా కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు అలా కాదే. ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడి మాదిరి మీడియా సంస్ధలు అటు కేంద్రంలోని బిజెపి- ఇటు రాష్ట్రంలోని తెలుగు దేశం పార్టీ మధ్య వున్నాయి. ప్రత్యేక హోదా గురించి ఎవరికీ నొప్పి లేదా రాజకీయంగా నష్టం జరగకుండా తమ ప్రావీణ్యాన్ని వుపయోగించి ఏం రాస్తాయో, ఎలా చూపుతాయో తెలియదు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల గడువు వుంది. చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పుల్లుగా వాగ్దానాలు చేసి, రంగుల కలలను జనం ముందుంచారు. ఏ రంగంలో చూసినా ఎదురుగాలి తప్ప మరొకటి కనపడటం లేదు. గత ఎన్నికల ఫలితాల గురించి చంద్రబాబు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. కేంద్రంలో తనపై ఆధారపడే ప్రభుత్వం వుంటుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. రాజ్యసభలో తనకు తగినంత బలం లేదు కనుక బిజెపి కూడా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీతో సంబంధాలను కొనసాగిస్తున్నది. మరొక మార్గం లేదు కనుక తెలుగుదేశం కూడా అధికారాన్ని పంచుకొని, తాను కూడా పంచి ఇచ్చింది.

    గత రెండు సంవత్సరాల అనుభవం చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది పిడికెడు మట్టి, ముంతెడు నీళ్లు అని అమరావతి శంకుస్ధాపన సభలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తేల్చి చెప్పారు. అందుకే చంద్రబాబు ముందు చూపుతో శాశ్వత రాజధానిని పక్కన పెట్టి తాత్కాలిక రాజధానిని తెరమీదకు తెచ్చారు. ప్రత్యేక తరగతి హోదా రాదని చంద్రబాబుకు ఎప్పుడో అవగతం అయినా దానిని అంగీకరిస్తే రాజకీయంగా నష్టం కనుక. సాధ్యమైన మేరకు దాని ప్రస్తావన, దానిపై ఘర్షణ రాకుండా చూసుకుంటున్నారు.అసలు ప్రస్తావించకపోతే అదీ నష్టమే కను తద్దినం మాదిరి స్మరించారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర పెద్దలు గత ఏడాది కాలంగా పరోక్షంగా చెబుతూ లీకులను వదులుతూనే వున్నారు. ఇక లాభం లేదని గత వారంలో చిన్న మంత్రుల ద్వారా పెద్ద విషయాన్ని చెప్పించారు.

    ఈ పూర్వరంగంలో గత వారం రోజులుగా చంద్రబాబుకు పాలుపోవటం లేదు. స్పందన ఎలా వుంటుందో తెలుసుకొనేందుకు కింది స్థాయి నాయకులతో విమర్శలు చేయిస్తున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకుంటే రాజకీయంగా ఒంటరి పాటు కావటంతో పాటు కేంద్రం నుంచి ప్రతి రోజూ అధికారికంగా తలనొప్పులే. సఖ్యంగా వున్న ఇపుడే వుదయం సాయంత్రం ఢిల్లీ ప్రభువుల దర్శనం చేసుకున్నా ఫలితం వుండటం లేదని తేలిపోయింది. ఇటు రాష్ట్రంలో చూస్తే రాజకీయంగా కలసి వచ్చే స్నేహితులు కనిపించటం లేదు. గత ఎన్నికలలో తోడ్పడిన సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అదేదో సినిమాలో చెప్పినట్లు వీలైతే నాలుగు మాటలు, కాఫీ, ఆశకు పిసినారి తనం ఎందుకన్నట్లు వీలైతే ముఖ్యమంత్రి పదవి కోసం దారి వెతుక్కుంటున్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడపుడే కోలుకొనే పరిస్థితి కనిపించటం లేదు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి మార్గం అగమ్యగోచరం. వైఎస్‌ కుటుంబంతో వున్న ఆర్ధిక లావాదేవీలు పరిష్కారం కాని వారు అవి తేలేంత వరకు అదే పార్టీలో కొనసాగవచ్చు.ఆ బాదర బందీ లేనివారు, తెలుగు దేశం పార్టీతో సర్దుబాటుకు వచ్చిన వారు ఇప్పటికే ఫిరాయించారు, రానున్న రోజుల్లో మరికొందరు రావచ్చు.

    తెలుగు దేశం పార్టీ పరిస్థితి కూడా అంత సజావుగా, వుత్సాహంతో, వుద్వేగంతో వురకలు వేసే పరిస్థితి వుండదు.కేంద్రంతో ముడిపడిన వ్యాపార లావాదేవీలు వున్నవారు దానితో వైరం తెచ్చుకొనేందుకు సుతరామూ అంగీకరించరు. రెండవది చంద్రబాబు నాయుడు అప్పుచేసి పప్పుకూడు అన్న పద్దతుల్లో రాజధాని అమరావతిని కూడా అప్పులతో నిర్మించేందుకు చూస్తున్నారు. అది సాధ్యం అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేము. ఇంతవరకు ఏ రాష్ట్ర రాజధాని నిర్మాణం కూడా అలా జరగలేదు.ఒక వేళ ఆ ప్రాంత భూములన్నీ తాకట్టు పెట్టి లేక భారీ రాయితీలు ఇచ్చో విదేశీ సంస్దల నుంచి అప్పు తెచ్చుకోవాలంటే కేంద్రం అనుమతులు తప్పనిసరి. లక్షల వుద్యోగాలు సృష్టించలేకపోయినా కనీసం రాజధాని నిర్మాణం చేయకుండా వచ్చే ఎన్నికలలో ఓటర్ల ముందుకు పోలేరు. చంద్రబాబు మరొకసారి విశ్వసనీయత సమస్యను ఎదుర్కోవటం స్పష్టంగా కనిపిస్తోంది.

     ఈ పూర్వరంగంలో ఏదో ఒక దారి లేదా సాకు వెతుక్కొని బిజెపి, కేంద్రంతో సర్దుకు పోదాం లెండి అన్నట్లు ఎన్నికల ముందు వరకు లొంగి పోవటం ఒక మార్గం. చంద్రబాబును అపర చాణక్యుడు అంటారు కనుక అప్పటి పరిస్థితిని బట్టి ఏదారి పట్టాలో నిర్ణయించుకోవటం ఒకటి.లేదూ తెగేదాకా లాగితే తెలుగు దేశం పార్టీ సంగతి తేల్చటానికి బిజెపి వెనుకాడదు. కాంగ్రెస్‌ బాటలోనే అది ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు వెనుకాడదు అని ఇప్పటికే రుజువు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ ఫిరాయింపు జనాలతో నిండి వుంది. అలాంటి వారికి మరొక జంప్‌ చేయటం కష్టం కాదు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చాం.అది సాధ్యం కాదని తేలిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కోసం బిజెపికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పటానికి ఎలాంటి జంకూ గొంకూ వుండదు. తొలిసారి తప్పు చేసినపుడు సిగ్గు పడతారేమో గాని తరువాత అలవాటుగా మారిపోతుంది. అధికారానికి బానిసలుగా మారితే ఎంతకైనా తెగిస్తారు.

     చంద్రబాబు ముందున్న మరొక మార్గం జనానికి వాస్తవాలు చెప్పి విశ్వసనీయత కల్పించుకొని వారి మద్దతు పొందటానికి ప్రయత్నించటం. చంద్రబాబు చాణక్యంలో ఇంతవరకు అలాంటి అధ్యాయం లేదు. చిత్రం ఏమంటే ఏది జరిగినా చంద్రబాబు, తెలుగుదేశం బలహీనపడే పరిస్థితులను స్వయంగా సృష్టించుకున్నారు. రెండో మార్గాన్ని అనుసరించితే కనీసం కొంత మంది సానుభూతి అయినా పొందవచ్చు.

      రాష్ట్రంలో బిజెపి కూడా మునుపటి మాదిరి లేదు. కేంద్రంలో ఎవరి దయా దాక్షిణ్యాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తప్ప రాష్ట్రంలో బలపడటానికి దానికి మరొక మంచి అవకాశం లేదు, రాదు. ఇప్పటికే రెండు సంవత్సరాలు వృధా అయిందనే తొందర వారిలో కనిపిస్తోంది. ఆ పార్టీలో సాంప్రదాయ ఆర్‌ఎస్‌ఎస్‌ రక్త సంబంధీకులే కాకుండా, కొత్తగా కాంగ్రెస్‌ రక్తం కూడా కలిసింది. వుపయోగించుకోవటం, లాభం లేదనుకున్నపుడు వదలి వేసిన గత అనుభవాల రీత్యా చంద్రబాబు నాయుడు వారికి నమ్మదగిన స్నేహితుడు కాదు. అన్నింటికీ మించి మర్రి చెట్టు నీడన మరొక మొక్క ఎదగదు అన్నట్లు తెలుగు దేశం నీడలో బిజెపి పెరగటం అసాధ్యం అని రెండు సంవత్సరాల అనుభవం వారికి నేర్పింది. అందువలన తమకు లొంగిపోయి అధికారంలో మరింత వాటా పెడితే సరి లేకపోతే తెలుగుదేశం మూలాలను దెబ్బతీయటానికి ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. అధికారం ఎంతపని అయినా చేయిస్తుంది. మొత్తానికి ప్రత్యేక హోదా ప్రత్యేక రాజకీయ పరిస్థితులకు నాంది పలికింది. ఇది ఏ మలుపు తిరుగుతుందో, రాష్ట్ర రాజకీయాలను ఎటు మళ్లిస్తుందో , ఏ ప్రస్తానానికి దారితీస్తుందో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

“Dilma’s Mistake Was to Promote Class Conciliation”

06 Friday May 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Brazil, Dilma, Dilma Rousseff, Latin America, Latin American left, mst, neoliberalism, Parliamentary coup, Popular Brazil Front

Interview With João Pedro Stédile

The economist and leader of the Landless Workers’ Movement (MST) of Brazil, Joao Pedro Stédile, affirmed that left-wing forces won’t allow the Parliamentarian right to fulfill their wish to force Dilma Rousseff out of the presidency to reinstall neoliberalism in the country.Stédile was interviewed byLibreRed
, where this article was first published, and the English translation onThe Dawn
website.

LibreRed (LR): What will be the reaction of the Brazilian people and the MST in particular if Dilma Rousseff is destituted?

Thousands rallied in major cities across Brazil on May Day.

Thousands rallied in major cities across Brazil on May Day to support the embattled President Dilma Rousseff.

João Pedro Stédile (JPS): First of all, we’re confident that it’s possible to stop the coup in process now that it has reached the Senate. We believe that the government has a greater representation in the Senate than in the Chamber of Deputies [where the vote was in favor of the impeachment], the Senators themselves are older, more experienced in politics and know that a Parliamentary coup like the ones that took place in Honduras or Paraguay would lead Brazil to a deeper crisis.

But if this coup is consolidated in the Senate, we, as part of the movements that are organized in the Popular Brazil Front won’t hesitate in denying any kind of legitimacy to a Michel Temer–Eduardo Cunha government. It would be an illegitimate government completely stained by corruption. It’s now public that they gave out a lot of money to get the votes of the deputies. Besides denying their legitimacy, and not participating in any process, we will keep taking to the streets to exert pressure and lead people to become conscious of what will happen.

As for now, on April 29 – next Friday – there will be mobilizations in several cities and on May 1 we want there to be a massive protest action. For that, we almost certainly will coordinate with several union organizations – there are eight of them, and only one supports the coup. We are in discussions with the seven unions (that are with the people), the possibility of doing a general strike before the vote in the Senate. We want to point out to the businessmen that despite their money and their plan to impose the comeback of neoliberalism and the subordination of our economy to the interests of yankee companies, we the working-class are the ones that produce riches. And if we make a general stoppage, it will be a signal to them that says “you may want to increase your profits and your exploitation again, but those who produce the riches in this country in the industry and agriculture are we, and we won’t allow a coup that destroys democracy in our country.”

LR: Now the right is saying, in Brazil and in the rest of the continent and the world, that this is not a coup but the mere application of Constitutional laws.

JPS: Sure, that’s what they said in Honduras, as well as in Paraguay, and it’s a trap. In Brazilian law, there is a provision that says that if a President commits a crime of responsibility or corruption against the country, the Parliament can punish and expel him or her. But in fact President Dilma didn’t commit any crime at all, the accusation they used against her in the process they started in the Parliament has to do with a mechanism of public accounting that the Government uses to meet its social obligations in health, education, and seeked other funds that were in public banks or in the provision for other areas. But this is not a crime, it’s an artifice of any government, even Michel Temer did it himself when he was in the Presidency of the Republic, replacing the President, and in the states of Brazil there are 24 governors, several of them from the right, but also from the center, left and any other ideological convictions, that use that form of accounting.

Therefore, there is no crime, and if there were, then Temer would have to be ousted too, and that’s why we denounce that a single innocent person can’t be judged for an action that was made by two partners: President and Vice President. But the bottom of the issue is not removing the President or not, apart from being a true blow to democracy, the problem is that we are going through a serious economic crisis and the capitalists’ way to deal with that crisis and restore their profit rate is to return to the neoliberal model, that is, to take away workers’ rights, hand out our resources, such as oil, mining, water, and biodiversity to transnational companies and keep interest rates high – President Dilma was an obstacle to that.

Temer has already announced his government plan, which is completely neoliberal. That’s why the Brazilian people’s organizations say that Temer is to Brazil what Mauricio Macri is to Argentina, but the difference resides in that Macri earned the votes to become President and he didn’t. Not only that, but he’s so unpopular that in recent polls 80 per cent of the people said that they don’t want him, and that if he ran for President, he’d get only one per cent of the vote in Brazil. That’s the state of affairs: it’s a coup against democracy.

LR: How come President Dilma chose him as Vice President?

JPS: That’s the sort of moves that we in the MST always criticized. In reality, Lula (in both of his terms) and Dilma always proposed a formula for class conciliation, like in Chile, so there were always seats reserved for sectors of the Brazilian bourgeoisie.

When Lula was President, that strategy worked well because his Vice President was a nationalist, serious and even honest businessman from the textile industry, whose business depended also on the internal market and therefore he was interested in having wealth distribution because that way he could sell more, but Mr. Temer is a lumpen bourgeoise. His only role is to defend the bourgeoisie, but he’s not actually a bourgeoise per se, and because of that, because he’s a lumpen, he betrayed the President. When the President publicly spoke to denounce that betrayal, the right started a process in the Supreme Federal Court to prevent her speech from being broadcast on the national network, to silence her speech against this man and the whole coup that was being schemed by more than a hundred corrupt Parliamentarians, who are themselves being investigated by the Supreme Federal Court. There’s no explanation as for why, to this day, the judicial power hasn’t had the courage to accelerate those processes, because most of the Parliamentarians that voted against Dilma could even go to jail for the millions they stole from public coffers, and in the form of kickbacks from companies.

LR: As an economist, could you explain how much the current economic crisis weighed in the current political crisis of Brazil?

JPS: The economic crisis is the reason why the class conciliation ceased to be possible, because when Lula was President, he designed a conciliation that was based on three pillars: firstly, to make the economy grow through industry (which he accomplished), secondly, to recover the role of the state of making productive investments such as education and health, to better the living conditions of the population and thirdly, to distribute income through an increase in the minimum wage. What happened? With the international crisis of capitalism the economy of Brazil, as a country on the periphery of capitalism, suffered greatly, and for three years the economy hasn’t grown.

Twenty years ago industry accounted for 50 per cent of our GDP and now, due to deindustrialization and competition from Chinese and U.S. companies, national industry accounts for only 9 per cent of the GDP, and there’s a deep economic crisis that can only be solved by recovering, again, the role of the state, controlling financial capital so that instead of accumulating wealth through speculation, the state can use that money to make productive investments in the industry and agriculture sectors, oriented toward the internal market. With that, the economy would grow again, and we’d have a new role for the workforce (because nowadays we have an unemployment rate of 10 per cent) and we could have social programs again.

The political crisis we’re going through is a consequence of the elites trying to get back the state and restore neoliberalism, but the working class isn’t going to accept that. It’s going to take years to get out of this, because the only way out of a crisis of this magnitude is through an agreement between social classes – not just parties – over a new model of the country, that can be hegemonic in most of society.

And now, at this moment, there’s no project being discussed in the country, not even within any of the classes – neither the bourgeoisie nor the petite bourgeoisie, nor the working class, have a clear project for the country. This is why we’re in this confusion and why the bourgeoisie is stupid enough – because they’re subordinated to the interests of imperialism – to think it’s enough to change the President of the Republic to magically solve the problems of the economy, but that’s not true. On the contrary, that would deepen the contradictions of inequality, deepen the institutional crisis and, hopefully, send the masses back to the streets so that they, with their political force, debate a new project for the country.

LR: Have some sectors of the working class, that have benefited by the social policies of Dilma and Lula, been co-opted by the right in Brazil?

JPS: It wouldn’t be fair to say they’ve been co-opted, because in that process of mobilization there was a sector of the petite bourgeoisie that went out on the streets to defend the coup. But they are the eight per cent of the population, and we, the left, went out on the streets and even in greater numbers, but we were all militants, organized sectors, the mediation between the masses and the leaders. The masses are still silent, still afraid. They haven’t mobilized yet but they were also not co-opted by the right.

But why is it so? At that point we have to be self-critical, because during the eight years that Lula governed, there was almost no work to elevate the level of political and cultural consciousness of those masses, who got better policies and better salaries but without a change in their views, and the government did nothing to change that. Unlike Venezuela, Ecuador and Bolivia, there was no effort to break with the monopolies in communications, therefore the TV station O Globo puts garbage in people’s heads every day and they remain perplexed while they watch the political game as if it was just another soap opera.

LR: Let’s conclude with a message from you to the people of Latin America. What would you like to say to them?

JPS: Times are hard but we mustn’t be discouraged or pessimistic, as the great thinkers of Latin America told us. We have to be pessimistic in our analysis but optimistic toward the future. It’s true that our continent, as everything else, is in crisis, but that’s not the fault of a leader, a government or a party.

Capitalism is to blame – the capitalist way of organizing production and life in society is in crisis around the world and because we in Latin America are in the periphery of world capitalism, capitalists see our continent as a bigger opportunity to dominate natural resources, markets and the workforce. These are hard times because we have to confront the empire, but this brings contradictions.

It’s time to put more energy into bringing awareness and organizing people, because in the coming years we’ll see a new, rising, mass movement on our continent and in this movement there will be new liberation projects and new leaders, and we’ll surely see the dream of Chavez, Martí, and Che come to life again. A project that unifies the dreams of Latin America. We must have hope because we have to fight every day. Those who fight, always win. •

Share this:

  • Tweet
  • More
Like Loading...

Socialism isn’t perfect, but it’s damn better than what we have

05 Thursday May 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ 1 Comment

Tags

Black Futures, CAPITALISM, communism, Marxism, Socialism, US left politics

by: JANAÉ BONSU

may 4 2016

People’s World Series on Socialism

Everyone seems to be talking about socialism these days, but what does it mean? That was the question asked by Susan Webb in one of our most popular and widely-shared recent articles. Millions of Americans are considering alternatives to a system run by and for the 1 percent. They are taking an interest in socialism, a word that has meant a great many things to activists, trade unionists, politicians, and clergy around the world over the last century and a half. The article below is one of a series on socialism, what it can mean for Americans in the 21st century, and how we might get there. 

On February 1, 2016 BYP100 (Black Youth Project 100) released the Agenda to Build Black Futures – a comprehensive platform of bold economic goals developed by young Black people. As one of them, I admittedly didn’t have a firm grasp on all the nuances and distinctions between the different political economies I’d often hear mentioned in social justice circles – socialism, communism, Marxism…and I still don’t. I do know, however, that capitalism has been the bane of most people’s existence (99% to be exact), and it was the reason why we needed to even draft such a document.

My co-authors and I wrote the Agenda based on what we thought would get Black and all oppressed people closer to social, economic, and political freedom. It wasn’t until after it was released and the feedback started rolling in that I heard the Agenda is, in many ways, a socialist economic platform. This, in turn, caused me to reflect on what the hell socialism even means.

The Agenda covers a lot of ground, but many of the recommendations we put forth have been articulated and fought for in the social movements of yesteryear – universal childcare, guaranteed income, baby bonds, jobs with a living wage, the right to unionize without retaliation, paid family leave, community land trusts, and cooperatives – just to name a few things.

But there are some things that today’s freedom fighters are much more vocal on, like comprehensive healthcare that covers gender-affirming and transition-related care, valuing women’s paid and unpaid labor, reproductive justice, and taking the profit out of punishment. If folks say that the Agenda is socialist, then I’ve come to some conclusions about what socialism must mean.

I understand capitalism to correspond with competition. In a capitalist society, one is measured by the quantity and quality (i.e. value) of one’s labor. Everyone is disposable. Socialism, then, must mean not having to compete to climb up a proverbial ladder because someone will inevitably be below someone else. Socialism must mean obliterating the notion of struggling to survive. In a world where poverty does not exist, neither do police (or at least not in their historically oppressive capacity). In a world where police don’t exist, neither do prisons and jails. That is the world I we had in mind in drafting the Agenda. Utopian? Most would say “definitely”. But I know its possible.

If the “playing field” is to ever be leveled, those complicit and accessory to the harms done that have caused and perpetuate the inequities that society’s most marginalized face must make amends. Yes, I’m talking about reparations.

I’m writing this on the day that the Treasury Department announced that Harriet Tubman will be the next face on the $20 bill to replace Andrew Jackson. Harriet Tubman was a former slave and an embodiment of anti-capitalism who risked her life to liberate the people who white men like Jackson purchased as property and whose labor they exploited. If Tubman was alive, I’m pretty sure she would rather see all those bills that her face is about to grace to go towards righting the wrongs of racist public policy over many lifetimes.

What’s really ironic is that in 1862, Congress signed off on reparations to slaveholders in D.C. that were loyal to the Union for their freed slaves. Yet, the horrors that enslaved people and their descendants endured by their hands haven’t been enough to move Congress to grant reparations. Oh, America.

In many ways, I think the aforementioned recommendations put forth in the Agenda are forms of reparations. If those same recommendations are socialist, then perhaps we should really consider this socialism thing (and self-proclaimed socialist, Bernie Sanders, should certainly reconsider his stance on reparations).

In any case, I agree with Susan Webb when she says, “Socialism is simply about rebuilding our society so that…the people who make this country run – not a tiny group of super-rich corporate profiteers – are the deciders, the planners, the policymakers.”

I disagree with Webb, though, on this notion that “socialism is rooted in American values.” Freedom is one value she listed, but freedom can’t possibly be an American value if, from its founding and at present, the structures that hold it together withhold freedom from so many people. The America I know has no values, which is why I’m committed to rebuilding an America informed by the values of freedom, justice, love, radical inclusivity, collective power, and interdependence.

Taken together, I won’t ever say that socialism is perfect – nothing is. But it’s damn better than what we have now.

Janaé Bonsu is the National Public Policy Chair of Black Youth Project 100 (BYP100). Follow her on Twitter @janaebonsu.

Courtesy :http://peoplesworld.org/

Share this:

  • Tweet
  • More
Like Loading...

The transit of Mercury over the disk of the Sun on Monday, May 9, 2016

03 Tuesday May 2016

Posted by raomk in Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, Science

≈ Leave a comment

Tags

Sun, The transit of Mercury, The transit of Mercury over the disk of the Sun

 

A transit of Mercury over the disc of the Sun will take place in the afternoon of May 9, 2016 (19 Vaishakha, 1938 Saka Era). This transit phenomenon will be visible from India.

This phenomenon takes place when the planet Mercury will be seen as a small black dot travelling from one limb of the solar disc to the other.

From the Earth this phenomenon is seen when the Mercury passes between the Sun and the Earth. This happens only when the Sun, the planet Mercury and

the Earth are lined up in one plane. The Mercury appears as a dot on the solar disc because its angular size is very small compared to that of the Sun as seen

from the Earth.

The transit begins with Contact-I, the instant when the disc of the planet Mercury is externally tangent with the Sun (Ingress exterior) followed by Contact-II

when the Mercury is internally tangent with the Sun (Ingress interior). The Mercury will be seen as a black spot, traveling several hours over the face of the disc,

will reach the opposite limb of the Sun at Contact-III, when the disc of the planet Mercury is internally tangent with the Sun (Egress interior). Finally,

the transit ends at Contact-IV when the disc of the planet Mercury is externally tangent with the Sun (Egress exterior).

The phenomenon is a relatively rare one which occurs 13 or 14 times in a century. It occurs in the month of May and November. The interval between

one November transit and next November transit may be 7, 13 or 33 years whereas the interval between one May transit and the next May transit may be 13 or 33 years.

The transit of Mercury will be visible from most of Asia (except south eastern parts and Japan), Europe, Africa, Greenland, South America,

North America, Arctic, North Atlantic Ocean and most of the Pacific Ocean. The entire transit, from beginning to end, will be visible from eastern

North America, northern South America, the Arctic, Greenland, extreme northwestern Africa, western Europe, and the North Atlantic Ocean.

In India, the beginning of the event comprising of Ingress exterior (Contact-I) and Ingress interior (Contact-II) will be visible from all places. The duration of the

entire transit event will be about 7 hour and 30 minutes. The observer in India will not see the ending of the event as the same will be in progress after sunset.

Depending upon the sunset time of different places in India, the observer located in the extreme east of the country will see the event about 1 hour from

the beginning and the observer located in the extreme west of the country will see the event about 2 hours and 45 minutes from the beginning.

 

In Delhi, the event can be seen for a duration of about 2 hours 20 minutes as it will start at 16h 41m IST and sunset will take place at 19h 01m IST.

Similarly, in Kolkata the event will start at 16h 41m IST and it can be seen for a duration of about 1 hour 26 minutes, in Mumbai the event will start

at 16h 41m IST and it can be seen for a duration of about 2 hours 24 minutes, in Chennai the event will start at 16h 41m IST and it can be seen for a

duration of about 1 hour 45 minutes.

A table related to local circumstances of some places in India is appended below for ready reference.

LOCAL CIRCUMSTANCES RELATING TO CERTAIN PLACES IN INDIA

 

Place Ingress

Exterior

contact

Ingress

Interior

contact

Egress

Interior

contact

Egress

Exterior

contact

Sunset Duration
h      m    s h      m    s h   m h   m
Agartala 16   40   33.6 16   43   45.6 **   ** **   ** 17   57 1   16
Ahmedabad 16   40   45.5 16   43   57.0 **   ** **   ** 19   12 2   31
Aijawl 16   40   33.1 16   43   45.1 **   ** **   ** 17   52 1   11
Ajmer 16   40   45.3 16   43   56.9 **   ** **   ** 19   09 2   28
Allahabad 16   40   39.5 16   43   51.3 **   ** **   ** 18   39 1   58
Amritsar 16   40   48.4 16   44   00.1 **   ** **   ** 19   17 2   36
Bangalore 16   40   37.8 16   43   49.4 **   ** **   ** 18   37 1   56
Bhagalpur 16   40   36.5 16   43   48.4 **   ** **   ** 18   18 1   37
Bhopal 16   40   41.4 16   43   53.1 **   ** **   ** 18   53 2   12
Bhubaneswar 16   40   34.5 16   43   46.3 **   ** **   ** 18   15 1   34
Cannanore 16   40   39.5 16   43   51.0 **   ** **   ** 18   44 2   03
Chandigarh 16   40   46.2 16   43   57.9 **   ** **   ** 19   06 2   25
Chennai 16   40   35.8 16   43   47.4 **   ** **   ** 18   26 1   45
Cochin 16   40   38.5 16   43   49.9 **   ** **   ** 18   37 1   56
Cooch Behar 16   40   35.9 16   43   47.9 **   ** **   ** 18  0 9 1   28
Cuttack 16   40   34.5 16   43   46.3 **   ** **   ** 18   15 1   34
Darjeeling 16   40   36.9 16   43   48.9 **   ** **   ** 18   15 1   34
Dehradun 16   40   45.0 16   43   56.7 **   ** **   ** 19   01 2   20
Delhi 16   40   44.4 16   43   56.1 **   ** **   ** 19   01 2   20
Dibrugarh 16   40   34.7 16   43   46.8 **   ** **   ** 17   48 1   07
Dwarka 16   40   48.3 16   43   59.7 **   ** **   ** 19   24 2   43
Gandhinagar 16   40   45.5 16   43   57.0 **   ** **   ** 19   12 2   31
Gangtok 16   40   36.9 16   43   48.9 **   ** **   ** 18   14 1   33
Gaya 16   40   37.2 16   43   49.0 **   ** **   ** 18   25 1   44
Guwahati 16   40   35.0 16   43   47.0 **   ** **   ** 18   01 1   20
Haridwar 16   40   44.7 16   43   56.4 **   ** **   ** 19   01 2   20
Hyderabad 16   40   38.2 16   43   49.8 **   ** **   ** 18   39 1   58
Imphal 16   40   33.3 16   43   45.3 **   ** **   ** 17   49 1   08
Itanagar 16   40   35.0 16   43   47.1 **   ** **   ** 17   54 1   13
Jaipur 16   40   44.6 16   43   56.2 **   ** **   ** 19   05 2   24
Jalandhar 16   40   47.8 16   43   59.4 **   ** **   ** 19   13 2   32
Jammu 16   40   49.2 16   44   00.9 **   ** **   ** 19   19 2   38
Kanyakumari 16   40   37.4 16   43   48.9 **   ** **   ** 18   31 1   50
Kavalur 16   40   36.7 16   43   48.2 **   ** **   ** 18   31 1   50
Kavaratti 16   40   41.8 16   43   53.2 **   ** **   ** 18   53 2   12
Kohima 16   40   33.7 16   43   45.8 **   ** **   ** 17   49 1   08
Kolkata 16   40   34.2 16   43   46.0 **   ** **   ** 18   07 1   26
Kozikode 16   40   39.2 16   43   50.7 **   ** **   ** 18   42 2   01
Lucknow 16   40   40.8 16   43   52.6 **   ** **   ** 18   44 2   03

 

“** **” indicates the event occurs after sunset.

 

LOCAL CIRCUMSTANCES RELATING TO CERTAIN PLACES IN INDIA

 

Place Ingress

Exterior

contact

Ingress

Interior

contact

Egress

Interior

contact

Egress

Exterior

contact

Sunset Duration
h      m    s h      m    s h   m h   m
Madurai 16   40   36.9 16   43   48.4 **   ** **   ** 18   30 1   49
Mangalore 16   40   40.3 16   43   51.7 **   ** **   ** 18   48 2   07
Mount Abu 16   40   46.0 16   43   57.6 **   ** **   ** 19   14 2   33
Mumbai 16   40   43.6 16   43   55.1 **   ** **   ** 19   05 2   24
Murshidabad 16   40   35.1 16   43   47.0 **   ** **   ** 18   10 1   29
Muzaffarpur 16   40   37.7 16   43   49.6 **   ** **   ** 18   25 1   44
Mysore 16   40   38.6 16   43   50.0 **   ** **   ** 18   40 1   59
Nagpur 16   40   39.1 16   43   50.7 **   ** **   ** 18   42 2   01
Nasik 16   40   43.2 16   43   54.7 **   ** **   ** 19   03 2   22
Panaji 16   40   41.5 16   43   53.0 **   ** **   ** 18   55 2   14
Patna 16   40   37.4 16   43   49.3 **   ** **   ** 18   24 1   43
Pondicherry 16   40   36.0 16   43   47.5 **   ** **   ** 18   27 1   46
Port Blair 16   40   28.7 16   43   40.6 **   ** **   ** 17   35 0   54
Pune 16   40   42.6 16   43   54.1 **   ** **   ** 19   00 2   19
Puri 16   40   34.2 16   43   46.0 **   ** **   ** 18   14 1   33
Raipur 16   40   37.4 16   43   49.2 **   ** **   ** 18   33 1   52
Rajkot 16   40   46.9 16   43   58.3 **   ** **   ** 19   18 2   37
Ranchi 16   40   36.1 16   43   48.0 **   ** **   ** 18   20 1   39
Shillong 16   40   34.5 16   43   46.5 **   ** **   ** 17   59 1   18
Shimla 16   40   46.2 16   43   58.0 **   ** **   ** 19   06 2   25
Silchar 16   40   33.6 16   43   45.7 **   ** **   ** 17   54 1   13
Siliguri 16   40   36.5 16   43   48.4 **   ** **   ** 18   13 1   32
Silvassa 16   40   43.7 16   43   55.2 **   ** **   ** 19   05 2   24
Srinagar 16   40   50.4 16   44   02.1 **   ** **   ** 19   22 2   41
Sringeri 16   40   39.7 16   43   51.2 **   ** **   ** 18   46 2   05
Tamelong 16   40   33.6 16   43   45.7 **   ** **   ** 17   50 1   09
Thanjavur 16   40   36.2 16   43   47.7 **   ** **   ** 18   27 1   46
Thiruvanantapuram 16   40   38.1 16   43   49.5 **   ** **   ** 18   34 1   53
Udaipur 16   40   45.1 16   43   56.7 **   ** **   ** 19   10 2   29
Ujjain 16   40   42.8 16   43   54.4 **   ** **   ** 18   59 2   18
Vadodara 16   40   44.4 16   43   55.9 **   ** **   ** 19   07 2   26
Varanasi 16   40   38.5 16   43   50.3 **   ** **   ** 18   32 1   51

 

“** **” indicates the event occurs after sunset

 The last transit of Mercury occurred on 6 November, 2006 when just end of the event was visible from the extreme north eastern parts of India at the time of

sunrise.  The next transit of Mercury will take place on 11 November, 2019 but the event will not be seen from India as the same will begin after the sunset

time of all places in India. The transit of Mercury on 13 November, 2032 will be visible again from India.

 

The apparent diameter of Mercury will be nearly 12 arc-second which is 1/158 of Sun’s apparent diameter. Thus, it will be difficult to see the Mercury at

transit over the face of the Sun without optical magnification. This event can be viewed with the help of binocular or telescope attached with proper solar

filter or by making projection of the Sun’s image on a white board by telescope. The Sun should never be viewed with the naked eye. Safe technique to

observe is by using filter like aluminized mylar, black polymer or welding glass of shade number 14.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d