• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Political Parties

కుట్ర సిద్దాంతాల హల్‌చల్‌ : నాడు కమ్యూనిజం-నిన్న సోవియట్‌-నేడు చైనా బూచి !

10 Thursday Sep 2020

Posted by raomk in BJP, CHINA, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China Threat, conspiracy theories, Pentagon on China military


ఎం కోటేశ్వరరావు
మానవాళి చరిత్రలో రాజ్యము – అధికారము ఉనికిలోకి వచ్చిన తరువాత కుట్రలు, కుట్ర సిద్దాంతాలు వాటి వెన్నంటే తలెత్తాయి. అధికారం లేని వారు లేదా బలహీనులు కుట్ర సిద్ధాంత ఆశ్రయం పొందుతారు అన్నది కొందరి అభిప్రాయం. దీనికి విస్తృత అర్ధం, భిన్న భాష్యాలు చెప్పవచ్చు. వాటితో అందరూ ఏకీభవించాలని లేదు. ప్రపంచంలో నిరంతరం కుట్ర సిద్దాంతాలు పుడుతూ జనారణ్యంలో కలియ తిరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో అంశం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరోవిధంగా చెప్పాలంటేే వాటితో లబ్ది పొందాలనుకొనే బలమైన శక్తులు వాటిని ముందుకు తెస్తాయి.


కమ్యూనిజం ప్రపంచాన్ని ఆక్రమిస్తోంది, ప్రజాస్వామ్యాన్ని హరిస్తోంది కనుక దాన్ని అడ్డుకోవాలన్న కుట్ర సిద్దాంతాన్ని ముందుకు తీసుకువచ్చింది బలవంతులైన సామ్రాజ్యవాదులే. అది వాస్తవం కాదని గ్రహించలేని వారు దాన్ని నిజమే అని నమ్మి ఆ సిద్దాంతానికి ఊతమివ్వటాన్ని చూస్తున్నాము. తరువాత కాలంలో సోషలిస్టు సోవియట్‌ను బూచిగా చూపి భయపెట్టటం ఎరిగిందే. ప్రాంతీయంగా పశ్చిమాసియాలో ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను మారణాయుధాలను గుట్టలుగా పోసిన బూచాడిగా చూపిన వైనం మన కళ్ల ముందే జరిగింది. ఇప్పుడు చైనా బూచిని ముందుకు తెచ్చారు. దాన్ని అర్దం చేసుకోలేని వారు ఆశ్రయం ఇస్తున్నారు. కుట్ర సిద్దాంత వైరస్‌ ఒకసారి ఎవరిలో అయినా ప్రవేశించిందంటే అది కరోనా కంటే ప్రమాదకరంగా వ్యాపిస్తుంది. భౌతిక దూరాన్ని పాటిస్తే కరోనా మన దరిచేరదు. కానీ కుట్ర సిద్దాంత వైరస్‌కు అలాంటివేమీ ఉండదు. ఒకరి వాట్సాప్‌లో ప్రవేశించినా, చెవి అప్పగించినా చాలు ప్రపంచాన్ని చుట్టి వస్తుంది.


ప్రస్తుతం మన దేశంలో బిజెపి వంటి సంఘపరివార్‌ సంస్ధలు. మీడియా, సామాజిక మాధ్యమం చైనా బూచిని జనాల మెదళ్లకు ఎక్కిస్తున్నదా ? తమ అనుభవంలోకి వచ్చిన దాని బట్టి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. చైనా నుంచి ముప్పు వస్తోందంటూ అనేక దేశాలను రెచ్చగొడుతూ, కూడగడుతూ అంతర్జాతీయంగా అమెరికా అటువంటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. చైనా అణ్వాయుధాలు ప్రపంచానికి ఆటంకంగా ఉన్నాయని, నౌకా దళంలో చైనా తమను మించి పోయిందని అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగన్‌ తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇవి చైనా మిలిటరీ ముప్పు అనే కుట్ర సిద్ధాంత అంశాలే.
ఇలాంటి ప్రచారం అమెరికా ఉత్తిపుణ్యానికే చేయదు. రక్షణ ఖర్చును ఇబ్బడి ముబ్బడి చేసేందుకు దేశీయంగా పార్లమెంట్‌ మీద వత్తిడి తేవటం, ముప్పును ఎదుర్కోవాలంటే ఆయుధాలు సమకూర్చుకోవాలి, అంటే యుద్ద పరిశ్రమల కార్పొరేట్లకు జనం సొమ్మును కట్టబెట్టేందుకు మానసికంగా జనాన్ని ఒప్పించే ఎత్తుగడ దీనిలో ఉంది. మిలిటరీ రీత్యా చైనా విజయవంతంగా ఎన్నో మార్పులు చేసిందని పొగడటం అంటే అమెరికాలోని సామాన్యులను భయపెట్టటమే. ఇవన్నీ నిజానికి పాతబడిన విద్యలే. అమెరికన్లను బురిడీ కొట్టించేందుకు తమను తాము నిందించుకొనేందుకు సైతం సిద్ద పడతారు. దానితో వారికి పోయేదేమీ లేదు. ఉదాహరణకు అమెరికా నిద్రపోతుంటే చైనా ఆయుధాలతో ఎదిగిపోయింది అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో చేసిన వ్యాఖ్య దానిలో భాగమే. వాస్తవానికి అది అతిశయోక్తి తప్ప వేరు కాదు. రాచపీనుగ ఒంటరిగా పోదు అన్నట్లు, తామే కాదు తమ స్నేహితులు కూడా నిద్రపోయారని చెప్పాడు. అదే సమయంలో అమెరికా స్నేహితులు, అనుయాయులు కలిస్తే చైనా కంటే ఎంతో బలం కలిగి ఉన్నామని పాంపియో చెప్పాడు.ఇది చైనాను బెదిరించటం.


ఇటీవలి కాలంలో తాను నాయకత్వం వహిస్తున్న నాటో కూటమి ఖర్చును రక్షణ పొందుతున్న దేశాలే ఎక్కువ భాగం భరించాలని ట్రంప్‌ బహిరంగంగా వత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. తాము 70శాతం ఖర్చు చేస్తుంటే మొత్తం ఐరోపా సభ్యదేశాలు 30శాతమే చెల్లిస్తున్నాయని ట్రంప్‌ రుసురుసలాడాడు. అయితే ఖర్చు ఎక్కువ భాగం అమెరికన్‌ సిబ్బందికి, ఆయుధాలకే ఖర్చు అవుతున్నందున తాము అదనంగా చెల్లించాల్సిన పనిలేదని నాటో దేశాలు బదులిచ్చాయి. ఇప్పుడు చైనా బూచిని చూపటం అంటే ఆసియాలోని దేశాలకు రక్షణ కల్పిస్తున్న తమ ఖర్చులో సింహభాగాన్ని భరించాలని అమెరికన్లు కోరటమే.


ఖండాంతర, నియంత్రిత క్షిపణులను చైనా మిలిటరీ తయారు చేసిందని, అవి అమెరికాకు ముప్పు తెస్తాయని, రాబోయే పది సంవత్సరాలలో ఇప్పుడున్న రెండువందల అణ్వాయుధాలు రెట్టింపు అవుతాయని పెంటగన్‌ పేర్కొన్నది. నిజానికి ఏ దేశం దగ్గరైనా అలాంటి ఆయుధాలు ఎన్ని ఉన్నాయో మిలిటరీ ఉన్నతాధికారులందరికీ కూడా తెలియదు. ఊహాగానాలు తప్ప సంఖ్యను ఎన్నడూ బయట పెట్టరు. ఇలాంటి అంకెలన్నీ చీకట్లో బాణాలు వేయటం తప్ప మరొకటి కాదు. ” గతంలో చైనాకు క్షిపణులు ఎక్కువ అవసరం ఉండేది కాదు. కానీ చైనాను తన వ్యూహాత్మక పోటీదారుగా అమెరికా పరిగణిస్తున్నది. ఈ నేపధ్యంలో తగినన్ని ఆయుధాలను సమకూర్చుకోని పక్షంలో చైనా ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని ” పెంటగన్‌ నివేదిక గురించి చైనా రక్షణ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గమనించాల్సిన అంశం ఏమంటే తనకు అవసరం అనుకుంటే చైనా అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే అణ్వాయుధాలను తయారు చేయగల స్ధితిలో ఉంది. అయితే తన 140 కోట్ల జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరచే మహత్తర కృషికి అది ప్రాధాన్యత ఇస్తున్నది తప్ప వనరులను ఆయుధాల కోసం దుర్వినియోగం చేయటం లేదు.


క్షిపణులు లేదా రాకెట్ల ద్వారా ప్రయోగించే ఆయుధాల సంఖ్య ఎంత అన్నదాన్ని బట్టి ఒక దేశ సైనిక పాటవాన్ని లెక్కించటం ఒక పద్దతి. చైనా మరో రెండువందలను తయారు చేయనుంది గనుక తమకు ముప్పు అని అమెరికా చెబుతున్నది. కానీ తన దగ్గర దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న ఆయుధాలను యావత్‌ ప్రపంచానికి ముప్పుగానా లేక శాంతి కోసం తయారు చేసిందా ? స్టాక్‌హౌమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) 2020 వార్షిక నివేదిక అమెరికా మోహరించిన అణ్వాయుధాలు 1,750, ఇతరంగా 4,050, అమ్ముల పొదిలో మరో 5,800 ఉన్నాయని పేర్కొన్నది. రష్యాతో ఒప్పందంలో భాగంగా కొన్ని మధ్యంతర శ్రేణి ఆయుధాలను ఉపసంహరించిన తరువాత పరిస్ధితి ఇది. 2019లో అమెరికా స్వయంగా చెప్పినదాని ప్రకారం దాని దగ్గర మొత్తం 6,185 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో 2,385 వినియోగానికి స్వస్తి చెప్పారు లేదా నాశనం చేశారు. మోహరించిన ఆయుధాలు 1365. వీటిని చూపే అమెరికా ప్రపంచాన్ని భయపెడుతోంది. బయటకు వెల్లడించనివి ఎన్ని ఉన్నాయో తెలియదు. వాటి ముందు చైనా వద్ద ఉన్న ఆయుధాలెన్ని, అది తెచ్చే ముప్పు ఎంత ?


నిజానికి ఒక దేశం దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నా ఎదుటి దేశం మీద ప్రయోగిస్తే సర్వనాశనం తప్ప ఏ దేశమూ మిగలదు. చైనా దగ్గర కూడా గణనీయంగా అణ్వాయుధాలు ఉన్నాయి గనుకనే అమెరికా దూకుడు తగ్గిందన్నది వాస్తవం, అయితే మానసిక ప్రచారదాడి కొనసాగుతూనే ఉంటుంది.1980 దశకం నుంచీ చైనా వద్ద రెండువందలకు మించి అణ్వాయుధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. వాటి సంఖ్యను పెంచటం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం స్టాక్‌ హౌం సంస్ధ సిప్రి మరియు అమెరికన్‌ సైంటిస్ట్స్‌ ఫెడరేషన్‌ 320 ఉన్నట్లు జోశ్యం చెప్పాయి. కనుక పెంటగన్‌ కొత్తగా కనుగొన్నదేమీ లేదన్నది స్పష్టం.గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇప్పుడు చైనా ఒక్కటే ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని చెప్పిన దేశం. అంతే కాదు అణ్వాయుధాలు లేని దేశాల మీద వాటిని ప్రయోగించబోమని, బెదిరించబోమని కూడా ప్రకటించింది.


పెంటగన్‌ అంచనా ప్రకారం భూమి మీద నుంచి ఖండాంతరాలకు ప్రయోగించే క్షిపణులు చైనా వద్ద 1250కు పైగా ఉన్నాయి. అవి 500 నుంచి 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయని చెబుతోంది. అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ప్రకారం అమెరికా మధ్యంతర శ్రేణి క్షిపణుల తయారీ నిలిపివేసింది. చైనా బూచిని చూపి ట్రంప్‌ సర్కార్‌ ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి కొత్త క్షిపణులను పరీక్షిస్తోంది. ఈ చర్య మరింతగా ఆయుధ పోటీని పెంచేదే తప్ప తగ్గించేది కాదు. రాడార్లు పసి గట్టకుండా, ధ్వని లేకుండా వేగంగా ప్రయాణించే అమెరికన్‌ బాంబర్లను కూడా కూల్చివేయగల రష్యా ఎస్‌-400 దీర్ఘ శ్రేణి ఆయుధం అమెరికా దూకుడుకు అడ్డుకట్ట వేయనుంది. చైనా త్వరలో వీటన్నింటినీ అధిగమించే ఆయుధాలను రూపొందిస్తున్నదని పెంటగన్‌ నివేదిక పేర్కొన్నది.


చైనా నౌకాదళంలో 350 యుద్ద ఓడలు, జలాంతర్గాములున్నాయని, సంఖ్యరీత్యా ప్రపంచంలో పెద్దదని, కొన్ని రంగాలలో తమకంటే ముందున్నదని, తమ వద్ద 293 మాత్రమే ఉన్నాయని పెంటగన్‌ పేర్కొన్నది. ఇది కూడా మైండ్‌ గేమ్‌ తప్ప మరొకటి కాదు. అమెరికా వద్ద ఉన్న ఆధునిక యుద్ద ఓడలతో పోల్చితే చైనా బలం తక్కువే. అమెరికా వద్ద భారీ అణ్వాయుధాలను ప్రయోగించే పదకొండు బడా యుద్ద నౌకలు ఉన్నాయి. ఒక్కొక్కదాని మీద 80 యుద్ద విమానాలను ఉంచేంత పెద్దవి ఉన్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా నౌకాదళం విస్తరించినప్పటికీ అణ్వాయుధేతర విమానవాహక నౌకలు రెండు మాత్రమే ఉన్నాయి. వాటిలో క్షిపణులును కూల్చివేసే విధ్వంసక క్షిపణులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చైనా నిర్మిస్తున్న నౌకలు అమెరికా వద్ద ఉన్నవాటి కంటే పెద్దవిగా ఉండబోతున్నాయని పశ్చిమ దేశాలు జోశ్యాలు చెబుతున్నాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడని ఇప్పటికే చైనా అనేక రంగాలలో నిరూపించింది.


అమెరికా కనుసన్నలలో పని చేసే జపాన్‌, దక్షిణ కొరియా ఇటీవలి కాలంలో విమానవాహక నౌకలతో సహా అనేక భారీ యుద్ద నావలను రంగంలోకి దించాయి. చైనా దగ్గర ఉన్న చిన్న తరహా యుద్ద నావలు కలిగించే భారీ నష్టాన్ని పెంటగన్‌ పరిగణనలోకి తీసుకోవటం లేదని ఒక విశ్లేషకుడు వాపోయాడు, అమెరికాను హెచ్చరించాడు. వెయ్యి అంతకు పైగా టన్నుల సామర్ధ్యం ఉన్న తీర రక్షక గస్తీ నౌకలు చైనాలో గత పది సంవత్సరాలలో 60 నుంచి 130కి పెరిగితే అమెరికా వద్ద 70 మాత్రమే ఉన్నాయని,రెండు నుంచి ఎనిమిది లక్షల వరకు ఉన్న సైనీకీకరణ గావించిన చేపల పడవలను తక్కువ అంచనా వేయకూడదని పేర్కొన్నాడు.
పెంటగన్‌ నివేదిక వచ్చిన సమయంలోనే చైనా విమాన వాహక రెండవ యుద్ద నౌక షాండోంగ్‌ శిక్షణ విన్యాసాలను ప్రారంభించింది. ఇది గత ఏడాది డిసెంబరులో నౌకాదళంలో చేరింది. తొలి నౌక లయనింగ్‌ కూడా పచ్చ సముద్రంలో సంచరిస్తున్నది. ఒకేసారి రెండు యుద్ద నౌకలు విన్యాసాలు జరపటం ఇదే తొలిసారి. తైవాన్‌ నుంచి అమెరికా పిచ్చిపనులు చేసేట్లయితే సమన్వయంతో వాటిని అరికట్టేందుకు వీలుకలుగుతుందని వార్తలు వచ్చాయి. ఈ రెండు నౌకల సంచారం ఎందుకనే విషయాన్ని చైనా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే జోశ్యాలు వెలువడ్డాయి. షాండోంగ్‌ యుద్ద విమానాలతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, లయనింగ్‌ తన రేవు నుంచి ఎక్కువ దూరం ప్రయాణించనందున సాధారణ శిక్షణ కార్యక్రమాలకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. రెండు నౌకలు సమీపం నుంచి అదే విధంగా దూరం నుంచి సమన్వయం చేసుకోవటం గురించి కూడా పరీక్షలు జరుపుతాయి.


జాతీయ వాదం ప్రపంచానికి ఎంతటి చేటు తెచ్చిందో అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్ధాలతో మానవాళి చవి చూసింది. అందువలన జాతీయ వాదానికి గురైన ఏ జాతీ ప్రశాంతంగా లేదు, ప్రపంచాన్ని శాంతంగా ఉండనివ్వలేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. జాతీయ వాదం వేరు దేశభక్తి వేరు. జాతీయవాదాన్నే దేశభక్తిగా చిత్రించి జాతీయవాదాన్ని వ్యతిరేకిస్తున్న వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న రోజులివి.


బ్రిటీష్‌ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే నాడు జాతీయవాదం-దేశ భక్తి. నేడు అసలు సిసలు దేశభక్తులుగా చెప్పుకుంటున్న సంఘపరివార్‌కు నాడు అవి పట్టలేదు. ఒక దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత జాతీయవాదం ముందుకు వస్తే దాని స్వభావం భిన్నంగా ఉంటుంది. జర్మనీలో ముందుకు తెచ్చిన జాతీయవాదాన్ని నాజీలు దేశభక్తిగా ప్రచారం చేశారు. ఐరోపాలో ఉన్న జర్మన్‌లు, జర్మనిక్‌ భాష మాట్లాడేవారందరూ ఒకే దేశంగా ఉండాలి. జర్మన్‌ జాతి ఔన్నత్యాన్ని నెలకొల్పాలి. యూదులు, పోల్స్‌, రుమేనియన్లు అల్పజాతి వారు కనుక వారిని జర్మన్‌ గడ్డ నుంచి పంపివేయాలి. ఇదే నాజీల దేశభక్తి. దీన్ని ఆమోదించిన వారు జాతీయవాదులు, దేశభక్తులు.ఈ వాదాన్ని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, జర్మనీలో వారికి చోటు లేదు, ఇదీ తీరు. హిట్లర్‌ జాతీయ వాదాన్ని సమర్ధించిన వారు దేశభక్తులు, వ్యతిరేకించిన కమ్యూనిస్టులను జర్మన్‌ ద్రోహులని ఆరోజు చిత్రహింసల పాలు చేశారు.


చైనాతో మన సరిహద్దును బ్రిటీష్‌ వారి హయాంలో వివిధ సందర్భాలలో అధికారులు ఇష్టమొచ్చినట్లు గీశారు. ఒకరు గీసినదానిలో ఆక్సారుచిన్‌ చైనా ప్రాంతంగా మరొక దానిలో మనదిగా ఉంది. అదే విధంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ను టిబెట్‌ అంతర్భాగంగా, బ్రిటీష్‌ ఇండియా భాగంగా పేర్కొన్న సందర్భాలున్నాయి. స్వాతంత్య్రానికి ముందు ఆ ప్రాంతాన్ని బ్రిటీష్‌ ఇండియా సర్కార్‌ ఆధీనంలో ఉన్నదానిని టిబెట్‌ స్వాధీనం చేసుకున్న సందర్భాలున్నాయి. బ్రిటీష్‌ వారితో టిబెట్‌ పాలకులు చేసుకున్న ఒప్పందాలను వేటినీ చైనా పాలకులు అంగీకరించలేదు. తమ సామంత రాజ్యానికి అలాంటి హక్కులేదని వాదించారు. ఒప్పందాలు అమలు కూడా కాలేదు. సరిహద్దులను ఖరారు చేసుకోవాలని నాడు చైనా గానీ బ్రిటీష్‌ ఇండియా గానీ పూనుకోలేదు.


అంతెందుకు మన దేశంలో ఆశ్రయం పొందిన 14 దలైలామా 1959లో తిరుగుబాటు చేసి మన దేశానికి పారిపోయి రావటానికి ముందు అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో భాగమే అని చెప్పాడు. ఆ తరువాత 2003లో కూడా వాస్తవానికి అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌కు చెందిందని చెప్పాడు.


1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది, 1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. తరువాత కాలంలో సరిహద్దుల సమస్య ముందుకు వచ్చింది. రెండు దేశాలూ తమ వైఖరే సరైనదే అనే విధంగా వ్యవహరించాయి. దానికి తోడు దలైలామా సమస్య తోడై అది యుద్దానికి దారి తీసింది. వివాదం తెగలేదు. అయితే పరిష్కారం కావాలి, రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలి. అందుకు సంప్రదింపులు పరిష్కారం తప్ప ఆయుధాలు మార్గం కాదు. 1962లో యుద్ద సమయంలో అన్ని పార్టీలు జాతీయవాదానికి గురై చైనాను దురాక్రమణదారుగా పేర్కొని యుద్దాన్ని సమర్ధించాయి. సిపిఐ జాతీయ నాయకత్వం దీని గురించి ఒక వైఖరి తీసుకోవాల్సివచ్చింది. ఆ సమయంలో జరిగిన చర్చలలో కొందరు సరిహద్దు వివాదాన్ని సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించాలనే వైఖరిని పార్టీ ప్రకటించాలని ప్రతిపాదించారు. మిగిలిన వారు యుద్దాన్ని సమర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే వైఖరి తీసుకున్నారు. అప్పటికి సైద్దాంతిక విభేదాల గురించి చర్చ తప్ప పార్టీలో చీలిక లేదు. సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన పార్టీనేతలను, ఆ అభిప్రాయాన్ని బలపరిచిన వారిని దేశ వ్యాపితంగా నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైలుపాలు చేసింది. తరువాత వారంతా సిపిఎంగా ఏర్పడ్డారు.


దేశభక్తి పేరుతో రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ దాని రాజకీయ విభాగం జనసంఫ్‌ు, ఇతర సంస్దలు చైనా వ్యతిరేక వైఖరిని తీసుకొని, యుద్దాన్ని వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించాయి. కానీ తరువాత కాంగ్రెస్‌ పాలకులు, జనతా పార్టీలో చేరి అధికారంలో భాగస్వాములైన జనసంఘనేతలు, తరువాత బిజెపిగా అధికారానికి వచ్చిన వారూ చేసిందేమిటి ? సరిహద్దు సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని, రెండు వైపులా తుపాకులు పేల కూడదని ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు కారణాలు ఏమైనా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మరోసారి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ఇతర సంస్ధల నేతలు చైనా వ్యతిరేక ప్రచారాన్ని పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. దానికి మీడియా తోడైంది సరే. 1962లో యుద్దాన్ని సమర్దించి జాతీయవాదానికి గురైన సిపిఐ ఇప్పుడు ఆ వైఖరిని సవరించుకున్నది. సిపిఎం మాదిరే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనే వైఖరినే తీసుకున్నది.
అనేక దేశాలలో కమ్యూనిస్టులు ఇలాంటి సమస్యలు వచ్చినపుడు జాతీయవాదానికి లోను కాకుండా ఒక సూత్రబద్ద వైఖరిని తీసుకున్నారు. పాలస్తీనాను ఆక్రమించి స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా అడ్డుకుంటున్న పాలకుల వైఖరిని ఇజ్రాయెల్‌ కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తున్నది. అక్కడి యూదుదురహంకారులు కమ్యూనిస్టులను దేశద్రోహులని నిందిస్తున్నా, దాడులకు పాల్పడినా కమ్యూనిస్టులు తమ వైఖరిని మార్చుకోలేదు.


చైనాతో సరిహద్దు వివాద పరిష్కారానికి శాంతియుత చర్చలు-ఇచ్చిపుచ్చుకోవటాలు తప్ప మరొక పరిష్కారం అసాధ్యం. ఈ విషయం ప్రతిపార్టీకీ తెలుసు. అయినప్పటికీ పైకి జాతీయవాదాన్ని ముందుకు తెస్తున్నాయి. మే, జూన్‌ మాసాలలో కొత్తగా చైనా వారు మన భూభాగాన్ని ఆక్రమించుకున్నారని చెప్పారు. తీరా మన ప్రధాని అఖిలపక్ష సమావేశంలో అబ్బే అలాంటిదేమీ లేదు అని ప్రకటించారు. తాజాగా మన ప్రాంతాన్ని ఆక్రమించుకొనేందుకు వస్తున్న చైనా వారిని పసిగట్టిన మన మిలిటరీయే చొరవ తీసుకొని కొన్ని కొండలను ఆధీనంలోకి తెచ్చుకుందని ప్రకటించారు. అసలేం జరుగుతోంది అన్నది తెలియటం లేదు.


యుద్దం వద్దు అన్న వారిని మన మిలిటరీ సత్తాను అవమానించే వారిగా చిత్రిస్తూ దాడి చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ శక్తి అమెరికా. అలాంటి దేశం జరిపిన యుద్దాలలో ఎక్కడైనా విజయం సాధించిందా ? అలాంటపుడు చైనా మనలను గానీ, మనం చైనాను గానీ యుద్ధంలో ఓడించి సమస్యలను పరిష్కరించుకోగలమా ? మన దగ్గర ఉన్న నాలుగు రూకలను అటు అమెరికా లేదా రష్యా మరొక దేశం నుంచో కొనుగోలు చేసే ఆయుధాలకు సమర్పించుకోవటం తప్ప మరొకటేమైనా జరుగుతుందా ? మన ప్రాంతాలను చైనాకు అప్పగించాలని ఎవరూ కోరటం లేదు. గతంలో లేదు భవిష్యత్‌లో కూడా ఉండదు. దేశభక్తి గురించి ఏ పార్టీ మరొక పార్టీకి బోధలు చేయాల్సిన,నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భిన్న అభిప్రాయం వ్యక్తం చేసినంత మాత్రాన ఎవరూ దేశద్రోహులు కాదు. ఉద్రేకాలకు లోనుకాకుండా ఆలోచించాల్సిన సమయమిది. గతంలో ప్రపంచంలో జరిపిన అనేక యుద్దాలు ఆయా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు లేదా జాతీయ దురహంకారంతో చేసినవే. అలాంటి వైఖరికి జనం మూల్యం చెల్లించాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పబ్‌జీపై దాడిలో మోడీజీ నిజాయితీ ఎంత ?

04 Friday Sep 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Science, USA

≈ 1 Comment

Tags

India apps ban, India PUBG, Modi’s surgical strike on PUBG, PUBG


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ మరో 117 చైనా యాప్‌లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్‌టాక్‌ మరో 58 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్ధితి ఎలా ఉందంటే ప్రభుత్వం ఏమి చెప్పినా మనం తలూపాల్సిందే, లేకపోతే దేశద్రోహుల కింద లెక్క. చెప్పిందాన్ని నోరెత్తకుండా అంగీకరించటమే దేశభక్తి. ఆ యాప్‌లతో పాటు అమెరికా, ఐరోపా దేశాలలో తయారైన ఎన్నో ఎంతో కాలం నుంచి వినియోగంలో ఉన్నాయి. ప్రతి యాప్‌ వినియోగదారుల సమాచారాన్ని ఏదో ఒక దేశానికి లేదా కార్పొరేట్‌ కంపెనీలకు, గూఢచార సంస్థలకు చేరవేస్తున్నవే అన్నది అవునన్నా కాదన్నా తిరుగులేని సత్యం. యాప్‌లందు చైనా యాప్‌లు వేరయా అంటారా ? అయితే వాటి ముప్పు గురించి ఇప్పటి వరకు తెలియదా ? చైనా యేతర దేశాల యాప్‌లు దేశ రక్షణకు ఉపయోగపడుతున్నాయా అని ఎవరైనా అడిగారో అంతే సంగతులు, బూతులతో దాడి చేసేందుకు అసలు సిసలు దేశ భక్తులం మేమే అని తమకు తామే కితాబులు ఇచ్చుకొని, కీర్తి కిరీటాలను స్వయంగా తల మీద పెట్టుకున్న గుంపులు సిద్దంగా ఉంటాయి. అయినా విమర్శనాత్మకంగా చూడక, ప్రశ్నించక తప్పదు !


దేశ రక్షణకే కాదు, సామాజిక భద్రతకు సైతం ముప్పుగా పరిణమించిన వాటి మీద చర్య తీసుకోవాల్సిందే. రాజీ పడకూడదు. ఎవరైనా కోరుకొనేది అదే ! అలాంటి వైఖరి, చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉందా అన్నది చూద్దాం. పబ్‌జీ వీడియో గేమ్‌కు రూపకల్పన చేసింది ఐరిష్‌ జాతీయుడు. దాన్ని తీసుకొని తయారు చేసింది దక్షిణ కొరియా కంపెనీ. చైనా అతి పెద్ద మార్కెట్‌ కనుక దానిలో ప్రవేశించి సొమ్ము చేసుకోవాలని కొరియా కంపెనీ చైనా కంపెనీ టెన్సెంట్‌తో ఒప్పందం చేసుకొని పదిశాతం వాటా ఇచ్చింది. కంప్యూటర్లలో ఉపయోగించేది ఒకటైతే సెల్‌ఫోన్లలో ఉపయోగించే రకం మరొకటి. దాన్ని టెన్నెంట్‌ తయారు చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెల్‌ఫోన్లలో ఆడేదాన్ని మాత్రమే నిషేధించింది. కంప్యూటర్లలో శుభ్రంగా ఆడుకోవచ్చు. సెల్‌ఫోన్ల ద్వారా వినియోగదారుల సమాచారం చైనాకు అందకూడదు, కానీ కంప్యూటర్ల ద్వారా దక్షిణ కొరియాకు చేరవచ్చు అని పరోక్షంగా నరేంద్రమోడీ సర్కార్‌ చెబుతున్నది. దక్షిణ కొరియా అమెరికా అడుగుజాడల్లో నడిచే దేశం. తాను సేకరించిన సమాచారాన్ని అమెరికాకు ఇవ్వకూడదు అన్న హామీని మన ప్రభుత్వం తీసుకున్నదా ? తెలియదు, తీసుకున్నట్లు ప్రభుత్వమూ చెప్పలేదు.


పబ్‌జి ద్వారా వినియోగదారుల సమాచార తస్కరణ ఒక సమస్య అయితే సామాజికంగా తలెత్తే లేదా జరిగే హాని అంతకంటే పెద్దది. మరి ఈ అంశం గురించి మోడీ సర్కార్‌ వైఖరి ఏమిటి ? 2017లో పబ్‌జీని చైనాలో ప్రవేశపెట్టారు. కాని దానిలో ఉన్న అంశాలు యువతను తప్పుదారి పట్టించేవిగానూ, హింసాత్మక ధోరణులకు పురికొల్పేవిగా ఉండటంతో చైనా 2018లోనే నిషేధించింది. మన దేశంలో అనేక కోర్టుల్లో దీనికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నరేంద్రమోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లోని రాజధాని అహమ్మదాబాద్‌, రాజకోటలో తాత్కాలికంగా నిషేధించారు. గత ఏడాదే దీని గురించి పలు రాష్ట్రాల్లో చర్చలు జరిగాయి. విద్యార్ధుల పాలిట మత్తు మందుల వంటివి, హాని కలిగిస్తున్నాయి, పిల్లల్లో హింసాత్మక ధోరణులు పెరుగుతున్నాయి అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల మానసిక సమస్యలు కూడా తలెత్తాయి. అవేమీ కేంద్ర ప్రభుత్వ దృష్టిలో లేవా ?


అంతెందుకు ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఆ దుష్ఫలితాల గురించి తెలుసు ! మహారాష్ట్రలో ఈ ఆటను నిషేధించాలని, దేశంలో సమీక్ష జరిపేందుకు నైతిక నియమావళి కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ముంబై హైకోర్టులో పదకొండు సంవత్సరాల బాలుడు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. ఆ పిల్లవాడి తరఫున స్వయంగా న్యాయవాది అయిన అతని తల్లి కోర్టుకు హాజరు అవుతున్నది. ప్రధాని నరేంద్రమోడీ విద్యార్ధులు, తలిదండ్రులతో గతంలో మాటా మంతీ జరిపిన సమయంలో ఒక తల్లి మాట్లాడుతూ తన కుమారుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిస అయ్యాడని వాపోయింది. అప్పుడు ప్రధాని మాట్లాడుతూ అతను పబ్జివాలానా ఏమిటి అని ప్రశ్నించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్‌ (ప్రచారం) అయింది. ఈ కేసులో ఆ ఉదంతాన్ని కూడా పిటీషన్‌లో కోర్టు దృష్టికి తెచ్చారు.


హింసాత్మక ధోరణులను పెంచే అంశాలపై సమీక్ష జరిపే నైతిక నియమావళి కమిటీ సమీక్షలో పబ్‌జీ ఆట ప్రమాదకరమని భావించి ఆ కమిటీ చైనాలో నిషేధించాలని సిఫార్సు చేసింది, దాన్ని అక్కడ అమలు జరిపారు. మన దేశంలో కూడా అలాంటి కమిటీని వేసి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ముంబై కేసులో పిటీషనరు ప్రశ్నించాడు. ఇలాంటి ఆటలే పిల్లల మీద ప్రతికూల ప్రభావాలు చూపుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక నివేదికలో హెచ్చరించిన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. అంతే కాదు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ కూడా పబ్జీ ఆట నిషేధానికి తీసుకున్న చర్యల గురించి నివేదిక ఇమ్మని కేంద్రాన్ని కోరింది. పబ్‌జీని జూదంగా మార్చి ఆడుతున్న పెద్ద వారిని గుజరాత్‌లో పోలీసులు అరెస్టులు కూడా చేశారు.


చైనా కమ్యూనిస్టు దేశం, నియంతృత్వం ఉంటుంది, అక్కడ ఏమైనా చేయగలరు, మనది ప్రజాస్వామిక దేశం అక్కడ చేస్తున్న మాదిరి ఇక్కడ చేయటం కుదరదు అనే వాదన ఇటీవల అనేక సందర్భాలలో కొందరు ముందుకు తెస్తున్నారు. బాధ్యతను తప్పించుకొనేందుకు అదొక సాకు తప్ప మరొకటి కాదు. తప్పుదారి పడుతున్న పిల్లలను సరైన దారిలోకి తెస్తామంటే ప్రజాస్వామ్యం అడ్డుకుంటుందా ? ఒక వేళ అడ్డుకునేట్లయితే భావి తరాలను చెడగొట్టే అలాంటి ప్రజాస్వామ్యం మనకెందుకు ? పబ్‌జి యాప్‌ను నిషేధిస్తే చైనా కంపెనీ టెన్సెంట్‌కు లక్ష కోట్ల రూపాయల నష్టమని కొందరు చెబుతున్నారు. పదిశాతం వాటా ఉన్న కంపెనీకే అంతనష్టమైతే తనదని కూడా చూసుకోకుండా చైనా కమ్యూనిస్టులు దాన్ని నిషేధించారు. మరి మన ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు కొనసాగనిచ్చినట్లు ? పోతే పోనీయండి పిల్లలు ఏమైతే మాకేం అని పాలకులు అనుకుంటున్నారా ?


2018 మార్చినెల తరువాత తొమ్మిది నెలల కాలంలో చైనా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క వీడియో గేమ్‌ను కూడా అమ్మకానికి అనుమతించలేదని ఆ విధానాన్ని 2019లో కూడా కొనసాగిసాంచవచ్చని 2018 డిసెంబరు 13న ఒక పత్రికలో కెవిన్‌ వెబ్‌ అనే విలేకరి రాశారు. ప్రభుత్వ విధానాలకు వీడియో గేమ్‌లు ఉన్నాయా లేదా అని పరిశీలించి అభిప్రాయం చెప్పేందుకు ఒక నైతిక నియమావళి కమిటీని కూడా చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నైతికత గురించి కబుర్లు చెప్పే మన పాలకులు ఇంతవరకు అలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదు. సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు అనే హాంకాంగ్‌ నుంచి వెలువడే పత్రికను నడుపుతున్నది కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్టుల పట్ల దానికి సానుభూతి కూడా ఉన్నట్లు మనకు కనపడదు. అలాంటి పత్రిక రాసిన కథనం ప్రకారం 2018 మార్చినెలలో హింసాత్మక, ఇతరంగా దురుసుగా వ్యవహరించటాన్ని ప్రోత్సహించే సినిమాలు, వీడియోగేమ్‌లు, యూ ట్యూబ్‌ సీరీస్‌ లేదా చిత్రాలను, నూతన మీడియా విభాగం కిందికి వచ్చే అన్నింటినీ సమీక్షించేందుకు చైనా సర్కార్‌ ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దాన్నుంచి అనుమతులు వచ్చే వరకు కొత్త వాటిని వేటినీ అంగీకరించకూడదని నిర్ణయించింది.అంతకు ముందు అనుమతించిన వాటి మీద కూడా ఆంక్షలు విధించింది.


చైనా సెంట్రల్‌ టీవీ ( మన దూరదర్శన్‌ వంటిది) వెల్లడించిన సమాచారం ప్రకారం నైతిక విలువల సమీక్ష కమిటీ 20గేమ్‌లను సమీక్షించి తొమ్మిదింటిని తిరస్కరించింది. మిగిలిన వాటిలో మార్పులను సూచించింది. కొన్ని వీడియో గేమ్‌లు పిల్లలను వ్యసన పరులుగాను, పని పాటలు లేని వారిగానూ మారుస్తాయనే విమర్శ చైనాలో వచ్చింది. 2018లో వీడియో గేమ్‌లపై 34 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసినట్లు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో గేమ్స్‌ తయారీ సంస్ధ చైనా కంపెనీ టెన్సెంట్‌. చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన దాని ఆదాయం 200 బిలియన్‌ డాలర్లు పడిపోయింది. పిల్లలు అదే పనిగా గేమ్స్‌లో మునిగి పోకుండా ఉండేందుకు వారిని గుర్తించి వ్యవధిని పరిమితం చేసే అంటే నిర్ణీత వ్యవధి తరువాత గేమ్‌లు ఆగిపోయే విధంగా సాప్ట్‌వేర్‌లో మార్పులు కూడా టెన్సెంట్‌ కంపెనీ చేసింది. చైనాను ఆర్ధికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే మన సర్కార్‌ యాప్‌లను నిషేధించింది. కానీ అంతకంటే ముందే చైనా తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తమ కంపెనీకి ఎంత నష్టం వచ్చినా ఆ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ నేత అనుకుంటున్న నరేంద్రమోడీ లేదా ఆయన సలహాదారులు, పెద్ద యంత్రాంగం వీటన్నింటినీ గమనిస్తున్నదా ? నిజంగా గమనిస్తే పబ్‌జీ వంటి ప్రమాదకరమైన వీడియో గేమ్‌ల మీద చర్య తీసుకొనేందుకు సరిహద్దులో చైనాతో సమస్య వచ్చేంత వరకు ఆగాలా ? అందువలన పబ్‌జీ గురించి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి తెలియని విషయము కాదు అన్నది స్పష్టం. తలిదండ్రులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, కోర్టులలో కేసులు ఎందుకు దాఖలు అవుతున్నాయో పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా ? కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు చైనాను దెబ్బతీసేందుకు నిషేధం అని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. అందుకే చిత్తశుద్ధి సమస్య ముందుకు వస్తున్నది. జాతిని ఏకత, శీలముతో నిర్మిస్తాము అని చెప్పుకొనే సంఘపరివార్‌ కుటుంబంలో పెరిగిన వారే ఇప్పుడు దేశంలోని అని ప్రధాన పదవులలో ఉన్నారు. పబ్‌జీ గాక పోతే దాని తాతల వంటి ప్రమాదకర వీడియో గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి, మరి వాటి సంగతేమిటి ?


ప్రపంచంలో ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం మీద కొత్త యుద్దం మొదలైంది. పది సంవత్సరాల క్రితం వరకు చైనా ఈ రంగంలోకి వస్తుందని లేదా తమకు పోటీ ఇస్తుందని అమెరికా వంటి దేశాలు ఊహించలేదు. చైనా వారికి తెలివి తేటలు లేవు, ఫ్యాక్టరీల్లో గొడ్డు చాకిరీ చేస్తారు గానీ వారికి ఆంగ్లం రాదు, ఆంగ్లం రాకుండా కృత్రిమ మేథలో ప్రవేశించలేరు అన్న భ్రమలున్నవారికి దిమ్మతిరిగేలా చైనా ముందుకు వచ్చింది. రాజకీయ రంగంలో ఎవరు ఎటు వుండాలో తేల్చుకోవాల్సిన సమయాల మాదిరి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన పోటీలో కూడా అమెరికా – చైనాల మధ్య ఏ పక్షంలో ఉండాలో దేశాలూ, కంపెనీలు తేల్చుకోవాల్సిస తరుణం వచ్చిందని అమెరికా మీడియా సంస్ధ సిఎన్‌ఎస్‌ విశ్లేషకులు జిల్‌ దిసిస్‌ జూలై11న రాసిన దానిలో పేర్కొన్నారు. ఫలానా యాప్‌, పరికరం ఫలానా దేశానిది అయితే కొనవద్దు అనే ఆంక్షలకు, ఇతర దేశాల మీద వత్తిళ్లకు శ్రీకారం చుట్టింది అమెరికా. ఇది రాబోయే రోజుల్లో పెట్టుబడిదారీ దేశాల్లోనే కొత్త విబేధాల సృష్టికి నాంది పలకటం ఖాయం.


అమెరికాతో సహా అనేక దేశాలు చైనాతో వాణిజ్యలోటులో ఉన్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు రాజకీయంగా చైనా వ్యతిరేక శిబిరంలో ఉన్న ఆస్ట్రేలియా, జపాన్‌, జర్మనీ, దక్షిణ కొరియా,బ్రెజిల్‌, సౌదీ అరేబియా, స్విడ్జర్లాండ్‌, ఒక దేశం కాకున్నా తైవాన్‌ ప్రాంతం చైనాతో వాణిజ్యంలో మిగుల్లో ఉన్నాయి. అందువలన ఎవరు ఎటు ఉండాలో తేల్చుకోవాల్సిన స్ధితే వస్తే ఈ దేశాల్లో ఉన్న కార్పొరేట్‌ సంస్ధలు నష్టాలు మూటగట్టుకొని లేదా మడి గట్టుకొని చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంటాయా లేక అనుకూల వైఖరిని తీసుకుంటాయా అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు రావటం అనివార్యం.తటస్ధ వైఖరి తీసుకున్నా అది అమెరికాకు ఓటమే అవుతుంది. టిక్‌టాక్‌ యాప్‌ చైనా కంపెనీది అయినప్పటికీ దాని సిఇఓ అమెరికన్‌. మన దేశం దాన్ని నిషేధించిన తరువాత మా భద్రతకు సైతం ముప్పే అంటూ అమెరికా పల్లవి అందుకుంది. నిజంగా ముప్పు అనుకుంటే చైనా కంపెనీకి ఒక అమెరికన్‌ సారధ్యం వహించటం నిజంగా ఆశ్చర్యమే. అదే అమెరికా దాన్ని తమ దేశంలోని కార్పొరేట్లకు విక్రయించాలని కోరిన విషయం కూడా తెలిసిందే.


ప్రస్తుతం యాప్‌ల తయారీలో ప్రపంచ వ్యాపితంగా తీవ్ర పోటీ నెలకొన్నది. యాప్‌లు వస్తువులను తయారు చేయవు. వాటిని మార్కెటింగ్‌ చేసేందుకు ఉపయోగపడతాయి. వినోదం లేదా సమాచారం, ఆటల వంటి వాటిని వినియోగదారులకు చేరుస్తాయి. వాటి ద్వారానే డబ్బు సంపాదించవచ్చు. ఇటీవలి కాలంలో చైనాలో పెరుగుతున్న లేదా కొత్తగా పుట్టుకు వస్తున్న బిలియనీర్లు ఈ రంగం నుంచి వచ్చిన వారే అత్యధికులు. ఇప్పుడు యాప్‌ల సునామీని ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ విభాగాన్ని విశ్లేషిస్తున్నవారు చెబుతున్నమాట. యాప్‌ అనీ అనే ఒక సంస్ధ రూపొందించిన నివేదిక ప్రకారం 2020 తొలి ఆరు నెలల కాలంలో ప్రపంచ యాప్‌ ఆర్ధిక వ్యవస్ధలో మొబైల్‌ యాప్స్‌ మరియు గేమ్స్‌ మీద 50 బిలియన్‌ డాలర్ల మేర వినియోగదారులు ఖర్చు చేశారు.అంతకు ముందు ఆరునెలలతో పోలిస్తే పదిశాతం ఎక్కువ. ప్రపంచ వ్యాపితంగా కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపధ్యంలో మే నెలలో రికార్డు స్ధాయిలో 9.6బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ప్రపంచ వ్యాపితంగా 1.6లక్షల కోట్ల గంటల పాటు వినియోగదారులు ఆరునెలల కాలంలో మొబైల్స్‌తో కాలక్షేపం చేశారని అంచనా.రానున్న రోజుల్లో కొత్త అంశాలతో పాటు ప్రత్యక్ష ప్రసారాలను చూసేందుకు వినియోగదారులు పోటీ పడతారని భావిస్తున్నారు. ప్రపంచ యాప్‌ల సునామీకి, అమెరికా-చైనాల పోటీకి ఇదే కారణం.


కరోనా వైరస్‌ ఒక వైపు ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తున్నది అన్నది ఒక చేదు నిజం. ఇదే సమయంలో గతంలో ఏ వైరస్‌ చూపని ప్రభావం జన జీవితాల మీద చూపుతున్నది అంటే అతిశయోక్తి కాదు. సెల్‌ ఫోన్‌ లేకుండా రోజువారీ జీవనం గడవదు అనుకొనే పరిస్ధితి రావటానికి కరోనా వైరస్‌ ముందు పది సంవత్సరాలు పడుతుందని అని అంచనా వేశారు అనుకుందాం. కరోనా ఆ వ్యవధిని రెండు మూడు సంవత్సరాలు తగ్గించి వేసిందని తాజా అంచనా. కొద్ది సంవత్సరాల క్రితం పుడుతున్న పిల్లలు ముందు అమ్మా అనటం కంటే అమ్మాయి అంటున్నారని జోక్‌లు పేలాయి. చందమామను చూపి పిల్లలకు తిండి తినిపించే తల్లులు పాత సినిమాలు, కథల్లో మాత్రమే కనిపిస్తారు. సెల్‌ ఫోన్లు చూపి తినిపించే వారు ఎక్కడ చూసినా మనకు దర్శనమిస్తున్నారు. కరోనా ఈ పరిణామాన్ని మరింత వేగవంతం కావించింది. సెల్‌ ఫోన్‌ లేకుండా బడికి వెళ్లం అని పిల్లలు మారాం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.


ఇప్పటికే టెలికాం రంగంలో చైనా దూసుకుపోతున్నది. ఐదవతరం ఫోన్ల సాంకేతిక పరిజ్ఞానంలో చైనా హువెయి కంపెనీ ముందున్నది. భద్రతా కారణాలను సాకుగా చూపి దాని పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేయవద్దని అమెరికా తన అనుంగు దేశాలను ఆదేశిస్తున్నది. యాప్‌లను కూడా ఇదే సాకుతో అడ్డుకో చూస్తున్నది. గాల్వన్‌ లోయ ఉదంతాలకు ముందు మన దేశానికి టిక్‌టాక్‌, పబ్‌జి, తదితర చైనా యాప్‌ల నుంచి ముప్పు ఉందని ప్రభుత్వం చెప్పలేదు. వెనెజులా, ఇరాన్‌ మీద కక్ష గట్టిన అమెరికా మనదేశాన్ని తన వైపు తిప్పుకుంది. అమెరికా బెదిరింపులకు లొంగి మనం ఆ రెండు దేశాల నుంచి చమురు కొనుగోలు ఆపి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాము. ఐదవతరం టెలికాం టెక్నాలజీ విషయంలో కూడా ఇదే వైఖరి తీసుకున్నాము.చైనా కంపెనీలను టెండర్లలో పాల్గొన కుండా నిషేధించటంతో పాటు పెట్టుబడులను కూడా అడ్డుకుంటూ నిబంధనలను రూపొందించారు. మనం చైనా వ్యతిరేక శిబిరం అంటే అమెరికా టెంట్‌లోకి దూరేందుకు గాల్వన్‌ లోయ ఉదంతాలు ఒక సాకు తప్ప మరొకటి కాదు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


ఒక నాడు కృత్రిమ మేధ రంగంలో ఐబిఎం, ఆపిల్‌, మైక్రోసాప్ట్‌ వంటి అమెరికన్‌ కంపెనీలు తప్ప మరొక పేరు వినిపించేది కాదు. ఇప్పటికీ అవి రంగంలో ఉన్నప్పటికీ చైనా కంపెనీలు ముందుకు దూసుకు వచ్చాయి. మేడిన్‌ చైనా 2025 పేరుతో చైనా ఉన్నత స్ధాయి సాంకేతిక పరిజ్ఞానంలో పట్టుసాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. పశ్చిమ దేశాల మీద ఆధారపడకూడదనే ప్రధాన అంశం దానిలో ఉంది. అందుకే తీగలతో పనిలేని ఫోన్లు, ఇంటర్నెట్‌, మైక్రోచిప్స్‌, రోబోరంగంలో బిలియన్ల డాలర్లను పెట్టుబడులుగా పెడుతున్నది.2019లో చైనా చేసుకున్న దిగుమతుల్లో పదిహేను శాతం లేదా 306 బిలియన్‌ డాలర్ల విలువగల చిప్‌సెట్లను చైనా దిగుమతి చేసుకుంది. ఈ నేపధ్యంలోనే తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తస్కరిస్తున్నది అనే ఒక తప్పుడు ప్రచారాన్ని ట్రంప్‌ ప్రారంభించాడు.అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి తమకు సాంకేతిక పరిజ్ఞానం అందదు అనే నిర్ణయానికి చైనా వచ్చింది. పైన చెప్పుకున్నట్లు పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా అభివృద్ధి పిలుపుకు నేపధ్యం ఇదే.


ప్రపంచంలో తొలి సారిగా అణుబాంబును తయారు చేసింది, ప్రయోగించి భయపెట్టింది అమెరికా. అయితే నాటి సోవియట్‌ నేత స్టాలిన్‌ తాపీగా బాంబును తయారు చేయించి, అంతరిక్ష ప్రయోగాలకు అంకురార్పణ చేసి ముందుకు పోయిన విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవటం తప్పుకాదు. తన వాణిజ్య ప్రయోజనాల కోసం టిక్‌టాక్‌ లేదా పబ్‌జి, మరొక కంపెనీ ఏదైనా చైనాకు దూరంగా జరిగినా ఆశ్చర్యం లేదు. అయినప్పటికీ వారికి వచ్చే నష్టం లేదు. కొత్త కంపెనీలను రంగంలోకి తెస్తారు తప్ప అయ్యో అంతా అయిపోయిందని చేతులు ముడుకు కూర్చోరు. సాంకేతిక రంగంలో చైనా ఏమీ లేని స్దితి నుంచి ప్రారంభం అయిందని గుర్తుంచుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కల్పిత వార్తలతో జనాలకు కహానీలు చెబుతున్న మీడియా !

03 Thursday Sep 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

#media lies on China, fake news, fake stories in media, media lies, Trump lies

ఎం కోటేశ్వరరావు


పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన చెప్పినట్లుగా మీడియాలో నిజాయితీగల మీడియా వేరయా అని చెప్పుకోవాల్సిన రోజులు దాపురించాయి. మీడియాలో పని చేసే వారి గురించి చెప్పనవసరం లేదు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులు పలుకుతుందన్నట్లుగా ఏ మీడియాలో పని చేస్తే దాని యాజమాన్యానికి అనుగుణంగా రాయాలి, చూపాలి తప్ప పని చేసే వారికి వాస్తవాలతో పని లేదు. అందుకే మీడియా అన్నా వాటిలో పని చేసే వారన్నా విశ్వసనీయత లేని వారిగా పరిగణిస్తున్నారు.


మే, జూన్‌ మాసాలలో భారత-చైనా సరిహద్దుల్లో జరిగిన విచారకర పరిణామాల్లో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు మరణించారు, 73 మంది గాయపడ్డారు, పది మంది చైనా సైనికులకు బందీలుగా పట్టుబడ్డారు. మన సైనికులు కూడా చాలా మంది చైనీయులను చంపారని, బందీలుగా పట్టుకున్నారని చెప్పటం తప్ప అటువైపు నుంచి ఎలాంటి నిర్ధారణలు లేవు. మరణించిన వారి గురించి చైనా ప్రభుత్వం బయట పెట్టటం లేదని, కుటుంబ సభ్యుల నోరు నొక్కివేసిందని మన మీడియా చెబుతోంది. పోనీ అది నిజమే అనుకుందాం. గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతంలో మన వారు 20 మంది మరణించటం తప్ప బందీలుగా ఎవరూ లేరని మన అధికారులు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ తరువాతే చైనా తన దగ్గర ఉన్న పదిమంది మన సైనికులను మనకు బహిరంగంగా అప్పగించింది. మన వారెవరూ బందీలుగా లేరని చెప్పిన తరువాత ఆ పదిమందిని చంపినా మన వారు నోటితో సహా అన్నీ మూసుకోవటం తప్ప చేసేదేమీ లేదు. అయినా చైనా మనవారిని మనకు అప్పగించింది.


అప్పటి వరకు మన మీడియా అల్లిన కథలకు బందీల అప్పగింత చెంపదెబ్బ అయింది. అన్నింటికీ మించి మన భూ భాగాలను చైనా అన్ని కిలోమీటర్లు ఆక్రమించింది, ఇన్ని కిలోమీటర్లు ఆక్రమించింది అని స్వయంగా చూసి వచ్చినట్లుగా మీడియా రాసింది, చూపింది. చర్చలు చేసింది, చైనా వ్యతిరేక విషాన్ని నూరిపోసింది. దేశ భక్తిని ఎంత ఎక్కువగా ప్రదర్శించుకొంటే ఒక నాడు అంత గొప్పగా ఉండేది. ఇప్పుడు చైనా వ్యతిరేకతను ఎంత ఎక్కువగా రెచ్చగొడితే అంత దేశ భక్తి అన్నట్లుగా మీడియా పోటీ పడి కేంద్ర పాలకుల మెప్పు పొందేందుకు ప్రయత్నించింది. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చైనా వారు మన ప్రాంతాలను ఆక్రమించలేదు అని చెప్పి మీడియాను బకరాను చేశారు. మీడియా ప్రచారాన్ని నమ్మి పైత్యం తలకెక్కించుకున్న వారి పరిస్ధితి తేలు కుట్టిన దొంగల మాదిరి తయారైంది.


రెండు దేశాల మధ్య ఎవరికీ చెందని ప్రాంతం కొంత ఉంది, దాన్ని చైనా ఆక్రమించుకుంది కనుకనే ప్రధాని మన ప్రాంతాన్ని ఆక్రమించలేదనే ఒక ప్రచారాన్ని ముందుకు తెచ్చారు. ఒక వేళ అదే నిజమైతే మన సైనికులను ఆప్రాంతానికి పంపి ప్రాణాలు పోయేందుకు నిర్ణయం తీసుకున్నది ఎవరు ? ఇంతకాలం ఆక్రమణకు పాల్పడని వారు ఇప్పుడెందుకు ఆ పని చేశారు అనే ప్రశ్నలు కూడా వస్తాయి. ఇక్కడ ఎవరికీ చెందని ప్రాంతమంటూ ఒకటి లేదు. ఒక నిర్ధారిత సరిహద్దు రేఖ లేదు. బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖ ఏ దేశ ఆధీనంలో ఏ ప్రాంతం ఉంది అని నిర్ధారించుకొని గీచింది కాదు, సుమారుగా నిర్ణయించారు. దాని ప్రకారం భారత్‌కు చెందినవి అనుకున్న కొన్ని ప్రాంతాలు చైనాకు చెందినవిగానూ, చైనాకు దక్కాల్సినవి అని పేర్కొన్నవి మన దేశ ఆధీనంలో ఉన్నాయి. ఆక్సారు చిన్‌ ప్రాంతం సరిహద్దు రేఖ ప్రకారం మనదిగా చూపారు కానీ అది ఎప్పటి నుంచో మా ఆధీనంలో ఉంది అని చైనా చెబుతోంది. దానితో విబేధించిన మన దేశం దాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నించింది, పర్యవసానం 1962 యుద్దం. దానిలో మొత్తంగా జరిగిందేమిటి ? చొచ్చుకుపోయిన మన సేనలను వెనక్కు కొట్టిన చైనా తన ఆధీనంలో ఉన్న ప్రాంతానికి కట్టుబడి ఉంది. దాన్ని మనదే అంటున్నాము. మరోవైపున ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో ఉంది. మక్‌మోహన్‌ రేఖ ప్రకారం అది చైనా ప్రాంతంగా ఉంది. అందువలన అది మా టిబెట్‌ దక్షిణ భాగం అని చైనా చెబుతోంది. తమది అని చెబుతోంది తప్ప ఆక్రమించుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.
తిరిగి మరోసారి మీడియా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకోవటమే విషాదకరం. దాన్ని నమ్మి అనేక మంది మరోసారి చిత్తయ్యారు. జూన్‌లో గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో మన సైనికులు చంపిన చైనా సైనికుల సమాధులు అంటూ జాతీయ మీడియాతో పాటు తెలుగు టీవీ ఛానల్స్‌ కూడా ఊదరగొట్టాయి. ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. మరోసారి పప్పులో కాలేశాయి. తప్పుడు వార్తలను ప్రచురిస్తే పాఠకులకు కలిగిన విచారానికి చింతిస్తున్నామని పత్రికలు ఒకప్పుడు చిన్నదో పెద్దదో వివరణ ఇచ్చేవి. ఇప్పుడు ఆ మాత్రపు విలువలను కూడా పాటించటం లేదు.


ఇంతకీ టీవీలలో చూపిన సమాధులు జూన్‌లో మరణించిన చైనా సైనికులవి కాదు. 1962 యుద్దంలో మరణించిన చైనా సైనికులవని, అవి ఆక్సారుచిన్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న చైనా గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలోని కాంగ్‌క్సివా అనే చోట ఏర్పాటు చేసిన యుద్ద స్మారక కేంద్రంలో ఉన్నట్లు తేలింది. వాటిని చూపి యాంకర్లు రెచ్చిపోయారు. బిజెపి లేదా సంఘపరివార్‌ సంస్ధల నేతలను తలదన్నే విధంగా మాట్లాడారు. గాల్వన్‌లోయలో మన సైనికుల చేతిలో హతులైన చైనా వారికి సంబంధించి రుజువులు ఏవి అనే అడిగేవారికి సమాధానం ఇవి అన్నారు. అంతే కాదు కావాలంటే వెళ్లి లెక్కపెట్టుకోండి అని ఎద్దేవా చేశారు. ఇంకోసారి రుజువులు అడగొద్దు, వీరత్వం చూపిన మన సైనికులను అవమానించవద్దు అని ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రెచ్చిపోయారు. ఆచరణలో ఆజ్‌తక్‌ టీవీ అవమానించింది.
టైమ్స్‌ నౌ ఛానల్‌ కూడా అదే బొమ్మలను చూపింది. మన సైనికులు 35 మంది చైనా వారిని చంపారని మన దగ్గర ఇప్పటికే ఆధారాలున్నాయి, కానీ మరణాలు అంతకంటే ఎక్కువే అని చిత్రాలు చూపుతున్నాయని యాంకర్‌ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్‌క్సివా యుద్ద వీరుల స్మారక కేంద్రంలో 107 మంది సమాధులు ఉన్నట్లు చైనా సైన్యం అధికారికంగానే ప్రకటించింది. వాటితో పాటు 2019లో మరణించిన ఒక సైనికుని సమాధిని కూడా అక్కడే ఏర్పాటు చేశారు, దాంతో 108 ఉన్నట్లు చైనా సిసిటీవీ మిలిటరీ ఛానల్‌లో ఆగస్టు 24నే చూపారని తేలింది. అవే సామాజిక మాధ్యమంలో కూడా ఉన్నాయి. వాటిని మన టీవీల వారు తీసుకొని తాము కనుగొన్నట్లు ఫోజు కొట్టినట్లుగా తేలింది. గ్జిన్‌ జియాంగ్‌ మిలిటరీ ప్రాంతంలో ఉన్న సిబ్బంది ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఆ స్మారక కేంద్రానికి వెళ్లి నివాళి అర్పించటం జరుగుతుంది. అలాంటి ఒక సైనికుని చిత్రాన్ని మన టీవీలు చూపాయి. ఆ సైనికుడు విలపిస్తున్నట్లు అది గాల్వన్‌ లోయలో మరణించిన చైనా వారి గురించి అని మన టీవీలు వ్యాఖ్యానం చెప్పాయి. అక్కడ 107మంది సైనికుల వివరాలు, ఇతర విశేషాల గురించి ఒక వ్యాసం 2019 మార్చినెలలో ప్రచురితమైనట్లు బూమ్‌ వెబ్‌ సైట్‌ వెల్లడించింది.


ఇవిగో గాల్వన్‌లో మరణించి చైనా సైనికుల సమాధులు అంటూ ఇండియా టుడే టీవీ ప్రసారం చేసిన వాటిలో ఒక గూగుల్‌ చిత్రం ఉంది. అది 2011నాటిదని ఆల్ట్‌ న్యూస్‌ కనుగొన్నది. ఏ చిత్రం ఎప్పటిదో కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం ఇండియా టుడే లేదా మరొక టీవీ ఛానల్స్‌ దగ్గర లేవా అంటే అందరి దగ్గరా ఉన్నాయి. వాటిని నిర్ధారణ చేసుకోవచ్చు గానీ తప్పుడు ప్రచారం చేయదలచుకున్నవారికి వాటితో పనేముంటుంది. తాము ప్రత్యేకంగా సంపాదించిన ఉపగ్రహ చిత్రాలంటూ ఇటీవలి కాలంలో టీవీ ఛానల్స్‌, కొన్ని పత్రికలు ప్రచురిస్తున్న లేదా ప్రదర్శిస్తున్నవన్నీ మిలిటరీ లేదా ప్రభుత్వం అందచేస్తున్నవే. వాటి గురించి మీడియా చేసే వ్యాఖ్యలు తప్ప నిజంగా అక్కడ జరుగుతున్నది ఏమిటన్నది సామాన్యులకు తెలియదు.


మన మీడియా ఒక్కటే కాదు, అనేక దేశాలలో అమెరికన్‌ సిఐఏ ఏజన్సీలు అందించే అనేక కథనాలు, చిత్రాలను పాఠకులకు, వీక్షకుల ముందు కుమ్మరిస్తున్నాయి. అమెరికా లేదా మరొక దేశ గూఢచార, ఇతర ప్రభుత్వ సంస్ధలు ప్రచారదాడిలో భాగంగా ఇలాంటి వాటిని నిరంతరం విడుదల చేస్తుంటాయి. వాటి వనరును పేర్కొన కుండా పత్రికలు , టీవీ ఛానల్స్‌కు ఆయా దేశాల్లో ఉన్న వార్తా సంస్దలు విడుదల చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాపితంగా కుహనా వార్తలు (ఫేక్‌ న్యూస్‌) పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. అందువలన అనేక అంతర్జాతీయ లేదా జాతీయ స్ధాయి మీడియా సంస్దలు వచ్చిన వార్తలను సరి చూసుకొనేందుకు, వాస్తవాలను తెలుసుకొనేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకొన్నాయి. వచ్చిన వార్తల తీరుతెన్నుల గురించి ప్రత్యేక కథనాలను వెలువరిస్తున్నాయి.


జూన్‌లో భారత-చైనా సరిహద్దులో జరిగిన ఉదంతాల గురించి వెలువడిన వీడియోలు, వార్తల గురించి బిబిసి విభాగం అదే పని చేసి కుహనా వార్తలు, కుహనా వీడియోలు, దృశ్యాల గురించి జూన్‌ 19న ఒక ప్రత్యేక కధనాన్ని వెలువరించింది. రెండు దేశాల సైనికులు దెబ్బలాడుకుంటున్న దృశ్యం అంటూ ఒక వీడియో వైరల్‌ అయింది. గాల్వన్‌ నది లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణ అని నమ్మిన వారు దాన్ని చూసి రకరకాల వ్యాఖ్యలు చేశారు. అయితే అదే వీడియో 2017 ఆగస్టులో, 2019 సెప్టెంబరులో కూడా అదే విధమైన సమాచారంతో యూట్యూబ్‌లో పోస్టు అయినట్లు బిబిసి తెలిపింది. ఏడాది క్రితం కాశ్మీరులో ఉగ్రవాదులతో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను గాల్వాన్‌ లోయ ఉదంతానికి అంటగట్టి ప్రచారం చేశారు. అదే విధంగా టిక్‌టాక్‌లో చైనా భాషలో ఉన్న ఒక వీడియోను కూడా అలాగే చిత్రించారు. దానిలో భారతీయ సైనికుడిని చైనా వారు తిడుతున్నట్లు, వెళ్లిపొమ్మని దబాయిస్తున్నట్లు ఉంది. జనవరిలో యూట్యూబ్‌లో పోస్టు అయిన ఆ వీడియోను తాజా ఉదంతంగా ఒక కాంగ్రెస్‌ నేత ప్రచారంలోకి తెచ్చారు. పోనీ సదరు వీడియో లడఖ్‌ ప్రాంతానిదా అంటే అదీ కాదు, అక్కడికి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుకు సంబంధించింది.ఒక సైనికుడి మృతదేహానికి అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను గాల్వన్‌ ఉదంతానికి జత చేసి ప్రచారం చేశారు. మేనెలలో లే-లడఖ్‌ ప్రాంతంలో ఒక ప్రమాదంలో మరణించిన సైనికుడికి సైనిక లాంఛనాలతో మహారాష్ట్రలోని స్వంత పట్టణంలో జరిపిన కార్యక్రమానికి సంబంధించిన వీడియో అది. గాల్వన్‌ లోయలో భారత సైనికుల మృతదేహాలంటూ హల్‌ చల్‌ చేసిన మరికొన్ని చిత్రాలను కూడా బిబిసి టీమ్‌ పరిశోధించింది. 2015లో నైజీరియా సైనికులపై అక్కడి బోకో హరామ్‌ తీవ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వారి చిత్రాలవి. వాటిని పాకిస్ధాన్‌ వెబ్‌సైట్‌ కూడా ఒకటి ఉపయోగించింది. అనేక మంది సైనికుల శవపేటికలకు సంబంధించిన మరో చిత్రాన్ని కూడా అదే వెబ్‌సైట్‌లో పెట్టి అది పుల్వామా దాడిలో మరణించిన భారత సైనికులని పేర్కొన్నారు. అది కూడా తప్పుడు చిత్రమే నంటూ పాఠకులను బిబిసి హెచ్చరించింది.


ప్రపంచంలో కల్పిత వార్తలు, రాజకీయ నేత అబద్దాలు ఇప్పుడు పెద్ద సమస్యలుగా తయారయ్యాయి. అతి పెద్ద కల్పిత వార్తల తయారీ కేంద్రాలకు అమెరికా నిలయం. అదే విధంగా రాజకీయ నేతల్లో అతి పెద్ద అబద్దాల కోరు డోనాల్డ్‌ ట్రంప్‌. ఇతగాడి గురించి అక్కడి పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ చెప్పిన సత్యం. అబద్దాల సునామీ అనే శీర్షికతో గార్డియన్‌ పత్రిక ట్రంప్‌ 20వేల అబద్దాలను పూర్తి చేసిన సందర్భంగా వాషింగ్టన్‌ పోస్టు చెప్పిన అంశాలను ఉటంకిస్తూ జూలై 13న ఒక వార్తను రాసింది. జూలై 9న రికార్డు స్ధాయిలో ట్రంప్‌ 62 అబద్దాలను ఆడి అబద్దాల రికార్డును నమోదు చేసినట్లు వాషింగ్టన్‌ పోస్టు వాస్తవాల నిర్ధారిత విభాగం పేర్కొన్నది. అలాంటి ట్రంప్‌, అమెరికా మనకు జిగినీ దోస్తు, భాగస్వామి అని మనలను తనతో పాటు కైలాసానికి తీసుకుపోతుందన్నట్లుగా మన మీడియా చిత్రిస్తోంది.


ట్రంప్‌గారూ మీరు ఇన్ని అబద్దాలు ఆడుతున్నందుకు ఎప్పుడైనా విచారించారా అని భారత సంతతికి చెందిన విలేకరి ఎస్‌వి డాటే ఆగస్టు 13న ప్రశ్నించినట్లు గ్లోబల్‌ న్యూస్‌ అనే ఒక వెబ్‌సైట్‌ వార్తను రాసింది. విలేకర్లతో మాట్లాడి సమయాన్ని వృధా చేయటం ఎందుకు, యావత్‌ సమయాన్ని దేశభక్తిలోనే గడిపేస్తా అన్నట్లుగా అధికారానికి వచ్చిన తరువాత ఒక్క పత్రికా గోష్టి కూడా పెట్టని నిరంతర తపనశీలి మన ప్రధాని నరేంద్రమోడీ అన్న విషయం తెలిసిందే. కానీ ట్రంప్‌ వేరు తరచూ విలేకర్లతో మాట్లాడతారు. అలాంటి ఆగస్టు 13నాటి సమావేశంలో మామూలుగానే కరోనా వైరస్‌, ఎన్నికల్లో తన ప్రత్యర్ధి జోబిడెన్‌ గురించి మాట్లాడిన తరువాత( నిజాలా అబద్దాలా అనేది కాసేపు పక్కన పెడదాం) అఫింగ్టన్‌ పోస్టు విలేకరిగా అధ్యక్ష భవన వార్తలను రాసే ఎస్‌వి డాటేను ప్రశ్నలు అడగండి అని ట్రంప్‌ స్వయంగా ఆహ్వానించాడు. కొన్ని వందల మంది విలేకర్లు ఉంటారు గనుక ప్రశ్నించే అవకాశం అందరికీ రాదు. మనవాడు తబ్బిబ్బు అయి తేరుకొని అధ్యక్ష మహౌదరు మూడున్నర సంవత్సరాలలో అమెరికా జనానికి మీరు చేసిందాన్ని గురించి అన్నీ అబద్దాలే చెప్పినందుకు ఎప్పుడైనా విచారించారా అని అడిగాడు. అన్నీ అంటే ఏమిటి అని ట్రంప్‌ తిరిగి ప్రశ్నించాడు. అదే అన్నీ అబద్దాలు, నమ్మశక్యం కాని అంశాలు చెప్పారు అని డాటే పునశ్చరణ గావించాడు. వాటిని ఎవరు చెప్పారు అని ట్రంప్‌ రెట్టించాడు. మీరే, లక్షల కొద్దీ ఉన్నాయి అని డాటే నొక్కి వక్కాణించాడు. కొద్ది సేపు మౌనంగా ఉన్న ట్రంప్‌ ఎలాంటి వ్యాఖ్య చేయకుండా మరొక విలేకరిని మాట్లాడాలని అడిగారు.


డోనాల్ట్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా పనిచేయక ముందు రిపబ్లికన్‌ పార్టీ నేతగా ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్‌ అబద్దాల గురించి ప్రశ్నించేందుకు తాను ఐదు సంవత్సరాల పాటు వేచి చూశానని విలేకర్ల సమావేశం తరువాత ఎస్‌వి డాటే ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. ట్రంప్‌-తన మధ్య జరిగిన సంభాషణను కూడా ట్విటర్‌లో పెట్టాడు. మరుసటి రోజు ఉదయానికే దాన్ని 38లక్షల మంది వీక్షించారు. అలాంటి ప్రశ్నలను మన విలేకర్లలో కొందరైనా అడిగే వారు ఇప్పటికీ ఉన్నారు, కానీ, అసలు అడిగేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ అవకాశం ఇస్తారా ? ఒక వేళ మారు మనసు పుచ్చుకొని ఇచ్చినా అడిగిన విలేకరి ఉద్యోగం ఆఫీసుకు వెళ్లేంతవరకు అయినా ఉంటుందా ?


ఈ నేపధ్యంలో చైనా-భారత్‌ సరిహద్దు ఘర్షణలు లేదా మరొక అంశం మీద గానీ సామాజిక మాధ్యమాల్లో, వాటిని ఆధారం చేసుకొని సాంప్రదాయ పత్రికలు, టీవీ మాధ్యమాల్లో కధనాలను వెలువరించుతున్న వాటి పట్ల జనం జాగ్రత్త వహించకపోతే తప్పుడు అభిప్రాయాలను బుర్రలోకి ఎక్కించుకొనే ప్రమాదం ఉంది. చైనాతో, పాకిస్ధాన్‌తో మనకు సమస్యలున్నాయి గనుక వాటి గురించి ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో ఇలాంటి ప్రచారం జరుగుతోందా ? సామాజిక మాధ్యమంలో ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశాలమీదనే జరుగుతుంటే అలాగే అనుకోవచ్చు. కానీ గత ఆరు సంవత్సరాలలో మన దేశంలో బిజెపి, నరేంద్రమోడీ గురించి అనుకూల తప్పుడు ప్రచారాలు, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలకు సంబంధించి వ్యతిరేక తప్పుడు ప్రచారాలు తక్కువేమీ కాదు. సామాజిక మాధ్యమం పెద్ద ఎత్తున విస్తరించింది, ఆండ్రాయిడ్‌, స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చినందున వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటివి వినియోగంలోకి వచ్చిన తరువాత ఇలాంటి తప్పుడు సమాచారాన్ని మెదళ్లకు ఎక్కించటమే పనిగా పెట్టుకున్న సంస్ధలు, పార్టీలు అందుకోసం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నాయి. బిజెపి, దానికి సంబంధించిన మరికొన్ని సంస్ధలు ప్రచారంలోకి తెచ్చిన విద్వేష పూరిత, రెచ్చగొట్టే, ఇతర సమాచారాన్ని అడ్డుకోవద్దని తమ సిబ్బందికి చెప్పినట్లు ఫేస్‌బుక్‌ అధికారులు తాజాగా అంగీకరించిన అంశం తెలిసిందే. అందువలన ఎవరైనా అలాంటి అంశాలను నిర్ధారించుకోకుండా రెచ్చి పోవద్దు, పొరబాటు అభిప్రాయాలకు రావద్దని మనవి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మనసులోని మాట వీడియో స్పందనతో మోడీ, బిజెపి మైండ్‌ బ్లాంక్‌ ?

01 Tuesday Sep 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Modi mann ki baat, modi mann ki baat dislikes surge


ఎం కోటేశ్వరరావు


కొద్ది రోజుల క్రితం మన ప్రధాని నరేంద్రమోడీని చైనీయులు తమ నేతల కంటే ఎక్కువగా అభిమానిస్తున్నారని అక్కడి అధికార దినపత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే వెల్లడించిందని ఒక కల్పిత వార్తను కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు ప్రచురించాయి. ఆహా ఓహౌ అని కొందరు సంబరాలు చేసుకున్నారు. నిజానికి ఆ సర్వే గురించి సదరు పత్రిక ప్రచురించిన వార్తలో ఆ ప్రస్తావనే లేదు.


ఇప్పుడు అలాంటి వారందరికీ దిమ్మ దిరిగే స్పందన మన దేశంలో వెల్లడైందని చెప్పవచ్చు. ఆగస్టు 30 ఆదివారం నాడు మన ప్రధాని మన్‌కీ బాత్‌ – మనసులోని మాట – ను అభిమానించిన వారి కంటే తిరస్కరించిన వారే మోడీ అభిమానుల్లో ఎక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. దీని భావమేమి రామచంద్ర ప్రభూ ! అయిష్టత ప్రకటించిన వారందరూ విదేశీయులే, కేవలం రెండు శాతం దేశీయులు మాత్రమే వారిలో ఉన్నారు అని బిజెపి ఐటి విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ సెలవిస్తే, ఇదంతా కాంగ్రెస్‌ చేయించింది అని బిజెపి కేంద్ర ప్రతినిధి విజరు సోంకర్‌ శాస్త్రి తమతో వ్యాఖ్యానించినట్లు ” ది ప్రింట్‌ ” పేర్కొన్నది.
నెటిజన్లు అయిష్టత ప్రకటించిన విషయాన్ని ఏ సీతారామ్‌ ఏచూరో, రాహుల్‌ గాంధీయో లేదా మరొకరో చెప్పలేదు. నరేంద్రమోడీ ప్రచారం కోసం ప్రభుత్వం, బిజెపి ఏర్పాటు చేసిన అధికారిక ఛానల్స్‌ స్వయంగా వెల్లడించిన సమాచారమే. ఆ ఛానళ్లకు ఖాతాదారులుగా చేరిన వారిలో అత్యధికులు బిజెపి కార్యకర్తలు లేదా నరేంద్రమోడీ అభిమానులే ఉంటారన్నది తెలిసిందే. తాజా స్పందన ద్వారా తమ మనసులో ఉన్న మాటలను మోడీ విస్మరిస్తున్నారని అభిమానులు ఆగ్రహిస్తున్నారా ? ఏమిటీ అసందర్భ ప్రసంగాలని విసుక్కుంటున్నారా ?


మనసులోని మాట పేరుతో ప్రధాని కార్యాలయ యంత్రాంగం లేదా పార్టీ యంత్రాంగం రాసి ఇచ్చిన దానిని చెబుతున్నారో లేక నిజంగా తన మనసులోని మాటనే చెబుతున్నారో మనకు తెలియదు. మనకు కనిపించేది, వినిపించేది మోడీయే కనుక అవి స్వంత భావాలుగానే పరిగణించాలి. ఇంత వరకు ప్రతినెలాఖరులో 68 సార్లు దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకున్నారు. ప్రభుత్వ సామాజిక మాధ్యమ ఖాతాలతో పాటు దూరదర్శన్‌, రేడియో కేంద్రాలు, బిజెపి అధికారిక యూట్యూబ్‌ ఛానల్స్‌, మరికొన్ని ఛానల్స్‌ కూడా ప్రసారం చేస్తున్నాయి.


ప్రధాని మన్‌కీ బాత్‌ కబుర్లను వినేందుకు తొలి నెలల్లో చాలా మంది ఆసక్తిని ప్రదర్శించారు. ఇప్పుడు కూడా వింటున్నవారు ఉండవచ్చు. తరువాత అదొక తద్దిన కార్యక్రమంగా మారిందని భావించిన వారు లేకపోలేదు. ఇది మామూలు విషయంగా మారింది. కుక్క మనిషిని కరిస్తే అది సాధారణ వార్త. మరి సంచలనం ఏమిటి అంటారా ? మనిషి కుక్కను కరవటం, సంఘటన జరిగిన తరువాత ఆ మనిషి మనోభావాలు ఎలా ఉన్నాయి, తనను కరచిన మనిషి గురించి కుక్క ఏమైనా స్పందించిందా వంటి ప్రశ్నలు వేసే యాంకర్ల తీరు తెన్నులు సరేసరి. ప్రధాని మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని అభిమానించటం సాధారణ అంశం. సంచలనం ఏమిటి ?
ఆగస్టు 30నాటి మన్‌కీ బాత్‌ను అభిమానించిన వారి కంటే తిరస్కరించిన వారే ఎక్కువగా ఉండటమే సంచలన వార్త. గంట గంటకూ తిరస్కరించిన వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాని అధికారిక ఛానల్‌లో అభిప్రాయాల వెల్లడి అవకాశాన్నే నిలిపివేయటం మరింత పెద్ద సంచలన వార్త. ఎందుకిలా జరిగిందో తెలియదుగానీ ఊహించుకోవచ్చు. స్పందనను పర్యవేక్షించే అధికార యంత్రాంగానికి మైండ్‌ బ్లాంక్‌ అయిందన్నది స్పష్టం. తమనేతకు మరుసటి రోజు ఏమి నివేదిస్తే ఎలాంటి స్పందన, పర్యవసానాలు వుంటాయో తెలియక అధికారిక ఛానల్‌లో అభిప్రాయాల బటన్‌ పని చేయకుండా నిలిపివేశారన్నది స్పష్టం.


మీడియాలో దీని మీద అనేక వార్తలు వచ్చాయి. కొన్ని సంస్ధలు కనపడీ కనపడకుండా వార్తలను ఇచ్చాయి. లాజికల్‌ ఇండియన్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ దీని గురించి ప్రచురించిన ఒక కధనం గురించి చూద్దాం. నీట్‌, జెయియి పరీక్షల మీద తలెత్తిన ఆగ్రహం కారణంగా బిజెపి యూ ట్యూబ్‌ ఛానల్లో అత్యంత అనిష్టత లేదా అయిష్టత ( నిఘంటువులో అసహ్యించుకున్న అని కూడా ఉంది) చూపిన వీడియోగా ప్రధాని మన్‌కీ బాత్‌ తయారైందనే శీర్షికతో కధనాన్ని వెలువరించింది. దానికి దృష్టాంతంగా విద్యార్ధుల ట్వీట్లు కొన్నింటిని ఉటంకించింది.


టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ముంబై మిర్రర్‌ కూడా ప్రముఖంగానే దీన్ని విశ్లేషించింది. మన్‌కీ బాత్‌ వీడియో విడుదల అయిన 24 గంటల తరువాత వివరాలను చూస్తే బిజెపి ఛానల్‌లో 79 వేల మంది ఇష్టత చూపారని, 5.34 లక్షల మంది అనిష్టత చూపారని పేర్కొన్నది. ప్రధాన మంత్రి అధికారిక యూ ట్యూబ్‌ ఛానల్లో 39వేల మంది ఇష్టత, 85వేల మంది అయిష్టత చూపారని పేర్కొన్నది.
సోమవారం రాత్రి పది గంటల సమయానికి బిజెపి ఛానల్లో 29లక్షల మంది చూస్తే వారిలో అభిమానించిన వారు 1.2లక్షలు, అయిష్టత వ్యక్తం చేసిన వారు 7.4లక్షలని ది ప్రింట్‌ తెలిపింది. ఆదివారం రాత్రి నుంచి సోమవార మంతా బిజెపి అభిమానులు పని కట్టుకొని అభిమానం వ్యక్తం చేసిన తరువాత పరిస్దితి ఇది అని గమనించాలి.
ఇక వ్యాఖ్యల విషయానికి వస్తే మచ్చుకు కొన్ని చూద్దాం. ౖ” ప్రియమైన ప్రధాని గారూ మీరు జెయియి, నీట్‌ గురించి మాట్లాడతారని నేను అనుకున్నాను. నాకు ఒక సంవత్సరాన్ని వృధా చేసినందుకు కృతజ్ఞతలు ” ఇది లాజికల్‌ ఇండియన్‌ పేర్కొన్నది. ” 2019లో నా కుటుంబం అతనికి ఎందుకు ఓటు చేసిందా అని ఇప్పుడు నేను విచారిస్తున్నాను. ఇంత హీనమైన ప్రధానిని ఎన్నడూ చూడలేదు. హెచ్‌ఆర్‌డి మంత్రి 80శాతం మంది విద్యార్ధులు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెబుతున్నారు. దీని అర్ధం మేము పరీక్షలను కోరుకుంటున్నామని కాదు.ఈ మనిషికి నేను మరోసారి ఓటు వేయను ” అని కిరణ్‌ మోరే అనే విద్యార్ధి ట్వీట్‌ చేసినట్లు ముంబై మిర్రర్‌ పేర్కొన్నది.
” మీరు నా దేశాన్ని నాశనం చేశారు. మీ పార్టీకి ఓటు వేసినందుకు ప్రతిక్షణం విచారిస్తాము. నా జీవిత కాలంలో ఈ కుహనా నటుడ్ని సమర్ధించను” అని ఒకరు, ” కుర్రాళ్లూ ఈ ఏడాదిని ఎన్నడూ మరిచి పోవద్దు. గోడీ (మోడీ ప్రభుత్వాన్ని కొందరు అలా పిలుస్తున్నారు) ప్రభుత్వం 30లక్షల మంది విద్యార్దుల ఆర్తనాదాలను, డిమాండ్లను ఎలా అణచివేసిందో కూడా మరవవద్దు.2024లో మనమేమిటో చూపాలి ” అన్న ట్వీట్లను కూడా ముంబై మిర్రర్‌ ప్రచురించింది.


ప్రధాని తన మనసులోని మాటలో లక్షలాది మంది విద్యార్ధులు, వారి తలిదండ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోలేదన్నది పైన పేర్కొన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్ధుల్లో ఆగ్రహం కారణంగా ఇలాంటి స్పందన వచ్చిందని ఇదేదో తాత్కాలికం అన్నట్లుగా చిత్రించే యత్నం కనిపించింది. విద్యార్ధులైనా మరొకరైనా అధికారిక చానళ్లలో ఖాతాదారులుగా చేరిన వారే మోడీ అంటే అభిమానులే కదా ! లేదూ వారంతా కొత్త వారు, తాజా మన్‌కీ బాత్‌ విని అలా స్పందించారని అనుకోవాలా ? అదైనా నరేంద్రమోడీకి ప్రతికూల స్పందనే కదా ! పరీక్షలు రాసేందుకు సిద్దమైన విద్యార్ధుల కుటుంబాలు, స్నేహితుల్లో ఇదొక ప్రధాన చర్చ నీయాంశం అయిందా లేదా ? ఇలాంటి స్పందన గత మన్‌కీ బాత్‌లకు ఎందుకు రాలేదు ? ఒక వేళ వచ్చినా పట్టించుకోకుండా నేను ఏమి చెప్పినా జనం నోరు మూసుకొని వింటారనే భావం ప్రధానిలో ఆయన యంత్రాంగంలో చోటు చేసుకుందా ? ఈ స్పందనతో బిజెపి నేతల మైండ్‌ బ్లాంక్‌ అయినట్లు కనిపిస్తోంది. కాస్త బాణీ మార్చారు. మోడీ వీడియో మీద అయిష్టతకు నెహ్రూయే కారణం అని చెప్పకుండా కాంగ్రెస్‌ అన్నారు. కాంగ్రెస్‌కు విదేశాల్లో అందునా అధికార ప్రతిపక్ష స్ధాయి కూడా లేని కాంగ్రెస్‌కు అంత పలుకుబడి ఉందా లేక నరేంద్రమోడీ వెలుగు ఆరిపోతోందా ? గతంలో నరేంద్రమోడీకి వచ్చిన మద్దతులో విదేశాల నుంచి ఎంత స్వదేశాల నుంచి ఎంతో వివరిస్తే బాగుండేది. కాంగ్రెస్‌కు అంత సత్తా ఉంటే 67 నెలలు ఏమీ చేయకుండా 68వ వీడియో మీద ఎందుకు కేంద్రీకరించింది అన్న ప్రశ్నకు కూడా బిజెపి నేతలు సమాధానం చెప్పాలి. అభిప్రాయాలను ఇలా తారు మారు చేయటం సాధ్యం అయితే గతంలో బిజెపి కూడా నరేంద్రమోడీకి అనుకూలంగా అదేపని చేసినట్లే కదా !


సామాజిక మాధ్యమాల్లో బిజెపికి మద్దతు బండారం ఏమిటో అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ బయట పెట్టింది. తాజాగా మరికొన్ని వివరాలను వెల్లడించింది. బిజెపికి 2014 ఎన్నికల్లో తాము ప్రచారం చేశామని ఫేస్‌బుక్‌ భారత అధికారిణి అంఖీదాస్‌ పేర్కొన్న విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆగస్టు 30వ తేదీ వార్తలో పేర్కొన్నది. బిజెపి రాజకీయవేత్తలు, వ్యక్తిగతంగా హిందూ మతవాదులు, బృందాల విద్వేష ప్రచారానికి నిబంధనల ఉల్లంఘన నిబంధనను పాటించవద్దని తమ సిబ్బందికి అంఖీదాస్‌ ఆదేశాలు ఇచ్చినట్లు గతంలో అదే పత్రిక వెల్లడించింది. మోడీ నాయకత్వంలోని బిజెపి నేతలకు నిబంధనల ఉల్లంఘన రూల్స్‌ను వర్తింప చేస్తే ఫేస్‌బుక్‌ వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయి కనుక చూసీ చూడనట్లు వ్యవహరించాలని ఆమె అదేశించినట్లు బయటపడింది.2014లో మోడీ అధికారానికి వచ్చిన సమయంలో ఆమె చేసిన ఒక పోస్టులో ” అతని సామాజిక మాధ్యమ ప్రచారానికి మనం అగ్గి అంటించాం, తరువాత చరిత్ర తెలిసిందే అని పేర్కొన్నారు. మరొక పోస్టులో మోడీని ఉక్కు మనిషిగా వర్ణించారు. భారత రాజ్య సోషలిజాన్ని ఓడించటానికి దిగువ స్ధాయి నుంచి చేసిన పనికి 30 సంవత్సరాలు పట్టింది అని కాంగ్రెస్‌ ఓటమి గురించి పేర్కొన్నట్లు అమెరికా పత్రిక వెల్లడించింది.

ఆగస్టు నెల మనసులోని మాటలో చెప్పిందేమిటి ? సెప్టెంబరును పోషకాహార నెలగా పరిగణిస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని సుభాషితం చెప్పారు. ఫ్రెంచి విప్లవ కాలంలో జనానికి రొట్టెలు కూడా దొరక్క రాణి మేరీ ఆంటోనెటెకు విన్నవించుకున్నపుడు రొట్టెలు దొరక్క పోతే కేకులు తినొచ్చు కదా అని ప్రశ్నించిందట. ప్రజలతో సంబంధాలు లేని పాలకుల స్పందన బాధ్యతా రాహిత్యం ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. మనం ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్ధాయికి చేరుకున్నామని మన మంత్రులు తమ జబ్బలను తామే చరుచుకొంటున్నారు. జనానికి కొనుగోలు శక్తి లేకపోతే ఆహార ధాన్యాలు మిగిలిపోతున్నాయి తప్ప ఎక్కువై కాదు.


ప్రపంచ ఆకలి సూచిక 2019లో ప్రపంచంలోని 117 దేశాలలో మన దేశం 102వ స్ధానంలో ఉంది. నరేంద్రమోడీ గారి మంచి రోజులు ప్రారంభమైన ఐదు సంవత్సరాల తరువాత ఉన్న పరిస్ధితి ఇది. ఆరు నుంచి 23నెలల వయస్సు ఉన్న పిల్లల్లో కేవలం పదిశాతం మందికి మాత్రమే కనీసంగా పెట్టాల్సిన ఆహారం అందుబాటులో ఉన్నది. 1991లో ఆహార లభ్యత తలకు 186.2 కిలోలు కాగా 2016లో 177.9 కిలోలకు తగ్గింది. 2015లో చైనాలో 450 కిలోలు, బంగ్లాదేశ్‌లో 200కిలోలు, అమెరికాలో 1,100 కిలోలు ఉంది. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ సమాచారం ప్రకారం కూరగాయల వినియోగంలో 2017లో చైనా సగటున ప్రతి ఒక్కరూ 377 కిలోలతో ప్రపంచంలోనే అగ్రస్ధానంలో ఉండగా మన దేశంలో 79.86కిలోలు, శ్రీలంకలో 49.83, బంగ్లాదేశ్‌లో 35, పాకిస్ధాన్‌లో 20.83 కిలోల వినియోగం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ తలకు రోజు ఒక్కింటికి 200-250గ్రాముల కూరగాయలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మన దేశంలో 218 గ్రాములుండగా చైనాలో 1033 గ్రాములు తీసుకుంటున్నారు. ఈ స్ధితిలో ఒక నెలను పోషకాహార మాసంగా ప్రకటించటం ఏమిటి ?


ప్రధాని నోటి నుంచి మరొక ఆణిముత్యం కుక్కలను, అదీ దేశీయ జాతులను పెంచండి. ఒక వైపు దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంతగా దిగజారనుందో ప్రభుత్వం లెక్కలు ప్రకటించటానికి కొద్ది రోజుల ముందు ప్రధాని నోటి నుంచి ఇలాంటి సందేశం రావటంతో జనం విస్తుపోతున్నారు. దేశంలో ఎలుకలు రైతుల పంట పొలాల్లో తరువాత గోదాముల్లో ఆహార ధాన్యాలను ఎంత నష్టపరుస్తున్నాయో తెలిసిందే. పది నుంచి 20శాతం వరకు ఉంటుందనే ఆ నష్టాన్ని అరికట్టేందుకు ఎలుక నివారణ సాధ్యంగాకపోతే పిల్లులను పెంచాలని పిలుపు ఇచ్చినా ఒక అర్ధం వుంటుంది. అదే విధంగా దోమలతో ఎంత మంది అనారోగ్యం పాలవుతున్నారో, ఎంత నష్టం జరుగుతోందో తెలుసు. దోమల నివారణ పిలుపు ఇచ్చినా అదో అందం. కుక్కలను అదీ దేశీయ కుక్కలను పెంచాలనటం ఏమిటో అర్ధం కాదు. కుక్కలు దేశీయమా విదేశీయా అని కాదు పోలీసు, మత్తుపదార్ధాలు, ఇతర అవాంఛనీయ కార్యకలాపాలను పసిగడతాయా లేదా అన్నది ముఖ్యం. ఇక్కడ కూడా జాతీయ భావనలను చొప్పిస్తున్నారా ?


కరోనా నేపధ్యంలో వాక్సిన్‌ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అనవసర ఖర్చులు తగ్గించుకొని అత్యవసరమైన వాటికే ఖర్చు చేస్తున్నారని ప్రపంచం నలుమూలల నుంచి వార్తలు వస్తున్న సమయంలో ప్రపంచం కోసం బొమ్మలను తయారు చేయాలని , మార్కెట్‌ను సొంతం చేసుకోవాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. వాటిని కొనుగోలు చేసే వారు ఉండాలి కదా ! బొమ్మల కంటే సెల్‌ఫోన్ల మార్కెట్‌ ఎక్కువ, ఇంకా అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ వదలి ఒక ప్రధాని బొమ్మల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమే. బొమ్మలైనా, మరొకటైనా తయారు చేయవద్దని గత ఆరు సంవత్సరాలలో మన దేశంలోని వారిని ఎవరు అడ్డుకున్నారు. అదేమీ కొత్తగా పెరుగుతున్న మార్కెట్‌ కాదే ! నిజంగా అలాంటి మార్కెట్‌, ఎగుమతి అవకాశాలు ఉంటే మన దేశంలోని తయారీదారులు ప్రధాని పిలుపు ఇచ్చే వరకు ఆగుతారా ?
కరోనాకు ముందు, కరోనా సమయంలో, తరువాత కూడా తమ ప్రభుత్వం చేయబోయే పనుల గురించి నరేంద్రమోడీ, మంత్రులు ఎన్నడూ దాచుకోలేదు. రైళ్లు, విమానాశ్రయాలు, బ్యాంకులు, బీమా, చమురు సంస్ధలు, గనులు, ప్రభుత్వ రంగ సంస్ధలు, ఇలా ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రతిదానిని ప్రయివేటీకరణ చేయటం గురించి నిరంతరం చెబుతూనే ఉన్నారు. వీటన్నింటినీ వదిలించుకున్న తరువాత నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు ఇంక చేసేదేమి ఉంటుంది ? పనేమీ లేకపోతే నెమలి ఆటలను చూపుతామని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే సూచన ప్రాయంగా జనానికి చెప్పారు. అనేక చోట్ల భారీ వర్షాలతో జనం వరదలు, ఇతర వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతుంటే ఒక్క రాష్ట్రాన్ని అయినా ప్రధాని సందర్శించకుండా నెమళ్లకు మేత వేస్తూ కాలక్షేపం చేస్తున్నారన్న సందేశం ఇప్పటికే జనంలోకి పోయిందా లేదా ?


నెమలిని పెంచటం చట్టరీత్యా నేరం కనుక మరోసారి అలాంటి ఆటలు ప్రధాని నుంచి రాకపోవచ్చు. మంత్రులకు పనేమీ ఉండదు కనుక కోతులు, కొండముచ్చులను ఆడించటం, పగటి వేషాలతో తుపాకి రాముడిలా, వీరతాళ్లతో పోతురాజుల్లా జనాన్ని అలరించటం, సాము గరిడీలకు దిగినా ఆశ్చర్యం లేదు ! ఆ చర్యలతో కడుపునింపుకొనే పొట్టగొట్టినట్లు అవుతుంది. ఇలాంటి వినోదం కోసమే అయితే మోడీ అండ్‌కోను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందా ? ఆరు సంవత్సరాల క్రితం ఒకసారి, ఏడాది క్రితం మరోసారి అధికారం కావాలని నరేంద్రమోడీ ప్రజలను కోరింది దేనికి ? ప్రజలు ఆయనను చూసి దేనికి ఓటు వేశారు ? ప్రజలెదుర్కొంటున్న తక్షణ లేదా ప్రధాన సమస్యలను వదలి ఇలాంటి కబుర్లను మన్‌కీ బాత్‌లో చెబితే వినటానికి సిద్దంగా లేరనేందుకు తాజా మన్‌కీ బాత్‌ వీడియోపై వెల్లడైన వ్యతిరేక స్పందన ఒక సూచిక. నెమళ్లను ఆడించటానికి, కుక్కలను పెంచండి, ప్రపంచం కోసం బొమ్మలను తయారు చేయండి, పౌష్టికాహారం తీసుకోండనే సుభాషితాలను వినేందుకా ఓటు వేసింది అని ఆలోచించాల్సిన సమయం వచ్చిందా లేదా ? ఆలోచించండి !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేవుడి పేరుతో రాష్ట్రాలకు జిఎస్‌టి శఠగోపం ? అబద్దాలతో తప్పుదారి పట్టిస్తున్న బిజెపి !

29 Saturday Aug 2020

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP False Claims, Old IMF data, Old IMF data about India


ఎం కోటేశ్వరరావు


కోవిడ్‌-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. అన్ని దేశాల పాలకులకు వైరస్‌ పెద్ద పరీక్షగా మారింది. అనేక దేశాల పాలకులు, పాలక పార్టీలు జిమ్మిక్కులు చేసి జనాన్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ అనే చులకన భావం ఎల్లెడలా వ్యాపించి ఉంది.


” నరేంద్రమోడీ భారత్‌కు దైవమిచ్చిన బహుమతి, పేదల పాలిట రక్షకుడు ” అని ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న ఎం.వెంకయ్య నాయుడు గతంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పని చేసిన సమయంలో వర్ణించారు. 2016 మార్చి 21వ తేదీన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సమయంలో ప్రవాహంలా దొర్లిన ఈ మాటలను అప్పుడు నరేంద్రమోడీ అభిమానులు వహ్వా వహ్వా అంటూ ఎంతగానో ఆనందించారు. మీడియా కూడా ప్రముఖంగానే ఈ వార్తలను ఇచ్చింది. సమావేశం ముగిసిన తరువాత కొందరు విలేకర్లు వెంకయ్య నాయుడి పొగడ్తల గురించి అడగ్గా హౌం మంత్రిగా ఉన్న రాజనాధ్‌ సింగ్‌ వెంకయ్యగారు మాట్లాడుతుండగా తాను వినలేదని తప్పించుకున్నారు. పోనీ దేశానికి దేవుడు ఇచ్చిన బహుమతిగా నరేంద్రమోడీని మీరు గానీ బిజెపిగానీ భావిస్తున్నదా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తిరస్కరించారు.
దేవుడు ఇచ్చిన బహుమతి, పేదల పాలిట రక్షకుడు అయిన నరేంద్రమోడీ ఏలుబడిలో జరగరానివి జరిగిపోతున్నాయి. ఆగస్టు 27న జిఎస్‌టి 41వ కౌన్సిల్‌ సమావేశం ముగిసిన తరువాత కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దైవ విధి లేదా దైవిక కృత్యం( యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ ) కారణంగా కరోనా మహమ్మారి వలన పన్ను వసూళ్లు తగ్గాయని సెలవిచ్చారు. దేశానికి తానిచ్చిన ” బహుమతి ” గురించి దేవుడు మరచి పోయినట్లా ? పేదల పాలిట రక్షకుడు వలస కార్మికులను స్వ స్ధలాలకు చేర్చటంలో ఎలా ఇబ్బందులు పెట్టారో, అలవిగాని ఇబ్బందులకు, దిక్కులేని చావులకు ఎలా కారకులయ్యారో, పని కోల్పోయిన వారి కడుపు ఎలా నింపుతున్నారో యావత్‌ దేశంతో పాటు దేవుడు కూడా చూస్తేనే ఉన్నాడు కదా !


ఐదు సంవత్సరాల పాటు జిఎస్‌టి వలన నష్టపోయే రాష్ట్రాలకు అంగీకరించిన సూత్రం ప్రకారం ఎంత నష్టమైతే అంత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. 2017 జూలై ఒకటి నుంచి 2022 జూన్‌ 30వరకు ఈ అవగాహన అమల్లో ఉంటుంది. అమల్లోకి వచ్చిన తేదీ నాటికి రాష్ట్రాలకు అంతకు ముందున్న అమ్మకపు పన్ను మీద ప్రతి ఏటా 14శాతం వృద్ధి ఉంటుందనే భావనతో రాష్ట్రాల ఆదాయాన్ని లెక్కించాలి. 2017 జూలై ఒకటి నాటికి వంద రూపాయలు ఆదాయం వచ్చిందనుకుందాం. మరుసటి సంవత్సరం దాన్ని రు.114గా పరిగణించాలి. ఒక వేళ ఆ మొత్తం రాకపోతే ఎంత తగ్గితే అంత మొత్తాన్ని ప్రతి రాష్ట్రానికి కేంద్రం చెల్లించాలి. మరుసటి సంవత్సరం 114 రూపాయలు మీద పద్నాలుగు శాతాన్ని పెంచి లెక్కించితే ఆ మొత్తం రు.129.96 అవుతుంది.తరువాత రూ.148.15కు పెరుగుతుంది. ఇలా ఐదు సంవత్సరాలు పెంచుతూ అమలు జరపాలి, సదరు మొత్తాలకు ఎంత తగ్గితే అంత మొత్తాన్ని కేంద్రం ఇవ్వాలి.


గత ఏడాది అంటే 2020 మార్చి నెల వరకు నష్టం మొత్తాన్ని చెల్లించిన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి చెల్లింపులను నిలిపివేసింది. నలభై ఒకటవ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశానికి నివేదించిన వివరాల ప్రకారం 2020-21 సంవత్సరానికి మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు ఆదాయం తగ్గుతుందని, జిఎస్‌టి సెస్‌ ద్వారా రూ.65వేల కోట్ల మేరకు సమకూరుతుందని, నిఖర ఆదాయ లోటు రూ.2.25లక్షల కోట్లని చెప్పారు. ఈ మొత్తాన్ని కేంద్రం చెల్లించాలన్నది రాష్ట్రాల డిమాండ్‌. అయితే రుణాలు తీసుకొని నష్టపోయిన ఆదాయాన్ని సమకూర్చుకొంటే తరువాత ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని దానికి గాను రెండు పద్దతులలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని కేంద్రం కోరింది. దీనికి గాను వారం రోజుల గడువును రాష్ట్రాలు కోరాయి.


సాధారణ పరిస్ధితుల్లో అవగాహన ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని అయితే ఆ మొత్తం సెస్‌ నిధి నుంచి తప్ప ఇతర ఖాతాల నుంచి చెల్లించకూడదని అటార్నీ జనరల్‌ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.అయితే దైవిక కృత్యాల ద్వారా ఆదాయం తగ్గితే కేంద్రం చెల్లించాలన్న నిబంధన లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశంలో వాదించారు. అదే పల్లవిని బిజెపి పాలిత రాష్ట్రమైన అసోం ఆర్ధిక మంత్రి హేమంత బిస్వాస్‌ శర్మ అందుకున్నారు. వారం తరువాత రాష్ట్రాలు ఏమి చెబుతాయి అన్న అంశాన్ని పక్కన పెడితే దైవిక కృత్యం పేరుతో కేంద్రం నుంచి రాష్ట్రాలకు చెల్లించాల్సిందేమీ లేదని చెప్పినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే దేవుడి పేరుతో శఠగోపం పెట్టటాన్ని రాష్ట్రాలు ఎలా పరిగణిస్తాయి, పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది. లోటును పూడ్చుకొనేందుకు రాష్ట్రాలకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. జిఎస్‌టి పరిధిలో లేని మద్యం, చమురు, మరికొన్ని వస్తువులపై ఇప్పటికే రాష్ట్రాలు గరిష్టంగా పన్ను వసూలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం డీజిలు, పెట్రోలు ధరల విధానాన్ని పక్కన పెట్టి వాటిమీద పన్నులను పెంచటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌ ధరలతో నిమిత్తం లేకుండా ధరలు పెంచుతూ వినియోగదారుల జేబులు కొడుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రాలు నిధుల లేమితో ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. అందుకోసం వైరస్‌ వ్యాప్తి ప్రమాదాన్ని పట్టించుకోకుండా మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం, రాష్ట్రాలు మద్యం ధరలను విపరీతంగా పెంచిన తీరును చూశాము. ఇప్పుడు రానున్న రోజుల్లో జిఎస్‌టి ఆదాయం తగ్గటం ఖాయమని తేలిపోయినందున వివిధ వస్తువులపై జిఎస్‌టిని పెంచినా చేసేదేమీ లేదు. పెట్రోలు, డీజిలు ధరలను భరిస్తున్నట్లే జనం జిఎస్‌టి పెంపుదలకు కూడా నోరెత్త కుండా అలవాటు పడాల్సి ఉంటుంది.


అనేక మంది నిపుణులు, సంస్ధలు, సర్వేలు దేశ ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకోవటం గురించి పెదవి విరుస్తున్నాయి తప్ప ఆశాభావం వెలిబుచ్చటం లేదు. కానీ అధికారపక్షం బిజెపి మాత్రం దేశం వెలిగిపోనుందని చెప్పటం గమనించాల్సిన అంశం. ఆగస్టు 22న ఆ పార్టీ సామాజిక మాధ్యమాల్లో ఒక ట్వీట్‌ చేసింది. దానికి మద్దతుగా సమాచారం ఉన్న చిత్రాన్ని కూడా జత చేసింది. ట్వీట్‌లో ఇలా ఉంది. ” కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రధాన దేశాలన్నీ తిరోగమన వృద్ధితో ప్రపంచం ఆర్ధికంగా రక్తమోడుతూ తంటాలు పడుతుండగా 2020లో సానుకూల వృద్దితో వెలిగిపోయే చోట భారత్‌ ఉంటుంది. వేగంగా అభివృద్ది చెందుతున్న దేశ స్దాయిని అది నిలబెట్టుకుంటుంది ” అని పేర్కొన్నది.
పైన పేర్కొన్న అభిప్రాయాన్ని బలపరుస్తూ బిజెపి విడుదల చేసిన చిత్రంలో ” కోవిడ్‌-19 సమయంలో భారత అసమాన ఆర్ధిక పోరాటం ” అని ఒక నినాదం ” 2020లో ప్రపంచంలోని పెద్ద ఆర్ధిక వ్యవస్దలలో అత్యధిక జిడిపి అభివృద్దిని నమోదు చేసేందుకు భారత్‌ నడుం కట్టింది ” అని మరొక నినాదాన్ని రాశారు. వాటి కింద భారత్‌ 1.9శాతం, చైనా 1.2 శాతం చొప్పున వృద్ది చెందుతాయని, అమెరికా 5.9, జర్మనీ 7, ఫ్రాన్స్‌ 7.2, ఇటలీ 9.1, స్పెయిన్‌ 8, జపాన్‌ 5.2, బ్రిటన్‌ 6.2 , కెనడా 6.5 శాతాల చొప్పున తిరోగమన వృద్ధి నమోదు చేస్తాయని పేర్కొన్నారు. ఈ అంకెలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్ద నుంచి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఐఎంఎఫ్‌ అంకెలకు, ఇతర సంస్దల అంచనాలకు తేడాలుంటాయి. వాటి గురించి పేచీ లేదు. ఈ అంకెలతో బిజెపి జనాన్ని తప్పుదారి పట్టించింది అన్నదే గమనించాల్సిన అంశం. ఇదే బిజెపి ఏప్రిల్‌ 15న చేసిన ఒక ట్వీట్‌లో ఇదే అంకెలతో భారత అభివృద్ది గురించి పేర్కొన్నది. అప్పటి చిత్రంలో 2021లో పైన పేర్కొన్న దేశాల ఆర్ధిక వ్యవస్ధలు పురోగమనంలో ఉంటాయని ఐఎంఎఫ్‌ అంకెలను పేర్కొన్నది. ఇప్పుడు వచ్చే ఏడాది అంచనాలను తొలగించి వర్తమాన సంవత్సరానికి నాలుగు నెలల క్రితం వేసిన అంచనాలు తాజావి అన్నట్లుగా పాత అంకెలనే బిజెపి ఆగస్టు 22న ట్వీట్‌ చేసింది. ఇది తప్పుదారి పట్టించటం తప్ప నిజాయితీ కాదు.


ఈ ఏడాది మిగిలిన కాలమంతా తీవ్ర ఆర్ధిక మాంద్యంలో ఉంటుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో మాత్రమే కోలుకోవటం ప్రారంభం కావచ్చని ఆగస్టు 18-27 మధ్య రాయిటర్స్‌ వార్తా సంస్ద నిర్వహించిన అభిప్రాయసేకరణలో ఆర్ధికవేత్తలు పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న వైరస్‌ వ్యాప్తిని చూస్తే సమీప భవిష్యత్‌లో కోలుకొనే అవకాశాలు కనిపించటం లేదని, ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున జనం దగ్గర పొదుపు చేసుకున్న మొత్తాలు కూడా కరిగిపోతాయని, తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి రేటు 18.3శాతం కుంగిపోనుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మూడు నెలల్లో వృద్ధి రేటు మూడుశాతం మాత్రమే ఉండవచ్చని చెప్పారు. కరోనాకు ముందు స్ధితికి చేరుకొనేందుకు ఏడాది పట్టవచ్చని 80శాతం మంది ఆర్ధికవేత్తలు చెప్పారు. మిగిలిన వారు రెండు సంవత్సరాలకు పైగా పట్టవచ్చని మిగిలిన వారు చెప్పారు.


ప్రతి ఏటా ఐఎంఎఫ్‌ ఏప్రిల్‌లో ఒకసారి, సెప్టెంబరు లేదా అక్టోబరులో రెండవ సారి ఆర్ధిక వ్యవస్ధల గురించి అంచనాలు, జోశ్యాన్ని వెల్లడిస్తుంది. అయితే కరోనా కారణంగా జూన్‌లో కూడా అంచనాలను సవరించింది. దాని ప్రకారం 2020లో చైనాలో ఒక శాతం పురోగమనం, మన దేశంలో 4.9శాతం తిరోగమనంలో ఉంటుందని పేర్కొన్నది. కానీ బిజెపి మాత్రం 1.9శాతం పురోగమనం అని వెలిగిపోతున్న చోట దేశం ఉందని, వేగంగా అభివృద్ది చెందుతున్నదని ఐఎంఎఫ్‌ పేరుతో బుకాయిస్తున్నది ! తప్పుడు విధానాలతో కరోనాతో నిమిత్తం లేకుండానే దేశాన్ని దిగజార్చిన వారు, కరోనా పేరుతో ఎంతకైనా దిగజారేందుకు సిద్ద పడుతున్నారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతీయవాద పులి మీద నరేంద్రమోడీ స్వారీ !

24 Monday Aug 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

COVID-19, Donald trump, Eurasia, India economy slowdown, Narendra Modi, Narendra Modi fifth biggest geopolitical risk, nationalism

ఎం కోటేశ్వరరావు
ప్రతి ఉగాదికి పంచాంగం చెప్పే పండితుల గురించి మనకు తెలిసిందే. వాటిలో సానుకూల అంశాలు తప్ప ప్రతి కూల అంశాలు సాధారణంగా చోటుచేసుకోవు. మహా అయితే కరవుల గురించి చెబుతారు. రాజకీయ పార్టీలకు పంచాంగం చెప్పే వారు ప్రతికూలంగా చెబితే వారు కార్యాలయాల గేటును ఎలా దాటుతారో వారికే తెలియదు. కనుక అది కూడా బి పాజిటివ్‌గానే ఉంటుంది.


ఉగాది పంచాంగానికి భిన్నంగా ప్రపంచానికి లేదా దేశాలకు ముప్పుగా పరిణమించే వారు లేదా పరిణామాల గురించి చెప్పేరాజకీయ జోశ్యులు కూడా ఉన్నారు. అమెరికా కేంద్రంగా పని చేసే యూరేసియా గ్రూప్‌ వాటిలో ఒకటి. 2020లో ప్రపంచ రాజకీయ ముప్పుగురించి జనవరిలో ఒక విశ్లేషణను వెలువరించింది. తరువాత మార్చినెలలో దానిని నవీకరించింది. అయినా తొలి పది ముప్పు జాబితాలో ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా అమెరికా గడ్డమీద పని చేస్తున్న సంస్ధ గనుక ప్రపంచానికి అమెరికా నుంచి తలెత్తే ప్రధాన ముప్పు జాబితాలో అక్కడి రాజకీయాలను చేర్చదు. కానీ ఈ ఏడాది దానికి భిన్నంగా తొలి ప్రపంచ రాజకీయ ముప్పుగా అమెరికా అంతర్గత రాజకీయాలని పేర్కొనటం విశేషం. రెండవదిగా సాంకేతిక రంగం, వాణిజ్యంలో చైనా-అమెరికా యుద్దం, మూడవదిగా అమెరికా-చైనా రాజకీయ వ్యవస్ధల మధ్య ముదురుతున్న వైరం, నాలుగవదిగా కార్పొరేట్‌ సంస్ధల పోరు, ఐదవదిగా నరేంద్రమోడీ వైఖరిని పేర్కొన్నది.


ఈ జోశ్యం లేదా రాజకీయ అంచనాలకు అనుగుణ్యంగానే తొలి ఎనిమిది నెలల్లో దాదాపు వాటి చుట్టూనే పరిణామాలు జరగటాన్ని గమనించవచ్చు. జనవరి నాటికి కరోనా వైరస్‌ అంశం యూరేసియా గ్రూప్‌ పరిగణనలో లేదు. మార్చినాటికి సవరించినా అప్పటికి అంతగా సమస్య తీవ్రతరం కాలేదు. ప్రపంచ రాజకీయ ముప్పుకు సంబంధించి తొలి ఐదు అంశాలలో పక్కాగా మొదటిది డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాలో, రెండవది ఆ పెద్ద మనిషి జిగినీ దోస్త్‌ నరేంద్రమోడీకి చెందాయి.మరో రెండింటిలో ట్రంప్‌కు మద్దతుగా నరేంద్రమోడీ ఉండటం యాదృచ్చికమా ? పధకం ప్రకారం జరిగిందనుకోవాలా ? నాటకీయ పరిణామాల మధ్య తిరిగి ట్రంప్‌ ఎన్నికైతే పాత కౌగిలింతలు కొనసాగుతాయి, సర్వేలు చెబుతున్నట్లుగా జోబిడెన్‌ గెలిస్తే నరేంద్రమోడీ కొత్త ప్రియుడి ప్రసన్నం కోసం ప్రయత్నించాల్సిందే.
2020లో మోడీ తన రెండవ పదవీ కాలంలో ఆర్ధిక అజెండాను ఫణంగా పెట్టి వివాదాస్పద సామాజిక విధానాలను ముందుకు తెస్తారని, మతపరమైన, ఒంటెత్తువాదంతో అస్దిర పరిస్ధితి ఏర్పడుతుందని, విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురుదెబ్బలు తగులుతాయని కూడా యూరేసియా నివేదిక పేర్కొన్నది. ఆర్టికల్‌ 370రద్దు, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, ముమ్మారు తలాక్‌ రద్దు, ఎన్‌ఆర్‌సి, సిఏఏ వంటి అంశాలను మరింత ముందుకు తీసుకుపోతారనే జోశ్యం దానిలో ఉంది. అయితే అనూహ్యంగా కరోనా సమస్య ముందుకు రావటంతో అవి తాత్కాలికంగా తెరవెనుకకు పోయాయి. విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురవుతున్న సమస్యలను మనం చూస్తున్నదే.


రెండవసారి ఎన్నికైనప్పటి నుంచి ఆర్ధిక అంశాలను విస్మరించి వివాదాస్పద సామాజిక అంశాలను ముందుకు తెచ్చారనేందుకు తార్కాణంగా గత ఏడాది తొలి మూడు నెలల కాలంలో 8శాతంగా ఉన్న వృద్ది రేటు నాలుగవ త్రైమాస కాలానికి 4.2శాతానికి పడిపోవటం తెలిసిందే. యూరేసియానే కాదు అనేక మంది ఆర్ధిక వేత్తలు చెప్పినట్లు ఈ దిగజారుడుకు కరోనాకు ఎలాంటి సంబంధం లేదు. అనేక మంది ముందే హెచ్చరిస్తున్నా మందగమనం తప్ప మాంద్యం లేదని ప్రభుత్వం బుకాయించిందే తప్ప వాస్తవాన్ని అంగీకరించలేదు. వరుసగా ఆరునెలల పాటు ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో పయనిస్తే దాన్ని అధికారయుతంగా మాంద్యం అని పరిగణిస్తారు. ఇప్పుడు దేశం వర్తమాన ఆర్దిక సంవత్సరం తొలి మూడుమాసాల్లో ( ఏప్రిల్‌-జూన్‌) తిరోగమనం అన్నది స్పష్టం కాగా అది ఏ స్దాయిలో ఉందో ఇంకా వెల్లడించాల్సి ఉంది. దేవుడు నైవేద్యం తినడనే వాస్తవం పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్నట్లుగా ఆర్ధిక దిగజారుడు ముందే తెలుసు గనుక కార్పొరేట్లకు రాయితీలతో వర్తమాన సంవత్సర బడ్జెట్‌ను రూపొందించారు. కరోనా రాకపోయినా దానితో ఫలితం ఉండేది కాదు. కరోనా రావటంతో ఇప్పుడు అసలు విషయాన్ని దాచి పెట్టి కరోనా పేరుతో విదేశాంగ విధానం, ఆర్ధిక రంగాలలో జాతీయ వాదానికి తెరతీసి దేశ పౌరుల దృష్టిని మళ్లించేందుకు పూనుకున్నారు.


ప్రపంచీకరణ నిరంతర అభివృద్ధికి తోడ్పడుతుందని నమ్ముతారు. లేనట్లయితే ఆ క్రమంలో దాని ఆర్ధిక ప్రయోజనాలు, రాజకీయ మద్దతు దెబ్బతింటుంది అని ప్రముఖ అమెరికన్‌ ఆర్ధిక వేత్త పాల్‌ శామ్యూల్‌సన్‌ హెచ్చరించాడు. పెట్టుబడిదారీ వ్యవస్ధ ఎలాంటిదో కరోనా వైరస్‌ నిరూపించింది.దాని కంటే ముందే ప్రపంచీకరణ సంగతి తరువాత ముందు మన సంగతి మనం చూసుకుందామని ప్రతి దేశం రక్షణాత్మక చర్యలకు, జాతీయవాదానికి పెద్దపీట వేస్తున్నది. డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు పీఠీన ఉంటే మన దేశం, నరేంద్రమోడీ కూడా అదే బాటలో ఉన్నారు.

ఓకల్‌ ఫర్‌ లోకల్‌ (స్ధానిక తయారీ వస్తువులనే అడగండి) అని మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు, సరిహద్దు సమస్యను సాకుగా చూపి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం, చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు వంటివి వాటిలో భాగమే. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కొన్ని జాతీయవాద ధోరణులను చూద్దాం. అమెరికాకు అగ్రస్ధానం అన్నది అందరికీ తెలిసిందే. ట్రంప్‌ గత ఎన్నికల్లో ఆ నినాదంతోనే ప్రచారం చేశాడు. దానిలో భాగంగానే చైనా మీద అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించింది. చైనా వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలపై, ఇతర దేశాలపై తాను ఆంక్షలను ప్రకటించటమే కాదు, తన ఆంక్షలను ఇతరులు కూడా పాటించాలని లేనట్లయితే వారి మీద కూడా చర్యలు తీసుకుంటానని అమెరికా బెదిరిస్తున్నది. ఇరాన్‌ నుంచి మన దేశం చమురు కొనుగోలు నిలిపివేయటానికి ఈ బెదిరింపే కారణం.


గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా అనుసరిస్తున్న వైఖరితో తలెత్తిన పర్యవసానాల కారణంగా ఇతర మార్కెట్లలో ప్రవేశించేందుకు బెల్డ్‌ అండ్‌ రోడ్‌ పేరుతో చైనా తన పధకాలను ముందుకు తీసుకుపోతున్నది. కొందరు దీనిని విస్తరణవాదం అని చిత్రిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు బ్రిటన్‌ వంటి దేశాలు విస్తరణవాదంలో భాగం మనవంటి అనేక దేశాలను వలసలుగా చేసుకున్నాయి. చైనా ఏ దేశాన్నీ ఆక్రమించలేదు. మిగతా దేశాల మాదిరి వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకుంటోంది.


అమెరికా, జపాన్‌లను ఒంటరిగా ఎదుర్కొనే శక్తిలేని ఐరోపా దేశాలు సమిష్టిగా వ్యవహరించేందుకు ఐరోపా యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.అయినా సభ్యదేశాలన్నీ రక్షణాత్మక చర్యలకు పాల్పడుతున్నాయి. దానిలో భాగంగానే యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగింది. వస్తువుల కోసం చైనా, లేదా ఆసియా దేశాల మీద ఆధారపడకూడదనే ధోరణి ఐరోపాలో పెరుగుతోంది. ఐరోపా జాతీయవాదంతో ఐరోపా యూనియన్‌ ముందుకు పోతున్నది.
ఆర్ధిక జాతీయవాదానికి ముద్దు పేరు ఆర్ధిక దేశభక్తి. ఆర్ధిక జనాకర్షక నినాదాలు, చర్యలు ఆచరణలో భాగం. తొలి రోజుల్లో స్వేచ్చా మార్కెట్‌ ఛాంపియన్‌గా ముందున్న నరేంద్రమోడీ ఇప్పుడు దానికి వ్యతిరేకమైన వైఖరిని అనుసరిస్తున్నారనే విమర్శలు ప్రారంభమయ్యాయి. ప్రపంచీకరణలో భాగమైన ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరేందుకు తిరస్కరించటం వాటిలో ఒకటి.( దానిలో చేరితే మన దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని దేశంలోని దాదాపు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించాయి) తాజాగా చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యల ఆంతర్యమిదే. ఈ రోజు చైనాతో ప్రారంభం కావచ్చుగానీ ఆర్ధిక జాతీయవాదం మరింత ముదిరితే అది మిగతా దేశాల పెట్టుబడులకు, వస్తువులకు సైతం విస్తరించే అవకాశాలు ఉన్నాయి. స్ధానిక వస్తువులనే అడగండి, ఆత్మనిర్భరత పేరుతో స్ధానికంగా అవసరమైన వస్తువులను తయారు చేసుకోవాలనే నినాదాలతో మన దేశం కూడా రక్షణ చర్యలకు పూనుకుంది. దీన్నో తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఇంతకు ముందు ఉన్న నిబంధనలను సడలించి 200 కోట్ల రూపాయల లోపు వస్తువులు, సేవలను విదేశాల నుంచి పొందకూడదని నిర్ణయించింది. చైనా నుంచి పెట్టుబడులను నిరోధించేందుకు వీలుగా నిబంధనలను సవరించింది. దీన్ని ఆర్దిక జాతీయవాదం అంటున్నారు.


జాతీయవాదానికి అనుగుణ్యంగా ఏ దేశానికి ఆ దేశం రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ఇతర దేశాల మీద ఆధారపడకుండా దేశీయంగానే అవసరాలను తీర్చుకొనేందుకు తీసుకొనే చర్యలను తప్పుపట్టనవసరం లేదు. కొన్ని సందర్భాలలో తప్పదు. ప్రపంచీకరణలో భాగంగా అమలు జరుపుతున్న ఉదారవాద విధానాలు అన్ని దేశాలకూ ఉపయోగపడటం లేదు. దానికి మన దేశమే చక్కటి ఉదాహరణ. ఇతర దేశాల వస్తువులన్నీ మన దేశంలో కుమ్మరిస్తున్నారు. ఫలితంగా స్ధానిక చేతివృత్తులు, పరిశ్రమలు, చివరికి వ్యవసాయం మీద కూడా ప్రతికూల ప్రభావాల పడ్డాయి.జాతీయ వాదాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు, కానీ జాతీయోన్మాదాన్ని ఎలా చూడాలి. పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ఎత్తుగడల్లో భాగంగా ఇలాంటి వాటిని ముందుకు తీసుకు వస్తారు.


జాతీయవాదంలో భాగంగా పోలీసు, మిలటరీ కాంటీన్లలో మన దేశంలో తయారైన వస్తువులను మాత్రమే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిషేధిత వస్తువుల జాబితాలో పండ్లు తోముకొనే కోల్గేట్‌ పేస్ట్‌ వంటి బహుళజాతి సంస్దల ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అవేవీ చైనా ఉత్పత్తులు కాదు. నిజానికి కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నరేంద్రమోడీ అధికారానికి రాగానే ఈ చర్యలెందుకు తీసుకోలేదు? టిక్‌టాక్‌ లేదా ఇతర చైనా యాప్‌లు మన భద్రతకు ముప్పు అని ఆకస్మికంగా గుర్తుకు రావటం ఏమిటి ? అదే నిజమైతే దానికి మోడీ అండ్‌కోను విచారించాలా లేదా ?


దేశంలో 1991నుంచి నూతన ఆర్ధిక విధానాలకు తెరతీశారు. అప్పటి వరకు లేని స్వదేశీ జాగరణ మంచ్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ రంగంలోకి తెచ్చింది. నూతన ఆర్ధిక విధానాలను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు గనుక, తామూ దేశ ప్రయోజనాలకోసమే పని చేస్తామని చెప్పేందుకు ఆ సంస్ధను ఏర్పాటు చేశారు. అదే ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టి అయిన బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత చేసిందేమిటి ?


చైనా వస్తువులను విధిగా కొనాలన్న నిబంధనలేవీ ప్రపంచ ఆరోగ్య సంస్ధ విధించలేదు. ఇక్కడున్న కమ్యూనిస్టు పార్టీలేవీ చైనా వస్తువుల గురించి లాబీయింగ్‌ జరపలేదు, దిగుమతి చేసుకోవాలని అడగలేదు. చైనా పెట్టుబడుల విషయం కూడా అంతే. గత ఆరు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడి కావటానికి నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన అవకాశాలు తప్ప తమ వస్తువులు కొనమని,పెట్టుబడులు తీసుకోవాలని చైనా వైపునుంచి వత్తిడేమీ లేదు. లేదా అమెరికా మాదిరి ప్రతీకార చర్యలు ఉన్నట్లు ఎవరూ ఇంతవరకు చెప్పలేదు.


అన్ని దేశాలూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో భాగస్వాములుగా ఉన్నపుడు దాని నిబంధనలను అమలు జరపటం వాటి విధి. లేకపోతే బయటకు వచ్చే స్వేచ్చ ఉంది. కమ్యూనిస్టులు అంతర్జాతీయవాదులు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం జరుపుతోందని భావిస్తున్నారు కనుక ఆ పార్టీ విధానాల మంచి చెడ్డల గురించి సహజంగానే ఆసక్తి ఉంటుంది. పార్టీల మధ్య సంబంధాలు కూడా పెట్టుకుంటారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఏ బంధం ఉందని బిజెపి ప్రతినిధి బృందాలు చైనా పర్యటనకు వెళ్లినట్లు ? నోరు తెరిస్తే చైనా కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వం అంటారు.


భారత్‌-చైనా మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. అందువలన రెండు దేశాల ఆర్ధిక వ్యవస్ధలు,ఇతర అనేక అంశాల గురించి రెండు దేశాలను పోల్చటం నరేంద్రమోడీ అధికారంతో నిమిత్తం లేకుండానే ఎప్పటి నుంచో జరుగుతోంది.చైనాతో మన దేశాన్ని పోల్చటాన్ని కొందరు దేశ ద్రోహంగానూ, చైనా భక్తిగానూ వర్ణిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో ఆ దాడి ఎక్కువగా ఉంది. చైనాతో మన దేశాన్ని పోల్చి ఎక్కువగా మాట్లాడుతున్నదెవరు ? నరేంద్రమోడీ ప్రధాని అయిన ఆరునెలల్లోపే చైనాను సందర్శించిన బిజెపి బృందాలు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే రాజకీయ పాఠశాలలను ఎందుకు సందర్శించాయి. మేము కూడా కమ్యూనిస్టు పార్టీ మాదిరే పార్టీని విస్తరిస్తామని, రాజకీయ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిందెవరు? చైనా కమ్యూనిస్టు పార్టీతో పోల్చుకున్నదెవరు?


చైనాను పక్కకు నెట్టి ప్రపంచానికి వస్తువులను అందిస్తామంటూ మేకిన్‌ ఇండియా, ఇప్పుడు మేక్‌ ఫర్‌ వరల్డ్‌ అని, త్వరలో జిడిపి రేటులో చైనాను అధిగమిస్తామని చెబుతున్నదెవరు ? ప్రతి ఏటా అనుకూలంగానో వ్యతిరేకంగానో చైనా వస్తువుల గురించి మాట్లాడుతున్నది వారే. అంతెందుకు 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సర్వేలో చైనా మాదిరి ఉపాధి, అభివృద్ది గురించి దాదాపు పదిపేజీలు కేటాయించి రాసినవారెవరు ? దీన్ని పోలిక అంటారా మరొకపేరుందా ?ఒక వేళ అదే దేశద్రోహం అయితే సంఘపరివార్‌ శక్తులే తొలి దేశద్రోహులు అవుతారు. చైనాను పక్కన పెట్టండి, అభివృద్ధి చెందిన దేశాల సరసకు దేశాన్ని తీసుకుపోతామని చెబుతారు. దాన్నేమంటారు ? పోలిక తప్పు కాదు. అయినా పోల్చిన వారిని దేశవ్యతిరేకులు అంటున్నారంటే జనాన్ని తప్పుదారి పట్టించటం తప్ప అది జాతీయవాదమా ? జాతీయోన్మాదమా ?


వలస పాలనను వ్యతిరేకించటం స్వాతంత్య్రానికి ముందు జాతీయవాదం. ప్రపంచాన్ని ఆక్రమించుకొనే క్రమంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, డచ్‌, పోర్చుగీసు, ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలలో జాతీయ వాదం ముందుకు వచ్చింది. తమ దేశం ప్రపంచంలో పై చేయి సాధించాలంటే ప్రపంచాన్ని ఆక్రమించాలనేది వాటి జాతీయ వాదం. చైనా,జర్మనీ, దక్షిణకొరియా, జపాన్‌ వంటి దేశాలతో పోటీపడుతూ వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాలను కోవటంలో తప్పు లేదు. వాటిని పక్కకు నెట్టి ఆ స్ధానాన్ని మనమే ఆక్రమించాలనుకుంటే అది సమస్యలకు దారి తీస్తుంది. నాడు జాతీయవాదంతో ఐరోపా దేశాలు పోటీపడి తొలుత ప్రాంతీయ యుద్ధాలు తరువాత ప్రపంచ యుద్ధాలకే పాల్పడ్డాయి. వస్తు తయారీ జాతీయ వాదం ముదిరితే అది వాణిజ్య యుద్దాలకు దారి తీస్తుంది.


అమెరికాను మరోసారి అగ్రస్ధానంలో నిలబెడతానని డోనాల్డ్‌ ట్రంప్‌ చెబితే మంచి రోజులు తెస్తానని మన నరేంద్రమోడీ వాగ్దానం చేశారు. ఇద్దరూ విఫలమయ్యారు. కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేయటంలోనూ అదే రికార్డు. వైరస్‌ నివారణ రాష్ట్రాల బాధ్యత అని తప్పించుకొనేందుకు పూనుకోవచ్చు. ప్రపంచం మొత్తాన్ని మహమ్మారులు చుట్టుముట్టినపుడు దేశపాలకులు తమ బాధ్యత లేదని తప్పించుకుంటే కుదరదు. జిడిపిని ఐదులక్షల కోట్ల డాలర్లకు తీసుకుపోతానని నరేంద్రమోడీ చెప్పారు. రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా సాధిస్తారా ? ఏ క్షణంలో అయినా కరోనా కేసుల్లో మన దేశాన్ని అమెరికా సరసన చేర్చే దిశలో ఉన్నారు. నరేంద్రమోడీ ఘోరవైఫల్యంగా ప్రపంచం కరోనా విస్తరణను చూస్తున్నది. అదే విధంగా కరోనా వైరస్‌ను తక్కువ చేసి మాట్లాడటం ట్రంప్‌ ఏలుబడిలోని అమెరికా చరిత్రలో అతి పెద్ద గూఢచర్య వైఫల్యంగా చరిత్రలో నమోదైంది. చరిత్రలో అమెరికా ఎంత ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నదో అదే బాటలో భారత్‌ కూడా పయనిస్తున్నది. రెండింటికీ కరోనా ఒక్కటే కారణం కాదు. రాకెట్‌ మాదిరి అమెరికాలో ఆర్ధిక స్దితి తిరిగి దూసుకుపోనుందని ట్రంప్‌ కనీసం మాటలైనా చెబుతున్నారు. నరేంద్రమోడీ నుంచి ఒక్క మాటైనా విన్నామా ?


డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ ఒకే కంచం-ఒకే మంచం స్నేహితుల మాదిరి ఉన్నారు. ఇద్దరూ తమ వైఫల్యాలను లేదా ఆర్ధిక, కరోనా వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు చైనా వ్యతిరేకతను ముందుకు తీసుకు వచ్చారు. ఒక రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీలను అక్కడి ప్రభుత్వం అణచివేస్తున్నదనే పేరుతో చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. దేశ భద్రతకు ముప్పు అనే పేరుతో చైనా యాప్‌లను మోడీ నిషేధించారు. ఇలా ఇద్దరు స్నేహితులూ ప్రజాకర్షక జాతీయవాద పులి స్వారీ చేస్తున్నారు. పెద్దలు చెప్పిన దాని ప్రకారం పులి స్వారీకి దిగిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి లేనట్లయితే దానికి బలికావాలి ! ఇద్దరు స్నేహితులకు ఆ సత్తా ఉందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెజాన్‌, అంబానీ సేవలో మోడీ – ఆందోళనలో కిరాణా దుకాణాల నాడి !

21 Friday Aug 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Jeff Bezos, Kirana Shopper, Mukesh Ambani, Reliance vs Amazon


ఎం కోటేశ్వరరావు
బాంక్‌ ఆఫ్‌ చైనా మన ప్రయివేటు ఐసిఐసిఐ బ్యాంకులో 15 కోట్ల రూపాయల విలువగల వాటాలను కొనుగోలు చేసింది. దీని మీద దేశంలో కొందరు గగ్గోలు లేవనెత్తారు. ఇంకేముంది సదరు బ్యాంకును చైనా మింగేసింది అన్నట్లుగా చిత్రించారు. ఇంతకూ అది ఎంత అంటే ఆ బ్యాంకు వాటాలలో 0.006శాతం మాత్రమే.
అమెరికాకు చెందిన ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ద అమెజాన్‌ గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలోని సంస్ధలను, వ్యాపారాన్ని మింగివేస్తున్నది. టాటా గ్రూప్‌కు చెందిన వెస్ట్‌లాండ్‌ అనే ప్రచురణ, పుస్తకపంపిణీ సంస్దలో 26శాతం వాటాలను 9.5 కోట్ల రూపాయలకు 2016 ఫిబ్రవరిలో కొనుగోలు చేసింది. మిగిలిన 74శాతం వాటాలను కూడా తీసుకుంటానని అంగీకరించింది. 2018లో టాప్‌జో అనే కంపెనీని 4 కోట్లడాలర్లకు (అంటే దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువ) కొనుగోలు చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ మోర్‌ అనే పేరుతో ఒక సూపర్‌ మార్కెట్‌ దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేసింది. వారి నుంచి ఒక సంస్ద దాన్ని రూ.4,200 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సంస్ధ నుంచి 49శాతం వాటాలను అమెజాన్‌ కొనుగోలు చేసి పెద్ద సంఖ్యలో దుకాణాల ఏర్పాటుకు పూనుకుంది.
పార్టిసిపేటరీ నోట్స్‌ పేరుతో విదేశీ పెట్టుబడిదారులు మన స్టాక్‌ మార్కెట్లో ఏ కంపెనీ వాటాలను అయినా కొనుగోలు చేయవచ్చు, లాభం అనుకున్నపుడు అమ్ముకొని వెళ్లిపోవచ్చు. ఒక దశలో మన దేశాలో ఇలాంటి పెట్టుబడులు నాలుగున్నరలక్షల కోట్ల రూపాయల మేరకు చేరాయి. ఇలా బడా కార్పొరేట్‌లు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో మన సంస్ధలను మింగివేస్తూ లాభాలను తరలించుకుపోతుంటే చైనా బ్యాంకు కేవలం 15 కోట్ల రూపాయల వాటాలను కొన్నందుకు గగ్గోలు పెట్టటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? ఏనుగులను దూరే కంతలను వదలి చీమలు దూరే వాటి మీద కేంద్రీకరించినట్లు అనుకోవాలా ? ఇది దేశ భక్తా లేక చైనా వ్యతిరేకతా ? ఇలా ప్రశ్నించటాన్ని చైనా అనుకూలం అని ఎవరైనా అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ఐసిఐసి అయినా హెచ్‌డిఎఫ్‌సి అయినా మరొక కంపెనీ అయినా వాటాలు, ఆస్ధులను అమ్మకానికి పెట్టటమా లేదా అన్నది వేరే అంశం. బహిరంగ మార్కెట్‌లో ఎవరైనా శక్తి ఉన్నవారు ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఏ విదేశీ సంస్ధ అయినా మన ప్రభుత్వం అనుమతించిన మేరకు లాభాలను తరలించుకుపోయేదే తప్ప మరొకటి కాదు.
ఇప్పుడు చిన్న చిన్న దేశాలను సైతం కొనుగోలు చేయగలిగిన బడా కార్పొరేట్‌లు మన మార్కెట్‌ను తమ స్వంతం చేసుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకున్నాయి. ఒక నాడు గుత్తాధిపత్యాన్ని నిరోధించేందుకు చట్టాలు చేసిన మన దేశం ఆరోగ్యకరమైన ఆ విధానాన్ని విస్మరించి అంతర్జాతీయ సంస్దల వత్తిడి లేదా ఆదేశాల మేరకు ఆ చట్టాన్ని రద్దు చేసి పోటీ కమిషన్‌ పేరుతో కొత్త చట్టాలను చేశాయి. దానిలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకొనే వారు లేరు. ఒక వైపు తీవ్ర ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. మరోవైపు మూల మూలకూ తమ దుకాణాల గొలుసును విస్తరించేందుకు విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌లు కండలు పెంచుతూ కసరత్తు చేస్తున్నాయి. ఆంబోతుల మధ్య లేగదూడలు నలిగినట్లుగా పెద్ద ఎత్తున స్వయం ఉపాధికల్పిస్తున్న కిరాణా దుకాణాల భవిష్యత్‌ నానాటికీ ప్రశ్నార్ధకంగా మారుతూ ఉపాధి సమస్యను ముందుకు తెస్తోంది. మన దేశంలో అతి పెద్ద కార్పొరేట్‌ సంస్ధ అయిన రిలయన్స్‌, అమెరికాలో అతి పెద్ద సంస్ధ అయిన అమెజాన్‌ మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు గోదాలోకి దిగాయి. రానున్న రోజుల్లో పోటీ ఏ విధంగా సాగుతుందో, పర్యవసానాలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారుతోంది.
రిలయన్స్‌ కంపెనీ అధిపతి ముకేష్‌ సంపాదన గంటకు ఏడు కోట్ల రూపాయలు కాగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ తొమ్మిది రెట్లు అంటే గంటకు 63 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు అంచనా.రిలయన్స్‌ కంపెనీ విలువ గత ఏడాది 140 బిలియన్‌ డాలర్లు కాగా అమెజాన్‌ విలువ 991.6బిలియన్‌ డాలర్లు. ఆసియాలోనే అతి పెద్ద ధనవంతుడైన ముకేష్‌ అంబానీ నిన్నా మొన్నా తన కంపెనీల్లో వాటాలను అమ్మి దాదాపు 20 బిలియన్‌ డాలర్ల మేర ( దాదాపు లక్షా 50వేల కోట్ల రూపాయలు) ధనం కూడ బెట్టుకున్నట్లు, తన కంపెనీలకు అప్పులు లేకుండా చేసుకున్నట్లు వార్తలు చదివాం. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి కంపెనీలు వాటిని కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే ముకేష్‌ తానే అనేక కంపెనీల కొనుగోళ్లకు దిగారు. అమెజాన్‌తో పోటీ పడేందుకు తన వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరించుకొనేందుకు పూనుకున్నారు. రోగులు దుకాణాలకు పోకుండా ఆన్‌లైన్‌లో ఆర్డరు చేస్తే ఔషధాలను అందచేసే నెట్‌మెడ్స్‌ అనే కంపెనీలో 620 కోట్లకు మెజారిటీ వాటాలను కొనుగోలు చేసినట్లు ఇది రాసిన సమయానికి చదివాము. ఇప్పటికే అమెజాన్‌ రంగంలో ఉంది. వచ్చే ఐదు సంవత్సరాలలో పాలు సరఫరా చేసే కంపెనీతో సహా అనేక సంస్ధలను తన సామ్రాజ్యంలో కలుపుకొనేందుకు పావులు కదుపుతున్నాది. రిలయన్స్‌ సంస్ధ జియో ఫోన్లతో పాటు ఇప్పుడు జియో మార్ట్‌ కంపెనీ ద్వారా కిరాణా సరకులను ఇండ్లకు అందచేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. వాల్‌ మార్ట్‌ కంపెనీ ఇప్పటికే 16 బిలియన్‌ డాలర్లు, అమెజాన్‌ 5.5 బిలియన్‌ డాలర్ల రంగంలోకి దిగాయి. స్వదేశీ డిమార్ట్‌ కూడా పోటీకి సన్నద్దం అవుతోంది. ఉల్లిపాయల మొదలు ఆర్ధిక సేవల వరకు దేన్నీ వదిలేందుకు ఇవి సిద్ధంగా లేవు.
మోటారు వాహనాల బీమా పాలసీలను ఎలాంటి పత్రాలతో నిమిత్తం లేకుండా కేవలం రెండు నిమిషాల్లో పునరుద్దరించే సేవలను అమెజాన్‌ ప్రారంభించింది. త్వరలో అమెజాన్‌ మెడికల్‌ షాపులు కూడా రాబోతున్నాయి.దాన్లో ఇంగ్లీషు మందులతో పాటు మూలికా ఔషధాలు కూడా ఉంటాయి. చైనాలో ప్రవేశించేందుకు విఫలయత్నం చేసిన ఈ సంస్ధ ఇప్పుడు మన మార్కెట్‌ మీద కేంద్రీకరించింది.
రిలయన్స్‌ లేదా అమెజాన్‌ వంటి బడా సంస్ధలన్నీ జన సమ్మర్దం ఎక్కువగా ఉండే పట్టణాల మీదే కేంద్రీకరిస్తున్నాయి. పని వత్తిడిలో ఉండే వారు, ధనికులు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. రిలయన్స్‌ జియో మార్ట్‌లో కొద్ది వారాల్లోనే రోజుకు రెండున్నరలక్షల ఆర్డర్లు వచ్చాయి. రెండు వందల పట్టణాలకే ప్రస్తుతం ఉన్న ఈ సేవలను విస్తరిస్తే ఇంకా పెద్ద మొత్తంలో స్పందన వస్తుంది. అయితే కూరగాయలు చెడిపోవటం, కొన్ని వస్తువుల జాడ లేకపోవటం, వాటికి నగదు వాపస్‌ ఆలస్యం కావటం వంటి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాటిని అధిగమించేందుకు పూనుకున్నారు. పెద్ద పట్టణాల్లో ఉన్న డిమార్డ్‌ దుకాణాల్లో ఇస్తున్న రాయితీలు ఇప్పుడు వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి.
ఇప్పుడు రిలయన్స్‌, అమెజాన్‌ వంటి సంస్ధలన్నీ రాయితీల జల్లులతో వినియోగదారులను ఆకట్టుకోబోతున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఏడాది చందా చెల్లించిన వారికి ఆ సంస్ధ ద్వారా ఏ వస్తువును కొనుగోలు చేసినా ధరల తగ్గింపుతో పాటు రవాణా చార్జీల రాయితీ అదనంగా ఇస్తున్నారు. పెద్ద పట్టణాల్లో ఉన్న బిగ్‌ బజార్‌ కంపెనీలో అమెజాన్‌కు వాటా ఉంది. రిలయన్స్‌ కూడా కొంత వాటాను దక్కించుకొనేందుకు పూనుకోగా అమెజాన్‌ అడ్డుపడుతోంది. అమెజాన్‌ ప్రస్తుతం ఒక్కో వ్యాపార రంగం గురించి ఒక్కొక్క పట్టణంలో ప్రయోగాలు, పరిశీలనలు జరుపుతోంది. ఉదాహరణకు పూనాలో ఇండ్లకు పండ్లు, కూరగాయల సరఫరా. మార్కెట్‌ తీరు తెన్నులు అవగతం అయిన తరువాత తన గొలుసును విస్తరించబోతున్నది.
రిలయన్స్‌ ఇప్పటికే తన దుకాణాల ద్వారా తాజాగా ఇండ్లకు సరఫరా చేస్తున్నది. రైతుల నుంచి నేరుగా ఇప్పటికే కొనుగోలు చేస్తుండగా మరింత ఎక్కువ చేసేందుకు పూనుకుంది. జియో కనెక్షన్‌ రేట్లు తగ్గించటం, ఫోన్లకు రాయితీల వంటి చర్యల ద్వారా మిగతా నెట్‌ వర్కులను దెబ్బతీసిన రిలయన్స్‌ ఇప్పుడు రేట్లు పెంచింది. తన కంటే ఆర్ధికంగా అన్ని విధాలా పెద్ద దైన అమెజాన్‌తో ఎలా ఢకొీంటుందో చూడాల్సి వుంది. స్ధానికంగా ఉండే కిరాణా దుకాలతో అనుసంధానించి ఆన్‌లైన్‌ ఆర్డర్లను పెద్ద ఎత్తున సంపాదించేందుకు ఒప్పందాలు చేసుకోనుంది. అంటే ప్రస్తుతం ఉన్న కిరాణా దుకాణాలు రిలయన్స్‌ లేదా అమెజాన్‌ వంటి కంపెనీల సరకులను సరఫరా చేసే కేంద్రాలుగా మారనున్నాయి. దీని వలన ఆ బడా సంస్దలు మౌలిక సదుపాయాలకు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ కంపెనీల పోటీకి నిలువలేని దుకాణదారులు కోల్పోయిన ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు ఆ కంపెనీల ఏజంట్లుగా మారిపోవటం అనివార్యంగా మారే దృశ్యం కనిపిస్తోంది. అయితే ఇదంతా తెల్లవారేసరికి జరిగిపోతుందని కాదు గానీ, సాంప్రదాయ కిరాణా దుకాణాలు ముందుగా పెద్ద పట్టణాలలో మనుగడ సమస్యలను ఎదుర్కోనున్నాయి.ప్రస్తుతం మన దేశంలో గొలుసుకట్టు షాపులు లేదా ఆన్‌లైన్‌(ఇకామర్స్‌) ద్వారా గానీ కేవలం 12శాతం లావాదేవీలు మాత్రమే జరుగుతున్నాయి. బడా సంస్దలన్నీ రాబోయే 20సంవత్సరాల వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకొని తమ పధకాలను రూపొందిస్తున్నాయి.
ప్రధాన నగరాలలో రిటైల్‌ వ్యాపారులకు వస్తువులను విక్రయిస్తున్న జర్మన్‌ మెట్రో సంస్ధ ఇప్పుడు దాన్ని మరింత విస్తరించి కిరాణా దుకాణదారులకు సరకులను సరఫరా చేసేందుకు ఆలోచిస్తున్నది. అంటే ఒక విధంగా చెప్పాలంటే పంపిణీదారు పాత్ర పోషించనుంది. ఇదే మాదిరి వాల్‌మార్ట్‌, అమెజాన్‌ కూడా హౌల్‌సేల్‌ వ్యాపారంలోకి దిగాలని చూస్తున్నాయి. రిలయన్స్‌ తన జియో ఖాతాదారులు, అదే విధంగా అది నిర్వహిస్తున్న నెట్‌వర్క్‌18పేరుతో వివిధ రాష్ట్రాలు, జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న వివిధ టీవీ ఛానళ్ల వీక్షకులు, రిలయన్స్‌ ఫ్రెష్‌ ఖాతాదారులతో మరింతగా తన కార్యకలాపాలను పెంచుకొనేందుకు చూస్తోంది.చౌకదుకాణాలతో ఒప్పందాలు చేసుకొని వాటి ద్వారా సరఫరా చేయాలని యోచిస్తున్నది. అంతే కాదు కొన్ని చోట్ల స్టాక్‌ పాయింట్ల ఏర్పాటు, ఐదువేల దుకాణాలతో ఇప్పటికే ఒప్పందం చేసుకుందన్న వార్తలు వచ్చాయి. పదివేల కిరాణా దుకాలతో ఒప్పందాలకు ఫ్యూచర్‌ గ్రూపు కూడా ఆలోచిస్తున్నది. అమెజాన్‌ 17,500 దుకాణాలతో, ఫ్లిప్‌కార్ట్‌ 15వేల కిరాణా దుకాణాల ద్వారా సెల్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తుల విక్రయానికి ఆలోచిస్తున్నది. అనేక వేల దుకాణాల ద్వారా ఈ కంపెనీలన్నీ ఆన్‌లైన్‌ వాణిజ్యం జరిపేందుకు పూనుకున్నాయి. ఈ ఏర్పాట్ల ద్వారా విదేశీ, స్వదేశీ బ్రాండ్‌ ఉత్పత్తులు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. పర్యవసానంగా వాటి లావాదేవీలు పెరుగుతున్నాయి.
నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తున్న గొలుసుకట్టు షాపులు ఇస్తున్న రాయితీలు వినియోగదారులను సహజంగానే ఆకట్టుకుంటున్నాయి. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా గొలుసుకట్టు షాపులకు వెళ్లేందుకు వినియోగదారుల సంఖ్య మీద పరిమితులు విధించటంతో అనేక మంది తిరిగి ముఖ్యంగా పట్టణాల్లోని కిరాణా దుకాణాలను ఆశ్రయించారు. నిబంధనలను సడలించిన తరువాత తిరిగి మామూలు స్ధితికి చేరుకుంటున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో దాదాపు 70లక్షల కిరాణా దుకాణాలు ఉన్నట్లు అంచనా. కుటుంబ సభ్యులతో పాటు సగటున ఒక్కొక్క దుకాణం ఇద్దరికి ఉపాధి కల్పించినా దాదాపు రెండున్నర నుంచి మూడు కోట్ల మంది పని చేసే అవకాశం ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

74 ఏండ్ల స్వాతంత్య్రం-2 : ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- హిందూత్వ !

17 Monday Aug 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

74th independence day India, Finance Capital, Narendra Modi, Neoliberalism in India, RSS-Hindutva


ఎం కోటేశ్వరరావు
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌, పాలకుల నివాసాలు శుభ్రంగా ఉన్నాయి, మన సామాన్యుల ఇండ్ల మాదిరి వర్షాలకు కురుస్తున్నట్లు వార్తలేమీ లేవు. దేశం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది, లోటు బడ్జెట్‌ను పూడ్చుకొనేందుకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగపోయినా ఎడా పెడా వేల కోట్ల రూపాయల పన్నులు, ధరల పెంపుతో జనాల జేబులు కొల్లగొడుతున్నారు.లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. కరోనా నివారణ చర్యలకు రాష్ట్రాలు నిధుల్లేక నానా అగచాట్లు పడుతున్నాయి. అయినా నూతన పార్లమెంట్‌ భవనం, ఇతర కట్టడాలు నరేంద్రమోడీ హయాంలో నిర్మిత మయ్యాయనే కీర్తి కండూతి కోసం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలను తగలేసి కట్టేందుకు నిర్ణయించారు. దీన్ని చూస్తే హిట్లర్‌ గుర్తుకు వస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోయేలా ఐరోపాలో ఎక్కడా లేని విధంగా జర్మనీలో గ్రేట్‌ హాల్‌ నిర్మించాలని నిర్ణయించి, నమూనాలను గీయించాడు. రెండవ ప్రపంచ యుద్దంలో కమ్యూనిస్టుల చేతిలో పరాజయం పాలై ఆత్మహత్య చేసుకున్నాడు గానీ గెలిచి ఉంటే దాన్ని నిర్మించి ఉండేవాడు. నెహ్రూ నీటిపారుదల ప్రాజెక్టులకు, ఇతర పారిశ్రామిక సంస్దలకు నాంది పలిక ఆధునిక దేవాలయాలకు ఆద్యుడయ్యాడనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేంద్రమోడీ తన ఖాతాలో ఆర్టికల్‌ 370 రద్దు, విగ్రహాలు, ఆయోధ్యరామ మందిరం తదితర అంశాలతో పాటు పార్లమెంట్‌ భవనాన్ని చేర్చి నెహ్రూ పేరును చెరిపి వేయాలన్న తాపత్రయం, ప్రయత్నం కనిపిస్తోంది.


సుప్రీం కోర్టు తీర్పు మాత్రమే చెప్పింది !
సుప్రీం కోర్టు బాబరీ మసీదు స్ధలం రాముడికే చెందాలని తీర్పు చెప్పింది తప్ప న్యాయం చేకూర్చలేదు అనే విమర్శలు ఉన్నాయి. మసీదు కూల్చివేతను ఒక నేరపూరిత చర్యగా వర్ణించింది.దోషులను శిక్షించేందుకు విచారణను వేగవంతం చేయాలన్నది. అదే కోర్టు మరోవైపున మసీదు కూల్చివేతలో ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఉన్నవారికి ఆ స్ధలంలో రామాలయనిర్మించే బాధ్యతను అప్పగించింది. అయితే అది ఒక ట్రస్టు ఆధ్వర్యాన జరగాలని తీర్పు చెప్పింది. కానీ నరేంద్రమోడీ అండ్‌కో దాన్ని ఒక అధికారిక కార్యక్రమంగా మార్చివేశారు. లౌకిక రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన మోడీ దీనికి హాజరు కావటాన్ని రాజ్యాంగ ఉల్లంఘన అని తప్ప ఏమనాలి ? రామాలయ నిర్మాణం కోసం శతాబ్దాల తరబడి అనేక మంది త్యాగాలు చేశారంటూ స్వాతంత్య్ర ఉద్యమంతో పోల్చటం చరిత్రను కించపరచటం కాదా ? నరేంద్రమోడీ మాతృసంస్ధ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామి కాదు. ఉద్యమాన్ని వ్యతిరేకించింది. ఒక సంస్ధగా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్రం పోరాటంలో ఎందుకు పాల్గొనలేదు అని తనకు తానే ప్రశ్న వేసుకొని ఆ సంస్ధ ప్రముఖుడు నానాజీ దేశముఖ్‌ ఇచ్చిన వివరణే అందుకు నిదర్శ నం.


చెప్పింది చెయ్యరు- చేసేది చెప్పరు !
అచ్చేదిన్‌ (మంచి రోజులు) అని నినాదమిచ్చిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఎన్నికల తరువాత అసలు ఆ మాటను ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రస్తావించలేదంటే అతిశయోక్తి కాదు. అదే విధంగా గుజరాత్‌ అభివృద్ది నమూనాను దేశమంతటా అమలు జరుపుతానని చెప్పారు. దాని ప్రస్తావనా లేదు. విదేశాల్లో దాచుకున్న దొంగ సొమ్మును తీసుకువస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వస్తాయి, ఇస్తామన్నట్లుగా మాట్లాడారు. అదేమైందో తెలియదు. నిరుద్యోగం 40 సంవత్సరాల రికార్డు స్ధాయికి చేరింది అని ప్రభుత్వ గణాంకాల నివేదిక తేల్చింది. అయితే అదంతా తప్పుల తడక, కల్పించిన ఉపాధిని పరిగణనలోకి తీసుకోలేదు, ఉదాహరణకు పకోడీల తయారీ కూడా ఉపాధికల్పనలో భాగమే అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోలేదు, సరైన లెక్కల పద్దతిని రూపొందించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఎన్నికల తరువాత అదే నివేదికను ఆమోదించారు. కొత్త గణాంకాలను తెచ్చిందీ లేదు.2019 పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పిఎల్‌ఎఫ్‌ఎస్‌)ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల కోసం ఆరునెలల పాటు తొక్కిపెట్టింది.2011-12 సంవత్సరాలలో 467.7 మిలియన్‌లుగా ఉన్నకార్మికశక్తి 2017-18 నాటికి 461.5మిలియన్లకు తగ్గిపోయారు. వ్యవసాయ రంగంలో 29.3 మిలియన్ల మంది ఉపాధి కోల్పోగా వారిలో 24.7 మిలియన్ల మంది మహిళలే ఉన్నారు. అయినప్పటికీ పాలకులు మహిళా ఉద్దరణ, విజయగాధల గురించి కబుర్లు చెబుతూనే ఉన్నారు. ఉపాధి తగ్గిపోయినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం .రూపొందించిన నివేదికలో నాలుగు దశాబ్దాల రికార్డు స్ధాయి 6.1.శాతానికి నిరుద్యోగం పెరిగిందని పేర్కొన్నది. దీనికి 2016లో నరేంద్రమోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు కారణం అన్నది దాని సారాంశం. దాన్ని ఎన్నికల ముందు విడుదల చేస్తే నష్టదాయకం కనుక తొక్కి పెట్టారు.


నరేంద్రమోడీ హయాంలో జిడిపి పెరుగుదల మొదలు అనేక గణాంకాలు వివాదాస్పదం అయ్యాయి. ఏది నిజమో కాదో తెలియని సందిగ్ద స్దితిలో జనాన్ని పెట్టారు. మోడీ గణానికి కావాల్సింది అదే. అలాంటి పరిస్ధితిలో తమ ప్రచార యంత్రాంగం ద్వారా అర్ధసత్యాలు, అసత్యాలను ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకోవాలన్నది ఎత్తుగడ. లెక్కించే పద్దతి సరిగా లేదు, మేము సాధించిన వృద్ధి గణాంకాల్లో చేరటం లేదని చెబుతున్న మోడీ సర్కార్‌ ఇంతవరకు సరైన పద్దతిని ఎందుకు రూపొందించలేకపోయింది.అంతచేతగాని స్ధితిలో మన యంత్రాంగం, ప్రధాని సలహాదారులు ఉన్నారా ? లేదూ కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ఉన్న విధానం ప్రకారం రూపొందించిన అంకెలను అంగీరించాలి, జనానికి అందించాలా లేదా ? పెద్ద నోట్ల రద్దు వలన సాధించేదేమిటి అంటే తరువాత కాలంలో లావాదేవీలన్నీ నమోదు అవుతున్నాయని చెబుతున్నారు. దానికోసమే అయితే యావత్‌ జనాన్ని అంత ఇబ్బంది పెట్టటం ఎందుకు, ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీయటమెందుకు? నల్లధనాన్ని బయటపెట్టేందుకు అని చెప్పిన పెద్దలు అసలా మాటనే మరచిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి గురించి దేశం ఏమి ఆశిస్తుంది? ఆచరణలో ఎన్ని లావాదేవీలు నమోదు అవుతున్నాయి. క్రెడిట్‌ కార్డు ద్వారా చిన్న దుకాణదారులందరూ రెండున్నరశాతం అదనంగా వసూలు చేస్తున్నందున వినియోగదారులు నగదు చెల్లింపుకే మొగ్గు చూపుతున్నారు. రియలెస్టేట్‌ రంగంలో లెక్కల్లో చూపుతున్నది ఎంతో నల్లధనం ఎంత చెల్లిస్తున్నారో బహిరంగ రహస్యం. అనేక దుకాణాల్లో కార్డు చెల్లింపులను అంగీకరించటం లేదన్నదీ తెలిసిందే. బిజెపి ఎన్నడూ కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తానని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఎంత నాటకీయంగా ఆపని చేసిందో చూశాము


అభివృద్ధికి ఆటంకం కార్మిక చట్టాలా – పాలకుల విధానాలా ?
దేశంలో అభివృద్ది కుంటుపడటానికి, ముందుకు పోయేందుకు కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కాపలాగా ఉన్న ఒక కుక్కను తప్పించాలంటే దాన్ని పిచ్చిదని ప్రచారం చేయాలన్నట్లుగా కార్మిక చట్టాలను రద్దు చేసి లేదా నీరు గార్చి యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలి వేసి దోపిడీని స్వేచ్చగా కొనసాగనివ్వాలన్నది అసలు లక్ష్యం. ముందే చెప్పుకున్నట్లు ద్రవ్య పెట్టుబడి, నయా ఉదారవాద విధానం కార్మికుల హక్కులను, బేరమాడే, పోరాడేశక్తిని సహించదు.
ఈ నేపధ్యంలోనే 1991 నుంచి ఒక పధకం ప్రకారం కార్మిక చట్టాల సంస్కరణల గురించి ప్రచార దాడి ప్రారంభించారు. మన కేంద్ర ప్రభుత్వం 45, అన్ని రాష్ట్రాలూ కలిపి మరో 170వరకు కార్మిక చట్టాలను చేశాయి. వీటిలో అత్యధిక భాగం కార్మికశక్తిలో పదిశాతానికి అటూ ఇటూగా ఉండే సంఘటిత కార్మికుల కోసం రూపొందించినవే. అసంఘటిత కార్మికులకు ఉన్న రక్షణ నామమాత్రం. అయినప్పటికీ పదిశాతం కార్మికులకు ఉన్న చట్టాలు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని నమ్మబలుకుతున్నారు. అసంఘటిత రంగ కార్మికుల్లో వలస కార్మికులు ఎందరున్నారో, వారికి ఎలాంటి రక్షణ లేదని కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా రుజువైంది. అసలు వారెంత మంది ఉన్నారో, ఎక్కడెక్కడ పని చేస్తున్నారో కేంద్రం లేదా రాష్ట్రాల వద్ద సమాచారమే లేదు, రికార్డులు అంతకంటే లేవు. కరోనా నివారణ కాలేదు కానీ కార్మికశాఖ డొల్లతనం, పాలకుల బండారం బట్టబయలైంది.
కార్మిక చట్టాలను సంస్కరించవద్దని ఎవరూ చెప్పటం లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటిదంటే తిరస్కరించిన దరఖాస్తులను కూడా పరిష్కరించిన జాబితా అంకెల్లో చూపుతుంది. అలాగే సంస్కరణలు అంటే ఉన్నవాటిని మరింత మెరుగుపరచటం గాకుండా అసలు పూర్తిగా ఎత్తివేయటంగా తయారైంది. పారిశ్రామిక, వాణిజ్య సంస్దలలో తనిఖీ యంత్రాంగం అక్రమాలకు పాల్పడుతోంది బాబూ అని కార్మికులంటే యజమానులకు అనుగుణ్యంగా అసలు తనిఖీలనే ఎత్తివేశారు. యాజమాన్యాలు నిబంధనలను సక్రమంగా అమలు జరపటం లేదంటే చట్టాల అమలు గురించి యజమానులు స్వయంగా అఫిడవిట్లు ఇస్తే చాలన్నట్లుగా చెబుతున్నారు.
కోర్టులు ఏ దేశంలో ఏ పాలనా వ్యవస్ధ ఉంటే దాని విధానాలకు అనుగుణ్యంగానే నడుచుకుంటాయన్నది ప్రపంచ అనుభవం. ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే వారికే కాదు యావత్‌ ఉద్యోగులు, కార్మికులకు సమ్మె హక్కు లేదిప్పుడు అంటే అతిశయోక్తి కాదు. సమ్మెను ఒక ఆయుధంగా వాడుతూ అత్యధిక సందర్భాలలో దుర్వినియోగం చేస్తున్నారని కోర్టులు వ్యాఖ్యానించాయి. సమ్మె ప్రాధమిక హక్కు కాదని వ్యాఖ్యానించాయి.


పరస్పర విరుద్ద వాదనలు !
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో మాదిరి పరస్పర విరుద్ద వాదనలు ఎలా ఉంటాయో చూద్దాం. నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది? పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఉన్న లోపాల కారణంగా తలెత్తుతుంది అని కమ్యూనిస్టులు చెబుతారు. కాదు మేము వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఉత్పాదకత పెరుగుతుంది, మాలాభాలు పెరుగుతున్నాయి, పని చేసే వారు ఎక్కువ మంది అవసరం లేదు, అందువలన నిరుద్యోగం పెరుగుతుంది అని యజమానులు, వారికి మద్దతు ఇచ్చే వారు చెబుతారు. ఇదే వాదన చేసే వారు కార్మిక చట్టాలు, కార్మికులకు హక్కులు కలిగించటం వలన వారు వేతనాల పెంపుదల కోసం, హక్కుల కోసం డిమాండ్లు చేస్తారు. వారి చర్యలు ఉత్పత్తికి ఆటంకంగా మారతాయి, ఉత్పాదక ఖర్చులు పెరుగుతాయి అని చెబుతారు. ఒక వైపు యాంత్రీకరణ ద్వారా ఖర్చులు తగ్గించామని చెప్పేవారు ఇక్కడ వేతనాలు పెరిగితే ఖర్చు పెరుగుతుంది అని వాదిస్తారు.


ఉత్పత్తి పడిపోవటానికి కార్మిక సమ్మెలు కారణం కానేకాదు. 2011లో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సామర్ధ్య వినియోగం 83శాతం ఉండగా క్రమంగా తగ్గుతూ పెరుగుతూ కరోనాకు ముందు 2019లో 76శాతం ఉండగా ఈ ఏడాదిలో ప్రస్తుతం 68శాతానికి పడిపోయింది.2003 నుంచి 2014వరకు సమ్మెలు 75శాతం తగ్గితే, పని దినాల నష్టం 90శాతం తగ్గింది. 2014లో 119 సమ్మెలు జరిగితే తరువాత రెండు సంవత్సరాలలో 106,93కు తగ్గాయి. 2017 జనవరి-అక్టోబరు మధ్య కాలంలో 82 జరిగాయి. ఇటీవలి కాలంలో వాణిజ్య సులభతర సూచికలో ఎన్నో పాయింట్ల మెరుగుదల ఉంది, నరేంద్రమోడీ ఏ ప్రధానీ చేయనన్ని విదేశీ పర్యటనలు చేసి సంబంధాలు మెరుగుపరచినట్లు, దేశ ప్రతిష్టను పెంచినట్లు చెప్పటాన్ని విన్నాం. అయినా మన ఎగుమతులు పెరగకపోగా పడిపోయాయి. దీనికి కార్మికులు కారణం కాదు. అయినా కార్మిక చట్టాలను మరింతగా సంస్కరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఎగుమతి ఆధారిత, ప్రత్యేక ఆర్ధిక ప్రాంతాలలో చట్టాలు పని చేయవు, ఇప్పుడు వాటిని ఇతర అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారా ? అనుమానం అక్కర లేదు.
అప్రెంటిస్‌ల పేరుతో చట్టబద్దంగానే శ్రమశక్తిని దోచుకొనేందుకు యజమానులకు అవకాశం కల్పించారు. కనీసం 15శాతం అప్రెంటిస్‌లు ఉండాలి. అంటే వారికి ఎలాంటి చట్టాలు, చట్టబద్ద వేతనాలు వర్తించవు. స్టైఫండ్‌ మాత్రమే ఇస్తారు.రిజిస్టర్లు, ఇతర రికార్డుల నిర్వహణలో కూడా మినహాయింపులు ఇచ్చారు గతంలో 19 మంది కార్మికులున్న ఫ్యాక్టరీలు, సంస్ధలకు ఇలాంటి వెసులుబాటు ఇస్తే నరేంద్రమోడీ గారు ఆ సంఖ్యను 40కి పెంచారు.


మన కార్మికుల శ్రమ శక్తిని దోపిడీ చేసేందుకు స్వదేశీ-విదేశీ కంపెనీలకు విచ్చల విడి అధికారాలను ఇచ్చేందుకు పూనుకున్నారు. మన దేశం మీద విదేశాలకు ఆసక్తి ఏమిటి, ఎందుకు ? ఉదాహరణకు జర్మనీలో గంటకు సగటున 35యూరోలు ఉన్నది. అంటే 41.5డాలర్లు. అందువలన మన దేశంలో గంటకు రెండు డాలర్లు ( రు.150 ) ఇచ్చినా ఇబ్బంది లేదన్నది విదేశీ పెట్టుబడిదార్ల లెక్క. రోబోలను వినియోగించినా గంటకు నాలుగు డాలర్లు అవుతుందని అందువలన రోబోల మాదిరి పని చేసే భారతీయ కార్మికులను వినియోగించుకోవటమే లాభం అని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకు అవసరమైన నైపుణ్యం కలిగిన వారు కావాలి గనుకనే, పెద్ద సంఖ్యలో గతంలో పాలిటెక్నిక్‌లను ప్రోత్సహిస్తే తరువాత తామర తంపరగా ఇంజనీరింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. నైపుణ్య అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించటం కూడా దీనిలో భాగమే.


జర్మనీలో నాజీలు ప్రపంచ యుద్దంలో జర్మనీ పొందిన పరాజయాన్ని పరాభవంగా చిత్రించి జనాల్లో జాతీయ ఉన్మాద భావనలను రెచ్చగొట్టారు. తిరిగి పూర్వ ప్రాభవాన్ని నెలకొల్పాలనే మనోభావాన్ని చొప్పించారు. మన దేశంలో అదే పద్దతుల్లో పన్నెండు వందల సంవత్సరాలుగా హిందువులు బాధితులు అనే ప్రచారాన్ని సంఘపరివార్‌ సంస్దలు నిరంతరం ప్రచారం చేస్తున్నాయి. పూర్వ వైభవాన్ని పునరుద్దరించాలని దానికి హిందూత్వ అని పేరు పెట్టారు. దాన్ని అంగీకరించని వారు దేశం వదలి పోవాలని హెచ్చరిస్తుంటారు. చరిత్రకు మతం రంగు పులుముతున్నారు. దేశంలో పాలన మత ప్రాతిపదికనే జరిగినట్లయితే మెజారిటీ ముస్లింలు ఉన్న కాశ్మీరులో రాజు హిందువు ఎలా అయ్యాడు ? మెజారిటీ జనం హిందువులుగా ఉన్న హైదరాబాద్‌, మైసూరు, జునాగఢ్‌ వంటి సంస్దానాలలో ముస్లింలు పాలకులుగా వందల సంవత్సరాలు ఎలా ఉన్నారు ?


మన దేశంలో కోట్లాది కుటుంబాలకు కనీస సౌకర్యాలు లేవు గానీ ప్రస్తుతం ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. వాట్సాప్‌ గురించి వేరే చెప్పనవసరం లేదు. దీన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటున్న బిజెపి కుహనా వార్తలను ప్రచారం చేసేందుకు పెద్ద యంత్రాంగాన్నే ఏర్పాటు చేసుకుంది. వాట్సాప్‌లో వచ్చిన వాటిని నమ్మకూడదని ఒక వైపు అనుకుంటూనే పదే పదే ఆ సమాచారం వస్తుండటంతో తమకు తెలియకుండానే నమ్ముతూ బుర్రను ఉపయోగించని విద్యావంతులైన వారెందరో ఉన్నారు. వాట్సాప్‌కు భారత్‌ను అతిపెద్ద మార్కెట్‌గా మార్చిన వినియోగదారులయ్యారు.


బిజెపి, దాని విధానాలను విమర్శించే జర్నలిస్టులను ప్రెస్టిట్యూట్స్‌(పత్రికా వ్యభిచారులు), ముజాహిదిన్స్‌, రెడ్‌ తాలిబాన్స్‌ ఇలా అనేక పదాలతో అవమానిస్తున్నారు. బెదిరిస్తున్నారు, లొంగని గౌరీలంకేష్‌ వంటి వారిని హతమార్చుతున్నారు. మీడియాను నియంత్రించే కార్పొరేట్లు సహజంగానే తమ ప్రయోజనాల కోసం మీడియాను పాకేజ్‌లకు, ప్రలోభాలకు అప్పగించే శారు.
ఫాసిస్టు, నాజీజాన్ని పెంచి పోషించిన శక్తులు తమ లక్ష్యాలను సాధించుకొనేందుకు ప్రయివేటు దళాలను ఏర్పాటు చేసుకున్నాయి, కొన్ని సందర్భాలలో ప్రత్యర్ధులను హతమార్చేందుకు కిరాయిహంతకులను కూడా వినియోగించుకున్నాయి. మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు విశ ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌ వంటివి అలాంటివే. గౌరీ లంకేష్‌, కులుబుర్గి, నరేంద్ర దబోల్కర్‌ వంటి వారిని కాషాయ భావజాలంతో ఉన్మాదులైన వారు లేదా వారు ఉపయోగించిన కిరాయి హంతకులు హతమార్చారు. గోరక్షకులు, హిందూత్వ పరిరక్షకుల పేరుతో ఎవరికి వారే దళాలుగా ఏర్పడటం ప్రత్యర్ధులు లేదా మైనారిటీ మతాలకు చెందిన వారిని హత్యలు చేయటాన్ని చూశాము.


మన దేశంలో ఫాసిస్టు శక్తులు అధికారంలో ఉన్నాయని చెప్పేవారు కొందరున్నారు. కాదు ఫాసిస్టు తరహా ధోరణులు నానాటికీ ప్రబలుతున్నాయనే వారు మరికొందరు. లేదు లేదు అసలైన ప్రజాస్వామ్యం ఇదే అని నమ్మబలుకుతున్నవారు ఎందరో ఉన్నారు. నువ్వేమిటో తెలుసు కోవాలంటే నీ గురించి ఆలోచించుకో అని సుప్రస్దిద్ద గ్రీకు తత్వవేత్త సోక్రటీస్‌ చెప్పాడు. అందువలన ఎవరేమి చెప్పినా, రాసినా, దృశ్యరూపంలో ప్రదర్శించినా ముందు వాటిని ‘సహనంతో ‘ వ్యక్తపరచనివ్వాలి, వినాలి, చదవాలి, చూడాలి. అలాంటి పరిస్ధితి దేశంలో ఉందా లేదా అని ప్రతి ఒక్కరూ మెదడుకు పదును పెట్టాలి. ఈ నేపధ్యంలో వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలను, దేశంలో వ్యక్తమౌతున్న కొన్ని ధోరణుల తీరు తెన్నులను చూశారు. ప్రపంచ వ్యాపితంగా ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- మితవాదం జమిలిగా ముందుకు వస్తున్నాయి. మన దేశంలో వాటికి మతోన్మాదం కూడా తోడైంది. కనుక పరిణామాలు, పర్యసానాలు ఎలా ఉంటాయి అన్నది ఎప్పటికప్పుడు జాగరూకులై ఉండాల్సిందే ! ముందే చెప్పుకున్నట్లు తద్దినం మాదిరి ఒక్క స్వాతంత్య్ర దినం రోజునే కాదు, నిరంతరం ప్రతి ఒక్కరూ ఆలోచించినపుడే స్వాతంత్య్రం నిలుస్తుంది. ( తొలి భాగం – 74 ఏండ్ల స్వాతంత్య్రం – 1: మేకిన్‌ ఇండియాకు పాతర -మేక్‌ ఫర్‌ వరల్డ్‌ జాతర ! )

Share this:

  • Tweet
  • More
Like Loading...

74 ఏండ్ల స్వాతంత్య్రం – 1: మేకిన్‌ ఇండియాకు పాతర -మేక్‌ ఫర్‌ వరల్డ్‌ జాతర !

17 Monday Aug 2020

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

74th independence day India, Make for World, Make In India, Narendra Modi


ఎం కోటేశ్వరరావు
ఇతరులపై ఆధారపడకుండా స్వంత శక్తులు, స్వంత వనరులతో అభివృద్ది చెందాలంటూ ఆత్మనిర్భర భారత్‌ అని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచం కోసం తయారీ (మేక్‌ ఫర్‌ వరల్డ్‌) అని పిలుపునిచ్చారు. ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చిన మేకిన్‌ ఇండియా పిలుపు ఘోరంగా విఫలమైనందున బహుశా ఆ పేరును ఉచ్చరించేందుకు ఇచ్చగించక లేదా పాత నినాదాలకు పాతరేసి కొత్త నినాదాల జాతరను ముందుకు తేవటంలో మోడీ చూపుతున్న అసమాన ప్రతిభకు ఇది నిదర్శనం అని చెప్పవచ్చు. నిజానికి రెండు నినాదాల అర్ధం, లక్ష్యం ఒక్కటే. విదేశాల కోసం భారత్‌లో వస్తు తయారీ. ఈ కొత్త నినాద మోజు ఎంతకాలం ఉంటుందో ఎప్పుడు మరో కొత్త నినాదం మన చెవులకు వినిపిస్తారో ఎదురు చూద్దాం.


ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం నుంచి రెండు సంవత్సరాల పాటు ఉండే సభ్యత్వానికి జరిగిన ఎన్నికలో భారత్‌కు 192కు గాను 184 ఓట్లు రావటం మన పరపతి పెరుగుదలకు నిదర్శనమని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. దీన్లో కాస్త హుందాతనం తగ్గినట్లు అనిపిస్తోంది. ఈ ఎన్నికలలో ఐదు స్దానాలకు ఐదు దేశాలు మాత్రమే రంగంలో ఉన్నాయి కనుక ఏకగ్రీవంగా జరిగినట్లే. అయినా నిబంధనావళి ప్రకారం ఓటింగ్‌ జరిగింది. మన దేశానికి 184 వస్తే మెక్సికోకు 187 వచ్చాయని గమనించాలి. అంటే మనకంటే మెక్సికో ఎక్కువ పలుకుబడి కలిగిన దేశం అనుకోవాలా ? గౌరవనీయమైన ప్రధాని నరేంద్రమోడీ గారికే వదలివేద్దా !
ఆగస్టు పదిహేను అన్నది ఒక పండుగ రోజు కాదు. దీక్షాదినంగా పాటించాల్సిన రోజు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని నిత్యం కాపాడుకోవాల్సి ఉంది. ఆ ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, వ్యతిరేకించిన శక్తుల వారసులు ఇప్పుడు అధికారంలో ఉన్నందున ప్రతి స్వాతంత్య్రం దినానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి రోజూ దాన్ని కాపాడు కొనేందుకు దీక్ష పూనాల్సిందే. దేశంలోని నాలుగు అత్యున్నత రాజ్యాంగ వ్యవస్ధలైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌ పదవుల్లో తొలిసారిగా సంఘపరివార్‌కు చెందిన వారే ఉన్నారు.


తప్పులు చేసేందుకు సైతం అవకాశం ఇవ్వని స్వేచ్చ విలువైనది కాదు అని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పారు. అనేక రాష్ట్రాలలో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండగా స్వాతంత్య్రానికి 73 సంవత్సరాలు నిండాయి, 74వ దినోత్సవం జరుపుకున్నాము. మహాత్ముడిని హత్య చేసిన భారత తొలి మతోన్మాద ఉగ్రవాది నాథూరామ్‌ గాడ్సేను మరొక దేశంలో అయితే అక్కడికక్కడే కాల్చి చంపి ఉండేవారు. కానీ అతగాడిన కోర్టులో ప్రవేశపెట్టటమే కాదు, గాంధీని తానెందుకు హతమార్చిందీ చెప్పుకొనేందుకు స్వేచ్చ ఇచ్చిన వ్యవస్ధ మనది. ఆ ప్రకటననే ఒక భగవద్గీతగా, ఒక బైబిల్‌, ఒక ఖురాన్‌ మాదిరి అచ్చువేసి మహాత్ముడిని హతమార్చటం ఎలా సమర్ధనీయమో చూడండి అని చెప్పేందుకు ప్రచారంలో పెట్టిన శక్తులకు, వాటిని హస్తభూషణాలుగా చేసుకొనేందుకు కూడా ప్రస్తుతం ఈ దేశంలో స్వేచ్చ ఉంది. మరోవైపు ప్రభుత్వ విధానాలను, పాలకపార్టీల వైఖరులను విమర్శించటమే దేశద్రోహం అన్నట్లుగా చిత్రించి దాడులు చేయటం, తప్పుడు కేసులు పెట్టే ప్రమాదకర పరిస్ధితి కూడా ఉంది.


ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ?
మెజారిటీ పౌరుల నిర్ణయమే ప్రజాస్వామిక తీర్పు. కానీ జరుగుతున్నదేమిటి ? మైనారిటీ తీర్పే మెజారిటీని శాసిస్తున్నది. ఇది గతంలో కాంగ్రెస్‌ హయాంలో, వర్తమానంలో బిజెపి ఏలుబడిలో అయినా అదే జరుగుతున్నది. 2014లో బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల రీత్యా విజయం సాధించింది, 2019లో ఘన విజయం సాధించింది.2014-19కి తేడా ఏమిటి ? ఆరుశాతం ఓట్లు పెంచుకొని 2019లో 37.4శాతం ఓట్లతో బిజెపి పెద్ద పార్టీగా ఉండగా, దాని మిత్రపక్షాలకు వచ్చిన ఓట్లు కలుపుకుంటే 45శాతం. అంటే 55శాతం మంది దానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. మొత్తం 29 రాష్ట్రాలలో 17 చోట్ల మాత్రమే పోలైన ఓట్లలో సగానికి మించి దానికి వచ్చాయి. ఒక్క వామపక్షాలు తప్ప కాంగ్రెస్‌ లేదా ఇప్పుడు బిజెపి లేదా వాటికి మద్దతు ఇస్తున్న పార్టీలు గానీ ఎన్నికల సంస్కరణల గురించి చెబుతాయి తప్ప డబ్బు, ప్రలోభాల ప్రమేయం లేని దామాషా ప్రాతినిధ్య ఎన్నికల విధానం కావాలని అడగటం లేదు.


ఎలాంటి పాలకుల ఏలుబడిలో ఉన్నాము !
” మనం అంటే ప్రజాస్వామ్యాలు యూదుల విషయంలో ఒక వైఖరిని తీసుకొనే స్ధితిలో లేవు.ఈ సామ్రాజ్యాలలో చదరపు కిలోమీటరుకు పది మంది జనం కూడా లేరు. అదే జర్మనీలో చదరపు కిలోమీటరుకు 135 మంది నివాసితులున్న చోట వారికి చోటు కల్పించాలట ” ఇది 1939 జనవరి 30న నాజీ హిట్లర్‌ తనను వ్యతిరేకించే దేశాలను ఉటంకిస్తూ చేసిన ప్రసంగంలోని అంశం.
మన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు 2002 సెప్టెంబరు తొమ్మిదిన గుజరాత్‌ గౌరవ యాత్ర బేచారాజ్‌లో ప్రవేశించిన సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ యాత్రలో మాట్లాడుతూ ” మనం బేచారాజ్‌కు నిధులు కేటాయించితే వారు మెచ్చరు. మనం నర్మద నీటిని శ్రావణమాసంలో తీసుకువస్తే అప్పుడు కూడా వారు మెచ్చరు. కాబట్టి ఏమి చేయాలి? మనం పునరావాస కేంద్రాలను నడపాలా ? బహిరంగ పిల్లల ఉత్పత్తి కేంద్రాలను తెరవాలా ” అన్నారు. మనం ఐదుగురం-మనకు 25 మంది అంటూ ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ చేసిన ప్రఖ్యాత ప్రసంగంలోని ఆణిముత్యాలివి.
జాతీయ మైనారిటీ కమిషన్‌ ఈ విద్వేష ప్రసంగానికి సంబంధించి వివరాలు కావాలని నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మోడీ ముఖ్యకార్యదర్శిగా ఉన్న పికె మిశ్రా ఇదే విషయమై ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రసంగానికి సంబంధించి ఏ విధమైన టేపులు లేదా రాతపూర్వకంగా ఏమీ లేనందున తాము జాతీయ మైనారిటీ కమిషన్‌కు పంపేందుకేమీ లేవని చెప్పాడు. ఇదేదో శతాబ్దం క్రితం జరిగింది కాదు. అధికారిక ఆధారాలు నాశనం చేయటం చేయటం లేదా అసలు లేకుండా చేసినందున అసలు ఇలాంటి ప్రసంగాన్ని మోడీ చేయలేదని బుకాయించినా చేసేదేమీ లేదు. అయితే పత్రికలు, టీవీలు వాటిని రికార్డు చేశాయి, ప్రచురించాయి, ప్రసారం చేశాయి గనుక తెలుసుకోగలుగుతున్నాము. అందుకే పని చేసే మీడియా అంటే నరేంద్రమోడీకి గిట్టదు. పాకేజ్‌లతో లేదా ముందే తయారు చేసిన ఫలానా ప్రశ్నలు మాత్రమే అడగాలి అన్న నిర్దేశాలకు అంగీకరించిన భజన మీడియా ప్రతినిధులతోనే ఇప్పటి వరకు మోడీ మాట్లాడారు తప్ప, ఒక్కటంటే ఒక్క పత్రికా గోష్టిని కూడా పెట్టలేదు, ఎందుకంటే ఏటికి ఎదురీదే జర్నలిస్టులు ఇంకా మిగిలే వారు ఉన్నారు గనుక, ప్రశ్నలు అడుగుతారు గనుక అని వేరే చెప్పనవసరం లేదు.
2007జనవరిలో మొహరం పండగ సందర్భంగా జరిగిన మతకలహంలో రాజకుమార్‌ అగ్రహారి అనే యువకుడు మరణించాడు. దాన్ని అవకాశంగా తీసుకొని అప్పుడు గోరఖ్‌పూర్‌ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాధ్‌ వెళ్లి ” కొంత మంది హిందువుల ఇళ్లు, దుకాణాలను తగులబెడితే ప్రతిగా అదేపని చేయకుండా ఆపాలని అనటంలో నాకు విశ్వాసం లేదు. ” అని మతవిద్వేషాన్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు ఆయన దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రి, అవసరమైతే నరేంద్రమోడీని తప్పించి ప్రధాని అభ్యర్ధిగా రంగంలో తెచ్చేవారిలో తొలి వ్యక్తిగా ప్రచారంలో ఉన్నారు. కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న అనేక మంది బిజెపి నేతలు ఇలాంటి ప్రచారాలకు పెట్టింది పేరు.
మేము హిట్లర్‌ను ఎక్కడైనా, ఎప్పుడైనా పొగిడామా అని సంఘపరివార్‌ శక్తులు ఎదురుదాడి చేస్తాయి. ఇలాంటి విద్వేషపూరిత ప్రచారం చేసేవారికి ఉత్తేజమిచ్చేది ప్రపంచంలో హిట్లర్‌ తప్ప చరిత్రలో మరొకరు లేరు. పేరు చెప్పనంత మాత్రాన బహిరంగంగా ఆరాధించనంత మాత్రాన గుండెల్లో గుడి కట్టిందెవరికో తెలియనంత అమాయకంగా మన సమాజం ఉందా ? ఇవి ఫాసిస్టు లేదా నాజీల ధోరణులు కావా ?


దేశంలో జరుగుతున్నదేమిటి ?
ఒక వ్యవస్ధను ధ్వంసం చేయాల్సి వస్తే దాని అవసరం ఏమిటో చెప్పాలి. జనాన్ని ఒప్పించాలి. కొద్ది మంది పెట్టుబడిదారులు అత్యధికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు గనుక ఆ వ్యవస్ధను ధ్వంసం చేయాలని కమ్యూనిస్టులు నిరంతరం దాని గురించి చెబుతూ ఉంటారు, తమ అంతిమ లక్ష్యం దోపిడీ వ్యవస్ధ నిర్మూలనే అని, అది జరగకుండా దోపిడీ అంతం కాదని బహిరంగంగానే చెబుతారు. వారి అవగాహనతో ఏకీభవించటమా లేదా అన్నది వేరే విషయం. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెబుతూ కొన్ని శక్తులు నిరంతరం దాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించటాన్ని చూస్తున్నాం. దానికి మూలమైన అన్ని రాజ్యాంగ వ్యవస్ధలను దుర్వినియోగం చేయటం, నీరు గార్చటం, దిగజార్చటం, చివరికి వాటి మీద విశ్వాసం లేకుండా చేసి అసలు ఈ రాజ్యాంగాన్నే మార్చివేయాలి, కఠినంగా ఒక వ్యవహరించే ఒక నియంత కావాలి అని జనం చేతనే అనిపించే విధంగా వారి చర్యలుంటున్నాయి. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది.


మెజారిటీ వర్గ పాలనా ? మెజారిటీ మత పాలనా ?
ప్రపంచంలో ప్రజాస్వామిక వ్యవస్ధలున్నాయని చెప్పుకొనే ప్రతి దేశంలోను ప్రజాస్వామిక వ్యవస్ధలు వత్తిళ్లకు, దాడులకు గురవుతున్నాయి.నిరంకుశ పోకడలున్న పాలకులు రోజు రోజుకూ పెరుగుతున్నారు.మొదటి ప్రపంచ యుద్దం ముగిసి వందేళ్లు గడచాయి.మొదటి ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచ పరిణామాల్లో తొలి సోషలిస్టు రాజ్యం సోవియట్‌ రష్యా ఏర్పడింది. మెజారిటీ కార్మికవర్గానికి ప్రాతినిధ్యం వహించే కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది కనుక దాన్ని తొలి శ్రామికరాజ్యం అన్నారు. దాని స్ఫూర్తితో అనేక దేశాల స్వాతంత్య్ర ఉద్యమాల్లో భాగస్వాములుగా ఉన్న వారు కమ్యూనిస్టు పార్టీలను ఏర్పాటు చేశారు.


ఇదే సమయంలో అనేక దేశాల్లో ఫాసిస్టు, నాజీ శక్తులు కూడా రంగంలోకి వచ్చాయి. మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అలాంటి శక్తే అన్నది అనేక మంది విమర్శ. దాని మైనారిటీ, కమ్యూనిస్టు వ్యతిరేకత ముందు బ్రిటీష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడటం ముఖ్య అంశంగా లేదు. అందుకే స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉంది. బ్రిటీష్‌ వారికి అనుకూలంగా కూడా వ్యవహరించిన చరిత్ర ఉంది. వ్యక్తులుగా తొలి రోజుల్లో ఉద్యమంలో పాల్గొన్న వినాయక దామోదర్‌ సావర్కర్‌ వంటి వారు జైలు జీవితాన్ని భరించలేక నాటి బ్రిటీష్‌ పాలకులకు లొంగిపోయి సేవ చేస్తామని రాసిన లేఖలు తరువాత బహిర్గతం అయ్యాయి. హిందూరాజ్య స్ధాపన నినాదంతో సంఘపరివార్‌ మెజారిటీ రాజ్య స్ధాపన లక్ష్యంగా పని చేస్తోంది.


మొదటి ప్రపంచ యుద్దం తరువాత ఇటలీ, జర్మనీ,జపాన్‌లలో అంతకు ముందున్న ప్రజాస్వామిక వ్యవస్ధలను కూల్చివేసి ముస్సోలినీ, హిట్లర్‌, టోజో వంటి నియంతలు రంగంలోకి వచ్చారు. మొదటి-రెండవ ప్రపంచ యుద్దాల మధ్య రెండు దశాబ్దాల కాలంలో ఒక వైపు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌తోక పాటు కొన్ని దేశాల్లో ఫాసిస్టు శక్తులు కూడా బలపడ్డాయి. మహా ఆర్ధిక మాంద్యం పెట్టుబడిదారీ వ్యవస్ధలను అతలాకుతలం చేసింది. ఫాసిస్టు శక్తులు అటు సోషలిజానికి ఇటు పెట్టుబడిదారీ వ్యవస్ధలున్న అమెరికా, ఐరోపా దేశాలకూ ముప్పుగా పరిణమించటంతో ఆ రెండుశక్తులు కలసి రెండవ ప్రపంచ యుద్దంలో ఫాసిజాన్ని ఓడించాయి. సోవియట్‌ యూనియన్‌ భారీ మూల్యం చెల్లించి, ఫాసిజం ఓటమిలో నిర్ణయాత్మక పాత్రను పోషించింది. దీని పర్యవసానం అనేక దేశాలు సోషలిస్టు వ్యవస్ధలోకి మరలాయి. ప్రత్యక్ష వలసలు రద్దయి స్వాతంత్య్రం పొందాయి.


తరువాత కాలంలో ద్రవ్య పెట్టుబడి ప్రపంచాన్ని పెద్ద ఎత్తున ఆవరించింది. దానికి మద్దతుగా కొన్ని చోట్ల నియంతృత్వ పోకడలు పెరగటం ప్రారంభమైంది.గతంలో పెట్టుబడిదారీ విధానం మధ్య తలెత్తిన తీవ్ర పోటీ ఫాసిజాన్ని ముందుకు తెచ్చింది. అయితే ఫాసిజం, మిలిటరీ నియంతలకు కాలం చెల్లింది కనుక ద్రవ్య పెట్టుబడిదారీ విధానం నయా ఉదారవాదాన్ని ముందుకు తెచ్చింది. దాన్ని అమలు జరిపేందుకు లాటిన్‌ అమెరికాలో మిలిటరీ నియంతలకు పట్టం కట్టారు. వాటికి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావటంతో ప్రజల ఆగ్రహాన్ని పక్కదారి పట్టించటం కోసం వారిని వదిలించుకొని కొత్త శక్తులను రంగంలోకి తెచ్చారు. ఇదే సమయంలో నయా ఉదార వాదం కంటే ఫాసిస్టు విధానమే పరిష్కారం అని చెప్పే నయా ఫాసిస్టు లేదా ఫాసిస్టు తరహా నయా ఫాసిస్టు శక్తులు అనేక ఐరోపా దేశాల్లో ముందుకు వచ్చాయి, గణనీయమైన విజయాలను కూడా సాధిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే మన దేశంలో బిజెపి విజయం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులు, డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి రిపబ్లికన్‌ పార్టీ మితవాదులు, శ్వేతజాతి దురహంకారులు నరేంద్రమోడీకి సహజమిత్రులుగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు.
స్వేచ్చ పరిరక్షకురాలిగా నయా ఉదారవాదం ఫోజు పెడుతుంది. స్వేచ్చామార్కెట్‌కు హామీ ఇస్తుంది. కానీ ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంది. గత కొద్ది సంవత్సరాలలో ఈ అవగాహనకు విరుద్దంగా అనేక దేశాలు తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలే దానికి నిదర్శనం. ఇంతే కాదు ఆయా దేశాల అర్ధిక, సామాజిక, రాజకీయ అంశాలలో పాలకుల జోక్యం, నియంత్రణలను పరిమితం చేసేందుకు నయా ఉదారవాదం పూనుకుంది.గతంలో పెట్టుబడిని పాలకులు నియంత్రిస్తే ఇప్పుడు పెట్టుబడే పాలకులను నియంత్రిస్తోంది. ఇది ఒక్క ఆర్ధిక రంగానికే కాదు, సామాజిక, రాజకీయ రంగాలకూ విస్తరిస్తోంది.


నయా ఉదారవాద విధానాలకు భిన్నంగా పాలకులను నియంత్రించటాన్ని ” ఆర్డోలిబరలిజం ” అంటున్నారు. ఆర్డర్‌ మరియు లిబరలిజం అనే రెండు పదాలను కలిపి అలా పిలుస్తున్నారు. ఉదారవాద విధానాలకు భంగం కలగ కుండా ఆదేశాలు(ఆర్డర్‌) జారీ చేయటం. ఇది నయాఉదారవాదాన్ని ముందుకు తెచ్చే ద్రవ్యపెట్టుబడిదారుల ఆదేశమే. మన దేశంలో ద్రవ్య నియంత్రణ మరియు బడ్జెట్‌ యాజమాన్యం(ఎఫ్‌ఆర్‌బిఎం) పేరుతో 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం తెచ్చిన చట్టం దీనిలో భాగమే. రుణ, ద్రవ్యలోటు, ఆదాయలోటు, ద్రవ్యోల్బణ లక్ష్యాలను నిర్ణయించటం దీనిలో భాగమే. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ ద్రవ్య రంగంలో మరింతగా ద్రవ్య పెట్టుబడిదారులకు అవకాశాలను కల్పిస్తున్నది.


ద్రవ్య పెట్టుబడి – కార్మికోద్యమం !
నయా ఉదారవాదాన్ని ముందుకు తెచ్చిన ద్రవ్య పెట్టుబడి కార్మికోద్యమాన్ని సహించదు.1991లో సరళీకరణ ప్రారంభమైన తరువాత కార్మిక సంఘాలను దెబ్బతీసేందుకు ప్రారంభమైన చర్యలు ఇప్పుడు మరింత తీవ్రమయ్యాయి. దేశ వ్యవస్ధలను,సంపదలను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మరియు దేశీయ పెట్టుబడిదారీ-భూస్వామ్యశక్తులకు మరింతగా అప్పగించేందుకు గత ఆరు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ మరింత వేగంగా పని చేస్తోంది. ఈ విధానాల వలన జనం ముఖ్యంగా పని చేయగలిగిన యువత నష్టపోతోంది. ఒక వైపు మేకిన్‌ ఇండియా పేరుతో ఉపాధి అవకాశాలను పెంచి ప్రపంచ ఫ్యాక్టరీగా మన దేశాన్ని మార్చుతామని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించింది. ఆచరణలో ఉపాధి తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అధికారంలో కాంగ్రెస్‌ లేదా బిజెపి, రెండు పార్టీల వెనుకా చేరే లేదా విడిగా ఉండే ప్రాంతీయ పార్టీలకు దేశంలో అమలు జరుపుతున్న విధానాల పట్ల మొత్తంగా ఎలాంటి పేచీ లేదు. ఈ పార్టీలను ఆడిస్తున్నది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి-దేశీయ పెట్టుబడిదారులన్నది వాస్తవం. ఈ పార్టీలు తమ ప్రయోజనాలకు దెబ్బతగలనంత వరకు అధికారం కోసం కొట్టుకోవటానికి, వ్యవస్ధలను దిగజార్చటానికి, డబ్బు, ప్రలోభాలతో ఎన్నికలను తొత్తడం చేయటం వంటి అక్రమాలను అంగీకరిస్తారు తప్ప విధానాలను మార్చేందుకు అనుమతించరు. గతంలో కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన కార్పొరేట్‌ సంస్ధలు ఇప్పుడు అదేపని బిజెపికి చేస్తున్నాయి. రేపు ఆ పార్టీ జనం నుంచి దూరం అయిందనుకుంటే తిరిగి కాంగ్రెస్‌కు లేదా మరొకశక్తికి మద్దతు ఇచ్చి రంగంలోకి తెచ్చేందుకు పూనుకుంటాయి.


నియంతలు, ఫాసిస్టులు -ఎన్నికలు !
నియంతలు, ఫాసిస్టుల లక్షణం ఎన్నికలను ప్రహసనంగా మార్చటం లేదా అసలు నిర్వహించకపోవటం, తమ వ్యతిరేకుల అణచివేతకు ప్రయివేటు సైన్యాలను ఏర్పాటు చేయటం వంటివి ఉన్నాయి. తాము ఓడిపోతాము అనుకుంటే ఎన్నికల రద్దు లేదా మరొక పద్దతిలో ప్రజాతీర్పును వమ్ము చేయటాన్ని చూశాము. మన దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించి 1976లో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసింది, పార్లమెంట్‌, అసెంబ్లీ వ్యవధిని పొడిగించింది. ఇది ఫాసిస్టు చర్యలను పోలి ఉంది. అయితే అత్యవసర పరిస్ధితిని ఎత్తివేసి తిరిగి ఎన్నికలను జరపకతప్పలేదు. అదే పక్కా ఫాసిస్టులు, నియంతలు అలాంటి అవకాశం ఇవ్వరన్నది చరిత్ర.


బిజెపి విషయానికి వస్తే దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌. ఐరోపా దేశాల్లో నియంతలు ఏర్పాటు చేసిన ప్రయివేటు ఆర్మీకి అనుకరణగా, తిరోగామి భావాలతో ఏర్పాటు అయింది. అయితే 2004 బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పాలకులు తాము విజయం సాధిస్తామనే ధీమాతో ఎన్నికలను నిర్వహించి ఓటమి పాలయ్యారు. 2019లో బిజెపి ఓడిపోనుంది లేదా తగినంత మెజారిటీ రాదనే వాతావరణం ఉన్నప్పటికీ ఎన్నికలను వాయిదా లేదు. అయితే ఎన్నికల్లో విజయం సాధించటానికి జనాన్ని మభ్యపరిచేందుకు చేయాల్సిందంతా చేసింది. అనేక రాష్ట్రాలలో పాగా వేసేందుకు అన్ని రకాల అవినీతి, అక్రమ పద్దతులను అనుసరిస్తోంది.మెజారిటీ రాని చోట ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేసేందుకు నిరంతరం ప్రయత్నించటాన్ని చూస్తున్నాము.


చరిత్ర వక్రీకరణ – కొత్త పుంతలు !
చరిత్ర నిర్మాతలు జనం, అయితే చరిత్రకు భాష్యం చెప్పేది పాలకవర్గం. అది ఎల్లవేళలా తమకు అనుకూలంగానే ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం పరపీడన పరాయణత్వం అని మహాకవి శ్రీశ్రీ పురోగామి భాష్యం చెబితే మతాల ఆధిపత్యంగా మనువాదులు చిత్రించటాన్ని చూస్తున్నాము. మార్పును కోరుతూ 2014లో తమ నరేంద్రమోడీని చూసి జనం ఓటేశారని, ఆ మార్పును కొనసాగించాలని కోరుతూ 2019లో మరిన్ని సీట్లు కట్టబెట్టారని ఆయన మద్దతుదారులు చెబుతారు. మార్పు అంటే ఏమిటి అన్నది బ్రహ్మపదార్ధం. కోరుకున్న వారికి, పరిశీలిస్తున్నవారిక ఒక పట్టాన అర్ధం కావటం లేదు.
దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చిందని అందరికీ తెలుసు. దానికి ఉన్న పరిమితులను గుర్తిస్తూనే కమ్యూనిస్టులు బూర్జువా స్వాతంత్య్రంగా పరిగణిస్తున్నారు. అయితే అది నిజమైన స్వాతంత్య్రం కాదని తామే అసలు సిసలు కమ్యూనిస్టులం అని చెప్పుకొనే నక్సలైట్స్‌ చెబుతారు. చిత్రం ఏమిటంటే బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక ఇతర సంస్ధలు కూడా ఇదే మాదిరే అది నిజమైనది కాదంటూనే తమ నరేంద్రమోడీ పాలనతోనే అసలైన స్వాతంత్య్రం వచ్చిందని కొత్త భాష్యం చెబుతారు. తాజాగా వందల సంవత్సరాల తరువాత రాముడు విముక్తి పొందాడని వర్ణిస్తూ , ఆలయ నిర్మాణానికి మోడీ భూమి పూజను దానికి జతచేశారు.గతంలో జరిగిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దుతున్నారన్న ప్రచారం తెలిసిందే. చరిత్రను తిరస్కరించటం, వక్రీకరించటం అంటే ఇదే. విమర్శ, భిన్నాభిప్రాయం కలిగి ఉండటం ప్రజాస్వామ్య లక్షణం. కానీ వాటిని దేశద్రోహం, దేశ వ్యతిరేకతగా అంతర్గత శత్రువులుగా చిత్రించుతున్నారు. 1991తరువాత కమ్యూనిస్టు బాధితుల పేరుతో ప్రచారంచేస్తున్న మితవాద శక్తులు, ఫాసిస్టులు, నాజీల లక్షణాలివి.


బిజెపి చెబుతున్న నూతన భారత్‌ అనేది కొత్తది కాదు. 1925లో ఏర్పడిన నాటి నుంచీ ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతున్నదే. ఇప్పుడు ఆ గళం పెరిగింది కనుక నేటి తరాలకు అది కొత్తగా, వినసొంపుగా ఉండవచ్చు. పార్లమెంట్‌ను ఒక ప్రహసనంగా మార్చారు. కాశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ రద్దు ఉదయం మంత్రివర్గ సమావేశంతో ప్రారంభమైన సాయంత్రానికి పార్లమెంట్‌ ఆమోదంతో సంపూర్ణం గావించారంటే బిజెపి తలుచుకుంటే మొత్తం రాజ్యాంగాన్ని కూడా ఇలాగే మార్చివేయగలదు, దానికి వంతపాడే ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తేలిపోయింది. ఇలాంటి ఆక్మసిక, ఆగంతుక చర్యలు నియంతల ఏలుబడిలో తప్ప ప్రజాస్వామిక దేశాల్లో ఇంతవరకు ఎక్కడా జరగలేదు.


భిన్నమైన పార్టీ అంటే ఏమిటి ? ఆచరణ ఎలా ఉంది ?
దేశ చరిత్రలో విశ్వాసాల ప్రాతిపదికన వివాదాస్పద తీర్పులు ఇవ్వటం, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఒకరు పాలకపార్టీ సిఫార్సుతో రాజ్యసభ సభ్యుడు కావటం న్యాయవ్యవస్ధ మీద జనానికి విశ్వాసం సడలే పరిణామాలు. ఎన్నికల కమిషన్‌లో జోక్యం, సిబిఐ, ఇడి, విజిలెన్స్‌ విభాగాలను ప్రత్యర్ధుల మీద ప్రయోగించటం వంటి చర్యలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఈ దుర్వినియోగం గతంలో కాంగ్రెస్‌ హయాంలోనే ప్రారంభమైంది. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న బిజెపి ఆచరణలో కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా వాటిని వినియోగిస్తున్నది. తమ పార్టీలో అంతా పరి శుద్దులు, పులుకడిగిన ముత్యాలే ఉన్నట్లు, ప్రత్యర్ధి పార్టీలన్నీ అవినీతి పరులతో నిండిపోయినట్లు చిత్రిస్తున్నారు. తాము ఓడిపోయిన చోట ఇతర పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలను కూల్చివేసేందుకు నిరంతర ప్రయత్నాలు, ప్రభుత్వ దర్యాప్తు సంస్ధలతో దాడులు చేయించటం అలాంటి అవకాశం లేనపుడు డబ్బు, ఇతర ప్రలోభాలతో లోబరుచుకొని తిమ్మిని బమ్మిని చేయటం చూస్తున్నదే.
నోరు తెరిస్తే ఆధారం లేని హేతు బద్దతకు, శాస్త్రీయ పరీక్షకు నిలవని ఆశాస్త్రీయ అంశాలను ప్రచారం చేయటం చూస్తున్నాము. పురాతన కాలంలోనే ఇంథనంతో పని లేని విమానాలుండేవని, ప్లాస్టిక్‌ సర్జరీ చేసి వినాయకుడికి ఏనుగు తల అంటించారని, కృత్రిమ పద్దతులలో కౌరవులకు జన్మనిచ్చారని, తాజాగా అప్పడాలు తింటే కరోనా వైరస్‌ తగ్గుతుందని చెప్పేవరకు చేయని ఆశాస్త్రీయ ప్రచారం లేదు. ఇది యువతలో ప్రశ్నించే లేదా ఉత్సుకతను చూపే తత్వాన్ని దెబ్బతీస్తున్నది. ఈ మేరకు విద్యారంగాన్ని కూడా తమ అజెండాకు అనుగుణ్యంగా రూపొందించేందుకు పూనుకున్నారు. (కానసాగింపు – 74 ఏండ్ల స్వాతంత్య్రం-2 : ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- హిందూత్వ ! )

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాకిస్ధాన్‌ కొత్త మాప్‌ మర్మం, పర్యవసానాలు ఏమిటి ?

07 Friday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

India-Pak relations, Pakistan new political map


ఎం కోటేశ్వరరావు


పాకిస్ధాన్‌ ప్రభుత్వం కొత్త రాజకీయ చిత్ర పటాన్ని రూపొందించి మన దేశంతో సరికొత్త వివాదానికి దిగింది. ఆక్రమిత కాశ్మీరును ఇప్పటికే తనదిగా చూపుతున్న పాక్‌ కొత్తగా జమ్మూకాశ్మీరు, లడఖ్‌ ప్రాంతాలను గుజరాత్‌లోని జునాఘడ్‌, సర్‌ క్రీక్‌ ప్రాంతాలను కూడా తనవిగా చూపుతూ కొత్త చిత్రపటాన్ని ప్రచురించింది. లడఖ్‌లో తమవిగా చైనా చెబుతున్న ప్రాంతం, గిల్గిట్‌్‌-బాల్టిస్ధాన్‌లో పాకిస్దాన్‌ 1963లో చైనాకు అప్పగించిన ప్రాంతం వీటిలో లేవు. నిజానికి ఈ మాప్‌లు కొత్తవి కాదు, స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే ఈ ప్రాంతాలు, నాటి తూర్పు పాకిస్దాన్‌(నేటి బంగ్లాదేశ్‌)ను కలిపి నాటి పాక్‌ ప్రభుత్వం ముద్రించింది.తరువాత వాటిని వెనక్కు తీసుకుంది. కాశ్మీర్‌ సమస్యను ఇరు దేశాలు పరిష్కరించుకోవాలన్న 1972 సిమ్లా ఒప్పందం తరువాత 1999 నాటి లాహౌర్‌ ప్రకటనకు విరుద్దం. పాక్‌ చర్య రాజకీయ మూఢత్వమని మన దేశం వ్యాఖ్యానించింది.
పాక్‌ కొత్త చిత్రపటాన్ని తయారు చేసినంత మాత్రాన ఆ ప్రాంతాలు దానివి కావు, మన నుంచి పోవు. ప్రతి దేశం తనవి అని భావించే ప్రాంతాలను చూపుతూ రాజకీయ చిత్ర పటాలను తయారు చేస్తుంది, ప్రచారంలో పెడుతుంది. సరిహద్దుల గురించి వివాదం ఉన్నపుడు వాటిని ఇరుగు పొరుగు దేశాలు అంగీకరించవు. ఉదాహరణకు చైనా ముద్రించే చిత్ర పటాల్లో మన ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ను తన టిబెట్‌లో భాగంగా చూపింది. అదే విధంగా మన చిత్ర పటాల్లో మనవిగా చూపుతున్న ఆక్సారుచిన్‌, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలు మన ఆధీనంలో లేవు.


మన ప్రధాని నరేంద్రమోడీ లేదా బిజెపి నేతలు అమెరికా అడుగులకు మడుగులొత్తుతున్నారు. మనకు ఎంతో కావలసిన దేశం అమెరికా అంటారు, అన్ని అంశాల్లో మనకు మద్దతు ఇస్తూ ముందుకు పొమ్మని చెబుతోంది అని చెబుతారు. చైనాకు వ్యతిరేకంగా మనకు మద్దతు ఇస్తోందని ఇటీవల ఎక్కువగా చెబుతున్నారు. భద్రతా మండలిలో మనకు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు చిత్తశుద్దితో పని చేస్తున్న మిత్ర దేశం అని కొనియాడతారు. అయినా సరే కాశ్మీరును మన అంతర్భాగంగా అమెరికా ఇంతవరకు గుర్తించలేదు అనే విషయం ఎంత మందికి తెలుసు. కాశ్మీర్‌ను ప్రస్తావించాల్సి వస్తే గతంలో భారత ఆక్రమిత ప్రాంతం అని పిలిచే అమెరికన్లు ఇటీవలి కాలంలో భారత పాలిత కాశ్మీరు అని సవరించారు తప్ప మరొక మార్పు చేయలేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ను నరేంద్రమోడీ పదే పదే కౌగలించుకున్నారు-దానికి ప్రతిగా నరేంద్రమోడీ భారత దేశ పిత అని ట్రంప్‌ బిరుదు ఇచ్చాడు తప్ప కాశ్మీరు మనదే అని గుర్తించలేదు.
అరుణాచల్‌ ప్రదేశ్‌ తనది అని చైనా తన పటాల్లో ముద్రించినా, కాశ్మీరు మనది అని అమెరికా గుర్తించకపోయినా వాటితో విబేధిస్తున్నామని చెబుతూనే రెండు దేశాలతో దౌత్య సంబంధాలు కొనసాగించటానికి మనకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయింది. పాకిస్ధాన్‌ తన చిత్ర పటాల్లో తాజాగా మార్పులు చేసినా ఇదే వైఖరి కొనసాగుతుంది.


పాకిస్ధాన్‌ తన చిత్రపటాన్ని ఇప్పుడెందుకు సవరించింది ?
కాశ్మీర్‌ తమదే అని చెబుతున్నప్పటికీ ఆక్రమిత ప్రాంతాన్ని ఆజాద్‌ కాశ్మీరు అని ప్రత్యేకంగా చూపుతోంది తప్ప మిగతా కాశ్మీరు, జునాఘడ్‌ను తమ అంతర్భాగాలుగా ఇంతవరకు చూపలేదు. ఇప్పుడు సవరించింది అంటే కొత్త వివాదానికి తెరలేపినట్లు అనుకోవాల్సి వస్తోంది. కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, దానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి ఏడాది గడచిన సందర్భంగా పాక్‌ ఈ చర్యకు పాల్పడింది. దీని గురించి జాతీయంగా, అంతర్జాతీయంగా వెలువడుతున్న విశ్లేషణలు మీడియా కథనాలను చూస్తే పాక్‌ చర్య వెనుక చైనా హస్తం ఉంది అన్నది ఒక ఆరోపణ. గతంలో నేపాల్‌ విషయంలోనూ అదే ఆరోపణను చైనా మీద చేశారు. గతంలో కుదిరిన ఒప్పందాలకు అనుగుణ్యంగా బంగ్లాదేశ్‌ వస్తువుల దిగుమతులపై చైనా పన్ను రాయితీలు ఇచ్చినపుడు కూడా దాన్ని భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ను బుట్టలో వేసుకొనే చర్యగా వర్ణించారు. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్‌ యుద్ద విమానాలు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఆల్‌ దఫ్రా వైమానిక కేంద్రంలో ఆగిన సమయంలో ఇరాన్‌ వైపు నుంచి మూడు క్షిపణులు బయలు దేరాయని, అవి ఆల్‌ దఫ్రా వైపే వస్తున్నట్లు సమాచారం అందిందని అమెరికాలోని సిఎన్‌ఎన్‌, ఫాక్స్‌ న్యూస్‌ టీవీ ఛానల్స్‌ వార్తలను ప్రసారం చేశాయి. ఇరాన్‌ క్షిపణులు వచ్చినట్లు అవి సమీపంలోని సముద్రంలో పడినట్లు కూడా అవి చెప్పాయి. ఇవి అమెరికా అల్లిన కట్టుకథలు, ఇరాన్‌తో మన సంబంధాలను చెడగొట్టే చర్య తప్ప మరొకటి కాదు. మీడియాలో వస్తున్న వర్ణణలు, అధికారయంత్రాంగం అనధికారికంగా వదులుతున్న లీకు వార్తలను బట్టి ఎలాంటి నిర్దారణలకు రాకూడదు. మీడియాలో వచ్చిన వార్తలకు విరుద్దంగా చైనా ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాక్‌ చర్య వెనుక చైనా ఉందని అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.

అయితే పాక్‌ చర్య వెనుక చైనా హస్తం లేదా ?
అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కినపుడు, సంక్లిష్టంగా మారినపుడు ప్రతి పరిణామం వెనుక ఏదో ఒక దేశ హస్తం ఉన్నట్లు అనుమానాలు తలెత్తటం సహజం. అవి దాయాదులు లేదా శత్రుదేశాల మధ్యనే కాదు మిత్రదేశాల వ్యవహారాల్లో కూడా కనిపిస్తుంది. కొన్ని పరిణామాల వెనుక చైనా హస్తం ఉందని అనుకొనే వారికి ఆ స్వేచ్చ ఉంది. అయితే మరికొన్ని పరిణామాల వెనుక అమెరికా హస్తం ఉందని దాని ప్రభావానికి మన దేశం లొంగిపోతోందనే కోణంలో కూడా వారితో పాటు అందరూ ఆలోచించాల్సి ఉంది.
ఉదాహరణకు మన దేశంతో కుదుర్చుకున్న ఒక రైల్వే లైన్‌ నిర్మాణం నుంచి ఇరాన్‌ మనలను తప్పించిందని మన మీడియాలో వార్తలు వచ్చాయి. చాబహర్‌ రేవు నుంచి ఆప్ఘనిస్తాన్‌ సరిహద్దు వరకు నిర్మించ తలపెట్టిన కొత్త రైలు మార్గ నిర్మాణంలో భాగస్వామ్యం గురించి భారత్‌తో చర్చలు జరిగాయి తప్ప ఒప్పందం వరకు రాలేదని ఇరాన్‌ ప్రకటించింది. భవిష్యత్‌లో ఇరాన్‌ మీద అమెరికన్లు ఆంక్షలను తీవ్రతరం చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే భయం మన దేశానికి కలిగినందున ఆ ప్రాజెక్టు నుంచి మన దేశాన్ని ఇరాన్‌ తప్పించిందనే రీతిలో వార్తలు వెలువడ్డాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోక పోవటానికి, ఆంక్షల గురించి భయపడటం వెనుక అమెరికా హస్తం ఉన్నట్లేనా ? అమెరికా బెదిరింపులకు మన 56 అంగుళాల ఛాతీ ఉన్న నరేంద్రమోడీ సర్కార్‌ భయపడినట్లా ?


ఇరాన్‌ చాబహార్‌ రేవు అభివృద్ధికి 2016లో మన నరేంద్రమోడీ సర్కార్‌ ఒప్పందం చేసుకుంది. ఐదుదశల్లో ఈ రేవు సామర్ద్యాన్ని పెంచాలన్నది పధకం. తొలి దశలో మన దేశం చేసుకున్న ఒప్పందాన్ని సకాలంలో అమలు చేయలేకపోయిందని ఇరాన్‌ చెబుతోంది. దానికి అమెరికా వత్తిళ్లే కారణం అని ఇరాన్‌ విమర్శిస్తోంది. అది వాస్తవం కానట్లయితే సకాలంలో పధకాన్ని పూర్తి చేయలేని మన అసమర్ధత అయినా అయ్యుండాలి. తదుపరి చర్యలకు భారత్‌కోసం తాము వేచి చూడలేమని ఇతర దేశాల పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామని ఇరాన్‌ చెబుతున్నది. అయితే ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలు తీవ్రం అవుతున్న కారణంగా మరొక దేశమేదీ ముందుకు రానపుడు అమెరికాను ఖాతరు చేయని చైనా అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. అందుకే మన విశ్లేషకులు మన దేశం ఇరాన్‌ను తీసుకుపోయి చైనా చేతిలో పెట్టిందని, దీనికి మనల్ని మనమే నిందించుకోవాలని వ్యాఖ్యానించారు. చైనాను ఒంటరిపాటు చేయటం దేవుడెరుగు మనకు మనమే ఒంటరి అవటానికి అమెరికా వలలో మనం చిక్కుకోవటం కారణం కాదా ?
ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకో కూడదు అన్నది అందరూ అంగీకరించే సాధారణ సూత్రం. అదే సమయంలో అంతర్జాతీయ రాజకీయాలు సరైన దారిలో లేవు కనుక వివాదాలు తలెత్తినపుడు ప్రతి దేశం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం నిత్యకృత్యంగా మారింది. తమ దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా జోక్యం చేసుకున్నట్లు స్వయంగా అమెరికాలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అనేక దేశాల ఎన్నికల్లో, ఎవరు అధికారంలోకి రావాలో ఎవరు రాకూడదో అమెరికా నిర్ణయిస్తోందన్న అంశం కూడా బహిరంగ రహస్యమే.


మన దేశంలో ఉగ్రవాదదాడులు, విచ్చిన్న చర్యలు జరిగినపుడు వాటి వెనుక పాకిస్ధాన్‌ హస్తం ఉందని మన ప్రభుత్వం చెప్పటం తెలిసిందే. పాకిస్ధాన్‌లోని బెలూచిస్తాన్‌, కరాచీ తదితర ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరి ఉగ్రవాద చర్యలు, దాడులు జరిగినపుడు పాక్‌ ప్రభుత్వం కూడా వాటి వెనుక మన హస్తం ఉందనే ఆరోపిస్తున్నది. పశ్చిమాసియాలోని అరబ్బు ప్రాంతాల్లో జరిగే దాడులకు ఇజ్రాయెల్‌ కారణమని, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరిగే చర్యలకు అరబ్బులు కారణమనే వార్తలు కూడా వస్తాయి. అత్యధిక సందర్భాలలో వీటికి ఆధారాలు ఉండవు అందువనల వీటిలో వాస్తవాలు ఏమిటి అన్నపుడు ఒక ఆరోపణ నిజమే అని అంగీకరించినపుడు రెండవదాన్ని కూడా నిజమే అనుకోవాలా లేదా ?


లడఖ్‌ ప్రాంతాన్ని కాశ్మీరు నుంచి విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా మన ప్రభుత్వం ప్రకటించింది. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని కూడా లడఖ్‌ అంతర్భాగమని భారత్‌ చెప్పటాన్ని తాము అంగీకరించటం లేదని భారత చర్య చట్టవిరుద్దమని చైనా ఏడాది క్రితమే భద్రతా మండలిలో అభ్యంతరాన్ని లేవనెత్తింది. మధ్యలో ఒకసారి తాజాగా ఆ చర్యకు ఏడాది నిండిన సందర్భంగా మరోసారి భద్రతా మండలిలో ఇష్టాగోష్టి చర్చకు చైనా లేవనెత్తింది. నిజానికి లడఖ్‌ను పూర్తిగా మనదే అని మనం చెప్పటం లేదా చైనా తన ఆధీనంలో ఉన్నదని చెప్పటం కొత్తగా తలెత్తలేదు. రెండు దేశాల మధ్య సమస్యలు, అనుమానాలు తలెత్తినపుడు మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటారనే కారణంతో లాంఛనంగా అభ్యంతరాలను లేవనెత్తుతారు. ఏడాది క్రితం తొలిసారి చైనా లడఖ్‌ గురించి అదే చేసినపుడు మన అధికారులు చైనా వెళ్లి యథాతధ స్థితి గురించి తాము ఎలాంటి చర్య తీసుకోలేదని, అంతర్గత వ్యవహారాల్లో భాగంగా కొన్ని చర్యలు తీసుకున్నట్లు ఇచ్చిన వివరణతో చైనా తదుపరి పొడిగించలేదు. అయితే తరువాత సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో తాజాగా చైనా మరోసారి భద్రతా మండలిలో దీన్ని చర్చకు పెట్టింది.


చైనా అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకుంటున్నామా ?
మన కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసినపుడు, ఆర్టికల్‌ 370 రద్దు చేసినపుడు పాకిస్ధాన్‌ విమర్శలు చేసింది. చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ సమయంలో అది మా అంతర్గత వ్యవహారం ఇతర దేశాల జోక్యం తగదని మన ప్రభుత్వం ప్రకటించింది.
ఇదే మాదిరి మన మీద చైనా అలాంటి ప్రకటనలే చేస్తున్నది. అవి అధికార ప్రతినిధులు లేదా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వ్యాఖ్యల రూపంలో ఉండవచ్చు. ఉదాహరణకు తైవాన్‌ సమస్య. తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని ఐక్యరాజ్యసమితి స్వయంగా గుర్తించింది. మన దేశం, అమెరికా కూడా అదే వైఖరిని కలిగి ఉంది. అయితే చైనాలో తైవాన్‌ విలీనం అయ్యేందుకు తగిన వాతావరణం లేదనే పేరుతో అమెరికన్లు జోక్యం చేసుకుంటున్నారు. తైవాన్‌కు ఆయుధాలు అందిస్తున్నారు, చైనా వ్యతిరేక శక్తులకు అన్ని రకాల సాయం అందిస్తున్నారు. దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం లేనందున దొడ్డిదారిన ఆఫీసులను ఏర్పాటు చేసి నిత్యం అక్కడి చైనా వ్యతిరేక శక్తులతో సంబంధాలను కలిగి ఉంది. ఇటీవలి కాలంలో అమెరికా ప్రభావానికి గురై భారత్‌ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటోందని చైనా విమర్శిస్తోంది.
కరోనా లాక్‌డౌన్‌కు ముందు తైవాన్‌లో జరిగిన ఎన్నికలలో చైనాలో విలీనాన్ని వ్యతిరేకించే శక్తులు విజయం సాధించాయి. వారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పంపగా బిజెపి తన ఇద్దరు ఎంపీలను ఎంపిక చేసింది. విమానాల రద్దు కారణంగా వారు భౌతికంగా వెళ్లి అక్కడి పాలకులను అభినందించలేకపోయారు గానీ ఆన్‌లైన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆపని చేశారు. ఈ చర్యను తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా చైనా పరిగణిస్తోంది.
కాశ్మీరులో ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి తగినన్ని అధికారాలు కల్పించే చర్యల్లో భాగంగా ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అదే మాదిరి చైనాలో అంతర్భాగమైన హాంకాంగ్‌లో కొన్ని శక్తులు 2047లో చైనాలో పూర్తిగా విలీనం కావాలన్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ స్వాతంత్య్రం కావాలని ఆందోళన చేస్తున్నాయి. చైనా అధికారాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నాయి. అలాంటి శక్తుల వలన ముప్పు వచ్చిందని భావించిన చైనా సర్కార్‌ తన అంతర్గత భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌కు వర్తింప చేసింది. ఈ చర్యను వ్యతిరేకించే వారికి పరోక్షంగా మద్దతు తెలియచేస్తూ మన ప్రతినిధి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్‌ వేదిక మీద లేవనెత్తారు. గతంలో ఎన్నడూ ఇలాంటి వైఖరిని తీసుకోలేదు. ఇది కూడా తమ అంతర్గత వ్యహారాల్లో జోక్యమే అని చైనా చెబుతోంది.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని కొన్ని దీవుల గురించి చైనాతో సహా ఆ ప్రాంత దేశాల మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. వాటికి మనకూ ఎలాంటి సంబంధమూ లేదు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా జోక్యం చేసుకోవటమే కాదు, ఆప్రాంతానికి యుద్ద నౌకలను తరలించి ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. దాని ఎత్తుగడకు అనుగుణ్యంగా ఆ వివాదంలో మన దేశం జోక్యం చేసుకోవటాన్ని చైనా తప్పుపడుతున్నది.
ఇక టిబెట్‌ విషయం గురించి తెలిసిందే. చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన దలైలామాను అమెరికా రూపొందించిన పధకం ప్రకారం మన దేశానికి రప్పించటం, ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు చేయటం, తిరుగుబాటుదార్లకు మన దేశంలో కొన్ని చోట్ల నివాసాలను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇదంతా దలైలామా మతాధికారి కనుక మానవతా పూర్వక వైఖరితో చేశాము. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా అభ్యంతర పెడుతున్నది. దానిలో భాగంగానే అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ పట్టణ పర్యటనకు దలైలామాను అనుమతించవద్దని గతంలో చైనా అభ్యంతర పెట్టిన విషయం కూడా తెలిసిందే. వీటన్నింటిలో చైనా వ్యవహారాలలో మన జోక్యం ఉన్నట్లా లేనట్లా ? మనం ఏమి చేసినా మనకు సరైనదిగా కనిపిస్తే చైనా ఏమి చేసినా చైనీయులకూ సరైనదిగానే కనిపిస్తుంది. ఏదేశానికైనా వాటి పర్యవసానాలు ఏమిటి అన్నది ముఖ్యం.


పాకిస్ధాన్‌ ఉగ్రవాది మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటాన్ని ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకోవటం. ప్రపంచ అణు సరఫరా దేశాల బృందంలో మన దేశం చేరటాన్ని చైనా అభ్యంతరం పెట్టటం, లడఖ్‌ విషయంలో భద్రతా మండలికి ఫిర్యాదు చేయటం వంటివి చైనా జోక్యంగా పరిగణించే వాటిలో కొన్ని.
పాకిస్దాన్‌కు గతంలో అమెరికా ప్రధాన మద్దతుదారుగా ఉంది. ఎఫ్‌16 యుద్ద విమానాలను అందించి మనలను పరోక్షంగా బెదిరించిన చరిత్ర అందరికీ తెలిసిందే. మన ప్రాంతాలను పాక్‌ తన అంతర్భాగాలుగా చూపుతూ చిత్ర పటాలను రూపొందిస్తే చైనాకు ప్రత్యక్షంగా కలిగే లాభం ఏమీ లేదు. మనకు వ్యతిరేకంగా పాక్‌ను చైనా రెచ్చగొడుతోంది అనే అభిప్రాయం ఒకటి ఉంది. గత చరిత్రను చూసినపుడు కాశ్మీర్‌ను ఆక్రమించేందుకు పాకిస్దాన్‌ను పురికొల్పింది బ్రిటన్‌, అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. తరువాత జరిగిన యుద్దాల సమయంలో మనకు వ్యతిరేకంగా ఆయుధాలు అందించింది అమెరికా అన్నదీ తెలిసిందే. బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ద సమయంలో మనం బంగ్లా దేశ్‌లో జరుగుతున్న ఊచకోతను నివారించేందుకు జోక్యం చేసుకొని పాక్‌ మిలిటరీని నిలువరించాము. స్వల్ప యుద్దం కూడా చేశాము. ఆ సమయంలో మనకు వ్యతిరేకంగా సైనిక చర్య తీసుకొనేందుకు అమెరికా తమ సప్తమ నౌకా దళాన్ని బంగాళాఖాత ప్రాంతానికి తరలించిన విషయం తెలిసిందే.అలాంటి అమెరికాతో, బ్రిటన్‌, ఇతర పశ్చిమ దేశాలతో రాసుకుపూసుకు తిరగటానికి మనకు ఎలాంటి పేచీ అభ్యంతరం కనిపించటం లేదు. పాకిస్ధాన్‌ పాలకులు అమెరికాతో చేతులు కలిపినపుడు అమెరికాను బహిరంగంగా విమర్శించటానికి మన మీడియాకు ధైర్యం చాలలేదు. ఒక వేళ ఇప్పుడు పాకిస్దాన్‌ను మన మీదకు చైనా ఎగదోస్తోంది అనుకుంటే, ఇంతకాలం అలాంటి చర్యలకు పాల్పడని చైనా ఇప్పుడు ఎందుకు ఆ పని చేస్తోందో రెండో కోణం కూడా పాఠకులకు అందించాలి. చైనాతో పాటు మన పాలకుల తప్పిదాలు, విధానాల్లో లోపాలు ఉంటే వాటిని కూడా ధైర్యంగా విమర్శించాలి. ఇరాక్‌ మీద అమెరికా దాడి, సిరియా మీద ఆల్‌ఖైదా ఉగ్రవాదులతో కలసి దాడులు చేసిన తమ పాలకుల గురించి అక్కడి మీడియాలో అనేక మంది తీవ్రంగా విమర్శించారు. వియత్నాం మీద దురాక్రమణ యుద్దానికి పాల్పడితే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన చరిత్ర అమెరికా ప్రజలకు ఉంది. మనం ఇతరులను కెలక్కపోతే ఇతరులూ మనలను కెలకరు అనే విషయాన్ని గ్రహించాలి. అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్దంలో మనం ఒక పక్షం వహించటం ఏమాత్రం క్షేమకరం కాదు అని పాలకులు గ్రహించాలి. అది సరైనదే అనుకుంటే వచ్చే పర్యవసానాలకూ బాధ్యత వారిదే అవుతుంది.


వెలువడుతున్న వ్యాఖ్యానాలు, పర్యవసానాలేమిటి ?
పాకిస్ధాన్‌ రూపొందించిన కొత్త చిత్ర పటంతో తలెత్తే ఇతర పర్యవసానాల గురించి మన దేశంలో చర్చ జరుగుతోంది. జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలు తమవి అని చెప్పటం ద్వారా కాశ్మీర్‌లోని వేర్పాటు వాదులు, లేదా ఆక్రమిత కాశ్మీర్‌లోని స్వతంత్ర కాశ్మీర్‌ వాదులకు ఎదురు దెబ్బ తగిలినట్లే అన్నది ఒక అభిప్రాయం. ఇప్పటి వరకు పాక్‌ పాలకులు కాశ్మీర్‌ సమస్య మీద ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, కాశ్మీరీలు స్వతంత్ర దేశంగా ఉంటే తాము మద్దతు ఇస్తామని చెప్పిన మాటలకు ఇక ముందు ఆస్కారం ఉండదు. పాక్‌ మాటలు నమ్మి వేర్పాటును కోరుతున్న వారి పరిస్ధితి అగమ్యగోచరంగా మారుతుంది అని కొన్ని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ,లిపులేక్‌,లిమియాధురా ప్రాంతాలు తనవే అంటూ కొద్ది వారాల క్రితం నేపాల్‌ ప్రకటించటం, ఇప్పుడు అదే పని పాక్‌ చేయటం కాకతాళీయంగా జరిగినవి కాదని వాటి వెనుక రెండు దేశాలకూ పెద్ద మొత్తంలో సాయం చేస్తున్న చైనా హస్తం ఉందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి.
” చైనాతో కలుపుతూ పాకిస్ధాన్‌ కాగితాల మీద తన చిత్ర పటాన్ని రూపొందించినందున రెండు దేశాలతో యుద్దం ఉండవచ్చేమో అన్న భారత్‌ భయాన్ని తాజా పరిణామం ఎక్కువ చేస్తున్నది. అయితే ఆచరణలో అది పని చేస్తుందనేందుకు ఆధారాలు చాలా పరిమితంగా ఉన్నాయి, అయితే దేశీయ రాజకీయాలు ఈ చిత్రపటం వెనుక ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నట్లు ” హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పేర్కొన్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d