• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Political Parties

మొక్కజొన్న తోటల్లో చీకట్లు ముసరనున్నాయా ?

16 Saturday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Telangana

≈ Leave a comment

Tags

corn, corn imports, corn msp, corn prices, india corn imports

ఎం కోటేశ్వరరావు

    అమెరికాలో సాధారణం కంటే ఎక్కువగా సాగు చేశారన్న అక్కడి వ్యవసాయశాఖ అంచనాతో ప్రపంచ మార్కెట్‌లో మొక్క జొన్నల ధరలు పడిపోయాయి. మన దేశంలో పత్తి సాగును తగ్గించిన రైతాంగం మొక్కజొన్న వైపు మొగ్గిందనే వార్తలతో తన విత్తన వ్యాపారం మూడు జొన్న కర్రలు ఆరు పొత్తులుగా పెరుగుతుందని మోన్‌శాంటో కంపెనీ లాభాల లెక్కలు వేసుకొంటోంది. గత రెండు సంవత్సరాలుగా వుత్పత్తి తగ్గిన కారణంగా దొంగ నిల్వదారుల చర్యలను వమ్ము చేసేందుకు, ధరలను తగ్గించేందుంటూ మొక్కజొన్నల దిగుమతికి అనుమతిస్తూ నరేంద్రమోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకోవటంతో టన్ను పద్దెనిమిదివేలు వున్న ధర అమాంతం పద్నాలుగు వేలకు పడిపోయింది.అనేక రికార్డులను బద్దలు చేస్తున్న మోడీ సర్కార్‌ పాతిక సంవత్సరాల క్రితం గరిష్టంగా వున్న రెండున్నరలక్షల టన్నుల దిగుమతి రికార్డును బద్దలు కొడుతూ ఐదు లక్షల టన్నులకు అనుమతించింది. వాటిపై దిగుమతి పన్నుకు పూర్తి మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయ పర్యవసానాలు ఎవరికి మేలు చేస్తాయి, ఎవరికి కీడు చేస్తాయి ?

     మొక్క జొన్నలు ప్రధానంగా కోళ్ల, పశుదాణా, గంజి పౌడరు తయారీకి వినియోగిస్తారు. ధరలు ఎక్కువగా వున్నాయి కనుక ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతులకు అనుమతివ్వాలని వ్యాపారులు చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గిందా? లేక తమ వద్ద పేరుకుపోతున్న నిల్వలను తగ్గించుకొనేందుకు అమెరికా సర్కార్‌ చేసిన వత్తిడికి మోడీ సర్కార్‌ లొంగి పోయిందా ? ప్రభుత్వం అంటే సమాజంలో అన్ని తరగతులకు సమన్యాయం చేయాల్సిన బాధ్యత కలిగినది. గత నాలుగు సంవత్సరాలుగా పెరిగిన వ్యవసాయ ఖర్చులతో పోల్చుకుంటే మొక్కజొన్నలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తక్కువే. క్వింటాలుకు రు.1310 నుంచి 1365కు మాత్రమే పెంచింది.అంటే ఏడాదికి సగటున 14 రూపాయలకు లోపు, ఇదే సమయంలో గుడ్డు ధరలు ఎంత పెరిగాయి? రైతులకు హైదరాబాదులో 2013 జూలైలో ఒక గుడ్డుకు సగటున 306.7పైసలు లభిస్తే అదే 2016 జూలైలో 360 పైసలకు పెరిగింది. ఇక వినియోగదారుల విషయానికి వస్తే 311 నుంచి 414.80పైసలకు పెరిగింది. ఇవి జాతీయ గుడ్ల సమన్వయ కమిటి ప్రకటించిన రేట్లు, చిల్లర దుకాణాలలో హైదరాబాదులో గత కొద్ది వారాలుగా ఐదు రూపాయలు అమ్ముతున్నారు. ఒక గుడ్డుకే ఇంత ధర పెరిగితే మొక్క జొన్నలకు క్వింటాలకు నాలుగు సంవత్సరాలలో 55 రూపాయలు పెరచటాన్ని ఏమనాలి? టోల్‌ టాక్సు పెంపుదలకు ద్రవ్యోల్బణం, వుద్యోగులు, కార్మికుల వేతనాలు, కరవు భత్యం పెంపుదలకు ఇలా ప్రతి దాని ధరల పెంపుదలకు ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్న సర్కార్‌ మొక్కజొన్నల మద్దతు ధరల పెంపుదలకు దానిని ఎందుకు వర్తింపచేయటం లేదు ? వరుసగా 2012 నుంచి 2015 వరకు వినియోగదారుల (సిపిఐ) ద్రవ్యోల్బణం 11.17,9.13,5.86,6.32 శాతం చొప్పున పెరిగింది. ప్రభుత్వం 2013-14 సంవత్సరానికి మొక్క జొన్నలకు ప్రకటించిన మద్దతు ధర రు.1310. అంతకు ముందు 2012 (డిసెంబరు నుంచి డిసెంబరు) ద్రవ్యోల్బణం రేటు 11.17శాతం అంటే 2012-13 సంవత్సరానికి గాను క్రితపు ఏడాది ప్రకటించిన రు.1175 మీద రు.131 పెంచాల్సి వుండగా నాలుగు రూపాయలు కలిపి 1310 చేశారు. మరుసటి ఏడాది ద్రవ్యోల్బణం రేటు 9.17 శాతానికి గాను 2014-15లో 119 రూపాయలు కలిపి రు.1429కి పెంచాల్సి వుండగా రు.1310నే కొనసాగించారు. 2015-16కు గాను మరో 83పెంచి రు.1512 కు బదులు 1325, 2016-17కు 95 రూపాయలు పెంచి రు1607 బదులు రు.1365గా మాత్రమే నిర్ణయించారు. సీజన్‌లో ప్రభుత్వ మద్దతు ధరలకు అటూ ఇటుగా మాత్రమే బహిరంగ మార్కెట్‌లో రైతాంగానికి దక్కుతున్న విషయం తెలిసిందే.

    తెలంగాణాలో దాదాపు ఎనిమిది లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో రెండున్న లక్షల హెక్టార్లలో మొక్క జొన్న సాగు అవుతోంది. తెలంగాణాలో ఇదే మూడవ పెద్ద పంటగా వుంది. అందువలన అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో వచ్చే మార్పులు తెలంగాణా రైతాంగంపై ప్రధానంగా ప్రభావం చూపుతాయని వేరే చెప్పనవసరం లేదు. చైనా నుంచి డిమాండ్‌ తగ్గటం కారణంగా ప్రపంచ మార్కెట్లో గణనీయంగా ధరలు పడిపోయాయి. దీనికి తోడు అమెరికాలో పెద్ద ఎత్తున నిల్వలు వుండిపోయాయి. కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున మొక్క జొన్నలు దిగుమతి చేసుకొనేందుకు నిర్ణయించిందంటే భారీ మొత్తంలో ఎగుమతి సబ్సిడీలు పొందే అమెరికా వ్యాపారులు ముందుగా లబ్ది పొందుతారు.మన దేశంలో సాధారణ వినియోగం ఏటా 20మిలియన్‌ టన్నులు వుంది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే మన దేశంలో మొక్క జొన్నల వుత్పత్తి 2015-16లో 23.67 నుంచి 21.02 మిలియన్‌ టన్నులకు పడిపోయినట్లు అంచనా. ఇది సాధారణ వినియోగం కంటే స్వల్పంగా ఎక్కువే. అంతకు ముందు 17 మిలియన్‌ టన్నులకు పడిపోయిన సందర్బాలలో కూడా మనం దిగుమతులు చేసుకోలేదు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి లేకున్నా దిగుమతులకు నిర్ణయించటం గమనించాల్సిన అంశం. మన దేశంలో ఆహార వినియోగం 17-20శాతం కాగా, దాణాగా 60-62శాతం, మిగిలింది విత్తనాలు, పారిశ్రామిక వినియోగంలో వున్నట్లు ఫిక్కీ నివేదిక పేర్కొన్నది.మాంసానికి పెంచే బ్రాయిలర్‌ కోడికి ఐదు వారాలలో 3.6 నుంచి 4 కిలోలు, గుడ్లు పెట్టే కోడికి ఏటా 42-47కిలోలను దాణా వేస్తారు. ఇది ప్రధానంగా మొక్కజొన్నలతో తయారు చేస్తారు. మొక్క జొన్నలకు ప్రత్యామ్నాయంగా వున్న జొన్నల లభ్యత సమస్యగా వుండటంతో మొక్కజొన్నలపైనే ప్రధానంగా పరిశ్రమ ఆధారపడుతోంది.

     వర్షాభావం కారణంగా రెండు సంవత్సరాలుగా వుత్పత్తి తగ్గినప్పటికీ ఈ ఏడాది సాగు 20-30శాతం వరకు పెరగవచ్చని, పత్తిసాగు తగ్గుతుందని కన్సెల్టెన్సీలు తమ ఖాతాదార్లకు సమాచారం పంపాయి. ఈ కారణంగానే మోన్‌శాంటో పెద్ద ఎత్తున విత్తనాలను రంగంలోకి దించి లాభాలను పెంచుకోవచ్చని అంచనా వేసుకున్నది.దానికి అనుగుణంగానే స్టాక్‌ ఎక్సేంజ్‌లలో దాని షేరు విలువ కూడా పెరిగింది.

     మార్కెట్‌ మాయాజాలం విషయానికి వస్తే 2011-12లో అమెరికాలో టన్ను మొక్కజొన్న ధర 295-300డాలర్ల మధ్య వుండగా మన దేశ కనీస మద్దతు ధర నాటి రూపాయి విలువలో 9800, డాలర్లలో 211 వుంది. 2014-15లో అమెరికా ధర 170-175 డాలర్లకు పడిపోగా మన దేశంలో 13,100 రూపాయలకు, 215 డాలర్లకు పెరిగింది. అందువలన దిగుమతులు చౌకగా మారాయి. ఈ కారణంగా మన ప్రభుత్వ దిగుమతులపై పన్ను విధించి దిగుమతులను నిరుత్సాహపరచింది. ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో జూలై 14న రోజువారీ మండీ ధర 164 డాలర్లు కాగా జూలై 16వ తేదీ ముందస్తు మార్కెట్‌ ధర 142 డాలర్లు వుంది.మన రూపాయి విలువ తగ్గిన కారణంగా పన్నెండు వేల రూపాయలకే టన్ను మొక్కజొన్నలు వస్తాయి. జూలై 16న తెలంగాణాలోని వివిధ మార్కెట్లలో క్వింటాలు ధర 1100 నుంచి 1680, ఆంధ్రప్రదేశ్‌లో 1310-1500 మధ్య వుంది. గతేడాది పత్తి రైతుల అనుభవం చూస్తే వారు పూర్తిగా అమ్ముకున్న తరువాత క్వింటాలు ఆరువేల రూపాయల వరకు పెరిగింది, దానితో విదేశీ కంపెనీలు లాభపడ్డాయని తాము నష్టపోయామని నూలు మిల్లుల యజమానులు గగ్గోలు పెట్టటంతో కొద్ది రోజుల పాటు మిల్లులను మూసివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మొక్క జొన్నల విషయంలో పంట చేతికి వచ్చే తరుణానికి దిగుమతుల కారణంగా గతేడాది కంటే ధరలు తగ్గితే అందుకు బాధ్యత కేంద్రానిది, కేంద్ర చర్యలపై నోరు మెదపని రాష్ట్రాలది అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ తీరే వేరు – గరిష్ట మంత్రులు, కనిష్ట పాలన

05 Tuesday Jul 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

cabinet reshuffle, Modi, modi cabinet, small government

ఎంకెఆర్‌

    ప్రధాని నరేంద్రమోడీ మరో వాగ్దానానికి తిలోదకాలిచ్చారు. కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అనే వాగ్దానానికి తూనా బొడ్డు అని చెప్పారు. గరిష్ట మంత్రులు-కనిష్ట పాలనకు తెరతీశారు. మంగళవారం నాడు ఐదుగురు మంత్రుల వుద్యోగాలు పీకివేసి 19మందికి కొత్తగా ఇచ్చారు. సంతుష్టీకరణ పనులు చేయబోమని గొప్పలు చెప్పుకొనే బిజెపి అదే బాటలో నడిచి జంబో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. మన్మోహన్‌ సింగ్‌ మంత్రివర్గంలో 78 మంది వుంటే మందగా ఎద్దేవా చేసి చూడండి మేము 45 మందితో ఏర్పాటు చేస్తున్నామని గొప్పగా చెప్పారు. మంత్రివర్గ ఏర్పాటులో అసాధారణం, సానుకూల మార్పు అని స్వయంగా నరేంద్రమోడీ తన అభిమానులకు ట్వీట్లు పంచారు. దానినే పెద్ద సంస్కరణగా వూరూ వాడా టాంటాం వేసుకున్నారు, వంది మాగధుల పొగడ్తలు అందుకున్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌, అదే మన్మోహన్‌ సింగ్‌ బూట్లలో కాళ్లు దూర్చారు.పని చేయని మంత్రులుగా పేరు తెచ్చుకున్న వారిని కొనసాగించారు. నిబంధనావళి ప్రకారం 82 మంది వరకు మంత్రులు వుండవచ్చు. అంటే మరో నలుగురికి చోటు కల్పించేందుకు అవకాశం వుంది.

     డెబ్బయి అయిదు సంవత్సరాలు దాటిన ముసలి వారిని మంత్రులుగా తీసుకోకూడదన్నది విధాన నిర్ణయంగా నరేంద్రమోడీ ప్రకటించినపుడు అద్వానీ అండ్‌ కోను వదలించుకొనేందుకే అని కొందరు గొణిగినప్పటికీ వహ్వా వహ్వా అంటూ ఎందరో అభినందనలు చెప్పారు. ముసలివారిని తొలగిస్తారని వూహాగానాలు చేసిన, రాసిన వారందరూ నజ్మా హెప్తుల్లా, కల్‌రాజ్‌ మిశ్రాల కొనసాగింపును చూసి అవాక్కయ్యారు. ఎన్‌పిఏ(పని చేయని) మంత్రిగా పేరు తెచ్చుకున్న సదానంద గౌడతో సహా మరికొందరిని పని చేసేందుకు కొనసాగనిచ్చారు. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి చెందిన సుజనా చౌదరిని కొనసాగించటం ద్వారా ‘మై హూనా ‘ అంటూ భరోసా ఇచ్చినట్లయింది.

    ఇప్పటికే 13 మంది మంత్రులున్న వుత్తర ప్రదేశ్‌కు మరి కొంత మందిని తోడు చేయటం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసమే అంటే కోపగించుకోకూడదు. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న బిజెపి ఆచరణలో అబ్బే అలాంటిదేమీ లేదని రుజువు చేసుకుంటున్నది. మోడీ మంత్రి వర్గ విస్తరణ పాలనతో సంబంధం లేదు ఎన్నికలు అధికారంపై తన మరియు ఆర్‌ఎస్‌ఎస్‌ పట్టు నిలుపుకొనే రాజకీయ చర్య అని ప్రముఖ లాయర్‌ ప్రశాంత భూషణ్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని తరచూ మన్‌కీ బాత్‌ అంటూ మాట్లాడతారు తప్ప కామ్‌కీ బాత్‌ను పట్టించుకోరని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని నరేంద్రమోడీ – ఇప్తార్‌ విందు రాజకీయాలు

03 Sunday Jul 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, iftar, iftar party, Narendra Modi, PM Narendra modi, politics of iftar, RSS, skull cap

సత్య

    మంత్రసానితనానికి ఒప్పుకున్నతరువాత ఏదొచ్చినా పట్టాలి అన్నట్లుగా ప్రజాజీవితంలో వుండాలి అనుకున్న తరువాత ప్రశంసలను ‘ఆస్వాదించటమే ‘ కాదు విమర్శలను కూడా ‘సహించాలి’.గత రెండు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ పైకి అభివృద్ధి మంత్రం జపిస్తున్నప్పటికీ ఆచరణలో హిందుత్వను పెంచి పోషించటంపైనే కేంద్రీకరిస్తున్నారన్నది కమ్యూనిస్టులు, కాని వారు కూడా చేసిన విమర్శలలో ఒకటి.http://economictimes.indiatimes.com/news/politics-and-nation/pm-narendra-modi-in-control-turns-focus-from-hindutva-to-development/articleshow/53021691.cms

   ‘పరిస్థితిని అదుపులోకి తెచ్చుకొని హిందూత్వ నుంచి అభివృద్ధి వైపు మరలిన ప్రధాని నరేంద్రమోడీ’ అనే శీర్షికతో జూలై రెండున ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఒక వ్యాఖ్యానాన్ని ప్రచురించింది. దానిని ఐఎఎన్‌ఎస్‌ అనే ఒక వార్తా సంస్ధ ప్రతినిధి రాశారు. ప్రచురించిన పత్రిక, రాసిన జర్నలిస్టు, రాయించిన వార్తా సంస్ధగానీ కమ్యూనిస్టులు, ఇతర పార్టీలతో ‘నీకిది నాకది’ సంబంధాలు కలిగినవి కాదు.ఎట్టకేలకు రెండు సంవత్సరాల తరువాత హిందుత్వ నుంచి అభివృద్ధి వైపు మరలినట్లు రాసిన ఆ కధనం ‘బి పాజిటివ్‌ ‘ ధోరణిలో సాగిందే అని గమనించాలి. హిందుత్వ బలపడటానికి నరేంద్రమోడీ ‘పాటు పడుతున్నారని’ చేసిన విమర్శలు వాస్తవమే అన్నది ఆ కధనం కూడా బలపరిచింది.

      ఈ వ్యాఖ్యానం వెలువడిన రోజే రాష్ట్రపతి ప్రతి ఏటా రంజాన్‌ సందర్భంగా సాంప్రదాయంగా ఇచ్చే ఇప్తార్‌ విందుకు వరుసగా మూడవ సంవత్సరం ప్రధాని నరేంద్రమోడీ డుమ్మా అనే వార్తలు కూడా వచ్చాయి. దేనికి హాజరు కావాలో కాకూడదో ప్రధాని ఇష్టం, ఆయనకు ఆ స్వేచ్ఛ లేదా అనే మండిపడే ప్రజాస్వామిక వాదులతో ఎలాంటి పేచీ లేదు.అత్యంత గౌరవనీయ పదవిలో దేశాధిపతి అధికారికంగా ఇచ్చే విందుకు సందర్భం ఏదైనా ఆహ్వానం రావటమే ఒక గౌరవంగా భావిస్తారు. దాన్ని మన్నించటం ఒక వ్యవస్ధకు ఇచ్చే మర్యాద. సోనియా గాంధీ, సీతారాం ఏచూరి వంటి వారు రావటం అన్నది ఇక్కడ ప్రధానం కాదు. ప్రధాని న్యూఢిల్లీలో వుండి రాకపోవటం అన్నది నలుగురి నోళ్లలో నానే అంశమే. ఈ విషయం నరేంద్రమోడీ, ఆయన సలహాదారులు, మార్గదర్శకులకు తెలియదు అనుకొనే అమాయకులు లేరు. మత రాజ్యాలుగా ప్రకటించుకున్నవి మినహా మన దేశంలో మతాన్ని రాజకీయ మయం చేసినంతగా మరే దేశంలోనూ జరగలేదంటే అతిశయోక్తి కాదు.వాటిలో ఇప్తార్‌ విందు ఒకటి.

      రాష్ట్రపతి ఇచ్చిన విందుకు రాకపోవటం గురించి కనీసం ట్విటర్‌ ద్వారా అయినా నరేంద్రమోడీ తెలిపారా లేదా అన్నది గానీ, బిజెపి నాయకత్వం ఇబ్బంది పడుతున్న కారణంగా తన ట్వీట్ల సంఖ్యను తగ్గించుకుంటానని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకోవటంలో భాగంగా గానీ ట్వీట్లు, వాటిని అనుసరించే అభిమానుల విషయంలో నరేంద్రమోడీతో పోటీ పడే సుబ్రమణ్యస్వామి దీని మీద ట్వీట్‌ చేసిందీ లేనిదీ తెలియదు. స్వాతి చతుర్వేది అనే ఒక సీనియర్‌ జర్నలిస్టు ‘రాష్ట్రపతి భవన్‌ ఇప్తార్‌ విందుకు భారత ప్రధాని మరోసారి రాలేదు, విదేశాలలో ఆయన చేసిన వుపన్యాసాలను మరచిపోయినట్లుగా కనిపిస్తున్నది ‘ అని ట్వీట్‌ చేశారు.’ ఇదీ భారతీయ స్ఫూర్తి,ఇది మా జాతి బలం, మా పౌరులందరూ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్దులు, చాలా పరిమితంగా వున్న పార్సీలు, దైవంపై నమ్మకం వున్న వారు , లేని వారు అందరూ భారత్‌లో అంతర్బాగం. ఒకసారి భారత్‌కు వచ్చినట్లుగానే ఈ రోజు భారత్‌ నుంచి సూఫీయిజం ప్రపంచానికి విస్తరిస్తోంది. భారత్‌లో రూపుదిద్దుకున్న ఈ సంప్రదాయం మొత్తం దక్షిణాసియా అంతటికి చెందుతుంది. అందుకే మన వారసత్వాన్ని ఈ ప్రాంతంలోని ఇతరులందరూ పాటించాలని, పునరుద్ధరించాలని కోరుతున్నాను.’ ఈ మాటలను ఢిల్లీలో జరిగిన ప్రపంచ సూఫీ మహాసభలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వుపన్యాసంలో చెప్పారు. విదేశాలకు వెళ్లినపుడు భిన్నత్వాన్ని తానెంతగా గౌరవించేది తన వుపన్యాసాలలో చెప్పే నరేంద్రమోడీ ఆచరణ ముస్లింల పట్ల వ్యతిరేక భావంతో వుంటారన్న అభిప్రాయాలకు అనుగుణంగా వుందని, తిరిగి వెనుకటి రోజులకు మరలారని కనిపిస్తోందని ఇండియా డాట్‌కామ్‌ వార్తలో వ్యాఖ్యానించారు.http://www.india.com/news/india/prime-minister-narendra-modi-skips-presidents-iftar-party-third-year-in-a-row-1304643/

     ఒకే రోజు నరేంద్రమోడీ గురించి భిన్నమైన వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.అమృతసర్‌లో నేనూ మరికొందరు జర్నలిస్టులు స్వర్ణదేవాలయ సందర్శనకు వెళ్లాము. తలమీద పాగా లేదా అది లేనట్లయితే కనీసం హాండ్‌ కర్చిఫ్‌ అయినా కప్పుకొని వెళ్లాలని చెప్పినదానిని మేము పాటించాము, అదే విధంగా తిరుపతి, తిరువనంతపురం పద్మనాభస్వామి గుడి సందర్శనకు వెళ్లినపుడు విధిగా అక్కడి ఆచారాలు పాటించాలని స్పష్టం చేశారు. ఇష్టం వున్నవారు పాటించి దేవాలయాలను సందర్శించారు లేని వారు బయటే వుండిపోయారు. నా గురించి తెలిసిన వారు నేను హిందూ మతావలంబకులను సంతుష్టి పరచటానికి అంగవస్త్రం ధరించి వారితో పాటు గుడిలోకి వెళ్లానని అనలేకపోయారు. ముస్లింలు సాంప్రదాయంగా ధరించే టోపీ (స్కల్‌ కాప్‌) ధరించటానికి నరేంద్రమోడీ తిరస్కరించారు. ముందే చెప్పుకున్నట్లు ప్రతిదానినీ రాజకీయం చేయటంలో భాగంగా ఇతర పార్టీల వారు వాటిని ధరించినపుడు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వారు మైనారిటీల సంతుష్టీకరణలో భాగమే ఇదని వూరూ వాడా ప్రచారం చేశారు. అలాంటి వారే చివరికి వాటిని ధరిస్తే ప్రతిపక్షాలు వూరుకుంటాయా? అందుకే నరేంద్రమోడీ బహుశా తిరస్కరించి వుండవచ్చు లేదా ఇంకేదయినా మహత్తర ఆశయం వుందేమో తెలియదు. టోపీ ధరించిన వారినీ లేదా ధరించని వారిని గానీ కమ్యూనిస్టులెపుడూ విమర్శించలేదు. సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నదని విమర్శలు,ఆరోపణలకు తీవ్రంగా గురైన కాంగ్రెస్‌ పార్టీ చివరికి ఇప్తార్‌ విందులకు స్వస్తి చెప్పింది. కాంగ్రెస్‌ను దుయ్యబట్టిన సంఘపరివార్‌ తన అనుబంధ సంస్ధ ఆర్‌ఎంఎం ద్వారా కొత్తగా ఇప్తార్‌ విందులకు తెరతీసింది. గతేడాది ఈ సంస్ధ సాదాసీదాగా నిర్వహిస్తే ఈ సంవత్సరం దానిని ఒక అంతర్జాతీయ సంఘటనగా చేసేందుకు 140 దేశాల రాయబారులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించి న్యూఢిల్లీ పార్లమెంట్‌ అనెగ్జర్‌లో భారీ ఇప్తార్‌ విందు ఏర్పాటు చేసింది. దాని ఎవరైనా విమర్శిస్తే సహించాలి. ఎదురుదాడికి దిగితే లాభం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమరావతిపై కొండంత రాగం తీసిన చంద్రబాబు చివరికి ….

02 Saturday Jul 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Amaravathi capital, ANDHRA PRADESH, Chandrababu duplicity, Chandrbabu

.

ఎం కోటేశ్వరరావు

     కొండంత రాగం తీసి చివరికి కీచుగొంతుతో ఏదో గొణిగి సరిపెట్టటంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాతే ఎవరైనా అంటే ఆయన అభిమానులకు కోపం కలగవచ్చు. హైదరాబాదుకు ధీటుగా ఐదులక్షల కోట్ల రూపాయలు రాజధానికి కావాలని సీమాంధ్రప్రాంతంలో విభజనకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్న సమయంలో ప్రకటించి ఆంధ్రప్రాంతంలో తలెత్తిన ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు లేదా సంతృప్తి పరచేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. కొండంత రాగం ఐదులక్షల కోట్లకు కనీసం ఐదు వేల కోట్లు కూడా కాదు కదా కేంద్రం విజయవాడ, గుంటూరు పట్టణాలకు ఇచ్చిన వెయ్యికోట్లతో సహా అమరావతి నూతన రాజధానికి మొత్తం మూడున్నర వేలకోట్లకు మించి ఇవ్వనంటున్నారని ఆయనే మెల్లగా ఇప్పుడు చెబుతున్నారు. ఆనాడు అసలు విభజనే వద్దంటుంటూ కొత్త రాజధానికి ఐదులక్షల కోట్లు ఆడగటం ఏమిటని ఎందరో మండి పడటంతో తాత్కాలికంగా వెనక్కు తగ్గారు.(ఆనాడు మండి పడ్డవారు ఇప్పుడు ఇంత అన్యాయమా అని కూడా అనటం లేదన్నది వేరే విషయం) అయితే తరువాత కొంత కాలం మౌనం పాటించి, బిజెపి-కాంగ్రెస్‌ పార్టీలతో విభజన ఖరారు చేయించిన తరువాత తిరిగి అదే పల్లవి అందుకున్నారు. హిందూ పత్రిక 2013 ఆగస్టు ఒకటిన ప్రచురించిన ఆయన పత్రికా గోష్టి వివరాల ప్రకారంwww.thehindu.com/news/national/andhra…/rs-5-lakh…capital…/article4975144.ece  తన మాటలను వక్రీకరించిందని ఈ పత్రికను అనే అవకాశం లేదు.

    హైదరాబాదుతో సమంగా కొత్త రాజధాని నిర్మాణం జరగాలంటే 4-5లక్షల కోట్లు కావాలని అందుకు కేంద్రం వుదారంగా నిధులు ఇవ్వాలని చెప్పారు. అసలు హైదరాబాదుతో సమంగా అని పోల్చటమే జనాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడ. మధ్యప్రదేశ్‌ను విభజించినపుడు భోపాల్‌తో సమంగా చత్తీస్‌ ఘర్‌కు, లక్నో మాదిరి వుత్తరాంచల్‌కు, పాట్నామాదిరి ఝార్కండ్‌కు రాజధానులు కావాలని ఎవరూ కోరలేదు. అది అసాధ్యం. కానీ అలాంటి కోరిక కోరకపోతే, దానిని జనంలో ప్రచారం చేసుకోకపోతే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు ? ఆ డిమాండ్‌ చేసిన సమయంలో తాను ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం తన డిమాండ్లను చెబుతున్నాను తప్ప రాజకీయాలు మాట్లాడటం లేదని ఆ నాడు చెప్పారు. ఇక్కడొక విషయాన్ని గుర్తు చేస్తే తెలుగుదేశం పార్టీ వారికి ఎక్కడైనా మండవచ్చు. అంతా కాంగ్రెస్‌ వారే చేశారు, పార్లమెంట్‌ తలుపులు మూశారు, చీకట్లో చేశారు, అన్యాయం చేశారు అని విమర్శిస్తున్నారు. దానితో ఎవరూ విబేధించటం లేదు, ఆ కాంగ్రెస్‌ వారికే తరువాత తెలిసి వచ్చింది, రెండు రాష్ట్రాలలో అనుభవిస్తున్నారు అది వేరే విషయం. ఒక నిపుణుల కమిటీని వేసి హైదరాబాదుతో సమంగా మౌలిక సదుపాయాలు, నీటి పంపిణీ, ఆదాయం, విద్యుత్‌,వుద్యోగాల వంటి అన్నింటినీ విభజన బిల్లులో చేర్చాలని కూడా చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు 2008లోనే కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకొనేది లేదని కూడా చంద్రబాబు చెప్పారు. ఇంత స్పష్టంగా ,నిక్కచ్చిగా ఇచ్చిన మాటకు నిలబడిన తెలుగు దేశం పార్టీ పార్లమెంటులో బిల్లులో ఇవేవీ చేర్చలేదని తెలిసీ ఎందుకు జోక్యం చేసుకోలేదు, పోనీ నిరసన తెలిపే యావలో మరిచిపోయామంటారా? అన్యాయంగా విభజిస్తున్నారని అప్పటికే పల్లవి అందుకున్న వారు బిల్లులో జరిగే అన్యాయాన్ని ఎందుకు చూడలేకపోయారు. ఒక కన్ను పోతుంటే ఏం చేశారు? పోనీ తెలుగుదేశం వారు విభజనను అడ్డుకొనే యత్నంలో మునిగిపోయారు అనుకుందాం, అన్నీ తానే అయి వ్యవహరించిన వెంకయ్య నాయుడికి ఇవన్నీ తెలియదా ? ఎందుకు మాట్లాడలేదు? ఈ ప్రశ్నలకు ఈ జన్మలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, వెంకయ్య నాయుడు, బిజెపి నుంచి సంతృప్తికర సమాధానాలు రావు.ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు కేటాయించటం కేంద్రానికి పెద్ద సమస్యకాదని మూడు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు చెప్పారు.అలాంటపుడు మూడున్నర వేలకోట్లకు మించి ఇవ్వనుంటున్నారని ఇప్పుడు చెప్పటం ఏమిటి ?

    తాను అధికారానికి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం, నాలుగైదులక్షల కోట్ల రూపాయల పాట మానుకోలేదుwww.deccanchronicle.com/140610/nation…/andhra-pradesh-new-capital-near-guntur పది-పది హేను సంవత్సరాలలో నాలుగు-అయిదు లక్షల కోట్లతో నూతన రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు. జనాన్ని వెర్రివాళ్లను చేయటాన్ని కొనసాగించారు. రాజధాని అంటే రాష్ట్ర అధికార కేంద్రమైన సచివాలయం, దాని అనుబంధ కార్యాలయాలు, అసెంబ్లీ, హైకోర్టు, రాజధాని కేంద్రంగా పనిచేసే వారికి అవసరమైన వసతి తప్ప చంద్రబాబు చెప్పే మిగిలిన వాటిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డిసి అయితే దాని కంటే పెద్దవైన న్యూయార్క్‌ ఇతర నగరాలు పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వుంది. చైనా రాజధాని బీజింగ్‌ అయితే అక్కడి అసలైన పారిశ్రామిక కేంద్రం దానికి ఎంతో దూరంలో వున్న షాంఘై అని అందరికీ తెలిసిందే. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. గుజరాత్‌ నూతన రాజధాని గాంధీ నగరం లేదా చత్తీస్‌ఘర్‌ నయా రాయపూర్‌ వంటి వన్నీ పరిపాలనా కేంద్రాలుగా నిర్మితమయ్యాయి, అవుతున్నాయి తప్ప చంద్రబాబు చెప్పే పద్దతుల్లో కాదు.ఆ పేరుతో వేలాది ఎకరాల భూములు తీసుకున్నారు కనుక ఇప్పుడు పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాల ఏర్పాటు గురించి సహజంగానే జనం నుంచి డిమాండ్‌ వస్తుంది.

    తాజాగా చైనా పర్యటన జరిపిన చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. రాజధానికి ఎంతో దూరంగా వున్న దొనకొండ ప్రాంతంలో దేశంలోనే తొలిదైన అంతర్జాతీయ పారిశ్రామిక కేంద్రం ఏర్పాటుకు చైనాతో ఒప్పందం చేసుకున్నట్లు ముఖ్య మంత్రి కార్యాలయం ప్రకటించింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు వున్న సాగర తీరం, పరిశ్రమల ఏర్పాటుకు వున్న అవకాశాల గురించి కూడా చైనా వారికి వివరించారు, ఇప్పటికే విశాఖ-చెన్నయ్‌ పారిశ్రామిక కారిడార్‌ గురించి వూరిస్తున్నారు. ఈ కారిడార్‌, దొనకొండ అంతర్జాతీయ పారిశ్రామిక కేంద్రం వంటి వన్నీ అమరావతి చుట్టూ ఏర్పాటు చేస్తామని చెప్పిన పారిశ్రా మిక పట్టణాలకు అదనంగా అనుకోవాలా ? ఒక అతిశయోక్తిని సమర్ధించుకోవటానికి మరొక అతిశయోకి.్త . ప్రపంచ వ్యాపితంగా వున్న పెట్టుబడిదారులు తెల్లవారిన తరువాత పెట్టుబడి పెట్టి సాయంత్రానికి వచ్చిన లాభాలతో మరోచోటికి పోయే రోజుల్లో విదేశీ కంపెనీలు, లేదా వ్యక్తులు ఫ్యాక్టరీలు, వ్యాపారాలను కొత్తగా పెట్టి ఆంధ్రప్రదేశ్‌ జనానికి వుపాధి కల్పిస్తారని నమ్మబలటానికి ఎంతో ధైర్యం కావాలి. అందుకు చంద్రబాబును అభినందించాల్సిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇప్తార్‌ విందు: ఆర్‌ఎస్‌ఎస్‌ ఆత్మవంచన

01 Friday Jul 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

BJP, iftar party, mrm, Narendra Modi, RMM, RSS, RSS Double game, RSS Duplicity, RSS game, RSS-BJP

సత్య

     పాపం ఆర్‌ఎస్‌ఎస్‌ ! తన కార్యక్రమాన్ని తానే బహిరంగంగా సమర్ధించుకోలేక భయపడుతోంది. ఒకనాడు తాము చేసిన విమర్శలు లేదా ఆరోపణలే మరోరోజు తమను రచ్చకీడుస్తాయని బహుశా ఆలోచించి వుండదు. పక్షం రోజుల క్రితం తన మైనారిటీ విభాగమైన రాష్ట్రీయ ముస్లిం మంచ్‌(ఆర్‌ఎంఎం) ద్వారా జూలై రెండున మన దేశంలోని ఇస్లామిక్‌ దేశాల రాయబారులతో పాటు మొత్తం 140 దేశాల ప్రతినిధులను, ఇతరప్రముఖులను ఆహ్వానించి రంజాన్‌ సందర్భంగా ఇప్తార్‌ విందు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ప్రధాన స్రవంతి మీడియాలో ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ స్వభావం, మైనారిటీ సంతుష్టీకరణ గురించి పెద్దగా చర్చ జరగలేదుగానీ సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అసలే నడుములు విరిగి లేవలేని స్థితిలో వున్న కాంగ్రెస్‌ మెజారిటీ ఓటర్లను ఆకర్షించాలని అనుకున్నదో ఏమో తొలిసారిగా ఇప్తార్‌ విందు ఇవ్వకూడదని నిర్ణయించింది. కాంగ్రెస్‌ వదలి వేసిన ఇప్తార్‌ విందులను ఆర్‌ఎస్‌ఎస్‌ తొలిసారి ప్రారంభించిందనే రీతిలో వార్తలు వచ్చాయి. ఈ చర్య ద్వారా మెజారిటీ హిందువులలో పలుచనవుతామని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధల నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం, యుపి తదితర రాష్ట్రాలలో రాబోయే ఎన్నికలలో హిందువులలో దాని ప్రభావం ఎలా వుంటుందో అన్న గుంజాటన, జూన్‌ 25న కాశ్మీర్‌లో పాక్‌ వుగ్రవాదుల దాడి వంటి వుదంతాలతో పాక్‌ రాయబారిని ఆహ్వానించి ఇప్తార్‌ విందు ఇవ్వటం నష్టదాయకమని పునరాలోచించి అబ్బే అసలు మేము అలాంటి కార్యక్రమమే తలపెట్టలేదంటూ పక్షం రోజుల తరువాత జూన్‌ 30న ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. వేరే సంస్ధ పెట్టుకున్న కార్యక్రమాన్ని తాము ఎందుకు వ్యతిరేకించాలని ఎదురు ప్రశ్నించింది.

     మెజారిటీ ప్రజానీకాన్ని రెచ్చగొట్టి తమకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పరచుకొనేందుకు మైనారిటీ వ్యతిరేకతను పురికొల్పటం దాని పధకాలలో ఒకటి. బిజెపి , దాని పూర్వ రూపమైన జనసంఘం తప్ప కాంగ్రెస్‌, వామపక్షాలు, మిగతా పార్టీలన్నీ ఓట్ల కోసం మైనారిటీలను బుజ్జగిస్తున్నాయని పదేపదే ప్రచారం చేసి కొంత మేరకు విద్వేషాన్ని రెచ్చగొట్టటంలో జయప్రదమైంది. ఇప్తార్‌ విందులు ఇవ్వటం, పర్యటనల సందర్భంగా మతపరమైన కేంద్రాలను సందర్శించటం వంటి చర్యలను అది తప్పుపట్టింది. ఓట్ల కోసం వామపక్షాలు మినహా మిగతా పార్టీలన్నీ అటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డాయనటంలో ఎలాంటి సందేహం లేదు.తాను రాజకీయంగా బలహీనపడినట్లు పసిగట్టిన ఇందిరా గాంధీ ఇలాంటి కార్యక్రమాలకు తొలిసారిగా పెద్ద ఎత్తున తెరతీశారు. తరువాత కాలంలో ఇతర పార్టీలు కూడా ఒక్క మైనారిటీలే కాదు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తుగడలకు పోటీగా మెజారిటీ ఓట్లను పోగొట్టుకోకుండా వుండేందుకు కూడా ప్రయత్నించాయన్నదానిలో రెండవ మాట లేదు. దేవాలయాల భూములను ఇతర మతాల పేదలైన కౌలుదార్లు సాగు చేయకూడదని, ఎవరైనా వుంటే వైదొలగాలని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం, హాజ్‌ యాత్రలకు ఇచ్చే రాయితీలను రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వంటి క్షేత్రాల సందర్శనకు రాయితీలు ఇస్తామని ప్రకటించటాన్ని ఏమనాలి ? కాంగ్రెస్‌ బాబరీ మసీదు తాళాలను తీయటం, షాబానో కేసులో సవరణలు, బాబరీ మసీదును కూల్చివేస్తుంటే చూస్తూ ఊరుకోవటం వంటి వన్నీ వాటిలో భాగమే. అందుకే కుహనా లౌకికవాదులంటూ సైద్దాంతిక దాడి చేయటానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు మంచి అవకాశాలు దొరికాయి.

  అంతర్జాతీయంగా నరేంద్రమోడీపై వున్న మైనారిటీ వ్యతిరేక ముద్ర తొలగించుకోవాలని సంఘపరివార్‌ ఆలోచిస్తున్నది. మిగతా పార్టీలు ఓట్లకోసమే మైనారిటీ పధకాలను ప్రకటిస్తే తాము ఓట్ల దృష్టితో గాక మైనారిటీల సంక్షేమం కోసమే పధకాలను ప్రవేశపెట్టి అమలు జరుపుతున్నామని, అందుకోసం గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేశాం చూడమంటూ ప్రచారానికి దిగింది. అసోం వంటి చోట్ల మైనారిటీ వ్యతిరేకతను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఎల్లకాలం సాగదు కనుక గణనీయ సంఖ్యలో వున్న మైనారిటీలను ‘సంతృప్తి పరచటం లేదా సంతుష్టీకరణ’ చేయటం ద్వారా వారిని పక్కా వ్యతిరేకులుగా మారకుండా చూసుకొనేందుకు పూనుకుంది. అనేక మంది ప్రముఖులు ఇప్తార్‌ విందులకు హజరు అవుతున్నారు. కేంద్రమంత్రి రాజనాధ్‌ సింగ్‌ పాల్గొన్న ఒక చిత్రం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం.

    మన దేశంలో ముస్లిం పాలనకు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర వుంది. వారి ప్రవేశం నుంచి రంజాన్‌ సందర్భంగా ఇప్తార్‌ విందులు ప్రారంభమయ్యాయి. మహమ్మద్‌ ప్రవక్త తన వుపవాసాన్ని మూడు ఖర్జూరాలు తిని ముగించేవారట. అయితే ప్రస్తుతం ఇప్తార్‌ విందులు ఖర్జూరాలకే పరిమితం కాలేదు, ఆయా దేశాలలో వున్న ఆహార అలవాట్లతో పాటు ఎన్నిరకాలు వడ్డిస్తే అంత గొప్పగా పరిగణించే రోజులు వచ్చాయి. సామూహికంగా జరిగే ఈ క్రతువుకు హాజరు కావటం కాకపోవటం అనేది మత విశ్వాసాలకు సంబంధం లేదు. హిందువుల పండగలను ముస్లింలు జరుపుకోవటం ఎలా జరుగుతోందో ఇప్తార్‌ విందులకు వుపవాసం పాటించని హిందువులు, ఇతర మతాల వారు కూడా హాజరుకావటం అన్నది ఒక సామాజిక మర్యాద, అంశంగా మారిపోయింది. వాటిని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ వివాదాస్పదం కావించింది. ఒక పార్టీ ఇచ్చిన విందుకారణంగా ముస్లింలందరూ అదే పార్టీకి ఓటు వేస్తారనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి వుండదు. అదే అయితే వినాయకచవితి, దసరా వంటి హిందువుల పండుగల సందర్బంగా బిజెపి నేతలు చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అంత మాత్రాన హిందువులందరూ వారికి ఓటు వేయటం లేదు. జర్మనీలో హిట్లర్‌ యూదు వ్యతిరేకతను రెచ్చగొడితే లాభం వుంటుందని భావించినట్లే మన దేశంలో ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకతను రెచ్చగొట్టటం ద్వారా లబ్ది పొందవచ్చని ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి శక్తులు భావిస్తున్నాయి. అందుకే ఈ రచ్చ.

 అధికారంలో వున్నపుడు మతం, మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవటంలో కాంగ్రెస్‌ ఎలా వ్యవహరించిందో కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు బిజెపి అంతకంటే ఎక్కువగా చేస్తోందనటంలో అతిశయోక్తి కాదు. వారణాసిలో ఒక హిందూమత కార్యక్రమానికి ప్రధాని హాజరుకావటం, దానిని ప్రత్యక్ష ప్రసారం చేయటం రాజకీయ లబ్ది పొందటంలో భాగం కాదా ? ఇరుగు పొరుగు దేశాలను సందర్శించినపుడు ప్రధాని మతపరమైన పూజలు నిర్వహించటం కూడా ప్రచారంలో ఒక భాగంగా మార్చివేశారు. సినీ హీరో షారూఖ్‌ ఖాన్‌ను పాక్‌ వుగ్రవాది హఫీజ్‌తో పోల్చిన హిందూమత పూజారి లేదా యోగి, పచ్చి ముస్లిం వ్యతిరేకి అయిన ఆదిత్యనాధ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి.

    ఇలాంటివి ఒక్క మన దేశానికే పరిమితం కాలేదు. వివిధ కారణాలతో అనేక దేశాలలో జరిగాయి, జరుగుతున్నాయి. ముస్లిం దండయాత్రలకు గురైన సోమనాధ దేవాలయాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వ నిధులతో తిరిగి నిర్మించారు.దేవాలయ నిర్మాణం జరపండిగాని దానికి ప్రజల నుంచి విరాళాలు సేకరించండి తప్ప ప్రభుత్వ నిధులు వద్దని చెప్పిన మహాత్మాగాంధీ సూచనను నాటి పాలకులు పట్టించుకోలేదు. 1971లో అంతర్యుద్ధం సందర్భంగా నేటి బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా పట్టణంలో పాక్‌ సైన్యం ధ్వంసం చేసిన రమణ కాళీ మందిరం స్ధానంలో జాతీయ దేవాలయం(ప్రభుత్వ) కట్టించాలని అక్కడి మైనారిటీ హిందువులు చేసిన వినతి లేదా డిమాండ్‌కు తలొగ్గిన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఢాకేశ్వరీ పేరుతో ఆలయ నిర్మాణం చేయటమే గాక దానిని జాతీయ ఆలయంగా కూడా ప్రకటించింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం అక్కడి మైనారిటీ హిందువుల కోరిక మేరకు హోలీ, దీపావళిని జాతీయ సెలవు దినాలుగా ప్రకటించింది. కెనడాలో పెద్ద సంఖ్యలో వున్న సిక్కు మైనారిటీల కారణంగా వైశాఖీ పూర్ణిమను జరుపుకోవాలని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది.

    ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ద ఆర్‌ఎంఎం పార్లమెంట్‌ భవనంలో జరప తలపెట్టిన ఇప్తార్‌ పార్టీకి మొత్తం 140 దేశాల ప్రతినిధులతో పాటు మోడీ మంత్రివర్గ సభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు కూడా హాజరౌతారని గొప్పగా ప్రకటించారు.దీని గురించి ఆర్‌ఎంఎంకు మార్గదర్శనం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ ఇంద్రేష్‌ కుమార్‌ మీడియాతో స్వయంగా మాట్లాడారు. దీనిని ఒక రాజకీయ ప్రయోజనం పొందేందుకు ఏర్పాటు చేసినదిగా చూడవద్దని కూడా చెప్పారు. భారత్‌లో అన్ని మతాల వారు సహజీవనం చేస్తున్నారని ప్రపంచానికి తెలిపేందుకు వుద్ధేశించినట్లు తెలిపారు.ఈ సంస్థకు ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదని చెప్పటం ఎలా వుందంటే బిజెపి వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో వుండవచ్చు, దానికీ తమకూ సంబంధం లేదని బుకాయించటం వంటిదే.

     ఆర్‌ఎంఎం అధిపతి మహమ్మద్‌ అఫ్జల్‌ ఈ విందు గురించి చెబుతూ భారత్‌లో ముస్లింలు శాంతి లేదా సంతోషంగా లేరని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, ముస్లింలకు మోడీ ప్రభుత్వం మంచి చేస్తున్నదని చెప్పటానికే ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని మోడీ హయాంలో ప్రారంభమైన ప్రపంచ సౌహార్ద్ర నూతన అధ్యాయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది, దీనిని రాజకీయమైందని చిత్రిస్తారు, సరిగ్గా ఆ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకే దీనిని నిర్వహిస్తున్నాం అని అరటి పండు వలచి చెప్పినట్లు వివరించారు.http://indiatoday.intoday.in/story/rss-tries-to-shed-pro-hindu-image-invites-140-countries-to-iftar-party/1/695911.html

   ముస్లింలను సంతృప్తిపరుస్తున్నారని కాంగ్రెస్‌, ఇతర పార్టీలను ఇప్పటి వరకు విమర్శిస్తూ, ఖండిస్తూ వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు తానే ఆ పనిచేస్తున్నదని బిజెపి మిత్రపక్షమైన శివసేన నాయకుడు మనీషా క్యాండే ధ్వజమెత్తారు.’ఒక హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పుడూ చెబుతుంటుంది,ఇప్తార్‌ విందుల వంటి వాటిని కాంగ్రెస్‌, ఇతర పార్టీలు ఏర్పాటు చేసినపుడు వాటిని ఖండిస్తుంది,అలాంటిది ఇప్పుడు అదే ఆపని చేస్తోంది. దాని అసలు భావజాలం నుంచి పూర్తిగా వైదొలిగింది, ఒకవైపు ఘర్‌ వాపసీ గురించి చెబుతారు మరోవైపు ఇప్తార్‌ విందులు ఇస్తారు, దీని ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ గందరగోళంలో వున్నదని వారే వెల్లడించుకుంటున్నారు అని క్యాండే పేర్కొన్నారు. రిజర్వేషన్లను సమీక్షించాలంటూ వ్యతిరేకంగా మాట్లాడి తరువాత దానిని కాదని చెప్పిన విషయం తెలిసిందే. చరిత్రలో దాని ఆత్మవంచన, పరవంచన ఖాతాలో ఇప్పుడు ఇప్తార్‌ విందు మరొకటి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమి సెపితిరి ! ఏమి సెపితిరి !! చిన్న మౌన ముని నరేంద్రమోడీ !!!

29 Wednesday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Arnab Goswami, BJP, Modi, Modi’s Interview, Modi’s silence, Prime Minister Narendra Modi, Times Now

ఎం కోటేశ్వరరావు

      పది సంవత్సరాలు అధికారంలో వున్న మన్మోహన్‌ సింగ్‌ పెద్ద మౌన మునిగా బిజెపి తదితరులతో పిలిపించుకున్నారు. కొద్ది వారాల క్రితమే రెండు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న చిన్న మౌన ముని నరేంద్రమోడీ తొలిసారిగా ఒక ప్రయివేటు టీవీ ఛానల్‌తో సంభాషించారు. తాము పూజించే లేదా అభిమానించే బాబాలు, మునులు ఎప్పుడు నోరు తెరుస్తారా మధుర భాషణం ఎప్పుడు విందామా అని ఎదురు చూసే భక్తులు, అభిమానులు ఆ క్షణంలో ఎంత తన్మయులౌతారో మోడీ భక్తుల పరిస్థితి కూడా అలాగే వుండి వుండాలి.

    నరేంద్రమోడీ నోరు తెరవటం ప్రపంచంలోని ఏడు వింతలలో చేరితే ఆయనను ఇంటర్వ్యూ చేసిన టైమ్స్‌ నౌ సంపాదకుడు ఆర్నాబ్‌ గోస్వామి పిల్లిలా మాట్లాడటం కూడా మరొకటిగా చేరటం మరొక విశేషం. మోడీ ఇంటర్వ్యూ చూసిన లేదా పత్రికలలో చదివిన వారు విమర్శనాత్మకంగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే మోడీ అభిమానులు వారిని సహించరని వేరే చెప్పనవసరం లేదు. అయితే అంతర్గతంగా ఎలాగూ మాట్లాడటం లేదనే విమర్శలు మూటగట్టుకున్నారు, ఇంతకంటే పోయేదేముంది మాట్లాడి అనవసరంగా విమర్శల పాలయ్యారని తలపట్టుకోవచ్చు. ఇంటర్య్యూలోని మచ్చుకు కొన్ని అంశాలు ఎలా వున్నాయో చూడబోయే ముందు ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చూడటం అవసరం.

     ఆర్నాబ్‌ గోస్వామి గురించి సల్మాన్‌ ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌ కొన్ని వ్యంగ్యోక్తులు సంధించారు. అత్యాచారానికి గురైన మహిళ స్ధితి గురించి సల్మాన్‌ ఖాన్‌ నోరు పారవేసుకోవటం, మీడియా, సామాజిక మీడియా, ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శించటం, దాని మీద సలీంఖాన్‌ క్షమాపణ చెప్పటం ఇవన్నీ తెలిసిందే. అయినా రేటింగ్‌ల కోసం మీడియాలో గోస్వామి వంటి వారు సల్మాన్‌ ఖాన్‌ గురించి చేసిన హడావుడి నష్టనివారణకు దోహదం చేయలేదు. నరేంద్రమోడీ ఇంటర్వ్యూను టీవీలో చూసిన సలీమ్‌ ఖాన్‌ మోడీ మాటల కంటే ఆర్నాబ్‌ గోస్వామి ప్రశ్నించే తీరునే గమనించినట్లున్నారు. అందుకే పెద్ద ఖాన్‌ చేసిన ట్వీట్స్‌లోని అంశాలు ఇలా వున్నాయి.

       ‘ ఏమిటీ ? మీరు ఇప్పుడు టమ్స్‌ నౌ(ఛానల్‌) మాత్రమే చూడండి, అది కూడా ఆర్నాబ్‌ కోసం, సల్మాన్‌ ఖాన్‌ మీద అతని అవ్యాజ ప్రేమానురాగాలను చూడటానికి కాదు, వైద్య కారణాలతో దానిని చూడటం అంటే ఎంతో వున్నత గౌరవం వుంది. వైద్య కారణాలు ఏమిటంటారా ? అవును, ఎందుకంటే నేను రెండు చెవులూ నలభై శాతం వినికిడి లోపంతో వున్నాను. ప్రతి మాటనూ ఆ ఛానల్‌లో మాత్రమే వినగలను. కానీ గత రాత్రి ప్రధాన మంత్రిని ఆర్నాబ్‌ ఇంటర్వ్యూ చెయ్యటాన్ని చూడటానికి గరిష్ట స్థాయిలో శ్రుతిని(సౌండ్‌) పెంచినా నాకు ఒక్క మాటా వినిపించలేదు. ఆర్నాబ్‌ అంత మృదువుగా వ్యవహరించటాన్ని నేను చూడలేదు. ప్రధాని సమాధానాల కోసం ఎలా ప్రశ్నించారో వూహించుకోవచ్చు. అతను రంకెలు మాత్రమే వేస్తాడు లేదా ఎవరికీ భయపడడు అని చెప్పే నాలి ముచ్చులు ఎక్కడ ?’

      అర్నాబ్‌ గోస్వామి టీవీలో చర్చలు నిర్వహించటాన్ని తొలిసారి ఎవరైనా వీక్షిస్తే పాల్గొన్నవారి మీద వేసే రంకెలు, హావభావాలను చూసి మీదపడి కొడతారా ఏమిటి అన్నట్లుగా వుంటాయి. ప్రధానితో చేసిన ఇంటర్యూ చూసి ఆయన అభిమానులు ఆశాభంగం చెంది వుంటారు, ఇతర నేతలతో చేసిన ఇంటర్వ్యూలను పోల్చి మోడీతో ఒక పరిణితి చెందిన టీవీ జర్నలిస్టు మాదిరి గాక ఒక టీచర్‌-విద్యార్ధి సంభాషణగా వుంది అని ఒకరు వ్యాఖ్యానించారు. ఒక ప్రధాని తొలిసారి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినపుడు ఆ సంభాషణ ద్వారా కొత్త విషయాలు రాబట్టే ప్రయత్నం, తీరు కనపడలేదని, చూసేవారికి కొత్తేదేముంది అన్నట్లుగా వుంది. ఆ కార్యక్రమం మోడీ ప్రదర్శన కాదు, మోడీని ఒక మూలకు నెట్టే మల్లయోధుడి పిడిగుద్దుల మాదిరి గాక పిల్లలు తాతయ్యలను చిరుకోపంతో ముట్టుకునే మాదిరి సాగింది, ఏ మల్లయోధుడైనా ఎదుటి వారిని ముష్టిఘాతాలతో ఆడుకోవటానికి గాక వర్తులం చుట్టూ వూరికే తిరుగుతారా అని ఎద్దేవా చేశారు.

     తనపై వచ్చిన విమర్శలకు తట్టుకోలేకపోయిన ఆర్నాబ్‌ తన కార్యక్రమాల గురించి చర్చించటం తప్ప మరొక పనిలేని గుంపు ఒకటి వుంది. వారు ఎంతో విధేయతతో వుత్సాహంతో వాటిని చూస్తున్నందుకు వారికి కృతజ్ఞుడనై వుంటాను అని వుక్రోషంతో సమాధానమిచ్చాడు. ఇంటర్వ్యూ సమయంలో అసాధారణరీతిలో మీరు మౌనంగా వున్నారు ఎందువలన అని ఒక జర్నలిస్టు ఆర్నాబ్‌ను అడిగినపుడు ఇలా చెప్పాడు.’ కొంతమంది ఇంటర్వ్యూను చూస్తున్నారనుకోండి వారికి వార్తా విశేషాలు ఎంతో ముఖ్యం.పాకిస్థాన్‌లో మిలిటరీ-పౌర విభజన ఏర్పడే అవకాశం గురించి ప్రధాని సూచన ప్రాయంగా చెప్పారు. ఎన్‌ఎస్‌జి గురించి స్పందన వార్తాంశం ముఖ్యం అని నేను ఆలోచించాను. రఘురాం రాజన్‌ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన(మోడీ) సమాధానమిచ్చిన తీరు సూటిగా వున్న వార్తాంశమని నేను అనుకున్నాను. ఈ వార్తాంశాలతో నా విధేయులైన వీక్షక బృందాన్ని, మీడియాను కూడా నిరాశపరిచాను’

    ఇంటర్వ్యూలో వున్న ఆ గొప్ప వార్తాంశమేమిటా అని అనేక మంది జర్నలిస్టులు చూశారు.తన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎవరైనా అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పకపోతే ఆర్నాబ్‌ ఎలా రెచ్చిపోతారో చూసినవారికే అర్ధం అవుతుంది. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రాజన్‌ గురించి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి నేరుగా ప్రధానికి లేఖ రాశారు, బహిరంగంగా ఎంత రచ్చ చేసిందీ తెలిసిందే. రాజన్‌ గురించి ఆర్నాబ్‌ అడిగిన దానికి మోడీ చెప్పిన సమాధానం ఎంత సూటిగా వుందో చూడండి.’ ఎవరైనా, మా పార్టీ వారు కావచ్చు కాకపోవచ్చు, అటువంటి పనులు తగవు. అలాంటి ప్రచారం జిమ్మిక్కులతో దేశం బాగుపడదు. అటువంటి పనులు చేసే వారు మరింత బాధ్యతాయుతంగా వుండాలి. వ్యవస్థకంటే తాము పెద్ద వారమని ఎవరైనా భావిస్తే అది తప్పు’ అని మాత్రమే అన్నారు.ఇలాంటి సమాధానాలు ఇతరులు చెప్పి వుంటే ఆర్నాబ్‌ వారిని చీల్చి చెండాడి పేరు చెప్పేంతవరకు వదలి పెట్టరు.

    ఈ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు, ప్రధాని సమాధానం చెప్పిన తీరు మీద కూడా అనేక స్పందనలు వచ్చాయి. విషయం ఏమీ చెప్పకుండానే , సూటిగా మాట్లాడ కుండా ఎలా సమాధానాలు ఇవ్వవచ్చో నేర్పే విధంగా వున్నాయన్నది వాటిలో ఒకటి. పిల్లలు ఆవు, చెట్ల వలన వుపయోగాల గురించి రాసే వ్యాసాల మాదిరి వున్నాయంటే అతిశయోక్తి కాదు. అనేక అంశాలపై నరేంద్ర మోడీ మౌనం పాటిస్తారనే విమర్శ వుంది. దీంతో అది మరింత స్పష్టమైంది. ముఖ్య అంశాలపై మాట్లాడినప్పటికీ సూటిగా సమాధానాలు లేవు. అన్నింటికీ మించి విలేకర్ల గోష్టి కాకుండా తనకు మద్దతునిచ్చే ఒక ఛానల్‌తో మాట్లాడటాన్ని ప్రచార కార్యక్రమంలో భాగంగా కొందరు భావించారు. మీడియాను ఎదుర్కొనే స్ధితిలో ప్రధాని లేరనేది స్పష్టమైందన్న అభిప్రాయమూ వుంది.

     ప్రధాన మంత్రి తరచూ విదేశీ ప్రయాణాలు, ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారన్న విమర్శలు వచ్చినపుడు అనేక మంది మంత్రులు, బిజెపి నేతలు విదేశీ పెట్టుబడుల కోసం జరుపుతున్నట్లు చెప్పారు. కానీ మోడీ సమాధానం అందుకు భిన్నంగా వుంది.’ ప్రపంచానికి నా గురించి తెలియదు. ఒక దేశానికి ఎవరు సారధిగా వున్నారు అని తెలుసుకోవాలని ప్రపంచం అనుకుంటుంది. ఎవరైనా మీడియా ద్వారా మోడీ గురించి తెలుసుకోవాలనుకున్నారనుకోండి, అలాంటి వారు అసలైన మోడీ ఎవరు అని తికమక పడే అవకాశం వుంది. అది జరిగితే దేశానికి నష్టం. భారత్‌పై విశ్వాసం కలగటానికి మోడీ వ్యక్తిత్వం ఆటంకం కాకూడదు, అందువలన నేను అందరు నాయకులను కలుసుకోవాలి, ముఖాముఖీ మాట్లాడాలి, నేను నిర్మొహమాటంగా మాట్లాడకపోతే వారికి భారత సారధి గురించి తెలియదు. అందువలన ఇది నాకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. ఇంతకు ముందు ప్రపంచ నాయకులను కలుసుకొనే అవకాశం రాలేదు.’

    నల్లధనాన్ని వెనక్కు తెచ్చి పదిహేను లక్షలు జమ చేస్తామని చెప్పారన్న ప్రశ్నకు ‘ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్య అది, వారికి మాట్లాడటానికి ఏదో ఒక సమస్య వుండాలి కదా ‘ అన్నారు. ధరల పెరుగుదల గురించి మాట్లాడుతూ ‘ గత ప్రభుత్వ హయాంలో ధరలు వేగంగా పెరగటాన్ని మీరు చూడవచ్చు, నేడు వేగం బాగా తగ్గింది. మీరు అంకెలను చూడవచ్చు.రెండవది వరుసగా రెండు సంవత్సరాలు కరవు వుంది.కూరగాయలు, ఆహారం, పప్పుల ధరలపై కరవు ప్రభావం ప్రత్యక్షంగా వుంటుంది, ఎందుకంటే అవన్నీ భూమిలో పండుతాయి. అంత పెద్ద కరవు వున్నపుడు ఎవరి చేతుల్లో ఏమీ వుండదు. ఇటువంటి పరిస్థితులలో దిగుమతులు చేసుకోవటం రెండవ అవకాశం. కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తాలలో పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంది. మూడవది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంయుక్త బాధ్యత అది.’

     కొందరు కేంద్ర మంత్రులు మతవుద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రకటనల చేయటం గురించి అడిగిన ప్రశ్నకు ‘ అటువంటి వ్యాఖ్యలు చేసేవారిని వాటి ద్వారా హీరోలుగా మార్చవద్దని నేను చెప్పదలచుకున్నాను.వారిని హీరోలను చేయకండి, వారే మానుకుంటారు.’ అన్నారు. ఇక వుపాధి గురించి చిరంజీవి సినిమాను గుర్తుకు తెచ్చేలా చెప్పారు. ‘ మొదటి విషయం మన దేశంలో 35 సంవత్సరాల లోపు వారు 80కోట్ల మంది వున్నారు. వుద్యోగాల కోసం పెద్ద డిమాండ్‌ వున్న విషయాన్ని మనం అంగీకరించాలి.కానీ వారెక్కడ వుపాధి పొందుతారు ? పెట్టుబడులు రావాలి. వాటిని మౌలిక సదుపాయాలు, వుత్పాదక, సేవా రంగాలలో వుపయోగించాలి. ఇప్పుడు మనం చొరవ తీసుకున్నాము, ముద్రా యోజన ప్రారంభించాము. రజకులు, క్షురకులు,పాలవారు, వార్తాపత్రికలు అమ్మేవారు, బండ్ల మీద అమ్మేవారందరూ కలసి దేశంలో మూడు కోట్ల మంది వున్నారు. వారి పనిని విస్తరించేందుకు ఎలాంటి హామీతో పనిలేకుండా దాదాపు 1.25లక్షల కోట్ల రూపాయల రుణం ఇచ్చాము. ఒకరు ప్రస్తుతం ఒకరికి పని కల్పిస్తున్నారనుకుందాం, దానిని విస్తరిస్తే అతనికి ఇద్దరు కావాలి. అదే ఇద్దరు వుంటే ముగ్గురు కావాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మూడు కోట్ల మంది ఈ చిన్న వ్యాపారులకు రుణం అందుబాటులోకి వచ్చిందనుకోండి వారు తమ పనిని విస్తరించక తప్పదు. మేం మరొక చిన్న నిర్ణయాన్ని తీసుకున్నాం. దేశంలో పెద్ద దుకాణాలు 365 రోజులూ నడుస్తాయి, కానీ చిన్న దుకాణాలను సెలవు రోజుల్లో మూసివేయాలి.చిన్న దుకాణాలను కూడా పొద్దుపోయే వరకు, వారానికి ఏడు రోజులు తెరవ వచ్చని మేము బడ్జెట్‌లో ప్రకటించాము. పెద్ద దుకాణాలకు లేని ఆంక్షలు చిన్న దుకాణాల వారికి ఎందుకు వర్తింపచేయాలి? కాబట్టి పొద్దుపోయే వరకు, వారానికి ఏడు రోజులూ తెరిచేందుకు అవకాశం వుంది కనుక గతంలో ఒకరిని వుద్యోగానికి పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఇద్దరిని పెట్టుకోవాలి, దీని వలన వుపాధి పెరగదా ? 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు వుండాలని చెబుతున్నాము.ఈ రంగం ఎంతో మందికి వుపాధి కల్పిస్తుంది.’

    కొంత మంది మంత్రులు, నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం గురించి ప్రస్తావించి మతం పేరుతో రాజకీయాలు చేయకూడదు కదా, వారిని అదుపు చేయాల్సిన అవసరం లేదా అని ఆర్నాబ్‌ ప్రశ్నించారు.’ మొదటిది, అభివృద్ధి వైపు జాతి పురోగమించాలని గట్టిగా విశ్వాసం వున్న వాడిని, అది అవసరం కూడా, అటువంటి వ్యాఖ్యలు చేసే వారిని హీరోలుగా చేయవద్దని నేను మీడియాను కోరుతున్నాను.’

      కానీ వారు వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు కదా ?’ వారిని హీరోలను చేయవద్దు వారే ఆగిపోతారు.’

    మేం వారిని హీరోలను చేయలేదు, విలన్లుగా చేశాము ‘ కానీ మీరు వారిని ఎందుకు అంత పెద్దగా చేస్తున్నారు. అలాంటి ప్రకటనలు చేయటాన్ని నేను టీవీలలో చూశాను, వారి ముఖాలు కూడా నేను చూడలేదు, చివరికి వారు టీవీలో అధికార ప్రతినిధులుగా మారుతున్నారు.’

  తమకు తామే ప్రతినిధులుగా ప్రదర్శించుకుంటున్నారు ‘ అలాంటి వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నాకు తెలియదు ‘

    మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వారి గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలివి. ఒక ప్రధాని స్ధాయిలో వున్న వ్యక్తి అనేక ముఖ్యాంశాల గురించి మాట్లాడిన తీరుతో అనేక మంది విస్తుపోతున్నారు. అభిమానులు ఎలాగూ వేరే అర్ధాలు తీస్తారన్నది తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్‌ఎస్‌జి వైఫల్యం ఎవరి ఖాతాకు ? ప్రధాన మంత్రా ! నరేంద్రమోడీనా !

28 Tuesday Jun 2016

Posted by raomk in BJP, CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Narendra Modi, npt, nsg, NSG china, NSG Failure, NSG INDIA

  అసలు అణు సరఫరా బృందం ఏమిటి ? అది ఎందుకు, ఎప్పుడు ఏర్పడింది? దానిలో భారత్‌ సభ్యత్వం పొందటానికి అమెరికా వంటి దేశాలు ఎందుకు సరే అంటున్నాయి, చైనా మరికొన్ని దేశాలు నిబంధనల అమలు గురించి ఎందుకు పట్టుబడుతున్నాయి? మనకు సభ్యత్వం వస్తుందా ? మన అణు కార్యక్రమానికి ఎవరు వ్యతిరేకులు వంటి అనేక ప్రశ్నలు రావటం సహజం.

ఎం కోటేశ్వరరావు

     ఎత్తుగడ, వ్యూహం ఏదైనా వుందా, లేక కొందరు అంటున్నట్లు దుర్బుద్ధి లేకపోవచ్చు, కారణం ఏదైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పధకాల పేర్లన్నింటికీ ముందు ‘ప్రధాని’ అని తగిలిస్తున్నారు. ఆ పధకం సఫలమైనా, విఫలమైనా ప్రధానికే ఆ పేరు దక్కుతుంది. ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ అన్న సులభ తర్కం సామాన్యులకు కూడా తెలుసనుకున్నారేమో వ్యూహకర్తలు. ఇప్పుడు అణు సరఫరా బృందం(ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం పొందటంలో భారత్‌ ఘోరవైఫల్యం చెందింది అన్న తీవ్ర విమర్శలు ఎక్కువగా వచ్చాయి. అవి ప్రతిపక్షం నుంచేగాక స్వపక్షం, ఏ పక్షానికి చెందినవారి నుంచి కూడా వున్నాయి. ఈ లెక్కన ఈ వైఫల్యాన్ని ఎవరి ఖాతాలో వేయాలి? ప్రధాన మంత్రా, నరేంద్రమోడీనా ?

     నరేంద్రమోడీ గద్దె నెక్కిన రెండు సంవత్సరాల తరువాత ప్రభుత్వ విదేశాంగ విధానం కారణంగా అంతకు ముందుతో పోలిస్తే ప్రపంచంలో భారత్‌ స్ధానంలో మార్పు స్పష్టంగా చూడవచ్చని బిజెపి ప్రతినిధి నలిన్‌ కోహ్లి ప్రకటించారు. ఒక్క విదేశాంగ విధానంలోనే కాదు అన్ని రంగాలలో స్పష్టమైన మార్పుంన్నారు.ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు ఎప్పుడు సభ్యత్వం వస్తుందనేదే మౌలిక సమస్య అని కూడా ఆయన చెప్పారు. పుణ్యం చేసిన వారికి మాత్రమే రాజుగారు వేసుకున్న దేవతా వస్త్రాలు కనిపిస్తాయి మిగతావారికి మరేవో కనిపిస్తాయన్న కధ మాదిరి వుందని ఎవరైనా భావిస్తే అది వేరే విషయం. మోడీ ప్రభుత్వ విదేశాంగ విధాన వైఫల్యం గురించి బిజెపి నేత, వాజ్‌పేయి మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన యశ్వంత సిన్హా చేసిన విమర్శలను కోహ్లీ తోసి పుచ్చారు. అణుసరఫరా బృందంలో సభ్యత్వం ఇవ్వాలనే దరఖాస్తుతో మనం వారి దగ్గరకు వెళ్ల కూడదని, మనకు ఇస్తామన్నది ద్వితీయ శ్రేణి ప్రాతినిధ్యం అంటూ అసలు దానిని మనం అంగీకరించకూడదంటూ ఇప్పటికే భారత్‌ పొందాల్సిందేదో పొందిందని యశ్వంత సిన్హా చెప్పారు. పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరపకూడదని, మన దౌత్య గుడ్లన్నింటినీ అమెరికా బుట్టలో పెట్టకూడదని కూడా సిన్హా వ్యాఖ్యానించటం విశేషం.

   ఎన్‌ఎస్‌జి సభ్యత్వ విషయంలో మోడీ ప్రభుత్వం మరింత మెరుగ్గా సంప్రదింపులు జరిపి వుండాల్సిందని అణుశక్తి సంస్ధ మాజీ అధ్యక్షుడు ఎంఆర్‌ శ్రీనివాసన్‌ వ్యాఖ్యానించారు. ఆ సంస్ధలో వ్యతిరేకతను వ్యక్తం చేసే వారి బహిరంగ వైఖరి తెలిసిందేనని, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేసిన వారికే సభ్యత్వం ఇవ్వాలన్న చైనాతో పాటు అసలు అణుశక్తిపై ఏమాత్రం ఆధారపడనివి కూడా ఆ సంస్ధలో సభ్యులుగా వున్నాయని చెప్పారు. ఈ బృందంలో ఒక్క చైనా తప్ప మిగతా దేశాలన్నీ సానుకూలంగా వున్నందున చైనా దిగిరాక తప్పదని ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లున్నదని శ్రీనివాసన్‌ వ్యాఖ్యానించారు. పేకాటలో మన తురుపు ముక్కలను ఎదుటివారికి చూపి చెత్త ఆట ఆడినట్లుగా వుందన్నారు. అణ్వస్త్రవ్యాప్తి నిరోధం విషయంలో మన ఎగుమతుల అదుపు, అణు రక్షణ చర్యలు తిరుగులేనివి అయినప్పటికీ సభ్య దేశాలను ఎంతో ముందుగానే ఒప్పించి వుండాల్సిందని, సభ్యత్వం లేకపోతే సమీప భవిష్యత్‌లో మన పౌర అణుశక్తి కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది వుండదంటూ, 2008లో ఒక దఫాకు పొందిన మినహాయింపుల కారణంగా అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌,కజకస్తాన్‌, ఆస్ట్రేలియా వంటి అణు సరఫరా దేశాలతో విజయవంతంగా ఒప్పందాలు చేసుకున్నామని శ్రీనివాసన్‌ చెప్పారు.

    అసలు అణు సరఫరా బృందం ఏమిటి ? అది ఎందుకు, ఎప్పుడు ఏర్పడింది? దానిలో భారత్‌ సభ్యత్వం పొందటానికి అమెరికా వంటి దేశాలు ఎందుకు సరే అంటున్నాయి, చైనా మరికొన్ని దేశాలు నిబంధనల అమలు గురించి ఎందుకు పట్టుబడుతున్నాయి? మనకు సభ్యత్వం వస్తుందా ? మన అణు కార్యక్రమానికి ఎవరు వ్యతిరేకులు వంటి అనేక ప్రశ్నలు రావటం సహజం.

     1974 మే 18వ తేదీన రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ వద్ద మన దేశం తొలి అణుపరీక్ష జరిపింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా వులిక్కి పడింది. కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా చెప్పుకోవాలంటే రెండవ ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో జపాన్‌ లొంగిపోయి చేతులెత్తేసిన స్ధితిలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికన్లు అణు బాంబులను వేసి ప్రపంచాన్ని బెదిరించారు. దాంతో అనేక దేశాలు తాము కూడా అణ్వాయుధాలను సమకూర్చుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. దీంతో 1958లో ఐర్లండ్‌ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ప్రతిపాదించింది. పది సంవత్సరాల తరువాత 1968లో దానిని అంగీకరించిన దేశాలు సంతకాలు చేయటం ప్రారంభించాయి. వాటిలో నాటి సోవియట్‌ యూనియన్‌, అమెరికా, బ్రిటన్‌, అసలు అణుకార్యక్రమంలేని అనేక దేశాలు వున్నాయి. చైనా, ఫ్రాన్స్‌ 1992లో మాత్రమే సంతకాలు చేశాయి. అణుకార్యక్రమం కలిగి వుండి అణ్వాయుధ పరీక్షలు చేసిన దేశాలు ఇవి. అయితే ఈ ఒప్పందంపై సంతకాలు చేసే సమయానికి అనేక దేశాలు అణుకార్యక్రమాన్ని కలిగి వున్నాయి. అణువిద్యుత్‌ కేంద్రాలు కలిగిన ప్రతి దేశం వద్ద అణ్వస్త్రాలు తయారు చేయగలిగిన పరిజ్ఞానం వుంటుందన్నది ఒక గట్టి నమ్మకం. అణుపరీక్షలు జరిపి ఈ ఒప్పందంలో చేరని దేశాలు పాకిస్థాన్‌, భారత్‌ మాత్రమే. వుత్తర కొరియా పరీక్షలు జరిపింది, ఒప్పందంపై సంతకాలు చేసింది. అయితే అమెరికా తమతో చేసుకున్న ఒప్పందాన్ని సక్రమంగా అమలు జరపలేదనే కారణంతో అది ఒప్పందం నుంచి వైదొలగింది. ఇజ్రాయెల్‌ వద్ద కూడా అణుపరిజ్ఞానం వుంది, దీనితో పాటు దక్షిణ సూడాన్‌ ఎన్‌పిటిపై సంతకాలు చేయలేదు.

     1974లో మన దేశం జరిపిన అణుపరీక్షతో అణు సరఫరాలపై ఆంక్షలు విధించాలనే ఆలోచన తలెత్తింది. దాంతో 1975 నవంబరులో లండన్‌ కేంద్రంగా పలు దేశాలు చర్చలు ప్రారంభించి 1978నాటికి ఒప్పందానికి వచ్చాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేయని దేశాలకు అణు సరఫరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేయరాదన్నది దానిలోని కీలక షరతు. అయితే ఎన్‌పిటి వునికిలోకి రాకముందే మన దేశానికి కెనడా, అమెరికా అణుసరఫరాలు చేశాయి. 1962లో చైనాతో సరిహద్దు వివాదం తరువాత మన దేశంలో అణుకార్యక్రమం ముమ్మరమైంది. 1968,69 సంవత్సరాలలో మన శాస్త్రవేత్తలు సోవియట్‌ యూనియన్‌లోని అణు కేంద్రాలను సందర్శించి వచ్చారు. తరువాత 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం,బంగ్లాదేశ్‌ విముక్తికి పూర్తి తోడ్పాటు ఇచ్చిన కారణంగా మన దేశాన్ని బెదిరించేందుకు అమెరికా తన నౌకా దళంలోని యుఎస్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే యుద్ధ నౌకను బంగాళాఖాతంలోకి పంపింది. దాంతో మన దేశం సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొని అమెరికా బెదిరింపులను అడ్డుకుంది. అదే సమయంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ అణ్వస్త్ర పరీక్ష జరపాలని మన శాస్త్రవేత్తలను ఆదేశించారు. దాని ఫలితమే 1974లో తొలి పరీక్ష. మన పరీక్షలో వుపయోగించిన ప్లుటోనియం అంతకు ముందు మనకు కెనడా అందచేసిన సైరస్‌ రియాక్టర్‌లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న భార జలాన్ని వుపయోగించి తయారు చేసింది. దాంతో ఆ రెండు దేశాలు మన పరీక్ష పట్ల వ్యతిరేకంగా స్పందించాయి. మనలను అభినందిస్తూ ప్రాన్స్‌ తొలుత టెలిగ్రాం పంపి తరువాత వుపసంహరించుకుంది. మనదేశం జరిపిన పరీక్షను అణు బ్లాక్‌మెయిల్‌గా పాకిస్థాన్‌ పరిగణించి తరువాత తన కార్యక్రమాన్ని ముమ్మరం చేసి చివరకు పరీక్ష చేసింది. మన పరీక్ష తరువాత తారాపూర్‌ అణువిద్యుత్‌ కేంద్రానికి భార జలసరఫరాలో ఇబ్బందులు పెట్టటం, రెండవసారి వాజ్‌పేయి ప్రధానిగా వుండగా మనం రెండవ పరీక్ష జరిపినపుడు అమెరికా మనపై ఆంక్షలు విధించటం వంటి విషయాలన్నీ తెలిసినవే.

    సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత క్రమంగా మన దేశ విదేశాంగ విధానంలో చోటు చేసుకున్న మార్పులతో అమెరికాకు జూనియర్‌ భాగస్వాములుగా చేరి లబ్దిపొందాలని మన పాలకవర్గం నిర్ణయించింది. దాని ఫలితమే అమెరికన్లు మనపై ఆంక్షల ఎత్తివేత, యుపిఏ ప్రభుత్వం అమెరికాతో మనకు హానికరమైన ఒప్పందం కుదుర్చుకోవటం, దానిని వ్యతిరేకించిన వామపక్షాలు యుపిఏకు మద్దతు వుపసంహరించుకున్నాయి. వ్యతిరేకించిన బిజెపి ఒప్పంద ఆమోదానికి సహకరించటమే కాదు, ఇప్పుడు అది మరింత గట్టిగా అమలు జరిపేందుకు పూనుకుంది, అనేక రంగాలలో మరింత దగ్గరైంది. గతంలో మనపై ఆంక్షలు విధిస్తూ అమెరికన్‌ పార్లమెంట్‌ తీర్మానించింది. మన ప్రభుత్వం అమెరికాకు లబ్ది కలిగించే అణు ఒప్పందం చేసుకొనేందుకు సిద్ధం కావటంతో 2006 దానిని సవరించింది.అంతటితో ఆగలేదు, భారత్‌కు ఒకసారికి అణు సరఫరాలకు మినహాయింపు ఇవ్వాలని స్వయంగా మిగతా దేశాలతో లాబీయింగ్‌ జరిపి 2008లో ఆమేరకు ఎన్‌ఎస్‌జిలో ఆమోదముద్ర వేయించింది. తరువాత ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం రాబోయే రోజులలో కూడా అణుసరఫరాలు జరపవచ్చు. మన దేశం మరికొన్ని దేశాలతో కూడా ఒప్పందం చేసుకుంది. ఆ దేశాలన్నీ ఎన్‌ఎస్‌జిలో భారత్‌ సభ్యత్వానికి మద్దతు ఇస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నాయి. ఒకసారి భారత్‌ సభ్యురాలైన తరువాత ఆ మినహాయింపులను రద్దు చేయటానికి అవకాశం వుండదు. వుదాహరణకు 2010లోనే బరాక్‌ ఒబామా మన దేశ పర్యటనలో మద్దతు గురించి చెప్పారు. అదే ఏడాదిఫ్రెంచి అధ్యక్షుడు సర్కోజీ కూడా అదే చెప్పాడు. రష్యా కూడా కొన్ని షరతులతో మద్దతు ప్రకటించింది.నరేంద్రమోడీ ప్రధాని అనే అంశం వూహా మాత్రంగా లేనపుడే ఇవన్నీ జరిగాయి. అయినప్పటికీ ఈ రెండు సంవత్సరాలలో మా మోడీయే ఇదంతా చేశారని భక్తులు ఎవరైనా చెప్పుకుంటే చేయగలిగిందేమీ లేదు. మెయ్యబోతే ఎద్దుల్లో దున్నబోతే దూడల్లో అన్నట్లు కాకుండా సభ్యత్వానికి రంగం సిద్ధం చేశారని గొప్పలు చెప్పుకోవటమే కాదు, వైఫల్యానికి కూడా బాధ్యత వహించాలి. శ్రీనివాసన్‌ చెప్పినట్లు చైనా, మరికొన్ని దేశాల వైఖరి మోడీ కంటే ముందే ప్రపంచానికి సువిదతం. మనకు సభ్యత్వం రాకుండా అడ్డుకుందని ఆరోపణలకు గురైన చైనా ఎన్‌ఎస్‌జిలో చేరింది 2004లోనే, అంతకు ముందు మనకు ఎందుకు సభ్యత్వం తెచ్చుకోలేకపోయాం అని కూడా ఆలోచించాలి. ఓడలో వున్నంత వరకు ఓడ మల్లయ్య దిగిన తరువాత బోడి మల్లయ్య అన్నట్లు 2008లో తనకు అవసరం గనుక మనకు మినహాయింపులు రావటానికి అమెరికా తన శక్తి మొత్తాన్ని వినియోగించింది. ఇప్పుడు అలాంటి ప్రయత్నం దానివైపు నుంచి రాలేదు, మేం సిద్దం మిగతా అందరి మద్దతు మీరే కూడగట్టుకోండి, మేం ఓటింగ్‌ సమయంలో మాత్రమే వస్తాం అన్నట్లుగా వుంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లుగా ఒక వేళ చైనా, ఇతర దేశాలు అంగీకరిస్తే అది తమ ఘనతే అని చెప్పుకొనేందుకు లేకపోతే వారే కారణం అంటూ మనలో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు ఈ అవకాశాన్ని అమెరికా వినియోగించుకుంది.తమ ప్రధాని భారత్‌కు సభ్యత్వం ఇవ్వరాదని 17దేశాలకు లేఖలు రాసిన కారణంగానే రాలేదని పాక్‌ ప్రధాని సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ పేర్కొన్నారు.చైనాతో పాటు అభ్యంతరం తెలిపిన వాటిలో బ్రెజిల్‌, టర్కీ, దక్షిణాఫ్రికా, స్విడ్జర్లాండ్‌, మెక్సికో కూడా వున్నాయి. ఇవేమీ చిన్నా చితకా దేశాలు కాదు, మనతో శతృత్వం వున్నవీ కాదు.

   పోనీ నరేంద్రమోడీ అంతా రంగం సిద్దం చేస్తే చివరి క్షణంలో చైనా, మరికొన్ని దేశాలు అడ్డుపడ్డాయనుకుందాం. వాటిని ఒప్పించేందుకు మోడీ ఎందుకు ప్రయత్నించలేదు, ప్రయత్నిస్తే ఈ భంగపాటు ఎందుకు కలిగేది, లేదా ముందే తెలిసి వుంటే దాదాపు సభ్యత్వం వచ్చినట్లే అనే హంగామా ఎందుకు సృష్టించారు.లేదా యశ్వంత సిన్హా చెప్పినట్లు సలహాదారులు తప్పుదారి పట్టించారా? దేశానికి మోడీ లేదా ఆయన మద్దతుదార్లు వివరించాలి.

    సియోల్‌ సమావేశంలో చైనా అడ్డుకుంది గనుక కొద్దిలో తప్పిందిగానీ తదుపరి మనకు రావటం ఖాయం అన్న పద్దతుల్లో మన ప్రభుత్వం ఇప్పుడు వుంది. నిజానికి ఆ సమావేశంలో అసలు మన సభ్యత్వం అజెండాలోనే లేదు. భారత దరఖాస్తు గురించి చర్చించరాదని చైనా అభ్యంతర పెట్టింది, మరో ఏడు దేశాలు పాకిస్తాన్‌ కూడా దరఖాస్తు చేసుకుంది దానిపట్ల ఎటువంటి వైఖరి తీసుకోవాలి,ఎన్‌పిటిపై సంతకం చేయని దేశాల పట్ల అనుసరించాల్సిన వైఖరి ఏమిటనే మౌలిక సమస్యలను లేవనెత్తాయి. దీంతో చివరకు ఎలాంటి నిర్ణయం జరగకూడదనే షరతుతో భారత దరఖాస్తును అజెండాలో చేర్చేందుకు చైనా, మిగతా దేశాలు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇది జరిగింది కనుక తదుపరి సభ్యత్వం రావటమే తరువాయి అన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.

    నాలుక నాది కాదు కనుక తాటి పట్టెతో గీసుకోమన్నట్లుగా చైనా వైఖరి తెలిసి వుండి కూడా మన దేశాన్ని అమెరికా ముందుకు నెట్టిందా ? అంతర్జాతీయ రాజకీయాలు అందునా ఇరుగు పొరుగుదేశాలతో సమస్యలు వున్నపుడు ఎలా వ్యవహరించాలో, ఎన్‌పిటిపై సంతకం చేయని దేశానికి సభ్యత్వం ఇవ్వకూడదనే నిబంధన అమలులో వుండగా మన దేశానికి లేదా పాకిస్థాన్‌కు రెండు దేశాలకు ఇవ్వటంలో వున్న సంక్లిష్టతలను మన విధాన నిర్ణేతలు పరిగణనలోకి తీసుకోలేదా ? లేదా అమెరికా వంటి దేశాలు మద్దతు ఇచ్చిన తరువాత నల్లేరు మీద బండి మాదిరి అందరూ దారిలోకి వస్తారనే ధీమాతో వున్నారా ?

     చైనా పట్ల ఇటీవలి కాలంలో ముఖ్య ంగా గత రెండు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ వ్యవహరించిన తీరు తెన్నుల గురించి మన మాజీ రాయబారి, విదేశీ వ్యవహారాల విశ్లేషకుడు ఎంకె.భద్ర కుమార్‌ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఏడాది కాలంగా ఏ మాత్రం పట్టించుకొని నరేంద్రమోడీ చివరి నిమిషంలో చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ను కలుసుకొనేందుకు తాష్కెంట్‌ ఎందుకు వెళ్లారన్నదానికి ఎలాంటి వివరణ లేదు. చైనా పట్ల సౌత్‌ బ్లాక్‌(ప్రధాని, విదేశాంగ శాఖ, రక్షణ వంటి ముఖ్యశాఖలున్న భవనం) అసహ్యకర విధానాలు అనుసరించిందని భద్రకుమార్‌ వ్యాఖ్యానించారు. కొన్ని వుదాహరణలను ఆయన పేర్కొన్నారు. శ్రీలంకలో అధికార మార్పిడి, మోడీ-బరాక్‌ ఒబామా సంయుక్తంగా ఆసియా పసిఫిక్‌ సంయుక్త ప్రకటన, జపాన్‌ ప్రధాని షింజేతో మోడీ సయ్యాటలు, వియత్నాంకు ఆయుధాలు, మలబార్‌ తీరంలో జపాన్‌తో కలసి సైనిక విన్యాసాల విస్తరణ, విదేశాంగ మంత్రుల స్ధాయిలో అమెరికా-భారత్‌-జపాన్‌ త్రిపక్ష చర్చలు, చైనాలోని అఘిర్‌ ఇస్లామిక్‌ వేర్పాటువాదులకు వీసాలు ఇవ్వటం, దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో భారత నౌకాదళాన్ని కొనసాగించటం, వియత్నాంకు బ్రహ్మూెస్‌ క్షిపణులు అందచేస్తామని బెదిరించటం వంటి చైనాకు ఇష్టం లేని చర్యలకు గత ఏడాదిన్నరకాలంగా అనుసరించారని భద్రకుమార్‌ పేర్కొన్నారు. చైనా కీలకమైన ప్రయోజనాలపై దాడి చేయటం ప్రతికూల ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల కారణంగా చైనా వైఖరి కఠినతరమైందని, తాష్కెంట్‌లో మోడీ ప్రత్యక్షంగా దానిని రుచి చూశారన్నారు. అమెరికాతో కలసి 21వ శతాబ్దంలోనిర్ణయాత్మక భాగస్వామ్య సమావేశాలకు హాజరవుతున్నంత కాలం దేవుడు తన స్వర్గంలోనే వున్నాడని, అంతా మంచే జరుగుతుందనే ప్రగాఢ భావనలోకి భారత్‌ వెళ్లిపోయిందని, ఏక ధృవ ప్రపంచ భావన నుంచి విడగొట్టుకోవటానికి రెండు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ ప్రధాని వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవటమే గాక తానే దానికి బలయ్యారు.మోడీ విశ్వసించిన ఆయన సిబ్బంది ద్వారా అమెరికన్లు భారత విదేశాంగ విధానాలను నిర్ణయిస్తున్నారంటే అది అమెరికన్ల తప్పుకాదు, అలా జరగటానికి ఆయనే అవకాశం ఇచ్చారు.అమెరికన్ల బలం గురించి వున్న విశ్వాసం మనల్ని తీవ్రంగా నష్టపరుస్తోంది, ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం గురించి ముందుగా ప్రతిపాదించి మనలను 2010 ముందుకు నెట్టిన అమెరికా ఇప్పుడు దానిని భారత-చైనా వివాదంగా మార్చటంలో జయప్రదమైంది, హిమాలయాన్ని అధిరోహించేందుకు ఏర్పాట్లు చేసే బాధ్యతను భారత్‌పైనే పెట్టింది అని ఆయన వ్యాఖ్యానించారు.

    ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అనేక మంది చేసిన విమర్శలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణ్యంగా మన ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ఇరుగు, పొరుగు , ఇతర అన్ని దేశాలతో సఖ్యతగా వ్యవహరించినపడే ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పుతాయి. తన ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేసే అమెరికా దౌత్యపరంగా అనేక ఎదురు దెబ్బలు తింటున్నది. దాని వెనుక నడిస్తే మనకూ తప్పవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా-భారత్‌ సంస్కరణలకు తేడా ఏమిటి ?

25 Saturday Jun 2016

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

China, economic reforms, FDI, INDIA, subsidies

ఎం కోటేశ్వరరావు

      ఎదుటి వారి ప్రతికూలతలను తమ అనుకూలతలుగా మార్చుకోవటం లాభార్జనా పరుల నిరంతర ప్రయత్నం. జౌళి రంగంలో అటువంటి అవకాశాలనే తమ లాభాలకు వినియోగించుకోవాలని స్వదేశీ, విదేశీ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు తహతహలాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న లేదా ప్రచారం చేస్తున్నదాని ప్రకారం రానున్న మూడు సంవత్సరాలలో జౌళి రంగంలో 11 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే ఆ రంగంలో మన ఎగుమతులు 30 బిలియన్‌ డాలర్లు పెరుగుతాయి. కోటి మందికి ప్రత్యక్ష, పరోక్ష వుపాధి లభిస్తుంది. దీని కోసం ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవ్వటానికి, ఇంకా కొన్నివేల కోట్ల పన్ను, ఇతర పరోక్ష రాయితీలు ఇవ్వటానికి కొత్త ప్రోత్సాహక పధకాన్ని ప్రకటించింది. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఇంత తక్కువ ఖర్చుతో అంత పెద్ద మొత్తం ప్రయోజనం కలుగుతుందంటే ఎవరు కాదంటారు? ఈ రంగంలో ఇప్పటికే మన కంటే ఎంతో ముందున్న బంగ్లాదేశ్‌ వంటి దేశాలు ఎంత పేదవైనా వాటి మార్కెట్‌ను నిలబెట్టుకోవటానికి ఇంతకంటే ఎక్కువ రాయితీలు ఇవ్వలేవా అన్నది అర్ధంగాని ప్రశ్న.

      మన ఆత్రాన్ని సొమ్ము చేసుకొనేందుకు, వూరించి ముందుకు దూకించేవారు ఎప్పుడూ వుంటారు. మన కేంద్ర ప్రభుత్వం రానున్ను మూడు సంవత్సరాలలో 17 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను 40 దాటిస్తామని చెబుతుంటే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా మూడేండ్లలో 40 ఏమిటి పది సంవత్సరాలలో 150 బిలియన్‌ డాలర్ల సత్తా మీకు వుందని మన సిఐఐ(కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) నియమించిన అమెరికా సంస్ధ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బిసిజి) ఒక నివేదిక ఇచ్చింది.దాని ప్రకారం 2025 నాటికి భారత జౌళిరంగం 300 బిలియన్‌ డాలర్ల విలువకు చేరుతుందని, 150 బిలియన్‌ డాలర్ల విదేశీమారక ద్రవ్య ఆర్జనతో పాటు ఐదు కోట్ల మందికి అదనంగా వుపాధి కల్పించవచ్చని, వారిలో మూడున్నర నుంచి నాలుగు కోట్ల మంది మహిళలు వుంటారని లెక్కలు చెప్పింది. దీనికి గాను అది చెప్పిన ఆధారాలు ఏమిటంటే చైనా యువాను విలువతో పాటు అక్కడ వేతనాలు పెరుగుతున్నాయి కనుక పరిశ్రమలు అక్కడి నుంచి తరలి పోతున్నాయి, అందువలన చైనాతో పాటు అలాంటి ఇతర దేశాల వాటిని భారత్‌ ఆకర్షిస్తే 280 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతుల మార్కెట్‌ను పట్టుకోవచ్చని ఆ నివేదిక మన ముందు ఒక రంగుల కలను సాక్షాత్కరింప చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌, వియత్నాం దేశాలు ముందు పీఠీన వున్నప్పటికీ, ఆఫ్రికాలో ఇథియోపియా వంటి కొత్త కేంద్రాలు వునికిలోకి వస్తున్నప్పటికీ,అమెరికాలో తిరిగి పెద్ద ఎత్తున వుత్పత్తి జరిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ భారత్‌కు ఈ అవకాశాలు వుంటాయని బిసిజి నమ్మబలికింది.

   మన జనానికి వుపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందే. అందుకు తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ ప్రజల, దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి చేయాలా అన్నదే సమస్య.స్వాతంత్య్రానికి ముందు బ్రిటన్‌ తన గ్లాస్గో (పాత తరం వారికి గ్లాస్గో పంచెలు ఇప్పటికీ గుర్తు వుంటాయి) తదితర నగరాలలో వున్న వస్త్ర కర్మాగారాల కోసం మన దేశాన్ని పత్తి సరఫరా చేసే దేశంగానూ, అక్కడ తయారైన వుత్పత్తులను విక్రయించే మార్కెట్‌గానూ మార్చిందన్నది తెలిసిందే. అప్పుడు దాని వుత్పత్తులకు ప్రపంచంలోని వలస దేశాలన్నింటినీ మార్కెట్‌లుగా మార్చి తన పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చింది. ఇప్పుడు కూడా బ్రిటన్‌ తన కర్మాగారాలకు అవసరమైన పత్తిని ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు. కానీ ఆ పని చేయదు. ఎందుకంటే అలా దిగుమతి చేసుకొని తన కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇచ్చి వుత్పత్తి చేయిస్తే అక్కడి కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు ఎలా వుంటాయి. అందువలన ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చౌకగా శ్రమశక్తి దొరుకుతుందో అక్కడే తనకు కావాల్సిన దుస్తులను తయారు చేయించుకుంటే అదే లాభసాటిగా వుంటోంది కనుక ఏకంగా తన ఫ్యాక్టరీలను ఆయా దేశాలకు తరలించటం లేదా కొత్త ఫ్యాక్టరీలను పెట్టి తయారు చేయిస్తున్నది.ఇదేదో బ్రిటన్‌ ఒక్కటే చేస్తున్నది కాదు, అన్ని ధనిక దేశాలదీ ఇదే బాట. నీరు పల్లంవైపు, పెట్టుబడిదారుడు లాభాలవైపు పయనిస్తాడు. గతంలో దేశాలను అక్రమించుకుంటే లాభాలు, ఇప్పుడు శ్రమశక్తితో తమకు కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకుంటే, ఇతర దేశాల దగ్గర లేని ఆధునిక పరిజ్ఞానంతో తన దగ్గర తయారయ్యే వస్తువులకు మార్కెట్లను పట్టుకుంటే సిరులు, అందుకే పద్దతులను మార్చారు.

    అమెరికా వాణిజ్యవేత్తలు, బంగ్లాదేశ్‌, వియత్నాం, చైనాల నుంచి దుస్తులు, బొమ్మలు, ఇతర సామగ్రిని దిగుమతి చేసుకొని, తమ వద్ద పాతబడిపోయిన అణు కర్మాగారాలు, మిలిటరీ ఆయుధాలను మన వంటి దేశాలకు అంట గట్టి లాభాలు పొందుతున్నారు. ఇవేవీ లేకపోతే పెట్టుబడి పెట్టనవసరం లేదు, ఫ్యాక్టరీ కట్టనవసరం లేదు, వ్యాపార దుకాణాలూ తెరవనవసరం లేదు. లాభాల బాటలో వున్న మన వంటి దేశాల కంపెనీల వాటాలను వుదయం కొనుగోలు చేసి సాయంత్రానికి వాటి విలువ పెరిగితే అమ్ముకొనీ లబ్ది పొందుతున్నారు. ఈ పని చేయటానికి సూట్‌ కేసులతో మన ముంబయ్‌ రానవసరం లేదు, సినిమాలలో చూపినట్లు ఏ విలాస కేంద్రంలోనో మందు, మగువలతో కూర్చొని ఇంటర్నెట్‌తో మీటలు నొక్కితే చాలు.

    భారత్‌ను చైనాతో పోల్చితే కొంత మందికి తేళ్లూ జెర్రులు పాకినట్లుంటాయి. అది నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం దానికీ దీనికీ పోలికా అని రంకెలు వేస్తారు. చైనా మాదిరి సంస్కరణలను మన దేశంలో సంస్కరణలు అమలు జరిపితే వ్యతిరేకిస్తారు అని కమ్యూనిస్టుల మీద నిందలు వేసేటపుడు మాత్రం వారికి అప్పుడు చైనా కావాలి. కానీ వారే మరో సందర్భంలో త్వరలో మన దేశం చైనాను అధిగమించబోతోందని లొట్టలు వేసుకుంటూ చెబుతూ తమ జబ్బలను తామే చరుచుకొని శభాష్‌ అని చెప్పుకుంటారు.అంతెందుకు కమ్యూనిస్టులను వ్యతిరేకించే మన వ్యాపారులు గత కొద్ది సంవత్సరాలుగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతోనే వ్యాపారాలు చేసి లాభాలు పోగు చేసుకోవటం లేదా? వారికి అక్కడి కమ్యూనిజం అడ్డం రావటం లేదేం? ఇది అన్యాయం కదా !

    ‘ఆసియా బ్రీఫింగ్‌’ అనే ఒక పత్రిక వుంది. అదేమీ కమ్యూనిస్టు, వామపక్ష పత్రిక కాదు. పెట్టుబడిదారుల సేవలో వుంటుంది. మూడు సంవత్సరాల క్రితం ఒక విశ్లేషణలో రెండు దేశాలలో వున్న కనీస వేతనాల గురించి ఒక పోలికను ఇచ్చింది.http://www.asiabriefing.com/news/2013/07/comparison-minimum-wages-in-china-and-india/ దానిలో రెండు దేశాలలోని కొన్ని ప్రధాన నగరాలలో కనీస వేతనాలు ఎలా వున్నాయో తెలిపింది. వాటిని దిగువ చూడవచ్చు.2013 జూలై 18న ప్రచురించిన ఆ వ్యాసంలో నాడు డాలరు విలువ రు.59.42గానూ, యువాన్లు 6.14గానూ వున్నాయి.

పట్టణం              నెలవేతనం స్ధానిక కరెన్సీ          అమెరికా డాలర్లలో

ఢిల్లీ                        6,448                                110

హైదరాబాదు              4,940                                  83

ముంబై                    4,940                                  83

జైపూర్‌                     4,030                                 68

అహమ్మదాబాదు         3,900                                 65

చెన్నయ్‌                  3,041                                51

షాంఘై                    1,620                                264

గ్వాంగ్‌జు                  1,550                                253

హాంగ్‌జౌ                   1,470                                240

టియాన్‌జిన్‌               1,500                                245

బీజింగ్‌                     1,400                                228

దలియన్‌                   1,300                               212

     కనీస వేతనాలపై కార్మికుల సంక్షేమ చర్యలకు గాను యజమానులు అదనంగా సగటున 30 నుంచి 50శాతం వరకు చెల్లించాలని, అదే భారత్‌లో గరిష్టంగా పదిశాతానికి మించి లేదని కూడా ఆ పత్రిక విశ్లేషణ పేర్కొన్నది. చైనాలో కనీస వేతనాలు, సంక్షేమ చర్యలకు యాజమాన్యాలు చెల్లించాల్సిన మొత్తాలు ఏటికేడు పెరుగుతున్నాయి తప్ప ఏదో ఒకసాకుతో కోత పెట్టటం లేదు. అందుకనే విదేశీ ప్రయివేటు యజమానులు చైనాలో తమకు గిట్టుబాటు కావటం లేదని సణగటం మొదలు పెట్టటమే కాదు, ఎక్కువ లాభాలు వచ్చే ప్రాంతాలకు వలసపోవటం ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ ఆదేశాలను అమలు జరపకపోయినా లేక కోత పెట్టినా అక్కడ కార్మికులు ప్రతిఘటించటమే కాదు, అవసరమైతే సమ్మెలకు కూడా దిగుతున్నారు. కనీస వేతనాల పోలిక చేసిన ఆసియా బ్రీఫింగ్‌ పత్రిక కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే పరిశ్రమల కార్యకలాపాల ప్రారంభానికి భారత్‌ కీలకం అని మూడు సంవత్సరాల నాడే తన వ్యాఖ్యలో పేర్కొన్నది. అంటే ఘనత వహించిన నరేంద్రమోడీ అధికారానికి రాక ముందే అని వేరే చెప్పనవసరం లేదు.ఎఫ్‌డిఐలు ఎక్కడ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయో ప్రపంచ పెట్టుబడిదారులకు సలహాలు ఇచ్చేందుకు 1992లో ఏర్పాటయిన డిజాన్‌ షిరా అండ్‌ అసోసియేట్స్‌ స్థాపకుడు క్రిస్‌ డేవన్‌ షైర్‌ విల్స్‌ రాసిన వ్యాసంలో పై వివరాలు పేర్కొన్నారు.

    కార్మికులకే కాదు, రైతాంగానికి మద్దతు ధరలు ఇవ్వటంలోనూ, సగటు దిగుబడులను పెంచే వంగడాలు, ఇతర పెట్టుబడులను సమకూర్చటంలోనూ అక్కడి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటున్నది. పత్తికి ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని ధరలను ఇవ్వటమే కాదు, వుత్పత్తి కేంద్రాలనుంచి కొనుగోలు కేంద్రాలకు చేర్చే రవాణా ఖర్చులను కూడా భరిస్తున్నది. ఇదంతా రెండు దేశాలలో సంస్కరణలు అమలు జరిగిన తరువాత తలెత్తిన పరిస్థితి. అందువలన ఏ సంస్కరణలను వ్యతిరేకించాలి? వేటిని సమర్ధించాలి ? కావాలంటే జనానికి మేలు చేసే సంస్కరణలకు ముందు తగిలిస్తున్నట్లు ప్రధాని పేరు తగిలించి అమలు జరపండి ఇబ్బంది లేదు. అవేమీ లేకుండా కార్మికులు కడుపుకట్టుకొని పెట్టుబడిదారులు,వ్యాపారులకు లాభాలు చేకూర్చాలని చూస్తే జనమే కాదు, దేశం కూడా నష్టపోతుంది.

   విచక్షణా రహితంగా విదేశీ కంపెనీలను, దిగుమతులను అనుమతిస్తే దేశీయ పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతింటాయి.అందుకే ఇక్కడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రక్షణ చర్యలు కోరుతున్నారు. ఇదే సమయంలో ఇతర దేశాలలో ఎక్కడ లాభసాటిగా అక్కడకు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. జపాన్‌ తన సామాన్యుల కారు మారుతీ తయారీని భారత్‌లో ప్రారంభిస్తే విలాసవంతమైన జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ కార్ల ఫ్యాక్టరీని మన టాటా మోటార్స్‌ చైనాలోని చాంగుషులో ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పేరుతో ఇక్కడ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోమని చెబుతున్నారు.చైనా కూడా అదే పని చేసింది. అదే సమయంలో తన అంతర్గత వినియోగాన్ని కూడా పెంచే క్రమంలో తన పౌరుల ఆదాయాలను గణనీయంగా పెంచింది. అందుకే ప్రపంచ ధనిక దేశాలలో తీవ్ర మాంద్యంతో ఎగుమతులు దెబ్బతిన్నప్పటికీ దాని ఆర్ధిక వ్యవస్ధపై పెద్ద ప్రభావం పడలేదు. అటువంటి పరిస్థితి మన దేశంలో వుందా ? విధానాలు అందుకు అనుగుణంగా వున్నాయా ? గౌరవంగా బతికేందుకు అవసరమైన వేతనాలు పొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గటం, స్వల్పవేతన వుద్యోగులు, కార్మికుల సంఖ్య పెరగటం దేనికి సూచిక ?

     సులభంగా వ్యాపారం చేసేందుకు అవకాశాల పేరుతో ప్రతి ఏడాదీ ప్రపంచబ్యాంకు ఒక సూచికను తయారు చేస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన సమయంలో ప్రపంచంలోని 189 దేశాలలో భారత్‌ 134వ స్థానంలో వుంది, దానిని 50లోపుకు చేరుస్తానని ప్రపంచ పెట్టుబడిదారులకు మోడీ హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాల తరువాత అది 130 స్థానంలో వుంది. ఆ యావలో మోడీ కార్మికులకు, సామాన్య జనానికి, దేశం మొత్తానికి హాని కలిగించే విధంగా మన ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా బార్లా తెరిచేందుకు పూనుకున్నారు. బ్రిటీష్‌ వ్యాపారులు స్ధానిక రాజులు, రంగప్పలను లోబరుచుకొని మొత్తం దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు స్వతంత్ర పాలనలో ఏకంగా ప్రభుత్వమే జనం పేరుతో అన్ని దేశాల వారికి దేశాన్ని అప్పగించేందుకు పూనుకుంది. ఏడుపదుల స్వాతంత్య్రం వెనక్కు పోతోందా? ముందుకు పోతోందా ? ఏది దేశ భక్తి? ఏది దేశద్రోహం, ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జౌళి పరిశ్రమల ప్రోత్సాహకాల మాటున కార్మిక వ్యతిరేక చర్యలు

24 Friday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Anti labour measures, Employee Provident Fund Scheme Reforms, NDA, PMRPY, textile package

ఎం కోటేశ్వరరావు

    ఎదుటి వారు తొడ కోసుకున్నారని మనం మెడ కోసుకుంటామా ? బుద్ధిలేని తనం అంటారు పెద్దలు ! కొన్ని దేశాలు పెట్టుబడిదారీ విధానం, కొన్ని దేశాలు సోషలిస్టు విధానాన్ని ఎంచుకుంటే మనం మిశ్రమ ఆర్ధిక విధానం ఎంచుకున్నాం. మధ్యేమార్గం అన్నారు ఎందరో ! ప్రపంచ దేశాలన్నీ మనలను చూసి నేర్చుకుంటున్నాయని, మనకు విదేశీ సిద్ధాంతాలు వద్దు, విధానాలు వద్దు అని కొందరు చెబుతున్నారే, వారే వాటికి తూనా బొడ్డు చెప్పి (స్వస్థి) అనుకరిస్తే భారతీయత మట్టి కరిచిపోదా ? సంస్కరణలు అమలు జరిపినంత మాత్రాన చైనా సోషలిస్టు విధానాన్ని వదలి వేసిందా ? అమెరికా, జపాన్‌ వంటి పెట్టుబడిదారీ దేశాలలో సైతం కొన్ని మార్పులు తప్ప వారు నమ్మిన పెట్టుబడిదారీ విధానాన్ని వదులుకోలేదే ? మరి మనం ఎందుకు మన మిశ్రమ ఆర్ధిక విధానం నుంచి దారి తప్పుతున్నాం ?( దానిని కూడా విమర్శించే వారు వున్నారు) ఇక మన దేశ ప్రత్యేకత ఏముంది? ఇది భారతీయతా ? జనానికి మేలు చేయని సంస్కరణలు ఎవరికోసం ? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశం.

    వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి వుపాధి కల్పిస్తున్న జౌళి రంగంలో మరిన్ని సంస్కరణలకు తెరతీసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.దేన్నయినా మూసిపెడితే పాచిపోతుందని తెలిసిందే. అలాగే ఎప్పటి కప్పుడు సంస్కరించుకోకపోతే ఏదీ పనికిరాదు. కానీ ఎలా సంస్కరించుకోవాలనేదే సమస్య? దీని గురించి పెద్దగా ఎక్కడా చర్చలు జరపలేదు, పర్యటనకు వచ్చిన ప్రతిసారీ పత్రికా గోష్టి జరిపి గలగలా మాట్లాడేవెంకయ్య నాయుడి వంటి వారు కూడా కనీసం ఆఫ్‌ ది రికార్డుగా కూడా వుప్పందించలేదే ? శత సహస్ర లేఖా రచయిత అవార్డుకు ఏకైక అర్హుడైన బండారు దత్తాత్రేయ కనీసం కార్మికులకు దీని గురించి ఒక్క లేఖయినా రాసినట్లు వినలేదు. మేము భారత మితవాదులం అని సగర్వంగా చెప్పుకొనే స్వరాజ్య పత్రికలో బ్రిజ్‌ మోహనలాల్‌ ముంజాల్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధి శ్రేయాస్‌ భరద్వాజ ఒక వ్యాఖ్యానం రాశాడు. అతను యువ మితవాది అని, తోటి విద్యార్ధులలో మితవాద భావాలను వ్యాపింపచేస్తున్నాడని ఆ పత్రిక అతని గురించి సగర్వంగా పరిచయం చేసింది. కేంద్ర ప్రభుత్వం జూన్‌ 22న ఒక జౌళి పాకేజిని ఆమోదించిందని, దానిలో సబ్సిడీల భాగం అంత ముఖ్యమైనదేమీ కాదు గాని దానిలో కార్మిక సంస్కరణల గురించి ఒక్క ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ తప్ప మీడియా వాటిని పట్టించుకోలేదు అని అతను వ్యాఖ్యానించాడు.

   అదేమీ నరేంద్రమోడీ విజయగాధ కాదు కనుక, ఆ వార్తను ప్రముఖంగా ప్రచురిస్తే తమ యజమానులు, వారికి ప్రకటనల ద్వారా అండదండలిచ్చే కార్పొరేట్‌ సంస్ధల యజమానులు, మాకు లేని పోని తలనొప్పి తెచ్చారు అని విమర్శించే పాలకపార్టీ నేతలతో తలనొప్పి ఎందుకు ? రాయకపోతే ఎవరు అడగొచ్చారు అని మీడియా కావాలనే వదలివేసిందని వేరే చెప్పనవసరం లేదు. ఇంతకూ ఏమిటా సంస్కరణలు. మేకను బలి ఇవ్వబోయే ముందు దానికి తిన్నంత తిండి పెడతారు, కడుగుతారు, అలంకరిస్తారని తెలిసిందే. అది మేక కనుక అమాయకంగా తింటుంది. కానీ కార్మికులు అలా కాదు కదా అందుకని వారి నోరు మూయించాలంటే వారిని ఆకర్షించాలి. అందుకుగాను కొన్ని ప్రతిపాదనలు చేశారు. అవేమంటే,

     నెలకు పదిహేను వేల రూపాయల కంటే తక్కువ వేతనం పొందుతున్న దుస్తుల పరిశ్రమల కొత్త కార్మికులకు మొదటి మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వమే ప్రావిడెంట్‌ ఫండ్‌ పధకం కింద యజమానుల తరఫున 12శాతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందట. ప్రధాన మంత్రి రోజ్‌గార్‌ ప్రస్థాన్‌ యోజన(పిఎంఆర్‌పివై) పధకం నుంచి ఇప్పటికే చెల్లిస్తున్న 8.33 శాతానికి అదనంగా 3.67శాతాన్ని జౌళి మంత్రిత్వశాఖ ఖాతా నుంచి చెల్లిస్తారట. ఎంత వుదారత్వం ! ఈ మొత్తం రానున్న మూడు సంవత్సరాలలో రు.1170 కోట్లు వుంటుందని అంచనా. పదిహేను వేల రూపాయల కంటే తక్కువ వేతనం పొందుతున్న కార్మికులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ పధకంలో చేరాలా లేదా అనే ‘స్వేచ్ఛ’ ఇస్తారట. దీని వలన కార్మికుల చేతిలో మరింత డబ్బు వుండటంతో పాటు సంఘటిత రంగంలో వుపాధిని పెంచటానికి తోడ్పడుతుందట. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) విధానం ప్రకారం వారానికి ఎనిమిది గంటలకు మించి ఓవర్‌టైమ్‌ దాట కూడదు, కొత్త విధానం వలన ఆ గంటలు బాగా పెరుగుతాయి.ఈ పరిశ్రమ స్వభావాన్ని బట్టి దుస్తుల తయారీ రంగంలో నిర్ణీత వ్యవధి వుపాధి విధానాన్ని ప్రవేశపెడతారు, ఆ కార్మికులను ఇతర పర్మనెంటు కార్మికులతో సమంగా చూస్తారు, అంటే పని గంటలు, వేతనాలు, అలవెన్సులు, ఇతర చట్టబద్దంగా వర్తించేవన్నీ వారికి వర్తింప చేస్తారట. సంవత్సరానికి ఆరువేల కోట్ల రూపాయల చొప్పున కేంద్రం కేటాయించే ఈ రాయితీల వలన ప్రస్తుతం 17బిలియన్‌ డాలర్లుగా వున్న మన వస్త్ర ఎగుమతులు మూడు సంవత్సరాలు తిరిగే సరికి 43 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయనీ, ప్రత్యక్ష, పరోక్ష వుపాధితో కోటి మంది లబ్ది పొందుతారని కేంద్ర ప్రభుత్వం ఒక రంగుల కలను మన ముందుంచింది.

   మన ఎగుమతులన్నీ వరుసగా గత ఏడాదిన్నర కాలంగా పడిపోయినట్లు ఒకవైపు అధికారికంగా చెబుతున్నారు. అయినా ఇంత ధైర్యంగా కేంద్రం చెబుతున్నదంటే నరేంద్రమోడీకి ఏ విదేశీ పర్యటనలోనో మన దేశం నుంచి ఎప్పుడో తరలి పోయిన గొప్ప మంత్రదండం లేదా మన పురాణాల్లోని అక్షయపాత్రలు దొరకటమో, ఇతర అద్బుతశక్తులు అయినా ఆవహించి వుండాలి లేదా మన సంస్కృత పండితులు వేదాలు, పురాణాల్లో నిక్షిప్తంగా వున్న వాటిని ఎట్టకేలకు వెలికి తీసి వుండాలి. ఏదో జరగక పోతే ఇలా చెబుతారా ?కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కార్మిక సంస్కరణలంటూ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలను వూరిస్తున్నది.

    శ్రేయాస్‌ భరద్వాజ తన వ్యాఖ్యానంలో ఒక విషయం చెప్పాడు. యజమానుల చిత్తం వచ్చినట్లు కార్మికులను తొలగించటానికి, పెట్టుకోవటానికి అవకాశం ఇచ్చే, రాత్రి పూట కూడా మహిళలను పనిచేయటానికి అనుమతించటం, 24 గంటలూ దుకాణాలు తెరిచి వుంచటం వంటి సంస్కరణలను పార్లమెంట్‌లో ప్రతిపాదించాలని కేంద్రానికి వుత్సాహం వున్నప్పటికీ ‘ వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలు, రాజ్యసభలో తగిన మెజారిటీ లేకపోవటం వలన సంస్కరణలకు బ్రేక్‌ వేయాలని మంత్రుల బృందానికి నాయకత్వం వహిస్తున్న అరుణ్‌ జెట్లీ కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కోరారని, అయితే పరోక్ష మార్గంలో లక్షిత రంగాలలో సబ్సిడీ పాకేజీలతో కలిపి ప్రవేశ పెడుతున్నారని ‘ యువ మితవాద భరద్వాజ వ్యాఖ్యానించాడు. నరేంద్రమోడీ సర్కార్‌ ఎత్తుగడను చక్కగా ప్రతిబింబించాడు.

   భారత మాతాకీ జై మార్కు దేశ భక్తులు, ఇతరులూ తరచూ లేవనెత్తే ప్రశ్నల గురించి కూడా చెప్పుకోవాలి. గత ఏడు దశాబ్దాల విధానాలు మన దేశాన్ని ముందుకు తీసుకుపోనపుడు మనం సంస్కరణలు అమలు జరపనవసరం లేదా ? కమ్యూనిస్టు చైనాలో సంస్కరణలను సమర్ధిస్తారు, అదే భారత్‌లో వ్యతిరేకిస్తారెందుకు మోడీపై గుడ్డి వ్యతిరేకత కాదా ? ఇంకా అటూ ఇటూ తిప్పి ఇంకా ఇలాంటివే అనేక మంది లేవనెత్తుతున్నారు.ప్రారంభంలోనే కొన్ని అంశాలను ప్రస్తావించాను.

     సంస్కరణలు అంటే ఏమిటి ? పదునైన కత్తితో మగవారు గడ్డం గీసుకోవచ్చు, స్త్రీ,పురుషులు కూరగాయలు తరగవచ్చు, మామిడి కాయలు కోసుకోవచ్చు, గూండాలు ప్రాణాలు తీయవచ్చు, అసహాయులు ఆత్మరక్షణకు వుపయోగించుకోవచ్చు. సంస్కరణలు కూడా అలాంటివే. ఎవరు అమలు చేస్తున్నారనేదానిని బట్టి వాటి ప్రయోజనం, ఫలాలు, పర్యవసానాలు వుంటాయి. అణు పరిజ్ఞానాన్ని బాంబుల తయారీకి వినియోగించి వాటిని జపాన్‌పై ప్రయోగించి అమెరికా ప్రపంచాన్ని భయపెట్టింది. అణుబాంబులను మరోసారి ప్రయోగించం అని చెప్పటానికి అమెరికా ఇప్పటికీ నిరాకరిస్తోంది. అదే అణుశక్తిని ప్రాన్స్‌ వంటి దేశాలు బాంబుల తయారీతో పాటు విద్యుత్‌ తయారీకి కూడా వినియోగిస్తున్నాయి. అణు సంస్కరణలలో భాగంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (ఎన్‌పిటి) కొన్ని దేశాలు ప్రతిపాదించాయి. అనేక దేశాలు సంతకాలు చేశాయి, భారత్‌ తిరస్కరించింది. ఈ సంస్కరణ లేదా ఒప్పందం తనకు నష్టదాయకం కనుకనే భారత్‌ తిరస్కరించింది. అణురంగంలో ఎంతో ముందున్న దేశాలు ఇతర దేశాలు ఆ పరిజ్ఞానాన్ని సముపార్జించకుండా చేసేందుకే ఎన్‌పిటి అస్త్రాన్ని వాడుతున్నాయి. సంస్కరణలు కూడా ఇలాంటివే. వాటి వలన లబ్ది పొందే శక్తులు అమలు జరపాలని కోరతాయి, నష్టపోయే శక్తులు వ్యతిరేకిస్తాయి. దుస్తుల తయారీ కంపెనీల వారు కారు చౌకగా తయారు చేసి విదేశాలకు చౌకగా ఎగుమతి చేసి లాభాలు పోగు చేసుకోవాలని చూస్తారు. అమెరికా, ఐరోపా దేశాల వారు దారిద్య్రం తాండవించే బంగ్లాదేశ్‌లో తమ ఫ్యాక్టరీలను పెట్టి చౌకగా దుస్తులు తయారు చేయించి వారే దిగుమతి చేసుకుంటున్నారు. అందుకే వాటిపై పన్నులు మినహాయింపు ఇచ్చారు. తాజాగా వస్తున్న వార్తలను బట్టి చైనాలో వేతనాలు పెరుగుతున్నందున విదేశీ కంపెనీలు ఇతర దేశాలకు తమ కార్యకలాపాలను తరలిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకోవాలని భారత పెట్టుబడిదారులు ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోంది.అందుకే నరేంద్రమోడీ సర్కార్‌ రాయితీల ప్రకటనతో పాటు కార్మిక సంస్కరణలనూ జమిలిగా అమలు జరిపేందుకు నిర్ణయించింది.

      పిల్లి నల్లదయినా ఎలుకలను పడితే ఎవరికీ ఇబ్బంది లేదు. అమలులో వున్న కార్మిక చట్టాలనే యాజమాన్యాలు పట్టించుకోవటం లేదు, అమలు జరిపే యంత్రాంగమే లేదు. ఈ స్ధితిలో వున్నవాటిని ఇంకా నీరుగారిస్తే చీకటి రోజుల్లోకి కార్మికులు నెట్టబడతారు. అందుకే ఇక్కడ కార్మికులు సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు.అది కాంగ్రెస్‌ పార్టీ అయినా బిజెపి అయినా తెలుగు దేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె, అన్నా డిఎంకె ఏదైనా కావచ్చు. ఎవరు అధికారంలో వుంటే వారిని వ్యతిరేకిస్తారు. అందువలన నరేంద్రమోడీ కనుక వ్యతిరేకిస్తున్నారు అనేది తప్పుడు ప్రచారం, ఎదురుదాడి మాత్రమే. కార్మికులు లేదా వారికి మద్దతు ఇస్తున్న వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర శక్తులు సంస్కరణలను వ్యతిరేకించటం లేదు. ప్రజా వ్యతిరేక అంశాలనే ప్రతిఘటిస్తున్నాయి. అది తగినంత లేని కారణంగా ఫలితాలు కనిపించటం లేదు, పాలకులు మరిన్ని దారుణమైన చట్టాలను రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ వుపసంహరణ, వడ్డీ రేటు విషయంలో వామపక్షాలు, కార్మిక సంఘాలతో నిమిత్తం లేకుండానే ఎక్కడిక్కడ కార్మికుల్లో తలెత్తిన నిరసనకు భయపడే ఎన్‌డిఏ సర్కార్‌ వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. అంతెందుకు రాజకీయంగా బిజెపిని సమర్ధించే ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘమైన బిఎంఎస్‌ కార్మిక సంస్కరణలను, అనేక ప్రభుత్వ నిర్ణయాలను మాట మాత్రంగా అయినా వ్యతిరేకించకపోతే మనుగడ సాగించలేని స్ధితికి నెట్టబడిందా లేదా ? అంటే వ్యతిరేకించే వారిది గుడ్డి వ్యతిరేకత కాదన్నది స్పష్టం. అది గోబెల్స్‌ ప్రచారమే. కమ్యూనిస్టు చైనాలో సంస్కరణలను ఆమోదించి, ఇక్కడ వ్యతిరేకిస్తారెందుకు ? దీనికి సమాధానం పెద్ద కష్టమేమీ కాదు. మరొక వ్యాసంలో దాని గురించి చర్చిద్దాం. ఇక్కడ ఒక ప్రశ్న. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగమైన బిజెపి ప్రతిపాదిస్తున్న లేదా అమలు జరుపుతున్న సంస్కరణలను ఇతర విభాగాలైన బిఎంఎస్‌,స్వదేశీ జాగరణ మంచ్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. ఒక కుటుంబంలోని కొంత మంది సభ్యులే వ్యతిరేకిస్తున్నపుడు బయటివారి వ్యతిరేకత గురించి వేలెత్తి చూపే హక్కు వుందా ? చైనాలో సంస్కరణల గురించి చెప్పేవారు వాటితో పాటు అక్కడ కార్మికులకు ఇచ్చిన హక్కులు, ఇతర సౌకర్యాల గురించి మాట్లాడరేమి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పప్పుల కోసం నరేంద్రమోడీ విదేశీ యాత్రలా ?

20 Monday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Availability of Pulses, Modi, pulse prices, Pulses

పప్పులో నీళ్లు కలిపి తినమంటున్న రామ్‌దేవ్‌

ఎం కోటేశ్వరరావు

     ఈ శీర్షికను చూసి ప్రధాని నరేంద్రమోడీ వీర భక్తులు, కాషాయ దేశభక్తులు కోపం తెచ్చుకోవద్దని మనవి.అంధుల రాజ్యంలో ఒంటి కన్నువాడు మహారాజు అని రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఏ చిత్తంతో అన్నారో గానీ మోడీగారి పాలన రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. సలహాలు ఇచ్చేవారు కూడా అపూర్వ మేథాసంపన్నులుగా వున్నట్లున్నారు. పప్పుల ధరలు చుక్కలు చూపిస్తున్న ఈ రోజుల్లో మా కాలంలోనే పప్పులతో ముఖం కడుక్కొని పప్పులతో స్నానం చేసి పప్పులలోనే నిద్రపోయే వారం అని పిల్లలకు రాత్రి పూట పిట్ట కధలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందా ? ఏమో ! ‘పప్పుల ధరల అదుపుకు మోడీ ఆఫ్రికా దేశాల పర్యటన’ ఇది ఒక ఆంగ్ల వార్త శీర్షిక.http://indiatoday.intoday.in/story/modi-to-visit-african-countries-to-check-racing-pulse-prices/1/695912.html

       మేకిండియా పిలుపును అమలు చేసేందుకే మా ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం విదేశీ పర్యటనలు చేస్తున్నారని భజన బృందం చెబుతుంటే కామోసనుకున్నాం. ఇప్పుడు పెట్టుబడుల కోసమే కాదు, పప్పుల కోసం వెళుతున్నారని మనం చెవులప్పగించి వినాలి కాబోలు.కోరి తలమీద పెట్టుకున్నాం కనుక తప్పదేమో మరి ! పట్టణాలలో కొన్ని పప్పుల ధరలు గరిష్టంగా 180 నుంచి 200 రూపాయల వరకు వున్నాయి.గ్రామాలలో అందునా మారు మూల గ్రామాలలో ఇంకా ఎక్కువ వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. మంచి రోజులు రానున్నాయని చెప్పటానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు తప్ప పప్పులుడికేందుకు చర్యలు లేవు. ప్రధాని నరేంద్రమోడీ జూలై తొలి వారంలో ఆఫ్రికా దేశాల పర్యటన జరుపుతున్నారు.ఆయనతో పాటు సీనియర్‌ అధికారుల బృందం వెళ్లి ఆఫ్రికా ఖండ దేశాలలో ప్రయివేటు వారితో కాంట్రాక్టు సాగు పద్దతిలో పప్పులు పండించేందుకు, పప్పులను దిగుమతి చేసుకొనేందుకు గల అవకాశాలను పరిశీలించి వస్తారని అధికారులే చెప్పినట్లు వార్తలు. పెట్టుబడుల కోసం మోడీయే విదేశాలు తిరిగి, పప్పుల కోసమూ ఆయనే వెళ్లాల్సి రావటం అంటే అధికారులు మోడీ మెప్పు పొందేందుకు, ఆయనను మెప్పించేందుకు ఇలా చేస్తున్నారా లేక సంబంధిత మంత్రులు వుత్సవిగ్రహాలా ?

   విజయమాల్య వంటి రుణ ఎగవేతదారులు తామరతంపరగా పుట్టుకు వస్తున్నారు, వారిపై నిఘావేయటానికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి), ఐబి, రెవెన్యూ ఇంటెలిజన్సు విభాగాలకు సిబ్బంది చాలని పరిస్థితులో పప్పులపై ఒక కన్నేసి వుంచమని కూడా ప్రభుత్వం చెప్పిందట. మన దేశంలో ఏటా పదిలక్షల టన్నుల పప్పుల వినియోగం పెరుగుతున్నదని అంచనా, ప్రస్తుతం ఏటా 24మిలియన్‌ టన్నులు అవసరం కాగా నాలుగు లక్షల టన్నుల వరకు దిగుమతులు చేసుకుంటున్నాం.

   ప్రపంచ పప్పుల సంవత్సరంగా 2016ను ప్రకటించారు. మన వినియోగదారులకు పప్పుల షాక్‌ కూడా ఈ సంవత్సరమే తగలటం విశేషం. పప్పుల వినియోగం, కొరత గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నా ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఏం చేసిందన్నది ఒక ప్రశ్న. (వుత్పత్తి, దిగుమతి మిలియన్‌ టన్నులలో, ఖర్చు కోట్ల రూపాయలలో, వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ఆధారంగా )

సంవత్సరం    వుత్పత్తి       దిగుమతి       దిగుమతి ఖర్చు

2012-13       18.34          4.02             13,357

2013-14        19.27         3.18             11,038

2014-15        17.15         4.00             14,396

2015-16        17.33         5.50             24,198

     పై అంకెలను చూసినపుడు ఏటేటా పెరుగుతున్న వినియోగం, తగ్గుతున్న వుత్పత్తికి అనుగుణంగా దిగుమతులు లేవన్నది స్పష్టం. 2015-16 సంవత్సరానికి సంబంధించి వుత్పత్తి అంకెలు అంచనా మాత్రమే. దేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాభావం, కరవు కారణంగా వుత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని మనకు కనిపిస్తున్నా ప్రభుత్వం గొప్పకోసం వుత్పత్తి పెరుగుదల అంచనా చూపింది. రెండవది 2012-13 సంవత్సరాలలో టన్ను రు 33వేల చొప్పున దిగుమతి చేసుకుంటే గతేడాది 43వేలకు పెరిగింది. మన పప్పుల వుత్పత్తి తగ్గిపోయిన విషయం గమనంలో వున్న కేంద్రం లేదా రాష్ట్రాలు గానీ అవసరమైన దిగుమతులను చేసుకోని కారణంగానే, అనేక చోట్ల నిల్వలన్నీ అయిపోవటాన్ని అవకాశం తీసుకున్న వాణిజ్యశక్తులు ధరలను అనూహ్యంగా పెంచివేశాయి. వారిని అదుపు చేసేందుకు, దొంగ నిల్వలను పట్టుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ కనపడదు.

    ఆఫ్రికా ఖండంలో పప్పులను పండించి దిగుమతి చేసుకొని ధరలను తగ్గిస్తామని కేంద్రం చెబుతుంటే దానికి గట్టి మద్దతుదారుగా స్వయం ప్రకటిత బాబా రామదేవ్‌ ఏ చిట్కా చెప్పారో తెలుసా. న్యూఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాదులో యోగా శిక్షణలో పాల్గొన్న సందర్బంగా మాట్లాడుతూ పప్పుల ధరల పెరుగులకు నరేంద్రమోడీని విమర్శించకూడదని సెలవిచ్చారు. పోనీ అంతటితో ఆగితే ఫరవాలేదు, ఈ సమస్యను అధిగమించటానికి పప్పులో నీళ్లెక్కువ పోసుకొని తింటే పొదుపు చేసి ఖర్చుకు ఖర్చు, పెంచుకున్న ఒళ్లు తగ్గి ఆరోగ్యానికి ఆరోగ్యమూ అని కూడా వుద్భోదించారు. అంటే కోడిగుడ్డంత బంగారం లేనివారెవరూ ఈదేశంలో లేరన్నట్లుగా పప్పులు ఎక్కువగా తిని జనమంతా వూబకాయాలను పెంచుకున్నారని గౌరవనీయులైన రామదేవ్‌ బాబా అనుకుంటున్నారా ? ప్రపంచ ఆరోగ్య సంస్ధ సిఫార్సు ప్రకారం మన దేశంలో ప్రతి ఒక్కరూ రోజుకు సగటున 80గ్రాముల పప్పులు తినాల్సి వుంది. మనదేశంలో సగటు లభ్యతే 40 గ్రాముల లోపు వుంది. అసలు పప్పుల ముఖం చూడనివారు కూడా వున్నారంటే ఆశ్చర్యం లేదు.

     రామ్‌దేవ్‌ ఇలా సెలవిస్తే మన కేంద్ర ఆహార మంత్రి మాననీయ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ గారు ధరల పెరుగుదల గురించి ఆశ్చర్యపోతున్నారట. పప్పులను పండించేందుకు లేదా దీర్ఘకాలిక దిగుమతులు చేసుకొనేందుకు గాను మయన్మార్‌,మొజాంబిక్‌ దేశాలకు ప్రతినిధులను పంపుతున్నామని చెప్పారు.ఇదెలా వుందంటే దాహంతో చస్తున్నామయ్యా అంటే దేశంలో అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఇంటికీ మంచినీటి నల్లా ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నాం అని చెప్పినట్లు వుంది.పరిస్థితి ఇంత తీవ్రంగా మారుతున్నపుడు పర్యవేక్షణ చేసే యంత్రాంగం, వారిని నడిపించాల్సిన మంత్రులు ఇంతకాలంగా ఏ గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? దేశంలో టమోటాలు, బంగాళాదుంపలు, వుల్లిపాయల వుత్పత్తి గణనీయంగా పెరిగింది, వినియోగంలో మార్పు లేదు అయినా ధరలు పెరిగాయంటే దీనికి పుకార్లే కారణం అని కూడా పాశ్వాన్‌ సెలవిచ్చారు. పుకార్లను తొలగించటానికి ప్రభుత్వ యంత్రాంగం నమో భజనలో వందోవంతైనా ప్రచారంలో స్ధానంలో కల్పించలేదేం?

     మన పొరుగు దేశం పాకిస్థాన్‌ మంత్రి మరొక మహత్తర సలహా ఇచ్చారు. పప్పుల కంటే కోడి మాంసం ధర తక్కువగా వుంది కనుక దాన్ని తినండన్నారు. అక్కడ కిలో పప్పులు రు.260 వుంటే కోడి మాంసం రు.200లకే దొరుకుతోందట. ఇవేమి ధరలయ్యా బాబూ అని అక్కడి ప్రతిపక్షాల వారు అడిగితే ఈ సలహా ఇచ్చారు.

     మన దేశంలో ఎకరానికి 750కిలోల పప్పుల దిగుబడి వుంటే అభివృద్ధి చెందిన దేశాలలో 1200 నుంచి 1800 కిలోల వరకు వుంది. దీనికి తోడు గత రెండు సంవత్సరాలలో రూపాయి విలువను దిగజార్చిన ప్రభుత్వ విధానాల కారణంగా దిగుమతి చేసుకొనే పప్పుల ధరలు కూడా పెరుగుతున్నాయి. కేంద్రమంత్రులతో కుమ్మక్కయిన వ్యాపారుల సిండికేట్లు ఆఫ్రికా నుంచి కిలో 55 రూపాయలకు పప్పులను దిగుమతి చేసుకొని మన దేశంలో 175 రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకొన్నట్లు, దానిలో మోడీకి ఎల్లవేళలా అండదండలుగా వుండే అదానీ వంటి వారు వున్నట్లు వచ్చిన వార్తలను ఇంతవరకు ప్రభుత్వం ఖంచించినట్లు మనకు తెలియదు.పప్పుల దిగుమతికి అదానీ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది.http://www.indiasamvad.co.in/investigation/inside-story-how-rs-55-per-kilo-african-dal-was-sold-in-india-for-rs-175-7853 అదానీ రేవులలో దిగుమతి చేసుకున్న పప్పులను నిలవ చేసి దాచివేశారని కూడా ఆరోపణలు వున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d