• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Politics

చంద్రబాబును ఆవహించిన గురజాడ గిరీశం !

21 Wednesday Dec 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

chandrababu naidu, Demonetisation, demonetisation worries, gurajada girisam

ఎంకెఆర్‌

    డామిట్‌ కథ అడ్డం తిరిగింది. పెద్ద నోట్ల రద్దు గురించి చంద్రబాబు నాయుడు కొత్త పల్లవి అందుకున్నారు. ‘ఓపినీయన్స్‌ అప్పుడప్పుడూ చేంజ్‌ చేస్తుంటేనే కానీ పొలిటీషియన్‌ కానేరడు !'( అభిప్రాయాలను అప్పుడప్పుడూ మార్చుకుంటూ వుంటేనే కానీ రాజకీయవేత్త కానేరడు) గురజాడ అప్పారావు పంతులు గారు గిరీశం పాత్ర ద్వారా ఎంత చక్కగా చెప్పారు. 1862-1915 మధ్య కేవలం 53 సంవత్సరాలు మాత్రమే జీవించిన గురజాడ ఆ నాటి రాజకీయ నేతల తీరు తెన్నులను చూసే అలాంటి వ్యాఖ్య చేశారంటే నేడే గనుక ఆయన వుండి వుంటే బాబోయ్‌ ఇంకేమైనా వుందా !

    ‘ ఒక ప్రముఖ రచయిత రాసిన ప్రతిదానినీ మెచ్చుకోవాలని నమ్మే అలవాటు తెలివి తక్కువ వారికి వుంటుంది. నా వరకైతే నాకు సంతృప్తినిచ్చే దానినే నేను చదువుతాను మరియు నా అభిరుచులకు తగినదానినే అభిమానిస్తాను’ అన్నాడు ప్రముఖ ప్రెంచి రచయిత ఓల్టేర్‌. చంద్రబాబు, నరేంద్రమోడీ నోటి నుంచి ఏది వస్తే అదే ప్రామాణికం అని నమ్మేవారు ఈ మాటలు తమకు ఎంతవరకు సరిపోతాయో ఆలోచించుకోవటం మంచిది. పెద్ద నోట్ల రద్దు గురించి కేంద్రానికి సిఫార్సు చేసిందే తానే అంటూ కేంద్రానికి రాసిన లేఖ గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చి నరేంద్రమోడీ ప్రశంసలు అందుకొనేందుకు ప్రయత్నించటాన్ని లోకమంతా చూసింది. ఇప్పుడు ఆ నిర్ణయం తెచ్చిన సమస్యలు, పర్యవసానాలను చూసి పెద్ద నోట్ల రద్దు తాను కోరుకున్నది కాదని, తలెత్తిన సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలియటం లేదని రోజంతా ఆలోచించినా తట్టటం లేదని సెలవిచ్చారు. బ్రూటస్‌ నువ్వు కూడానా ! అని స్నేహితుడిగా వుండి వెన్నుపోటు పొడిచిన బ్రూటస్‌ గురించి రోమన్‌ చక్రవర్తి జూలియస్‌ సీజర్‌ వాపోయినట్లుగా బహుశా గత రాత్రి నరేంద్రమోడీ కూడా ఒంటరిగానో లేక అమిత్‌ షా, వెంకయ్య నాయుడి వంటి తన నీడలను పిలిపించుకొనే చంద్రబాబు నాయుడి గురించి అనుకొని వుండి వుండాలి.

    సరే చంద్రబాబు నాయుడంటే పోలవరం తాత్కాలిక డామ్‌ మట్టి తీయిస్తూ, కాంక్రీట్‌ పోయిస్తూ ఆ పనేమీ లేకపోతే నేను నిదురపోను మిమ్మల్ని నిదురపోనివ్వనంటూ అధికారులతో ఏదో ఒక ప్రయోజనం లేని దాని గురించి సమీక్షపేరుతో తీరిక లేకుండా వుండి వుంటారనుకుందాం. లక్షల రూపాయల ప్రజాధనం పందారం చేస్తూ ఆయన నియమించుకున్న సలహాదారులేం చేస్తున్నట్లు ? రాజు మెచ్చిందే రంభ అన్నట్లుగా చంద్రబాబు మనసెరిగి నోట్ల రద్దు అంతా సజావుగానే జరిగిపోతుందంటూ, వాస్తవ పరిస్థితిని వివరించకుండా తప్పుదారి పట్టించి వుంటారా ?

      ‘నోట్ల రద్దు చిన్న ప్రయోజనాల కంటే మోడీ వ్యూహం ఎంతో సాహసోపేతమైనది’ అనే శీర్షికతో ఆర్‌ జగన్నాధన్‌ అనే ఆయన భక్తుడు ఒకరు రాసిన వ్యాసంలోని అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. నోట్ల రద్దు వలన ఎంతో మేలు జరుగుతుంది, దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనం అని ఇప్పటికీ ఒకవైపు ప్రచారం సాగుతుంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఈ భక్తుడు రాసిన దానికి చిన్న ప్రయోజనాలని పేరు పెట్టటం అంటే ముందే చెప్పాం కదా అని ఎదురుదాడి చేసేందుకే. నోట్ల రద్దుతో జనం ఇబ్బందులపై మీడియా వార్తలతో ఇబ్బంది పడిన భక్తులు భజన బాణీ మార్చారు. మోడీ ఏదో పెద్ద పధకంతోనే ఈ పని చేశారంటూ కొత్త పాట అందుకున్నారు. ‘నోట్ల రద్దు వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో విజయం కోసం కాదు, అది జరిగితే అదొక ప్రయోజనకరమైన బోనస్‌ అవుతుంది. ఆయన రాజకీయ లక్ష్యాలు అసాధారణమైనవి. అధికారానికి వచ్చిన వెంటనే నల్లధనంపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.2015లో విదేశీ ఆస్థుల గురించి తొలి స్వచ్చంద వెల్లడి పధకాన్ని ప్రకటించారు.అరవై శాతం పన్ను విధించటంతో అది విఫలమైంది. దాని గురించి గుణపాఠం తీసుకొని ఆదాయ వెల్లడి పధకం (ఐడిఎస్‌) ప్రారంభించారు. సెప్టెంబరులో ముగిసిన దానిలో రు.67,382 కోట్ల మేరకు ప్రకటన చేయించగలిగారు. వాయిదాల పద్దతిలో దానిలో 45శాతం మేరకు వసూలు చేస్తారు.( హైదరాబాదులో ప్రకటించి చేతులెత్తేసిన పదివేల కోట్ల రూపాయల ఆస్థిపరుల వంటి వారు ఇంకా ఎందరున్నారో తెలియదు).తరువాత బినామీ లావాదేవీల నిషేధ సవరణ చట్టాన్ని నోట్ల రద్దుకు కొద్ది రోజుల ముందు నోటిఫై చేశారు. జనం తమ వద్ద వున్న సొమ్మును బ్యాంకులలో డిపాజిట్‌ చేయటాన్ని చూసి పన్నుల చట్టాన్ని సవరించింది. దాని ప్రకారం దాచుకున్న సొమ్మును వెల్లడిస్తే 50శాతం పన్ను వసూలు చేసి, 25శాతం మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా నాలుగు సంవత్సరాల తరువాత చెల్లించే విధంగా ఒక పధకాన్ని ప్రవేశపెట్టారు.అది కూడా పనిచేయకపోతే నగదును మరింత తక్కువ చేసేందుకు, మరింతగా డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధవైపు నడిపించేందుకు లక్ష్యాన్ని మార్చారు. పరిశుద్దులయ్యేందుకు ఇవన్నీ ప్రతి వారికి ఒకటికి రెండు అవకాశాలు ఇవ్వటం, అలా చేసే వారికి వేధింపులు లేకుండా చూడటం, ఎన్నో ప్రయోజనాలు లేకుండా బిజెపికి పునాది వంటి మద్దతుదారులైన వాణిజ్య, వృత్తిదారుల ఆగ్రహానికి గురిఅయ్యేందుకు కూడా సిద్ద పడి ఒక రాజకీయ నాయకుడు ఈ సాహసం చేయరు.’ ఇలా జనానికి ఆగ్రహం కలగకుండా మంచి రోజులు ముందున్నాయని నమ్మించేందుకు చేసిన ప్రయత్నమిది అని వేరే చెప్పనవసరం లేదు. చంద్రబాబు రాజకీయ నాయకుడు కనుక ఎటుబోయి ఎటు వస్తుందో అన్న ముందు జాగ్రత్తతో నోట్ల రద్దు తన సలహా వల్లనే జరిగిందని తొలి రోజుల్లో చెప్పుకున్నారు తప్ప తరువాత క్రమంగా అసంతృప్తిని వెల్లడించటం ప్రారంభించారు. తీరా ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. దీనిలో అయినా నిజాయితీ వుందా ? లేక ఆగ్రహిస్తున్న జనాన్ని దువ్వేందుకా ? కారణం ఏదైనా చంద్రబాబును గురజాడ గిరీశం ఆవహించినట్లు కనిపిస్తోంది. అందుకే ఒపీనియన్‌ను చేంజ్‌ చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లు – చెల్లని పాత నోట్లు !

18 Sunday Dec 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Telangana

≈ Leave a comment

Tags

demonetised notes, Pawan kalyan, pawan kalyan tweets

Image result for pawan kalyan tweets

ఎంకెఆర్‌

      అన్నా పవర్‌ స్టారన్నా మీ అభిమానిగా నా ఆందోళన, ఆవేదనదాచుకోలేక ఈ లేఖ రాస్తున్నా. మీ సెక్రటరీలు లేకపోతే సలహాదారులతో ట్వీట్లు ఇప్పించినట్లు కాకుండా నువ్వే స్వయంగా చదువుకో అన్నా, లేకపోతే నిన్ను తప్పుదారి పట్టించే అవకాశం వుంది. ట్వీట్ల ద్వారా అనేక విషయాల మీద మా అన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నాడని తెలిసి అభిమానులం అందరం పొంగిపోయాం. ఇదేంటన్నా అట్టర్‌ ప్లాఫు సినిమాల మాదిరి తుస్సు మంటున్నాయి. ఒక సినిమా ఫట్టయి డబ్బాలు వెనక్కు తిరిగి వస్తే తరువాత మరో డైరెక్టర్‌తో హిట్టు సినిమా తీసి అభిమానులను అలరించటం తెలిసిందే. ఈ మధ్య నీ రాజకీయ సినిమాలన్నీ ఓపెనింగ్‌ కలెక్షన్ల తరువాత మరుసటి రోజు నుంచి జనం చూడటం లేదని నీకూ తెలిసి వుండాలి కదా అన్నా. అయినా రాజకీయ డైరెక్టర్లను మార్చినట్లు కనిపించటం లేదు. ఇలాగయితే అభిమానులం ఏం కావాలో తెలియటం లేదన్నా.

    ఎప్పుడో ఏడాది క్రితంనాటి విషయాలపై మీ స్టారు ఇప్పుడు ట్వీట్లు ఇస్తున్నాడు పవర్‌, పంచ్‌ తగ్గిపోయిందా, ఇప్పటి విషయాల మీద ఏడాది తరువాత ట్వీటుతాడా అని చివరికి బిజెపి వారు కూడా ఎగతాళిగా అంటున్నారన్నా. మాకు తలతీసేసినట్లయింది. ఓడ ఎక్కేంత వరకు ఓడ మల్లయ్య దిగింతరువాత బోడి మల్లయ్య అన్నట్లుగా పద్దతి తప్పితే ఎంతలో ఎంత మార్పో చూడన్నా ! ఇప్పుడు అటు బిజెపి, తెలుగుదేశం వారూ పట్టించుకోవటం లేదు, ఇటు వాటిని వ్యతిరేకించే వారూ నమ్మటం లేదు. దేశమంతా నరేంద్రమోడీ రద్దు చేసిన పెద్ద నోట్ల కంటే ఎక్కువ నగదు బ్యాంకుల్లో జమ అవుతుందా లేదా అని పందాలు కడుతూ డిసెంబరు 30 కోసం అందరూ అటువైపే చూస్తుంటే నువ్వేంటన్నా ఏడాది క్రితపు విషయాల మీద ఇప్పుడు స్పందిస్తున్నావు. అప్పుడు మరచిపోయావా, లేకపొరపాటున ఇప్పుడిచ్చావో తెలియటం లేదన్నా. వాటిని చెల్లని పాతనోట్లని చిన్న పిల్లాడు కూడా పట్టించుకోవటం లేదన్నా !

    పెళ్లి మంత్రాలు పెళ్లికి-తద్దినపు మంత్రాలు తద్దినానికి చదవాలన్నట్లుగా సందర్భాన్ని బట్టి కదన్నా స్పందించాల్సింది? చిన్నపుడు మా పిసినారి అమ్మమ్మ లడ్లు, కారప్పూస నెలల తరబడి దాచి చివరికి ఎప్పుడో పిల్లలికి పెడితే ఆమె చూడకుండా బయటపడేసి పారిపోయేవారు. మా కాటమ రాయుడికి అలాంటి సలహాలు ఇచ్చే నిపుణులెవరో గానీ వెతికి పట్టుకొని వీరతాళ్లు వేయాలని మన వారంతా సిద్ధం అవుతున్నారన్నా.

     రెండున్నర సంవత్సరాలయినా సాధించిన పెద్ద విజయమిది అని చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేక వుత్తర ప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రాలలో ఓటర్ల ముందుకు ఎలా పోవాలా అని తలలు పట్టుకొని నరేంద్రమోడీ- అమిత్‌ షా ఒకరి గడ్డాన్ని మరొకరు ు నిమురు కుంటుంటే ఒక అర్దరాత్రి పెద్ద నోట్లు రద్దు ఆలోచన వచ్చినట్లు మన పవర్‌ స్టార్‌కు ఈ ఆలోచన ఏ సమయంలో వచ్చిందో అని జనం గుసగుసలాడుకుంటున్నారన్నా. ట్వీట్లతో బిజెపి మీద పేలుస్తున్న షాట్లు అరవై ఏండ్ల తరువాత వెనుకటి కెవడో అమ్మా అని అరిచాడన్నట్లుగా వుందిరా అబ్బాయ్‌ అని మా మాస్టారు అన్నారు. అసలేమీ మాట్లాడని వారి కంటే ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడటం మంచిదే కదా అని సమర్ధించాం అనుకో.

     ఒక చిన్న సందేహమన్నా మనం జన సేన రాజకీయ పార్టీని పెడుతున్నట్లా లేనట్లా ? లేక సినిమా టైటిల్‌ రిజిస్టరు చేసి దశాబ్దాలు గడిచినా తీయకుండా వున్నట్లుగా వుంటామా ? వేముల రోహిత్‌ ఆత్మహత్యకు కారకులు బిజెపి వారన్నది మీ ట్వీట్‌ అర్దం అని మేము అనుకుంటున్నాం . రోహిత్‌ వంటి వారు ఆత్మహత్యకు పాల్పడకుండా ఎలా చూడాలా అన్నది ఆలోచించాల్సింది పోయి బిజెపి వ్యతిరేక పార్టీలు ఆ వుదంతం నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తే బిజెపి , దాని మిత్ర పక్షాలు రోహిత్‌ దళితుడు కాదని నిరూపించేందుకు ప్రయత్నించాయని మీరు విమర్శించారు. ఈ తర్కం మీ పికె బుర్రలో పుట్టిందా లేక తెలివి తక్కువ మేథావుల నుంచి అరువు తెచ్చుకున్నదా అని ఇక్కడ అడుగుతున్నారన్నా.మీ పీకె అంత పోటు గాడయితే ఎన్నికల సమయంలో బిజెపి-తెలుగుదేశం భుజాలెక్కి, తరువాత అప్పుడప్పుడు సినిమాలు లేనపుడు, కాల్షీట్లు ఖాళీగా వున్నపుడు ఇలా వచ్చి అలా పోవటం తప్ప పీకిందేమిటి అని అడుగుతూ మీకంత సీన్‌ లేదంటున్నారన్నా !

    తప్పును తప్పుగా ఖండించటం తప్పయితే రోహిత్‌ బలవన్మరణం చెందిన పదకొండు నెలల తరువాత అదీ ఆ సమస్యపై జనం మరచి పోయిన తరువాత పికె ఇప్పుడు తప్పుపట్టటం ద్వారా మీ జనసేన పార్టీ ఏ రాజకీయ ప్రయోజనం ఆశిస్తోంది? తమను దోషులుగా చూపిన పార్టీలపై బిజెపి కూడా ఇదే మాదిరి ఎదురు దాడి చేసింది, దానికి పికె ఆరోపణకు తేడా ఏమిటి ? పోనీ ఇతర పార్టీలను తప్పుపట్టిన మీ నేత ఆత్మహత్యలకు పాల్పడకుండా ఏం చేయాలో ఇంతకాలం తరువాత కూడా ఎందుకు చెప్పలేదు? ఇలాంటి ప్రశ్నలతో జనం మా తలంటుతున్నారన్నా ? మాక్కూడా నిజమే కదా అనిపిస్తోంది. అవు, నోట్ల రద్దు, ఏపికి ప్రత్యేక హోదా ఇలా ఏ సమస్యపై అయినా ఎవరైనా విమర్శిస్తే అధికారంలో వున్న పార్టీలన్నీ రాజకీయ లబ్దికోసమే వీటిపై విమర్శలు చేస్తున్నాయనే కదా ఎదుటి పక్షాలపై దాడి చేస్తోంది. దేశం మీకేమిచ్చిందని కాదు ఆడగాల్సింది దేశానికి మీకేమిచ్చారని ఆలోచించుకోవాలన్నట్లుగా ఇలాంటివన్నీ ప్రత్యర్ధులను నోరు మూయించటానికి అధికారపార్టీ ప్రయోగించే అస్త్రాలు. రాజకీయాలలో ఇవన్నీ పాతబడి తుప్పు పట్టిన ఆయుధాలన్నా !

   రాజకీయాలలోకి రాదలచుకుంటే ఎప్పటికప్పుడు స్పందించాలి తప్ప ఆరునెలలకో, సంవత్సరానికో అయితే నలుగురూ నవ్వుతారన్నా, జరిగిందేదో జరిగింది. మీ ట్వీట్లకు మీడియా పెద్దగా స్పందించలేదని మీకు కూడా అర్ధం అయిందనుకుంటా ! ఇక ముందైనా వెంటనే స్పందిస్తేనే ఫలితం, ప్రయోజనం !!

మీ అభిమాని

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ అడుసు తొక్కారు ! కాళ్లు కడిగే విధము చెప్పండి !!

30 Wednesday Nov 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

demonetization, demonetization mesh, Modi, modi government

ఎం కోటేశ్వరరావు

    తాంబోలం ఇచ్చేశాను యిహ తన్నుకు చావండి అంటాడు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు, మా మోడీ అడుసు తొక్కారు, కాళ్లు కడిగే విధము చెప్పండీ అంటున్నారు నమో ప్రహసనంలో ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ .

    మొదటిది నాటకం. కరటకశాస్త్రి, ఆయన శిష్యుడు, మధురవాణి నాటకం ఆడి బాల్యవివాహాన్ని తప్పిస్తారు. కధను సుఖాంతం చేస్తారు. రెండవది వాస్తవం. ఎలా ముగుస్తుందో తెలియదు. అన్నింటికంటే ఎలా ముగించాలో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడికి ముందుగానే వుప్పందిన కారణంగా పెద్ద నోట్ల రద్దును రద్దు చేయాలని లేఖ రాసి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం పొందినట్లు అనుకుంటున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు తరువాత ఆ లేఖను చూపి ఆ ఖ్యాతిలో తమ నేతకు భాగముందన్నట్లుగా మీడియాలో ప్రచారం వచ్చేట్లుగా తెలుగుదేశం వారు మేనేజ్‌ చేశారు. రద్దుతో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు నగదు రహిత లావాదేవీలపై సూచనలు చేసే పేరుతో ఐదుగురు ముఖ్య మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయతలపెట్టినట్లు, దానికి చంద్రబాబు నాయుడిని సారధ్యం వహించమని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్‌జైట్టీ ఫోన్లో కోరినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

     కేంద్రం నుంచి అలాంటి ఆఫరు వచ్చినపుడు మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు ఎగిరి గంతేసి వుండేవారు.అనుకున్నదొకటి అయ్యింది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అన్నట్లుగా తగిన సన్నాహం, పర్యవసానాలను వూహించకుండానే నరేంద్రమోడీ నోట్ల రద్దును ప్రకటించేశారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే సర్వేల లోగుట్టు గురించి చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాంటపుడు నరేంద్రమోడీ తాను చేయించిన సర్వేలో నోట్ల రద్దుకు 93శాతం మద్దతు వుందని చెబితే నమ్మేంత అమాయకంగా చంద్రబాబు వుంటారా ? ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు, ఆ విషయాలలో, అలాంటి రాజకీయ చాణక్యంలో సరిలేరు నీకెవ్వరూ సరసాల సుధాకరా అన్నట్లుగా చంద్రబాబు పండిపోయారు. కేంద్రం ప్రతిపాదించిన కమిటీకి సారధ్యం వహించే విషయాన్ని కాదన్నట్లుగా చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేసే మీడియాలో వార్తలు వచ్చాయి. అవునంటే కాదనిలే అని ఆడవారి గురించి అనవసరంగా ఆడిపోసుకుంటారు గానీ చంద్రబాబు కాదు అన్నారంటే నరేంద్రమోడీ దగ్గర దేనికో టెండరు పెట్టి వుంటారని గుసగుసలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే నోట్ల రద్దు పర్యవసానాలపై తలుపు చెక్కతో కాకుండా తమలపాకుతో కొట్టినట్లుగా జనం కోసమైనా తన అసంతృప్తిని వెల్లడించారు. కేంద్రం వద్ద తన పలుకుబడిని వుపయోగించి రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో నోట్లు తెప్పిస్తా అన్నట్లు హడావుడి చేసి అవాక్కయ్యారు. ఇనుము బాగా కాలినపుడే దానిని కావలసిన విధంగా మలచుకొనేందుకు సుత్తి దెబ్బలు వేయాలి. నోట్ల రద్దు గురించి మాట్లాడటానికి పార్లమెంట్‌కు వెళ్ల కుండా ముఖంచాటేయటం ఒక బలహీనత. దానిని ప్రదర్శించిన మోడీని ఎలాంటి ప్రతిఫలం లేకుండా -అదేలెండి రాష్ట్ర అభివృద్ధికే సుమా- వూరికే ఆదుకుంటే ప్రయోజనం ఏముంటుంది ? అది పరిష్కారం అయితే ముఖ్యమంత్రుల కమిటీకి నేతృత్వం వహించటానికి చంద్రబాబు క్షణంలో సిద్దం అవుతారు.

    నోట్ల రద్దు పర్యవసానాల గురించి జనం అర్ధరాత్రుళ్లు ఎటిఎంల ముందు క్యూలు కడుతుంటే , బ్యాంకుల్లో తమ డబ్బును తాము తీసుకోవటానికి వీల్లేక జనం అవస్తలు పడుతుంటే వాటిని పరిష్కరించాల్సిన కేంద్రం దాని గురించి స్పష్టంగా చెప్పకుండా తక్షణమే నగదు రహిత బదిలీ గురించి సలహాలు చెప్పాలని ముఖ్య మంత్రుల కమిటీని ప్రతిపాదించటం అర్ధంలేని విషయం. నగదు రహిత లావాదేవీల గురించి ఎవరికీ అభ్యంతరం లేదు. దానికి తగిన పరిస్థితులు వున్నాయా లేవా అన్నదే సమస్య. దయ్యాలు తిరిగే సమయంలో ఒక నాయకుడికి ఒక ఆలోచన వస్తే తెల్లవారేసరికి దానిని అమలు జరపాలని పట్టుబడితే కుదరదు. అనేక అభివృద్ది చెందిన దేశాలలో ఇప్పటికీ నగదు లావాదేవీలు గణనీయంగా వున్నాయి. కొన్ని దేశాలలో ఇటీవలి కాలంలో అవి పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అందువలన తగిన సన్నాహాలు చేసుకొని చేయాల్సిన మార్పులను తొందరపడితే పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలే ఏర్పడతాయి. ముందు ప్రభుత్వంతో మొదలు పెట్టి దశలవారీగా అమలు జరిపి అవినీతిని అరికడితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

నీవు నేర్పిన విద్యయే కదా మోడీ !

     ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరగటంలో కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఎలాంటి తేడా లేదని తేలిపోయింది. ఓటింగ్‌కు అనుమతించే నిబంధన కింద చర్చకు అధికారపక్షం తిరస్కరించటంతో బుధవారం నాడు లోక్‌సభ పరిమితంగానే కార్యకలాపాలు చేపట్టి గురువారం నాటికి వాయిదా పడింది. గతంలో 2జి స్కామ్‌పై చర్చ సందర్భంగా ప్రధాని మన్మోహస్‌ సింగ్‌ సభకు హాజరై, ఓటింగ్‌కు అనుమతించే నిబంధనల ప్రకారం చర్చ జరగాలని బిజెపి పెద్దలు పట్టుపట్టారు. ఇప్పుడు వారు వీరయ్యారు. అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. పోయినోడే మంచోడనిపిస్తున్నారు. ఎలాగంటే అప్పుడు చర్చ అవినీతి గురించి కనుక కాంగ్రెస్‌ ప్రధాని సభకు రావటానికి సిగ్గు పడ్డారు, సమర్ధించుకోలేని దుస్థితిలో ఆపని చేశారు. ఇప్పుడు నరేంద్రమోడీ సభకు రావటానికి బిడియమెందుకు ? ఇదేమీ అవినీతి అంశం కాదే. నోట్ల రద్దును అవినీతి అని ఎవరూ అనటం లేదే ! ఓటింగ్‌ జరిగేందుకు వీలు కల్పించే నిబంధనల కింద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్‌లో పాలక కూటమికి పూర్తి మెజారిటీ వుంది. అయినా వ్యతిరేకిస్తున్నది. ఈ కారణంగా 16వ తేదీ నుంచి జరుగుతున్న వుభయ సభలలో ఈ అంశంపై ముందుకు సాగటం లేదు.ఒక వేళ ఓటింగ్‌ గీటింగ్‌ జరిగితే దాని వలన ప్రభుత్వం పడిపోయే పరిస్థితులేమీ లేవే ! నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఎవరైనా ఓటు చేస్తే ఎందుకు అలా చేశారో వారే చెప్పాల్సి వుంటుంది.

     తాను చేసిన నోట్ల రద్దుకు 93శాతం జనం మద్దతు పలికారని ప్రధానే స్వయంగా చెబుతున్నారు. వందకు రెండువందల మంది మద్దతు వుందనే వంది మాగధుల సంగతి సరేసరి. జనం మద్దతు లేకపోతే మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికలలో బిజెపి పెద్ద పార్టీగా ఎలా సీట్లు సంపాదించింది అని కొత్త పాయింటును దొరకబుచ్చుకున్నారు. జనం మద్దతు వుందా లేదా అన్నది తేలాలంటే ఆ సమస్య మీదే ఓటింగ్‌ జరగాలి. నోట్ల రద్దుతో తలెత్తిన జన ఇబ్బందులను ఎప్పటిలోగా తీరుస్తారు, ముందస్తు ఏర్పాట్లు లేకుండా ఇబ్బంది పెట్టే చర్య ఎందుకు తీసుకున్నారని కదా ప్రతిపక్షాలు అడుగుతోంది. ఏ పార్టీ అయినా నోట్ల రద్దును వ్యతిరేకించిందా ? లేదే ! దాని పర్యవసానాల గురించి అడగటానికి ప్రతిపక్షానికి అర్హత లేకపోతే పార్లమెంట్‌కు హాజరై ప్రభుత్వ వైఖరిని ప్రధాని నరేంద్రమోడీ వివరించాలి కదా ! పార్లమెంట్‌తో పని లేకుండా నరేంద్రమోడీ ప్రధాని కాలేదు, ఆయన లోక్‌సభా నాయకుడు. ప్రతిపక్షం చర్చకు అంగీకరిస్తే ప్రధాని సభకు వస్తారు అని పాలకకూటమి వాదిస్తోంది. ప్రధాని రాక నెపంతో పార్లమెంట్‌ను జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షానికి అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి ? జనం సొమ్మును ఎందుకు వృధా చేయాలి? యాభై రోజులలో అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని, ధరలు తగ్గుతాయని అనటం తప్ప నిర్ధిష్టంగా ఏదీ చెప్పటం లేదు. బంగారం ధరలు తగ్గాయి, జనం దానితో కడుపు నింపుకోలేరు కదా ! కడుపు నింపే పప్పుల ధరలు పెరిగాయి. అలాంటపుడు పాలకులు చెప్పే మాటలను జనం ఎలా నమ్మాలి ?

అత్తమీది కోపం దుత్తమీద చూపినట్లు

       అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు ( ఇది మహిళలను కించపరచటంగా భావించవద్దని మనవి ) చంద్రబాబు నాయుడు పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులకు బ్యాంకర్లపై నిందమోపి తన పరిధిని అతిక్రమించారు. మధ్యలో వారేమి చేస్తారు. ఒక చెక్కు తీసుకొని ఒక రోజు బ్యాంకుకు వెళ్లి వుంటే సిబ్బంది ఎంత వత్తిడితో గత కొద్ది రోజులుగా పని చేస్తున్నారో చంద్రబాబుకు తెలిసి వుండేది. రిజర్వుబ్యాంకు నోట్లు పంపితే కదా పంపిణీ చేసేది. తెలుగు నేలలో కొన్ని మీడియా సంస్ధలు ఒక కొత్త లాజిక్‌ను తయారు చేశాయి. అదేమంటే తెలుగుదేశం అధికారంలో వున్నపుడు తమకు మంచివి అనిపించిన అంశాలను చంద్రబాబు ఖాతాలో జమ చేయటం, వైఫల్యాలన్నింటికి అధికారులను బాధ్యులుగా చేసి వారి ఖాతాలో వేయటం. నోట్ల రద్దు పర్యవసానాలకు నరేంద్రమోడీ నిర్వాకాన్ని ఇంతవరకు ఒక్కసారి కూడా సానుకూలంగా కూడా విమర్శించలేదు. బ్యాంకర్లపై నిందలు మోపి, వారిపై వత్తిడి పెంచి ముఖ్యమంత్రి సాధించేదేమీ వుండదని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచబ్యాంకు ర్యాంకుల పోటీలో పాకిస్థాన్‌ కంటే వెనుకబడిన మోడీ !

30 Sunday Oct 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

anti globalization movement, Doing business rankings, globalization, India-Pakistan, Narendra Modi, WB Doing business ranking

ప్రపంచీకరణ – పర్యవసానాలు -1

ఎం కోటేశ్వరరావు

   ప్రపంచంలో నిత్యం అనేక అంశాల గురించి చర్చలు జరుగుతూనే వుంటాయి. చర్చ అంటేనే విరుద్ధ అంశాల మధనం. పురాణాలలో చెప్పిన దాని గురించి నమ్ముతున్నారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే నమ్మే వారు చెప్పిన క్షీర సాగర మధనం అమృతం కోసమే జరిపినప్పటికీ ఆ క్రమంలో అనేకం బయట పడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన మధనం ప్రపంచీకరణ లేదా దాని మరోపేరు సరళీకరణ ఫలితాలు, పర్యవసానాల గురించే అన్నది తెలిసిందే. నేతి బీరకాయలో నెయ్యి మాదిరి దానికి పెట్టిన పేరు వుదారవాదం. పెట్టుబడిదారీ విధానం దుష్టమైందన్న పేరు బాగా ప్రాచుర్యంలోకి రావటంతో ఎంతో తెలివిగా దాని పేరు మార్చారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ, ప్రపంచవాణిజ్య సంస్ధ ఇలా అనేకం ఏ పేరుతో పని చేసినా కార్పొరేట్ల లాభాలను, ఆ వ్యవస్ధను కాపాడే రూపాలు, ఆయుధాలే. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఎన్ని అవతారాలేత్తినా దుష్ట సంహారం కోసమే అని చెప్పినట్లుగా పెట్టుబడిదారులు కూడా కార్మికవర్గాన్ని దోచుకొనేందుకు వర్తమానంలో ఎత్తిన అవతారమే ప్రపంచీకరణ. దానిపై జరుగుతున్న మధనంలో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

   ప్రపంచబ్యాంకు 2017వ సంవత్సరానికి మనకు ప్రధానం లేదా దానం చేసిన వ్యాపార ర్యాంకు 131, అంతకు ముందు సంవత్సరం 130 వుంది.మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు బాధ పడి నట్లుగా మన ప్రధాని, కేంద్ర మంత్రుల పరిస్థితి తయారైందంటే అతిశయోక్తి కాదు. ఎలాగంటే మన దేశం ఒక ర్యాంకును మెరుగుపరచుకుంటే పొరుగుదేశం పాకిస్థాన్‌ 148 నుంచి 144కు పెరిగి నాలుగు స్ధానాల ఎగువకు వెళ్లింది. చైనా 80 నుంచి 78 కి పెంచుకొని తన స్ధానాన్ని మెరుగు పరుచుకుంది. దాంతో మన కంటే ఇతర దేశాలు మంచి సామర్ధ్యాన్ని ప్రదర్శించినట్లే అనే కొందరు చేసిన వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లయింది. తాను అనేక సంస్కరణలను చేపట్టినా ప్రపంచబ్యాంకు వాటిని ఎందుకు పట్టించుకోలేదు, గతేడాది కంటే మన ర్యాంకును గణనీయంగా ఎందుకు పెంచలేదు అని ప్రధాని నరేంద్రమోడీ ఒక రాత్రంతా తనలో తాను తెగ మధన పడిపోయారు. తన మంత్రులు, అధికారులతో కూడా మధించి నెలరోజుల్లో నివేదిక ఇమ్మని ఆదేశించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన ర్యాంకు వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ను మరింత కుంగదీసింది. రానున్న కొద్ది సంవత్సరాలలో మన ర్యాంకు 50కి చేర నుందని ఈ ఏడాది మే నెలలోనే ఆమె ఆనందంగా ఆశాభావం వెలిబుచ్చారు. తీరా దరిదాపుల్లో లేకపోవటంతో తీసుకున్న చర్యలన్నీ ప్రపంచబ్యాంకు విధించిన గడువులోగా అమలులోకి రానందున వాటిని పరిగణనలోకి తీసుకోలేదని, వచ్చే ఏడాది ర్యాంకులో ఫలితం కనిపిస్తుందని ట్వీట్‌ చేశారు.

మోడీ బృందం ఎందుకు భంగపాటుకు గురైంది ? నిజానికి ఈ ర్యాంకులు అంకెల గారడీ తప్ప మరొకటి కాదు. మన విద్యావిధానాల మాదిరి ఒకేడాది నిర్ణయించిన ప్రమాణాలు మరొక ఏడాది వుండవు. వాటికి ఇచ్చే మార్కులు కూడా అంతే. కొన్ని ర్యాంకుల తీరుతెన్నులను గమనించండి. నా చిన్న తనంలో గ్రామాలలో బుర్ర కథలు, హరికథల వంటి కళారూపాలను ప్రదర్శించే వారు తమకు మంచి భోజనాలు, భారీ ఎత్తున ధన ధాన్యాలతో సత్కారాలు పొందేందుకు ఏ వూరు వెళితే ఆ వూరి వారిని వుబ్చించేవారు. చుట్టుపక్కల 66 వూళ్లకు మీ వూరు పోతుగడ్డ అని చెప్పగానే నిజమే కావాలనుకొని ప్రతి వూరి వారూ నరేంద్రమోడీ చెప్పినట్లు రొమ్ములు చరుచుకొనే వారు. తమ వ్యాపారాలకు రాయితీలు పొందేందుకు, సులభంగా అనుమతులు సంపాదించుకొనేందుకు కాస్త రూపం మార్చి ‘పోతుగడ్డ’ టెక్నిక్‌ను వాడుతున్నారు.

ఆ క్రమంలో గత రెండున్నర సంవత్సరాలలో అనేక సంస్ధలు నరేంద్రమోడీ సర్కార్‌ను ఆకాశానికి ఎత్తుతున్నాయి. ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్‌ ఒక్కసారిగా 16 దేశాలను దాటి 39వ ర్యాంకుకు చేరినట్లు ప్రపంచ ఆర్ధిక వేదిక( డబ్ల్యుఇఎఫ్‌ ) ప్రకటించింది. చంద్రబాబు నాయుడు వంటి వారికి ఇదొక పవిత్ర స్ధలం. ప్రతి ఏటా వెళ్లి వచ్చి ఆర్భాటం చేస్తుంటారు. వెళ్లి రావటం ఒక ఘనతగా ప్రచారం చేసుకుంటారు. అవినీతి విషయంలో అవినీతి విషయంలో ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్ధ సూచికలో ఏకంగా భారత్‌ తొమ్మిది పాయింట్లను మెరుగుపరచుకుందని వార్తలు వచ్చాయి. http://timesofindia.indiatimes.com/india/Indias-ranking-on-global-corruption-index-improves/articleshow/45358144.cms  చిత్రం ఏమిటంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరునెలలు పూర్తి అవుతున్న సమయంలో ఈ ర్యాంకుల ప్రకటన జరిగింది. దాని ప్రకారం మన్మోహన్‌ సింగ్‌ అధికార చివరి సంవత్సరం 2013లో 94వ ర్యాంకులో వుండగా 2014లో 85వ స్ధానానికి మెరుగుపరచుకుంది. దీనికి మోడీ ప్రభుత్వం తీసుకున్న అవినీతి రహిత చర్యలే కారణమంటూ ఆయన భక్తులు బాపు సినిమా ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు ఏర్పాట్లను గుర్తు చేశారు. మరుసటి ఏడాదికి ఆ ర్యాంకు 76కు చేరింది. మరో తొమ్మిది ర్యాంకులను పెంచారు.http://www.transparency.org/cpi2015#results-table  ఇది ఆ సంస్ధ అధికారిక వెబ్‌సైట్‌ చిరునామా. దీని ప్రకారం 2012,13 మనకు వచ్చిన మార్కులు నూటికి 36, మోడీ హయాం 2014,15లో వచ్చినవి 38. ఇదే సమయంలో పాకిస్థాన్‌ 27 నుంచి 30కి పెంచుకుంది. మిగిలిన దేశాలలో అవినీతి పెరిగి మన ర్యాంకు మెరుగుపడింది తప్ప మన మార్కులు పెరిగి కాదన్నది స్పష్టం అవుతోంది.

ఇక కొత్త కల్పనల సూచిక వరుసగా ఐదు సంవత్సరాలు పడిపోతూ వున్నది కాస్తా 81నుంచి 2015లో 66కు పెరగటం కూడా నరేంద్రమోడీ ఘనతే అని చెప్పారు.http://www.dnaindia.com/money/report-india-s-rank-on-global-innovation-index-improves-to-66-2247413 కొత్త కల్పనలు రహస్యంగా వుండేవేమీ కాదు. దేశ ప్రజలకు తెలియకుండా అల్లా వుద్దీన్‌ అద్బుత దీపం ఏమైనా మోడీ సర్కార్‌కు దొరికిందా అన్న అనుమానం వచ్చింది. మంత్రులు చెప్పేది, మీడియాలో వచ్చే వార్తలు ఎలా వుంటాయో తెలుసు కనుక సంస్ధ అధికారిక వెబ్‌ సైట్‌ను ఆశ్రయిస్తే http://www.wipo.int/edocs/pubdocs/en/economics/gii/gii_2013.pdf ప్రకారం 2013లో మనకు వచ్చిన మార్కులు 36.17 శాతంగానూ ర్యాంకు 66గానూ దర్శన మిచ్చింది. దీంతో మరింత ఆసక్తి పెరిగి 2016 ర్యాంకింగ్‌ల కోసం చూస్తే దానిలో మన మార్కులు 33.61శాతానికి తగ్గినా ర్యాంకు మాత్రం 66గానే వుంది. ఇదే సమయంలో మన ఇరుగు పొరుగుదేశాల స్ధితి ఎలా వుంది అన్న సందేహం కలగటం సహజం కదా ! పాకిస్తాన్‌ 23.33 మార్కులు, 137 ర్యాంకు నుంచి 22.63 మార్కులు 119వ ర్యాంకుకు మెరుగు పడింది. ఇదే సమయంలో చైనా విషయానికి వస్తే తన మార్కులు 44.66, ర్యాంకు 35 నుంచి 50.57 ర్యాంకు 25 తెచ్చుకుంది.

వివిధ వసతుల కల్పనాంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచబ్యాంకు లాజిస్టిక్స్‌ సామర్ధ్య సూచికలను ప్రకటిస్తుంది.http://www.dnaindia.com/money/report-india-moves-up-to-35th-rank-on-world-bank-s-logistics-performance-index-2230168 దీని ప్రకారం 2014లో 54వ స్ధానంలో వున్నది కాస్తా 2016 నాటికి 35వ ర్యాంకుకు చేరిందని ప్రశంసలు కురిపించారు. ప్రపంచబ్యాంకు రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే వివరాల ప్రకారం 2007లో మన ర్యాంకు 39, మనకు వచ్చిన మార్కులు 3.07, 2012లో 46 -3.08, 2014లో 54 – 3.08, 2016లో 35 -3.42 వచ్చాయి. మార్కులలో పెద్ద తేడాలు లేకపోయినప్పటికి 2007-14 మధ్య ర్యాంకు 39 నుంచి 54కు పడిపోయింది. అందువలన ఈ ర్యాంకుల గురించి సంబరపడి, అది తమ సామర్ధ్యమే అని చెప్పుకుంటే అంతకు మించి జనాన్ని మోసం చేయటం మరొకటి వుండదు.

ఇక సులభతర వాణిజ్య ర్యాంకుల విషయానికి వస్తే 2007లో మనకు వచ్చిన ర్యాంకు 116 అక్షరాలా నూట పదహారు. అది 2014 నాటికి 142కు పడిపోయింది. ర్యాంకులు కేటాయించిన పద్దతిని ప్రపంచబ్యాంకు సవరించటంతో అది 134గా నిర్ధారణ అయింది. 2015 జూన్‌ నాటికి మన ర్యాంకు 130కి మెరుగు పడింది, తరువాత దానిని 131కి సవరించారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన ర్యాంకు 130 అంటే ఎదుగూ బొదుగూ లేకుండా వుండి పోయింది. ఇది జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యవేత్తలలో నరేంద్రమోడీ పలుకుబడిని తగ్గించేది లేదా అనుమానాలను రేకెత్తించేది కనుకనే నరేంద్రమోడీ, ఆయన మంత్రులు అంతగా కంగారు పడుతున్నారు.

    ప్రపంచీకరణ అంటే విదేశీ సంస్ధలు మన దేశంలో సులభంగా వ్యాపారం చేసుకొనే అవకాశాలను కల్పించటం, దానికి ప్రశంసగా ప్రపంచబ్యాంకు ఇచ్చే ర్యాంకుల పిచ్చి ముదిరి వాటి కోసం మన ప్రధాని, దానికి అనుకరణగా కేంద్రం ప్రవేశ పెట్టిన ర్యాంకు కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. అదింతటితో ఆగదు, మరిన్ని పర్యవసానాలకు దారితీస్తుందని గుర్తించాలి. ప్రపంచ పెట్టుబడిదారులకు మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా తెరిచేందుకు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోనున్నారు.

    ప్రస్తుతం ప్రపంచీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నది ఎవరు అంటే కొంత మంది విశ్లేషణ ప్రకారం ధనిక దేశాలలోని కార్మికవర్గం, దానితో పాటు అక్కడి పెట్టుబడిదారీ వర్గం అంటే అతిశయోక్తి కాదు. గతంలో వర్ధమాన, తృతీయ ప్రపంచ దేశాలలో ప్రపంచీకరణకు వ్యతిరేక గళాలు బలంగా వినిపించాయి, ఇప్పటికీ అడపాతడపా వినిపిస్తూనే వున్నాయి. అయితే గతం మాదిరి పెద్ద ఎత్తున లేవన్నది వాస్తవం. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా గతంలో మాదిరి సామాజిక వేదికల (సోషల్‌ ఫోరాలు) సదస్సులు ఇప్పుడు జరగటం లేదు, వెనుక పట్టు పట్టాయి. అవి సాధించిన విజయాలేమిటి ? వాటికి వున్న పరిమితులు ఎంతవరకు అన్న విషయాలను ఇక్కడ విశ్లేషించటం లేదు. మొత్తం మీద ప్రపంచీకరణ కోరుకున్న పెట్టుబడిదారులు, వారి సమర్ధకులదే పైచేయిగా వుంది, దానితో లాభాలు పొందవచ్చని కార్పొరేట్లు భావిస్తున్న కారణంగానే మరింతగా సంస్కరణల పేరుతో చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అందుకు నరేంద్రమోడీ సమర్ధకుడు అని భావించిన కారణంగానే గద్దెనెక్కించటమే గాక, తమ చేతులలో వున్న ప్రచార మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున వూదరగొడుతున్నారు. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరిగిన వుద్యమాలు సాధించిన ఫలితాలు, కార్మికులు కోల్పోయిన వాటి గురించి, పర్యవసానాల గురించి లోతుగా అధ్యయనం చేయాల్సి వుంది. కండ్లు లేనివారు ఏనుగును వర్ణించినట్లుగా ఎవరికి వారు తమ అనుభవంలోకి వచ్చిన అంశాల గురించి రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. వాటన్నింటినీ కొట్టి వేయలేము, అలాగని వాటినే అంతిమ నిర్ధారణలుగా అంగీకరించలేము. అందువలన ఆ పరిమితులకు లోబడి ఈ సందర్భంగా కొన్ని విషయాలను పాఠకుల దృష్టికి తెస్తున్నాను.

     కొద్ది నెలల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిపోవాలా వద్దా అనే విషయమై బ్రిటన్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. దానిలో ఎక్కువ మంది వైదొలగటానికే మొగ్గు చూపారు. సభ్య దేశాలపై పొదుపు చర్యల పేరుతో కార్పొరేట్ల లాభాలలో కోత పడకుండా చూసేందుకు ఐరోపా యూనియన్‌ రుద్దిన పొదుపు చర్యలకు జనంలో వ్యతిరేకత వ్యక్తం కావటంతో పాటు, ఒక యూనియన్‌లో వుండి దాని తరఫున ఒక సభ్య దేశంగా ప్రపంచ మార్కెట్‌ వాటాను పరిమితంగా పంచుకోవటం కంటే విడిగా వుండి ఎక్కువ వాటాను తెచ్చుకోవచ్చన్న బ్రిటన్‌ కార్పొరేట్ల వత్తిడికూడా ఈ నిర్ణయాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ముగిసిన ప్రచారంలో కూడా వాణిజ్యంపై చర్చకు పెద్ద పీట వేయటం, ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి అమెరికా బయటకు రావాలని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించటం, కెనడా-ఐరోపా యూనియన్‌ మధ్య చర్చలలో వున్న సమగ్ర ఆర్ధిక, వాణిజ్య ఒప్పందం(సిఇటిఏ) పట్ల వెల్లడౌతున్న వ్యతిరేకత ధనిక దేశాలలో ప్రపంచీకరణకు కార్మికవర్గం కంటే పెట్టుబడిదారీ వర్గంలోనే పెరుగుతున్న వ్యతిరేకతను సూచిస్తోంది. ఇది ఆయా దేశాల పారిశ్రామిక, వాణిజ్య సంస్ధల రక్షణాత్మక చర్యలకు దారితీస్తోంది. ధనిక దేశాల నుంచి ప్రారంభమైన ఈ క్రమం అన్ని దేశాలకు తరతమ తేడాలతో విస్తరించటం అనివార్యం.

    ఒక తత్వం ప్రకారం ఎప్పుడూ ప్రపంచీకరణ అనుకూలత, ప్రపంచీకరణ వ్యతిరేకత వ్యక్తమౌతూనే వుంటాయి. రుతువుల మాదిరి పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాంద్యాలు రావటం, దాని నుంచి ఏదో విధంగా బయట పడటం సైకిలు చక్రం మాదిరి ఒకదాని వెంట ఒకటి సంభవిస్తుంటాయి. దాని పర్యవసానాలు ప్రపంచీకరణ మీద పడతాయి. గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రపంచీకరణ పర్యవసానంగా ధనిక దేశాలలో నష్టపోయిన సాంప్రదాయ మధ్యతరగతి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో వుంది.లబ్ది పొందిన వారిలో ప్రస్తుతం ప్రపంచీకరణ విధానానికి వున్న పరిమితులు తమ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా ప్రదర్శించటానికి వీలు కల్పించటం లేదనే తరగతి కూడా అదే ధనిక దేశాలలో ప్రపంచీకరణను మరొక వైపు నుంచి విమర్శిస్తుంది. ప్రపంచీకరణ విధానాన్ని కనిపెట్టిన వారు దాని పర్యవసానాలను వూహించలేకపోయారు. ప్రపంచీకరణ ఆర్ధిక అసమానతలను జెట్‌ వేగంతో పెంచింది. ఫలితంగా వలసలు పెరిగిపోయాయి. వలసలకు ఇతర అనేక కారణాలు వున్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం ప్రపంచీకరణే. ఇది కొన్ని దేశాల నుంచి వలసలను పెంచితే మరికొన్నింటి నుంచి తగ్గించిందని కూడా వెల్లడైంది. శ్రమను కారుచౌకగా ఆమ్ముకొనే వలస కూలీలను ప్రోత్సహించటం కూడా ప్రపంచీకరణలో భాగమే అన్నది ఇక్కడ మరిచి పోరాదు. ధనిక దేశాలలో ప్రపపంచీకరణ తెచ్చిన అసంతృప్తికి, పేద దేశాల నుంచి సామూహికంగా వస్తున్న వలస కార్మికుల సమస్య అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.2008లో ప్రారంభమైన ధనిక దేశాల ఆర్ధిక మాంద్యం సమస్యను మరింత సంక్లిష్టం గావించింది. అనేక చోట్ల నిరుద్యోగం, దారిద్య్రం, వేతనాలలో కోతలు పెరిగిపోయాయి. పర్మనెంటు వుద్యోగాలు తగ్గి తక్కువ వేతనాలు లభించే తాత్కాలిక వుపాధిలో చేరే పరిస్థితికి కార్మికవర్గం చేరింది. ఇవన్నీ ప్రపంచీకరణ ఫలితమే అని భావించటంతో ధనిక దేశాలలో వ్యతిరేక గళం వినిపించటం ప్రారంభమైంది. ఇది ఒక కోణం. మరోవైపు నుంచి పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కూడా పర్యవసానాలు ప్రతికూలంగా తయారయ్యాయి. అదెలా వుందో తాజాగా వెల్లడైంది.

    ఇటీవల రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకానమీ, ట్రేడ్‌, ఇండస్ట్రీ అనే సంస్ధ ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది.http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html దానిలో వున్న వివరాల ప్రకారం ప్రపంచీకరణ వివిధ దేశాల మధ్య అసమాన లబ్దికి దారితీసింది. అలా లబ్ది పొందిన వాటిలో భారత్‌ ఒకటి, అయితే చైనాతో పోల్చితే చాలా తక్కువ ప్రయోజనం కలిగింది. ఈ లబ్ది పారిశ్రామికవేత్తలతో పాటు కార్మికవర్గానికి కూడా దక్కింది. ఎవరు ఎక్కువ అంటే ఈ కాలంలో దేశంలో పెరిగిన ఆదాయ, ఆర్ధిక అసమానతలు, పెరిగిన బిలియనీర్లను చూస్తే కార్మికుల కంటే పారిశ్రామిక, వాణిజ్యవర్గాలే ఎక్కువ లబ్ది పొందాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే నరేంద్రమోడీ మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని వారంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ సంస్కరణలు కొత్త సమస్యలను తీసుకువస్తాయని తెలిసినప్పటికీ తక్షణం లాభదాయకంగా వుంది కనుక రాబోయే పర్యవసానాల గురించి వారు అంతగా ఆలోచించటం లేదు.అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా తిరుగులేని శక్తిగా అవతరించింది. జపాన్‌ను వెనక్కు నెట్టి రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది. తనకున్న ఆర్ధిక శక్తి కారణంగా స్వేచ్చా వాణిజ్య నిబంధనలు, విధానాన్ని మరింత గట్టిగా అమలు జరపాలని అది కోరుతోంది. దాని దెబ్బకు గిలగిలలాడుతున్న ధనిక దేశాలు తాము ముందుకు తెచ్చిన స్వేచ్ఛా వాణిజ్యవిధానాన్ని పక్కన పెట్టాలని కోరుతున్నాయనటానికి ముందే చెప్పినట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్‌ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి వైదొలుగుతానని బెదిరించటం పక్కా నిదర్శనం. పైన పేర్కొన్న పరిశోధనా పత్రంలో ప్రపంచీకరణ పర్యవసానాల గురించి ఏం చెప్పారు ? వచ్చే భాగంలో చూడండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అక్టోబరు విప్లవ ప్రాధాన్యత-ప్రపంచ పర్యవసానాలు

25 Tuesday Oct 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

communist, Joseph Stalin, Lenin, october revolution, october revolution it's implications, october revolution today's relevance

ఎం కోటేశ్వరరావు

     ప్రపంచ గతినే ఒక పెద్ద మలుపు తిప్పిన వుదంతం 1917 రష్యన్‌ అక్టోబరు విప్లవం.ఆ మహత్తర ఘటన జరిగి నూరు సంవత్సరాలు కావస్తోంది. ఆ సందర్భంగా ప్రపంచంలోని పలు కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు నిర్వహించి ఆ విప్లవ ప్రాధాన్యతను నేటి తరాలకు పరిచయం చేసేందుకు పూనుకున్నాయి. ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజాన్ని ఏడు నిలువుల లోతున పాతివేసి విజయం సాధించామని చంకలు కొట్టుకుంటూనే అనేక చోట్ల పాలకవర్గాలు చివరికి చే గువేరా బొమ్మ, ఎర్ర రంగు టీషర్టులు, కమ్యూనిజానికి చెందిన పుస్తకాలు అమ్మటం కనిపించినా వులిక్కి పడటాన్ని ఇండోనేషియా వంటి అనేక చోట్ల చూస్తున్నాం. వూరంతా కావమ్మ మొగుడు అంటే కామోసనుకున్నాను, ఇప్పుడు కాదంటున్నారు కనుక నా కర్రా బుర్రా ఇస్తే నాదారిన నే పోతా అన్న మాదిరి 1991లో సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చి వేసిన తరువాత అనేక మంది కమ్యూనిస్టు జండాలు తిప్పేశారు.

   పాతిక సంవత్సరాలు గడిచిన తరువాత అనేక చోట్ల పూర్వపు సోషలిస్టు దేశాలలో అంతర్మధనం జరుగుతోంది. వున్న సంక్షేమ వ్యవస్ధ పోయింది, పెట్టుబడిదారీ విధానం అదనంగా అన్న వస్త్రాలు ఇవ్వకపోగా వున్న వస్త్రాలను లాగివేసుకుందని, కడుపు మాడుస్తోందని జనం గ్రహించారు. పెట్టుబడిదారీ వ్యవస్ధకు తలమానికమైన అమెరికాలో నిన్న మొన్నటి వరకు సోషలిస్టు, కమ్యూనిస్టు అని చెప్పుకోవాలంటేనే జనం వణికిపోయే పరిస్థితి. ఇప్పుడు అవును మేము సోషలిస్టులమే అయితే ఏమిటి అని మిలియన్ల మంది యువత ప్రశ్నిస్తున్నారంటే పరిస్థితిలో ఎంత మార్పు ! అమెరికాలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం అక్కడి కార్మిక, మధ్యతరగతి పౌరుల జీవితాలను అతలాకుతలం చేయటమే దీనికి కారణం, పెట్టుబడిదారీ వ్యవస్ధ విఫలమైందని అనేక మంది అంగీకరిస్తున్నారు. ప్రత్యామ్నాయం ఏమిటని శోధిస్తున్నారు. ఆ క్రమంలో అనేక మంది అటకెక్కించిన కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ గ్రంధాలను దించి దుమ్మదులిపి అసలు వాటిలో ఏం రాశారు ? మనకేమైనా పరిష్కారం చూపుతాయా అని అధ్యయనం చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది ?

   ప్రపంచ చరిత్రలో ఎన్నో రకాల విప్లవాలు సంభవించాయి. అనేక పరిణామాలు నాటకీయంగానే ప్రారంభమయ్యాయి. పైకి అలా కనిపించినప్పటికీ వాటికి తగిన భూమిక తయారై వున్నందునే అలా జరిగాయి. అయితే ఎక్కడ, ఏ రూపంలో, ఎలా జరుగుతుందన్నదే అనూహ్యం. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన బ్రిటన్‌, జర్మనీ వంటి చోట్ల సోషలిస్టు విప్లవం వస్తుందని కారల్‌మార్క్సు-ఎంగెల్స్‌ అంచనా వేశారు. అందుకు భిన్నంగా రష్యాలో వచ్చింది. లెనిన్‌తో సహా బోల్షివిక్‌ పార్టీ నాయకత్వం ఎక్కువ భాగం ప్రవాసంలో వుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో జారు చక్రవర్తుల పాత్రపై జనం ఆగ్రహంతో వున్నారు. ఈ స్ధితిలో బోల్షివిక్‌లకు అవకాశం ఇవ్వకుండా రష్యా పాలకవర్గం 1917ఫిబ్రవరిలో కెరెన్సీని రంగంలోకి దించి తిరుగుబాటు పేరుతో జారును తొలగించి బూర్జువా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. అయితే అక్టోబరు నాటికి బోల్షివిక్‌ నేత లెనిన్‌ ప్రవాసం నుంచి తిరిగి వచ్చి కెరెన్సీ ప్రభుత్వాన్ని తొలగించి సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచాన్ని కుదిపివేసిన పదిరోజులు అనే పేరుతో జాన్‌ రీడ్‌ అనే అమెరికన్‌ రచయిత ఈ మహత్తర విప్లవం పరిణామాలను గ్రంధస్ధం చేశారు.

   మొదటి ప్రపంచ యుద్ధం అనివార్యంగా కనిపిస్తున్న పరిస్ధితులలో 1914లో అంతర్జాతీయ సోషలిస్టు వుద్యమం ఒక విధంగా కుప్పకూలిపోయింది. నాటి కార్మివర్గ పార్టీలలో ముఖ్యమైన జర్మన్‌ మ్యూనిస్టుపార్టీ యుద్ధానికి అనుకూలంగా ఓటు చేసింది. కొద్ది మంది మైనారిటీలు మాత్రమే ఇది ప్రజల యుద్ధం కాదు, ప్రజలపై యుద్ధం అని వాదించారు. అలాంటివారిలో లెనిన్‌ నాయకత్వంలోని బోల్షివిక్‌ పార్టీ ఒకటి. ఆ కారణంగానే అది సరైన ఎత్తుగడలు అవలంభించి పాలకవర్గ బలహీనతను వుపయోగించుకొని మహత్తర సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేయగలిగింది.

    అక్టోబరు విప్లవం గురించి 1918లో లెనిన్‌ ఒక సందర్బంగా రాసిన దానిలో ‘ సోవియట్‌ తరహా నూతన రాజ్యాన్ని సృష్టించి కష్టతరమైన సమస్యలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే పరిష్కరించగలిగాము. ప్రధాన ఇబ్బంది ఆర్ధిక రంగంలో వుంది’ అని చెప్పారు. విప్లవ సమయంలో మిగతా ఐరోపాతో పోల్చితే రష్యా అనేక విధాలుగా వెనుకబడే వుంది. అంతర్గతంగా భూస్వామిక శక్తులు, పెట్టుబడిదారులు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించారు. బయట మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలు, పరాజిత దేశాలూ రెండు కూటములూ సోవియట్‌ చుట్టూ దానిని నమిలి మింగేసేందుకు అవకాశం కోసం చూస్తున్న సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు చుట్టుముట్టి వున్నాయి. 1917లో సంభవించిన విప్లవం 1989 నాటికి సామ్రాజ్యవాదుల కుట్రలకు బలై ఎలా కూలిపోయిందీ తెలుసుకోకుండా దాని ప్రాధాన్యతను , నేటికీ దానికి వున్న విలువ ఏమిటో అర్ధం చేసుకోలేము.

    అక్టోబరు విప్లవానికి ముందు విదేశాంగ విధానమంటే సామ్రాజ్యవాదులు ఏ ప్రాంతాన్ని ఎలా ఆ క్రమించుకోవాలి, ఎవరైనా పోటీకి వస్తే వారిని ఎలా దెబ్బతీయాలనేదే తప్ప మరొకటి మనకు కనపడదు. ఆధునిక చరిత్రలో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే విదేశాంగ విధానానికి రూపకల్పన జరిపింది సోవియట్‌ యూనియన్‌ వునికిలోకి వచ్చిన తరువాతే. కమ్యూనిస్టు పార్టీలు, సామ్రాజ్యవాద వ్యతిరేక, జాతీయ వుద్యమాలు, వివిధ ప్రజా సంఘాలకు రూపకల్పన చేసింది కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ అన్నది తెలిసిందే. దాన్ని ఒక విధానంగా ఆచరణలోకి తెచ్చింది, అభివృద్ది చేసిందీ సోవియట్‌ యూనియన్‌. అక్టోబరు విప్లవం ఫలితంగా ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌ అనేక దేశాలలో కమ్యూనిస్టు విప్లవ సంస్ధల ఏర్పాటుకు, జాతీయ విముక్తి, విప్లవాలకు తోడ్పాటునందించింది. చైనా విముక్తికి ప్రత్యక్షంగా తోడ్పడింది, సోవియట్‌ లేకుంటే చరిత్ర మరోవిధంగా వుండి వుండేది. సోవియట్‌లో కష్టజీవుల రాజ్యం ఏర్పడిందని, ఎలా వుంటుందో చూద్దామని అష్టకష్టాలు పడి వెళ్లిన వారు అనేక మంది కమ్యూనిస్టులుగా మారి తమ దేశాలలో కూడా అలాంటి వ్యవస్ధలను ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు, 1920 తాష్కెంట్‌ నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు ఆ విధంగా జరిగిందే . సంపూర్ణ స్వాతంత్య్రం కావాలనే డిమాండ్‌ను మన స్వాతంత్య్రం వుద్యమంలో ముందుకు తెచ్చింది కమ్యూనిస్టులే. ఈ కారణంగానే తమ దోపిడీకి రాగల ముప్పును గమనించి సామ్రాజ్యవాదులు సోవియట్‌ను మొగ్గలోనే తుంచేందుకు ప్రయత్నించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలు, పరాజితులూ ఇరు పక్షాలూ సోవియట్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. దాన్ని గమనించే లెనిన్‌ ప్రారంభంలోనే జర్మన్‌ సామ్రాజ్యవాదులతో బ్రెస్ట్‌లిటోవస్కీ సంధి చేసుకొని విప్లవ ఫలితాన్ని రక్షించారు. అక్టోబరు విప్లవం జాతీయ స్వాతంత్య్ర, విముక్తి వుద్యమాలకు వూపునివ్వటంతో మన దేశంతో సహా అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీల పుట్టుకకు పురుడు పోసింది. పర్యవసానంగా రెండవ ప్రపంచ యుద్దం నాటికి సామ్రాజ్యవాదులు తమ వలసలను ఇంకేమాత్రం నిలుపుకోలేని పరిస్ధితులు ఏర్పడ్డాయి. దీంతో సోవియట్‌ను దెబ్బతీసేందుకు అమెరికాతో సహా అన్ని సామ్రాజ్యవాద దేశాలూ జర్మన్‌ నాజీ హిట్లర్‌ను అన్ని విధాలుగా ప్రోత్సహించాయి.ఈ కుట్రను ముందుగా పసిగట్టిన స్టాలిన్‌ హిట్లర్‌ వ్యతిరేక కూటమితో ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రయత్నించారు. ముందుగా హిట్లర్‌ను సోవియట్‌పైకి పంపి దానిని పతనం చేసిన తరువాత తాము తేల్చుకోవచ్చని ఇతర సామ్రాజ్యవాదులు దురాలోచన చేశారు.

    అందుకే తగిన సన్నాహాలు చేసుకొనేందుకు మరోసారి 1939తో జర్మనీతో రష్యన్లు పరస్పర దాడుల నిరోధ ఒప్పందం చేసుకున్నారు. సోవియట్‌ను ఏక్షణంలో అయినా లేపివేయవచ్చు, ముందు గతంలో తమను ఓడించిన ఇతర సామ్రాజ్యవాదుల పని బట్టాలని నిర్ణయించుకున్న హిట్లర్‌ తన వ్యూహం అమలు జరిపాడు. వరుసగా విజయాలు సాధించిన వూపులో సోవియట్‌ను కూడా ఆక్రమించుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించిన హిట్లర్‌ 1941లో అంతకు ముందు చేసుకున్న ఒప్పందాన్ని వుల్లంఘించి సోవియట్‌పై దాడులకు దిగాడు. ఇది ప్రపంచగతిని మరోమలుపు తిప్పుతుందని ఎవరూ వూహించలేదు. ఐక్యరాజ్యసమితి ఏర్పడటానికి ముందు నానాజాతి సమితి వుండేది. దాని వైఫల్యాల తీరుతెన్నులను గమనించి రెండవ ప్రపంచ యుద్దానికి ముందు దురాక్రమణదారులకు వ్యతిరేకంగా ఒక భద్రతా వ్యవస్ధను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది నాటి సోవియట్‌ యూనియన్‌ మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. ఆ తరువాత అంతకంటే పటిష్టమైన ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. అయితే ఇది కూడా నానాజాతి సమితి వైఫల్యాల బాటలోనే పయనిస్తున్నది, అందుకు బాధ్యత ఎవరిది, నిబంధనలను వుల్లంఘిస్తున్నది ఎవరంటే అమెరికా, దాని మిత్రరాజ్యాలే మనకు కనిపిస్తాయి.

    ఐరోపాను గడగడలాడించిన హిట్లర్‌ సేనలను మట్టుబెట్టటమే గాక, హిట్లర్‌ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చావాల్సిన పరిస్ధితిని కల్పించిన మొనగాడుగా సోవియట్‌ ప్రపంచం ముందు నిలిచింది. అంతే కాదు తూర్పుఐరోపాను, ఆసియాలో వుత్తర కొరియాను విముక్తి చేసి సోషలిస్టు శిబరాన్ని విస్తరింపచేసింది. చైనాలో సోషలిస్టు విప్లవం జయప్రదమయ్యేందుకు ఎంతో తోడ్పడింది.రష్యాలో అక్టోబరు విప్లవం జరగపోయి వుంటే, అది బలపడి రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ మూకలను ఓడించకుండా వున్నట్లయితే ప్రపంచంలో ఏమి జరిగి వుండేది ? నాజీలు, ఫాసిస్టులు, ఇతర సామ్రాజ్యవాదులు మరో రూపంలో ప్రపంచాన్ని తిరిగి పంచుకొని వుండేవారు కాదా ? ఆ ముప్పును తప్పించింది, వలస రాజ్యాలన్నింటికీ స్వాతంత్య్రం వచ్చింది కమ్యూనిస్టుల వలనే కాదా ?

Image result for 2nd world war ,stalin

   అక్టోబరు విప్లవంతో ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌ ఒక కుట్ర ఫలితమని సామ్రాజ్యవాదులు వర్ణిస్తారు. ఒక ప్రయోగంగా కొందరు వర్ణిస్తే , మరికొందరు దానిని అంగీకరించరు. 1871 మార్చి 18 నుంచి మే 28వరకు వునికిలో వున్న పారిస్‌ కమ్యూన్‌ను దిగ్బంధం చేసి అణచివేసిన మాదిరి ప్రపంచంలో ఆరోవంతు వున్న సోవియట్‌ యూనియన్‌ను భౌతికంగా దిగ్బంధం చేయటం సాధ్యం కాదని పెట్టుబడిదారీ వర్గం ప్రారంభంలోనే గుర్తించింది.అందుకే తొలుత అంతర్గత తిరుగుబాట్లు, అంతర్యుద్ధ కుట్రల ద్వారా దానిని దెబ్బతీయాలని చూసింది. ఆ తొలి ఎత్తుగడ విఫలమైంది. అటువంటి వ్యవస్ధ రెండు దశాబ్దాలపాటు కొనసాగి స్ధిరపడటమేగాక అనేక విజయాలు సాధించి ప్రపంచ కార్మివర్గాన్ని ఆకర్షించింది. దీనికి తోడు రెండవ ప్రపంచ యుద్ధంలో అనూహ్యంగా హిట్లర్‌ను ఓడించి ప్రపంచ హీరోగా నిలబడింది. దీంతో భౌతికంగా అంతం చేయలేమని , కార్మిక వర్గం మొత్తంగా తమ దోపిడీకి చరమ గీతం పాడుతుందని పెట్టుబడిదారులు నిర్ధారణకు వచ్చి పన్నిన సుదీర్ఘకుట్ర ఫలితమే ప్రచ్చన్న యుద్దం.

   సోవియట్‌, తదితర దేశాల వ్యవస్ధలను కూల్చివేయటానికి, కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు సామ్రాజ్యవాదులు దాదాపు పది లక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేశారని అంచనా. కమ్యూనిజం పనికిరాదు, అసంగతం అని చెప్పిన వారు దాన్ని దెబ్బతీసేందుకు ఇంత భారీ మొత్తం ఖర్చు చేయటాన్ని బట్టే దానికున్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. శ్రామికవర్గంతో ప్రత్యక్ష పోరు సల్పితే ప్రయోజనం లేదన్నది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దోపిడీ వర్గం నేర్చుకున్న పెద్ద పాఠం. కొత్త పద్దతులను ఎంచుకుంది. ఎదుటి పక్షంలోని లోపాలు, బలహీనతలను ఎంచుకొని వాటిమీద కేంద్రీకరించటం ద్వారా సైద్ధాంతిక దాడి, కుట్రలు, అనుమానాలు, గందరగోళంలో పడవేయటం వంటి సకల చాణక్య ఎత్తుగడులను అమలు జరిపి తమ చేతికి మట్టి అంటకుండా దెబ్బతీయటం ప్రచ్చన్న యుద్ద లక్షణం. దాన్ని ఒక్క సోవియట్‌, తూర్పు ఐరోపాకే పరిమితం చేయలేదు. క్యూబాను భౌతికంగా అష్టదిగ్బంధనం గావించారు. కమ్యూనిస్టు చైనాను రెండు దశాబ్దాలకు పైగా అసలు గుర్తించేందుకు, ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం వహించేందుకే లేకుండా అడ్డుకున్నారు. వియత్నాం, కంపూచియా, లావోస్‌లపై దశాబ్దాల తరబడి యుద్ధాలు చేసి కమ్యూనిజాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.

    పుట్టిన దగ్గర నుంచి కూలిపోయే వరకు ఏడు దశాబ్దాల పాటు సోవియట్‌ వనరులలో ఎక్కువ భాగం దానిని కాపాడు కొనేందుకు ఖర్చు చేసిన ఫలితంగానే అది ఎలాంటి భౌతికదాడులకు గురికాలేదన్నది ఒక వాస్తవం. అయితే అదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు విసిరిన సవాలును స్వీకరించిన కమ్యూనిస్టులు సోవియట్‌ అభివృద్దికి అనుసరించిన కొన్ని పద్దతులు, ప్రయోగాలు ఎన్నో విజయాలతో పాటు కొన్ని వ్యతిరేక ఫలితాలనిచ్చాయన్న అభిప్రాయాన్ని కాదనలేము.వాటిలో కమ్యూనిస్టులు బ్యూరాక్రాట్లుగా మారటం ఒకటి. అనేక ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ సోవియట్‌ సాధించిన విజయాలను తక్కువ చేసి చూడలేము. స్టాలిన్‌ హయాంలో కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ సాధించిన అభివృద్ధి కారణంగానే ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఫాసిస్టు హిట్లర్‌ను మట్టుబెట్టటం సాధ్యమైంది. అణురంగంలో అమెరికాతో ధీటుగా వుండబట్టే మరో నాగసాకి, హిరోషిమాలు పునరావృతం కాలేదు. ప్రణాళికా బద్ధమైన ఆర్ధిక వ్యవస్ధను అమలు జరిపి అనేక విజయాలు సాధించి ఈనాడు అనేక దేశాలకు మార్గదర్శకంగా వున్నది కూడా సోవియట్‌ యూనియనే. సోవియట్‌ ప్రయోగాలు ప్రపంచానికి అనేక గుణపాఠాలు కూడా నేర్పాయి.

    లాభం లేనిదే వ్యాపారి వరదన పోడన్న సామెత తెలిసిందే.సోవియట్‌ యూనియన్‌ ఏర్పాటు, పురోగమనం, ఫాసిజంపై యుద్ధ విజయం కారణంగా జనం కమ్యూనిస్టులవైపు మొగ్గకుండా చూసేందుకే పాలకవర్గాలు జనానికి వెసులుబాటునిచ్చే కొన్ని సంక్షేమ చర్యలను చేపట్టకతప్పని పరిస్ధితులు ఏర్పడ్డాయని గ్రహించటం అవసరం. ఇదే క్రమంలో లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండంలో నియంతలకు మద్దతు ఇచ్చే విధానాలను అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు విరమించుకోవాల్సి వచ్చింది. తమ లాభాల రేటు తగ్గకుండా చూసుకొనేందుకు మరోవైపు పెట్టుబడిదారీ వర్గం వుత్పత్తిని మరింతగా పెంచే, కార్మికుల సంఖ్యను తగ్గించే పరిజ్ఞానంవైపు కూడా దృష్టి సారించింది. అది సోషలిస్టు దేశాలకు విస్తరించకుండా ఇనుప తెరలను ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే సోవియట్‌తో సంబంధాలున్న మనవంటి దేశాలకు కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసింది. అయినా అంతరిక్ష రంగంలో సోవియట్‌ అమెరికా కంటే ఎంతో ముందుకు పురోగమించింది. గతంలో సోవియట్‌,తరువాత దాని వారసురాలిగా రష్యా మనకు అందించిన అంతరిక్ష ప్రయోగ పరిజ్ఞాన ఫలితమే ఈ రోజు మనం జయప్రదంగా అంతరిక్ష , క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ అగ్రరాజ్యాల సరసన నిలబడగలుగుతున్నామన్నది మరిచి పోరాదు. ప్రచ్చన్న యుద్ధం పేరుతో సామ్రాజ్యవాదులు సాగించిన కుట్రల తీవ్రతను అర్ధం చేసుకోవటంలో, ఎదుర్కోవటంలో వైఫల్యం, వైరిపక్ష బలాన్ని తక్కువగా అంచనా వేయటం, సంస్కరణల అమలులో వైఫల్యం వంటి అంశాలు , రాజకీయంగా మితవాదానికి గురికావటం చివరకు బోరిస్‌ ఎల్సిన్‌ వంటి శక్తులు పార్టీ నాయకత్వ స్ధానాలలోకి ఎదగటంతో సామ్రాజ్యవాదులు తమ కుట్రలను సులభంగా అమలు చేసి సోవియట్‌ను కూల్చివేయగలిగారు.

    సోవియట్‌, తూర్పు ఐరోపా పతనం వలన ఆయా దేశాల పౌరులతో పాటు ప్రపంచం కూడా ఎంతో నష్టపోయింది. అమెరికా చెప్పిందే వేదం. సోవియట్‌ అంతరిస్తే తమ ఖండం నుంచి అమెరికా సేనలు తిరుగుముఖం పడతాయని ఆశించిన ఐరోపా ధనిక దేశాల ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌ పాలకవర్గ అంచనాలు తప్పాయి. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలకు వ్యతిరేకంగా నాటో కూటమిని ఏర్పాటు చేసిన అమెరికా అక్కడి సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన తరువాత దానిని రద్దు చేయకపోగా గత పాతిక సంవత్సరాలలో మరింతగా పటిష్ట పరుస్తున్నారంటే వారి ఎజండా ఇంకా మిగిలే వుందన్నది సుస్పష్టం. అంటే మిగతా సోషలిస్టు దేశాలు, కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తూనే వున్నారు. ఐరోపా ధనిక దేశాలపై తన పట్టు కొనసాగాలంటే నాటో కూటమిని కొనసాగించటం అవసరం. సోవియట్‌ లేకపోయినా దాని స్ధానంలో వచ్చిన రష్యా నుంచి ఐరోపాకు ముప్పు తొలగలేదనే కొత్త పల్లవిని అమెరికన్లు అందుకున్నారు.

     సోవియట్‌ అంతరించిన తరువాత దాని బూచిని చూపితే నడవదు. అందుకు గాను వుగ్రవాదంపై పోరు పేరుతో సరికొత్త అజెండాకు తెరలేపింది. ఆ పేరుతో పశ్చిమాసియా ఆక్రమణకు పూనుకుంది. ఇజ్రాయెల్‌కు ఇంకా ముప్పు తొలగలేదనే పేరుతో ఆ ప్రాంతంలో కొనసాగేందుకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నది. సోవియట్‌ను కూల్చివేసిన తరువాత పాతిక సంవత్సరాల పాటు ఒక చిన్న కమ్యూనిస్టు దేశం క్యూబాను దెబ్బతీసేందుకు ప్రయత్నించి సాధ్యంగాక దానితో అమెరికన్లు తాత్కాలికంగా అయినా రాజీపడి సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలలో ఎన్నికైన వామపక్ష ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఆసియాలో తమకు లాభదాయకంగా వున్న కారణంగా చైనాతో భారీ ఎత్తున వాణిజ్య లావాదేవీలు నడుపుతూనే మరోవైపున దానిని దెబ్బతీసేందుకు నిరంతరం కుట్రలు పన్నుతూనే వున్నాయి. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని చైనా ఆధీనంలో వున్న దీవులపై తమకు హక్కు వుందంటూ జపాన్‌, ఫిలిప్పైన్స్‌ తదితర దేశాలతో వివాదాలను రెచ్చగొడుతూ ఆ ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేస్తున్నారు.

    ప్రపంచ మానవాళి సోవియట్‌కు, స్టాలిన్‌కు తీర్చలేని విధంగా రుణపడిందంటే అతిశయోక్తికాదు. స్టాలినే లేకుంటే తరువాత కాలంలో ఆయనను నియంత అని నిందించిన వారు, హిట్లర్‌తో మతిలేని పోలికలు తెచ్చిన వారు బతికి వుండేవారు కాదు, వారి వారసులు అసలు పుట్టివుండేవారు కాదు. ప్రపంచాన్ని హిట్లర్‌ అనే నియంత ఆక్రమించ కుండా కాపాడింది, తమ ప్రాణాలు అర్పించిన రెండు కోట్ల మంది సోవియట్‌ పౌరులు, వారిని అంతటి మహత్తర త్యాగాలకు సిద్దపరిచిన స్టాలిన్‌ నాయకత్వమే. ఒక దుర్మార్గుడు ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకుంటే లొంగిపోయి సలాం కొట్టినవారిని, బానిసలుగా మారిన వారిని, గుడ్లప్పగించి చూసిన వారిని ప్రపంచ చరిత్ర చూసింది గానీ, ఆత్మగౌరంతో బతికేందుకు ఇలాంటి త్యాగాలు చేయటం మరొక వుదంతంలో ఎక్కడా కానరావు.

    ఐరోపాలో లేదా మన వంటి వర్ధమాన దేశాలలో ప్రభుత్వాలు సంక్షేమ చర్యలను చేపట్టటం రష్యాలో అక్టోబరు విప్లవం, సోవియట్ల ఏర్పాటు తరువాతనే ప్రారంభమైంది అని గుర్తించాలి. ఆ సోవియట్‌ కూలిపోయిన తరువాత గత పాతిక సంవత్సరాలలో ఆ సంక్షేమ చర్యలను ఒక్కొక్కటిగా పెట్టుబడిదారీ దేశాలన్నింటా వుపసంహరించటాన్ని గమనిస్తున్నాము. గతం మాదిరి జనం పోల్చుకోవటానికి ప్రత్యామ్నాయ వ్యవస్ధ లేదని, తమ లాభాల్లో జనానికి వాటా పెట్టాల్సిన అవసరం లేదని పెట్టుబడిదారులు భావిస్తుండటమే సంక్షేమ చర్యలకు కోత, వుపసంహరణ.

   ఇతరులకు జోస్యం చెప్పిన బల్లి కుడితిలో పడి గిలగిలా కొట్టుకున్నట్లు సోషలిస్టు వ్యవస్ధలు ఫలితాలు సాధించలేవని, ఆచరణ సాధ్యం కాదని ప్రచారం చేసిన పెట్టుబడిదారీ వ్యవస్ధలు తామే తీవ్ర సంక్షోభంలో పడి బయటకు రాలేక దిక్కుతోచకుండా వున్నాయి. మరోవైపున సంక్షుభిత పెట్టుబడిదారీ దేశాల మార్కెట్లపై ఆధారపడిన చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాల ఎగుమతుల ఆర్ధిక లావాదేవీలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షోభంలో పడలేదు. విజయవంతంగా నడుస్తున్నాయి. దివాళాకోరు ఆర్ధిక విధానాలు అమలు జరుపుతున్న మనవంటి దేశాలు రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా వాటి దుష్పలితాలను అనుభవిస్తున్నాయి. సోవియట్‌ కూలిపోయిన తరువాత ప్రపంచంలోని వామపక్షాలు కూడా నూతన సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

      కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతుల వుద్యమాలు వెనుకపట్టు పట్టాయి. యజమానులు తమ షరతులను ముందుకు తెస్తూ ఎదురుదాడులు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు తమ వస్తువులను అమ్ముకొనేందుకు తెచ్చిన నూతన సాంకేతిక పద్దతులతో గొలుసుకట్టు ప్రపంచ మార్కెట్‌ను తమ అదుపులోకి తెచ్చుకుంటున్నాయి. దీంతో సరిహద్దులతో నిమిత్తం లేకుండా వస్తువులు ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుతున్నాయి. దీని అర్ధం ఏమంటే తమ ఆర్ధిక వ్యవస్థల మీద ఆయాదేశాలకు అదుపు వుండదు. కార్మికులు యూనియన్లు పెట్టుకోవటానికి, తమ న్యాయమైన హక్కులను సాధించుకొనేందుకు కష్టమౌతుంది. ఎక్కడ కార్మిక శక్తిని దోచుకొనేందుకు అవకాశం వుంటే అక్కడికి పరిశ్రమలను తరలించి లేదా కొత్తగా ఏర్పాటు చేసి వస్తువులను తయారు చేసి ఎగుమతులు చేస్తున్నాయి. ఈ కారణంగా మన ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా నినాదం ఇచ్చి, తమ దగ్గర ఎటువంటి అవకాశాలు వున్నాయో ప్రపంచదేశాలన్నింటా చెబుతున్నారు. అవసరమైతే కార్మిక చట్టాల రద్దు, నామమాత్రంగా చేసి యజమానుల ఇష్టారాజ్యానికి అవకాశం కల్పిస్తామని ప్రాధేయపడుతున్నారు. కార్మిక సంఘాల ఏర్పాటును కఠిన తరం చేసే నిబంధనలు చేరుస్తున్నారు.తక్కువ సంఖ్యలో కార్మికులున్న పరిశ్రమలలో వారిని తొలగించేందుకు, మూసివేసేందుకు యజమానులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నారు. అప్రెంటిస్‌ల పేరుతో ఏండ్ల తరబడి నామమాత్ర వేతనాలకు పనిచేయించుకొనే వెసులుబాటును కల్పిస్తున్నారు. చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావు వంటి ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇవన్నీ పరోక్షంగా సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయిన పర్యవసానాలే అన్నది గమనించాలి.

    అక్టోబరు విప్లవం ప్రపంచంలో తెచ్చిన మార్పులు, దానికి తగిలిన ఎదురు దెబ్బల కారణంగా ప్రపంచంలో సామ్రాజ్యవాదుల ఆధిక్యం పెరిగిపోవటం, వారిని ఎదిరించేవారు లేకపోవటంతో వర్ధమాన దేశాలకు తిరిగి ముప్పు ఏర్పడటం, కార్మిక,కర్షక వుద్యమాలు వెనుకపట్టుపట్టం, యజమానుల దోపిడీ పెరగటం,సంక్షేమ చర్యలకు కోత ద్వారా ప్రజలపై భారాలు మోపటం వంటి పర్యవసానాల గురించి చెప్పుకున్నాము. సోవియట్‌ పతనం నుంచి గుణపాఠాలు తీసుకోవటమంటే పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం నుంచి వైదొలగి ఆ దుర్మార్గ విధానానికి సలాం కొట్టటం కాదు. అక్టోబరు విప్లవం గురించి మరింతగా మధనం చేయాలి. లోపాలను పునరావృతం కాకుండా చూసుకోవాలి. దానిని వర్తమాన పరిస్ధితులకు అన్వయించుకోవాలి. ప్రతి వైఫల్యం విజయానికి ఒక మెట్టు అని అంగీకరిస్తే అక్టోబరు విప్లవం, సోవియట్‌ ప్రయోగం కూడా అలాంటిదే. ప్రస్తుతం సాంప్రదాయ పెట్టుబడిదారుల స్ధానంలో ద్రవ్య పెట్టుబడిదారులు ప్రపంచంపై ఆధిపత్యం వహిస్తున్నారు. వారి నూతన ఎత్తుగడలను కార్మికవర్గం నూతన పద్దతులలో చిత్తుచేయటం తప్ప మరొక మార్గం లేదు. ఈ క్రమంలో పెట్టుబడిదారీ సిద్దాంత వేత్తలు ముందుకు తెచ్చే గందరగోళ సిద్ధాంతాలు లేదా వాదనలను వారి తీరుతెన్నుల నుంచే ఎండగట్టాలి. రెండు రెళ్లు నాలుగు అన్నది ఏ కాలంలో అయినా ఒకటే. అలాగే కార్మికులు, కర్షకులు దోపిడీకి గురవుతున్నంత వరకు దానిని ఎలా అంతం చేయాలన్నదానిలోనూ ఎలాంటి గందరగోళం, మార్పూ వుండకూడదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

CPI(M) supports the demand of Muslim women on triple talaq

18 Tuesday Oct 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

communal forces, CPI(M), Muslim women, triple talaq, Uniform Civil Code

The Polit Bureau of the Communist Party of India (Marxist) has issued the following statement on October 18, 2016.
The CPI(M) supports the demand of Muslim women against the practice of arbitrary and instant triple talaq. This specific practice is not permitted in most Islamic countries. Acceptance of this demand will bring relief to affected women.
All personal laws including those for the majority community require reform.
In this context the claims being made by Government spokespersons that personal laws for Hindu women have already been reformed   shows that their interest is not in securing women’s equality but in targeting the  minority communities, particularly the Muslim minority.  Even now laws concerning, adoption, property rights and even the right to choose your own partner discriminate against Hindu women.
With the offensive of the communal forces on the very identity of minority communities, any move to push the agenda of Uniform Civil Code as is being done by the Government directly and through its institutions is counterproductive for the rights of women. Uniformity is not the guarantee for equality.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యన్‌ ఎన్నికల ఫలితాలు – ఓట్లు, సీట్ల మాయాజాలం

23 Friday Sep 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA

≈ Leave a comment

Tags

Communist Party of the Russian Federation, Duma, Duma elections, RUSSIA, Russia’s Duma, Russia’s Duma Elections

 

Image result for State Duma Building

ఎంకెఆర్‌

    గత ఆదివారం నాడు (సెప్టెంబరు 18న) రష్యన్‌ పార్లమెంట్‌ డ్యూమా ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీతో సహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ సగానికిపైగా సీట్లను కోల్పోగా అధికార పార్టీ స్వల్పంగా ఓట్ల శాతాన్ని పెంచుకొని మూడింట రెండువంతులకు సీట్లు పొందింది. అనేక మంది ఎందుకిలా జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. మొత్తం 450 స్ధానాలకు గాను 225 నియోజకవర్గ ప్రాతిపదిన, మిగిలిన 225 దామాషా ఓటింగ్‌ ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో గత పాతిక సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ శాతం ఓటింగ్‌ నమోదు కావటం ఒక కొత్త రికార్డు అయితే అధికార పక్షం ఐక్య రష్యా పార్టీ అంతకు ముందున్న 238 ను 343కు పెంచుకొని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ విధంగా విజయం సాధించటానికి మారిన ఎన్నికల పద్దతి, ఎన్నికలలో అక్రమాలే ప్రధాన కారణం అని ఫలితాల అనంతరం వెలువడుతున్న వార్తలు, విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికలలో అన్ని స్ధానాలూ దామాషా ప్రాతిపదికన పార్టీలకు కేటాయించారు. ఈ సారి సగం మాత్రమే వుండటం, అనేక మంది పోటీ పడిన కారణంగా మైనారిటీ ఓట్లతోనే అధికారపక్షం ప్రత్యక్ష ఎన్నికల విభాగంలో అత్యధిక సీట్లను గెలుచుకోవటం సాధ్యమైంది. సాధారణంగా ఓటింగు డిసెంబరులో జరుగుతుంది, అటువంటి దానిని అధికార పార్టీ పట్టుబట్టి సెప్టెంబరుకు మార్పించింది. తక్కువ ఓట్లు పోలు కావటానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. దీని కంటే ఎన్నికలు ఒక ప్రహసనమని భావించిన మెజారిటీ ఓటర్లు ప్రభుత్వంపై వ్యతిరేకత వున్నప్పటికీ ప్రతిపక్షాల మీద విశ్వాసం లేకపోవటం కూడా తోడై ఓటింగ్‌కు దూరంగా వున్నారు. మన దేశంలో మాదిరి ఓట్ల అమ్మకం, కొనుగోలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. ఎన్నికలకు కొద్ది వారాల ముందు లెవడా అనే ఏజన్సీ నిర్వహించిన ఒక సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరు తమ ఓటును 5000 రూబుళ్లకు అమ్మేందుకు సుముఖంగా వున్నట్లు తేలింది. రష్యా జనాభాలో 2.3 కోట్ల మంది లేక 16శాతం దారిద్య్రరేఖ ప్రమాణం నెలకు 174 డాలర్ల కంటే తక్కువ ఆదాయం పొందుతున్నవారు వున్నారు. గత ఎన్నికల మాదిరే ఈ ఎన్నికలలో కూడా అధికార పక్షం పాల్పడిన అక్రమాలు, అవినీతి గురించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఓటర్ల కంటే బ్యాలట్‌ బాక్సులలో పడిన ఓట్లు ఎక్కువగా వున్నట్లు , కొన్ని చోట్ల అసలు ఓటర్లు లేకుండానే సిబ్బందే ఓట్లతో బాక్సులను నింపినట్లు తేలటం, మరికొన్ని చోట్ల దొంగ ఓట్లు వేసినట్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ శాతాలను కూడా ప్రకటించటం వంటి అ క్రమాలు చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అనేక పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్‌ ఫలితాలను రద్దు చేసినట్లు స్వయంగా రష్యా వార్తా సంస్ధ ఇటార్‌ -టాస్‌ పేర్కొన్నది. నిజానికి అవి సముద్రంలో కాకి రెట్ట వంటివి. ఈ సారి పార్లమెంట్‌కు ప్రజాస్వామిక సంస్కరణలకు వ్యతిరేకులైన పచ్చి మితవాదులు పాలక పక్షం నుంచి గణనీయంగా ఎన్నికైనట్లు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.

    గత ఎన్నికల్లో పాల్పడిన అవినీతి కారణంగా ప్రపంచవ్యాపితంగా నగుబాట్ల పాలైన అధ్యక్షుడు పుతిన్‌ ఎన్నికలను పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా జరిపేందుంటూ ఎన్నికలకు ముందు మానవహక్కుల న్యాయవాదిగా గౌరవ మన్ననలను పొందిన ఎలా పాం ఫిలోవాను నియమించారు. అయినప్పటికీ దిగువ యంత్రాంగం మొత్తం అధికార పక్ష కనుసన్నలలో పనిచేసేదిగా వుండటంతో సైంటిఫిక్‌ రిగ్గింగ్‌ జరిపి అధికారపక్షం మెజారిటీ సీట్లను తెచ్చుకున్నది. అక్రమాల గురించి సామాజిక మీడియాలో కుప్పలు తెప్పలుగా వెల్లడిస్తున్నారు. తొమ్మిది ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అనేక పోలింగ్‌ బూత్‌లలో ఎన్నికలను రద్దు చేసినట్లు పాం ఫిలోవా గురువారం నాడు ప్రకటించారు. దర్యాప్తులో ఇంకా మరిన్ని అక్రమాలు వెల్లడయ్యే అవకాశం కూడా వుందన్నారు. పరిశీలక సంస్ధలలో ఒకటైన ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓయిసిడి) కూడా ఎన్నికలు సక్రమంగా జరగలేదని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వలేదని పేర్కొన్నది.

    గతంలో 2007 ఎన్నికలలో అధికార ఐక్య రష్యా గరిష్టంగా 315 సీట్లు , తరువాత కనిష్టంగా 2011లో 238 సీట్లు, తాజాగా 343 సీట్లు తెచ్చుకుంది. సోవియట్‌ కూలిపోయిన తరువాత 1993లో జరిగిన తొలి ఎన్నికలలో నమోదైన 54.8శాతంమే ఇప్పటి వరకు కనిష్టంగా వుంది. అలాంటిది తాజా ఎన్నికలలో 48శాతానికి పడిపోయింది.అయితే ఇది కూడా ముందే చెప్పుకున్నట్లు ఓటర్ల కంటే ఎక్కువగా పడిన బ్యాలట్లను కూడా లెక్కిస్తే వచ్చిన సంఖ్య. అందువలన అంతకంటే తక్కువ మందే ఓటర్లు పాల్గొన్నట్లు చెబుతున్నవారు కూడా లేకపోలేదు. రాజధాని మాస్కో, మరో పెద్ద నగరమైన సెంట్‌ పీటర్స్‌ బర్గ్‌లో 35, 33 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైనట్లు ప్రకటించారు.

    నాలుగు వందల యాభై స్ధానాలకు గాను అధికారపక్షం 343 పొందగా రెండవ పార్టీగా రష్యన్‌ కమ్యూనిస్టుపార్టీ 42, మూడవ పార్టీగా పచ్చిమితవాద పక్షం ఎల్‌డిపిఆర్‌ 39, న్యాయమైన రష్యా పార్టీ 23 గెలుచుకుంది. మరో రెండు పార్టీలు ఒక్కొక్క స్ధానం, నేరగాడిగా గతంలో ఇంటర్‌ పోల్‌ వెతికిన వ్యక్తి ఏకైక స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 225 సీట్లలో అధికారపక్షం 203 గెలుచు కుంది. ఒక పరిశీలకుడు సెర్గీ షిఫిలికిన్‌ చెప్పిన దాని ప్రకారం అధికార పక్షానికి వచ్చినట్లు చెబుతున్న ఓట్లలో 45శాతం లేదా కోటీ 20 లక్షల ఓట్లు బోగస్‌. పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లు 37శాతానికి మించి లేరు, ఈ లెక్కన పోలైన ఓట్లలో అధికారపక్షానికి వచ్చినట్లు చెబుతున్న 54 శాతం కాకుండా 40శాతమే వాస్తవ ఓట్లు అయి వుండాలి.

    గత మూడు ఎన్నికలలో వరుసగా వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం , సీట్లు ఎలా వున్నాయో దిగువ పట్టికలో చూస్తే అధికార పార్టీ ఎన్నికల విధానంలో ఎందుకు మార్పు తెచ్చిందో దాని కారణంగా ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడిందో అవగతం అవుతుంది.

ఏడాది        ఐక్య రష్యా       కమ్యూనిస్టు       ఎల్‌పిడిఆర్‌       జస్ట్‌ రష్యా

2007        64.30-315      11.57-57         8.14-40        7.74-38

2011        49.32-238      19.19-92        11.67-56      13.24-64

2016        54.19-343       13.34-42       13.16-39        6.23-23

         గత ఎన్నికలతో పోల్చితే కమ్యూనిస్టు పార్టీ , జస్ట్‌ రష్యా ఓట్ల శాతం తగ్గిందన్నది స్పష్టం. ఆ మేరకు అధికార పార్టీకి పెద్దగా పెరగపోయినా సీట్లు గణనీయంగా పెరగటానికి ఎన్నికల విధానంలో చేసిన మార్పే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.దామాషా ప్రాతిపదికన కేటాయించిన 225 సీట్లలో ఐక్య రష్యాకు 140, కమ్యూనిస్టుపార్టీకి 35,ఎల్‌పిడిఆర్‌కు 34, జస్ట్‌ రష్యాకు 16 వచ్చాయి. నియోజకవర్గాలలో వరుసగా ఈ పార్టీలకు 203, ఏడు, ఏడు, ఐదు, మరో రెండు చిన్న పార్టీలకు ఒక్కొక్కటి దక్కాయి.ఒక స్వతంత్ర అభ్యర్ధి గెలిచాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనంపై తెలుగు దేశం-బిజెపి ఎదురుదాడి !

15 Thursday Sep 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Politics

≈ Leave a comment

Tags

AP Package, ap special asistance, ap special status, chandababu duplicity, Narendra Modi, Venkaiah naidu

Image result for Telugu desam started offensive against people

ఎం కోటేశ్వరరావు

     మహానటుడు నందమూరి తారకరామారావు సినిమాలలో చిక్కడు-దొరకడు, రేచుక్క-పగటి చుక్క వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు ఆనందాన్ని పంచితే సినిమా పరిభాషలో చెప్పాలంటే కొంతమంది దృష్టిలో అయినా ‘తోడు దొంగలు ‘ గా కనిపిస్తూ, ఎన్‌టిఆర్‌ అసలు సిసలు వారసులం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ, మితృపక్షం బిజెపి నాయకులు నిజజీవితంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరుల ముందు నటిస్తున్నారు. ఎన్‌టిఆర్‌ సినిమాలు చివరకు సుఖాంతంగా ముగిశాయి. ప్రత్యేక తరహా హోదా కంటే ఎక్కువ ప్రయోజనం కలిగే ప్రత్యేక సాయం అనే వీరి నటన ఎలా ముగుస్తుందన్నది ఆసక్తికరం. ఎందుకంటే రియాలిటీ షో కదా ! ఇలాంటి షోలు ఫలానా విధంగా మాత్రమే నిర్వహించాలనే , ఫలానా విధంగా ముగించాలనే నిబంధనేమీ లేదు. వ్యాపారం కనుక వారికి అనుకూలమైన రీతిలో వాటిని రూపొందిస్తారు.ఈ రియాలిటీ షోలో రాని ప్రత్యేక హోదా , దాని కంటే ఎలా మెరుగో తెలియని లేదా వారైనా చెప్పని ప్రత్యేక సాయంపై జనంపై ఎదురు దాడికి దిగారు. త్వరలో ఈ సాయానికి కేంద్ర కాబినెట్‌ ఆమోద ముద్ర వేసిన తరువాత అదింకా పెరగవచ్చు లేదా జనంలో ప్రతికూలత వ్యక్తమైతే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గ వచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం తమ ఆత్మరక్షణ, సమర్ధనకు వూరూరా ఎదురుదాడి చేయాలనే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Image result for venkaiah naidu

దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో మాదిరి ‘పంచాంగ ‘ వెంకయ్య

      రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇక రాదు అన్నది సుస్పష్టం. దీనికి జనాన్ని మానసికంగా సిద్ధం చేయటానికి 27నెలల పాటు కసరత్తు చేయాల్సి వచ్చిందంటే ఈ విషయంలో తెలుగుదేశం, బిజెపిలు ఎంత భయపడ్డాయో, ఆందోళనకు గురయ్యాయో చెప్పకనే చెప్పినట్లయింది. ఎంతైనా బిజెపివారి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తుగడలు, తెలుగుదేశం వారి సినిమా దర్శకత్వాలతో పార్లమెంటరీ చర్చల ట్విస్టులమీద ట్విస్టులు, అసెంబ్లీ తీర్మానాల ప్రహసనాలు, అనుకూల, సానుకూల పత్రికలు, టీవీలలో లీకుల వార్తల వడ్డన, వుత్తుత్తి బెదిరింపులు, అలకలు , పిట్టకథలు అబ్చో ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్నీ వేశారు. జనానికి ఎంతో వినోదం కలిగించారు. ఇప్పుడు చెబుతున్న ఆసాధ్యాలు, సుసాధ్యాల గురించి వుభయ పార్టీల పెద్దలు పార్లమెంట్‌, అసెంబ్లీ చర్చలలో ఎందుకు చెప్పలేదని ఎవరైనా అడిగితే అది రాష్ట్ర ద్రోహం అవుతుంది. కనీసం ఎప్పుడు జ్ఞానోదయం అయిందో అదైనా చెప్పాలి. దొంగను దొంగంటే నువ్వు దొంగ, నీ కుటుంబం అంతా దొంగలే అని ఎదురుదాడి చేస్తారు. తెలుగుదేశం,బిజెపిలు ఇపుడు ఎదురుదాడికి దిగాయి. పార్లమెంట్‌లో తానొక్కడినే మాట్లాడానని,కమ్యూనిస్టులుగానీ మిగతా వారు ఎందుకు మాట్లాడలేదని వెంకయ్య నాయుడు, పాకేజి కంటే ఇంకా మెరుగైనదేమిటో చెబితే తాను పోరాడతానని చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. వెంకయ్య నాయుడి వ్యవహారం దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆవుల్లో అన్నట్లుగా వుంది. ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి తానొక్కడినే పట్టుబట్టినట్లు ఒక ఘనతగా చెప్పుకున్నారు. తీరా తామే దానికి మొండిచేయి చూపాల్సి వచ్చేసరికి తానసలు అంధ్రప్రదేశ్‌ ప్రతినిధిని కాదని అయినా దానికోసం ఎంతో చేస్తే విమర్శిస్తారా అంటున్నారు. గత రెండున్నర సంవత్సరాలలో ఎన్నడూ ఈ మాట ఎక్కడా ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పలేదు ? కావమ్మ మొగుడని మీరంతా అంటే కామోసు కామోసనుకొని ఇంతకాలం కాపురం చేశా, ఇప్పుడు కాదంటున్నారు కనుక నా కర్రా బుర్రా ఇస్తే వెళ్లి పోతా అన్నాడట వెనుకటి కెవడో ! ‘పంచాంగ’ నాయుడిగారి తీరు అలాగే వుంది.

     రాష్ట్ర విభజన ఒక రాజకీయ నిర్ణయం. దానిలో భాగస్వాములు కానిది ఒక్క సిపిఎం మాత్రమే. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు మిగతా పార్టీలన్నీ ఎంతో కొంత దానిలో భాగస్వాములే. ఒక వైపు రెండు కళ్ల సిద్ధాంతం చెబుతూ చంద్రబాబు నాయుడు తన పాత్రను చక్కగా పోషించారు. విభజన చట్టంలోని అంశాల గురించి ఏం మాట్లాడితే జనం ఏమనుకుంటారో, రాజకీయంగా నష్టమా లాభమా అని ఆలోచించి విభజనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సమయంలో విభజన సరిగా లేదంటూ తెలుగుదేశం పార్టీ గోడమీది పిల్లివాటం ప్రదర్శించింది. భాషా ప్రయ్తు రాష్ట్రాలను విడదీయకూడదన్న తమ సూత్రబద్ద వైఖరికి సిపిఎం కట్టుబడి వుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా విభజితమయ్యే రెండు రాష్ట్రాలలోనూ తమ పలుకుబడి పెంచుకోవచ్చన్న దురాశతో బిజెపి నేతలు కాంగ్రెస్‌ నిర్ణయానికి వంతపాడారన్నది నగ్నసత్యం. అందుకే వెంకయ్య నాయుడు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు తప్ప నిజానికి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కాదు. ఆ పెద్దమ్మనే (సోనియా గాంధీ) కాదు, ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండని సుష్మాస్వరాజ్‌ తెలంగాణా వాసులను, కాంగ్రెస్‌ ఐదంటే కాదు పది అని పట్టుబట్టి ప్రత్యేక హోదాకు ఒప్పించింది తామే అని బిజెపివారు ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకున్న విషయాన్ని కాదంటారా ? అప్పుడు ఏ పార్టీ వారు కూడా పాకేజి గురించి మాట్లాడలేదు. మాట తప్పింది, ద్రోహం చేసింది బిజెపి . అందువలన హోదా గురించి మాట్లాడింది మీరే కనుక ఆ ఖ్యాతిని కూడా గుండుగుత్తగా వుంచుకోండి , ప్రత్యేక హోదాను తప్ప అందుకు వచ్చే ఖ్యాతిలో వాటా ఇమ్మ ని ఎవరైనా అడిగితే వెంకయ్యకు కోపం వస్తే అర్ధం వుంది. ఎవరూ అడగటం లేదే ! ఒక రాజకీయ పార్టీ మీద మరొక పార్టీ ఎదురుదాడి చేస్తే కొంత వరకు అర్ధం చేసుకుంటారు, కానీ మొత్తం జనం మీదే ఎదురుదాడికి దిగి లబ్ది పొందిన రాజకీయ పార్టీ మనకు ఎక్కడా కనపడదు. ఇపుడు కొన్ని రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని బిజెపి,తెలుగుదేశం పార్టీలు ప్రశ్నించిన జనం మీదే తుపాకులు ఎక్కుపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధిని కాకపోయినా నన్నే తిడతారా అంటూ వెంకయ్య నాయుడి రుసరుసలు.ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి కాకపోయినా రాష్ట్రానికి ఎంతో చేశారంటూ ఆ పెద్దమనిషికి బిజెపి నేతలు సన్మానాల మీద సన్మానాలు చేస్తున్నారు. రెండు పార్టీలకు చట్ట సభల్లో సరిపడా తగిన మద్దతు వుంది,కావాలనుకుంటే ఎదుటి పార్టీల ప్రతినిధులను ఆకర్షించగలిగే అధికారం వుంది, నీతి నియమాలను ఎప్పుడో గాలికి వదిలి నిరంతరం ఎక్కడ అధికారమనే పంచదార వుంటే అక్కడికి చేరే చీమల మాదిరి పార్టీలు మారటానికి సిద్ధంగా వున్న జనం వున్నారు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ఎదురు దాడి ప్రారంభించిన చంద్రబాబు

    వెంకయ్య నాయుడి మాటలలో చెప్పాలంటే ప్రత్యేక హోదాతో నిమిత్తం లేకుండానే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు ఒప్పందాలు చేసుకున్నారు. పదేళ్లలో చేయాల్సిందానిని రెండు సంవత్సరాలలోనే కేంద్రం ఎన్నో చేసిందని వెంకయ్య నాయుడు టాం టాం వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దీనికి కృతజ్ఞతల మీద కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా గురించి వూరూ వాడా ప్రచారం చేసింది, అశలు కల్పించింది మీరు. ఎప్పుడూ పాకేజి గురించి చెప్పలేదు. ఇప్పుడు పాకేజి కంటే మెరుగైనదేమిటో చెప్పమని చంద్రబాబు, తెలుగుదేశ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. అది కూడా చెప్పాల్సింది మీరే. పద్నాలుగవ ఆర్ధిక సంఘం కొత్తగా ప్రత్యేక హోదాను ఇవ్వకూడదని సిఫార్సు చేసిందని ఒక మాట, ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఇస్తే మిగతావన్నీ తమకూ అడుగుతాయి,ఇవ్వకపోతే ఎన్‌డిసిలో వ్యతిరేకిస్తాయి అని మరోమాట, ఇప్పటికే వున్న రాష్ట్రాలకు కూడా రద్దు చేయబోతున్నాం అని ఇంకోమాట. ఏదో ఒక మాట మీద కట్టుబడి వుండాలి కదా !

    ప్రత్యేక హోదాకు ఇన్ని ఆటంకాలు చెప్పిన పెద్ద మనుషులు ప్రత్యేక పాకేజీ కూడా లేకుండా ప్రత్యేక సాయం అని పేరు పెట్టి ఒక ప్రకటన చేశారు. ఓకే ఆంధ్రప్రదేశ్‌ పట్ల జాలి, దయ, కరుణతో ఈ సాయం చేస్తున్నారని అనుకుందాం. అది నిబంధనలకు అనుగుణంగానా, లేక పక్కన పెట్టారా ? అనుగుణ్యంగానే అయితే దానిలో ప్రత్యేకత ఏమున్నట్లు. వుదాహరణకు రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన ఆదాయలోటు రు.22,113 కోట్ల మొత్తాన్ని ఐదు సంవత్సరాలలో కేంద్రం చెల్లిస్తుంది. దీన్ని ప్రత్యేక సాయం అంటున్నారు, అది ఎలా అవుతుంది ? రాష్ట్రాన్ని విడగొట్టకపోయినా ఆ మొత్తం వచ్చేదే. ఎందుకంటే మన రాష్ట్ర విభజనతో నిమిత్తం లేని పధ్నాలుగవ ఆర్ధిక సంఘం ఆంధ్రప్రదేశ్‌తో పాటు పదకొండు రాష్ట్రాలకు రు.1,94,821 కోట్ల రూపాయలను ఐదు సంవత్సరాల కాలంలో చెల్లించాలని సిఫార్సు చేసింది. విశాఖ పట్టణం నగరం కంటే తక్కువ జనాభా వున్న నాగాలాండ్‌ రాష్ట్రానికి రు.18,475, జమ్ము కాశ్మీర్‌కు 60, హిమచల ప్రదేశ్‌కు 40వేల కోట్లు ఇవ్వనున్నారు. దీన్ని గురించి ఏమంటారు ?http://ficci.in/SPdocument/20563/Highlights_14thFinance_Commission_Report.pdf

    ప్రత్యేక హోదాకు,పరిశ్రమల రాయితీలకు సంబంధం లేదని ఒక మాట. విభజన చట్టంలోనే హోదా గురించి అప్పుడు కాంగ్రెసే పెట్టి వుంటే పోయేది, ఆ పని చేయకుండా అన్యాయం చేసిందని ఒక విమర్శ. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే పరిశ్రమలన్నీ అక్కడికే తరలి పోతాయని తమిళనాడు అభ్యంతరం చెబుతున్నదని వెల్లడించింది ఎవరు ? హోదాకు రాయితీలకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్‌ జనాల మెదళ్లకు ఎక్కించేందుకు కష్టపడకపోతే అదేదో అభ్యంతరాలు పెట్టే రాష్ట్రాలకు ఎందుకు నచ్చచెప్పలేకపోయినట్లు ? రాని హోదా గురించే పట్టుబట్టి ఇచ్చే రాయితీలసు కూడా వద్దందామా అని మరొక ఎదురుదాడి.ఈ కాలంలో వెంకయ్య నాయుడి చొరవతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమిటో, హోదాతో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి చేసిందేమిటో ఒక శ్వేతపత్రం ప్రకటించి వివరిస్తే తప్ప జనానికి వాస్తవం అర్ధం కాదు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ప్రధాని అలా మనవి చేసుకుంటారా ? గవర్నర్‌ అంతగా దిగజారి పోయారా ?

      అన్నింటికీ కొత్త అర్ధాలు చెబుతున్న మాననీయ ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశానికి కూడా కొత్త భాష్యం చెప్పినట్లు ఒక అస్మదీయ పత్రిక వార్తలను బట్టి తెలిసింది. ప్రధాన మంత్రి, రాష్ట్ర గవర్నర్‌ భేటీ అయ్యారని 40 నిమిషాలలో సగం పాకేజి,ఆంధ్రప్రదేశ్‌ గురించే మాట్లాడారని లీకుల కధనం. ఆ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు ప్రధానో లేక గవర్నరో అస్మదీయ పత్రికల విలేకర్లను పిలిచి చెవిలో వూది వుండాలి. లేకపోతే వారి ప్రతినిధులు కల్పించిన కధనమైనా అయి వుండాలి. తామేం చేసినా, చెప్పినా నోరు మూసుకొని వినాలి, పడి వుండాలన్న బరితెగింపు కాకపోతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే సమస్య మరింత జఠిలం అవుతుందని ప్రధాని మోడీ అభిప్రాయ పడినట్లు ఆ కధనంలో వుంది.అలాంటపుడు మజ్లిస్‌ పార్టీ ప్రతినిధితో సహా అఖిల పక్ష బృందాన్ని కాశ్మీర్‌కు ఎందుకు పంపినట్లు ? సమస్యను మరింత జఠిలం చేయటానికా ? ఇక ముందు ఎలాంటి అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయరని భావించాలా ? అభివృద్ధి కావాలనుకున్నవారు ప్యాకేజీని స్వాగతిస్తారని, సమస్యను సాగదీసి రావణకాష్టం చేయాలనుకున్నవారు మాత్రమే విమర్శలు చేస్తారని ప్రతిపక్షాలపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్యాకేజికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందట. కొన్ని ప్రాంతాలలో ఇలాంటి వాటిని పోసుకోలు కబుర్లు అంటారు. హోదా బదులు వట్టిస్తరి మంచినీళ్ల వంటి పాకేజీకి జనాన్ని ఒప్పించటానికి పడుతున్న పాట్లు తప్ప మరొకటి దీనిలో కనిపించటం లేదు. పాకేజి పట్ల 60శాతం జనం సంతృప్తిగా వున్నారని ప్రతిపక్షాలు మాత్రం హోదా వల్ల అమిత ప్రయోజనాలు కలుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నాయని గవర్నర్‌ ప్రధానితో చెప్పినట్లుగా వుంది. ఒక గవర్నర్‌ ప్రధానితో కలిసినపుడు ఒక వేళ చెప్పాల్సి వస్తే ఏ పార్టీ వైఖరి ఏమిటో చెబుతారు తప్ప దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఒక రాజకీయ నేత మాదిరి ఫిర్యాదు చేస్తారా ? గవర్నర్‌ అంతగా దిగజారి పోయారా ? ప్రతిపక్షాలపై తాము చేయదలచుకున్న ఆరోపణలను గవర్నర్‌కు ఆపాదించి వాటికి విశ్వసనీయత కల్పించ చూసే అతి తెలివి తప్ప మరొకటి కాదు . అంతకంటే పెద్ద తెలివి తక్కువ పదజాలం చూడండి. ‘ ఇంకొన్ని అంశాలలో ఏపీకి సాయం అవసరమనే విషయం మేమూ గుర్తించాం. వాటిని కూడా అందించటానికి ప్రణాళిక రూపొందించుకుంటాం ‘ అని ప్రధాని పేర్కొన్నారట. ప్రణాళికను రూపొందించుకుంటాం అని ప్రధాని అన్నట్లుగా రాయటం చంద్రబాబు మెప్పు పొందటానికి తప్ప మరొకటి కాదు. ఒక కింది స్ధాయి అధికారి పెద్ద అధికారితో ‘మనవి’ చేసుకున్నట్లుగా వుంది తప్ప ఒక ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్య మంత్రితో మాట్లాడినదిగా లేదు. అయితే ఇక్కడ ఒకటి జరిగి వుండటానికి ఆస్కారం వుంది. ఆంగ్ల భాషలో ప్రధాని అంత పండితుడు కానట్లే హిందీలో కూడా చంద్రబాబు అంతే. అందువలన ఒకరు హిందీలో మరొకరు ఆంగ్లంలో ఫోన్లో మాట్లాడి నపుడు సదరు వార్త రాసిన విలేకరి పక్కనే వుండి విని రాసుకోవటం లేదా చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేసి మాట్లాడిన దానిని తర్జుమా చేయటంలో వచ్చిన ఇబ్బంది కానీ అయి వుండాలి.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

చంద్రబాబు చక్రం తిప్పటంపై జనంలో ఇంకా ఆశలు

    తెలుగుదేశ నాయకత్వ ఆరోపణలను వారి మాటల్లో చెప్పాలంటే వారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే ప్రతిపక్షాలు జనాన్ని రెచ్చగొడుతున్నాయి. జనం రెచ్చిపోయిన సూచనలు ఎక్కడా కనిపించటం లేదు. అంతా శాంతియుతంగా వుంది. కనుక తెలుగుదేశమే ప్రతిపక్షాలను రెచ్చగొడుతున్నది అనుకోవాలేమో ! ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక హోదా రాష్ట్రం అంటే ఏమిటో జనానికి ఒక బ్రహ్మ పదార్ధంగా తయారైంది. అది రాదని తెలిసిన తెలుగుదేశం, బిజెపిలు , వాటికి కొమ్ముకాసే మీడియా దాని వలన కలిగే ప్రయోజనాలను జనానికి వివరించి చైతన్య పరచటం, ఆశలు కలిగించటం తమకు నష్టమని భావించాయన్నది కొందరి అభిప్రాయం. కర్ణుడి రధం నడుపుతూనే అతనిని దెబ్బతీయటానికి ప్రయత్నించిన సారధి శల్యుడి మాదిరి అస్మదీయ మీడియా జనం పక్షం అని చెపుతూనే ప్రత్యేక హోదా పట్ల జనంలో ఆసక్తి సన్నగిల్లి పోవటానికి శల్యసారధ్యం చేస్తున్నదా ? ఆ మేరకు జయప్రదమైనట్లే కనిపిస్తున్నది. ప్రత్యేక హోదా రాదన్న నిరాశ, నమ్మిన వారే మోసం చేశారన్న ఆశక్తత జనంలో కనిపిస్తోందన్నది ఒక అభిప్రాయం. రెండో వైపు ప్రతిపక్షంపై విస్వసనీయత లేకపోవటంతో నిజం చెప్పినా నమ్మని స్ధితి, వామపక్షాలు నామమాత్రంగా మారటం. మూడో అభిప్రాయం కూడా వుంది అదేమంటే తిమ్మిని బమ్మిని చేయగల చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఐటి రంగంలో అమరావతిని మరో హైదరాబాదుగా మారుస్తారనే గుడ్డి విశ్వాసం బలంగా వుండబట్టే హోదా లేకపోయినా ఇచ్చిందాంతో సంతృప్తి చెందుదామనే భావనకు లోనయ్యారనే అభిప్రాయమూ వుంది.

  ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న శతకకారుడిని బిజెపి-తెలుగుదేశం పార్టీలు ఆశ్రయించినట్లు ఇప్పుడు వారి మాటలను బట్టి చెప్పవచ్చు. ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి జనాన్ని భ్రమ పెడితే ఇప్పుడు ప్రత్యేక హోదా లేకపోయినా రాయితీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తారని బాబొస్తే జాబొస్తుందన్న పాత నినాదాన్ని తిరిగి జనానికి గుర్తు చేశారు. ఇది మరొక ఆశాభంగానికి నాంది అవుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పార్లమెంటరీ, మీడియా కుట్రలతో ప్రభుత్వాల కూల్చివేత !

13 Tuesday Sep 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ 1 Comment

Tags

Brazil, elected governments, Honduras, parliamentary and media coup, Parliamentary coup, Prague, Turkey

Image result for parliamentary and media coup against elected governments

సత్య

     గత కొద్ది వారాలుగా వివిధ ఖండాలలోని కొన్ని దేశాలలో జరిగిన పరిణామాలను పరిశీలించినపుడు పార్లమెంటరీ వ్యవస్ధలు, మీడియా సంస్ధలు, వ్యక్తుల పాత్రలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. పార్లమెంటరీ వ్యవస్థలు పరిహాసం పాలౌతున్నాయి, కుట్రలకు నిలయాలుగా మారుతున్నాయి. మీడియా ‘స్వతంత్ర’ సూచిక వేగంగా పడిపోతున్నది. ఏదో ఒక పక్షాన చేరి తారసిల్లటానికే యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. చాలా కాలంగా కప్పుకున్న మేకతోళ్లను తీసి అవతల పడవేస్తున్నాయి. అందుకే గతంలో పత్రికలు పెట్టుబడిదారులకు పుట్టిన విష పుత్రికలు అని వర్ణించినపుడు విపరీత వ్యాఖ్యానంగా భావించిన వారు మీడియా పోకడలను చూసి ఇప్పుడు నిజమే అన్న నిర్ధారణలకు వస్తున్నారు. వర్గ సమాజంలో అటో ఇటో చేరకుండా తటస్థంగా వుండటం అసాధ్యమని, అదొక ముసుగు మాత్రమే అని కమ్యూనిస్టులు ఎప్పుడో చెప్పారు. ఎవరైనా తాము అటూ ఇటూ కాదు అని చెప్పారంటే మార్పును వ్యతిరేకించి వున్న వ్యవస్ధను వున్నట్లుగా వుంచాలని చెప్పటమే. పర్యవసానం ఆ వ్యవస్ధను కాపాడాలని కోరుకొనే వారికి మద్దతు ఇవ్వటమే. ముందే కూసిన కోయిల కూతలను పరిగణనలోకి తీసుకోనట్లే ఆ కమ్యూనిస్టులు అన్నీ ఇలాగే చెబుతారు అని తోసిపుచ్చిన వారు ఇప్పుడేమంటారో తెలియదు. ఏమన్నా అనకున్నా వాస్తవాలను ఎల్లకాలం దాయటం కష్టం.

      జూలై 15న ఐరోపాలోని టర్కీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు మిలిటరీలోని ఒక వర్గం విఫల తిరుగుబాటు చేసింది. కుట్రలో జర్నలిస్టులు కూడా వున్నట్లు తేలటంతో టర్కీ ప్రభుత్వం అనేక మంది ఇతర కుట్రదారులతో పాటు వంద మంది జర్నలిస్టులను కూడా అరెస్టు చేసింది. అమెరికాలో తిష్టవేసిన టర్కీ ముస్లిం ఇమాం ఫతుల్లా గులెన్‌ సిఐఏతో కలసి రూపొందించిన కుట్ర మేరకు సైనికాధికారులు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించారన్న విషయం తెలిసిందే. కుట్రను విఫలం చేసిన తరువాత గులెన్‌కు మద్దతు ఇస్తున్న 130 మీడియా సంస్ధలు మూతపడ్డాయి. వందమంది వరకు జర్నలిస్టులను అరెస్టు చేశారు. కొందరు విదేశాలకు పారిపోయారు. ఆగస్టు నెలాఖరులో బ్రెజిల్‌ పార్లమెంట్‌ అభిశంసన తీర్మానం ద్వారా ఆ దేశపు వామపక్ష వర్కర్స్‌ పార్టీ (పిటి)నేత అయిన దిల్మా రౌసెఫ్‌ను దేశాధ్యక్ష పదవి నుంచి తొలగించారు. దీన్ని ప్రజాస్వామిక కుట్రగా కొంత మంది వర్ణించారు. కుట్రల జాబితాలోకి కొత్త పదం చేరింది. ఈ ప్రజాస్వామిక కుట్రలో స్వతంత్ర పాత్ర పోషిస్తున్నామని చెప్పుకొనే మీడియా ఒక ముఖ్యపాత్ర వహించిందన్న విమర్శలు కూడా గట్టిగానే వచ్చాయి. దీంతో ప్రభుత్వాల కూల్చివేత కుట్రదారుల్లో మీడియా అధిపతులు కూడా వుంటారని చేర్చాల్సి వుంది. ఈ వార్తలు చదువుతున్న సమయంలోనే బంగ్లాదేశ్‌లో వంగ బంధు ముజబుర్‌ రహ్మాన్‌ హత్య, ప్రభుత్వ కూల్చివేతలో భాగస్వామి అయ్యారనే నేరారోపణపై విచారణకు గురై వురి శిక్ష పడిన ఒక మీడియా అధిపతి మీర్‌ ఖాసిం అలీని 1971లో చేసిన నేరాలకు గాను సెప్టెంబరు మొదటి వారంలో వురి తీశారు. నేరం చేసి సమయంలో పాకిస్థాన్‌ అనుకూల విద్యార్ధి సంఘనేతగా వున్నప్పటికీ తరువాత కాలంలో ఒక పెద్ద వాణిజ్య, మీడియా అధిపతిగా ఎదిగాడు.

   అధికార రాజకీయాలు- ప్రభుత్వాలపై మీడియా అధిపతులు లేదా సంస్ధల ప్రమేయం లేదా పెత్తనం, ప్రభావం ఎలాంటిదో తెలుగువారికి చెప్పనవసరం లేదు. ఒక పార్టీకి వ్యతిరేకంగానో అనుకూలంగానో మాత్రమే కాదు, పార్టీ అంతర్గత విబేధాలలో కూడా జోక్యం చేసుకోవటాన్ని ఎన్‌టిరామారావుపై తెలుగుదేశంలో తిరుగుబాటు సందర్భంగా అందరూ చూశారు. కాంగ్రెస్‌ నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండు పత్రికలపై బహిరంగంగానే విమర్శలు చేయగా తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ఒక పత్రిక, ఛానల్‌ విలేకర్లను తమ పార్టీ సమావేశాలకు రావద్దని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక నేత లేదా పార్టీని కొన్ని పత్రికలు ఎలా పెంచి పెద్ద చేయవచ్చో, నచ్చనపుడు సదరు నేతను వ్యతిరేకించి ఎలా బదనాం చేయవచ్చో, అదే పార్టీలో అంతకంటే ఎక్కువగా తమకు వుపయోగపడతారనుకున్నపుడు ఇతర నేతలు, పార్టీలను ఎలా ప్రోత్సహిస్తారో ప్రత్యక్షంగా చూశారు, చూస్తున్నారు, భవిష్యత్‌లో కూడా చూస్తారు. మీడియా ఏకపక్షంగా వ్యవహరించినా లేక ఒక పక్షం వహించిందని జనం భావించినా ఏం జరుగుతుందో కాశ్మీర్‌ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. కాశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలు, అక్కడి పరిస్థితిని జాతీయ మీడియా సంస్ధలు వక్రీకరిస్తున్నాయి లేదా వాస్తవాల ప్రాతిపదికన వార్తలను అందించటం లేదన్న విమర్శలు ఇటీవలికాలంలో పెరిగిపోయాయి. పార్లమెంటరీ అఖిలపక్ష బృందం పర్యటన సందర్భంగా కాశ్మీర్‌లోయలో కర్ప్యూను సడలించారు. ఆ సమయంలో ప్రెస్‌ అని స్టిక్కర్‌ పెట్టుకున్న వాహదారులపై అక్కడి నిరసనకారులు దాడులకు పాల్పడిన ఘటనలు జరిగాయి. కొంత మంది విలేకర్లు తాము జాతీయ మీడియాకు చెందినవారం కాదు, స్దానిక సంస్ధలలో పని చేస్తున్నామని చెప్పినా జర్నలిస్టులంటే జర్నలిస్టులే తప్పుడు రాతలు రాస్తారు, తప్పుడు దృశ్యాలను చూపుతారు అంటూ వరసపెట్టి దాడి చేసిన వుదంతాలు వున్నాయి. ఇది కాశ్మీర్‌కే పరిమితం కాదు, కొన్ని ఛానల్స్‌ లేదా పత్రికలకే పరిమితం కాబోదు. యాజమాన్యాల వైఖరి కారణంగా ఆ సంస్థలలో పని చేసే జర్నలిస్టులకు రాబోయే రోజుల్లో తలెత్తనున్న ముప్పును ఇవి సూచిస్తున్నాయి.

   టర్కీలో కుట్ర నుంచి తప్పించుకున్న ఎర్డోగన్‌కు గతంలో మద్దతు ఇచ్చిన శక్తులే వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ మాదిరి టర్కీ, ఇరాక్‌, సిరియా తదితర దేశాలను చీల్చి ఆ ప్రాంతంలో కుర్దిస్ధాన్‌ ఏర్పాటు చేయాలన్న పధకాన్ని అమలు జరిపేందుకు అమెరికా పూనుకుందన్న వార్తలతో రష్యన్లు ముందుగానే టర్కీని హెచ్చరించటంతో కుట్రను జయప్రదంగా తిప్పి కొట్టగలిగినట్లు చెబుతున్నారు. కుట్రకు పాల్పడిన వారిలో సైనికాధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులను టర్కీ ప్రభుత్వం అరెస్టు చేసి రానున్న రోజుల్లో విచారణ జరిపి శిక్షలు విధించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అందువలన మీడియా పాత్ర ఏమిటనే చర్చ రాబోయే రోజుల్లో పెద్దగా జరగటం అనివార్యం.

   ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవటమా లేదా అన్న సమస్యపై జరిగిన ప్రజాభి ప్రాయసేకరణలో మీడియా ఎలా వ్యవహరించిందో చూశాము. చివరకు ప్రభుత్వ నిధులతో నడిచే బిబిసి కూడా ఒకవైపు మొగ్గింది. నిజానికి ఆ ప్రజాభిప్రాయ సేకరణలో వర్గ సమస్య లేదు. కార్పొరేట్‌ శక్తుల లాభనష్టాల విషయంలో తలెత్తిన విభేధాలతో కొన్ని సంస్ధలు విడిపోవటానికి అనుకూలిస్తే మరికొన్ని వ్యతిరేకించాయి. నవంబరు నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అధికార డెమోక్రటిక్‌ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీల అభ్యర్ధుల ఎన్నిక ప్రక్రియలో మీడియా సంస్ధలు ఎలా జోక్యం చేసుకున్నాయో, ఇప్పుడు అభ్యర్ధులు ఖరారైన తరువాత మొత్తంగా మీడియా రెండు శిబిరాలుగా చీలిపోవటాన్ని చూడవచ్చు. అసలు ఆ ఎన్నికలే కొంత మంది దృష్టిలో పెద్ద ప్రహసనం అయితే దానిలో మీడియా జోక్యం చేసుకొని తిమ్మినిబమ్మిని చేయటం, ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేయటం కనిపిస్తుంది. లాటిన్‌ అమెరికాలో జరిగిన పరిణామాలలో మీడియా పాత్రను మరింత అధ్యయనం చేయాల్సి వుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదులు లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలలో అనేక మంది నియంతలను రంగంలోకి తెచ్చి తమ కార్పొరేట్‌ అనుకూల వ్యవస్ధలను ఏర్పాటు చేశారు. లాటిన్‌ అమెరికాలో దాదాపు ప్రతి దేశం సైనిక తిరుగుబాట్లు, నియంతల పాలనలో మగ్గటమే గాక ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధల విధానాలైన నయావుదారవాద ప్రయోగశాలగా మార్చి వేశారు. ఈ క్రమాన్ని అక్కడి మీడియా మొత్తంగా బలపరచటమేగాక, నియంతలు, అభివృద్ధి నిరోధకులను సోపానాలుగా చేసుకొని ప్రతి దేశంలో మీడియా రంగంలో గుత్తాధిపతులు తయారయ్యారు. నీకిది నాకది అన్నట్లుగా నియంతలు, కార్పొరేట్లు, మీడియా అధిపతులు కుమ్మక్కై పంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారందరూ ఒకరి ప్రయోజనాలను ఒకరు కాపాడుకొనేందుకు ఏకం అవుతారని కూడా వేరే చెప్పనవసరం లేదు.

   నయావుదారవాద విధానాలు, నియంతలకు వ్యతిరేకంగా ప్రతి దేశంలోనూ సాయుధ, ప్రజా పోరాటాలు చెలరేగాయి. దాంతో నియంతలతో ఎల్లకాలం జనాన్ని అణచలేమని గ్రహించిన సామ్రాజ్యవాదం విధిలేని పరిస్థితుల్లో నియంతల స్ధానంలో ప్రజాస్వామ్య వ్యవస్ధల పునరుద్ధరణకు తలవంచక తప్పలేదు. దాంతో దాదాపు ప్రతి దేశంలోనూ ఎన్నికలు స్వేచ్చగా జరిగిన చోట నియంతలను వ్యతిరేకించిన, పోరాడిన శక్తులు అధికారానికి వచ్చాయి. వాటిలో కొన్ని చోట్ల వామపక్ష శక్తులున్నాయి. క్రమంగా అనేక దేశాలలో అవి ఎన్నికల విజయాలు సాధించటం, పౌరులకు వుపశమనం కలిగించే చర్యలు తీసుకొని ఒకటికి రెండు సార్లు వరుసగా అధికారానికి వస్తుండటం, రాజకీయంగా అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకోవటం, తమలో తాము సంఘటితం కావటానికి ప్రయత్నించటం వంటి పరిణామాలు అమెరికన్లకు నచ్చలేదు. దీంతో తిరిగి కుట్రలకు తెరలేపింది. గతంలో లేని విధంగా పార్లమెంటరీ కుట్ర, ప్రజాస్వామ్య ఖూనీలకు పాల్పడింది. వాటికి మీడియా సంస్ధలు వెన్నుదన్నుగా కత్తి చేయలేని పనిని కలంతో పూర్తి చేస్తున్నాయి.

Image result for parliamentary and media coup against elected manual zelaya

హొండురాస్‌ అధ్యక్షుడిని పక్కదేశం కోస్టారికాలో పడేశారు

     హొండూరాస్‌లో జోస్‌ మాన్యుయల్‌ జెలయా రోసాలెస్‌ దేశాధ్యక్షుడిగా 2006లో ఎన్నికయ్యాడు. మితవాద వేదిక నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మిగతా లాటిన్‌ అమెరికా దేశాల ప్రభావంతో విదేశాంగ విధానంలో వెనెజులా, బ్రెజిల్‌,అర్జెంటీనాలతో కలసి అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకొని లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల కూటమిలో చేరాలని నిర్ణయించాడు. మితవాద కూటమి నుంచి వామపక్ష వైఖరి తీసుకోవటం హొండురాస్‌ మితవాద రాజకీయ శక్తులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, మీడియా శక్తులకు అసలు మింగుడు పడలేదు. విదేశాంగ విధానంతో పాటు అందరికీ వుచిత విద్య, చిన్న రైతులకు సబ్సిడీలు, వడ్డీరేటు తగ్గింపు, కనీసం వేతనం 80శాతం పెంపు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, వుద్యోగులకు సామాజిక భద్రత కల్పన, దారిద్య్ర నిర్మూలన వంటి చర్యలు తీసుకున్నారు. ప్రయివేటు మీడియా ప్రభుత్వ కార్యకలాపాలను దాదాపు బహిష్కరించింది.అసలేం జరుగుతోందో కూడా జనానికి తెలియకుండా అడ్డుకుంది. దాంతో రోజుకు రెండు గంటల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి టీవీ, రేడియో ప్రసారం చేయాలనే వుత్తరువులను జెలయా జారీ చేశాడు. ప్రతిపక్షం దీనిని నిరంకుశ చర్యగా అభివర్ణించింది. దేశంలో హత్యల రేటు మూడు శాతం తగ్గిన సమయంలో పెరిగిపోయినట్లు మీడియా ప్రచారం చేసింది. జెలయాను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఆయనను తీవ్రంగా విమర్శించే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దానిని అవకాశంగా తీసుకొని ఇంకే ముంది జెలయానే ఆ పని చేయించాడు, జర్నలిస్టులకు రక్షణ లేదనే ప్రచారం మొదలు పెట్టారు. 2010లో జరిగే ఎన్నికలలో అధ్యక్ష, పార్లమెంట్‌, స్దానిక సంస్ధలతో పాటు దేశ రాజ్యాంగ సవరణల గురించి కూడా ఓటింగ్‌ నిర్వహించాలని జెలయా 2009లో ప్రతిపాదించాడు. ఇంతకంటే ప్రజాస్వామిక ప్రతిపాదన మరొకటి వుండదు. కానీ జెలయా తన పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సవరణలు చేయరాదనే నిషేధాన్ని వుల్లంఘించినందున పదవికి అనర్హుడు అంటూ అభిశంశస ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.నిజానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుంటే అధ్యక్షుడు రాజ్యాంగాన్ని సవరించటానికి వీలుంది. రెండవది అధ్యక్షపదవికి ఎన్నిక జరిపే సమయంలోనే రాజ్యాంగాన్ని సవరించటానికి జనం ఆమోదం కోసం ఓటింగ్‌ జరపాలని పెట్టినందున ఆ ఎన్నికలో ఓడిపోతే ఇంటికి పోవాలి, గెలిస్తే కొనసాగవచ్చు, రాజ్యాంగ సవరణ ద్వారా కొనసాగే సమస్యే అక్కడ తలెత్తలేదు.

    రాజ్యాంగ సవరణపై ప్రజాభిప్రాయ సేకరణతో సహా ప్రతిపోలింగ్‌ కేంద్రానికి నాలుగు బ్యాలట్‌ బాక్సులను తరలించేందుకు సహకరించాలని జెలయా మిలిటరీని కోరాడు. మిలిటరీ ప్రధాన అధికారి ధిక్కరించటంతో జెలయా అతడిని బర్తరఫ్‌ చేశాడు. మిలిటరీ అధికారికి మద్దతుగా రక్షణ మంత్రితో పాటు పలువురు మిలిటరీ అధికారులు రాజీనామా చేశారు. సైనికాధికారిని బర్తరఫ్‌ చేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పార్లమెంట్‌, సుప్రీం కోర్టు కూడా తీర్మానించాయి. అయితే బర్తరఫ్‌కు రెండు రోజుల ముందే కీలక ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించటం, బర్తరఫ్‌కు ముందు రోజే ఆ పని చేసినట్లు వార్తలు వ్యాపించటాన్ని బట్టి కుట్రలో భాగంగానే ప్రధాన అధికారి ధిక్కరణ కూడా వుందని వెల్లడైంది. సైనిక దళాల ప్రధాన అధికారిని బర్తరఫ్‌ చేసిన మరుసటి రోజు జెలయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించటం, వెంటనే సైన్యం ఆపని చేసింది. నిదుర మంచం మీద వున్న జెలయాను అరెస్టు చేసి పక్కనే వున్న కోస్టారికాలో పడేసి వచ్చారు. హింసాకాండ చెలరేగే ప్రమాదం వుందనే కారణంగా అధ్యక్షుడిని బర్తరఫ్‌ చేసినట్లు సాకు చెప్పారు. తరువాత జెలయా రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తున్నట్లు పార్లమెంట్‌ తీర్మానించింది. నిజానికి జెలయా ఎలాంటి రాజీనామా పత్రంపై సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితో సహా అంతర్జాతీయ సంస్థలు అనేకం ఖండించాయి, చివరకు కుట్ర సూత్రధారి ఒబామా కూడా తొలగింపు చట్టబద్దం కాదని ప్రకటించాల్సి వచ్చింది.తరువాత జరిగిన ఎన్నికలలో అనేక అక్రమాలు జరిగాయి. తొలుత 60శాతం ఓట్లు పోలయ్యాయని, 55శాతం ఓట్లతో కొత్త అధ్యక్షుడు ఎన్నికైనట్లు ప్రకటించారు, ఆ తరువాత అసలు పోలైంది 49శాతమే అని పేర్కొన్నారు. ఈ అక్రమాన్ని మీడియా బయటపెట్టకపోగా సక్రమమే అని చిత్రించి మద్దతు ఇచ్చాంది.

Image result for parliamentary  coup against elected governments

పరాగ్వేలో పేదల పక్షాన పనిచేయటమే తప్పిదమైంది

      రోమన్‌ కాథలిక్‌ బిషప్‌గా పని చేసిన ఫెర్నాండో అరిమిందో ల్యూగో మెండెజ్‌ పరాగ్వే అధ్యక్షుడిగా 2008-12 సంవత్సరాలలో పని చేశారు. చిన్నతనంలో రోడ్లపై తినుబండారాలను విక్రయించిన ల్యూగో కుటుంబానికి నియంతలను ఎదిరించిన చరిత్ర వుంది. దాంతో ల్యూగో సాధారణ విద్యనభ్యసించి ఒక గ్రామీణ ప్రాంతంలో టీచర్‌గా పని చేశారు. ఆ సందర్భంగా వచ్చిన అనుభవంతో ఆయన క్రైస్తవ ఫాదర్‌గా మారారు. ల్యూగోను ఈక్వెడార్‌లో పనిచేయటానికి పంపారు. అక్కడ పని చేసిన ఐదు సంవత్సరాల కాలంలో పేదల విముక్తి సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నారు. అది గమనించిన పరాగ్వే పోలీసులు 1982లో స్వదేశానికి తిరిగి వచ్చిన ల్యూగోను దేశం నుంచి వెలుపలికి పంపి వేయాలని చర్చి అధికారులపై వత్తిడి తెచ్చారు. దాంతో ఐదు సంవత్సరాల పాటు రోమ్‌లో చదువుకోసం పంపారు. 1994లో బిషప్‌గా బాధ్మతలు స్వీకరించారు. ఎన్నికలలో పోటీ చేయటానికి వీలుగా తనను మతాధికారి బాధ్యతల నుంచి విడుదల చేసి కొంత కాలం సెలవు ఇవ్వాలని 2005లో కోరారు. చర్చి నిరాకరించింది, తరువాత పోటీ చేసి గెలిచిన తరువాత సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు ఆయన భూ పోరాటాలను బలపరిచారు. అప్పటికే పేదల బిషప్పుగా పేరు తెచ్చుకున్న ల్యూగోను అంతం చేస్తామని బెదిరించినప్పటికీ లొంగలేదు. ఆయన తండ్రి నిరంకుశ పాలకులను ఎదిరించి 20 సార్లు జైలుకు వెళ్లటాన్ని ఆయన చూసి వున్నాడు. 2008లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.తాను వేతనం తీసుకోనని ప్రకటించాడు.తొలిసారిగా గిరిజన తెగల నుంచి ఒకరిని వారి వ్యవహారాల మంత్రిగా నియమించారు. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న మాదిరి అవినీతి నిరోధం, భూ సంస్కరణల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదలకు ఇండ్ల నిర్మాణం, నగదు బదిలీ కార్యక్రమాలు చేపట్టారు.

    పేదలకు మద్దతు ఇచ్చి భూసంస్కరణలకు పూనుకున్న ల్యూగోను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరిగింది. దానిలో భాగంగా భూ ఆక్రమణ చేసిన పేదలను తొలగించేందుకు పోలీసులు కాల్పులు జరిపి 17 మందిని బలిగొన్నారు.ఈ వుదంతం దేశంలో అభద్రతకు చిహ్నం అని ప్రచారం ప్రారంభించిన పార్లమెంట్‌ సభ్యులు ప్రజలకు భద్రత కల్పించాలంటే దేశాధ్యక్షుడిని తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. వారం రోజుల్లో పార్లమెంట్‌ వుభయ సభల్లో తీర్మానాలు చేసి తొలగించారు. వున్నత న్యాయ స్ధానం కూడా దానిని సమర్ధించింది. అక్కడి మీడియాకు దీనిలో ఎలాంటి తప్పు కనిపించలేదు.

   ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన బ్రెజిల్‌ వామపక్ష అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ ప్రజాస్వామ్య బద్దంగా పని చేయకపోవటమనే ఒక నేరాన్ని ఆపాదించి అభిశంసన ప్రక్రియ ద్వారా పదవి నుంచి తొలగించారు. ప్రపంచంలో, లాటిన్‌ అమెరికా పరిణామాలలో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది.మిలిటరీ కుట్ర, మరొక కుట్ర గురించి చరిత్రలో వుందిగానీ ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య, మీడియా కుట్ర ‘ తోడు కావటం ఈ పరిణామంలో గమనించాల్సిన అంశం. అధ్యక్షురాలిపై ఎలాంటి అవినీతి, అక్రమాల కేసులు లేవు. అయినప్పటికీ అక్కడి మీడియా ఆమెను అవినీతిపరురాలిగా చిత్రించి జనాన్ని నమ్మేట్లు చేసింది. అభిమానించిన జనమే అనుమానించేట్లు చేయటాన్ని చూసి శకుని సైతం సిగ్గు పడేట్లు, తనకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని తలపట్టుకునేట్లు చేసింది. ఎన్నికలను తొత్తడాన్ని చూశాము, ఎన్నికైన ప్రభుత్వాలను ఎంత సులభంగా కూలదోయవచ్చో చూస్తున్నాము. బ్రెజిల్‌ అధ్యక్షురాలిపై బాధ్యతా నిర్వహణలో వైఫల్యమనే నేరాన్ని ఆరోపించి పదవి నుంచి తొలగించటం ప్రజాస్వామ్యం, ప్రజాతీర్పును పరిహసించటమే. పార్లమెంట్‌ అనుమతి లేకుండా దిల్మా రౌసెఫ్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేశారన్నది ప్రధాన ఆరోపణ. గతంలో అనేక సందర్భాలలో అలా ఖర్చు చేయటం తరువాత పార్లమెంట్‌ ఆమోదం పొందటం అన్నది అన్ని చోట్లా జరిగినట్లే అక్కడా జరిగింది. అటువంటి పద్దతులను నివారించాలంటే అవసరమైన నిబంధనలను సవరించుకోవచ్చు, రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చు. అసలు లక్ష్యం వామపక్ష అధ్యక్షురాలిని పదవి నుంచి తొలగించటం కనుక ఏదో ఒక సాకుతో ఆపని చేశారు. దొంగే దొంగ అని అరచి నట్లుగా అనేక అవినీతి కేసులలో ఇరుక్కున్నవారే అధ్యక్షురాలిపై కుట్ర చేసి పార్లమెంట్‌, కోర్టులను వుపయోగించుకొని పదవి నుంచి తొలగించారు.ఈ క్రమం ప్రారంభమైనపుడే అనేక మంది అంతర్జాతీయ న్యాయ నిపుణులు అభిశంసనకు ఎలాంటి ఆధారమూ లేదని ప్రకటించారు. అయినా జరిగిపోయింది.పాండవ పక్షపాతి కృష్ణుడికి ముందుగా వచ్చిన ధుర్యోదనుడిని తప్పించుకోవటానికి ముందుగ వచ్చితీవు, మున్ముందుకు అర్జును జూచితి అన్నట్లుగా దిల్మా రౌసెఫ్‌కు వ్యతిరేకంగా ఓటు చేసిన వారందరూ దాదాపు ఏదో ఒక అవినీతి కుంభకోణం కేసులలో వున్నవారే అయినా మీడియాకు అదేమీ కనిపించలేదు.

  వామపక్ష శక్తులు శక్తివంతమైన మీడియాతో ప్రారంభం నుంచి సర్దుకు పోయేందుకు ప్రయత్నించాయి. దాంతో తొలి రోజుల్లో ఇష్టంలేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా వున్న పత్రికలు అవకాశం దొరికనపుడల్లా వామపక్షాలపై ఒకరాయి విసురుతూ పని చేశాయి. లాటిన్‌ అమెరికాలోని కార్పొరేట్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదులు వామపక్ష శక్తులను అదికారం నుంచి తొలగించాలనుకున్నతరువాత మీడియా పూర్తిగా వాటితో చేతులు కలిపింది.మచ్చుకు బ్రెజిల్‌ మీడియా సంస్ధల నేపధ్యాన్ని చూస్తే అవి వామపక్షాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. లాటిన్‌ అమెరికాలోని మీడియా సంస్ధలన్నీ దాదాపు కుటుంబ సంస్థలే. బ్రెజిల్‌లోని రెడె గ్లోబో మీడియా సంస్ధ రాబర్ట్‌ మారినిహో కుటుంబం చేతుల్లో వుంది. 1980 దశకం నాటికే అధికారంలో వున్న మిలిటరీ నియంతల ప్రాపకంతో 75శాతం వీక్షకులు, చదువరులపై ఆధిపత్యం సాధించింది. నియంతల పాలన అంతరించిన తరువాత 1989లో జరిగిన తొలి ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలో పిటి పార్టీ నేత లూలా డిసిల్వాను ఓడించిన ఫెర్నాండో కాలర్‌కు ఈ సంస్ధకు చెందిన టీవీ గ్లోబో బహిరంగంగా మద్దతు ఇచ్చింది. 1990దశకంలో కొత్త సంస్ధలకు అవకాశ ం ఇచ్చినప్పటికీ దాని పట్టు తగ్గలేదు. వామపక్ష పిటి పార్టీ అధికారానికి వచ్చిన తరువాత కూడా 2005లో బ్రెజిల్‌ ప్రకటనల బడ్జెట్‌లో సగం మొత్తం దానికే వెళ్లింది. అయినప్పటికీ మీడియా తన కార్పొరేట్‌, సామ్రాజ్యవాద అనుకూల వైఖరులను ప్రదర్శించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఈ పూర్వరంగంలో మీడియా రంగాన్ని ప్రజాస్వామీకరించాలన్న అభిప్రాయాన్ని కొందరు వెలిబుచ్చుతుండగా, గుత్త సంస్ధలుగా ఎదగకుండా ఆంక్షలు విధించాలని మరికొందరు చెబుతున్నారు. వర్గ వ్యవస్ధలో దోపిడీదారులకు ఒక ఆయుధంగా మీడియా వుపయోగపడుతున్నందున ప్రత్యామ్నాయ మీడియాను కూడా రూపొందించాలనే అభిప్రాయం కూడా వెల్లడి అవుతోంది. అయితే ఈ ప్రతిపాదనలేవీ నిర్ధిష్ట రూపం తీసుకోవటం లేదు.

గమనిక ఈ వ్యాసం ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి ‘ మాస పత్రికలో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రత్యేక హోదా, పాకేజీ కూడా లేదని చెప్పటానికి ఇన్ని నాటకాలు ఆడాలా ?

08 Thursday Sep 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ 1 Comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, special status to Andhra pradesh, tdp

నాడు పార్లమెంట్‌ తలుపులు మూసి ప్రహసన ప్రాయంగా కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీల నేతలు కుమ్మక్కై చీకట్లో రాష్ట్ర విభజన తీర్మానం చేశారు. అయితే ఆ విభజన హామీలను తుంగలో తొక్కేందుకు మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వకుండా నేడు బిజెపి నేతలు అర్ధరాత్రి సమాయాన్ని ఎంచుకొని ప్రత్యేక హొదా లేదని ప్రకటించారు. అది విద్రోహం అని మిగతా పార్టీలన్నీ విమర్శిస్తే తెలుగు దేశం, బిజెపి పార్టీలు స్వాగతం పలికాయి.

ఎం కోటేశ్వరరావు

     ప్రతిపక్ష వైసిపి సభ్యులు నిశ్శబ్దంగా కూర్చుంటే ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేస్తానని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు శాసనసభలో పదే పదే ప్రకటించటాన్ని యావత్‌ తెలుగు ప్రజలూ గమనించారు. రెండు సంవత్సరాలకు పైగా రాజకీయ పార్టీలు, జనం నోర్మూసుకుని కూర్చున్నా ఎన్నడూ దాని గురించి సూటిగా మాట్లాడని చంద్రబాబు ప్రత్యేక హోదా, పాకేజీ కూడా ఇచ్చేది లేదని ఒకవైపు కేంద్రం తేట తెల్లంగా ప్రకటించిన తరువాత దాని గురించి తాను ప్రకటన చేస్తానని చెప్పటమే రాజకీయ జాణతనం. తెలుగుదేశం పార్టీ ఎంతగా ఆత్మరక్షణలో పడిపోయిందంటే వైసిపి సభ్యులు అసెంబ్లీ కార్యకలాపాలు సాగకుండా నినాదాలతో అడ్డుకుంటుంటే తెలుగు దేశం సభ్యులు ముఖాలు వేలాడవేసుకొని నిస్సహాయంగా కూర్చుండి పోయారు. అదే మిగతా సందర్బాలలో గతంలో వారెన్నడూ అంత వినమ్రతతో కూర్చోలేదు. బహుశా ప్రస్తుత అసెంబ్లీలో అధికారపక్షం ఇలా నీరుగారి పోయి వుండటం ఇదే మొదటిసారి.

    నాడు పార్లమెంట్‌ తలుపులు మూసి ప్రహసన ప్రాయంగా కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీల నేతలు కుమ్మక్కై చీకట్లో రాష్ట్ర విభజన తీర్మానం చేశారు. అయితే ఆ విభజన హామీలను తుంగలో తొక్కేందుకు మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వకుండా నేడు బిజెపి నేతలు అర్ధరాత్రి సమాయాన్ని ఎంచుకొని ప్రత్యేక హొదా లేదని ప్రకటించారు. అది విద్రోహం అని మిగతా పార్టీలన్నీ విమర్శిస్తే తెలుగు దేశం, బిజెపి పార్టీలు స్వాగతం పలికాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు కూడా లేదని తేలిపోయింది. ప్రత్యేక పాకేజీ లేకుండా ప్రత్యేక సాయం అని అది కూడా 2015 నుంచి 2020 వరకు మాత్రమే అని కేంద్రం స్పష్టం చేసింది. పోనీ దాని వివరాలు ఏమిటి అంటే రేపు ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పెడతాం చూసుకోమని విలేకర్లకు చెప్పి పంపారు.ఈ మాత్రం చెప్పటానికి అర్దరాత్రి ప్రత్యేకంగా పత్రికా గోష్టి పెట్టటం అవసరమా ?

    తాము రాజకీయంగా నిండా మునిగి జనాన్ని ముఖ్యంగా యువత భవిష్యత్‌ను అంధకారంలో ముంచిన పెద్దలు ముసుగులో గుద్దులాట ఎందుకనుకున్నారో ఏమో వెంటనే తేల్చివేశారు. ఇక తేల్చు కోవలసింది జనమే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం చేసేందుకు ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని కేంద్ర మంత్రులు ప్రకటించినపుడే అది వట్టిస్తరి మంచినీళ్లని తేలిపోయింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తున్నట్లు పెద్ద వూదరగొడుతున్నారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు నుంచే ఆ డిమాండ్‌ వుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏ సాగునీరు, విద్యుత్‌ ప్రాజెక్టుకైనా ఆ సూత్రాలు వర్తిస్తే కేంద్ర ప్రభుత్వం వాటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించి 90శాతం నిధులు అంద చేస్తుంది.ఇప్పటికే అలాంటి 14 ప్రాజెక్టుల జాబితాను ఈ చిరునామాలో చూడవచ్చు.http://wrmin.nic.in/writereaddata/Guidelines/NProjects572133778.pdf పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టటం ద్వారా ఆ మేరకు రాష్ట్రానికి వెసులుబాటు కలుగుతుంది. అలాంటి హోదా ఇవ్వటానికి రాష్ట్రాన్ని విభజించటానికి సంబంధం లేదు. రాష్ట్రాన్ని విభజించిన కారణంగా వెసులు బాటు కోసం ఆహోదా ఇచ్చినట్లు చెప్పటం మోసం చేయటమే. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక హోదాను కల్పించటాన్ని మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించినపుడు, జాతీయ ప్రాజెక్టు హోదా తమ పధకాలకు సైతం ఎందుకు కల్పించరని కేంద్రాన్ని ఇతర రాష్ట్రాలు అడగకుండా వుంటాయా ? ఒక వేళ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించినందుకు పరిహారంగా ఇస్తే ఆమేరకు నిబంధనలను కూడా సవరించకుండా ఎలా సాధ్యం. ఒక రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వటానికి మిగతా రాష్ట్రాలు ఎలా అంగీకరిస్తాయి ?

    ప్రత్యేక హోదా విషయమై ఒకే నోటితో రెండు మాటలు మాట్లాడుతూ అనేక అనుమానాలకు తావిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలిపిస్తే మరో పదకొండు రాష్ట్రాలు అడుగుతాయి కనుక రాజకీయంగా సమస్యలు తలెత్తే అవకాశం వుంది కనుక కొత్తగా ఏ రాష్ట్రానికీ ఇవ్వదలచలేదు. ఒక వేళ ఇచ్చినా రాయితీలను గణనీయంగా తగ్గించిన కారణంగా పెద్దగా ప్రయోజనం వుండదు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు కూడా పెద్దగా లబ్డి పొందింది లేదు. ఇప్పుడు ఇన్ని విషయాలు చెబుతున్న పెద్దలకు ఈ విషయాలన్నీ రెండు సంవత్సరాలకు ముందు ఎన్నికల సందర్భంగా, లేదా గత రెండు సంవత్సరాలుగా తెలియవా ? వేదికల మీద వాగ్దానాలు కురిపించిన పెద్దలు రాజ్యాంగం, నిబంధనలు తెలియని అజ్ఞానులు కాదే ! కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా 32 నుంచి 42 శాతానికి పెంచారు. అయితే కుడి చేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకున్నట్లుగా కేంద్రం అమలు జరుపుతున్న అనేక పధకాలను రాష్ట్రాలకు బదలాయించారు. ఫలితంగా పది శాతం నిధులతో పాటు అంత కంటే ఎక్కువే భారం మోపారు. రెండవది రాష్ట్రాలకు వాటా లేని సెస్సుల వంటి వాటిని ఇటీవలి కాలంలో విపరీతంగా పెంచారు. దాని వలన జనం జేబుల నుంచి కేంద్రానికి వెళ్లేది కూడా పెరిగింది.

     ప్రత్యేక హోదా రాయితీలకు అవకాశం వున్న రాష్ట్రాలలో ఇప్పటికే అనేక మంది వాటిని నమ్ముకొని పరిశ్రమలు పెట్టారు. ఇప్పుడు జిఎస్‌టి వచ్చింది కనుక ఆ రాయితీలను మధ్యలో నిలిపివేస్తారా ? అదే మాదిరి జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగ బద్దంగానే ప్రత్యేక ప్రతిపత్తి వుంది. మరి అక్కడ ఎలా అమలు జరుపుతారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు పార్లమెంట్‌లో , వెలుపలా వాగ్దానం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే మిగతా రాష్ట్రాలకు అమలు జరిగినంత కాలం అమలు జరుగుతాయి. మిగతావాటికి ఆగిపోతే ఆంధ్రప్రదేశ్‌కూ నిలిచిపోతాయి, నలుగురితో నారాయణ ! పేచీ వుండదు, బిజెపి మోసం చేసిందనే విమర్శలూ వుండవు. అలాంటపుడు వాగ్దానం చేసిన మేరకు ప్రకటించటానికి ఇబ్బంది ఏమిటి ? ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకొని యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు పని చేయటం అవసరం. కేంద్రం తన విధానాలు మార్చుకొని ఆంధ్రప్రదేశ్‌లో తగినన్ని పెట్టుబడులు పెట్టి వుపాధి కల్పించాలి. కడపలో మరో వుక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టరు, వివిధ రంగాలలో ి ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్న కేంద్ర ప్రభుత్వం మౌలిక రంగాలైన పెట్రోలియం, రక్షణ వంటి రంగాలకు అవసరమైన వుత్పత్తుల తయారీకి మరో ఇసిఐఎల్‌, మరో ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ,అణ ఇంధన కాంప్లెక్స్‌, వంటివి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టటానికి ఆటంకం ఏమిటి ? ఐడిపిఎల్‌ వంటి వాటిని స్ధాపించి యువతకు వుపాధితో పాటు జనానికి చౌకగా ఔషధాలు అందించటానికి వున్న ఇబ్బంది ఏమిటి ?

   ఇప్పుడున్నపరిస్థితుల్లో ఎవరైనా ఇప్పటికే మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్‌ వున్న ప్రాంతాలలోనే పరిశ్రమలు పెడతారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే చైనాలోనే ప్రయివేటు రంగం పరిశ్రమలన్నీ ఆ విధంగా కొన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలలోనే కేంద్రీకృతమయ్యాయి. అభివృద్ధి కొత్త సమస్యలను సృష్టించింది. దాంతో పరిశ్రమలు లేని ప్రాంతాలలో పెట్టుబడులకు కేంద్రీకరించింది. గతంలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన విధానం కూడా కొన్ని అసమానతలను సృష్టించింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, పలు సంస్థలను హైదరాబాదులోనే కేంద్రీకరించటంతో అటు తెలంగాణాలో మిగిలిన జిల్లాలు, ఇటు ఆంధ్రప్రాంతంలో కొంతమేరకు విశాఖ మినహా మిగిలిన జిల్లాలన్నీ వెనుకబడిపోయాయి. మన దేశంలో కూడా వెనుకబడిన ప్రాంతాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకుండా ప్రయివేటు వారి వచ్చి ఒరగపెడతారనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి వుండదు.అందువలన ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని డిమాండ్‌ చేయటం ఎంతో సముచితం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d