• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Politics

CPI(M) and CPI On the Current Events in the Kashmir Valley

04 Sunday Sep 2016

Posted by raomk in CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Article 370, CPI, CPI(M), India-Pakistan, Kashmir, Kashmir problem, Kashmir Valley, Left parties

The CPI(M)  General Secretary Sitaram Yechury  and the CPI General Secretary S.Sudhakar Reddy have issued the following statement On the Current Events in the Kashmir Valley

The state of Jammu & Kashmir has been a part of India ever since the
accession of the state to the Indian Union in October 1947. Throughout the
chequered history of the past six decades, Kashmir has been not just a
territorial dispute for India but a test of the secular, democratic and
federal nature of the Indian Republic.

For the past nearly two months Kashmir has been in turmoil.  Since the
killing of Burhan Wani, a Hizbul Commander, the people in the Valley have
been out on the streets in mass protests. More than 70 people have died in
the firing by the security forces and a few thousand have been injured. Two
security personnel have also lost their lives. Pellet guns used by the
security forces have blinded and maimed many.  Instead of quelling the
protesters, it only intensified with each death and injury in police firing.
The main force driving these protests are the youth. These mass protests
that have spread into rural Kashmir, graphically illustrate the deep sense
of alienation of the people from the Indian State. At no time has the gulf
between India and the Kashmiri people been so wide. This serious situation
calls for an examination of the entire Kashmir problem.

The consistent stand the Left parties have been taking is that Jammu &
Kashmir has a special status which was reflected in the adoption of Article
370 of the Indian Constitution. At the heart of the matter lies how in
letter and spirit its autonomy and special status, eroded over the years,
can be restored. A political agreement must be reached, which should be
acceptable to the people whereby the state of Jammu & Kashmir would remain
as part of the Indian Union but by fulfilling the commitment, made to the
state and the people in 1948.

The entire geo-political situation has changed in the post-independence
decades. A solution to the Kashmir problem has also the dimension of India
and Pakistan discussing to settle long standing disputes.

These immediate steps must begin by taking certain confidence building
measures:

*       The first of these must be the immediate cessation of the use of
pellet guns.
*       Secondly, withdraw the AFSPA and the army from the civilian areas.
*       Thirdly, order a judicial enquiry into all instances of excesses
committed by the armed forces against civilians.
*       Fourthly, adequate compensation to all families who have suffered
loss of lives and rehabilitation of the injured by ensuring their means of
livelihood must be undertaken immediately.
*       Fifthly, time bound projects for economic development and employment
generation, including transfer of Dulhasti and Uri power projects; opening
of an IIM and IIT in Srinagar.

Further, the initiation of the political dialogue must not be based on any
preconditions.  The earlier recommendations of the various working groups
and the report of the team of interlocutors appointed after the visit of the
all party delegation in 2010 following the then disturbances must be kept in
consideration.

The Left parties suggest the following necessary steps at for arriving
towards a political solution in the current concrete circumstances:

a.    The internal dialogue with all stakeholders in Jammu & Kashmir should
proceed on the basis reversing the erosion of Article 370. The three regions
of the state, Jammu, the valley and Ladakh, should have autonomous
structures within the State of Jammu & Kashmir. This will entail changes in
the constitutional and legal scheme which can begin by revising the existing
orders and laws. Ultimately, a fresh political framework should emerge.

b.    The second dimension is the India-Pakistan factor. Since 2014 India
has been adopting a blow hot-blow cold policy towards a comprehensive
dialogue with Pakistan. This Government of India had announced that this
dialogue will also deal with the question of Kashmir, the government must
carry forward this process safeguarding India’s interests and ensure that
Pakistan is brought to the discussion table.

The people in the rest of the country are being fed various stereotypes
about the Kashmiri people. Kashmiris are being depicted as secessionists,
terrorists and pro-Pakistan. This must be put to an end. Reports of attacks
on Kashmiri youth in other parts of the country must be immediately
investigated and culprits punished.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా కాలేజీల్లో అగ్రస్థానంలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక ‘

03 Saturday Sep 2016

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Anti communist, Che Guevara, communist manifesto, HONG KONG ELECTIONS, Kapernick, Karl Marx, lavish banquets, National Anthem Controversy, Norman Bethune

Image result for Original Communist Manifesto

ఎంకెఆర్‌

   అమెరికా పాలకవర్గం కమ్యూనిజాన్ని అంతం చేయాలని చూస్తున్నది. కానీ ప్రస్తుతం అక్కడి కళాశాలలోని ఆర్ధిక శాస్త్ర విద్యార్ధులు అధ్యయనం చేయాల్సిన పుస్తకాలంటూ సిఫార్సు చేసిన వాటిలో కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంధం అగ్రస్థానంలో వుంది. ఆ గ్రంధాన్ని మార్క్స్‌-ఎంగెల్స్‌ 1848లో రాసిన విషయం తెలిసిందే. ఓపెన్‌ సిలబస్‌ ప్రాజెక్టు(ఒపిఎస్‌) కింద నూతన సిలబస్‌ సమాచారాన్ని సేకరించగా ఈ విషయం వెల్లడైందని మార్కెట్‌ వాచ్‌ డాట్‌ కాంలో ప్రచురించిన విశ్లేషణలో పేర్కొన్నారు. వివిధ వెబ్‌సైట్లు, సమాచారాన్నుంచి సేకరించిన వివరాల ప్రకారం ప్రతి ప్రచురణకు పాయింట్లను కేటాయించారు. ఒక పుస్తకం పేరు ఎన్నిసార్లు ప్రస్తావనకు వచ్చింది, దానిని ఎన్నిసార్లు బోధించారు అనే లెక్కలను తీశారు. వాటి ప్రకారం కమ్యూనిస్టు ప్రణాళిక సంఖ్య 3,189 కాగా బోధనా పాయింట్లు 99.7 వచ్చాయి.మిగతా పుస్తకాలకంటే ఇవి రెండు, నాలుగు రెట్లు ఎక్కువ. కమ్యూనిస్టు ఆర్ధిక, సామాజిక బోధనల తరువాత కీనిసియన్‌ సిద్ధాంతాల ప్రచురణలు ఎక్కువగా వున్నాయి.ఆర్ధిక, ద్రవ్య విషయాలకు సంబంధించి అగ్రస్ధానంలో వున్న పది హేను పుస్తకాలలో పది కీనిసియన్‌ లేదా కమ్యూనిస్టు సిద్ధాంతానికి చెందినవే వున్నాయి. స్వేచ్చా మార్కెట్‌ వ్యవస్థకు సంబంధించిన పుస్తకాలు అగ్రస్థానంలో రెండు మాత్రమే వున్నాయి. వాటిలో ఒక వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌ అనే ఆడమ్‌ స్మిత్‌ రచన రెండవ స్ధానంలో, పెట్టుబడిదారీ విధానం మరియు స్వేచ్ఛ అనే మిల్టన్‌ ఫ్రైడ్‌ మాన్‌ గ్రంధం ఐదవ స్ధానంలో వుంది.http://www.marketwatch.com/story/communist-manifesto-among-top-three-books-assigned-in-college-2016-01-27

imrs.php

విలాస విందులు-చైనా కమ్యూనిస్టు పార్టీ ఆంక్షలు

   అవినీతి, అక్రమాలపై దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు విలాసవంతమైన విందులకు సభ్యులు దూరంగా వుండాలని ఆంక్షలు విధించింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు విందు ఆహ్వానాలను అందుకున్నపుడు వాటికి ఎవరు సొమ్ము ఖర్చు చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారో,ఎక్కడ జరుగుతోందో ముందుగా తెలుసుకోవాలని సూచించింది. పార్టీ సభ్యులు, అధికారులు ఎలాంటి విందులకు హాజరు కాకూడదో తెలిపింది.అధికారులు ప్రయివేటు క్లబ్బులలో జరిగే విందులకు వెళ్లటాన్ని, ఇతరులను ఆహ్వానించటంపై నిషేధం విధించింది. అలాంటి 20 రకాల విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదని తెలిపింది.వివాహాలు, దినాలను విలాసవంతంగా నిర్వహించకూడదని సూచించింది. గ్జీ జింగ్‌ పింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి గత మూడు సంవత్సరాలుగా అవినీతిపై కేంద్రీకరించారు. ఇప్పుడు విలాసాలపై దృష్టి సారించారు. పార్టీ కార్యకర్తలు, అధికారులు దిగువ సూచనలు పాటించాలని ఆదేశించారు.

     భారీ ఎత్తున జరిపే విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదు. అధికార విధులతో సంబంధం లేని విందులు ఏర్పాటు చేయరాదు. అదే నగరం లేదా దేశంలోని ఇతర శాఖల వారిని ఆహ్వానించినపుడు ప్రజల సొమ్మును విందులకు ఖర్చు చేయరాదు.దిగువ స్ధాయి డిపార్ట్‌మెంట్లను విందులు ఏర్పాటు చేయమని అడగ కూడదు.అధికారిక విధులతో సంబంధం లేని విందులకు ఇతర నగరాలలో వెళ్లకూడదు. గ్రామశాఖలు ఏర్పాటు చేసే విందులను స్వీకరించరాదు. ప్రయివేటు కంపెనీలు ఏర్పాటు చేసే విందులకు వెళ్ల కూడదు, ఒక వేళ వెళ్లాల్సి వస్తే అందుకయ్యే ఖర్చును చెల్లించాలి. తమ భోజన ఖర్చు చెల్లించాలని ప్రయివేటు కంపెనీలను అడగ కూడదు. వాణిజ్య పర్యటనలలో ఇతర అధికారుల భోజనాలకు చెల్లించకూడదు. పొద్దు పోయిన తరువాత చేసే భోజనాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేయకూడదు. స్వప్రయోజనాలు ఇమిడి వున్న వ్యక్తుల నుంచి వచ్చే విందు ఆహ్వానాన్ని తిరస్కరించాలి. అలాంటి వాటి పట్ల ఎల్ల వేళలా అప్రమత్తంగా వుండాలి. అధికారిక విధులకు అంతరాయం కలిగించే విందులకు వెళ్ల కూడదు. అధికారిక విధులతో నిమిత్తం లేని ఫంక్షన్లకు వచ్చిన అతిధులకు ప్రజల సొమ్మును వెచ్చించకూడదు. ప్రభుత్వ సంస్ధలు ఇచ్చే విందులకు ప్రయివేటు వ్యక్తులను పిలవ కూడదు, అలాంటి విందులలో విందు ఆడంబరంగా వుండకూడదు. ప్రయివేటు క్లబ్బులు, ఇతర ఖరీదైన ప్రాంతాలకు వెళ్లకూడదు. చిన్న బృందాలు, గ్యాంగులను ఏర్పాటు చేసేందుకు వుద్ధేశించిన విందులకు దూరంగా వుండాలి. నగదు బహుమతులు అందచేసే, అధికారులకు చెడ్డపేరు తెచ్చేందుకు అవకాశం వున్న విందులకు వెళ్లకూడదు.

Image result for Dr. Norman Bethune

నార్మన్‌ బెతూన్‌పై కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకుల కడుపు మంట

   ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజం అంతిరించి పోయిందంటూనే ఆదర్శ కమ్యూనిస్టుల గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతగా భయపడుతున్నారు. ఎందుకంటే ఆదర్శవాదులు ధృవతారలుగా వెలుగుతూనే వుంటారు. చైనా విముక్తి, జపాన్‌ దురాక్రమణ వ్యతిరేకపోరాటంలో నిమగ్నమైన కమ్యూనిస్టులకు సాయపడేందుకు కెనడా నుంచి నార్మన్‌ బెతూన్‌, భారత్‌ నుంచి ద్వారకా నాధ్‌ శాంతారామ్‌ కొట్నీస్‌(డిఎన్‌ కొట్నిస్‌) వంటి ఎందరో ప్రాణాలకు తెగించి చైనా వెళ్లి సేవలు అందించారు.

   ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు ఆరు వరకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ చైనా పర్యటన జరుపుతున్నారు.ఆయన రాక సందర్భంగా చైనా ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నార్మన్‌ బెతూన్‌ మెడల్‌ను బహుకరించింది. ఇలాంటిదే 1973లో తన తండ్రికి బహుకరించారని జస్టిన్‌ తన ఇస్‌స్టాగ్రామ్‌ పేజీలో వ్యాఖ్యానించారు. ఇంకేముంది కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులకు అవకాశం దొరికినట్లయింది. మాజీ ప్రధాని పిరే ఇలియట్‌ ట్రుడెవ్‌ అడుగుజాడల్లో ఆయన కుమారుడు జస్టిన్‌ కూడా చైనా తో సంబంధాల విషయంలో వ్యవహరిస్తున్నాడని చైనాలో మానవ హక్కుల హరణం గురించి తెలుసుకోవాలంటూ కాగితాలు, ఇంటర్నెట్‌ను ఖరాబు చేస్తున్నారు. నార్మన్‌ బెతూన్‌ అంటే కెనడాలో అత్యధికులకు అసలు తెలియదు, చైనాలో మాత్రం జాతీయ వీరుడు, ప్రతి స్కూలు పిల్లవాడికీ బెతూన్‌ పేరు తెలుసు. వైద్యుడిగా జీవితం ప్రారంభించిన బెతూన్‌ కమ్యూనిస్టు కూడా. కెనడాలో వైద్యం వలన తన జీవితం ధన్యం కాదని గ్రహించిన ఆయన తొలుత స్పెయిన్‌ వెళ్లి అక్కడ నియంతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన అంతరుద్ధ్యంలో పాల్గొన్నాడు. తరువాత 1938లో చైనా వెళ్లి కమ్యూనిస్టు గెరిల్లా దళాలలో చేరి వారికి వైద్య చికిత్స అందించారు. ఆ సమయంలోనే మావోతో పరిచయం ఏర్పడింది. అయితే 1939లో జరిగిన ఒక ప్రమాదంలో బెతూన్‌ మరణించారు. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత అంతర్జాతీయ కమ్యూనిస్టు సౌహార్ధ్రతకు ఒక ఆదర్శంగా బెతూన్‌ సేవలను పరిగణించి ఆయన గురించి స్కూలు పాఠ్యాంశాలలో చేర్చటంతో ఆయన పేరు ప్రతి చైనీయుడికీ సుపరిచితం అవుతోంది.

   1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాను గుర్తించేందుకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి తిరస్కరించింది. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా పరిగణించి ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం కలిగించింది. అయితే అలా కొనసాగటం సాధ్యం కాని స్ధితిలో అమెరికా దిగి వచ్చి కమ్యూనిస్టు చైనాను గుర్తించక తప్పలేదు. దాంతో అప్పటి వరకు అమెరికాను అనుసరించిన కెనడా కూడా చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకొంది. 1973లో కెనడా ప్రధాని పిరే చైనా పర్యటన జరిపి మావోతో భేటీ అయ్యారు. ఆ పర్యటన సందర్భంగా నార్మన్‌ బెతూన్‌కు చైనాలో వున్న ఆదరణ, వున్నత స్ధానాన్ని గమనించారు.బెతూన్‌ది కెనడా, మాదీ కెనడా అన్నట్లుగా సంబంధాలను కలుపుకున్నారు.అప్పటి నుంచి కెనడాలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ, కమ్యూనిస్టు వ్యతిరేకులైనా చైనాతో సంబంధాల విషయంలో నార్మన్‌ బెతూన్‌ పేరును వుపయోగించుకుంటూనే వున్నారు.

   జపాన్‌ సేనలకు వ్యతిరేకంగా పోరాడేందుకు చైనాకు వెళ్లిన బెతూన్‌ కెనడా విలువలకు ద్రోహం చేశాడని అతడే మాత్రం ఆదర్శం కాదంటూ కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులు విషం చిమ్ముతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం టొరోంటో సన్‌ అనే పత్రిక అధిపతి పీటర్‌ వర్తింగ్టన్‌ ఒక వ్యాఖ్యానం రాస్తూ ‘ మానవత్వానికి సాయం చేసేందుకు బెతూన్‌ చైనా వెళ్లలేదు, అక్కడ మావో కమ్యూనిస్టు పార్టీ సైన్యానికి తోడ్పడేందుకు మాత్రమే వెళ్లారు, సాధారణ రోగులకు బదులు గాయపడిన కమ్యూనిస్టు గెరిల్లాలకు చికిత్స చేసేందుకు మాత్రమే వెళ్లారు అని రాసిన విషయాన్ని ఇప్పుడు వుటంకిస్తూ ఆ విషయాన్ని ప్రధాని జస్టిన్‌ మరిచిపోకూడదని కమ్యూనిస్టు వ్యతిరేక రచయితలు వుద్బోధించారు. మానవ హక్కుల వుల్లంఘనలకు పాల్పడుతున్న చైనాను ప్రధాని ఎలాగూ నిలదీయలేరు, కనీసం బెతూన్‌ను పొగిడుతూ నటించటం అయినా మానుకోవాలని కొందరు వ్యాఖ్యాతలు రాశారు.

కమ్యూనిస్టులు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తప్పేనా ?

    హాంకాంగ్‌ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకు పోటీ చేయటం లేదంటూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు దానినొక సమస్యగా ఓటర్ల ముందుంచేందుకు పూనుకున్నారు. హాంకాంగ్‌ విషయానికి వస్తే దానిదొక ప్రత్యేక పరిస్థితి. బ్రిటీష్‌ వారి కౌలు 99 సంవత్సరాల కౌలు గడువు ముగిసిన తరువాత మాతృదేశం చైనాలో ప్రాంతమది. అంతర్జాతీయ నౌకాశ్రయంగా, పెట్టుబడులు, వాణిజ్య కేంద్రంగా బ్రిటీష్‌ వారి ఏలుబడిలో రూపొందింది. దానిని విలీనం చేసే సందర్భంగా 1997వ సంవత్సరంలో చైనా ఒక ఒప్పందం చేసుకుంది. అదే మంటే చైనాలో అంతర్భాగమైనప్పటికీ యాభై సంవత్సరాల పాటు అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగించేందుకు అంగీకరించింది. ఒకే దేశం రెండు వ్యవస్థలు అన్న విధానంగా దీనిని వర్ణించారు. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, హాంకాంగ్‌లో పెట్టుబడిదారీ వ్యవస్ధ.దానికి అనుగుణ్యంగానే హాంకాంగ్‌ పాలక మండలి నిర్ణీత గడువులో ఎన్నికలు నిర్వహిస్తూ స్వయం పాలనా మండలికి అప్పగించింది.అయితే హాంకాంగ్‌ను ఎలాగైనా చైనా నుంచి విడదీయాలన్న దుర్బుద్ధితో సామ్రాజ్యవాదులు అనేక రకాలుగా అక్కడి పౌరులను రెచ్చగొడుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో విబేధించే శక్తులు పాలకులుగా ఎన్నికైనప్పటికీ చైనా ప్రభుత్వం వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించటం లేదు. ఆదివారం నాడు ఎన్నికలు జరిగే హాంకాంగ్‌లో 72లక్షల మంది జనాభా వున్నారు. దానికి ఎన్నికయ్యే పాలక మండలితో పాటు చైనా ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ మండలి ప్రత్యేకంగా వుంటుంది. హాంకాంగ్‌ తరఫున చైనాలో అధికారిక ప్రతినిధిగా అదే వుంటుంది. రోజువారీ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకులు దానిలోని సభ్యులందరూ కమ్యూనిస్టులే అని అయితే బయటికి అలా చెప్పుకోరు అని తప్పుడు ప్రచారం చేస్తారు. ఒప్పందానికి అనుగుణంగా హాంకాంగ్‌లోని సంస్ధలకు విశ్వాసం కలిగించేందుకు కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో పోటీ చేయటం లేదు.

కాస్ట్రోతో చేయి కలుపుతారు, ఆయన బొమ్మపై రాద్ధాంతం చేస్తారు

    అమెరికా పాలకులు క్యూబాను నాశనం చేయాలని, దాని అధినేత ఫిడెల్‌ కాస్ట్రోను అంతం చేయాలని ఎన్నో యత్నాలు చేసి సాధ్యంగాక చివరికి దిగి వచ్చి దౌత్య సంబంధాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.అయితే మరోవైపు కాస్ట్రో బొమ్మతో వున్న టీ షర్టులను ధరించిన వారిపై మాత్రం రాద్ధాంతం చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాజాగా ఫుట్‌బాల్‌ ఆటగాడు కోలిన్‌ కయోపెర్నిక్‌ తెలిపిన నిరసన తీరుతెన్నులపై పెద్ద రగడ చేస్తున్నారు. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్షకు నిరసనగా ఒక ఫుట్‌బాల్‌ పోటీ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్నపుడు లేచి నిలబడలేదు.దానిపై నెల రోజుల తరువాత చెలరేగిన వివాదం గురించి మాట్లాడేందుకు గత వారంలో విలేకర్లతో మాట్లాడాడు.ఆ సందర్భంగా ఫిడెల్‌ కాస్ట్రో, అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన ప్రముఖులతో కూడి వున్న టీ షర్టును వేసుకన్నాడు. దానిపై ‘భావ సారూప్యం వున్నవారు ఒకే విధంగా ఆలోచిస్తారు ‘ అనే నినాదం రాసి వుంది.”Like Minds Think Alike.”)నల్ల, రంగు జాతీయులను అణచివేస్తున్నందుకు నిరసనగా తాను జాతీయ గీతాలాపన సందర్భంగా నిలబడకుండా నిరసన తెలిపానని స్పష్టం చేశాడు. తనకు ఫుట్‌ బాల్‌ కంటే నిరసన ముఖ్యమని వేరే విధంగా ఆలోచిస్తే స్వార్ధం అవుతుందని అన్నాడు. విలేకర్ల సమావేశం సందర్భంగా వేసుకున్న టీషర్టుపై ఫిడెల్‌ కాస్ట్రో బొమ్మ వుందంటే కయో పెర్నిక్‌ ఒక కమ్యూనిస్టు నియంతను సమర్ధించినట్లేనని ఒక పత్రికలో రాశారు. క్యూబా నుంచి ప్రవాసం వచ్చిన క్యూబన్‌-అమెరికన్లు కయో పెర్నిక్‌పై మండి పడుతున్నారుె. ఎందుకలా చేశాడంటూ మీడియాలో నిరసన ఒక పెద్ద చర్చనీయాంశమైంది. కయో పెర్నిక్‌ తల్లి పేద కుటుంబానికి చెందిన శ్వేత జాతి యువతి కాగా తండ్రి నల్లజాతీయుడైన ఆఫ్రో-అమెరికన్‌.

   అమెరికా జాతీయ గీతం జాతి వివక్షా పూరితమైనదనే విమర్శ ఎప్పటి నుంచో వుంది. దానిని రాసింది ఒక బానిస యజమాని. నల్లజాతి వారిని బానిసలుగా చేసి అమెరికా ఖండంలో వ్యాపారం చేసిన విషయం తెలిసినదే. ఆ గీతంపై గతంలో ఎందరో నిరసన తెలిపారు. అనేక మంది నల్లజాతి క్రీడాకారులు ఆ గీతాలాపన సందర్భంగా మాట్లాడుతూ వుండటమో, కాలో చేయో కదిలించటం, టోపీ తీయటం,పెట్టుకోవటం వంటి రూపాలలో నిరసన తెలపటం జరుగుతున్నది. తాను అమెరికా వ్యతిరేకిని కాదని, అమెరికా మరింత మెరుగ్గా తయారు కావటానికే ఈ నిరసన తెలిపినట్లు కయో పెర్నిక్‌ చెప్పాడు.తొలుత కూర్చుని నిరసన తెలిపిన అతను ఇప్పుడు మోకాళ్ల మీద నిలబడుతున్నాడు.1972లో జాకీ రాబిన్సన్‌ అనే బేస్‌బాల్‌ ఆటగాడు నిరసన తెలిపుతూ ‘నేను నిలబడను, జాతీయ గీతం పాడను, పతాకానికి వందనం చేయను, శ్వేతజాతి లోకంలో నేనొక నల్లజాతీయుడనని నాకు తెలుసు ‘ అని వ్యాఖ్యానించాడు.అంతకు ముందు ఇద్దరు నల్లజాతి ఒలింపిక్‌ రన్నర్లు జాతీయ గీతాలాపన సందర్భంగా నల్లజాతీయుల శక్తి చిహ్నంగా బిగించిన పిడికిలి చూపి నిరసన తెలిపారు.

చే గువేరాపై నోరు పారవేసుకున్న టర్కిష్‌ స్పీకర్‌

    ప్రముఖ విప్లవ కారుడు చే గువేరా ఒక హంతకుడు కనుక అతనినెవరూ అభిమానించకూడదని వ్యాఖ్యానించిన టర్కీ పార్లమెంట్‌ స్పీకర్‌ ఇస్మాయిల్‌ కర్మాన్‌ చర్యను ప్రపంచంలో అనేక మంది ఖండించారు.తమ ఆరాధ్యనేత అయిన చేగువేరాను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని క్యూబా డిమాండ్‌ చేసింది. ఒక యువజన బృందాన్ని వుద్ధేశించి ఆయన మాట్లాడుతుండగా వారిలో కొందరు చేగువేరా బొమ్మలున్న టీ షర్టులు ధరించి కనిపించటంతో స్పీకర్‌కు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతనొక గెరిల్లా, బందిపోటు ,39 సంవత్సరాల వయస్సులోనే వురి తీసి చంపాడు, అతను అదర్శం కాకూడదు అని మాట్లాడాడు. క్యూబా నిరసన తెలపటంతో టర్కీ ప్రభుత్వం సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. తమ స్పీకర్‌ మార్క్సిస్టు వ్యతిరేకి కాదని, ఒక జాతీయ వాదిగా తమ దేశంలో వున్న వేలాది మందిని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప క్యూబా సోషలిస్టు విప్లవంలో భాగస్వామి అయిన వారిని కాదని చెప్పేందుకు ప్రయత్నించారని వివరణ ఇచ్చింది. స్పీకర్‌ వ్యాఖ్యలు చేగువేరా చరిత్రను వక్రీకరించాయని క్షమాపణ చెప్పాల్సిందేనని టర్కీలో క్యూబా రాయబారి డిమాండ్‌ చేశారు. టర్కీలోని వామపక్ష పార్టీల కార్యకర్తలు చే గువేరా టీషర్టులు ధరించి దేశమంతటా స్పీకర్‌ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశారు. పార్లమెంట్‌ ఎదుట చేసిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. టర్కీ పాలకపార్టీ ఏకెపి కమ్యూనిస్టు వ్యతిరేక, మతవాద పార్టీ అన్న విషయం తెలిసిందే. క్యూబాలో ఒక మసీదు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్న టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ అభ్యర్ధనను క్యూబా సర్కార్‌ గతంలో అంగీకరించలేదు. అమెరికాను 1492లో కొలంబస్‌ కనుగొనక ముందే ముస్లింలు కనుగొన్నారని ఎర్డోగన్‌ వాదిస్తారు. కొలంబస్‌ డైరీలలో ఒక కొండ పక్కన గుమ్మటాలతో కూడిన ఒక భవనం గురించి వర్ణణ వుందని అది అక్కడి మసీదు గురించే అని టర్కీలోని కొందరు చెబుతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పవన్‌ కల్యాణ్‌ గబ్బర్‌ సింగా ? రబ్బర్‌ సింగా ?

30 Tuesday Aug 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, ap special status, BJP, jana sena party, Pawan kalyan, tdp

విశ్వసనీయత సమస్య ఎదుర్కొంటున్న పవర్‌ స్టార్‌

ఎంకెఆర్‌

    సినిమా వాళ్లు ఏది చేసినా నాటకీయంగా వుంటుంది.అది లేకపోతే జనానికి కిక్కు వుండదు. ప్రేక్షకులకు కిక్కు ఎక్కితేనే పోనీలెమ్మని సినిమాలు చూసిపెట్టి నాలుగు డబ్బులు నిర్మాతల మొహాన వేస్తారు. సినిమా కధ వూహించని మలుపులు తిరిగి వీక్షకులకు వుత్కంఠ కలగ చేసినట్లుగా ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనే డాక్యుమెంటరీ కూడా ఆసక్తికలిగిస్తోంది. దీనిలో నటులు, పాత్రలు కాకుండా నిజమైన వ్యక్తులే నటిస్తున్నారు గనుక డాక్యుమెంటరీ అనాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆకస్మికంగా పవర్‌ స్టార్‌ పవర్‌ కల్యాణ్‌ తిరుపతిలో ఒక సభ జరిపి ఏకపాత్రాభినయంతో ప్రత్యేక హోదా గురించి పోరు ప్రకటన చేశారు. అనేక మందికి ముఖ్యంగా అధికారంలో వున్న తెలుగుదేశం-బిజెపి కూటమికి ఇష్టం లేని మాటలలో ప్రత్యేక హోదా ఒకటి.ఎందుకంటే అది గుర్తుకు వచ్చినపుడల్లా ఆంధ్రప్రదేశ్‌ జనం ఇంకా దాని కోసం ఎదురు చూస్తున్నారేమో అనే చిన్న అనుమానంతో కొద్ది క్షణాలే అయినా వారి మనసంతా వికలం అవుతుంటుంది.

     అన్నట్లు నాటకీయం అంటే తిరుపతి సభకు వారం రోజుల ముందు హైదరాబాదులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమార స్వామి ప్రత్యేకంగా వచ్చి పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ఆ సమయంలో వారు మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి సినిమా విడుదల సందర్భంగా పవన్‌ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానని కుమారస్వామి చెప్పారు. కానీ అంతకు ముందే రాబోయే ఎన్నికలలో పవన్‌ కల్యాణ్‌ మద్దతును కుమారస్వామి కోరుతున్నట్లు దాని గురించి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అటు న్యూఢిల్లీలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రత్యేక హోదా గురించి తీవ్ర చర్చ, బంద్‌ జరిగిన సమయంలో పవన్‌ కల్యాణ్‌ మౌనంగా వున్నారు. ఈ పూర్వరంగంలో కుమార స్వామితో కలసి మీడియా ముందుకు వచ్చినపుడు పవర్‌ స్టార్‌ ఎంతో ప్రశాంతంగా, స్ధిత ప్రజ్ఞుడి మాదిరి ప్రత్యేక హోదా ఇవ్వను అని ఇంకా కేంద్రం స్పష్టంగా చెప్పలేదు, అయినా ఇది సున్నితమయిన అంశం కనుక ఇపుడే మీ మాట్లాడను తగు సమయంలో స్పందిస్తా అని చెప్పి ఎంతో సంయమనం పాటించారంటూ కొందరు విలేకర్లు వ్యాఖ్యానించారు.మరి అలాంటి వ్యక్తికి వారం రోజుల్లో ఏం మార్పులు కనిపించాయి, అదనంగా వచ్చిన స్పష్టత ఏమిటి, సున్నితాంశం కాస్తా తక్షణాంశంగా దాని స్వభావం ఎలా మార్చుకుంది, అసలు ప్రత్యేక హోదా గురించి రాజకీయ పార్టీలు, జనం కూడా మరిచి పోతున్న తరుణంలో పవన్‌ కల్యాణ్‌కు గుర్తుకు వచ్చి ఎందుకు ఆగ్రహం వచ్చింది అని అనేక మంది పరిపరి విధాలా ఆలోచిస్తున్నారు. చీకట్లో ఏదైనా చెట్టు తొక్కాడా లేక తెలియకుండా ఎక్కడైనా బోధి వృక్షం కింద కూర్చొని వచ్చారా ? పవన్‌ కల్యాణే స్వయంగా చెబితే తప్ప తెలియదు, అప్పటి వరకు పది మంది నానా రకాలుగా అనుకుంటూనే వుంటారు.

     పుష్కరాల సందర్బంగా తాను స్వయంగా మునిగి జనాన్ని కృష్ణ నీటిలో మునకలు వేయించి ఎంతో పుణ్యం జనం ఖాతాలలో ఎంతో పుణ్యం జమ చేయించిన చంద్రబాబు, ఆయన పరివారం తమకు వచ్చిన ప్రచార కండూతి, ఇతర పుష్కర లాభాల గురించి లెక్కించుకుంటుండగా పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం, బిజెపి పార్టీని కూడా విమర్శించి కాస్త ఇబ్బంది పెట్టారనే చెప్పాలి. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజి వస్తుందనీ చెప్పలేరు, రాదనీ చెప్పలేని స్ధితిలో వారు వున్నారు. పవన్‌ కల్యాణ్‌ మాటల్లో చెప్పాలంటే మేడమ్‌ ఎలాగూ లేరు కనుక బిజెపి వారు సార్‌తో భైంటక్‌( సమావేశం) ఏర్పాటు చేయిస్తామని మాత్రమే చెప్పగలరు. వారి దగ్గర అంతకంటే మాటలు లేవు.

   రాజకీయాల్లోకి రావాలని, చక్రం తిప్పాలని, నాలుగు డబ్బులు చేసుకోవాలని అనేక మంది కోరుకుంటున్నపుడు పవన్‌ కల్యాణ్‌ కోరుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఎన్‌టి రామారావు జనం కోసం సినిమాలను వదులుకొని ఎంతో త్యాగం చేశానని చెప్పుకున్నారు, కానీ ముందు జాగ్రత్తగా వవన్‌ కల్యాణ్‌ రాజకీయ, సినిమా నటన రెండూ చేస్తానని చెప్పారు. ఎందుకంటే పెద్ద కుటుంబం కదా ! గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రంగంలోకి వచ్చి చివరిదాకా నిలబడినట్లుగా తిరుపతి సభలో ఆ జాబితాలో బిజెపి, తెలుగుదేశం పార్టీలను కూడా జమ చేశారు, ఆ పార్టీలను ఎంత గట్టిగా విమర్శించారు, ఏకి పారేశారు అని కాదు, వాటికి అనుగుణంగా కట్టుబడి వుంటారా లేదా ఆ డైలాగులను పెట్టుబడిగా పెట్టి లబ్ది పొందుతారా అన్నదే సమస్య. రాజకీయాలలో విస్వసనీయతను ఏడు నిలువుల లోతున పాతరేసిన పార్టీలలో బిజెపి, తెలుగుదేశం తక్కువేమీ తినలేదు. వాటినేమీ పట్టించుకోకుండా, తెలిసినా తెలియనట్లు గా గత ఎన్నికలలో వాటి కొమ్ముకాశారు. ఎందుకైనా మంచిది అన్నట్లు స్వంతంగా జనసేన అనే స్వంత పార్టీని ఏర్పాటు చేశారు. మధ్య మధ్యలో కొన్ని డైలాగులు తప్ప ఇంతవరకు తెలుగుదేశం, బిజెపిలను విమర్శించలేదు. అవి చెప్పిన మాటలను ఇంతకాలం గాఢంగా నమ్మటానికి దారితీసిన పరిస్థితులేమిటి ? ఇప్పుడు జ్ఞానోదయం కావటానికి కారణాలేమిటి అన్నది జనానికి సూటిగా చెప్పాలి. అప్పుడే తాను ప్రారంభిస్తానంటున్న ప్రత్యేక హోదా ఆందోళన వెనుక జనం చేరే అవకాశం వుంటుంది. గత ఎన్నికల నాటికీ ఇప్పటికీ వచ్చిన తేడా ఏమిటంటే విస్వసనీయతలేని రాజకీయ నాయకుల సరసన పవన్‌ కల్యాణ్‌ కూడా చోటు సంపాదించుకున్నారు. గత ఎన్నికల సందర్భంగా పాకేజి కుదుర్చుకున్నారని విమర్శలు ఎదుర్కొన్న పవన్‌ కల్యాణ్‌ మరోసారి అలాంటిదానికి పూనుకోరన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న వుండనే వుంది.

    రాజకీయాలలో ముందురోజు పొద్దు పోయే వరకు ఎదుటి పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన వారు తెల్లవారే సరికి అదే పార్టీలోకి ఫిరాయిస్తున్నారు, అంతకు ముందు వరకు తాను వున్న పార్టీని అంతకంటే ఎక్కువగా వుతికి పారేస్తున్నారు. ఏమిటీ ఈ విపరీతం అంటే ఈ రోజుల్లో మీకు తెలియందేముంది మాకు ఇష్టం వున్నా లేకపోయినా అధినాయత్వ చెప్పినట్లు చేయాలి కదా అని ఎలాంటి సిగ్గు ఎగ్గూ లేకుండా సమర్ధించుకుంటున్నారు. ఇటువంటి స్ధితిలో గత ఎన్నికల తరువాత ఏడాదికి ఒకసారి వచ్చే సైబీరియా పక్షుల మాదిరి ఇలా వచ్చి అలా ఒక ప్రకటన చేసి పోతున్నారని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ సారి కూడా అలాగే చేస్తారా అని అనుమానిస్తున్నవారు లేకపోలేదు. ఆర్ధికంగా ఇబ్బందులలో వున్న పవన్‌ కల్యాణ్‌ ఈమధ్య తాను ఎంతో అభిమానించే ఒక వాహనాన్ని కూడా అమ్ముకున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి.అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఒక పార్టీని స్ధాపించటం అంటే వందల కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చిన సొమ్మయినా వుండాలి లేదా ఎన్నికలలో అభ్యర్ధిగా నిలబెడతానని చెప్పి సీట్లు అమ్ముకొని అయినా ఆమేరకు పోగెయ్యాలి. పవన్‌ కల్యాణ్‌ దగ్గర అంత సొమ్ము వుందని ఎవరూ అనుకోరు, పోనీ సీట్లు అమ్ముకోవటానికి ఇంతవరకు పార్టీ లేదు, కార్యకలాపాలు లేవు, అన్నింటికీ మించి అప్పుడే ఎన్నికలు లేవు, అధికారానికి వస్తారనే వాతావరణమూ లేదు. బద్దశత్రువులు అనుకుంటున్నవారే జనం కోసం అనే పేరుతో చేతులు కలిపిన విపరీత పోకడల మన కళ్ల ముందే వున్నాయి. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే తెలుగుదేశం అధికారానికి వస్తే, అధికారానికి వచ్చిన తరువాత జనతా పార్టీ ఏర్పడిన చరిత్రా మన దేశంలో వుంది. అందువలన జనం తలచుకుంటే ఎప్పుడు ఏమైనా జరుగుతుంది. సినిమాలు మారినపుడు డైలాగులు కూడా మారతాయి, ఒక నటుడు ఒకే డైలాగులతో రెండు సినిమాలలో నటిస్తే జనం చూడరని తెలిసిందే. అందువలన బిజెపి, తెలుగుదేశం పార్టీలను విమర్శించినప్పటికీ రాజకీయ చాణక్యంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ను ఆకస్మికంగా వారే ప్రయోగించారన్న ప్రచారాలు వున్నాయి.

   ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు కల్పిస్తే ఏ ఏ రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయో వెంకయ్య నాయుడు వంటి వారు వారికి పదే పదే గుర్తు చేస్తారు. ఏపికి కల్పిస్తే మోడీని మరో పదకొండు రాష్ట్రాలు అడుగుతాయని మరో మంత్రి చెబుతారు.తాను 21 సార్లు ప్రధానిని కలిశానని, 31 సార్లు కలిశానని మరోసారి అవసరమైతే ఇంకా ఎన్నిసార్లయినా కలుస్తానని, వత్తిడి పెంచుతానని చంద్రబాబు చెబుతూనే వుంటారు. పాకేజీల ప్రహసనమూ తెలిసిందే. బీహార్‌ ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ వేల కోట్ల రూపాయల పాకేజీ ప్రకటించారు. దానిని అమలు జరిపిందీ లేనిదీ తెలియదు.టీ కప్పులో తుఫాను మాదిరి కాంగ్రెస్‌ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు బిల్లుపై చర్చ తరువాత దానిని శీతల గిడ్డంగిలో పెట్టారు. ఒక రోజు బంద్‌ చేసి జనం కూడా తరువాత మౌనంగా వున్నారు. దీనికి విశ్లేషకులు కొందరు రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి ప్రత్యేక హోదా వస్తే పెద్దగా ఒరిగేదేమీ వుండదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా చెప్పారు. దాని కంటే భారీ పాకేజ్‌ మెరుగు అని వారితో పాటు వారికి నిత్యం సలహాలు చెప్పే జిగిని లేదా జిగురు జర్నలిస్టులు కూడా సందర్భం వచ్చినపుడు జనం బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

    జనంలో ఇంకా ఏదో మూలన ప్రత్యేక హోదా గురించి మోజు వుందని, దాన్ని తాము తీర్చని కారణంగా ప్రతిపక్ష వైసిపి, కాంగ్రెస్‌ వుపయోగించుకుంటాయామో, దాన్ని అడ్డుకోవాలంటే రాణీగారి అధికారపక్షం మాదిరి రాణీగారి ప్రతిపక్షాన్ని కూడా తామే ఏర్పాటు చేసుకోవాలనే ఎత్తుగడలో భాగంగా తెలుగుదేశం స్క్రిప్టు రాసి, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిందన్నది ప్రచారంలో వున్న ఒక విశ్లేషణ. అయితే తెలుగుదేశం వారు కొందరు పవన్‌ కల్యాణ్‌ విమర్శలపై ఘాటుగా ఎందుకు స్పందిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒక బాణాన్ని వదిలిన తరువాత అది తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుతుందో లేదో తెలియదు. కనుక ఒక జేబులో అనుకూల మరో జేబులో ప్రతికూల ప్రకటనలు, వివిధ పార్టీల జండాలు బొడ్డు చుట్టూ కట్టుకొని తిరుగుతూ ఏది వాటంగా వుంటే దాన్ని బయటకు తీసే రోజులివి. అందువలన కొందరు నేతలు పవన్‌ ప్రకటనను ఆహ్వానిస్తే ఎంతైనా వ్యాపార వేత్త గనుక దేనికి మార్కెట్‌లో డిమాండ్‌ వుంటుందో తెలిసిన వ్యక్తి కనుక టిజి వెంకటేష్‌ వంటి వారు కాస్త మసాలా దట్టించి డైలాగులు వదులుతున్నారు. గడ్డం పెంచి గడ్డం గీసుకున్నంత సులభం కాదు రాజకీయాలంటే అన్న గడ్డం భాష ఒకటి. దానికి కొద్ది నెలల క్రితం రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎంత ఖర్చు చేసిందీ బహుశా గుర్తుకు వచ్చి వుంటుంది.

     తెలుగుదేశం అనే మర్రి చెట్టు నీడలో తాము ఎదగటం కష్టమనే విషయం బిజెపి నాయకత్వంలో మొదలైందని, తగినంత మెజారిటీ రాదనే కారణంతో ఎన్నికలకు ముందు కలసి నప్పటికీ ఇప్పుడు స్వంతంగా ఎదగాల్సిన అవసరం ఏర్పడిందన్నది ఆ పార్టీలో బహిరంగ చర్చ. అయితే ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ మాదిరే బిజెపి కూడా మోసం చేసిందనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కారణంగా గతంలో వున్న మోజు చాలా మందికి తీరింది. తాము నేరుగా రంగంలోకి దిగే అవకాశం లేనందున పవన్‌ కల్యాణ్‌ అనే బాణాన్ని బిజెపి వారే ప్రయోగించారన్న అభిప్రాయమూ వుంది. దీని వలన తెలుగుదేశాన్ని దెబ్బతీయటం, వైసిపి, కాంగ్రెస్‌లకు నోరు లేకుండా చేయవచ్చన్న ఎత్తుగడవుంది.రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఏదో విధంగా ప్రత్యేక హోదా సమస్యను సాగదీసి చంద్రబాబు వలన దాన్ని సాధించటం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని కలగచేయటం ద్వారా తెలుగుదేశాన్ని దెబ్బతీయటం ఒకటి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా వుత్తుత్తి పాకేజ్‌లు ప్రకటించి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన విధంగా అజాగళ స్ధనం మాదిరి పేరుకు ఏదో ఒక హోదా ప్రకటన చేసి దాన్ని పవన్‌ కల్యాణ్‌ ఖాతాలో వేసి ఇచ్చింది బిజెపి, తెచ్చింది జనసేన అనే పేరుతో మిగతావారిని పక్కకు పెట్టి తాము రాజకీయ లబ్ది పొందటంగా బిజెపి ఎత్తుగడ వుందన్నది ఒక అభిప్రాయం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ సంస్ధలను ఏర్పాటు చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అందెవేసిన చేయి. వాటిలో తమ అదుపులో వుండేవారిని ప్రవేశపెట్టి అవసరమైన సందర్భాలలో వుపయోగించుకుంటుంది. తిరుపతి సభలో విమర్శలు చేసినప్పటికీ బిజెపి, తెలుగుదేశం పార్టీలపై గతంలో కాంగ్రెస్‌ మాదిరి విరుచుకుపడలేదు. ఒకవేళ రానున్న రోజుల్లో విరుచుకుపడినా అది లాలూచీ కుస్తీ మాత్రమే అనే అభిప్రాయమూ వుంది. పవన్‌ కల్యాణ్‌కు కుల తత్వం వుందా లేదా అన్నది సమస్య కాదు, ఆయన చేసుకున్న వివాహాలను బట్టి కులతత్వాన్ని అంటకట్టలేరు. కానీ ఆయన వెనుక చేరుతున్న వారిలో కులశక్తులు వున్న వాస్తవాన్ని మాత్రం కాదనలేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజకీయాలలో కులం ప్రాధాన్యం వహిస్తున్న కారణంగా అలాంటి విమర్శలు లేదా ఆరోపణలు రావటం సహజం. అధికారం కోసం కులాలు, మతాలను, మూఢనమ్మకాలను పూర్తి స్ధాయిలో వుపయోగించుకుంటున్న రోజులివి.అందువల్లనే అది ఏ రాజకీయ పార్టీ లేదా నేత అయినా ఇప్పుడు విస్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ అందుకు మినహాయింపు కాదు.

    నేను సింహం లాంటోడ్ని అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను అదే తేడా మిగతావన్నీ సేమ్‌ సేమ్‌టు సేమ్‌ అన్న డైలాగ్‌తో జనాన్ని ఆకట్టుకున్న పవన్‌ కల్యాణ్‌ తన విశ్వసనీయతను రుజువు చేసుకుంటారా లేక సేమ్‌ టు సేమ్‌ అన్నట్లు మిగతా రాజకీయ నేతల మాదిరి తానూ ఒకటే అని నిర్ధారిస్తారా ?ఎటు సాగదీస్తే అటు సాగే మాదిరి గబ్బర్‌ సింగ్‌ కాదు రబ్బరు సింగ్‌ అన్న విమర్శను నిజం చేస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫేస్‌బుక్‌లో వామపక్ష భావజాలంపై బుర్రలేని కువ్యాఖ్యలు

24 Wednesday Aug 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Political Parties

≈ 1 Comment

Tags

facebook, filmmaker, leftists, Olympics, PV Sindhu, Sanal Kumar Sasidharan, stupid comments

Image result for stupid funny comments

ఎం కోటేశ్వరరావు

     మీడియా అంటే జనాలకు నమ్మకం పోతోంది. రాబోయే రోజుల్లో అదింకా వేగం పుంజుకోనుంది. ఎందుకంటే ఎవరి అజెండాను వారు అమలు జరుపుతూ నిజాలను ఏడు నిలువుల లోతున పాతరేస్తున్నారు. కత్తిపీటను కనుగొన్న వారి లక్ష్యం గొంతులు కోయటం కాదు. వంటగదిలో మహిళల పనిని సులభం చేయటానికో, ఇతర అలాంటి వుపయోగం కోసమో వాటిని రూపొందించారు. కానీ కొందరు గొంతులు కోయటానికి వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్‌, దానిలో సామాజిక మాధ్యమంగా పరిగణించబడే ఫేస్‌బుక్‌ వంటి వాటిని కూడా అలాగే దుర్వినియోగం చేస్తున్నారు. తాజా వుదంతం విషయానికి వస్తే కేరళకు చెందిన మళయాల సినీ దర్శకుడు సనల్‌ కుమార్‌ శశిధరన్‌ ఒలింపిక్‌ రజత పతక గ్రహీత పివి సింధుపై చేసిన ఒక వ్యంగ్య వ్యాఖ్యపై చెలరేగిన దుమారం.http://www.opindia.com/  ఈ వెబ్‌సైట్‌లో వచ్చే సమాచారం అంతా కమ్యూనిస్టు, వామపక్ష వ్యతిరేకత, బురద చల్లుడు, బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివార్‌కు అనుకూలమైన రాతలు రాసి జనానికి వడ్డించటం. ఇటీవలి కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేయించిన అనేక వెబ్‌సైట్లలో ఇదొకటి. దీనిలో సనల్‌ కుమార్‌ శశిధరన్‌ వ్యాఖ్యపై వెబ్‌సైట్‌ సిబ్బంది వండి వార్చిన ఒక వంటకానికి Left leaning filmmaker says he will like to spit on PV Sindhu అని పేరు పెట్టారు. దీని అర్ధం ఏమంటే ‘ పివి సింధుపై వుమ్మటాన్ని తాను ఇష్టపడతానని వామపక్ష భావజాలం వున్న సినిమా దర్శకుడు చెబుతున్నాడు ‘. కాళిదాసు కవిత్వానికి తమ వామపక్ష వ్యతిరేక పైత్యం జోడించి మొత్తం వామపక్షంపై తప్పుడు అభిప్రాయం కలిగించటానికి, రాళ్లేయటానికి చేస్తున్న నిరంతర యత్నాలలో ఇదొకటి. ఇంకే ముంది కాషాయ దురద అంటించుకున్నవారు దీన్ని చూసి మరింతగా గోక్కోవటం మొదలు పెట్టి వామపక్ష భావజాలం, వామపక్ష వాదులపై రాళ్లు వేయటం ప్రారంభించారు. ఇలాంటి బాపతుకు వాస్తవం తెలుసుకొనే శ్రద్ధ వుండదు, ఒక వ్యాఖ్య, విమర్శ చేయబోయే ముందు తమకూ ఒక బాధ్యత వుంటుందని భావించరు. వాస్తవం తెలిసిన తరువాత పోనీ దానిని సవరించుకుంటారా అంటే అదీ వుండదు. వారి సాఫ్ట్‌వేర్‌ అలాంటిది.

     సనల్‌ కుమార్‌ శశిధరన్‌ తాను వామపక్ష వాదిని అని చెప్పుకున్నట్లు ఎక్కడా మనకు గూగులమ్మ దేవత వెతుకులాటలో కనిపించదు. అతనొక సినిమా దర్శకుడు మాత్రమే. ఆ పెద్ద మనిషి చేసిన వ్యాఖ్యపై దుమారం చెలరేగటంతో తట్టుకోలేక తన ముఖపుస్తకం (ఫేస్‌బుక్‌ ఖాతాలో పెద్ద వివరణ ఇచ్చుకున్నాడు. సంఘపరివార్‌ను నిత్యం మోసే జీ న్యూస్‌ కూడా చివరికి దాని పూర్తి పాఠం ప్రచురించి అసలు శశిధరన్‌ ఏమి వ్యాఖ్యానించాడు అంటూ ఒక వార్తను ఇచ్చింది. దాని లింక్‌http://zeenews.india.com/sports/rio-olympics-2016/did-sanal-sasidharan-actually-try-to-humiliate-pv-sindhu-with-spit-remark-heres-the-truth_1921757.html దాని పూర్తి పాఠం ఇలా వుంది.’ మనం చాలా కష్టకాలంలో జీవిస్తున్నాం. వ్యంగ్యాన్ని, హాస్యాన్ని కనీసంగా కూడా అర్ధం చేసుకోలేని జనం మీడియాను ఏలుతున్నారు. సంచలనాత్మక వార్తల కోసం వారు మొహం వాచిపోయి వున్నారు. ఒలింపిక్స్‌లో పివి సింధు విజయాన్ని న్యూనత పరచాలని ఎవరైతే చూస్తున్నారో ఆ నకిలీ మేథావులు నేను చేసిన వ్యాఖ్యను విమర్శించటాన్ని చూడటం భయం కొల్పేదిగా వుంది. కొన్ని జాతీయ మీడియాలు కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకోవటం, తప్పుడు వ్యాఖ్యానాలు చెప్పి నాకు వ్యతిరేకంగా వుపయోగిస్తున్నాయి. ఇదంతా కైరాలీ జనం టీవీ ఒక అవాంఛనీయ స్క్రోలింగ్‌ వేయటంతో ప్రారంభం కావటం విచారకరం. దాన్నొక వామపక్ష మీడియా అని పిలుస్తారు. ఇప్పుడు సంచలనాత్మక మీడియా నన్నొక వామపక్ష భావజాల సినిమా దర్శకుడిగా చెబుతూ ఈ వార్తను నాకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నది.నేను చేసిన వ్యాఖ్య ఏమిటో స్పష్టత కలిగి వుండటం, దానికి కట్టుబడి వున్న కారణంగా నా వైఖరిని స్పష్టం చేయాలని నేను అనుకోలేదు. నేనేమి చెప్పానో, దాని అర్ధం ఏమిటో నన్ను అనుసరించే వారికి బాగా అర్ధం అవుతుంది. ఇప్పుడు కొంత మంది స్నేహితులు కూడా నా వ్యాఖ్యలను దుర్వినియోగం చేసిన వారి పాటనే పాడటం విచారకరం.ఇది భయానకమైన పరిస్థితి. వాస్తవంగా నేను ఏం చెప్పానో అర్ధం చేసుకోవటానికి కొన్ని క్షణాలు కూడా ఖర్చు చేయకుండా కేవలం నామీద దాడి చేయటానికి, దుర్వినియోగం చేయటం మాత్రమే కోరుకుంటున్న పిచ్చి గుంపుకు వివరించటం వలన ప్రయోజనం లేదు.నేను ఒకటే విషయం చెప్పదలచుకున్నాను, అదేమిటంటే మన పితృస్వామ్య దేశంలో మొత్తం మహిళా సమాజంలో పోరాడి పతకం సాధించిన మహిళను న్యూనత పరిచే వున్మాదిని కాదు నేను. శతాబ్దాల తరబడి మహిళల అణచివేతతో బాధపడుతున్న ఒక దేశం నుంచి ఆమె పోరాడి ఒలింపిక్స్‌లో గొప్ప విజయం సాధించటం ఒక గొప్ప విషయం.అత్యాచారాలు, అవమానాలకు గురయ్యే యువతుల వేషధారణ గురించి చర్చించటానికి తొలి ప్రాధాన్యత ఇచ్చే దేశం మనది. గర్భంలోనే ఆడశిశువుల ప్రాణాలు తీస్తున్న సిగ్గుమాలిన వుదంతాలు ఇప్పటికీ జరుగుతున్న దేశం మనది. తోటి పౌరులారా నేను ఇలా చెబుతున్నందుకు మీరు నన్ను దేశ ద్రోహి అని పిలవటం ప్రారంభిస్తారని నాకు తెలుసు, నేను దానికి సిద్ధమే, ఎందుకంటే నా దేశభక్తిని ఎవరి ముందూ నిరూపించుకోవటానికి సిద్దంగా లేను. కానీ నేను పివి సింధు గురించి మాట్లాడిన దానిని పూర్తిగా దుర్వినియోగ పరచిన వార్తలను వ్యాపింప చేయవద్దు. ఇది నిరాధారమైన, పూర్తిగా వాస్తవ విరుద్ధమైది.’

   ఈ వివరణ చదివిన తరువాత ఈ దేశంలోని వామపక్షాలు పివి సింధు విజయాన్ని కించపరుస్తాయని మెదడు అరికాల్లో వుంటే తప్ప తలమీద వున్నవారెవరూ అనుకోరు. శశిధరన్‌ రాజకీయ భావాలేమిటి అన్నదికాదు, ఆయన వ్యాఖ్యలను ఆధారం చేసుకొని వామపక్ష భావజాలంపై దాడి చేయటం గర్హనీయం. వామపక్ష సిద్దాంతాలు, రాజకీయాలను విమర్శించదలచుకుంటే అందుకు వేదికలు వున్నాయి, వాటిపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపని చేయవచ్చు. ఇలాంటి సందర్బాలను దాడికి వుపయోగించుకోవటం నీచాతి నీచం.

   కొన్ని సందర్భాలలో అమ్మా అన్నా కూడా బూతుగా చిత్రించే దౌర్భాగ్య స్ధితిలో మనం వున్నామన్నది నగ్నసత్యం. హ్యాస్యం, వ్యంగ్యాన్ని భరించే, సహించగలిగే స్ధితికి, అర్దం చేసుకోగల స్ధాయికి మన సమాజం ఎదగలేదు. అసలు అలాంటి ప్రయోగాలు వున్నవనే విషయమే చాలా మందికి తెలియదు. శశిధరన్‌ చెప్పినట్లు కైరాలీ టీవీ తొలుత ఆయనను తప్పు పట్టింది. దానిని ప్రసారం చేసిన బాధ్యుడికి సైతం ఆ వ్యంగ్యం, హాస్యం తెలిసి వుండకపోవచ్చు. దానిని ఒక వామపక్ష వాది విమర్శగా ప్రసారం చేసే అవకాశమే లేదు. అంతేకాదు శశిధరన్‌ నిజంగా వామపక్ష వాది అయి వుంటే దానిని ప్రసారం చేయబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి వుండేవారన్నది గ్రహించాలి. శశిధరన్‌ తన సినిమాలలో మహిళల పట్ల పురోగామి వైఖరిని వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. బహుశా ఆ కారణంగా ఆయను వామపక్ష శిబిరంవైపు నెట్టి దాడికి ఆయుధంగా చేసుకున్నారా ? పురోగామి భావాలు వామపక్షాల సొత్తేమీ కాదు, మానవత్వం వున్నవారెవరైనా కలిగి వుంటారు. మొరటోడికి మల్లె పూవు ఇస్తే ఏం జరుగుతుందో తెలిసిందే కదా ! అందువలన శశిధరన్‌ చెప్పినట్లు ఆయన గురించి తెలిసిన స్నేహితులే అపార్ధం చేసుకున్నారు కనుక సమాజం, తోటి వారు అర్ధం చేసుకోగలిగిన వ్యంగ్యం, హాస్యం మాత్రమే వుపయోగించాలని కూడా తెలుసుకోవటం అవసరం.

    ఇక సామాజిక మాధ్యమంలో ఇష్టపడటాలు(లైకులు) పంచుకోవటాలు(షేర్‌) వ్యాఖ్యలు చేయటానికి http://www.opindia.com/ వ్యాఖ్యానం అటూ ఇటూ తిరుగుతున్నది. ఇంకా ఇతర వార్తలున్నాయోమో నా దృష్టికి రాలేదు. ఈ వెబ్‌ సైట్‌ను ఏర్పాటు చేసింది ఒక సంఘపరివార్‌ భక్తుడు. కిరాయి రాతగాడు కూడా అయి వుండాలి.అతగాడి పేరు రాహుల్‌ రాజ్‌. సంఘపరివార్‌ను కాపు కాసే, తాను మితవాద స్వరాన్ని అని కాలర్‌ ఎగరేసి చెప్పుకొనే స్వరాజ్య అనే పత్రికhttp://swarajyamag.com/culture/interview-rahul-raj-co-founder-of-opindia-com సరిగ్గా ఏడాది క్రితం ఇంటర్వూ చేసింది. దానిలో రాహుల్‌ రాజ్‌ చెప్పిన ఒక ఆణిముత్యం ఎలా వుందో చూడండి.’ 2013లో ఢిల్లీలో అన్నా హజారే ఆందోళన జరిగిన సమయంలో దానిలో భాగస్వామిని, ఆమ్‌ ఆద్మీ పార్టీతో వుండాలని నేను అనుకున్నాను.ఆ తరువాత నేను రాజకీయాల గురించి రాయటం ప్రారంభించాను. కానీ కొంత కాలం గడిచాక అరె నేను వుండాల్సింది వారితో కాదని అర్ధం చేసుకున్నాను, అప్పటి నుంచి బిజెపి అనుకూల రాతలు రాయటం ప్రారంభించాను.’ అలాంటి పెద్ద మనిషి సారధ్యంలో నడిచే వెబ్‌ సైట్‌లో వామపక్ష భావజాలంపై రాళ్లు వేయించటం, నాలుగు రాళ్లు సంపాదించుకోవటం అతని వృత్తి. అలాంటి వారి వెబ్‌ సైట్‌ నుంచి వార్తలను చదివి బుర్రను వుపయోగించుకుండా తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిని ఏమనాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయిదిత్‌ ఫొటోను చూసి భయపడిన కమ్యూనిస్టు వ్యతిరేకులు

14 Sunday Aug 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

1965 anti-communist purge, communist Aidit, Indonesian Communist Party (PKI)., PKI, victims of 1965

Netizens see face of communist Aidit, painting removed from Terminal 3

ఎం కోటేశ్వరరావు

   ఒకవైపు కమ్యూనిజం అంతరించి పోయింది, దాన్ని పూర్తిగా ఓడించి విజయం సాధించామని ప్రకటించిన పాతిక సంవత్సరాల తరువాత కమ్యూనిస్టు నేతల ఫొటోలను చూసి కూడా వ్యతిరేకులు ఎంతగా భయపడుతున్నారో, కమ్యూనిస్టు వ్యతిరేకతను తమ రాజకీయ ప్రయోజనానికి ఎలా వుపయోగించుకుంటున్నారో రెండు వుదాహరణలు వెల్లడిస్తున్నాయి.ఒకటి నియంత సుహార్తో హతమార్చిన ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీ అధినేత డిఎన్‌ అయిదిత్‌ ఫొటో. రెండవది అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా.

    ఇండోనేషియా రాజధాని జకర్తా సమీపంలో కొత్తగా నిర్మించిన సోకర్నో -హట్టా విమానాశ్రయంలోని మూడవ టెర్మినల్‌ 2017లో పూర్తి స్ధాయిలో వినియోగానికి రానుంది. ఇటీవలే పూర్తయి పాక్షికంగా రాకపోకలకు అనుమతించారు. ఆ టెర్మినల్‌ భవనం అలంకరణలో భాగంగా ఇండోనేషియా జాతీయ నాయకులుగా పరిగణించబడుతున్న వారి వందలాది ఫొటోలను ఏర్పాటు చేశారు. వాటిలో యాభై సంవత్సరాల క్రితం అమెరికా మార్గదర్శకత్వంలో జరిగిన సైనిక కుట్రలో హత్యకు గురైన కమ్యూనిస్టు పార్టీ నేత డిఎన్‌ అయిదిత్‌ మాదిరిగా వున్న ఒక చిత్రం కూడా వుంది. దాని కింద క్లుప్తంగా ఇలా రాసి వుంది.’ ఒక రంగస్థలంగా వున్న ఇండోనేషియా చర్చ ద్వారా వాస్తవాలను వెదికేందుకు అచంచలంగా నివేదిస్తోంది. ఒక సూత్రాన్ని రూపొందించేందుకు భావాలు జత కూడుతాయి . అది కేవలం రాజ్యం గురించే కాదు, జాతీయ ఐక్యత అనే ఒక ఆత్మగా రూపొందేందుకు భిన్న భాషలనుంచి భిన్నత్వాన్ని ఎలా రూపొందించాలన్నదాని గురించి కూడా వుంటుంది.’

     దీనికి ఎవరికి వారు తమదైన అర్ధాలు తీసుకున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు ఆ చిత్రాన్ని చూసి ఇంకేముంది ఇండోనేషియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీకి ప్రాణ ప్రతిష్ట జరిగిందని సామాజిక మీడియాలో గగ్గోలు పెట్టారు. దీనిపై గత శుక్రవారం నాడు విమానాశ్రయ నిర్వాహకులు స్పందించారు. కంపెనీ కార్పొరేట్‌ కార్యదర్శి అగస్‌ హర్యాదీ మాట్లాడుతూ ఆ చిత్రంలో వున్నది అయిదిత్‌ అని నిర్ధారణగా చెప్పలేము. దానిని నిర్ధారించుకొనే పనిలో వున్నాము. ఎందుకంటే కోంపాస్‌ డాట్‌ కాం పేర్కొన్నట్లు తొలి ప్రధాని సుతాన్‌ జహీర్‌ది కూడా కావచ్చు అన్నారు. ఇది చెప్పిన కొద్ది గంటలలోనే కంపెనీ డైరెక్టర& జొకో మూర్తజా మోద్‌జో ఒక ప్రకటన చేస్తూ ఆ చిత్రాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తొలుత దానిపై తెల్లని వస్త్రం కప్పి తరువాత పూర్తిగా తొలగించారు. ఐదు దశాబద్దుాల క్రితం ఇండోనేషియాలో జరిగిన కుట్రలో భాగంగా ఐదులక్షల మంది కమ్యూనిస్టులు, నియంత సుహార్తోను వ్యతిరేకించిన వారిని మిలిటరీ, వారితో చేతులు కలిపిన ఇస్లామిక్‌ సంస్ధల సాయుధులు హతమార్చిన విషయం తెలిసిందే. నాటి ఘటనలకు బాధ్యులైన వారిని శిక్షించాలని, వూచకోతపై క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చిన నేపధ్యంలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకులు చెలరేగి పోతున్నారు.

   గతంలో జరిగినదానిని తవ్వటం గాయాలను కెలకటం తప్ప మరొక ప్రయోజనం వుండదని అందువలన వాటి గురించి మాట్లాడ కూడదని రిటైర్డ్‌ జనరల్‌ కికి శ్యాంకరీ వంటి వారు కమ్యూనిస్టు వ్యతిరేక గళం విప్పుతున్నారు. జాతీయ భావమైన పంచశీలకు విరుద్ధంగా దేశంలో తిరిగి కమ్యూనిజం, ఇతర భావజాలాలను వ్యాపింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ జూన్‌లో జరిగిన ఒక కమ్యూనిస్టు వ్యతిరేక సదస్సులో కికీ ఆరోపించాడు. ఒక మార్క్సిస్టు తప్పకుండా ఒక నాస్తికుడు అయి వుంటాడని, భూమిని దేవుడు సృష్టించలేదని చెప్పిన అరిస్టాటిల్‌, ప్లాటోల తత్వశాస్త్రం మార్క్సిజం వెనుక వున్నదని, కాబట్టి వారు దేవుడిని నమ్మరంటూ అరిగిపోయిన రికార్డును తిరిగి వినిపించాడు. కికీ రోత వాదనలను తత్వవేత్త, క్రైస్తవ పూజారి అయిన ఫ్రాంజ్‌ మెగ్నిస్‌ సుసేనో తిరస్కరించారు. కారల్‌ మార్క్స్‌ భావాలు అరిస్టోటిల్‌తో సంబంధం లేనివి,అరిస్టోటిల్‌ భావాలు నాస్తికత్వంతో నిమిత్తం లేనివి అన్నారు. మార్క్స్‌ పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించారని, దాన్ని కూలదోయాలని చెప్పాడన్నారు. తరువాత రష్యా నాయకుడు లెనిన్‌ ఆ పని చేసేందుకు ఒక విప్లవ పార్టీ అవసరాన్ని గురించి చెప్పారని అన్నారు. ‘మార్క్స్‌ విప్లవ పార్టీ గురించి మాట్లాడలేదు, కానీ లెనిన్‌ పార్టీపై కేంద్రీకరించారు, కేవలం సిద్ధాంతం మీదే కాదు విప్లవనిర్వణ గురించి కూడా చెప్పారు.కనుకనే అతను విప్లవకారులను తయారు చేశాడు, వారిని కమ్యూనిస్టులని పిలిచారు, కాబట్టి కమ్యూనిజం అంటే మార్క్‌, లెనిన్‌ సిద్దాంతాల కలయిక ‘ అని ఫ్రాంజ్‌ జకర్తాపోస్టుతో చెప్పారు. కికీ వక్రీకరణలను జర్నలిస్టు ఫెబ్రియానా ఫిర్దౌస్‌ తన ఫేస్‌ బుక్‌లో పోస్టు చేయటంతో అనేక మంది మాజీ జనరల్‌ కికీ కొత్త సిద్ధాంతాన్ని కనుగొన్నాడంటూ వ్యంగ్యంగా తీవ్ర విమర్శలు చేశారు. దాంతో మతశక్తులు ఫెబ్రియానాపై దాడికి దిగిన విషయం తెలిసిందే.

   రెండవ విషయం డోనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి గురించిన ప్రచారం. ట్రంప్‌ భార్య ఒక కమ్యూనిస్టా అంటూ అదొక పెద్ద రహస్యాన్ని బయట పెట్టినట్లుగా ఆదివారం నాడు ఒక వ్యాఖ్యాత ఏకంగా పెద్ద వ్యాసమే రాశాడు. మార్నింగ్‌ లెడ్జర్‌ అనే డాట్‌కామ్‌లో సౌనక్‌ ముఖోపాధ్యాయ అనే పెద్ద మనిషి ఆ పని చేశాడు.ఆమె కమ్యూనిస్టు అయి వుండటానికి పేర్కొన్న కారణాలు ఇలా వున్నాయి. ఆమె ఐరోపాలోని యుగోస్లావియాలో పుట్టింది.ఆ సమయంలో అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం వుంది, కనుక తప్పకుండా ఆమె మ్యూనిస్టు భావజాలాన్ని అభిమానించి వుంటుంది కనుక కమ్యూనిస్టే అయి వుంటుందన్నది తర్కం. ఒక వేళ ట్రంప్‌ గనుక గెలిస్తే ఒక కమ్యూనిస్టు దేశంలో పుట్టిన మహిళ అమెరికాలో ప్రధమ మహిళగా తొలిసారిగా రికార్డుల కెక్కుతారట. ట్రంప్‌ కమ్యూనిస్టు పార్టీ పాలనలో వున్న చైనా అంటే సానుకూల వైఖరి వుండటం మరొక కారణమట. మోకాలికీ బోడి గుండుకు ముడిపెడుతూ రాసే మతిలేని రాతలు తప్ప మరొకటి కాదు. ట్రంప్‌ భార్య మెలినియా యుగోస్లావియాలో పుట్టినప్పటికీ మోడలింగ్‌ వృత్తి కోసం అమెరికా వచ్చింది.అక్కడే ఒక ఫ్రెంచి పత్రికకు నగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ తరువాత ఒక ఫ్యాషన్‌ షో సందర్భంగా పరిచయమైన ట్రంప్‌ను వివాహం చేసుకుంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీకి దిగటంతో ఆయన ప్రత్యర్ధులు ఆ పొటోలను ఈనెలలో తిరిగి ప్రచురింప చేయించి, ఇలాంటి ఆమెను ప్రధమ పౌరురాలిగా ఎలా అంగీకరిస్తామంటూ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఆమె తండ్రి కమ్యూనిస్టు కనుక ఆమె కూడా కమ్యూనిజాన్ని అభిమానించి వుంటుందంటూ ట్రంప్‌ను దెబ్బతీసేందుకు కమ్యూనిస్టు వ్యతిరేకతను కూడా వాడుకోవటం దీని లక్ష్య ంగా వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Increasing Assaults by Cow Vigilante Groups:CPI(M)

01 Monday Aug 2016

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Communist Party of India (Marxist), Cow Vigilante Groups, CPI(M), Gau Rakshaks, Kashmir

The Polit Bureau of the Communist Party of India (Marxist) met in New Delhi
on July 30 and 31, 2016. It has issued the following statement:

Provide Relief To the Flood Affected

The Polit Bureau took note of the serious havoc caused by the floods that have occurred in various parts of the country, especially in East and northern parts of the country, owing to heavy rains. Assam and Bihar are the worst affected. Reports of heavy loss of lives displacement of several lakhs and rendering tens of thousands homeless have come in. The havoc inflicted in various states is unprecedented. Several districts continue to remain marooned and cut off. The Central Government should immediately conduct a survey of all the affected districts, make an assessment and rush immediate relief to all those affected. Priority should be given to evacuate all those who are stranded.

Increasing Assaults by Cow Vigilante Groups

The Polit Bureau condemned the increasing attacks by so-called Gau Rakshaks
in various parts of the country. After the lynching of Mohd. Akhlaq in Dadri, several incidents of such cow vigilante groups attacking dalits and people from the minority community have been reported from various parts of the country including from Gujarat and Madhya Pradesh. Shockingly, in all these incidents the police and administration have remained mute spectators and at times even aiding the culprits and lodging cases against the victims of these attacks.There has been an increase in the attacks on dalits ever since this BJP government assumed office at the Centre.The BJP-led government at the Centre is not only contributing to the alarming increase in the number of such incidents but is also sharply escalating communal polarisation, attacks against dalits and women.

Kashmir:Start Political Dialogue
The Polit Bureau reiterated its grave concern at the deteriorating situation in Kashmir. The standoff between the people and the security forces continues. Till now, as per media report 42 people have been killed and hundreds injured in the massive people?s unrest following the encounter death of Burhan Wani and his associates.The high number of casualties and severe injuries raise serious questions about the brutality with which the security forces have sought to quell the protests. The use of supposedly ?non-lethal? pellet bullets on stone throwing youth has led to eye injuries and consequent loss of vision for many of the protesters. Most of the injuries have been inflicted above the waist. The use of pellet guns must be stopped immediately. The PB reiterates its demand for holding accountable those responsible for killing innocent
unarmed protesters.Adequate compensation to all families who have suffered loss of lives and rehabilitation of the injured by ensuring their means of livelihood must be
undertaken immediately.The need to take effective steps to check cross border filtration cannot be an excuse for the use of unwarranted force against the civilian
population. The AFSPA must be restricted to border areas and withdrawn from the rest of the state.Dialogue needs to be initiated immediately to not only end the current
strife but also to move towards arriving at long lasting peace and normalcy
in Kashmir. The PB reiterates that the Central Government must immediately
convene an all party meeting to discuss this issue. At the state level,consultations with all the political forces and civil society groups must be urgently begun. The overnment of India must resume the Indo-Pak dialogue on all outstanding issues. This should also include an all encompassing dialogue with Pakistan.

Retrograde Education Policy
The Polit Bureau condemned the efforts being made by the Central Government to communalise the education system. In the name of the new education policy an attempt is being made to undermine whatever little remains of its scientific and democratic content. It is clear that the effort is to systematically communalise the education system, particularly higher education and research. The Party in consultation with educationists and organisations of students and teachers will launch a big movement to resist this communal onslaught on education.

Solidarity with West Bengal

The Polit Bureau expressed serious concern over the continued attacks on the
Party and the Left in West Bengal. Eleven comrades belonging to the Party have been killed after the last phase of elections concluded in the state on May 19 till July 29. This is in addition to the 176 lives taken by the Trinamool Congress armed attacks during the course of the last five years of its rule. Over 60,000 families of Party members and sympathizers have been displaced from their homes and villages, Party and mass organisation offices ransacked. Women are targeted and subjected to sexual assaults as well. Huge amounts are being extorted as ransom.In response to the call given by the Central Committee at its last meeting for countrywide protest actions against the murder of democracy in West Bengal, rallies, dharnas etc are being organised in various parts of the country in the first week of August 2016. Various leaders from West Bengal will be participating in these programmes.

Plenum Implementation

The CPI(M) Plenum on Organisation had taken many decisions to strengthen the
Party organisation in order to increase the independent strength of the CPI(M) and its political intervention capacities. While these decisions have begun to be discussed and implemented in the specific situation in each state, these could not be done in those states which went to assembly elections recently. The Polit Bureau discussed the implementation of these decisions at the Party Centre and at the level of the Polit Bureau and Central Committee. These will be placed for follow up action in the
forthcoming Central Committee meeting scheduled to be held from September 17
to 19, 2016.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో తగ్గుతున్న ఆరోగ్య భారం-భారత్‌లో పెరుగుతున్న రోగ రుణ భారం

23 Saturday Jul 2016

Posted by raomk in CHINA, Economics, Health, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

China, healthcare costs, healthy china, INDIA, world bank on china health

Image result for china healthcare

ఎం కోటేశ్వరరావు

   మన ప్రభుత్వాలు అమలు జరుపుతున్న దారిద్ర నిర్మూలన పధకాలు కాగితాల మీద దరిద్రుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఎంత ఆదాయం వస్తే, ఎంత ఖర్చు చేస్తే దారిద్య్రంతో వున్నట్లు అనే కొలబద్ద నిర్ణయంలోనే తిరకాసు వున్న విషయం తెలిసిందే. లెక్కలు చూపేందుకు పడుతున్న తాపత్రయం దారిద్య్ర నిర్మూలనలో లేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే పాలకులు విధానాల కారణంగా అనారోగ్యం పాలైన పేద, మధ్యతరగతి కుటుంబాలన్నీ తట్టుకోలేని ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పుల పాలు కావలసి వస్తోందని ప్రతి కుటుంబ సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రతి ఏటా 6.3 కోట్ల మంది ఈ అప్పుల వూబిలో దిగుతున్నారు. తాజాగా జూలై 22వ తేదీన ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్ధ, చైనా ప్రభుత్వం హెల్తీ చైనా (ఆరోగ్యవంతమైన చైనా) పేరుతో ఒక పెద్ద విశ్లేషణాత్మక నివేదికను వెల్లడించాయి. దానిలో చైనాలో జరిగిన అభివృద్ధి కారణంగా తలెత్తిన సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలా అనే అంశాలను చర్చించారు. దానిలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

  ప్రస్తుతం మొత్తం చైనా ఆరోగ్యఖర్చులో అక్కడి ఆసుపత్రుల వాటా 54శాతం వుండగా, ఓయిసిడి(ఐరోపా ఆర్ధిక, అభివృద్ధి సంస్ధ ) దేశాలలో అది 38 శాతంగా వుంది.

   1980-2000 సంవత్సరాల మధ్య చైనాలో ఆసుపత్రి పడకల సంఖ్య 1.19 నుంచి 2.17 మిలియన్లకు , తరువాత 13 సంవత్సరాలలో 2013 నాటికి 4.58 మిలియన్లకు పెరిగాయి. ఇదే సమయంలో అత్యధిక ఓయిసిడి దేశాలలో పడకలను కుదించారు, కొన్ని దేశాలలో అది 30శాతం వరకు వుంది.

   2002-2013 మధ్య టెరిటరీ, సెకండరీ ఆసుపత్రుల సంఖ్య 82,29శాతం చొప్పున పెరగ్గా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య ఆరుశాతం తగ్గింది.ఆసుపత్రులలో చేరటం 2003లో 4.7శాతం వుండగా 2013లో 14.1శాతానికి చేరింది.

    ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల నిపుణుల సంఖ్య 36శాతం తక్కువగా వుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలపై విశ్వాసం లేక అన్ని అర్హతలు కలిగిన ఆరోగ్య కార్యకర్తలు లేని కారణంగా గ్రామీణ ప్రాంత రోగులు వాటికి వెళ్లకుండా నేరుగా పై తరగతి ఆసుపత్రులకు వెళ్లటం ఎక్కువైంది.

  వైద్య రంగంలో వేతనాలు ఆకర్షణీయంగా లేని కారణంగా దాదాపు 40శాతం మంది మెడికల్‌ గ్రాడ్యుఏట్లు ఆసుపత్రులలో చేరకుండా ఔషధాలు, వైద్య పరికరాల పరిశ్రమలలో చేరుతున్నారు.

  మెడికల్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య 2003-13 మధ్య రెట్టింపైంది. వారిలో నర్సింగ్‌ సిబ్బంది 108శాతం, ఫిజిషియన్స్‌లో 41 శాతం పెరుగుదల కనిపించింది.అయినప్పటికీ నర్సింగ్‌ సిబ్బంది, ఇతరుల కొరత ఇంకా ఎక్కువగానే వుంది.

    అవసరానికి మించి మందులు రాయటం ఒక ప్రధాన సమస్యగా వుంది.సగటున మూడు మందులు రాస్తున్నారు. ఇంజెన్ల రేటు 53శాతం వుంది, ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన సిఫార్సు కంటే ఇవి రెండు ఎక్కువే. రాస్తున్న మందులలో యాంటీబయటిక్స్‌ సగం వుంటున్నాయి.

  గ్రామీణ వైద్యులు కేవలం 26శాతం కేసులలో వ్యాధిని సరిగా నిర్ధారిస్తున్నారని ఒక సర్వేలో తేలింది.అవసరంలేని, హానికరమైన మందుల సిఫార్సు చేయటం 64శాతం కేసులలో కనిపించింది.

    వైద్య సేవలకు ఫీజు చెల్లించే ఏజన్సీ ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఔషధాలపై ఇస్తున్న లాభాల కారణంగా ఆసుపత్రుల రంగంలో, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. స్థూలజాతీయాదాయం (జిడిపి) పెరుగుదల రేటు కంటే ఆరోగ్య ఖర్చుల పెరుగుదల రేటు ఎక్కువగా వుంది. ఏటా 8.4శాతంగా వుంది.జిడిపిలో ఆరోగ్య సంరక్షణ ఖర్చు 2015లో 5.6శాతం వుండగా 2035 నాటికి 9.1శాతం పెరగవచ్చని అంచనా.ఇది డాలర్లలో 467.2 మిలియన్ల నుంచి 2.4 బిలియన్లకు పెరుగుతుంది.

   ప్రపంచబ్యాంకు అంచనా ప్రకారం మెరుగైన వ్యాధుల యాజమాన్య పద్దతులను పాటిస్తే ఆరోగ్య ఖర్చు తగ్గి జిడిపిలో మూడు శాతం పొదుపు అవుతుంది. మరింత మెరుగైన ఆరోగ్య వ్యవస్ధ, సంరక్షణ,ఆరోగ్యం సమకూరే విధంగా సంస్కరణలు చైనాలో అమలు జరిగితే ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించినట్లు అవుతుంది.

    జీవితకాలం పెరిగిన కారణంగా ప్రస్తుతం 65 సంవత్సరాల వయసు దాటిన వారు చైనాలో 14 కోట్ల మంది వున్నారు.వీరి సంఖ్య 2030 నాటికి 23 కోట్లకు పెరుగుతుందని అంచనా.

  రెండు దశాబ్దాల క్రితం అప్పుడే అంటు వ్యాధులు, పుట్టిన పిల్లలకు వచ్చే వ్యాధులు, పౌష్టికాహారం,తల్లుల ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తిన వ్యాధులు 41శాతం వుండేవి. ఇప్పుడు ఓయిసిడి దేశాలలో మాదిరి చైనాలో దీర్ఘకాల, అంటు లక్షణం లేని వ్యాధుల కారణంగా 85 శాతం మంది మరణిస్తున్నారు. మొత్తం మరణాలలో మూడింట రెండువంతులకు హృదయ, క్యాన్సర్‌ వ్యాధులు కారణం అవుతున్నాయి. పెద్ద వారిలో అధిక బరువు సమస్య 1991-2009 మధ్య మూడు రెట్లు 11.8 నుంచి 29.2శాతానికి పెరిగింది. ఇది పురుషులలో ఎక్కువగా వుంది. నలభై తొమ్మిదిశాతం చైనా పురుషులు రోజూ పొగతాగుతున్నారు. ఇది ఓయిసిడి దేశాలతో పోల్చితే రెండు రెట్ల కంటే ఎక్కువ. మద్యం వినియోగం 2000-2010 మధ్య రెట్టింపైంది. సగటున తలకు 5.8లీటర్లు వుంది.

   2009లో చైనా పెద్ద ఎత్తున ఆరోగ్య సంస్కరణలు ప్రారంభించింది.నూట ముప్ఫై కోట్ల మందికి మూడు లక్షల కోట్ల యువాన్లను ఖర్చు చేయాలని తలపెట్టింది. ఫలితంగా దాదాపు నూటికి నూరుశాతం మందికి ఆరోగ్యబీమా సమకూరింది. దశాబ్దకాలంలో ఆరోగ్య సంరక్షణకు జేబులోంచి ఖర్చు చేయాల్సిన మొత్తం 60 నుంచి 30శాతానికి తగ్గింది. అయితే గ్రామీణ జనాభా మాత్రం మొత్తం ఖర్చులో సగం తమ జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. మెరుగుదల అంతటా సమంగా లేదని ఇది వెల్లడిస్తోంది.

    వందల సంవత్సరాలుగా అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిలో ఎంతో ముందున్న ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అర్ధికంగా,రాజకీయ, సైనిక రంగాలలో ఎంతో ముందున్నా మొత్తం జనానికి ఆరోగ్యబీమా కల్పించటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికీ మూడు కోట్ల మందికిపైగా (2014) 10.4 శాతం జనానికి ఆరోగ్యబీమా లేదు. వారికి జబ్బు చేస్తే మన దేశంలో సామాన్య, మధ్యతరగతి మాదిరి అప్పులపాలు కావాల్సిందే. బీమా లేని వారి సంఖ్య ఏటా ఏడుశాతం పెరుగుతున్నదని ఒకవైపు సర్వేలు తెలుపుతున్నాయి.2018 నాటికి బీమా సౌకర్యం లేనివారి సంఖ్యను 2.4కోట్లు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఆ సమస్య మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. వలస వచ్చిన వారిలో నమోదు కాని వారికి బీమా సౌకర్యం వర్తించదు, వారి సంఖ్య దీనికి అదనం. ఎంతన్నది అమెరికా ఎన్నడూ చెప్పదు. మన దేశంలో బీమా సౌకర్యం గురించి చెప్పుకోనవసరం లేదు. ప్రభుత్వ వుద్యోగులు, కొందరు ప్రయివేటు వుద్యోగులకు మినహా మిగతా సామాన్య జనంలో చాలా పరిమితంగానే బీమా పధకాలలో వున్నారు. వైద్యానికి జేబులోంచి ఖర్చు చేసే మొత్తం 85శాతం వరకు వుంటోంది.

   ఇక్కడ ఒక సమస్య గురించి ప్రస్తావించక తప్పదు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటాం. పీల్చటానికి కావాల్సినంత కాలుష్య గాలి, తాగటానికి తగినన్ని కాలుష్య జలాలు వుచితం తప్ప వాటి కారణంగా వచ్చే రోగాల బారిన పడితే అంతే సంగతులు. గాలి, నీటి కాలుష్యానికి పాల్పడేవారిని కాపాడటం తప్ప వారి బారిన పడేవారిని ఆదుకొనేందుకు ముందుకు రాని ప్రజాస్వామ్యం ! డబ్బు లేక కాదు సుమా, డబ్బు లేకపోతే ఏటా ఆరులక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్‌ సంస్ధలు, ధనికుల వజ్రవైఢూర్యాల దిగుమతులకు పన్ను రాయితీలివ్వటం ఎలా సాధ్యం? అడిగితే జవాబు చెప్పరు. మరి అత్యంత సంపద్వంతమైన భూతల స్వర్గం అమెరికాలో కూడా అందరికీ వైద్యం అందుబాటులో ఎందుకు లేకపోయింది ?

  మొత్తం 130 కోట్ల మందికి నాణ్యమైన వైద్య సౌకర్యం అందించే స్ధితికి ఇంకా చైనా చేరుకోకపోయినప్పటికీ రోగాల కారణంగా జనం అప్పుల పాలు కావటం అక్కడ లేదు. చిన్నదో పెద్దదో ఏదో ఒక బీమా ప్రతి ఒక్కరికీ వుంది.రెండువందల యాభై సంవత్సరాల స్వాతంత్య్రం, అభివృద్దిలో అమెరికా సాధించలేని విజయాన్ని చైనా అందులో నాలుగో వంతు కాలంలోనే సాధించటం ఎలా సాధ్యమైంది ? మనం ఆ బాటలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి వుంది. చైనా నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రజాస్వామ్యం అన్న జవాబు వెంటనే సిద్దంగా వుంటుంది.చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడటం ముఖ్యం అన్నారు. అలాగే మంచి గాలి కోసం కిటికీ తెరిస్తే గాలితో పాటు ఈగలూ,దోమలూ కూడా వస్తాయి, వాటిని అరికట్టగలం అన్నారు. సంస్కరణలు అంటే విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానానికి చైనా మార్కెట్‌ను తెరవటం. అది జరిగింది. అభివృద్ధితో పాటు అవినీతి, అక్రమాల వంటి అవలక్షణాలూ పుష్కలంగానే ప్రవేశించినట్లు అక్కడ జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దానిని చైనీయులేమీ దాచుకోవటం లేదు.

    కౌలుగడువు తీరి వాటిని తనలో విలీనం చేసుకొనే సందర్భంగా హాంకాంగ్‌, మకావో దీవులలో 2050 వరకు పెట్టుబడిదారీ విధానాన్ని అనుమతిస్తామని  చైనా ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అంటే దాని ప్రకారం బిలియనీర్లను అనుమతించటంతో పాటు వారు పెరగటానికి కూడా కమ్యూనిస్టుపార్టీ అంగీకరించినట్లే. ఈ కారణంగానే 2050 వరకు తమ పెట్టుబడులకు ఎలాంటి ఢోకాలేదనే ధీమాతో చైనాలో పెట్టుబడులు, ఫ్యాక్టరీలు, వ్యాపారాలు పెట్టటానికి ధైర్యంగా ముందుకు వచ్చి డబ్బు కుమ్మరించారు. దీనిని చూసి కొంత మంది చైనాలో వున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదు, అది కమ్యూనిజం బాటలో పయనించటం లేదు అని విమర్శిస్తున్నారు. చైనా ప్రభుత్వ కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి, బిలియనీర్లు తయారయ్యేందుకు వీలు కల్పిస్తోంది కనుక అధికారిక పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశం అని వర్ణిస్తున్నవారూ లేకపోలేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశాల కంటే భిన్నంగా చైనాలో జీవన ప్రమాణాలు, ఆదాయాలూ పెరుగుతున్నాయా లేదా అంటే పెరుగుతున్నాయి. పెట్టుబడిదారీ దేశం అయితే అది ఎలా సాధ్యం ? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఐరోపాలోని ధనిక దేశాలు కూడా కొన్ని సంక్షేమ చర్యలు అమలు జరిపినంత మాత్రాన వాటిని సోషలిస్టు దేశాలు అనటం లేదు అలాగే అమలు జరుపుతున్న చైనాను మాత్రం సోషలిస్టు దేశంగా ఎలా అంగీకరిస్తాం అనే వారు లేకపోలేదు. సోషలిజం, కమ్యూనిజం భావనల వ్యాప్తిని అడ్డుకొనేందుకు రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐరోపాలోని ధనిక దేశాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపాయి. కానీ గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా 2008 సంక్షోభం ప్రారంభమైన తరువాత వాటన్నింటినీ ఒక్కటొక్కటిగా రద్దు లేదా కోత పెడుతున్నాయి. ఇదే సమయంలో చైనాలో సంక్షేమ చర్యలు మరింతగా పెరుగుతున్నాయి తప్ప తగ్గుతున్నట్లు సమాచారం లేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అమలు జరుపుతున్న ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలన్నీ సంక్షోభం లేదా ఒకటి రెండు శాతం అభివృద్ధి రేటుతో మాత్రమే ముందుకు పోతుండగా చైనాలో గతంతో పోలిస్తే కొంత మేరకు తగ్గినా ఎనిమిదిశాతం వరకు అభివృద్ధి వుంది, ఇలా ఎందుకు జరుగుతోంది ?

    చివరిగా ఒక్క విషయం. మన కంటే సాగు భూమి తక్కువ, జనాభా ఎక్కువ వున్న దేశం చైనా. మనదేశంలో 65 ఏండ్లు దాటిన వృద్ధులు జనాభాలో 5.8 శాతం వుంటే అక్కడ 9.6 శాతం వున్నారు. అ ంటే వృద్దాప్య పెన్షన్లు, వారి సంక్షేమ ఖర్చూ ఎక్కువే. మన సగటు జీవన కాలం 67.8 అయితే అక్కడ 75.15 వుంది. మన పట్టణ జనాభా 31శాతం అయితే అక్కడ 50శాతం దాటింది.మన దేశంలో ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆసుపత్రి పడక వుంటే చైనాలో 3.8 వున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చైనాతో పోల్చితే మనకు అనుకూలమైనవీ, ప్రతికూలమైన పరిస్ధితులూ వున్నాయి. చైనాలో అమలు జరుపుతున్న సంస్కరణలు అక్కడ సామాన్య జనజీవితాలను మెరుగు పరచటంతో పాటు ధనికులనూ పెంచుతున్నాయి.మన దేశంలో కేవలం ధనికులను మాత్రమే పెంచుతున్నాయి.

   చైనా తనదైన ప్రత్యేక శైలిలో సోషలిజాన్ని నిర్మిస్తున్నట్లు మొదటి నుంచి చెబుతోంది. సోషలిజాన్ని ఫలానా మార్గంలో సాధించాలని లేదా ఫలానా విధంగానే నిర్మించాలని మార్క్సిస్టు మహోపాధ్యులెవరూ నిర్ధేశించలేదు. కొన్ని అంచనాలు, జోశ్యాలు, ఊహలు మాత్రమే చేశారు. అత్యంత వెనుకబడిన ఆఫ్రికా దేశాలలో, ఎంతో పురోగతి సాధించిన అమెరికా ఖండ దేశాలలో భౌతిక పరిస్ధితులు భిన్నంగా వున్నపుడు రెండు చోట్లా ఒకే విధంగా సోషలిస్టు వ్యవస్ధను సాధించటం ఎలా సాధ్యం. దేని మార్గం దానిదే. అందువలన చైనాలో జరుగుతున్నదానిని చూసి కొన్ని నిర్ధారణలకు రావాల్సిన అవసరం లేదు, చైనా అయినా మరొక కమ్యూనిస్టుపార్టీ గురించి అయినా విమర్శనాత్మక దృష్టితో చూడటం, సద్విమర్శలు చేయటంలో తప్పులేదు. ప్రపంచ వ్యాపితంగా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన స్ధితిలో కమ్యూనిజాన్ని తెగనాడితే లబ్దిపొందేది కమ్యూనిస్టు వ్యతిరేకులు మాత్రమే.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

22 Friday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Narendra Modi, special status to Andhra pradesh, tdp

 నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన అనధికార బిల్లు అందరూ వూహించినట్లుగానే రెండవ సారి కూడా చర్చకు రాకుండా పోయింది. అలాంటి బిల్లులను చర్చకు రానివ్వరని ఎలాంటి ఆవేశ కావేషాలకు లోనుకాకుండా ఎంతో శాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్‌ పౌరులు గ్రహించటం మంచిది. రజనీకాంత్‌ ఒక సినిమాలో సినిమాలో చెప్పినట్లు అతిగా ఆశపడవద్దు. నరేంద్రమోడీ, చంద్రబాబు మంత్రదండాలు, అల్లావుద్దీన్‌ అద్బుతదీపాలు, లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య వంటి పవన్‌ కల్యాణ్‌ ప్రకటనల కోసం ఎదురు చూసే ఆనందం ఎంతైనా ప్రత్యేక హోదాతో రాదు కదా !

    ఆ బిల్లు చర్చకు వస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలుగు దేశం పార్టీ నేతలు చెప్పిన తీరును చూసినపుడే రాదన్న గట్టి ధీమా వారిలో వుందని తేలిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే కాంగ్రెస్‌ రెండు సంవత్సరాల తరువాత ఒక ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని అంగీకరిద్దాం. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు, అలాగే చంద్రబాబుకు తెలిసిన రాజకీయం కూడా అలాంటిదే. రాష్ట్ర విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా అన్యాయం చేశారనే శాశ్వత విమర్శను కొనసాగించాలన్నా , ఆ పేరుతో మరికొంత కాలం ఓట్లు దండుకోవాలన్నా దానిని ఇవ్వకుండా, అలాంటి బిల్లులను చర్చకు రాకుండా చేయటం బిజెపి, తెలుగుదేశం పార్టీలకు అవసరం అని శుక్రవారం నాటి పరిణామాలు నిరూపించాయని కూడా అనుకోకతప్పదు మరి. రాష్ట్రాన్ని విభజించి అసెంబ్లీ చరిత్రలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన కాంగ్రెస్‌కు జ్ఞానోదయం కలిగి కావచ్చు లేదా చేసిన తప్పును దిద్దుకోవాలంటే పోయిన చోటే వెతుక్కోవాలన్న లోకోక్తి ప్రకారం గానీ ఏదైనేం రెండు సంవత్సరాలకు ఒక బిల్లును ప్రవేశపెట్టింది.

   నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు బిజెపి నేత అవునో కాదో తెలియని మా గుంటూరు గొరిజవోలు చిన్న సినీ హీరో శివాజీ దానిని 14వ అంశంగా పెట్టారని శరభ శరభ దశ్శరభ శరభ అంటున్నాడు. బిల్లు చర్చకు రావాలని, ఆమోదం పొందాలని తెలుగుదేశం పార్టీ నిజంగా కోరుకుంటే , హోదా రాకపోతే ఆంధ్రప్రజలు ఆగ్రహిస్తారని అనుకొని వుంటే చర్చకు రాకుండా పోయిన తరువాత దాని మీద ఆ పార్టీ నేతలు, చివరికి నిన్నటి వరకు కాంగ్రెస్‌లో వుండి తెలుగుదేశంలో రాజ్యసభ సీటుకొనుక్కున్నారని విమర్శలు ఎదుర్కొన్న టిజి వెంకటేష్‌తో సహా అలాంటి వ్యాఖ్యలు చేసి వుండేవారు కాదు.

   ఆమ్‌ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎంపీ పార్లమెంట్‌ ప్రాంగణాన్ని వీడియో తీసి దానిని సామాజిక మీడియాలో పెట్టారని అది నిబంధనలకు వ్యతిరేకం కనుక అతగాడిపై చర్య తీసుకోవాలని బిజెపి అభ్యంతరం తెలిపింది. ఓకే, అదే వాస్తవమైతే నిబంధనల ప్రకారం స్పీకరుకు ఫిర్యాదు చేయవచ్చు, రుజువైతే చర్య తీసుకోవచ్చు, ఎవరు అడ్డుపడ్డారు. వుభయ సభలలో కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల సభ్యులు కూడా చర్య తీసుకోవాలనే కోరారు తప్ప వ్యతిరేకించలేదు. అన్నింటికీ మించి సదరు సభ్యుడు క్షమాపణ చెప్పాడు. అయినా సరే అతని ప్రవర్తన అభ్యంతరకరం అనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా మాదిరి బిజెపి వ్యూహకర్తల మేకిట్‌ ఎన్‌ ఇష్యూ (దాన్నొక సమస్యగా చేయండి ) కాకపోతే ఆ పేరుతో లోక్‌సభ, రాజ్యసభలను ఒక రోజంతా పనిచేయకుండా వాయిదా పడేట్లు అధికారపక్షమే అడ్డుకోవాల్సినంత తీవ్ర విషయమా అది.

   రాజ్యసభలో ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి పార్లమెంట్‌ భద్రతా విషయాన్ని చర్చించాలన్న అధికార పక్ష సభ్యురాలి డిమాండ్‌ను కాంగ్రెస్‌ సభ్యులు ఆమోదించలేదు. ప్రశ్నోత్తరాల తరువాత దాని గురించి చర్చించవచ్చని చెప్పారు.అయినా సరే బిజెపి దాని మిత్రపక్షాల సభ్యులు తమ పట్టువీడకుండా గొడవ చేయటంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సహా అనధికార బిల్లులు చర్చకు రాకుండా పోయాయి. కాంగ్రెస్‌ సభ్యులు ముందే చర్చకు అంగీకరించి వుంటే బిల్లు చర్చకు వచ్చేదని నెపాన్ని కాంగ్రెస్‌ మీద నెట్టేందుకు తెలుగుదేశం మంత్రులు, ఎంపీలు ప్రయత్నించటాన్ని చూస్తే జరిగిందేమిటో అర్ధం చేసుకోలేనంత అమాయకంగా ఆంధ్రప్రజానీకం వుందని భావిస్తున్నారా ? లేక తామేం చెప్పినా నిజమే నిజమే అని తలలూపుతారనుకుంటున్నారా ? అన్నీ వదులుకున్న వాళ్లం హైకోర్టు కోసం పట్టుబట్టి హైదరాబాదులోనే కూర్చుంటామా అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే అన్ని పార్టీలనీ గుడ్డిగా నమ్మి (సిపిఎం తప్ప) అన్నీ వదులుకున్న ఆంధ్రులు రాని ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టి కూర్చుంటారా ?

      తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారికి ఏమైందో తెలియదు. శుక్రవారం రాత్రి తన సిబ్బంది ద్వారా ఒక అధికారిక ప్రకటన పంపారు. దాని పూర్తి పాఠం ఇలా వుంది.’రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని భావించాము కాబట్టే రాష్ట్రానికి ద్రోహము చేసిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్  అని చూడకుండా మద్దతు ఇచ్చాము . సభలోకి వెళ్లకముందే AP ప్రయోజనాలు ముఖ్యము అని స్పష్టము గా చెప్పాను. టీడీపీ కృషి , ఒత్తిడి వలనే కేంద్రము క్రమము గా అన్ని పథకాలకు నిధులు కేటాయించటం జరిగింది . ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహ ధర్మాన్నే పాటిస్తాము కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయము లో రాజీ పడే పరిస్థితి లేదు . రాజకీయ ఎదుగుదల కోసము కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలని తెలివైన ఆంధ్రులు తేలికగా అర్థము చేసుకుంటారు . ‘.

ఇక్కడ సామాన్యులకు అర్ధం కాని విషయం ఏమంటే కాంగ్రెస్‌ మీద అంత సానుభూతి ఎందుకు? తెలుగు దేశం పార్టీ కృషి, వత్తిడి వల్లనే కేంద్రం అన్ని పధకాలకు నిధులు ఇచ్చిందన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఇలా చెప్పటం నిజంగా ఆశ్చర్యంలోనే ఆశ్చర్యం. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుస్తుందా లేక వత్తిడి ద్వారా పని చేస్తుందా ? మీరు చెప్పినట్లు స్నేహంగా వున్నంత కాలం నిధులు విడుదల చేయని కారణంగానే వత్తిడి తెచ్చారని అనుకోవాలా ? వత్తిడి కారణంగా అదనంగా వచ్చిన నిధులేమిటో జనానికి తెలియ చేస్తే సంతోషిస్తారు. బిజెపి-తెలుగు దేశం మధ్య వున్నది అనుభూతికి అందని అపూర్వ స్నేహంగా కనిపిస్తోంది. మీరు తెచ్చే వత్తిడికి నిజంగా అంత సత్తా వుంటే ప్రత్యేక హోదా సంగతి ఇంతకాలం ఎందుకు తేల్చలేకపోయారు అని జనం అడుగుతున్నారు. పార్లమెంట్‌లో మీరే ఎందుకు వత్తిడి తేలేదు. ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యులు సభలో గందర గోళం, వెల్‌లోకి దూసుకుపోవటం వంటివి చేస్తారు. కానీ మీ మిత్రపక్షం అధికారంలో వుండి ఆ పని చేస్తోంది. అంటే ప్రజాస్వామ్యాన్ని తలకిందులుగా అర్ధం చేసుకోవాలా ?

    కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు, బుద్ది రాదు అనుకుందాం . బిజెపి, తెలుగుదేశం పార్టీల వద్ద శుద్ది,బుద్ది టన్నుల కొద్దీ వున్నాయి కదా ! ఇప్పటికైనా ఎలాంటి రాజకీయాలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది కోసం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ ఏదో ఒకటి చేసి చూపండి, ఏమీ చేయకుండానే మూడో ఏడాదిలో ప్రవేశించారు. లేదా ఏదీ అవేమీ వుండవు అనైనా చెప్పండి ! సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెరిగిన జపాన్‌ కమ్యూనిస్టుల ఓట్లు, సీట్లు

14 Thursday Jul 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Uncategorized

≈ Leave a comment

Tags

japan Upper house elections, japanese communist party, japanese communist party votes and seats increased, jcp

ఎంకెఆర్‌

    గత ఆదివారం నాడు జపాన్‌ ఎగువ సభకు జరిగిన ఎన్నికలలో పాలక లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎల్‌డిపి) కూటమి మెజారిటీ సీట్లు తెచ్చుకుంది. మూడింట రెండువంతుల మెజారిటీతో చేయాల్సిన సవరణకు సరిపడా సీట్లు సాధించింది. ఎగువ సభలోని 242స్ధానాలలో ప్రతి మూడు సంవత్సరాలకు సగం సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. నియోజకవర్గాల ప్రాతిపదికన 73 దామాషా ఓటింగ్‌ ప్రకారం 48 మంది సభ్యులను ఎన్నుకుంటారు. మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల తరువాత కమ్యూనిస్టుపార్టీ పదకొండు స్ధానాలను పొందగా ఈ సారి 14కు పెరిగింది. గతం కంటే ఓట్లు పెరగటమే దీనికి కారణం. పాలక ఎల్‌డిపి నాయకత్వం ప్రధాన ప్రతిపక్షంగా వున్న డెమోక్రటిక్‌ పార్టీ(డిపి)తో సమంగా కమ్యూనిస్టులను విమర్శించారు, విమర్శలతో పాటు కమ్యూనిస్టు వ్యతిరేక విషాన్ని చిమ్మారు. అ యినప్పటికీ వాటన్నింటినీ తట్టుకొని కమ్యూనిస్టుపార్టీ తన బలాన్ని పెంచుకుంది. ఈ ఎన్నికలలో పాలకపార్టీ విజయం సాధించినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అత్యంత తక్కువ మంది ఓటర్లు పాల్గొన్న (54.7) ఎన్నికలలో ఇది నాలుగవది. ఓటింగ్‌ వయస్సును 20 నుంచి 18కి తగ్గించిన కారణంగా యువ ఓటర్లు వుత్సాహంతో పాల్గొన్నప్పటికీ ఇంత తక్కువ శాతం పోలు కావటం అక్కడి పాలకకూటమిపై అవిశ్వాసం, ప్రతిపక్ష పార్టీలపై విశ్వాసలేమిని సూచిస్తున్నది.

    గత రెండున్నదశాబ్దాలుగా తీవ్ర ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న జపాన్‌ రాజకీయ వ్యవస్ధలో అస్ధిరత్వం అంతర్భాగంగా మారిపోయింది. పాలక, ప్రతిపక్ష పార్టీలలో చీలికలు, కొత్త దుకాణాలు తెరవటం సర్వసాధారణం. సంక్షోభం నుంచి బయట పడేందుకు పాలకవర్గం జపాన్‌ రాజ్యాంగ సవరణకోసం గత కొద్ది సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నది. రెండవ ప్రపంచ యుద్దంలో విజేతగా వున్న అమెరికా పరాజిత జపాన్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవటంతో పాటు జపాన్‌కు మిలిటరీ లేని రాజ్యాంగాన్ని ఆమోదించే విధంగా షరతు విధించింది, జపాన్‌ రక్షణ బాధ్యత తాను తీసుకుంది. దాంతో మిలిటరీ ఖర్చును పరిశోధన, అభివృద్ధికి వుపయోగించి సాంకేతిక రంగంలో అమెరికా, ఇతర ఐరోపా అగ్రదేశాలను అధిగమించి ఆర్ధిక రంగంలో జపనీయులు సవాలు విసిరారు. ప్రపంచ రాజకీయ రంగంలో పోయిన తమ పెత్తనాన్ని పునరుద్దరించుకొనేందుకు జపాన్‌ పాలకవర్గం తిరిగి మిలిటరీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నది. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి గురైన పూర్వరంగంలో అక్కడి జనం తిరిగి మిలిటరీ ఏర్పాటుకు అనుకూలంగా లేరు. అయితే ఒక్క కమ్యూనిస్టుపార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజ్యాంగ సవరణ తద్వారా మిలిటరీ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నాయి. అయితే కమ్యూనిస్టుపార్టీతో పాటు కొన్ని శక్తులు, కొందరు ప్రముఖులు మాత్రం మిలిటరీ రాజ్యాంగ సవరణలను వ్యతిరేకిస్తున్నారు.

    జపాన్‌కు మిలిటరీ లేకుండా చేయటంలో రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రధాన పాత్ర వహించిన అమెరికన్లు ఇటీవలి కాలంలో తమ వైఖరిని మార్చుకున్నారు. జపాన్‌ రాజ్యాంగంలో తొమ్మిదవ ఆర్టికల్‌ ప్రకారం జపాన్‌ మిలిటరీని కలిగి వుండటం, యుద్ధాలలో పాల్గొనటం నిషిద్ధం. అయితే అమెరికన్లు వివిధ దేశాలలో జోక్యం చేసుకున్న సందర్భంగా తమ సైనికుల ప్రాణాలు పోవటం, ఆర్ధికంగా పెనుభారంగా మారటంతో పాటు ఒక్క యుద్ధంలో కూడా విజయం సాధించని విషయం తెలిసిందే. దాంతో తమ యుద్ధ భారాన్ని మిత్రదేశాలపై రుద్దేందుకు అమెరికా పూనుకుంది. తన తరఫున దాడులలో పాల్గొనేందుకు జపాన్‌ను ప్రోత్సహిస్తోంది. అందుకు రాజ్యాంగ సవరణ జరపమని సలహా ఇస్తోంది. పాతిక సంవత్సరాల క్రితం సోవియట్‌ రద్దయి పోయి, రష్యా తిరిగి అవతరించటం, చైనా చుట్టూ అమెరికా ఏర్పాటు చేస్తున్న సైనిక వలయంలో జపాన్‌ పాత్ర లేకుండా అమెరికన్లు నేరుగా పాల్గొనటం అంత తేలిక కాదు. తమ దేశాన్ని తిరిగి మిలిటరీ మయం గావించటాన్ని మెజారిటీ జపనీయులు అంగీకరించటం లేదు. రాజ్యాంగసవరణ ప్రతిపాదనలను ముందుకు తెచ్చినపుడల్లా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు, ఇదే సమయంలో తమ దేశంలో ఏర్పాటు చేసిన సైనిక స్ధావరాలలో అమెరికన్లు తిష్ట వేయటాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆత్మరక్షణ దళం పేరుతో వున్న బలగాలకు జాతీయ రక్షణ బలగాలని నామకరణం చేయటం ద్వారా మిలిటరీకరణకు 2012లో ఒక ప్రతిపాదనను ముందకు తెచ్చారు.దాని ప్రకారం శాంతి పరిరక్షణ పేరుతో విదేశాలలో జపాన్‌ సాయుధశక్తులను నియమించవచ్చు, దానికి తోడు సంయుక్త ఆత్మరక్షణ పేరుతో అమెరికాతో కలసి దాడులలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ప్రధాని సైనిక దళాల ప్రధాన అధికారిగా వుంటారు. ఈ దళాలను అంతర్గతంగా వెల్లడయ్యే వ్యతిరేకతను అణచివేయటానికి కూడా నియోగించవచ్చు. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా అవసరమైన ముసాయిదా సవరణలను కూడా సిద్ధం చేశారు.

     ఈ సవరణ ఆమోదం పొందితే ప్రపంచ రాజకీయాలపై అది ప్రభావం చూపుతుంది.ప్రస్తుతం జపాన్‌ పాలకవర్గం వివిధ కారణాలతో అమెరికన్లకు లోబడి వున్నప్పటికీ అధికారికంగా మిలిటరీ ఏర్పడిన తరువాత కూడా అలాగే వుంటుందన్న గ్యారంటీ లేదు. ఆసియాలో ఒక పెద్ద ఆర్ధిక శక్తిగా చైనా అవతరించటం, దానికి ప్రస్తుతానికి రష్యాతో విబేధాలు లేకపోవటం వంటి కారణాలతో చైనా, రష్యాలను ఎదుర్కొనేందుకు జపాన్‌ అవసరం అది భావిస్తున్నది. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్ధానంలో జపాన్‌ పౌరుడిని న్యాయమూర్తిగా నియమించటం, దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుతం చైనా కమాండ్‌లో వున్న కొన్ని దీవులపై చైనాకు హక్కులేదని తాజాగా తీర్పు వెలువరించటంలో అమెరికా హస్తం వుంటుందని వేరే చెప్పనవసరం లేదు.ఈ పూర్వరంగంలో జపాన్‌ ఎన్నికలలో పాలకకూటమి ఎగువ సభలో మూడింట రెండువంతుల మెజారిటీ సాధించటం రానున్న రోజులలో ఎలాంటి పరిణామాలకు నాంది అవుతుందో చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిలీ అంతటా చౌక ఔషధాలకు శ్రీకారం చుట్టిన ఓ కమ్యూనిస్టు !

13 Wednesday Jul 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Latin America, Left politics

≈ Leave a comment

Tags

a communist mayor, Cheap-Medicine, Chile, medicine prices, Recoleta mayor

DanielJadue2012.jpg

ఎంకెఆర్‌

   చిలీలోని ఒక చిన్న నగర మేయర్‌గా వున్న ఒక కమ్యూనిస్టు చూపిన చొరవ, చేసిన ప్రయోగం ఇప్పుడు దేశం అంతటా అమలు జరుగుతోంది. చిలీ రాజధాని శాంటియాగో శివార్లలో శ్రామికులు ఎక్కువగా వున్న లక్షన్నర జనాభాగల రికొలేటా పట్టణానికి మేయర్‌గా వున్న డేనియల్‌ జాడు 49 సంవత్సరాల వయస్సున్న ఓ కమ్యూనిస్టు. నాలుగు సంవత్సరాల క్రితం మేయర్‌గా ఎన్నికయ్యాడు. విశ్వవిద్యాలయంలో స్ధానిక సంస్ధల వ్యవహారాలను అధ్యయనం చేసిన చదువును ఆచరణలో జనానికి వినియోగించటమే ఆయన చేసిన ఒక ప్రయోగం. చిలీలో ఔషధాల విక్రయాలలో 90శాతం కేవలం మూడు సంస్ధల చేతులలో నడుస్తున్నాయి. అవి రోగులను పీల్చిపిప్పి చేసేందుకు ఔషధ ధరలను నియంత్రిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. ప్రతిదానికీ వెల నిర్ణయంచే నయా వుదారవాద విధానాల ప్రయోగశాల లాటిన్‌ అమెరికా అయితే ఆ విధానాలను నియంతల పాలనలో బలవంతంగా రుద్దిన దేశాలలో చిలీ ప్రధమ స్ధానంలో వుంది. చిలీ అనగానే ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చిన కమ్యూనిస్టు సాల్వెడార్‌ అలెండీ, ఆయనను హత్య చేసి ప్రభుత్వాన్ని కూల్చివేసిన సైనిక నియంత పినోచెట్‌ గుర్తుకు రాకమానరు.

    మేయర్‌ డేనియల్‌ ఇతర దుకాణాలతో పోల్చితే 78శాతం వరకు ధరలపై రాయితీ ఇచ్చే ఔషధాలు, వైద్య పరికరాలను కార్మికులకు అందుబాటులోకి తెచ్చారు. నగరపాలక సంస్ధ ఆధ్వర్యంలో దుకాణాలను ఏర్పాటు చేశాడు.అది విజయవంతం కావటంతో 58 మున్సిపాలిటీలు వాటిని తెరిచాయని, మరికొన్ని అదేబాటలో వున్నాయని ఆయన చెప్పారు. ధనికులు నివసించే ప్రాంతాలలోని వారు ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకిస్తారు. అలాంటిది కార్మికులతో పాటు ధనికులు కూడా ఈ ఔషధాల కోసం వస్తుండటంతో దేశమంతటా వాటికి డిమాండ్‌ పెరుగుతోంది. ప్రయివేటు ఔషధ దుకాణాలు పౌరుల క్షేమం కంటే తమ లాభాలకు తొలి ప్రాధాన్యత ఇస్తాయి, అదే మా మున్సిపల్‌ దుకాణాలు చిలీ ఔషధదుకాణాల తీరు తెన్నులనే మార్చివేస్తున్నాయని మేయర్‌ వెల్లడించారు.1995,2012లో కోర్టు ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకొని ఔషధదుకాణాల కంపెనీలు ధరలను పెంచివేశాయి. దాంతో చౌక ధరల దుకాణాల ఆలోచన తలెత్తింది. చిలియన్లు 53శాతం వైద్య ఖర్చులను తమ జేబులు లేదా బీమా ద్వారా చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది.

  మొత్తం జనజీవనాన్ని ప్రయివేటు రంగమే శాసిస్తున్న చిలీలో మున్సిపాలిటీలు దుకాణాలు తెరవటం ఒక పెద్ద ముందడుగు.ఈ దుకాణాలు కంపెనీల నుంచి నేరుగా, ప్రభుత్వ వ్యవస్ధ ద్వారా జనరిక్‌, బ్రాండెడ్‌ ఔషధాలను కొనుగోలు చేసి లాభాపేక్షలేకుండా వినియోగదారులకు రాయితీలకు అందచేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రభుత్వం పరిష్కరించలేని సమస్యలను స్ధానిక సంస్ధలు పరిష్కరించటంతో దేశమంతటా వీటి గురించి చర్చ ప్రారంభమైందని డేనియల్‌ అన్నారు. ప్రస్తుతం పరిమితంగా వున్న మున్సిపల్‌ దుకాణాలు తమకు పోటీనిస్తాయని కార్పొరేట్‌ సంస్ధలు భావించటం లేదు. అయితే వచ్చే ఏడాదిలోగా మొత్తం అన్ని మున్సిపాలిటీలు దుకాణాలను తెరిచేందుకు ముందుకు సాగుతున్నాయి. మరింతగా విస్తరిస్తే గుత్త సంస్ధలు వూరుకుంటాయా ? తొలుత చిన్న దుకాణాలపై ఈ ప్రభావం వుంటుందని, తరువాతే తమ వంతు అని అవి భావిస్తున్నాయి.

   కమ్యూనిస్టు మేయర్‌ ఒక్క ఔషధ దుకాణాల ప్రారంభమే కాదు, ఇతర అనేక సమస్యలను పరిష్కరించేందుకు పూనుకున్న క్రమంలో ఎన్నో అటంకాలు, అపవాదులు, కోర్టులలో సవాళ్లు ఎదురవుతున్నాయి. గత నలభై సంవత్సరాలుగా పార్కింగ్‌ ఫీజులతో జనాన్ని బెంబేలెత్తిస్తున్న సంస్ధ నుంచి ఆ కాంట్రాక్టును రద్దు చేసి ఫీజులను తగ్గించారు. డేనియల్‌ జాడు తీసుకున్న చర్యలు ప్రజామోదంతో పాటు వారికి ఎంతో భారాన్ని తగ్గిస్తున్నట్లు అనేక మంది తమ అనుభవాలను తెలుపుతున్నారు. నలభై తొమ్మిది సంవత్సరాల ఈ కమ్యూనిస్టు మేయర్‌ పాలస్తీనా నుంచి వలస వచ్చిన ఒక క్రైస్తవ కుటుంబానికి చెందిన వారు. ఆర్కిటెక్ట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. పట్టణ ప్రణాళిక కోర్సులో సామాజిక గృహనిర్మాణరంగం ప్రత్యేక సబ్జక్టుగా విశ్వవిద్యాలయంలో పట్టా పొందారు.పదిహేను సంవత్సరాల పాటు సామాజిక యాజమాన్య పద్దతులపై పనిచేశారు.విద్యార్ధిగా వున్న సమయంలో రహస్య పాలస్తీనా విమోచనా సంస్ధ (పిఎల్‌ఓ) చిలీ విభాగం విద్యార్ధి సంఘం అధ్యక్షుడిగా, తరువాత లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంత పాలస్తీనియన్‌ యువజన సంఘాల సమన్వయ కర్తగా పనిచేశారు. ఆ క్రమంలో ఏర్పడిన పరిచయాలతో 1993లో చిలీ కమ్యూనిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో చేరారు. సాధారణ పరిస్ధితులు ఏర్పడిన తరువాత రెండు సార్లు పార్లమెంట్‌, మూడు సార్లు మేయర్‌ ఎన్నికలలో పోటీ చేశారు. మూడవసారి 2012లో మేయర్‌గా ఎన్నికయ్యారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d