• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

అకాలీ మంత్రి రాం రాం, 25న భారత బంద్‌ – బిజెపి భజన పార్టీల్లో భయం భయం !

19 Saturday Sep 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

Farmers agitations, SAD minister quits modi cabinet, September 25th Bharat Bandh


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు మరి. గతంలో ఇందిరా గాంధీ మీద కూడా జనం ఈగవాలనిచ్చే వారు కాదు. ఈనెల 25న భారత బంద్‌కు పిలుపు ఇవ్వటం ద్వారా రైతు సంఘాలు మట్టి పిసుక్కునే రైతును మోడీ గురించి ఆలోచింప చేస్తున్నాయి. అకాలీ దళ్‌ మంత్రి హరసిమ్రత్‌ కౌర్‌ నరేంద్రమోడీ కొలువు నుంచి తప్పుకుంటూ చేసిన రాజీనామా మోడీ మీద మరులుకొన్న వారిని ఒక్క కుదుపు కుదిపింది. దీనర్ధం ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుందని కాదు. సంస్కరణలు, రైతాంగాన్ని ఆదుకొనే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ ముందుకు తెస్తున్న ముప్పు గురించి గ్రామీణ భారతంలో తీవ్ర మధనానికి ఈ పరిణామం తోడ్పడుతుంది. ఈ రోజు కావాల్సింది అదే. పొలాలు పదునెక్కితేనే పంటలకు అదును, సాగు సాధ్యం. రైతాంగ బుర్రలకు అదే వర్తిస్తుంది. తమ పంటలకు మిత్ర పురుగులేవో శత్రుకీటకాలేవో తెలుసుకోగలిగిన రైతాంగం తమకు మేలు-కీడు చేసే వారిని, విధానాలను గుర్తించలేరా ?
పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రైతాంగం కరోనాను కూడా లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దాన్ని లెక్కచేయకుండా నాకెదురేముంది అన్నట్లు పార్లమెంట్‌లో నరేంద్రమోడీ రైతాంగానికి నష్టం-కార్పొరేట్లకు ఇష్టమైన వ్యవసాయ సంబంధిత బిల్లులను ఆమోదింపచేసుకున్నారు. మేమూ సంగతేమిటో తేల్చుకుంటామని రైతులు చెబుతున్నారు. రైతువ్యతిరేకమైన చర్యలను తాము ఆమోదించలేమని చెబుతూ పంజాబ్‌ శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడి) పార్టీకి చెందిన మంత్రి హరసిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ గురువారం నాడు రాజీనామా చేయటం, దాన్ని శుక్రవారం నాడు రాష్ట్రపతి ఆమోదించటం వెంటవెంటనే జరిగిపోయాయి. రాజ్యసభలో ముగ్గురు, లోక్‌సభలో ఇద్దరు సభ్యులున్న ఈ పార్టీ మంత్రి వర్గం నుంచి తప్పుకుంది తప్ప ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినట్లు ఇది రాస్తున్న సమయానికి ప్రకటించలేదు. తాము పదవి వీడినా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తూనే రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని అకాలీదళ్‌ నేత, లోక్‌సభ ఎంపీ అయిన సుఖవీందర్‌ సింగ్‌ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడే సుఖవీర్‌, ఆయన భార్యే హరసిమ్రాత్‌ కౌర్‌. స్ధానిక వత్తిళ్ల కారణంగానే ఆమె రాజీనామా చేశారు తప్ప తమ రైతాంగ విధానాలు కాదని బిజెపి ప్రకటించి సమస్య తీవ్రతను మభ్యపెట్టేందుకు, ఆందోళన చేస్తున్న రైతాంగాన్ని అవమానించేందుకు ప్రయత్నించింది. ఈ పూర్వరంగంలో ఆ పార్టీని తమ కూటమిలో ఉంచుకొని బిజెపి బావుకొనేదేమీ ఉండదు, అలాగే కొనసాగి అవమానాల పాలుకావటం తప్ప అకాలీదళ్‌ పొందే లబ్ది ఏమీ ఉండదు. ఈ నెల 25న భారత బంద్‌కు రైతు సంఘాలు పిలుపు నిచ్చినందున ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ దాని పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటాయన్నది యావత్‌ ప్రజానీకం కన్పార్పకుండా చూడనుంది.
అకాలీ మంత్రి రాజీనామాకు ముందు జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా, చిత్తశుద్ధిని ప్రశ్నించేవిగా ఉన్నాయి. అకాలీదళ్‌ అగ్రనేత అయిన 92 ఏండ్ల ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ నివాసం ముందు రైతులు నిరసన తెలిపారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను అంతకు ముందు కేంద్రం ఆర్డినెన్స్‌ల ద్వారా తెచ్చింది. అవి రైతులకు మేలు చేకూర్చేవి అంటూ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ సెప్టెంబరు మూడవ తేదీన ఒక వీడియో ద్వారా పంజాబ్‌ పౌరులకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అవి రైతులకు హాని చేస్తాయంటూ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాదల్‌ ప్రకటనకు నిరసగా మూడు రోజులు వరుసగా రైతులు ఆయన నివాసం ఎదుట నిరసన తెలిపారు.ఈ నేపధ్యంలో తాము కేంద్రం నుంచి రాజీనామా చేయటం తప్ప మరొక మార్గం లేదని దళ్‌ రైతు విభాగనేత సికిందర్‌ సింగ్‌ మల్కా ప్రకటించారు. బిల్లులను వ్యతిరేకించాలని దళ్‌ విప్‌ జారీ చేసింది. చర్చలో బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ సభ్యులు ప్రసంగించారు. గురువారం నాడు మంత్రి రాజీనామా ప్రకటన వెలువడింది. తాను ఒక రైతుబిడ్డ, సోదరిగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రకటించారు.
అంతర్గతంగా అకాలీ దళ్‌ నాయకత్వం ఏ విధంగా భావించినప్పటికీ రైతాంగంలో తలెత్తిన భయాందోళనలను రాజకీయంగా తమను మరింతగా దూరం చేస్తాయని భయపడిందన్నది స్పష్టం. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మార్కెట్‌ యార్డులకు వెలుపల వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు ప్రభుత్వ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఇది తమకు నష్టదాయకమని రైతులు భావిస్తున్నారు. వ్యాపారులు దేశంలో ఎక్కడైనా ఎలక్ట్రానిక్‌ పద్దతుల్లో పంటలను కొనుగోలు చేయవచ్చు.రైతులు అమ్కుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత మార్కెట్ల వెలుపల జరిగి క్రయ, విక్రయాలపై మార్కెట్‌ ఫీజు, లెవీ, సెస్‌ల వంటివి విధించేవి.కార్పొరేట్లకు అనుకూలంగా తాజా బిల్లుతో వాటిని రద్దు చేశారు.
నిత్యావసరకుల చట్టానికి చేసిన సవరణల ప్రకారం కొన్ని ఉత్పత్తులను నిత్యావసర లేదా అత్యవసర వస్తువులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. వాటి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాలను క్రమబద్దీకరించటం లేదా నిషేధించవచ్చు. యుద్దం, కరవు, అసాధారణంగా ధరల పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే కొన్ని ఆహార వస్తువులు, ఉత్పత్తుల సరఫరాలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. ధరలు గణనీయంగా పెరిగినపుడు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమాణాలపై ఆంక్షలను ప్రకటించాల్సి ఉంది.తోటల ఉత్పత్తుల ధరలు వందశాతం, ఆహార వస్తువు ధరలు 50శాతం పెరిగినపుడు వ్యాపారుల నిల్వలపై పరిమితులు విధిస్తారు. ధరల పెరుగుదలను నిర్ధారించేందుకు గడచిన పన్నెండునెలల్లో ఉన్న ధరలు లేదా గడచిన ఐదు సంవత్సరాలలో ఉన్న ధరల సగటు తీసుకొని ఏది తక్కువైతే దాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఉదాహరణకు ఉల్లిధర ఒక నెలలో కిలో 15 నుంచి 40 రూపాయలకు పెరిగిందనుకుందాం. అప్పుడు ఆంక్షలు విధించాలంటే పన్నెండు నెలల సగటు చూసినపుడు 30, ఐదేండ్ల సగటు లెక్కించినపుడు 40 రూపాయలు ఉంటే 30 రూపాయల మీద వందశాతం అంటే 60 రూపాయలకు పెరిగినపుడు, ఇదే విధంగా ఆహార వస్తువుల ధరల పెరుగుదల కూడా అలాగే ఉంటే 30 రూపాయల మీద యాభైశాతం అంటే 45 రూపాయలకు పెరిగినపుడు మాత్రమే వ్యాపారుల నిల్వల మీద ఆంక్షలు విధిస్తారు. లేనట్లయితే అపరిమితంగా నిల్వలు చేసుకోవచ్చు. వినియోగదారుల జేబులు కొల్లగొట్టవచ్చు.
రైతుల సాధికార మరియు రక్షిత బిల్లు పేరుతో తెచ్చిన దానిలో రైతులు మరియు వ్యాపారుల మధ్య ఒప్పందం( కాంట్రాక్టు ) కుదుర్చుకోవచ్చు. దాని ప్రకారం అంగీకరించిన మేరకు రైతులకు వ్యాపారులు ధరలు చెల్లించాలి, వ్యాపారులకు రైతులు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి. ఇక్కడే మతలబు ఉంది. నాణ్యతను నిర్ణయించేది వ్యాపారులుగానే ఉంటున్నారు తప్ప రైతుల చేతుల్లో ఏమీ ఉండదు. ఆ పేరుతో ధరల్లో కోత విధిస్తే చేసేదేమీ ఉండదు. ఇప్పుడు మార్కెట్‌ యార్డుల్లోనే నాణ్యత లేదనే పేరుతో వ్యాపారులు ధరలను తగ్గిస్తున్న విషయం తెలిసిందే. రేపు కాంట్రాక్టు వ్యవసాయంలో వ్యాపారులు అదే పని చేస్తే రైతులకు చెప్పుకొనే దిక్కు కూడా ఉండదు.
ఈ బిల్లులు చట్ట రూపం దాల్చి అమల్లోకి వస్తే భవిష్యత్‌ సాగు అవసరాలకు అనువుగా ఉంటాయని వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ” బిల్లులు చట్టాలైన తరువాత పోటీ పెరుగుతుంది మరియు ప్రయివేటు పెట్టుబడులు గ్రామాలకు చేరతాయి. వ్యవసాయ ప్రాధమిక సదుపాయాలు సమకూరుతాయి, నూతన వ్యవసాయ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తాయి. ఈ సంస్కరణల ద్వారా తమ వ్యవసాయం లాభసాటిగా మారేందుకు రైతులు బడా వ్యాపారులు, ఎగుమతిదార్లతో సంబంధాలను నెలకొల్పుకోవచ్చు, ఆదాయాన్ని పెంచుకోవచ్చు ” అని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ చెప్పారు. ఇవన్నీ రైతాంగాన్ని మభ్యపెట్టేవే తప్ప మరొకటి కాదు.
పంజాబ్‌ రాజకీయాలను చూసినపుడు బిజెపి, నరేంద్రమోడీ పలుకుబడి అక్కడ పని చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచింది, అదే విధంగా లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. ఒక నాడు తిరుగులేని ప్రాంతీయ పార్టీగా ఉన్న అకాలీదళ్‌ నేడు ఒక చిన్న శక్తిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో మూడో స్ధానానికి పడిపోయింది. రైతులు ముఖ్యంగా సిక్కు జాట్ల పార్టీగా ఉన్నది కాస్తా రైతుల్లో తన పట్టును కోల్పోయింది. కేంద్రం పైన చెప్పిన వ్యవసాయ ఆర్డినెన్స్‌లు జారీ చేసిన తరువాత గత మూడు నెలలుగా వాటిని సమర్ధించేందుకు అకాలీదళ్‌ నానా పాట్లు పడింది. దేశంలో కరోనా వైరస్‌ నిరోధంలో వైఫల్యం, ఆర్ధిక రంగంలో రికార్డు స్ధాయిలో దిగజారుడు, ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ ఆందోళనలు చూసిన తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరువు నిలవాలంటే వాటిని వ్యతిరేకించటం తప్ప మరొక మార్గం లేదనే అంచనాకు వచ్చినట్లు కనిపిస్తోంది. లాభసాటిగా ఉంటుంది అనుకుంటే ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినా ఆశ్చర్యం లేదు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పంజాబ్‌ రైతులు వీధుల్లోకి రావటానికి కారణాలు ఏమిటన్నది అసక్తి కరం. ఒప్పంద వ్యవసాయం అన్నది గత అకాలీ-బిజెపి ప్రభుత్వ హయాంలో 2013లోనే ప్రవేశపెట్టారు తప్ప దాని అమలు గురించి రైతాంగాన్ని వత్తిడి చేయలేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులు చూసిన తరువాత ఒప్పంద వ్యవసాయాన్ని బలవంతంగా చేయిస్తారనే భయం రైతాంగంలో తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌ అసెంబ్లీ ఆగస్టు 28న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. గత రెండు వారాలుగా వివిధ రైతు సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి.వాటిని ఖాతరు చేయకుండా కేంద్రం ఆర్డినెన్స్‌ల స్ధానంలో బిల్లులను ప్రతిపాదించి పార్లమెంట్‌లో ఆమోదింపచేయించుకుంది.లోక్‌సభలో ఆమోదం పొందిన తరువాత అకాలీ మంత్రి రాజీనామా చేశారు. తాము కూడా బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేస్తామని ఆమ్‌ ఆద్మీ ప్రకటించటంతో అకాలీల మీద వత్తిడి పెరిగింది.రాజీనామాతో తాము రైతుల కోసం పదవులను త్యాగం చేశామని చెప్పుకొనేందుకు అకాలీలు వెంటనే పావులు కదిపినట్లుగా భావిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్ధానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 77, ఆమ్‌ఆద్మీకి 20, అకాలీ- బిజెపి కూటమికి 18 మాత్రమే వచ్చాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో 13 స్ధానాలకు గాను అకాలీ, బిజెపి రెండేసి సీట్లు మాత్రమే గెలిచాయి. అకాలీ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బిజెపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సగం సీట్లు కావాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. బాదల్‌ కుటుంబం కారణంగానే తాము కూడా ఓటమి పాలైనట్లు భావిస్తోంది. అందువలన కూడా రాజీనామా అస్త్రం ప్రయోగించారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి అకాలీ మంత్రి రాజీనామా ఎన్‌డిఏలోని ఇతర చిన్న పార్టీలకు, విడిగా ఉంటూ బిజెపికి మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీలకు నిస్సందేహంగా ఒక కుదుపు వంటిదే. భారత బందుకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న పరీక్ష ఆ పార్టీల ముందుకు రానుంది. ఆర్ధిక వ్యవస్ధ, ఉపాధి గురించి ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. మరోవైపు నరేంద్రమోడీ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. జిఎస్‌టి నష్టపరిహారాన్ని చెల్లించకుండా తప్పించుకొనేందుకు దేవుడి మీద నెట్టిన తీరు తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇలాగే ఎంతకైనా తెగించే అవకాశాలున్నట్లు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి.
ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు మంగళం పాడే విద్యుత్‌ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణా అసెంబ్లీ తీర్మానం చేయటం ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న భయాలను వెల్లడిస్తోంది. కానీ అదే పార్టీ వ్యవసాయ సంస్కరణల గురించి ఎలాంటి తీర్మానం చేయలేదు. తీవ్రమైన అవినీతి కేసుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి సర్కార్‌ ఏ వైఖరి తీసుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో అనే గుంజాటనలో ఉంది. జిఎస్‌టి బకాయిలపై దేవుడి లీల అన్న కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో కలిసేందుకు ముందుకు రాలేదు. మరోవైపున విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్రం విధించిన షరతులను అమలు చేసేందుకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది. 2004 ఎన్నికల్లో బిజెపితో కలసి భంగపడిన తెలుగుదేశం2014లో లబ్ది పొందింది. వైసిపి దాడులు, కేసులను ఎదుర్కొనేందుకు బిజెపితో సఖ్యతకు ప్రయత్నించినా తాజా విద్యుత్‌, వ్యవసాయ సంస్కరణల పర్యవసానాల గురించి పునరాలోచనలో పడటం ఖాయం. ఇదే విధంగా తమిళనాడులోని అన్నాడిఎంకె, ఇతర రాష్ట్రాల్లోని బిజెపి భజన పార్టీలు కూడా ఆర్ధిక రంగంలో నరేంద్రమోడీ అనుసరించే విధానాలు, ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనే తీరు, వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణలు వాటి పర్యవసానాలు, అకాలీ పార్టీ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఏ గట్టునుండాలో తేల్చుకొనేందుకు పరిణామాలు తొందర పెడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేవుడి మీద ఒట్టు – నిజంగానే యావత్‌ ప్రపంచం నరేంద్రమోడీ వైపు చూస్తోంది !

12 Saturday Sep 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

India economy, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్‌ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్దానంతో 66లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ రోజులు పట్టదు. ఇతర దేశాల జనాభాతో పోలిస్తే మన కేసుల సంఖ్య తక్కువే అని ప్రాధమిక గణితం తెలిసిన వారు కూడా చెబుతారు. సంతోషించాల్సిన అంశమే. దీన్ని నరేంద్రమోడీ గారి విజయ ఖాతాలోనే వేద్దాం. కేసులు తక్కువగా ఉన్నపుడు లాక్‌డౌన్‌ ప్రకటించి విపరీతంగా పెరుగుతున్నపుడు ఎత్తివేసిన ఘనతను కూడా ఆయనకే ఆపాదిద్దాం.


జనవరిలోనే వైరస్‌ గురించి తెలిసినా, అధికారులు హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించి సకాలంలో లాక్‌డౌన్‌ ప్రకటించకుండా, ప్రకటించినా అరకొర చర్యలతో అమెరికన్లకు ముప్పు తెచ్చాడు డోనాల్డ్‌ ట్రంప్‌. ఆ పెద్దమనిషి జిగినీ దోస్తు, కౌగిలింతల ఫేం నరేంద్రమోడీ మే 16వ తేదీ నాటికి కరోనా కేసులు పూర్తిగా ఆగిపోతాయని చెప్పిన నీతి ఆయోగ్‌ అధికారుల మాటలు నమ్మినట్లు కనిపిస్తోంది. నిజంగా తగ్గిపోతే ఆ ఖ్యాతి తనఖాతాలో ఎక్కడ పడదోనని పెద్ద నోట్లను రద్దు చేసిన మాదిరి ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రాలతో చర్చలు లేకుండా ఆకస్మికంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు నరేంద్రమోడీ. అయితే అంచనాలు తప్పి కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ దశలవారీ ఎత్తివేసి మరింత పెరిగేందుకు కారకులయ్యారు, అయినా దాన్ని కూడా విజయంగానే చిత్రించేందుకు ప్రయత్నించారన్నది సర్వత్రా వినిపిస్తున్నమాట. అధికారులదేముంది ! రాజుగారికి ఏది ప్రియమో అదే కదా చెప్పేది. తప్పుడు సలహాలు, జోశ్యాలు చెప్పిన వారి మీద చర్య తీసుకున్నారా ? అదేమీ లేదు.


అన్నీ బాగానే ఉన్నాయి. అసలు విషయం ఆర్ధికం సంగతేమిటి ? దీన్ని ఎవరి ఖాతాలో వేయాలి, ఎవరిని బాధ్యులుగా చేయాలి ? నాకు సంబంధం అంటకట్టేందుకు చూస్తున్నారు, నాకేం బాధ్యత లేదు అని జిఎస్‌టి విషయంలో ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గారికి పగలూ, రేయీ దేవతలతో సహా కలలోకి వచ్చిన దేవుడు ఒకటికి పదిసార్లు స్పష్టం చేశారని తెలిసింది.


పెద్ద వాటిలో ఒక్క చైనా తప్ప అనేక దేశాల ఆర్ధిక వ్యవస్ధలు కరోనా భాషలో చెప్పాలంటే ఆక్సిజన్‌ సిలిండర్ల మీద ఉన్నాయి. మనది వెంటిలేటర్‌ మీద ఉంది అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్న తెలుగు లోకోక్తి తెలిసిందే.జనాభాతో పోల్చుకుంటే మన కరోనా కేసులు తక్కువ అని చెబుతున్నవారు ఆర్ధిక రంగంలో అన్ని దేశాల కంటే దిగజారుడులో అగ్రస్ధానంలోకి ఎందుకు నెట్టారో మాట్లాడరేమి ? ఏమిటీ మన దేశ ప్రత్యేకత ? అదైనా చెప్పాలి కదా !
వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో అంటే ఏప్రిల్‌-జూన్‌ మధ్య జిడిపి వృద్ది రేటు 24శాతం తిరోగమనంలో ఉందని, ఇంకా లెక్కలు పూర్తిగానందున నవంబరు 28న సరైన లెక్కలు చెబుతామని కేంద్రం ప్రకటించింది. కొందరు ఆర్ధికవేత్తలు దిగజారుడు 35శాతం వరకు వుండవచ్చని చెప్పారు. నిండా మునిగిన వారికి లోతు ఎంత ఉంటేనేం ! మొదటి మూడు నెలలే కాదు మిగిలిన తొమ్మిదినెలలూ ఎంత తిరోగమనంలో ఉంటామన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం తప్ప మిగిలిన అందరూ కుస్తీపడుతున్నారు.


వర్తమాన ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి(2021 మార్చి 31) మన ఆర్ధిక వ్యవస్ధ 14.8శాతం తిరోగమనంలో ఉంటుందని గోల్డ్‌మన్‌ శాచస్‌, 10.5శాతమని ఫిచ్‌ రేటింగ్‌ సంస్ధలు జోశ్యం చెప్పగా మన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్ధికవేత్తలు 16.5శాతంగా పేర్కొన్నారు. వరుసగా రెండు త్రైమాసాలు(ఆరునెలలు) ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉంటే మాంద్యం అంటారు. స్వతంత్ర భారత చరిత్రలో 1958లో 1.2శాతం 1966లో 3.66, 1973లో 0.32, 1980లో 5.2శాతం తిరోగమన వృద్ధి నమోదైంది. తొలి త్రైమాసిక తాత్కాలిక ఫలితాలను ప్రకటించిన తరువాత ప్రతి సంస్ధ అంతకు ముందు వేసిన అంచనాలను సవరించి లోటును మరింత పెంచింది. ఉదాహరణకు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసర్చ్‌ సంస్ద 5.3శాతంగా పేర్కొన్న లోటును 11.8శాతానికి పెంచింది.ఎస్‌బిఐ మాత్రం 20 నుంచి 16.5శాతానికి తగ్గించింది. అయితే వచ్చే జూన్‌ నాటికి ఆర్ధిక వ్యవస్ద పురోగమించవచ్చని కూడా ఈ సంస్దలు జోశ్యం చెబుతున్నాయి. రెండవ త్రైమాసంలో 12శాతం విలోమ అభివృద్ధి ఉంటుందని, రానున్న మూడు సంవత్సరాలలో సగటున పదమూడు శాతం చొప్పున అభివృద్ధి నమోదు చేస్తేనే కరోనాకు ముందున్న స్ధాయికి జిడిపి చేరుకుంటుందని క్రిసిల్‌ సంస్ధ చెప్పింది.
వాస్తవ జిడిపిలో పదమూడు శాతం అంటే 30లక్షల కోట్ల రూపాయలు శరీరం మీద మిగిలిపోయే మచ్చ మాదిరి శాశ్వత నష్టం సంభవిస్తుందని, ఆసియా-పసిఫిక్‌ ప్రాంత దేశాలలో ఈ నష్టం మూడు శాతానికి మించి ఉండదని క్రిసిల్‌ పేర్కొన్నది. జి20 దేశాలలో మన జిడిపి పతనం గరిష్టంగా ఉందని మూడీస్‌ పేర్కొన్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే ఏడాది కూడా జిడిపిలోటులోనే ఉంటుందని అంచనా వేసింది.ఆక్స్‌ఫర్డ్‌ అనలిటికా మరింత స్పష్టంగా సచిత్రంగా చూపింది. భారత్‌లో మరో ఉద్దీపన పధకాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ అభిప్రాయపడింది. ఆరోగ్యం, ఆహారం, అవసరమైన వారికి ఆదాయ మద్దతు, వాణిజ్యానికి రాయితీలు ఇవ్వాలని ఐఎంఎఫ్‌ సమాచార శాఖ అధికారి గెరీ రైస్‌ చెప్పారు. వర్తమాన సంవత్సరంలో 4.5శాతం, వచ్చే ఏడాది ఆరుశాతం తిరోగమన వృద్ధి ఉంటుందని ఐఎంఎఫ్‌ జోశ్యం చెప్పింది.


కరోనా వైరస్‌ సమయంలో ప్రభుత్వ ఖర్చు తగ్గినకారణంగా అదిశాశ్వత నష్టాన్ని కలిగించవచ్చని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వం తన డబ్బు సంచి ముడి విప్పకపోతే కోలుకోవటం కష్టమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉద్దీపన ప్రకటించాలనే సూచనలు అన్ని వైపుల నుంచీ వస్తున్నాయి. ఇది కూడా 21లక్షల కోట్ల రూపాయల పధకం వంటిదే అయితే ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింత నగుబాట్ల పాలు కావటం ఖాయం.
ఏప్రిల్‌ జూలై మాసాల్లో గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 9.4లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ ఏడాది ఆ వ్యవధిలో 10.5లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది కంటే తక్కువ.2020-21 బడ్జెట్‌లో అంతకు ముందు సంవత్సరం కంటే మొత్తంగా 12.7శాతం అదనపు ఖర్చు ఉంటుందని ప్రతిపాదించారు. అయితే ఇప్పటి వరకు పెరిగింది 11.3శాతం మాత్రమే. కరోనా బాధితులను ఆదుకొనేందుకు మేము అది చేశాము ఇది చేశాము అని చెప్పుకొనే చర్యలకు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చినట్లు ? బడ్జెట్‌లో కొన్నింటికి తగ్గించి మరికొన్నింటికీ ఖర్చు చేస్తున్నారను కోవాలి. ఇది కూడా రెవెన్యూ ఖర్చు తప్ప దాని మీద వచ్చే రాబడి నామమాత్రం. దాని వలన ఆస్తుల కల్పన జరగదు, ఉపాధి పరిమితం తప్ప పెరగదు. మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వం ఖర్చు చేస్తే వాటిని వినియోగించుకొనేందుకు ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. తద్వారా కొంత ఉపాధి పెరుగుతుంది. ఇప్పుడు అది చాలా పరిమితంగానే చేస్తున్నారు. ఇది ఆర్ధిక వ్యవస్ధ దిగజారటానికి లేదా పక్షవాత రోగి మాదిరి తయారు కావటానికి దారితీస్తుంది.


సిఎంఐయి సంస్ధ సమాచారం ప్రకారం గత రెండు సంవత్సరాలలో ప్రతి మూడు మాసాలకు 1.5లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చేసిన ఖర్చు రూ.19,200 కోట్లు మాత్రమే. 2018-19 మరియు 2019-20సంవత్సరాలలో ప్రతి మూడు మాసాలకు సగటున మూడున్నర లక్షల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం లేదా ప్రయివేటు రంగం కొత్త ప్రాజెక్టులను ప్రకటించాయి. అంత మొత్తం ఉన్నపుడే ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు ప్రారంభం అయింది. ఇప్పుడు జూన్‌తో ముగిసిన మూడు మాసాల్లో ప్రకటించిన నూతన ప్రాజెక్టుల విలువ ఐదోవంతు కేవలం రూ.70,600 కోట్లు మాత్రమే. గతంలో ప్రకటించిన పధకాల పూర్తి కూడా చాలా తక్కువగా ఉంది. ప్రయివేటు వినియోగం 2014 సెప్టెంబరు తరువాత కనిష్టంగా నమోదైంది.
కేంద్రం, రాష్ట్రాలు కరోనా ఉద్దీపనల పేరుతో చేసిన ఖర్చు ఏప్రిల్‌-జూన్‌ మధ్య 16శాతం పెరిగింది. ఇది పెట్టుబడులను ఆకర్షించటానికి లేదా ప్రయివేటు వినిమయం పెరగటానికి గానీ తోడ్పడదని ఆర్ధిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఉపాధి పోగొట్టుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉంటే పని చేస్తున్న వారికి కూడా వేతనాల కోత గురించి తెలిసిందే. ఇది పారిశ్రామిక, సేవా రంగాలలో మాంద్యానికి దోహదం చేసింది. ఎగుమతులు 19శాతం పడిపోయాయి. ఇది ఒక నష్టం. ఇదే సమయంలో దిగుమతులు 40శాతం తగ్గిపోయాయి. దీని అర్ధం ఏమిటి ? కొనుగోలు డిమాండ్‌ తగ్గిపోవటమే, అది కేంద్రానికి, రాష్ట్రాలకు వచ్చే ఆదాయానికి కూడా గండికొడుతుంది.
కరోనాను ఎదుర్కొనేందుకు లేదా దాని కారణంగా దిగజారిన ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించేందుకు అదనపు ఖర్చు చేసినందువలన గాక ఆదాయం తగ్గిన కారణంగానే లోటు ఏర్పడుతున్నది. దానిని పూడ్చుకొనేందుకు కేంద్రం అప్పులు చేయటానికి లేదా రిజర్వుబ్యాంకును ఆదేశించి అదనంగా నోట్లను ముద్రించి కేంద్రం కొంత మేరకు బయటపడవచ్చు. రాష్ట్రాలు అప్పుల ఊబిలో మరింతగా కూరుకుపోతాయి. రిజర్వుబ్యాంకు నోట్లను ముద్రిస్తే అది ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. గతంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన బిజెపికి దాని పర్యవసానాలు తెలుసు కనుక నోట్ల ముద్రణ గురించి గుంజాటన పడుతోంది. అవసరమైన సాకులు వెతుకుతోందని చెప్పవచ్చు. ఏ పేరుతో చేసినా అది సామాన్యుల నెత్తిమీద మోదటమే అవుతుంది. ద్రవ్యలోటు పన్నెండు శాతానికి పెరుగుతుందని, అప్పులు జిడిపిలో 90శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఆర్ధిక వ్యవస్ధను పునరుజ్జీవింప చేసేందుకు పెద్ద ఉద్దీపన పధకాన్ని ప్రకటించాలని ఫిక్కి అధ్యక్షురాలు సంగీతా రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. లాక్‌డౌన్‌ సడలించిన కారణంగా తమ ఆర్డర్లు పెరిగాయని 25శాతం కంపెనీలే జూన్‌లో పేర్కొనగా ఆగస్టునాటికి 44శాతానికి చేరాయని ఆమె పేర్కొన్నారు.


1933లో అమెరికా ఎదుర్కొన్న మాదిరి సవాలును ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటోందని ప్రధాని ఆర్ధిక సలహాదారుల బృంద సభ్యుడైన నీలేష్‌ షా సుప్రసిద్ద జర్నలిస్టు కరన్‌ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బలంగా ఉన్న ఎంఎస్‌ఎంఇలను ఆదుకొని బలహీనమైన వాటిని అంతరించి పోయేందుకు అనుమతించాలని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. స్వాతంత్య్రం తరువాత తొలిసారిగా దేశం ఒకేసారి వైద్య, ఆర్ధిక, ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, దీన్నొక అవకాశంగా మార్చుకోవాలన్నారు. ప్రపంచ పుత్తడి మండలి అంచనా ప్రకారం భారత్‌లో రెండులక్షల కోట్ల డాలర్ల విలువగల 25వేల టన్నుల బంగారం గృహస్తుల వద్ద ఉంది. దీనిలో ఎక్కువ భాగం లెక్కల్లో లేదు. అందువలన అలాంటి బంగారం కలిగిన వారందరికీ క్షమాభిక్ష పెట్టి చట్టబద్దం గావిస్తే బిలియన్ల డాలర్లను సమీకరించుకోవచ్చు అన్నారు నీలేష్‌ షా. దేశం ఇప్పటికి 500 బిలియన్‌ డాలర్ల విలువగల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే దానిలో 376 బిలియన్ల మేరకు అధికారికంగా జరగ్గా 140 బిలియన్‌ డాలర్ల విలువగలది దొంగబంగారం అన్నారు. 1933లో అమెరికా ఆర్ధిక మాంద్యం నుంచి తప్పించుకొనేందుకు బంగారాన్ని జాతీయం చేసిందని, మన దేశంలో గతంలో మొరార్జీదేశారు జాతీయానికి బదులు నియంత్రణ చట్టాన్ని తెచ్చారన్నారు. మన ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనేందుకు జనం త్యాగాలు చేయాలన్నారు. కోటక్‌ మహీంద్రా కంపెనీలో పని చేస్తున్న నీలేష్‌ షా వ్యక్తిగత అభిప్రాయాలుగా చెప్పినప్పటికీ నరేంద్రమోడీకి సలహాలు ఇచ్చే సమయంలో అవి ప్రభావితం చూపకుండా ఉంటాయా, లేక వాటిని పక్కన పెట్టి మోడీగారికి ఇష్టమైన సలహాలు చెబుతారా ?


నరేంద్రమోడీ ప్రపంచ నాయకుడు, ఆయన కోసం ప్రపంచ మంతా ఎదురు చూస్తోందని బిజెపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. మరొక విధంగా అది నిజమే అనిపిస్తున్నది. ప్రపంచ నేతగాకపోతే 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీ ఎందుకు పొందారు ? ఇప్పటి వరకు 14 మంది ఈ బహుమతిని పొందగా మోడీ తొలి భారతీయుడని మోడీ అభిమానులు పొంగిపోయారు. మోడినోమిక్స్‌, యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీకి గాను నరేంద్రమోడీకి సియోల్‌ శాంతి బహుమతి ప్రదానం ‘ అంటూ శీర్షికలు పెట్టిన పత్రికలున్నాయి. మోడినోమిక్స్‌(మోడీ తరహా ఆర్ధిక విధానం) ద్వారా భారత్‌లో మరియు ప్రపంచంలో వున్నతమైన ఆర్ధిక అభివద్ధికి అందించిన తోడ్పాటుకుగాను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు మన విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొన్నది. ‘ అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచేందుకు ఆయన అంకిత భావం, ప్రపంచ ఆర్ధిక వద్ధి పెంపుదల, ప్రపంచంలో వేగంగా వద్ధి చెందుతున్న పెద్ద ఆర్ధిక వ్యవస్ధ అభివద్ది పెంపుదలతో భారత పౌరుల మానవాభివద్ధికి కషి, అవినీతి వ్యతిరేక మరియు సామాజిక ఏకీకరణం ద్వారా ప్రజాస్వామ్యం మరింతగా అభివద్ధి చెందించే ప్రయత్నాలకు గుర్తింపు ఇది, క్రియాశీలకమైన విదేశాంగ విధానంతో ప్రపంచవ్యాపితంగా వున్న దేశాలతో వ్యవహరించిన మోడీ సిద్దాంతాలు, ఆసియా పసిఫిక్‌ దేశాలతో సానుకూల విధానంతో ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతికి ప్రధాని చేసిన కషిని కూడా ఎంపిక కమిటీ గుర్తించింది అని కూడా ప్రకటన పేర్కొన్నది.


ఇంతగొప్ప నరేంద్రమోడీ ప్రధానిగా ఉండగా అమెరికాను అధిగమించే వేగంతో పెరుగుతున్న కరోనా కేసులేమిటి ? 2008 ఆర్ధిక సంక్షోభంలో దెబ్బతిన్న తాము కూడా భారత స్ధాయిలో జిడిపిలో దిగజారలేదు, అక్కడ ఇలా ఎందుకు జరుగుతోంది, ఆర్భాట ప్రకటనలేనా అసలేమీ లేదా అనే సందేహాలతో యావత్‌ ప్రపంచం భారత్‌ను, దానికి ప్రతినిధిగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ గురించి నిజంగానే మోరెత్తి చూస్తోంది. లేకపోతే ఇప్పుడు మన దేశం నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకొనేది ఏమి ఉంది కనుక ? ఆస్తికులు నమ్మే, నాస్తికులు తిరస్కరించే దేవుడి మీద ఒట్టు. ఇది నిజమని అందరూ నమ్మాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పబ్‌జీపై దాడిలో మోడీజీ నిజాయితీ ఎంత ?

04 Friday Sep 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Science, USA

≈ 1 Comment

Tags

India apps ban, India PUBG, Modi’s surgical strike on PUBG, PUBG


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ మరో 117 చైనా యాప్‌లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్‌టాక్‌ మరో 58 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్ధితి ఎలా ఉందంటే ప్రభుత్వం ఏమి చెప్పినా మనం తలూపాల్సిందే, లేకపోతే దేశద్రోహుల కింద లెక్క. చెప్పిందాన్ని నోరెత్తకుండా అంగీకరించటమే దేశభక్తి. ఆ యాప్‌లతో పాటు అమెరికా, ఐరోపా దేశాలలో తయారైన ఎన్నో ఎంతో కాలం నుంచి వినియోగంలో ఉన్నాయి. ప్రతి యాప్‌ వినియోగదారుల సమాచారాన్ని ఏదో ఒక దేశానికి లేదా కార్పొరేట్‌ కంపెనీలకు, గూఢచార సంస్థలకు చేరవేస్తున్నవే అన్నది అవునన్నా కాదన్నా తిరుగులేని సత్యం. యాప్‌లందు చైనా యాప్‌లు వేరయా అంటారా ? అయితే వాటి ముప్పు గురించి ఇప్పటి వరకు తెలియదా ? చైనా యేతర దేశాల యాప్‌లు దేశ రక్షణకు ఉపయోగపడుతున్నాయా అని ఎవరైనా అడిగారో అంతే సంగతులు, బూతులతో దాడి చేసేందుకు అసలు సిసలు దేశ భక్తులం మేమే అని తమకు తామే కితాబులు ఇచ్చుకొని, కీర్తి కిరీటాలను స్వయంగా తల మీద పెట్టుకున్న గుంపులు సిద్దంగా ఉంటాయి. అయినా విమర్శనాత్మకంగా చూడక, ప్రశ్నించక తప్పదు !


దేశ రక్షణకే కాదు, సామాజిక భద్రతకు సైతం ముప్పుగా పరిణమించిన వాటి మీద చర్య తీసుకోవాల్సిందే. రాజీ పడకూడదు. ఎవరైనా కోరుకొనేది అదే ! అలాంటి వైఖరి, చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉందా అన్నది చూద్దాం. పబ్‌జీ వీడియో గేమ్‌కు రూపకల్పన చేసింది ఐరిష్‌ జాతీయుడు. దాన్ని తీసుకొని తయారు చేసింది దక్షిణ కొరియా కంపెనీ. చైనా అతి పెద్ద మార్కెట్‌ కనుక దానిలో ప్రవేశించి సొమ్ము చేసుకోవాలని కొరియా కంపెనీ చైనా కంపెనీ టెన్సెంట్‌తో ఒప్పందం చేసుకొని పదిశాతం వాటా ఇచ్చింది. కంప్యూటర్లలో ఉపయోగించేది ఒకటైతే సెల్‌ఫోన్లలో ఉపయోగించే రకం మరొకటి. దాన్ని టెన్నెంట్‌ తయారు చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెల్‌ఫోన్లలో ఆడేదాన్ని మాత్రమే నిషేధించింది. కంప్యూటర్లలో శుభ్రంగా ఆడుకోవచ్చు. సెల్‌ఫోన్ల ద్వారా వినియోగదారుల సమాచారం చైనాకు అందకూడదు, కానీ కంప్యూటర్ల ద్వారా దక్షిణ కొరియాకు చేరవచ్చు అని పరోక్షంగా నరేంద్రమోడీ సర్కార్‌ చెబుతున్నది. దక్షిణ కొరియా అమెరికా అడుగుజాడల్లో నడిచే దేశం. తాను సేకరించిన సమాచారాన్ని అమెరికాకు ఇవ్వకూడదు అన్న హామీని మన ప్రభుత్వం తీసుకున్నదా ? తెలియదు, తీసుకున్నట్లు ప్రభుత్వమూ చెప్పలేదు.


పబ్‌జి ద్వారా వినియోగదారుల సమాచార తస్కరణ ఒక సమస్య అయితే సామాజికంగా తలెత్తే లేదా జరిగే హాని అంతకంటే పెద్దది. మరి ఈ అంశం గురించి మోడీ సర్కార్‌ వైఖరి ఏమిటి ? 2017లో పబ్‌జీని చైనాలో ప్రవేశపెట్టారు. కాని దానిలో ఉన్న అంశాలు యువతను తప్పుదారి పట్టించేవిగానూ, హింసాత్మక ధోరణులకు పురికొల్పేవిగా ఉండటంతో చైనా 2018లోనే నిషేధించింది. మన దేశంలో అనేక కోర్టుల్లో దీనికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నరేంద్రమోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లోని రాజధాని అహమ్మదాబాద్‌, రాజకోటలో తాత్కాలికంగా నిషేధించారు. గత ఏడాదే దీని గురించి పలు రాష్ట్రాల్లో చర్చలు జరిగాయి. విద్యార్ధుల పాలిట మత్తు మందుల వంటివి, హాని కలిగిస్తున్నాయి, పిల్లల్లో హింసాత్మక ధోరణులు పెరుగుతున్నాయి అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల మానసిక సమస్యలు కూడా తలెత్తాయి. అవేమీ కేంద్ర ప్రభుత్వ దృష్టిలో లేవా ?


అంతెందుకు ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఆ దుష్ఫలితాల గురించి తెలుసు ! మహారాష్ట్రలో ఈ ఆటను నిషేధించాలని, దేశంలో సమీక్ష జరిపేందుకు నైతిక నియమావళి కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ముంబై హైకోర్టులో పదకొండు సంవత్సరాల బాలుడు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. ఆ పిల్లవాడి తరఫున స్వయంగా న్యాయవాది అయిన అతని తల్లి కోర్టుకు హాజరు అవుతున్నది. ప్రధాని నరేంద్రమోడీ విద్యార్ధులు, తలిదండ్రులతో గతంలో మాటా మంతీ జరిపిన సమయంలో ఒక తల్లి మాట్లాడుతూ తన కుమారుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిస అయ్యాడని వాపోయింది. అప్పుడు ప్రధాని మాట్లాడుతూ అతను పబ్జివాలానా ఏమిటి అని ప్రశ్నించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్‌ (ప్రచారం) అయింది. ఈ కేసులో ఆ ఉదంతాన్ని కూడా పిటీషన్‌లో కోర్టు దృష్టికి తెచ్చారు.


హింసాత్మక ధోరణులను పెంచే అంశాలపై సమీక్ష జరిపే నైతిక నియమావళి కమిటీ సమీక్షలో పబ్‌జీ ఆట ప్రమాదకరమని భావించి ఆ కమిటీ చైనాలో నిషేధించాలని సిఫార్సు చేసింది, దాన్ని అక్కడ అమలు జరిపారు. మన దేశంలో కూడా అలాంటి కమిటీని వేసి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ముంబై కేసులో పిటీషనరు ప్రశ్నించాడు. ఇలాంటి ఆటలే పిల్లల మీద ప్రతికూల ప్రభావాలు చూపుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక నివేదికలో హెచ్చరించిన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. అంతే కాదు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ కూడా పబ్జీ ఆట నిషేధానికి తీసుకున్న చర్యల గురించి నివేదిక ఇమ్మని కేంద్రాన్ని కోరింది. పబ్‌జీని జూదంగా మార్చి ఆడుతున్న పెద్ద వారిని గుజరాత్‌లో పోలీసులు అరెస్టులు కూడా చేశారు.


చైనా కమ్యూనిస్టు దేశం, నియంతృత్వం ఉంటుంది, అక్కడ ఏమైనా చేయగలరు, మనది ప్రజాస్వామిక దేశం అక్కడ చేస్తున్న మాదిరి ఇక్కడ చేయటం కుదరదు అనే వాదన ఇటీవల అనేక సందర్భాలలో కొందరు ముందుకు తెస్తున్నారు. బాధ్యతను తప్పించుకొనేందుకు అదొక సాకు తప్ప మరొకటి కాదు. తప్పుదారి పడుతున్న పిల్లలను సరైన దారిలోకి తెస్తామంటే ప్రజాస్వామ్యం అడ్డుకుంటుందా ? ఒక వేళ అడ్డుకునేట్లయితే భావి తరాలను చెడగొట్టే అలాంటి ప్రజాస్వామ్యం మనకెందుకు ? పబ్‌జి యాప్‌ను నిషేధిస్తే చైనా కంపెనీ టెన్సెంట్‌కు లక్ష కోట్ల రూపాయల నష్టమని కొందరు చెబుతున్నారు. పదిశాతం వాటా ఉన్న కంపెనీకే అంతనష్టమైతే తనదని కూడా చూసుకోకుండా చైనా కమ్యూనిస్టులు దాన్ని నిషేధించారు. మరి మన ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు కొనసాగనిచ్చినట్లు ? పోతే పోనీయండి పిల్లలు ఏమైతే మాకేం అని పాలకులు అనుకుంటున్నారా ?


2018 మార్చినెల తరువాత తొమ్మిది నెలల కాలంలో చైనా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క వీడియో గేమ్‌ను కూడా అమ్మకానికి అనుమతించలేదని ఆ విధానాన్ని 2019లో కూడా కొనసాగిసాంచవచ్చని 2018 డిసెంబరు 13న ఒక పత్రికలో కెవిన్‌ వెబ్‌ అనే విలేకరి రాశారు. ప్రభుత్వ విధానాలకు వీడియో గేమ్‌లు ఉన్నాయా లేదా అని పరిశీలించి అభిప్రాయం చెప్పేందుకు ఒక నైతిక నియమావళి కమిటీని కూడా చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నైతికత గురించి కబుర్లు చెప్పే మన పాలకులు ఇంతవరకు అలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదు. సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు అనే హాంకాంగ్‌ నుంచి వెలువడే పత్రికను నడుపుతున్నది కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్టుల పట్ల దానికి సానుభూతి కూడా ఉన్నట్లు మనకు కనపడదు. అలాంటి పత్రిక రాసిన కథనం ప్రకారం 2018 మార్చినెలలో హింసాత్మక, ఇతరంగా దురుసుగా వ్యవహరించటాన్ని ప్రోత్సహించే సినిమాలు, వీడియోగేమ్‌లు, యూ ట్యూబ్‌ సీరీస్‌ లేదా చిత్రాలను, నూతన మీడియా విభాగం కిందికి వచ్చే అన్నింటినీ సమీక్షించేందుకు చైనా సర్కార్‌ ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దాన్నుంచి అనుమతులు వచ్చే వరకు కొత్త వాటిని వేటినీ అంగీకరించకూడదని నిర్ణయించింది.అంతకు ముందు అనుమతించిన వాటి మీద కూడా ఆంక్షలు విధించింది.


చైనా సెంట్రల్‌ టీవీ ( మన దూరదర్శన్‌ వంటిది) వెల్లడించిన సమాచారం ప్రకారం నైతిక విలువల సమీక్ష కమిటీ 20గేమ్‌లను సమీక్షించి తొమ్మిదింటిని తిరస్కరించింది. మిగిలిన వాటిలో మార్పులను సూచించింది. కొన్ని వీడియో గేమ్‌లు పిల్లలను వ్యసన పరులుగాను, పని పాటలు లేని వారిగానూ మారుస్తాయనే విమర్శ చైనాలో వచ్చింది. 2018లో వీడియో గేమ్‌లపై 34 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసినట్లు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో గేమ్స్‌ తయారీ సంస్ధ చైనా కంపెనీ టెన్సెంట్‌. చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన దాని ఆదాయం 200 బిలియన్‌ డాలర్లు పడిపోయింది. పిల్లలు అదే పనిగా గేమ్స్‌లో మునిగి పోకుండా ఉండేందుకు వారిని గుర్తించి వ్యవధిని పరిమితం చేసే అంటే నిర్ణీత వ్యవధి తరువాత గేమ్‌లు ఆగిపోయే విధంగా సాప్ట్‌వేర్‌లో మార్పులు కూడా టెన్సెంట్‌ కంపెనీ చేసింది. చైనాను ఆర్ధికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే మన సర్కార్‌ యాప్‌లను నిషేధించింది. కానీ అంతకంటే ముందే చైనా తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తమ కంపెనీకి ఎంత నష్టం వచ్చినా ఆ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ నేత అనుకుంటున్న నరేంద్రమోడీ లేదా ఆయన సలహాదారులు, పెద్ద యంత్రాంగం వీటన్నింటినీ గమనిస్తున్నదా ? నిజంగా గమనిస్తే పబ్‌జీ వంటి ప్రమాదకరమైన వీడియో గేమ్‌ల మీద చర్య తీసుకొనేందుకు సరిహద్దులో చైనాతో సమస్య వచ్చేంత వరకు ఆగాలా ? అందువలన పబ్‌జీ గురించి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి తెలియని విషయము కాదు అన్నది స్పష్టం. తలిదండ్రులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, కోర్టులలో కేసులు ఎందుకు దాఖలు అవుతున్నాయో పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా ? కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు చైనాను దెబ్బతీసేందుకు నిషేధం అని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. అందుకే చిత్తశుద్ధి సమస్య ముందుకు వస్తున్నది. జాతిని ఏకత, శీలముతో నిర్మిస్తాము అని చెప్పుకొనే సంఘపరివార్‌ కుటుంబంలో పెరిగిన వారే ఇప్పుడు దేశంలోని అని ప్రధాన పదవులలో ఉన్నారు. పబ్‌జీ గాక పోతే దాని తాతల వంటి ప్రమాదకర వీడియో గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి, మరి వాటి సంగతేమిటి ?


ప్రపంచంలో ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం మీద కొత్త యుద్దం మొదలైంది. పది సంవత్సరాల క్రితం వరకు చైనా ఈ రంగంలోకి వస్తుందని లేదా తమకు పోటీ ఇస్తుందని అమెరికా వంటి దేశాలు ఊహించలేదు. చైనా వారికి తెలివి తేటలు లేవు, ఫ్యాక్టరీల్లో గొడ్డు చాకిరీ చేస్తారు గానీ వారికి ఆంగ్లం రాదు, ఆంగ్లం రాకుండా కృత్రిమ మేథలో ప్రవేశించలేరు అన్న భ్రమలున్నవారికి దిమ్మతిరిగేలా చైనా ముందుకు వచ్చింది. రాజకీయ రంగంలో ఎవరు ఎటు వుండాలో తేల్చుకోవాల్సిన సమయాల మాదిరి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన పోటీలో కూడా అమెరికా – చైనాల మధ్య ఏ పక్షంలో ఉండాలో దేశాలూ, కంపెనీలు తేల్చుకోవాల్సిస తరుణం వచ్చిందని అమెరికా మీడియా సంస్ధ సిఎన్‌ఎస్‌ విశ్లేషకులు జిల్‌ దిసిస్‌ జూలై11న రాసిన దానిలో పేర్కొన్నారు. ఫలానా యాప్‌, పరికరం ఫలానా దేశానిది అయితే కొనవద్దు అనే ఆంక్షలకు, ఇతర దేశాల మీద వత్తిళ్లకు శ్రీకారం చుట్టింది అమెరికా. ఇది రాబోయే రోజుల్లో పెట్టుబడిదారీ దేశాల్లోనే కొత్త విబేధాల సృష్టికి నాంది పలకటం ఖాయం.


అమెరికాతో సహా అనేక దేశాలు చైనాతో వాణిజ్యలోటులో ఉన్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు రాజకీయంగా చైనా వ్యతిరేక శిబిరంలో ఉన్న ఆస్ట్రేలియా, జపాన్‌, జర్మనీ, దక్షిణ కొరియా,బ్రెజిల్‌, సౌదీ అరేబియా, స్విడ్జర్లాండ్‌, ఒక దేశం కాకున్నా తైవాన్‌ ప్రాంతం చైనాతో వాణిజ్యంలో మిగుల్లో ఉన్నాయి. అందువలన ఎవరు ఎటు ఉండాలో తేల్చుకోవాల్సిన స్ధితే వస్తే ఈ దేశాల్లో ఉన్న కార్పొరేట్‌ సంస్ధలు నష్టాలు మూటగట్టుకొని లేదా మడి గట్టుకొని చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంటాయా లేక అనుకూల వైఖరిని తీసుకుంటాయా అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు రావటం అనివార్యం.తటస్ధ వైఖరి తీసుకున్నా అది అమెరికాకు ఓటమే అవుతుంది. టిక్‌టాక్‌ యాప్‌ చైనా కంపెనీది అయినప్పటికీ దాని సిఇఓ అమెరికన్‌. మన దేశం దాన్ని నిషేధించిన తరువాత మా భద్రతకు సైతం ముప్పే అంటూ అమెరికా పల్లవి అందుకుంది. నిజంగా ముప్పు అనుకుంటే చైనా కంపెనీకి ఒక అమెరికన్‌ సారధ్యం వహించటం నిజంగా ఆశ్చర్యమే. అదే అమెరికా దాన్ని తమ దేశంలోని కార్పొరేట్లకు విక్రయించాలని కోరిన విషయం కూడా తెలిసిందే.


ప్రస్తుతం యాప్‌ల తయారీలో ప్రపంచ వ్యాపితంగా తీవ్ర పోటీ నెలకొన్నది. యాప్‌లు వస్తువులను తయారు చేయవు. వాటిని మార్కెటింగ్‌ చేసేందుకు ఉపయోగపడతాయి. వినోదం లేదా సమాచారం, ఆటల వంటి వాటిని వినియోగదారులకు చేరుస్తాయి. వాటి ద్వారానే డబ్బు సంపాదించవచ్చు. ఇటీవలి కాలంలో చైనాలో పెరుగుతున్న లేదా కొత్తగా పుట్టుకు వస్తున్న బిలియనీర్లు ఈ రంగం నుంచి వచ్చిన వారే అత్యధికులు. ఇప్పుడు యాప్‌ల సునామీని ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ విభాగాన్ని విశ్లేషిస్తున్నవారు చెబుతున్నమాట. యాప్‌ అనీ అనే ఒక సంస్ధ రూపొందించిన నివేదిక ప్రకారం 2020 తొలి ఆరు నెలల కాలంలో ప్రపంచ యాప్‌ ఆర్ధిక వ్యవస్ధలో మొబైల్‌ యాప్స్‌ మరియు గేమ్స్‌ మీద 50 బిలియన్‌ డాలర్ల మేర వినియోగదారులు ఖర్చు చేశారు.అంతకు ముందు ఆరునెలలతో పోలిస్తే పదిశాతం ఎక్కువ. ప్రపంచ వ్యాపితంగా కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపధ్యంలో మే నెలలో రికార్డు స్ధాయిలో 9.6బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ప్రపంచ వ్యాపితంగా 1.6లక్షల కోట్ల గంటల పాటు వినియోగదారులు ఆరునెలల కాలంలో మొబైల్స్‌తో కాలక్షేపం చేశారని అంచనా.రానున్న రోజుల్లో కొత్త అంశాలతో పాటు ప్రత్యక్ష ప్రసారాలను చూసేందుకు వినియోగదారులు పోటీ పడతారని భావిస్తున్నారు. ప్రపంచ యాప్‌ల సునామీకి, అమెరికా-చైనాల పోటీకి ఇదే కారణం.


కరోనా వైరస్‌ ఒక వైపు ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తున్నది అన్నది ఒక చేదు నిజం. ఇదే సమయంలో గతంలో ఏ వైరస్‌ చూపని ప్రభావం జన జీవితాల మీద చూపుతున్నది అంటే అతిశయోక్తి కాదు. సెల్‌ ఫోన్‌ లేకుండా రోజువారీ జీవనం గడవదు అనుకొనే పరిస్ధితి రావటానికి కరోనా వైరస్‌ ముందు పది సంవత్సరాలు పడుతుందని అని అంచనా వేశారు అనుకుందాం. కరోనా ఆ వ్యవధిని రెండు మూడు సంవత్సరాలు తగ్గించి వేసిందని తాజా అంచనా. కొద్ది సంవత్సరాల క్రితం పుడుతున్న పిల్లలు ముందు అమ్మా అనటం కంటే అమ్మాయి అంటున్నారని జోక్‌లు పేలాయి. చందమామను చూపి పిల్లలకు తిండి తినిపించే తల్లులు పాత సినిమాలు, కథల్లో మాత్రమే కనిపిస్తారు. సెల్‌ ఫోన్లు చూపి తినిపించే వారు ఎక్కడ చూసినా మనకు దర్శనమిస్తున్నారు. కరోనా ఈ పరిణామాన్ని మరింత వేగవంతం కావించింది. సెల్‌ ఫోన్‌ లేకుండా బడికి వెళ్లం అని పిల్లలు మారాం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.


ఇప్పటికే టెలికాం రంగంలో చైనా దూసుకుపోతున్నది. ఐదవతరం ఫోన్ల సాంకేతిక పరిజ్ఞానంలో చైనా హువెయి కంపెనీ ముందున్నది. భద్రతా కారణాలను సాకుగా చూపి దాని పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేయవద్దని అమెరికా తన అనుంగు దేశాలను ఆదేశిస్తున్నది. యాప్‌లను కూడా ఇదే సాకుతో అడ్డుకో చూస్తున్నది. గాల్వన్‌ లోయ ఉదంతాలకు ముందు మన దేశానికి టిక్‌టాక్‌, పబ్‌జి, తదితర చైనా యాప్‌ల నుంచి ముప్పు ఉందని ప్రభుత్వం చెప్పలేదు. వెనెజులా, ఇరాన్‌ మీద కక్ష గట్టిన అమెరికా మనదేశాన్ని తన వైపు తిప్పుకుంది. అమెరికా బెదిరింపులకు లొంగి మనం ఆ రెండు దేశాల నుంచి చమురు కొనుగోలు ఆపి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాము. ఐదవతరం టెలికాం టెక్నాలజీ విషయంలో కూడా ఇదే వైఖరి తీసుకున్నాము.చైనా కంపెనీలను టెండర్లలో పాల్గొన కుండా నిషేధించటంతో పాటు పెట్టుబడులను కూడా అడ్డుకుంటూ నిబంధనలను రూపొందించారు. మనం చైనా వ్యతిరేక శిబిరం అంటే అమెరికా టెంట్‌లోకి దూరేందుకు గాల్వన్‌ లోయ ఉదంతాలు ఒక సాకు తప్ప మరొకటి కాదు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


ఒక నాడు కృత్రిమ మేధ రంగంలో ఐబిఎం, ఆపిల్‌, మైక్రోసాప్ట్‌ వంటి అమెరికన్‌ కంపెనీలు తప్ప మరొక పేరు వినిపించేది కాదు. ఇప్పటికీ అవి రంగంలో ఉన్నప్పటికీ చైనా కంపెనీలు ముందుకు దూసుకు వచ్చాయి. మేడిన్‌ చైనా 2025 పేరుతో చైనా ఉన్నత స్ధాయి సాంకేతిక పరిజ్ఞానంలో పట్టుసాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. పశ్చిమ దేశాల మీద ఆధారపడకూడదనే ప్రధాన అంశం దానిలో ఉంది. అందుకే తీగలతో పనిలేని ఫోన్లు, ఇంటర్నెట్‌, మైక్రోచిప్స్‌, రోబోరంగంలో బిలియన్ల డాలర్లను పెట్టుబడులుగా పెడుతున్నది.2019లో చైనా చేసుకున్న దిగుమతుల్లో పదిహేను శాతం లేదా 306 బిలియన్‌ డాలర్ల విలువగల చిప్‌సెట్లను చైనా దిగుమతి చేసుకుంది. ఈ నేపధ్యంలోనే తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తస్కరిస్తున్నది అనే ఒక తప్పుడు ప్రచారాన్ని ట్రంప్‌ ప్రారంభించాడు.అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి తమకు సాంకేతిక పరిజ్ఞానం అందదు అనే నిర్ణయానికి చైనా వచ్చింది. పైన చెప్పుకున్నట్లు పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా అభివృద్ధి పిలుపుకు నేపధ్యం ఇదే.


ప్రపంచంలో తొలి సారిగా అణుబాంబును తయారు చేసింది, ప్రయోగించి భయపెట్టింది అమెరికా. అయితే నాటి సోవియట్‌ నేత స్టాలిన్‌ తాపీగా బాంబును తయారు చేయించి, అంతరిక్ష ప్రయోగాలకు అంకురార్పణ చేసి ముందుకు పోయిన విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవటం తప్పుకాదు. తన వాణిజ్య ప్రయోజనాల కోసం టిక్‌టాక్‌ లేదా పబ్‌జి, మరొక కంపెనీ ఏదైనా చైనాకు దూరంగా జరిగినా ఆశ్చర్యం లేదు. అయినప్పటికీ వారికి వచ్చే నష్టం లేదు. కొత్త కంపెనీలను రంగంలోకి తెస్తారు తప్ప అయ్యో అంతా అయిపోయిందని చేతులు ముడుకు కూర్చోరు. సాంకేతిక రంగంలో చైనా ఏమీ లేని స్దితి నుంచి ప్రారంభం అయిందని గుర్తుంచుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతీయవాద పులి మీద నరేంద్రమోడీ స్వారీ !

24 Monday Aug 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

COVID-19, Donald trump, Eurasia, India economy slowdown, Narendra Modi, Narendra Modi fifth biggest geopolitical risk, nationalism

ఎం కోటేశ్వరరావు
ప్రతి ఉగాదికి పంచాంగం చెప్పే పండితుల గురించి మనకు తెలిసిందే. వాటిలో సానుకూల అంశాలు తప్ప ప్రతి కూల అంశాలు సాధారణంగా చోటుచేసుకోవు. మహా అయితే కరవుల గురించి చెబుతారు. రాజకీయ పార్టీలకు పంచాంగం చెప్పే వారు ప్రతికూలంగా చెబితే వారు కార్యాలయాల గేటును ఎలా దాటుతారో వారికే తెలియదు. కనుక అది కూడా బి పాజిటివ్‌గానే ఉంటుంది.


ఉగాది పంచాంగానికి భిన్నంగా ప్రపంచానికి లేదా దేశాలకు ముప్పుగా పరిణమించే వారు లేదా పరిణామాల గురించి చెప్పేరాజకీయ జోశ్యులు కూడా ఉన్నారు. అమెరికా కేంద్రంగా పని చేసే యూరేసియా గ్రూప్‌ వాటిలో ఒకటి. 2020లో ప్రపంచ రాజకీయ ముప్పుగురించి జనవరిలో ఒక విశ్లేషణను వెలువరించింది. తరువాత మార్చినెలలో దానిని నవీకరించింది. అయినా తొలి పది ముప్పు జాబితాలో ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా అమెరికా గడ్డమీద పని చేస్తున్న సంస్ధ గనుక ప్రపంచానికి అమెరికా నుంచి తలెత్తే ప్రధాన ముప్పు జాబితాలో అక్కడి రాజకీయాలను చేర్చదు. కానీ ఈ ఏడాది దానికి భిన్నంగా తొలి ప్రపంచ రాజకీయ ముప్పుగా అమెరికా అంతర్గత రాజకీయాలని పేర్కొనటం విశేషం. రెండవదిగా సాంకేతిక రంగం, వాణిజ్యంలో చైనా-అమెరికా యుద్దం, మూడవదిగా అమెరికా-చైనా రాజకీయ వ్యవస్ధల మధ్య ముదురుతున్న వైరం, నాలుగవదిగా కార్పొరేట్‌ సంస్ధల పోరు, ఐదవదిగా నరేంద్రమోడీ వైఖరిని పేర్కొన్నది.


ఈ జోశ్యం లేదా రాజకీయ అంచనాలకు అనుగుణ్యంగానే తొలి ఎనిమిది నెలల్లో దాదాపు వాటి చుట్టూనే పరిణామాలు జరగటాన్ని గమనించవచ్చు. జనవరి నాటికి కరోనా వైరస్‌ అంశం యూరేసియా గ్రూప్‌ పరిగణనలో లేదు. మార్చినాటికి సవరించినా అప్పటికి అంతగా సమస్య తీవ్రతరం కాలేదు. ప్రపంచ రాజకీయ ముప్పుకు సంబంధించి తొలి ఐదు అంశాలలో పక్కాగా మొదటిది డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాలో, రెండవది ఆ పెద్ద మనిషి జిగినీ దోస్త్‌ నరేంద్రమోడీకి చెందాయి.మరో రెండింటిలో ట్రంప్‌కు మద్దతుగా నరేంద్రమోడీ ఉండటం యాదృచ్చికమా ? పధకం ప్రకారం జరిగిందనుకోవాలా ? నాటకీయ పరిణామాల మధ్య తిరిగి ట్రంప్‌ ఎన్నికైతే పాత కౌగిలింతలు కొనసాగుతాయి, సర్వేలు చెబుతున్నట్లుగా జోబిడెన్‌ గెలిస్తే నరేంద్రమోడీ కొత్త ప్రియుడి ప్రసన్నం కోసం ప్రయత్నించాల్సిందే.
2020లో మోడీ తన రెండవ పదవీ కాలంలో ఆర్ధిక అజెండాను ఫణంగా పెట్టి వివాదాస్పద సామాజిక విధానాలను ముందుకు తెస్తారని, మతపరమైన, ఒంటెత్తువాదంతో అస్దిర పరిస్ధితి ఏర్పడుతుందని, విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురుదెబ్బలు తగులుతాయని కూడా యూరేసియా నివేదిక పేర్కొన్నది. ఆర్టికల్‌ 370రద్దు, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, ముమ్మారు తలాక్‌ రద్దు, ఎన్‌ఆర్‌సి, సిఏఏ వంటి అంశాలను మరింత ముందుకు తీసుకుపోతారనే జోశ్యం దానిలో ఉంది. అయితే అనూహ్యంగా కరోనా సమస్య ముందుకు రావటంతో అవి తాత్కాలికంగా తెరవెనుకకు పోయాయి. విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురవుతున్న సమస్యలను మనం చూస్తున్నదే.


రెండవసారి ఎన్నికైనప్పటి నుంచి ఆర్ధిక అంశాలను విస్మరించి వివాదాస్పద సామాజిక అంశాలను ముందుకు తెచ్చారనేందుకు తార్కాణంగా గత ఏడాది తొలి మూడు నెలల కాలంలో 8శాతంగా ఉన్న వృద్ది రేటు నాలుగవ త్రైమాస కాలానికి 4.2శాతానికి పడిపోవటం తెలిసిందే. యూరేసియానే కాదు అనేక మంది ఆర్ధిక వేత్తలు చెప్పినట్లు ఈ దిగజారుడుకు కరోనాకు ఎలాంటి సంబంధం లేదు. అనేక మంది ముందే హెచ్చరిస్తున్నా మందగమనం తప్ప మాంద్యం లేదని ప్రభుత్వం బుకాయించిందే తప్ప వాస్తవాన్ని అంగీకరించలేదు. వరుసగా ఆరునెలల పాటు ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో పయనిస్తే దాన్ని అధికారయుతంగా మాంద్యం అని పరిగణిస్తారు. ఇప్పుడు దేశం వర్తమాన ఆర్దిక సంవత్సరం తొలి మూడుమాసాల్లో ( ఏప్రిల్‌-జూన్‌) తిరోగమనం అన్నది స్పష్టం కాగా అది ఏ స్దాయిలో ఉందో ఇంకా వెల్లడించాల్సి ఉంది. దేవుడు నైవేద్యం తినడనే వాస్తవం పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్నట్లుగా ఆర్ధిక దిగజారుడు ముందే తెలుసు గనుక కార్పొరేట్లకు రాయితీలతో వర్తమాన సంవత్సర బడ్జెట్‌ను రూపొందించారు. కరోనా రాకపోయినా దానితో ఫలితం ఉండేది కాదు. కరోనా రావటంతో ఇప్పుడు అసలు విషయాన్ని దాచి పెట్టి కరోనా పేరుతో విదేశాంగ విధానం, ఆర్ధిక రంగాలలో జాతీయ వాదానికి తెరతీసి దేశ పౌరుల దృష్టిని మళ్లించేందుకు పూనుకున్నారు.


ప్రపంచీకరణ నిరంతర అభివృద్ధికి తోడ్పడుతుందని నమ్ముతారు. లేనట్లయితే ఆ క్రమంలో దాని ఆర్ధిక ప్రయోజనాలు, రాజకీయ మద్దతు దెబ్బతింటుంది అని ప్రముఖ అమెరికన్‌ ఆర్ధిక వేత్త పాల్‌ శామ్యూల్‌సన్‌ హెచ్చరించాడు. పెట్టుబడిదారీ వ్యవస్ధ ఎలాంటిదో కరోనా వైరస్‌ నిరూపించింది.దాని కంటే ముందే ప్రపంచీకరణ సంగతి తరువాత ముందు మన సంగతి మనం చూసుకుందామని ప్రతి దేశం రక్షణాత్మక చర్యలకు, జాతీయవాదానికి పెద్దపీట వేస్తున్నది. డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు పీఠీన ఉంటే మన దేశం, నరేంద్రమోడీ కూడా అదే బాటలో ఉన్నారు.

ఓకల్‌ ఫర్‌ లోకల్‌ (స్ధానిక తయారీ వస్తువులనే అడగండి) అని మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు, సరిహద్దు సమస్యను సాకుగా చూపి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం, చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు వంటివి వాటిలో భాగమే. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కొన్ని జాతీయవాద ధోరణులను చూద్దాం. అమెరికాకు అగ్రస్ధానం అన్నది అందరికీ తెలిసిందే. ట్రంప్‌ గత ఎన్నికల్లో ఆ నినాదంతోనే ప్రచారం చేశాడు. దానిలో భాగంగానే చైనా మీద అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించింది. చైనా వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలపై, ఇతర దేశాలపై తాను ఆంక్షలను ప్రకటించటమే కాదు, తన ఆంక్షలను ఇతరులు కూడా పాటించాలని లేనట్లయితే వారి మీద కూడా చర్యలు తీసుకుంటానని అమెరికా బెదిరిస్తున్నది. ఇరాన్‌ నుంచి మన దేశం చమురు కొనుగోలు నిలిపివేయటానికి ఈ బెదిరింపే కారణం.


గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా అనుసరిస్తున్న వైఖరితో తలెత్తిన పర్యవసానాల కారణంగా ఇతర మార్కెట్లలో ప్రవేశించేందుకు బెల్డ్‌ అండ్‌ రోడ్‌ పేరుతో చైనా తన పధకాలను ముందుకు తీసుకుపోతున్నది. కొందరు దీనిని విస్తరణవాదం అని చిత్రిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు బ్రిటన్‌ వంటి దేశాలు విస్తరణవాదంలో భాగం మనవంటి అనేక దేశాలను వలసలుగా చేసుకున్నాయి. చైనా ఏ దేశాన్నీ ఆక్రమించలేదు. మిగతా దేశాల మాదిరి వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకుంటోంది.


అమెరికా, జపాన్‌లను ఒంటరిగా ఎదుర్కొనే శక్తిలేని ఐరోపా దేశాలు సమిష్టిగా వ్యవహరించేందుకు ఐరోపా యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.అయినా సభ్యదేశాలన్నీ రక్షణాత్మక చర్యలకు పాల్పడుతున్నాయి. దానిలో భాగంగానే యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగింది. వస్తువుల కోసం చైనా, లేదా ఆసియా దేశాల మీద ఆధారపడకూడదనే ధోరణి ఐరోపాలో పెరుగుతోంది. ఐరోపా జాతీయవాదంతో ఐరోపా యూనియన్‌ ముందుకు పోతున్నది.
ఆర్ధిక జాతీయవాదానికి ముద్దు పేరు ఆర్ధిక దేశభక్తి. ఆర్ధిక జనాకర్షక నినాదాలు, చర్యలు ఆచరణలో భాగం. తొలి రోజుల్లో స్వేచ్చా మార్కెట్‌ ఛాంపియన్‌గా ముందున్న నరేంద్రమోడీ ఇప్పుడు దానికి వ్యతిరేకమైన వైఖరిని అనుసరిస్తున్నారనే విమర్శలు ప్రారంభమయ్యాయి. ప్రపంచీకరణలో భాగమైన ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరేందుకు తిరస్కరించటం వాటిలో ఒకటి.( దానిలో చేరితే మన దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని దేశంలోని దాదాపు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించాయి) తాజాగా చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యల ఆంతర్యమిదే. ఈ రోజు చైనాతో ప్రారంభం కావచ్చుగానీ ఆర్ధిక జాతీయవాదం మరింత ముదిరితే అది మిగతా దేశాల పెట్టుబడులకు, వస్తువులకు సైతం విస్తరించే అవకాశాలు ఉన్నాయి. స్ధానిక వస్తువులనే అడగండి, ఆత్మనిర్భరత పేరుతో స్ధానికంగా అవసరమైన వస్తువులను తయారు చేసుకోవాలనే నినాదాలతో మన దేశం కూడా రక్షణ చర్యలకు పూనుకుంది. దీన్నో తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఇంతకు ముందు ఉన్న నిబంధనలను సడలించి 200 కోట్ల రూపాయల లోపు వస్తువులు, సేవలను విదేశాల నుంచి పొందకూడదని నిర్ణయించింది. చైనా నుంచి పెట్టుబడులను నిరోధించేందుకు వీలుగా నిబంధనలను సవరించింది. దీన్ని ఆర్దిక జాతీయవాదం అంటున్నారు.


జాతీయవాదానికి అనుగుణ్యంగా ఏ దేశానికి ఆ దేశం రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ఇతర దేశాల మీద ఆధారపడకుండా దేశీయంగానే అవసరాలను తీర్చుకొనేందుకు తీసుకొనే చర్యలను తప్పుపట్టనవసరం లేదు. కొన్ని సందర్భాలలో తప్పదు. ప్రపంచీకరణలో భాగంగా అమలు జరుపుతున్న ఉదారవాద విధానాలు అన్ని దేశాలకూ ఉపయోగపడటం లేదు. దానికి మన దేశమే చక్కటి ఉదాహరణ. ఇతర దేశాల వస్తువులన్నీ మన దేశంలో కుమ్మరిస్తున్నారు. ఫలితంగా స్ధానిక చేతివృత్తులు, పరిశ్రమలు, చివరికి వ్యవసాయం మీద కూడా ప్రతికూల ప్రభావాల పడ్డాయి.జాతీయ వాదాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు, కానీ జాతీయోన్మాదాన్ని ఎలా చూడాలి. పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ఎత్తుగడల్లో భాగంగా ఇలాంటి వాటిని ముందుకు తీసుకు వస్తారు.


జాతీయవాదంలో భాగంగా పోలీసు, మిలటరీ కాంటీన్లలో మన దేశంలో తయారైన వస్తువులను మాత్రమే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిషేధిత వస్తువుల జాబితాలో పండ్లు తోముకొనే కోల్గేట్‌ పేస్ట్‌ వంటి బహుళజాతి సంస్దల ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అవేవీ చైనా ఉత్పత్తులు కాదు. నిజానికి కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నరేంద్రమోడీ అధికారానికి రాగానే ఈ చర్యలెందుకు తీసుకోలేదు? టిక్‌టాక్‌ లేదా ఇతర చైనా యాప్‌లు మన భద్రతకు ముప్పు అని ఆకస్మికంగా గుర్తుకు రావటం ఏమిటి ? అదే నిజమైతే దానికి మోడీ అండ్‌కోను విచారించాలా లేదా ?


దేశంలో 1991నుంచి నూతన ఆర్ధిక విధానాలకు తెరతీశారు. అప్పటి వరకు లేని స్వదేశీ జాగరణ మంచ్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ రంగంలోకి తెచ్చింది. నూతన ఆర్ధిక విధానాలను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు గనుక, తామూ దేశ ప్రయోజనాలకోసమే పని చేస్తామని చెప్పేందుకు ఆ సంస్ధను ఏర్పాటు చేశారు. అదే ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టి అయిన బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత చేసిందేమిటి ?


చైనా వస్తువులను విధిగా కొనాలన్న నిబంధనలేవీ ప్రపంచ ఆరోగ్య సంస్ధ విధించలేదు. ఇక్కడున్న కమ్యూనిస్టు పార్టీలేవీ చైనా వస్తువుల గురించి లాబీయింగ్‌ జరపలేదు, దిగుమతి చేసుకోవాలని అడగలేదు. చైనా పెట్టుబడుల విషయం కూడా అంతే. గత ఆరు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడి కావటానికి నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన అవకాశాలు తప్ప తమ వస్తువులు కొనమని,పెట్టుబడులు తీసుకోవాలని చైనా వైపునుంచి వత్తిడేమీ లేదు. లేదా అమెరికా మాదిరి ప్రతీకార చర్యలు ఉన్నట్లు ఎవరూ ఇంతవరకు చెప్పలేదు.


అన్ని దేశాలూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో భాగస్వాములుగా ఉన్నపుడు దాని నిబంధనలను అమలు జరపటం వాటి విధి. లేకపోతే బయటకు వచ్చే స్వేచ్చ ఉంది. కమ్యూనిస్టులు అంతర్జాతీయవాదులు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం జరుపుతోందని భావిస్తున్నారు కనుక ఆ పార్టీ విధానాల మంచి చెడ్డల గురించి సహజంగానే ఆసక్తి ఉంటుంది. పార్టీల మధ్య సంబంధాలు కూడా పెట్టుకుంటారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఏ బంధం ఉందని బిజెపి ప్రతినిధి బృందాలు చైనా పర్యటనకు వెళ్లినట్లు ? నోరు తెరిస్తే చైనా కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వం అంటారు.


భారత్‌-చైనా మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. అందువలన రెండు దేశాల ఆర్ధిక వ్యవస్ధలు,ఇతర అనేక అంశాల గురించి రెండు దేశాలను పోల్చటం నరేంద్రమోడీ అధికారంతో నిమిత్తం లేకుండానే ఎప్పటి నుంచో జరుగుతోంది.చైనాతో మన దేశాన్ని పోల్చటాన్ని కొందరు దేశ ద్రోహంగానూ, చైనా భక్తిగానూ వర్ణిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో ఆ దాడి ఎక్కువగా ఉంది. చైనాతో మన దేశాన్ని పోల్చి ఎక్కువగా మాట్లాడుతున్నదెవరు ? నరేంద్రమోడీ ప్రధాని అయిన ఆరునెలల్లోపే చైనాను సందర్శించిన బిజెపి బృందాలు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే రాజకీయ పాఠశాలలను ఎందుకు సందర్శించాయి. మేము కూడా కమ్యూనిస్టు పార్టీ మాదిరే పార్టీని విస్తరిస్తామని, రాజకీయ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిందెవరు? చైనా కమ్యూనిస్టు పార్టీతో పోల్చుకున్నదెవరు?


చైనాను పక్కకు నెట్టి ప్రపంచానికి వస్తువులను అందిస్తామంటూ మేకిన్‌ ఇండియా, ఇప్పుడు మేక్‌ ఫర్‌ వరల్డ్‌ అని, త్వరలో జిడిపి రేటులో చైనాను అధిగమిస్తామని చెబుతున్నదెవరు ? ప్రతి ఏటా అనుకూలంగానో వ్యతిరేకంగానో చైనా వస్తువుల గురించి మాట్లాడుతున్నది వారే. అంతెందుకు 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సర్వేలో చైనా మాదిరి ఉపాధి, అభివృద్ది గురించి దాదాపు పదిపేజీలు కేటాయించి రాసినవారెవరు ? దీన్ని పోలిక అంటారా మరొకపేరుందా ?ఒక వేళ అదే దేశద్రోహం అయితే సంఘపరివార్‌ శక్తులే తొలి దేశద్రోహులు అవుతారు. చైనాను పక్కన పెట్టండి, అభివృద్ధి చెందిన దేశాల సరసకు దేశాన్ని తీసుకుపోతామని చెబుతారు. దాన్నేమంటారు ? పోలిక తప్పు కాదు. అయినా పోల్చిన వారిని దేశవ్యతిరేకులు అంటున్నారంటే జనాన్ని తప్పుదారి పట్టించటం తప్ప అది జాతీయవాదమా ? జాతీయోన్మాదమా ?


వలస పాలనను వ్యతిరేకించటం స్వాతంత్య్రానికి ముందు జాతీయవాదం. ప్రపంచాన్ని ఆక్రమించుకొనే క్రమంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, డచ్‌, పోర్చుగీసు, ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలలో జాతీయ వాదం ముందుకు వచ్చింది. తమ దేశం ప్రపంచంలో పై చేయి సాధించాలంటే ప్రపంచాన్ని ఆక్రమించాలనేది వాటి జాతీయ వాదం. చైనా,జర్మనీ, దక్షిణకొరియా, జపాన్‌ వంటి దేశాలతో పోటీపడుతూ వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాలను కోవటంలో తప్పు లేదు. వాటిని పక్కకు నెట్టి ఆ స్ధానాన్ని మనమే ఆక్రమించాలనుకుంటే అది సమస్యలకు దారి తీస్తుంది. నాడు జాతీయవాదంతో ఐరోపా దేశాలు పోటీపడి తొలుత ప్రాంతీయ యుద్ధాలు తరువాత ప్రపంచ యుద్ధాలకే పాల్పడ్డాయి. వస్తు తయారీ జాతీయ వాదం ముదిరితే అది వాణిజ్య యుద్దాలకు దారి తీస్తుంది.


అమెరికాను మరోసారి అగ్రస్ధానంలో నిలబెడతానని డోనాల్డ్‌ ట్రంప్‌ చెబితే మంచి రోజులు తెస్తానని మన నరేంద్రమోడీ వాగ్దానం చేశారు. ఇద్దరూ విఫలమయ్యారు. కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేయటంలోనూ అదే రికార్డు. వైరస్‌ నివారణ రాష్ట్రాల బాధ్యత అని తప్పించుకొనేందుకు పూనుకోవచ్చు. ప్రపంచం మొత్తాన్ని మహమ్మారులు చుట్టుముట్టినపుడు దేశపాలకులు తమ బాధ్యత లేదని తప్పించుకుంటే కుదరదు. జిడిపిని ఐదులక్షల కోట్ల డాలర్లకు తీసుకుపోతానని నరేంద్రమోడీ చెప్పారు. రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా సాధిస్తారా ? ఏ క్షణంలో అయినా కరోనా కేసుల్లో మన దేశాన్ని అమెరికా సరసన చేర్చే దిశలో ఉన్నారు. నరేంద్రమోడీ ఘోరవైఫల్యంగా ప్రపంచం కరోనా విస్తరణను చూస్తున్నది. అదే విధంగా కరోనా వైరస్‌ను తక్కువ చేసి మాట్లాడటం ట్రంప్‌ ఏలుబడిలోని అమెరికా చరిత్రలో అతి పెద్ద గూఢచర్య వైఫల్యంగా చరిత్రలో నమోదైంది. చరిత్రలో అమెరికా ఎంత ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నదో అదే బాటలో భారత్‌ కూడా పయనిస్తున్నది. రెండింటికీ కరోనా ఒక్కటే కారణం కాదు. రాకెట్‌ మాదిరి అమెరికాలో ఆర్ధిక స్దితి తిరిగి దూసుకుపోనుందని ట్రంప్‌ కనీసం మాటలైనా చెబుతున్నారు. నరేంద్రమోడీ నుంచి ఒక్క మాటైనా విన్నామా ?


డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ ఒకే కంచం-ఒకే మంచం స్నేహితుల మాదిరి ఉన్నారు. ఇద్దరూ తమ వైఫల్యాలను లేదా ఆర్ధిక, కరోనా వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు చైనా వ్యతిరేకతను ముందుకు తీసుకు వచ్చారు. ఒక రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీలను అక్కడి ప్రభుత్వం అణచివేస్తున్నదనే పేరుతో చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. దేశ భద్రతకు ముప్పు అనే పేరుతో చైనా యాప్‌లను మోడీ నిషేధించారు. ఇలా ఇద్దరు స్నేహితులూ ప్రజాకర్షక జాతీయవాద పులి స్వారీ చేస్తున్నారు. పెద్దలు చెప్పిన దాని ప్రకారం పులి స్వారీకి దిగిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి లేనట్లయితే దానికి బలికావాలి ! ఇద్దరు స్నేహితులకు ఆ సత్తా ఉందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెజాన్‌, అంబానీ సేవలో మోడీ – ఆందోళనలో కిరాణా దుకాణాల నాడి !

21 Friday Aug 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Jeff Bezos, Kirana Shopper, Mukesh Ambani, Reliance vs Amazon


ఎం కోటేశ్వరరావు
బాంక్‌ ఆఫ్‌ చైనా మన ప్రయివేటు ఐసిఐసిఐ బ్యాంకులో 15 కోట్ల రూపాయల విలువగల వాటాలను కొనుగోలు చేసింది. దీని మీద దేశంలో కొందరు గగ్గోలు లేవనెత్తారు. ఇంకేముంది సదరు బ్యాంకును చైనా మింగేసింది అన్నట్లుగా చిత్రించారు. ఇంతకూ అది ఎంత అంటే ఆ బ్యాంకు వాటాలలో 0.006శాతం మాత్రమే.
అమెరికాకు చెందిన ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ద అమెజాన్‌ గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలోని సంస్ధలను, వ్యాపారాన్ని మింగివేస్తున్నది. టాటా గ్రూప్‌కు చెందిన వెస్ట్‌లాండ్‌ అనే ప్రచురణ, పుస్తకపంపిణీ సంస్దలో 26శాతం వాటాలను 9.5 కోట్ల రూపాయలకు 2016 ఫిబ్రవరిలో కొనుగోలు చేసింది. మిగిలిన 74శాతం వాటాలను కూడా తీసుకుంటానని అంగీకరించింది. 2018లో టాప్‌జో అనే కంపెనీని 4 కోట్లడాలర్లకు (అంటే దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువ) కొనుగోలు చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ మోర్‌ అనే పేరుతో ఒక సూపర్‌ మార్కెట్‌ దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేసింది. వారి నుంచి ఒక సంస్ద దాన్ని రూ.4,200 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సంస్ధ నుంచి 49శాతం వాటాలను అమెజాన్‌ కొనుగోలు చేసి పెద్ద సంఖ్యలో దుకాణాల ఏర్పాటుకు పూనుకుంది.
పార్టిసిపేటరీ నోట్స్‌ పేరుతో విదేశీ పెట్టుబడిదారులు మన స్టాక్‌ మార్కెట్లో ఏ కంపెనీ వాటాలను అయినా కొనుగోలు చేయవచ్చు, లాభం అనుకున్నపుడు అమ్ముకొని వెళ్లిపోవచ్చు. ఒక దశలో మన దేశాలో ఇలాంటి పెట్టుబడులు నాలుగున్నరలక్షల కోట్ల రూపాయల మేరకు చేరాయి. ఇలా బడా కార్పొరేట్‌లు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో మన సంస్ధలను మింగివేస్తూ లాభాలను తరలించుకుపోతుంటే చైనా బ్యాంకు కేవలం 15 కోట్ల రూపాయల వాటాలను కొన్నందుకు గగ్గోలు పెట్టటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? ఏనుగులను దూరే కంతలను వదలి చీమలు దూరే వాటి మీద కేంద్రీకరించినట్లు అనుకోవాలా ? ఇది దేశ భక్తా లేక చైనా వ్యతిరేకతా ? ఇలా ప్రశ్నించటాన్ని చైనా అనుకూలం అని ఎవరైనా అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ఐసిఐసి అయినా హెచ్‌డిఎఫ్‌సి అయినా మరొక కంపెనీ అయినా వాటాలు, ఆస్ధులను అమ్మకానికి పెట్టటమా లేదా అన్నది వేరే అంశం. బహిరంగ మార్కెట్‌లో ఎవరైనా శక్తి ఉన్నవారు ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఏ విదేశీ సంస్ధ అయినా మన ప్రభుత్వం అనుమతించిన మేరకు లాభాలను తరలించుకుపోయేదే తప్ప మరొకటి కాదు.
ఇప్పుడు చిన్న చిన్న దేశాలను సైతం కొనుగోలు చేయగలిగిన బడా కార్పొరేట్‌లు మన మార్కెట్‌ను తమ స్వంతం చేసుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకున్నాయి. ఒక నాడు గుత్తాధిపత్యాన్ని నిరోధించేందుకు చట్టాలు చేసిన మన దేశం ఆరోగ్యకరమైన ఆ విధానాన్ని విస్మరించి అంతర్జాతీయ సంస్దల వత్తిడి లేదా ఆదేశాల మేరకు ఆ చట్టాన్ని రద్దు చేసి పోటీ కమిషన్‌ పేరుతో కొత్త చట్టాలను చేశాయి. దానిలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకొనే వారు లేరు. ఒక వైపు తీవ్ర ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. మరోవైపు మూల మూలకూ తమ దుకాణాల గొలుసును విస్తరించేందుకు విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌లు కండలు పెంచుతూ కసరత్తు చేస్తున్నాయి. ఆంబోతుల మధ్య లేగదూడలు నలిగినట్లుగా పెద్ద ఎత్తున స్వయం ఉపాధికల్పిస్తున్న కిరాణా దుకాణాల భవిష్యత్‌ నానాటికీ ప్రశ్నార్ధకంగా మారుతూ ఉపాధి సమస్యను ముందుకు తెస్తోంది. మన దేశంలో అతి పెద్ద కార్పొరేట్‌ సంస్ధ అయిన రిలయన్స్‌, అమెరికాలో అతి పెద్ద సంస్ధ అయిన అమెజాన్‌ మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు గోదాలోకి దిగాయి. రానున్న రోజుల్లో పోటీ ఏ విధంగా సాగుతుందో, పర్యవసానాలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారుతోంది.
రిలయన్స్‌ కంపెనీ అధిపతి ముకేష్‌ సంపాదన గంటకు ఏడు కోట్ల రూపాయలు కాగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ తొమ్మిది రెట్లు అంటే గంటకు 63 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు అంచనా.రిలయన్స్‌ కంపెనీ విలువ గత ఏడాది 140 బిలియన్‌ డాలర్లు కాగా అమెజాన్‌ విలువ 991.6బిలియన్‌ డాలర్లు. ఆసియాలోనే అతి పెద్ద ధనవంతుడైన ముకేష్‌ అంబానీ నిన్నా మొన్నా తన కంపెనీల్లో వాటాలను అమ్మి దాదాపు 20 బిలియన్‌ డాలర్ల మేర ( దాదాపు లక్షా 50వేల కోట్ల రూపాయలు) ధనం కూడ బెట్టుకున్నట్లు, తన కంపెనీలకు అప్పులు లేకుండా చేసుకున్నట్లు వార్తలు చదివాం. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి కంపెనీలు వాటిని కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే ముకేష్‌ తానే అనేక కంపెనీల కొనుగోళ్లకు దిగారు. అమెజాన్‌తో పోటీ పడేందుకు తన వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరించుకొనేందుకు పూనుకున్నారు. రోగులు దుకాణాలకు పోకుండా ఆన్‌లైన్‌లో ఆర్డరు చేస్తే ఔషధాలను అందచేసే నెట్‌మెడ్స్‌ అనే కంపెనీలో 620 కోట్లకు మెజారిటీ వాటాలను కొనుగోలు చేసినట్లు ఇది రాసిన సమయానికి చదివాము. ఇప్పటికే అమెజాన్‌ రంగంలో ఉంది. వచ్చే ఐదు సంవత్సరాలలో పాలు సరఫరా చేసే కంపెనీతో సహా అనేక సంస్ధలను తన సామ్రాజ్యంలో కలుపుకొనేందుకు పావులు కదుపుతున్నాది. రిలయన్స్‌ సంస్ధ జియో ఫోన్లతో పాటు ఇప్పుడు జియో మార్ట్‌ కంపెనీ ద్వారా కిరాణా సరకులను ఇండ్లకు అందచేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. వాల్‌ మార్ట్‌ కంపెనీ ఇప్పటికే 16 బిలియన్‌ డాలర్లు, అమెజాన్‌ 5.5 బిలియన్‌ డాలర్ల రంగంలోకి దిగాయి. స్వదేశీ డిమార్ట్‌ కూడా పోటీకి సన్నద్దం అవుతోంది. ఉల్లిపాయల మొదలు ఆర్ధిక సేవల వరకు దేన్నీ వదిలేందుకు ఇవి సిద్ధంగా లేవు.
మోటారు వాహనాల బీమా పాలసీలను ఎలాంటి పత్రాలతో నిమిత్తం లేకుండా కేవలం రెండు నిమిషాల్లో పునరుద్దరించే సేవలను అమెజాన్‌ ప్రారంభించింది. త్వరలో అమెజాన్‌ మెడికల్‌ షాపులు కూడా రాబోతున్నాయి.దాన్లో ఇంగ్లీషు మందులతో పాటు మూలికా ఔషధాలు కూడా ఉంటాయి. చైనాలో ప్రవేశించేందుకు విఫలయత్నం చేసిన ఈ సంస్ధ ఇప్పుడు మన మార్కెట్‌ మీద కేంద్రీకరించింది.
రిలయన్స్‌ లేదా అమెజాన్‌ వంటి బడా సంస్ధలన్నీ జన సమ్మర్దం ఎక్కువగా ఉండే పట్టణాల మీదే కేంద్రీకరిస్తున్నాయి. పని వత్తిడిలో ఉండే వారు, ధనికులు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. రిలయన్స్‌ జియో మార్ట్‌లో కొద్ది వారాల్లోనే రోజుకు రెండున్నరలక్షల ఆర్డర్లు వచ్చాయి. రెండు వందల పట్టణాలకే ప్రస్తుతం ఉన్న ఈ సేవలను విస్తరిస్తే ఇంకా పెద్ద మొత్తంలో స్పందన వస్తుంది. అయితే కూరగాయలు చెడిపోవటం, కొన్ని వస్తువుల జాడ లేకపోవటం, వాటికి నగదు వాపస్‌ ఆలస్యం కావటం వంటి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాటిని అధిగమించేందుకు పూనుకున్నారు. పెద్ద పట్టణాల్లో ఉన్న డిమార్డ్‌ దుకాణాల్లో ఇస్తున్న రాయితీలు ఇప్పుడు వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి.
ఇప్పుడు రిలయన్స్‌, అమెజాన్‌ వంటి సంస్ధలన్నీ రాయితీల జల్లులతో వినియోగదారులను ఆకట్టుకోబోతున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఏడాది చందా చెల్లించిన వారికి ఆ సంస్ధ ద్వారా ఏ వస్తువును కొనుగోలు చేసినా ధరల తగ్గింపుతో పాటు రవాణా చార్జీల రాయితీ అదనంగా ఇస్తున్నారు. పెద్ద పట్టణాల్లో ఉన్న బిగ్‌ బజార్‌ కంపెనీలో అమెజాన్‌కు వాటా ఉంది. రిలయన్స్‌ కూడా కొంత వాటాను దక్కించుకొనేందుకు పూనుకోగా అమెజాన్‌ అడ్డుపడుతోంది. అమెజాన్‌ ప్రస్తుతం ఒక్కో వ్యాపార రంగం గురించి ఒక్కొక్క పట్టణంలో ప్రయోగాలు, పరిశీలనలు జరుపుతోంది. ఉదాహరణకు పూనాలో ఇండ్లకు పండ్లు, కూరగాయల సరఫరా. మార్కెట్‌ తీరు తెన్నులు అవగతం అయిన తరువాత తన గొలుసును విస్తరించబోతున్నది.
రిలయన్స్‌ ఇప్పటికే తన దుకాణాల ద్వారా తాజాగా ఇండ్లకు సరఫరా చేస్తున్నది. రైతుల నుంచి నేరుగా ఇప్పటికే కొనుగోలు చేస్తుండగా మరింత ఎక్కువ చేసేందుకు పూనుకుంది. జియో కనెక్షన్‌ రేట్లు తగ్గించటం, ఫోన్లకు రాయితీల వంటి చర్యల ద్వారా మిగతా నెట్‌ వర్కులను దెబ్బతీసిన రిలయన్స్‌ ఇప్పుడు రేట్లు పెంచింది. తన కంటే ఆర్ధికంగా అన్ని విధాలా పెద్ద దైన అమెజాన్‌తో ఎలా ఢకొీంటుందో చూడాల్సి వుంది. స్ధానికంగా ఉండే కిరాణా దుకాలతో అనుసంధానించి ఆన్‌లైన్‌ ఆర్డర్లను పెద్ద ఎత్తున సంపాదించేందుకు ఒప్పందాలు చేసుకోనుంది. అంటే ప్రస్తుతం ఉన్న కిరాణా దుకాణాలు రిలయన్స్‌ లేదా అమెజాన్‌ వంటి కంపెనీల సరకులను సరఫరా చేసే కేంద్రాలుగా మారనున్నాయి. దీని వలన ఆ బడా సంస్దలు మౌలిక సదుపాయాలకు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ కంపెనీల పోటీకి నిలువలేని దుకాణదారులు కోల్పోయిన ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు ఆ కంపెనీల ఏజంట్లుగా మారిపోవటం అనివార్యంగా మారే దృశ్యం కనిపిస్తోంది. అయితే ఇదంతా తెల్లవారేసరికి జరిగిపోతుందని కాదు గానీ, సాంప్రదాయ కిరాణా దుకాణాలు ముందుగా పెద్ద పట్టణాలలో మనుగడ సమస్యలను ఎదుర్కోనున్నాయి.ప్రస్తుతం మన దేశంలో గొలుసుకట్టు షాపులు లేదా ఆన్‌లైన్‌(ఇకామర్స్‌) ద్వారా గానీ కేవలం 12శాతం లావాదేవీలు మాత్రమే జరుగుతున్నాయి. బడా సంస్దలన్నీ రాబోయే 20సంవత్సరాల వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకొని తమ పధకాలను రూపొందిస్తున్నాయి.
ప్రధాన నగరాలలో రిటైల్‌ వ్యాపారులకు వస్తువులను విక్రయిస్తున్న జర్మన్‌ మెట్రో సంస్ధ ఇప్పుడు దాన్ని మరింత విస్తరించి కిరాణా దుకాణదారులకు సరకులను సరఫరా చేసేందుకు ఆలోచిస్తున్నది. అంటే ఒక విధంగా చెప్పాలంటే పంపిణీదారు పాత్ర పోషించనుంది. ఇదే మాదిరి వాల్‌మార్ట్‌, అమెజాన్‌ కూడా హౌల్‌సేల్‌ వ్యాపారంలోకి దిగాలని చూస్తున్నాయి. రిలయన్స్‌ తన జియో ఖాతాదారులు, అదే విధంగా అది నిర్వహిస్తున్న నెట్‌వర్క్‌18పేరుతో వివిధ రాష్ట్రాలు, జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న వివిధ టీవీ ఛానళ్ల వీక్షకులు, రిలయన్స్‌ ఫ్రెష్‌ ఖాతాదారులతో మరింతగా తన కార్యకలాపాలను పెంచుకొనేందుకు చూస్తోంది.చౌకదుకాణాలతో ఒప్పందాలు చేసుకొని వాటి ద్వారా సరఫరా చేయాలని యోచిస్తున్నది. అంతే కాదు కొన్ని చోట్ల స్టాక్‌ పాయింట్ల ఏర్పాటు, ఐదువేల దుకాణాలతో ఇప్పటికే ఒప్పందం చేసుకుందన్న వార్తలు వచ్చాయి. పదివేల కిరాణా దుకాలతో ఒప్పందాలకు ఫ్యూచర్‌ గ్రూపు కూడా ఆలోచిస్తున్నది. అమెజాన్‌ 17,500 దుకాణాలతో, ఫ్లిప్‌కార్ట్‌ 15వేల కిరాణా దుకాణాల ద్వారా సెల్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తుల విక్రయానికి ఆలోచిస్తున్నది. అనేక వేల దుకాణాల ద్వారా ఈ కంపెనీలన్నీ ఆన్‌లైన్‌ వాణిజ్యం జరిపేందుకు పూనుకున్నాయి. ఈ ఏర్పాట్ల ద్వారా విదేశీ, స్వదేశీ బ్రాండ్‌ ఉత్పత్తులు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. పర్యవసానంగా వాటి లావాదేవీలు పెరుగుతున్నాయి.
నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తున్న గొలుసుకట్టు షాపులు ఇస్తున్న రాయితీలు వినియోగదారులను సహజంగానే ఆకట్టుకుంటున్నాయి. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా గొలుసుకట్టు షాపులకు వెళ్లేందుకు వినియోగదారుల సంఖ్య మీద పరిమితులు విధించటంతో అనేక మంది తిరిగి ముఖ్యంగా పట్టణాల్లోని కిరాణా దుకాణాలను ఆశ్రయించారు. నిబంధనలను సడలించిన తరువాత తిరిగి మామూలు స్ధితికి చేరుకుంటున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో దాదాపు 70లక్షల కిరాణా దుకాణాలు ఉన్నట్లు అంచనా. కుటుంబ సభ్యులతో పాటు సగటున ఒక్కొక్క దుకాణం ఇద్దరికి ఉపాధి కల్పించినా దాదాపు రెండున్నర నుంచి మూడు కోట్ల మంది పని చేసే అవకాశం ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

74 ఏండ్ల స్వాతంత్య్రం-2 : ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- హిందూత్వ !

17 Monday Aug 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

74th independence day India, Finance Capital, Narendra Modi, Neoliberalism in India, RSS-Hindutva


ఎం కోటేశ్వరరావు
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌, పాలకుల నివాసాలు శుభ్రంగా ఉన్నాయి, మన సామాన్యుల ఇండ్ల మాదిరి వర్షాలకు కురుస్తున్నట్లు వార్తలేమీ లేవు. దేశం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది, లోటు బడ్జెట్‌ను పూడ్చుకొనేందుకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగపోయినా ఎడా పెడా వేల కోట్ల రూపాయల పన్నులు, ధరల పెంపుతో జనాల జేబులు కొల్లగొడుతున్నారు.లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. కరోనా నివారణ చర్యలకు రాష్ట్రాలు నిధుల్లేక నానా అగచాట్లు పడుతున్నాయి. అయినా నూతన పార్లమెంట్‌ భవనం, ఇతర కట్టడాలు నరేంద్రమోడీ హయాంలో నిర్మిత మయ్యాయనే కీర్తి కండూతి కోసం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలను తగలేసి కట్టేందుకు నిర్ణయించారు. దీన్ని చూస్తే హిట్లర్‌ గుర్తుకు వస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోయేలా ఐరోపాలో ఎక్కడా లేని విధంగా జర్మనీలో గ్రేట్‌ హాల్‌ నిర్మించాలని నిర్ణయించి, నమూనాలను గీయించాడు. రెండవ ప్రపంచ యుద్దంలో కమ్యూనిస్టుల చేతిలో పరాజయం పాలై ఆత్మహత్య చేసుకున్నాడు గానీ గెలిచి ఉంటే దాన్ని నిర్మించి ఉండేవాడు. నెహ్రూ నీటిపారుదల ప్రాజెక్టులకు, ఇతర పారిశ్రామిక సంస్దలకు నాంది పలిక ఆధునిక దేవాలయాలకు ఆద్యుడయ్యాడనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేంద్రమోడీ తన ఖాతాలో ఆర్టికల్‌ 370 రద్దు, విగ్రహాలు, ఆయోధ్యరామ మందిరం తదితర అంశాలతో పాటు పార్లమెంట్‌ భవనాన్ని చేర్చి నెహ్రూ పేరును చెరిపి వేయాలన్న తాపత్రయం, ప్రయత్నం కనిపిస్తోంది.


సుప్రీం కోర్టు తీర్పు మాత్రమే చెప్పింది !
సుప్రీం కోర్టు బాబరీ మసీదు స్ధలం రాముడికే చెందాలని తీర్పు చెప్పింది తప్ప న్యాయం చేకూర్చలేదు అనే విమర్శలు ఉన్నాయి. మసీదు కూల్చివేతను ఒక నేరపూరిత చర్యగా వర్ణించింది.దోషులను శిక్షించేందుకు విచారణను వేగవంతం చేయాలన్నది. అదే కోర్టు మరోవైపున మసీదు కూల్చివేతలో ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఉన్నవారికి ఆ స్ధలంలో రామాలయనిర్మించే బాధ్యతను అప్పగించింది. అయితే అది ఒక ట్రస్టు ఆధ్వర్యాన జరగాలని తీర్పు చెప్పింది. కానీ నరేంద్రమోడీ అండ్‌కో దాన్ని ఒక అధికారిక కార్యక్రమంగా మార్చివేశారు. లౌకిక రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన మోడీ దీనికి హాజరు కావటాన్ని రాజ్యాంగ ఉల్లంఘన అని తప్ప ఏమనాలి ? రామాలయ నిర్మాణం కోసం శతాబ్దాల తరబడి అనేక మంది త్యాగాలు చేశారంటూ స్వాతంత్య్ర ఉద్యమంతో పోల్చటం చరిత్రను కించపరచటం కాదా ? నరేంద్రమోడీ మాతృసంస్ధ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామి కాదు. ఉద్యమాన్ని వ్యతిరేకించింది. ఒక సంస్ధగా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్రం పోరాటంలో ఎందుకు పాల్గొనలేదు అని తనకు తానే ప్రశ్న వేసుకొని ఆ సంస్ధ ప్రముఖుడు నానాజీ దేశముఖ్‌ ఇచ్చిన వివరణే అందుకు నిదర్శ నం.


చెప్పింది చెయ్యరు- చేసేది చెప్పరు !
అచ్చేదిన్‌ (మంచి రోజులు) అని నినాదమిచ్చిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఎన్నికల తరువాత అసలు ఆ మాటను ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రస్తావించలేదంటే అతిశయోక్తి కాదు. అదే విధంగా గుజరాత్‌ అభివృద్ది నమూనాను దేశమంతటా అమలు జరుపుతానని చెప్పారు. దాని ప్రస్తావనా లేదు. విదేశాల్లో దాచుకున్న దొంగ సొమ్మును తీసుకువస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వస్తాయి, ఇస్తామన్నట్లుగా మాట్లాడారు. అదేమైందో తెలియదు. నిరుద్యోగం 40 సంవత్సరాల రికార్డు స్ధాయికి చేరింది అని ప్రభుత్వ గణాంకాల నివేదిక తేల్చింది. అయితే అదంతా తప్పుల తడక, కల్పించిన ఉపాధిని పరిగణనలోకి తీసుకోలేదు, ఉదాహరణకు పకోడీల తయారీ కూడా ఉపాధికల్పనలో భాగమే అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోలేదు, సరైన లెక్కల పద్దతిని రూపొందించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఎన్నికల తరువాత అదే నివేదికను ఆమోదించారు. కొత్త గణాంకాలను తెచ్చిందీ లేదు.2019 పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పిఎల్‌ఎఫ్‌ఎస్‌)ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల కోసం ఆరునెలల పాటు తొక్కిపెట్టింది.2011-12 సంవత్సరాలలో 467.7 మిలియన్‌లుగా ఉన్నకార్మికశక్తి 2017-18 నాటికి 461.5మిలియన్లకు తగ్గిపోయారు. వ్యవసాయ రంగంలో 29.3 మిలియన్ల మంది ఉపాధి కోల్పోగా వారిలో 24.7 మిలియన్ల మంది మహిళలే ఉన్నారు. అయినప్పటికీ పాలకులు మహిళా ఉద్దరణ, విజయగాధల గురించి కబుర్లు చెబుతూనే ఉన్నారు. ఉపాధి తగ్గిపోయినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం .రూపొందించిన నివేదికలో నాలుగు దశాబ్దాల రికార్డు స్ధాయి 6.1.శాతానికి నిరుద్యోగం పెరిగిందని పేర్కొన్నది. దీనికి 2016లో నరేంద్రమోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు కారణం అన్నది దాని సారాంశం. దాన్ని ఎన్నికల ముందు విడుదల చేస్తే నష్టదాయకం కనుక తొక్కి పెట్టారు.


నరేంద్రమోడీ హయాంలో జిడిపి పెరుగుదల మొదలు అనేక గణాంకాలు వివాదాస్పదం అయ్యాయి. ఏది నిజమో కాదో తెలియని సందిగ్ద స్దితిలో జనాన్ని పెట్టారు. మోడీ గణానికి కావాల్సింది అదే. అలాంటి పరిస్ధితిలో తమ ప్రచార యంత్రాంగం ద్వారా అర్ధసత్యాలు, అసత్యాలను ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకోవాలన్నది ఎత్తుగడ. లెక్కించే పద్దతి సరిగా లేదు, మేము సాధించిన వృద్ధి గణాంకాల్లో చేరటం లేదని చెబుతున్న మోడీ సర్కార్‌ ఇంతవరకు సరైన పద్దతిని ఎందుకు రూపొందించలేకపోయింది.అంతచేతగాని స్ధితిలో మన యంత్రాంగం, ప్రధాని సలహాదారులు ఉన్నారా ? లేదూ కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ఉన్న విధానం ప్రకారం రూపొందించిన అంకెలను అంగీరించాలి, జనానికి అందించాలా లేదా ? పెద్ద నోట్ల రద్దు వలన సాధించేదేమిటి అంటే తరువాత కాలంలో లావాదేవీలన్నీ నమోదు అవుతున్నాయని చెబుతున్నారు. దానికోసమే అయితే యావత్‌ జనాన్ని అంత ఇబ్బంది పెట్టటం ఎందుకు, ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీయటమెందుకు? నల్లధనాన్ని బయటపెట్టేందుకు అని చెప్పిన పెద్దలు అసలా మాటనే మరచిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి గురించి దేశం ఏమి ఆశిస్తుంది? ఆచరణలో ఎన్ని లావాదేవీలు నమోదు అవుతున్నాయి. క్రెడిట్‌ కార్డు ద్వారా చిన్న దుకాణదారులందరూ రెండున్నరశాతం అదనంగా వసూలు చేస్తున్నందున వినియోగదారులు నగదు చెల్లింపుకే మొగ్గు చూపుతున్నారు. రియలెస్టేట్‌ రంగంలో లెక్కల్లో చూపుతున్నది ఎంతో నల్లధనం ఎంత చెల్లిస్తున్నారో బహిరంగ రహస్యం. అనేక దుకాణాల్లో కార్డు చెల్లింపులను అంగీకరించటం లేదన్నదీ తెలిసిందే. బిజెపి ఎన్నడూ కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తానని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఎంత నాటకీయంగా ఆపని చేసిందో చూశాము


అభివృద్ధికి ఆటంకం కార్మిక చట్టాలా – పాలకుల విధానాలా ?
దేశంలో అభివృద్ది కుంటుపడటానికి, ముందుకు పోయేందుకు కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కాపలాగా ఉన్న ఒక కుక్కను తప్పించాలంటే దాన్ని పిచ్చిదని ప్రచారం చేయాలన్నట్లుగా కార్మిక చట్టాలను రద్దు చేసి లేదా నీరు గార్చి యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలి వేసి దోపిడీని స్వేచ్చగా కొనసాగనివ్వాలన్నది అసలు లక్ష్యం. ముందే చెప్పుకున్నట్లు ద్రవ్య పెట్టుబడి, నయా ఉదారవాద విధానం కార్మికుల హక్కులను, బేరమాడే, పోరాడేశక్తిని సహించదు.
ఈ నేపధ్యంలోనే 1991 నుంచి ఒక పధకం ప్రకారం కార్మిక చట్టాల సంస్కరణల గురించి ప్రచార దాడి ప్రారంభించారు. మన కేంద్ర ప్రభుత్వం 45, అన్ని రాష్ట్రాలూ కలిపి మరో 170వరకు కార్మిక చట్టాలను చేశాయి. వీటిలో అత్యధిక భాగం కార్మికశక్తిలో పదిశాతానికి అటూ ఇటూగా ఉండే సంఘటిత కార్మికుల కోసం రూపొందించినవే. అసంఘటిత కార్మికులకు ఉన్న రక్షణ నామమాత్రం. అయినప్పటికీ పదిశాతం కార్మికులకు ఉన్న చట్టాలు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని నమ్మబలుకుతున్నారు. అసంఘటిత రంగ కార్మికుల్లో వలస కార్మికులు ఎందరున్నారో, వారికి ఎలాంటి రక్షణ లేదని కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా రుజువైంది. అసలు వారెంత మంది ఉన్నారో, ఎక్కడెక్కడ పని చేస్తున్నారో కేంద్రం లేదా రాష్ట్రాల వద్ద సమాచారమే లేదు, రికార్డులు అంతకంటే లేవు. కరోనా నివారణ కాలేదు కానీ కార్మికశాఖ డొల్లతనం, పాలకుల బండారం బట్టబయలైంది.
కార్మిక చట్టాలను సంస్కరించవద్దని ఎవరూ చెప్పటం లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటిదంటే తిరస్కరించిన దరఖాస్తులను కూడా పరిష్కరించిన జాబితా అంకెల్లో చూపుతుంది. అలాగే సంస్కరణలు అంటే ఉన్నవాటిని మరింత మెరుగుపరచటం గాకుండా అసలు పూర్తిగా ఎత్తివేయటంగా తయారైంది. పారిశ్రామిక, వాణిజ్య సంస్దలలో తనిఖీ యంత్రాంగం అక్రమాలకు పాల్పడుతోంది బాబూ అని కార్మికులంటే యజమానులకు అనుగుణ్యంగా అసలు తనిఖీలనే ఎత్తివేశారు. యాజమాన్యాలు నిబంధనలను సక్రమంగా అమలు జరపటం లేదంటే చట్టాల అమలు గురించి యజమానులు స్వయంగా అఫిడవిట్లు ఇస్తే చాలన్నట్లుగా చెబుతున్నారు.
కోర్టులు ఏ దేశంలో ఏ పాలనా వ్యవస్ధ ఉంటే దాని విధానాలకు అనుగుణ్యంగానే నడుచుకుంటాయన్నది ప్రపంచ అనుభవం. ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే వారికే కాదు యావత్‌ ఉద్యోగులు, కార్మికులకు సమ్మె హక్కు లేదిప్పుడు అంటే అతిశయోక్తి కాదు. సమ్మెను ఒక ఆయుధంగా వాడుతూ అత్యధిక సందర్భాలలో దుర్వినియోగం చేస్తున్నారని కోర్టులు వ్యాఖ్యానించాయి. సమ్మె ప్రాధమిక హక్కు కాదని వ్యాఖ్యానించాయి.


పరస్పర విరుద్ద వాదనలు !
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో మాదిరి పరస్పర విరుద్ద వాదనలు ఎలా ఉంటాయో చూద్దాం. నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది? పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఉన్న లోపాల కారణంగా తలెత్తుతుంది అని కమ్యూనిస్టులు చెబుతారు. కాదు మేము వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఉత్పాదకత పెరుగుతుంది, మాలాభాలు పెరుగుతున్నాయి, పని చేసే వారు ఎక్కువ మంది అవసరం లేదు, అందువలన నిరుద్యోగం పెరుగుతుంది అని యజమానులు, వారికి మద్దతు ఇచ్చే వారు చెబుతారు. ఇదే వాదన చేసే వారు కార్మిక చట్టాలు, కార్మికులకు హక్కులు కలిగించటం వలన వారు వేతనాల పెంపుదల కోసం, హక్కుల కోసం డిమాండ్లు చేస్తారు. వారి చర్యలు ఉత్పత్తికి ఆటంకంగా మారతాయి, ఉత్పాదక ఖర్చులు పెరుగుతాయి అని చెబుతారు. ఒక వైపు యాంత్రీకరణ ద్వారా ఖర్చులు తగ్గించామని చెప్పేవారు ఇక్కడ వేతనాలు పెరిగితే ఖర్చు పెరుగుతుంది అని వాదిస్తారు.


ఉత్పత్తి పడిపోవటానికి కార్మిక సమ్మెలు కారణం కానేకాదు. 2011లో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సామర్ధ్య వినియోగం 83శాతం ఉండగా క్రమంగా తగ్గుతూ పెరుగుతూ కరోనాకు ముందు 2019లో 76శాతం ఉండగా ఈ ఏడాదిలో ప్రస్తుతం 68శాతానికి పడిపోయింది.2003 నుంచి 2014వరకు సమ్మెలు 75శాతం తగ్గితే, పని దినాల నష్టం 90శాతం తగ్గింది. 2014లో 119 సమ్మెలు జరిగితే తరువాత రెండు సంవత్సరాలలో 106,93కు తగ్గాయి. 2017 జనవరి-అక్టోబరు మధ్య కాలంలో 82 జరిగాయి. ఇటీవలి కాలంలో వాణిజ్య సులభతర సూచికలో ఎన్నో పాయింట్ల మెరుగుదల ఉంది, నరేంద్రమోడీ ఏ ప్రధానీ చేయనన్ని విదేశీ పర్యటనలు చేసి సంబంధాలు మెరుగుపరచినట్లు, దేశ ప్రతిష్టను పెంచినట్లు చెప్పటాన్ని విన్నాం. అయినా మన ఎగుమతులు పెరగకపోగా పడిపోయాయి. దీనికి కార్మికులు కారణం కాదు. అయినా కార్మిక చట్టాలను మరింతగా సంస్కరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఎగుమతి ఆధారిత, ప్రత్యేక ఆర్ధిక ప్రాంతాలలో చట్టాలు పని చేయవు, ఇప్పుడు వాటిని ఇతర అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారా ? అనుమానం అక్కర లేదు.
అప్రెంటిస్‌ల పేరుతో చట్టబద్దంగానే శ్రమశక్తిని దోచుకొనేందుకు యజమానులకు అవకాశం కల్పించారు. కనీసం 15శాతం అప్రెంటిస్‌లు ఉండాలి. అంటే వారికి ఎలాంటి చట్టాలు, చట్టబద్ద వేతనాలు వర్తించవు. స్టైఫండ్‌ మాత్రమే ఇస్తారు.రిజిస్టర్లు, ఇతర రికార్డుల నిర్వహణలో కూడా మినహాయింపులు ఇచ్చారు గతంలో 19 మంది కార్మికులున్న ఫ్యాక్టరీలు, సంస్ధలకు ఇలాంటి వెసులుబాటు ఇస్తే నరేంద్రమోడీ గారు ఆ సంఖ్యను 40కి పెంచారు.


మన కార్మికుల శ్రమ శక్తిని దోపిడీ చేసేందుకు స్వదేశీ-విదేశీ కంపెనీలకు విచ్చల విడి అధికారాలను ఇచ్చేందుకు పూనుకున్నారు. మన దేశం మీద విదేశాలకు ఆసక్తి ఏమిటి, ఎందుకు ? ఉదాహరణకు జర్మనీలో గంటకు సగటున 35యూరోలు ఉన్నది. అంటే 41.5డాలర్లు. అందువలన మన దేశంలో గంటకు రెండు డాలర్లు ( రు.150 ) ఇచ్చినా ఇబ్బంది లేదన్నది విదేశీ పెట్టుబడిదార్ల లెక్క. రోబోలను వినియోగించినా గంటకు నాలుగు డాలర్లు అవుతుందని అందువలన రోబోల మాదిరి పని చేసే భారతీయ కార్మికులను వినియోగించుకోవటమే లాభం అని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకు అవసరమైన నైపుణ్యం కలిగిన వారు కావాలి గనుకనే, పెద్ద సంఖ్యలో గతంలో పాలిటెక్నిక్‌లను ప్రోత్సహిస్తే తరువాత తామర తంపరగా ఇంజనీరింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. నైపుణ్య అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించటం కూడా దీనిలో భాగమే.


జర్మనీలో నాజీలు ప్రపంచ యుద్దంలో జర్మనీ పొందిన పరాజయాన్ని పరాభవంగా చిత్రించి జనాల్లో జాతీయ ఉన్మాద భావనలను రెచ్చగొట్టారు. తిరిగి పూర్వ ప్రాభవాన్ని నెలకొల్పాలనే మనోభావాన్ని చొప్పించారు. మన దేశంలో అదే పద్దతుల్లో పన్నెండు వందల సంవత్సరాలుగా హిందువులు బాధితులు అనే ప్రచారాన్ని సంఘపరివార్‌ సంస్దలు నిరంతరం ప్రచారం చేస్తున్నాయి. పూర్వ వైభవాన్ని పునరుద్దరించాలని దానికి హిందూత్వ అని పేరు పెట్టారు. దాన్ని అంగీకరించని వారు దేశం వదలి పోవాలని హెచ్చరిస్తుంటారు. చరిత్రకు మతం రంగు పులుముతున్నారు. దేశంలో పాలన మత ప్రాతిపదికనే జరిగినట్లయితే మెజారిటీ ముస్లింలు ఉన్న కాశ్మీరులో రాజు హిందువు ఎలా అయ్యాడు ? మెజారిటీ జనం హిందువులుగా ఉన్న హైదరాబాద్‌, మైసూరు, జునాగఢ్‌ వంటి సంస్దానాలలో ముస్లింలు పాలకులుగా వందల సంవత్సరాలు ఎలా ఉన్నారు ?


మన దేశంలో కోట్లాది కుటుంబాలకు కనీస సౌకర్యాలు లేవు గానీ ప్రస్తుతం ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. వాట్సాప్‌ గురించి వేరే చెప్పనవసరం లేదు. దీన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటున్న బిజెపి కుహనా వార్తలను ప్రచారం చేసేందుకు పెద్ద యంత్రాంగాన్నే ఏర్పాటు చేసుకుంది. వాట్సాప్‌లో వచ్చిన వాటిని నమ్మకూడదని ఒక వైపు అనుకుంటూనే పదే పదే ఆ సమాచారం వస్తుండటంతో తమకు తెలియకుండానే నమ్ముతూ బుర్రను ఉపయోగించని విద్యావంతులైన వారెందరో ఉన్నారు. వాట్సాప్‌కు భారత్‌ను అతిపెద్ద మార్కెట్‌గా మార్చిన వినియోగదారులయ్యారు.


బిజెపి, దాని విధానాలను విమర్శించే జర్నలిస్టులను ప్రెస్టిట్యూట్స్‌(పత్రికా వ్యభిచారులు), ముజాహిదిన్స్‌, రెడ్‌ తాలిబాన్స్‌ ఇలా అనేక పదాలతో అవమానిస్తున్నారు. బెదిరిస్తున్నారు, లొంగని గౌరీలంకేష్‌ వంటి వారిని హతమార్చుతున్నారు. మీడియాను నియంత్రించే కార్పొరేట్లు సహజంగానే తమ ప్రయోజనాల కోసం మీడియాను పాకేజ్‌లకు, ప్రలోభాలకు అప్పగించే శారు.
ఫాసిస్టు, నాజీజాన్ని పెంచి పోషించిన శక్తులు తమ లక్ష్యాలను సాధించుకొనేందుకు ప్రయివేటు దళాలను ఏర్పాటు చేసుకున్నాయి, కొన్ని సందర్భాలలో ప్రత్యర్ధులను హతమార్చేందుకు కిరాయిహంతకులను కూడా వినియోగించుకున్నాయి. మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు విశ ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌ వంటివి అలాంటివే. గౌరీ లంకేష్‌, కులుబుర్గి, నరేంద్ర దబోల్కర్‌ వంటి వారిని కాషాయ భావజాలంతో ఉన్మాదులైన వారు లేదా వారు ఉపయోగించిన కిరాయి హంతకులు హతమార్చారు. గోరక్షకులు, హిందూత్వ పరిరక్షకుల పేరుతో ఎవరికి వారే దళాలుగా ఏర్పడటం ప్రత్యర్ధులు లేదా మైనారిటీ మతాలకు చెందిన వారిని హత్యలు చేయటాన్ని చూశాము.


మన దేశంలో ఫాసిస్టు శక్తులు అధికారంలో ఉన్నాయని చెప్పేవారు కొందరున్నారు. కాదు ఫాసిస్టు తరహా ధోరణులు నానాటికీ ప్రబలుతున్నాయనే వారు మరికొందరు. లేదు లేదు అసలైన ప్రజాస్వామ్యం ఇదే అని నమ్మబలుకుతున్నవారు ఎందరో ఉన్నారు. నువ్వేమిటో తెలుసు కోవాలంటే నీ గురించి ఆలోచించుకో అని సుప్రస్దిద్ద గ్రీకు తత్వవేత్త సోక్రటీస్‌ చెప్పాడు. అందువలన ఎవరేమి చెప్పినా, రాసినా, దృశ్యరూపంలో ప్రదర్శించినా ముందు వాటిని ‘సహనంతో ‘ వ్యక్తపరచనివ్వాలి, వినాలి, చదవాలి, చూడాలి. అలాంటి పరిస్ధితి దేశంలో ఉందా లేదా అని ప్రతి ఒక్కరూ మెదడుకు పదును పెట్టాలి. ఈ నేపధ్యంలో వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలను, దేశంలో వ్యక్తమౌతున్న కొన్ని ధోరణుల తీరు తెన్నులను చూశారు. ప్రపంచ వ్యాపితంగా ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- మితవాదం జమిలిగా ముందుకు వస్తున్నాయి. మన దేశంలో వాటికి మతోన్మాదం కూడా తోడైంది. కనుక పరిణామాలు, పర్యసానాలు ఎలా ఉంటాయి అన్నది ఎప్పటికప్పుడు జాగరూకులై ఉండాల్సిందే ! ముందే చెప్పుకున్నట్లు తద్దినం మాదిరి ఒక్క స్వాతంత్య్ర దినం రోజునే కాదు, నిరంతరం ప్రతి ఒక్కరూ ఆలోచించినపుడే స్వాతంత్య్రం నిలుస్తుంది. ( తొలి భాగం – 74 ఏండ్ల స్వాతంత్య్రం – 1: మేకిన్‌ ఇండియాకు పాతర -మేక్‌ ఫర్‌ వరల్డ్‌ జాతర ! )

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన అంకుర సంస్ధలు అమెరికా ఎందుకు పోతున్నాయి !

09 Sunday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Indian startups, Silicon Valley, startup ecosystems, startups, unicorn startups


ఎం కోటేశ్వరరావు
ఒక బిలియన్‌ డాలర్లకు పైగా విలువ కలిగిన అంకుర సంస్ధలు( స్టార్టప్స్‌) మన దేశంలో 21 ఉన్నాయని, అవి చైనా సంస్దలలో కేవలం పదో వంతని ఆగస్టు మొదటి వారంలో పిటిఐ వార్తా సంస్ధ ఒక విశ్లేషణలో పేర్కొన్నది. అంకుర సంస్ధలు అనేకం ఉన్నప్పటికీ ఒక బిలియన్‌ డాలర్ల విలువ దాటిన వాటిని యూనీకార్న్‌ సంస్దలని పిలుస్తున్నారు. అలాంటి సంస్దలు భారతీయులు విదేశాల్లో నెలకొల్పినవి 40కి పైగా ఉన్నాయన్న సమాచారం ఆసక్తి కలిగించేది.
కరోనా వైరస్‌ కారణంగా చైనా నుంచి పెద్ద సంఖ్యలో కంపెనీలు, ఫ్యాక్టరీలు మన దేశానికి తరలివస్తున్నాయనే వార్తలు వచ్చాయి. ఏప్రిల్‌ చివరి వారంలో ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ అలాంటి కంపెనీలను ఆకర్షించే విధంగా రాష్ట్రాలు అవసరమైన నైపుణ్యం, మౌలిక సదుపాయాలను కలిగించి చైనా నుంచి వచ్చే కంపెనీలకు ప్రత్యామ్నాయం మన దేశమే అనే పరిస్ధితిని కల్పించాలని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. తెలంగాణా రాష్ట్ర సిఎం చంద్రశేఖరరావుతో సహా మంత్రులు, ఇతరులు సదరు కంపెనీలకు భూములను కూడా సిద్దం చేశామని, రావటమే తరువాయి అన్నట్లుగా ప్రకటనలు చేసిన అంశాన్ని గుర్తు చేయాలి. తెలంగాణా సిఎం ఒక్కరే కాదు, అనేక రాష్ట్రాల నుంచి ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. తరువాత అదే చైనాలో తిరిగి సాధారణ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని, వస్తాయని చెప్పిన కంపెనీలు అసలు బయటకు వచ్చాయో లేదో వచ్చినా ఏ దేశానికి వెళ్లాయో చెప్పిన వారు లేరు.
చైనా కంపెనీల గురించి పక్కన పెడితే మన దేశానికి చెందిన వారు అంకుర కంపెనీలను మన దేశంలో కాకుండా అమెరికా లేదా మరొక దేశంలో ఏర్పాటు చేయటానికి కారణాలు ఏమిటి అన్నది సమస్య. సరిహద్దు వివాదం తలెత్తిన తరువాత మన దేశంతో భూ సరిహద్దు ఉన్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు అనుమతులు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను చేసిన విషయం తెలిసిందే. అది చైనాను లక్ష్యంగా చేసుకొనే అన్నది తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెల వరకు ఏర్పాటు చేసిన చైనాకు చెందిన 227 అంకుర సంస్ధలలో విదేశాలలో స్ధాపించినవి కేవలం 16 మాత్రమే, మిగిలినవన్నీ చైనాలోనే పెట్టారు. అరవైకి పైగా సంస్ధలను మన వారు ఏర్పాటు చేస్తే ముందే చెప్పుకున్నట్లు వాటిలో 40 విదేశాల్లోనే అంటే మన ఐఐటిల్లో చదువుకొని కంపెనీలను మాత్రం విదేశాల్లో పెడతారు. వారిలో దేశభక్తిని నింపటంలో మన పాలకులు విఫలమయ్యారా లేక దేశంలోని పరిస్ధితులు బాగోలేవని విదేశాలకు వెళ్లిపోయారా ?
మన దేశంలోని 21 అంకుర సంస్ధల విలువ 73.2 బిలియన్‌ డాలర్లు. వీటిలోని పదకొండు కంపెనీలలో చైనాకు చెందిన ముగ్గురు పెట్టుబడులు పెట్టారు. విదేశాల్లో మన వారు ఏర్పాటు చేసిన సంస్దల విలువ 99.6బిలియన్‌ డాలర్లు. వీటిలో ఎక్కువ భాగం అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలోనే ఉన్నాయి. ప్రపంచంలోని 29 దేశాలలోని 145 నగరాల్లో 586 అంకుర సంస్ధలు ఉన్నాయి. మన దేశంలోని 21యూనీకార్న్‌ సంస్దలలో ఎనిమిది బెంగళూరులో ఉండటంతో అంకుర సంస్ధల రాజధానిగా దాన్ని పిలుస్తున్నారు. మన దేశంలో అలాంటి సంస్ధలలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్‌ను 2017లో ఏర్పాటు చేశారు. దాని తరువాత మరొక సంస్ధ లేదు. ఒక అంకుర సంస్ధ యూనీకార్న్‌ స్ధాయికి చేరుకోవాలంటే భారత్‌లో 7, అమెరికాలో 6.5, చైనాలో 5.5సంవత్సరాల వ్యవధిని తీసుకుంటున్నది. బహుశా ఈ కారణంగానే మన దేశానికి చెందిన వారు మన దేశం వెలుపలికి పోతున్నట్లు చెప్పవచ్చు.
చైనాకు చెందిన ఆలీబాబా 5, టెన్‌సెంట్‌, డిఎస్‌టి గ్లోబల్‌ మూడేసి భారత యూనీకార్న్‌ సంస్ధలలో పెట్టుబడులు పెట్టాయి.జపాన్‌కు చెందిన సాప్ట్‌బ్యాంక్‌ తొమ్మిదింటిలో, అమెరికా సంస్ధ టైగర్‌ గ్లోబల్‌ ఐదు కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. మన దేశానికి చెందిన యూనీకార్న్‌ అంకుర సంస్ధలను ఏర్పాటు చేసిన వారిలో 36 మంది ఐఐటియన్లు కాగా వారిలో ఎక్కువ మంది ఢిల్లీ ఐఐటికి చెందిన వారు ఉన్నారు. దేశంలోని మొత్తం 104 మంది యూనీకార్న్‌ సంస్ద స్ధాపకులు ఉంటే వారిలో కేవలం ఐదుగురు మాత్రమే మహిళలు.
అంకుర సంస్ధలలో తగ్గుతున్న పెట్టుబడులు !
మన దేశంలోని అంకుర సంస్ధలలో వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో తొలిసారిగా పెట్టుబడులు ఆగస్టు మొదటి వారంలో కేవలం 92లక్షల డాలర్లకు పడిపోయినట్లు యువర్‌ స్టోరీ.కామ్‌లో వచ్చిన ఒక విశ్లేషణ పేర్కొన్నది. జూలై చివరి వారంలో 6.3 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ వచ్చిన దగ్గర నుంచి పెట్టుబడులు బలహీనంగా ఉన్నప్పటికీ ఇంత తక్కువగా రావటం ఇదే తొలిసారి. ఈ వారంలో కేవలం తొమ్మిది సంస్దలకే పెట్టుబడులు వచ్చాయి. రుణ ఒప్పందం ఒక్కటీ లేదు.ఇతర సంస్ధలకు వచ్చిన పెట్టుబడులన్నీ గతంలో కుదిరిన ఒప్పందాల మేరకు వచ్చినవిగా ఉన్నాయి.
ప్రపంచంలో యూనీకార్న్‌ అంకుర సంస్ధల సంఖ్య మరియు విలువ రీత్యా అమెరికా తరువాత చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రభుత్వం నుంచి గట్టి మద్దతు రావటం, ప్రయివేటు రంగం నుంచి పెట్టుబడులు, ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం కారణాలుగా సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పత్రిక ఒక విశ్లేషణలో పేర్కొన్నది. చైనాలో తొలి తరం అంకుర సంస్దలకు విదేశాలకు చెందిన సాప్ట్‌బ్యాంక్‌, యాహూ, నాస్పర్స్‌ వంటి సంస్ధలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి. తరువాత గత దశాబ్ది నుంచి ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్ధలు, విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం ప్రధానంగా ఉంది. ఆర్ధిక మద్దతు మాత్రమే కాకుండా సంస్దల నిర్వహణకు స్నేహపూర్వక వాతావరణం ఉందని కూడా ఆ పత్రిక వ్యాఖ్యాత పేర్కొన్నారు. అమెరికా నుంచి అధ్యయనం చేసిన ఎంబియే కార్యక్రమాలతో పాటు సాంప్రదాయక చైనా పద్దతులను మేళవించి అనేక కంపెనీలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా దాటి విదేశాల్లో కూడా దూసుకుపోతున్నాయి. విదేశాల్లో చదువుకున్న వారు స్వదేశానికి తిరిగి రావటంతో పాటు దేశీయంగా అనేక మంది కళాశాల గ్రాడ్యుయేట్లు ప్రతిఏటా ప్రతిభావంతుల సముదాయంలో చేరుతున్నారు. తొలి రోజుల్లో చైనా అంకుర సంస్దలు ఇతరులను కాపీ చేసినట్లు కనిపించినా తరువాత చైనా తరహాగా ప్రాచుర్యం పొందాయి. బైడు ( చైనా గూగుల్‌), దిదీ చుక్సింగ్‌( చైనా ఉబెర్‌) ఉరు చాట్‌ (చైనా వాట్సాప్‌) వాటిలో కొన్ని. ప్రపంచంలోని యూనీకార్న్‌ అంకుర సంస్దల విలువ 1.9లక్షల కోట్ల డాలర్లు, ఇది ఇటలీ జిడిపికి సమానం.
అనేక సంస్ధలు ఇప్పుడు చైనా నుంచి కాపీ చేస్తున్నాయనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. దానికి పెద్ద ఉదాహరణ టిక్‌టాక్‌.అలాంటి దానిని ప్రతి దేశం ఎందుకు తయారు చేసుకోకూడదు అన్నంతగా అది ప్రాచుర్యం పొందింది.అలాగే చైనా ఫోన్లు, గతంలో చౌకరకం ఫోన్లకు మారుపేరుగా చైనా ఉంటే ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దాని ఫోన్లు మన మార్కెట్‌ను ఎలా ఆక్రమించాయో తెలిసిందే. ఇప్పటి వరకు చైనా కంపెనీలుగా పేరు గాంచినవి అనేక అంతర్జాతీయ కంపెనీలుగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలోని తొలి ఐదు పెద్ద అంకుర సంస్దలలో చైనాకు చెందినవి నాలుగు ఉన్నాయి.అలీబాబాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ 150 బిలియన్‌ డాలర్ల విలువతో ఈ ఏడాది హరున్‌ గ్లోబల్‌ యూనీకార్న్‌ సూచికలో అగ్రస్ధానంలో ఉంది. అగ్రస్దానంలో ఉన్న అమెరికాలో ఇలాంటి కంపెనీల సంఖ్య 233, చైనా కంటే ఆరు ఎక్కువ. ఈ ఏడాది అమెరికా 30, చైనా 21 కంపెనీలను జత చేశాయి. ఈ రెండు దేశాల మధ్య పోటీ తీవ్ర స్ధాయిలో ఉంది. ఒక వైపు రెండు దేశాలూ వాణిజ్య యుద్దం మరోవైపు సాంకేతిక పరిజ్ఞాన పోటీ యుద్దంలో నిమగమయ్యాయి. సెప్టెంబరు 15లోగా తమ కార్పొరేట్‌ కంపెనీలకు టిక్‌ టాక్‌ను విక్రయించని పక్షంలో అమెరికాలో నిషేధిస్తామని ట్రంప్‌ బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే. టిక్‌ టాక్‌ యాప్‌ ద్వారా సమాచారాన్ని చైనా తస్కరిస్తున్న దాఖలాలు లేవని సిఐఏ నివేదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చైనా సంస్ధలను ఏదో రక్షణ, చౌర్యం అంటూ ఏదో ఒక పేరుతో నిషేధించేందుకు అమెరికా లేదా మన వంటి మరొక దేశం పూనుకోవటం వెనుక చైనా సంస్ధలను ఆర్ధికంగా దెబ్బతీయాలన్న ఎత్తుగడ ఉంది. ప్రస్తుతం చైనాకు చెందిన 39 యూనీకార్న్‌ అంకుర సంస్ధలు ఇ కామర్స్‌ రంగంలో ఉన్నాయి.
యూనీకార్న్‌ అంకుర సంస్ధలు ఏ నగరంలో ఎన్ని ఉన్నాయన్నది చూస్తే 93తో బీజింగ్‌ అగ్ర స్ధానంలో ఉండగా శాన్‌ ఫ్రాన్సిస్కోలో 68, షాంఘైలో 47, న్యూయార్క్‌లో 33, షెంజెన్‌లో 20 ఉన్నాయి. ఒక ప్రాంతంగా చూస్తే అమెరికాలోని సిలికాన్‌ వాలీలో 121ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులను రాకుండా చూసేందుకు తీసుకున్న చర్యల ప్రభావం కనిపిస్తోంది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీల(ఎన్‌బిఎఫ్‌సి) ఏర్పాటుకు పలు సంస్దలు చేసుకున్న దరఖాస్తులను రిజర్వుబ్యాంకు తాజాగా తిరస్కరించింది. మారిషస్‌లో నమోదైన చైనా వెంచర్‌ కాపిటల్‌ మరియు ప్రయివేటు ఈక్విటీ ఫండ్స్‌ ఈ దరఖాస్తులు చేసుకున్నాయి. ద్రవ్య లావాదేవీల అక్రమాలను నిరోధించటంలో మారిషస్‌ నిబంధనలు పటిష్టంగా లేవనే కారణంతో ఆ దరఖాస్తులను తిరస్కరించినట్లు చెబుతున్నారు. అయితే వీటిని తిరస్కరించలేదని సమీక్ష చేసేందుకు చాలా సమయం పడుతుందని పక్కన పెట్టినట్లు మరో వార్త.
అంకుర సంస్దలను ఏర్పాటు చేసే మన వారు మన గడ్డ మీద కాకుండా అమెరికా లేదా మరొక దేశానికి ఎందుకు పోతున్నారు ? అదే చైనాకు చెందిన వారు విదేశాల్లో చదువుకొని తిరిగి వచ్చి తమ స్వంత గడ్డమీద సంస్ధలను ఏర్పాటు చేసేందుకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మన పాలకుల మీద విశ్వాసం లేకనా లేక విధానాల్లో స్ధిరత్వం లేదా ? గత కాంగ్రెస్‌ పాలకుల కంటే తాము భిన్నమని బిజెపి చెబుతోంది, అయినా పరిస్దితిలో మార్పు ఎందుకు రాలేదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ మై హూనా అంటే నమ్మని జనం : బ్రిటన్‌ యు గవ్‌ సర్వే వెల్లడి

06 Thursday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

modinomics, world economy recession 2020, YouGov survey


ఎం కోటేశ్వరరావు


ఏ రోజు ఏ దేశం మాంద్యంలోకి కూరుకుపోయిందో అనే వార్త వినాల్సి వస్తుందో తెలియటం లేదు. వరుసగా ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా జిడిపి వృద్ధి రేటు తిరోగమనాన్ని సూచిస్తే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయినట్లుగా పరిగణిస్తారు. బ్రిటన్‌కు చెందిన సంస్ధ యు గవ్‌ జరిపిన తాజా సర్వే వివరాల ప్రకారం మన ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉన్నవారి శాతం చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దీన్నే మరో విధంగా చెప్పాలంటే మీకు నేను ఉన్నాను అని మన ప్రధాని నరేంద్రమోడీ ధీమా మీద ఆర్ధిక వ్యవస్ధ విషయంలో జనంలో విశ్వాసం లేదు అని సర్వే ఫలితం సూచిస్తోంది.
తాజాగా ఫిలిఫ్పైన్స్‌ 29 సంవత్సరాల తరువాత తొలిసారిగా మాంద్యంలోకి జారింది. తొలి త్రైమాస కాలంలో 0.7 శాతం తిరోగమనాన్ని సూచించగా ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో 9శాతం ఉండవచ్చన్న అంచనాలను తారు మారు చేసి 16,5 దిగజారింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అనేక దేశాల తిరోగమనం గత ఏడాదే ప్రారంభమైంది. కరోనా మహమ్మారి పతన వేగాన్ని పెంచింది. గత ఏడునెలలుగా ప్రపంచాన్ని కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తున్నది. ఫిలిఫ్పైన్స్‌లో ఇది రాసిన సమయానికి లక్షా 16వేల కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాపితంగా కోటీ 90లక్షల మందికి సోకింది, కోటీ 22లక్షల మంది కోలుకున్నారు, ఏడు లక్షల 12 మందికి పైగా మరణించారు.49.73లక్షల మందితో అమెరికా, 28.62లక్షల మందితో బ్రెజిల్‌ ఒకటి రెండు స్దానాల్లో ఉంటే మన దేశంలో 19.64 లక్షల మందికి పైగా సోకింది. తొలి రోజుల్లో పాకిస్దాన్‌ కేసులు మనలో సగం వరకు ఉండేవి ఇప్పుడు 2.81లక్షలతో 14వ స్ధానంలో, 2.46లక్షలతో బంగ్లాదేశ్‌ 16, చైనా 84వేల కేసులతో 29వ స్ధానంలో ఉంది.

ఆర్ధిక వ్యవస్ధ, తమ భవిష్యత్‌ గురించి ప్రపంచంలోని జన ఆలోచనా ధోరణి ఎలా ఉంది ?
బ్రిటన్‌కు చెందిన యు గవ్‌ అనే ఒక సంస్ధ తాజాగా నిర్వహించిన సర్వే వివరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దాని ప్రకారం అతి పెద్ద ఆందోళనకర అంశం ప్రపంచ వ్యాపిత ఆర్దిక మాంద్యం. అయితే ఇది అన్నిదేశాలలో ఒకే తీవ్రతతో లేదు. ప్రపంచంలో మెక్సికన్లు తీవ్ర నిరాశ, ఆందోళన చెందుతుండగా, సోషలిస్టు వియత్నాం, చమురు సంపదలున్న మధ్య ప్రాచ్య దేశాల జనం తమ ఆర్దిక వ్యవస్ధ గురించి ఎక్కువ మంది ఆశాభావంతో ఆదుర్దాలేకుండా ఉన్నారు.

దేశాల ఆర్ధిక వ్యవస్ధల కుంగుబాటు ఎలా ఉంది ?
మన దేశ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ ఒకటితో ప్రారంభం అవుతుంది.అనేక దేశాల్లో జనవరి నుంచి ఆరంభం. మనకు మూడు నెలలు గడిస్తే అనేక దేశాలకు ఆరునెలలు గడిచింది. ప్రతి మూడు నెలలకు ఆర్ధిక ఫలితాలను మదింపు వేయటం దాదాపు అన్ని చోట్లా ఉన్నది. మన ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించి లాక్‌డౌన్‌ కారణంగా సమాచార సేకరణ సిబ్బంది బయటకు వెళ్లలేని కారణంగా సమాచారం సమగ్రమైంది కాదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అంచనాలు తప్ప వాస్తవాలు ఇంకా బయటకు రావటం లేదు. మిగతా దేశాలు కూడా పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తున్న సూచనలు కనిపించటం లేదు. అరకొరగా వస్తున్నాయి. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ అనే పత్రిక ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలు సగటున ఏడుశాతం, వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది రెండున్నరశాతం తిరోగమనంలో ఉండవచ్చని అంచనా వేసింది.
ఇప్పటి వరకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ఎన్ని సార్లు మాంద్యంలోకి పోయింది, వాటి తీవ్రత ఎలా ఉంది ?
1876 నుంచి ఇప్పటి వరకు 14సార్లు ప్రపంచం మాంద్యానికి గురైంది. వీటిలో కొన్ని దేశాలకు మినహాయింపు ఉన్నా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను మొత్తంగా చూసినపుడు ఈ నిర్ధారణకు వచ్చారు.1930-32 సంవత్సరాలలో 17.6, 1945-46లో 15.5, 1914లో 6.7శాతాలు గరిష్టంగా నమోదు కాగా 2020లో 6.2శాతం ఉండవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత 2009లో వచ్చిన ఆర్ధిక మాంద్యం 2,9శాతమే తిరోగమనం అయినా చాలా పెద్దదని ఆర్ధికవేత్తలు చెప్పారు, ఇప్పుడు దానికి రెండు రెట్లు 6.2శాతం అని అంచనా, ఇంకా దిగజారినా ఆశ్యర్యం లేదు. అనేక దేశాలో 2009 నాటి మాంద్య ప్రభావం ఇంకా కొనసాగుతుండగా మరో మాంద్యం ముప్పు ఉందని కరోనాకు ముందే అనేక మంది హెచ్చరించారు. ఇప్పుడు జమిలిగా మరో పెద్ద సంక్షోభం రానున్నది, దీని ప్రభావం ఎంతకాలం ఉంటుందో చెప్పలేని స్ధితి.

వివిధ దేశాల్లో అభివృద్ధి రేటు పతనాల తీరు ఎలా ఉంది ?
సమగ్రమైన సమాచారం ఇంకా రావటం లేదు, అంచనాలు, తాత్కాలిక గణాంకాలు మాత్రమే వెలువడుతున్నాయి. వాటిలో సింగపూర్‌ ఆర్ధిక వ్యవస్ధ చిన్నదే అయినా తొలి మూడు మాసాల్లో 3.3శాతం పతనం కాగా రెండవ త్రైమాసంలో 41.2శాతం మైనస్‌లో పడింది. అమెరికా రెండవ త్రైమాసంలో 33శాతం, యూరో జోన్‌లో 12.1శాతం అయితే స్పెయిన్‌లో 18.5 జర్మనీ 10.1, స్పెయిన్‌ స్వీడన్‌లో 8.6 శాతాల చొప్పున తిరోగమనంలో చైనాలో తొలి మూడు మాసాల్లో 6.8శాతం మైనస్‌ అయితే రెండవ త్రైమాసంలో 3.2శాతం అభివృద్ధిలోకి వచ్చింది. దక్షిణ కొరియాలో మొదటి మూడు నెలల్లో 3.3శాతం తిరోగమనం కాగా రెండవ త్రైమాసంలో 1.3శాతం నమోదు కావటంతో సాంకేతికంగా మాంద్యం ముంగిట ఉన్నట్లే భావిస్తున్నారు. మన దేశం తొలి త్రైమాస వివరాలు ఇంకా ప్రకటించలేదు గానీ వివిధ సంస్ధలు 6.1శాతం మైనస్‌ అని అంచనా వేశాయి. రానున్న ఏడాది కాలంలో తమ వ్యవస్ధలు ఆర్ధిక మాంద్యంలోకి పోతాయని మెక్సికో, ఫ్రాన్స్‌ దేశాలు, చైనాలో పెట్టుబడిదారీ వ్యవస్ధ ఉన్న హాంకాంగ్‌ ప్రాంత పౌరుల్లో నాలుగింట మూడువంతుల మంది భావిస్తున్నారు.

చైనా, మన, ఇతర దేశాల గురించి యు గవ్‌ సర్వే ఏమి చెప్పింది ?
రెండుదేశాల మధ్య నెలకొన్న పరిస్ధితుల్లో ఆర్ధికం గురించి జనం ఏమనుకుంటున్నారన్నది నిజంగా ఆసక్తి కలిగించేదే. మన దేశంలో 54శాతం మంది మాంద్యంలోకి పోనున్నామని చెప్పగా ఇప్పుడున్న స్దితే కొనసాగుతుందని చెప్పిన వారు 21, అచ్చేదిన్‌ అని చెప్పిన వారు 14శాతం మంది ఉన్నారు. దీనికి కారణం ఏమిటన్నది మరొక ప్రశ్నకు వచ్చిన సమాధానం వెల్లడిస్తోంది. సర్వేకు ముందు నెలతో పోల్చితే సర్వే సమయంలో తమ ఆదాయం తగ్గిందని చెప్పిన వారి సంఖ్య మెక్సికోలో 58శాతం కాగా రెండవ స్ధానంలో ఫిలిప్పీన్స్‌లో 51, మూడవ స్ధానంలో ఉన్న మన దేశంలో 50శాతం మంది చెప్పారు. ఆదాయాలు పడిపోవటం ఎక్కువగా ఉన్న కారణంగానే యథాతధ స్ధితి కొనసాగుతుందని చెప్పిన వారి సంఖ్య తక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన పధకం తమను ఉద్దరిస్తుందన్న విశ్వాసం జనంలో కలిగించలేదని కూడా సర్వేలో వెల్లడైన అభిప్రాయం సూచిస్తున్నది.
మాంద్య భయం ఎక్కువగా ఉన్న అమెరికా, ఫ్రాన్స్‌తో సహా ఐరోపా దేశాల్లో ఆదాయం తగ్గినవారి శాతం కనిష్టంగా ఉంది. చైనా విషయానికి వస్తే ఆదాయం తగ్గిన వారు 29, వియత్నాంలో 25శాతం ఉన్నారు. స్ధిరంగా ఉన్న వారు మన దేశంలో 34శాతం అయితే చైనాలో 52 శాతం ఉన్నారు. వియత్నాంలో స్ధిరంగా ఉన్న వారి శాతం41 అయితే ఆదాయం పెరిగిన వారు 33శాతం ఉన్నారు కనుక అక్కడి వారిలో ఆందోళన లేదని సర్వేలో వెల్లడైంది.
చైనాలో మాంద్యం గురించి చెప్పిన వారు 30, యథాతధ స్ధితి కొనసాగుతుందన్న వారు 50, మెరుగుపడుతుందని 12శాతం మంది చెప్పారు. అమెరికాలో 47శాతం మంది ఆర్ధిక మాంద్యం గురించి భయపడుతున్నారు. స్ధిరంగా ఉంటుందని 16శాతం, అభివృద్ధి పధంలో ఉంటామని 20శాతం చెప్పారు. సోషలిస్టు వియత్నాంలో మాంద్యం గురించి భయపడుతున్నవారు 24, యథాతధంగా ఉంటుందన్న వారు 56, మరింత పురోగమిస్తామని ఆశాభావం వెలిబుచ్చిన వారు 15శాతం మంది ఉన్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జనంలో ప్రపంచంలో అత్యధికంగా 27శాతం మంది తమ ఆర్దిక వ్యవస్ధలు పురోగమిస్తాయనే ఆశాభావం వెల్లడైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అప్పుల కుప్పగా భారత్‌ : గురువు వాజ్‌పేయి రికార్డును బద్దలు కొట్టనున్న శిష్యుడు నరేంద్రమోడీ !

04 Tuesday Aug 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

india debt, India debt matters


ఎం కోటేశ్వరరావు


మనకు నరేంద్రమోడీ అనే కొత్త దేవుడు, రక్షకుడు వచ్చాడు. ఆయన మహత్తులు అన్నీ ఇన్నీ కావు. ఛాతీ 56 అంగుళాలంట. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మనకు మంచి రోజులు వచ్చాయి. గుజరాత్‌ అనుభవాన్ని దేశమంతటా అమలు చేస్తారు. గతంలోనూ, ఇప్పుడూ సాగుతున్న ప్రచార సారం ఇదే.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం-దాని రూపు రేఖల గురించి మీడియా గత కొద్ది రోజులుగా ప్రచారం ప్రారంభించింది. శంకుస్ధాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా జరపబోతున్నారు. కొద్ది రోజుల పాటు జనాన్ని ఆ భక్తిలో ముంచి తేల్చుతారు. సుప్రీం కోర్టు మార్గాన్ని సుగమం చేసింది, స్దలం గురించి సవాలు చేసిన వారు కూడా తీర్పును ఆమోదించారు. రామాలయ నిర్మాణ ఏర్పాట్లు చేసుకోనివ్వండి ఇబ్బంది లేదు.
కకావికలమైన దేశ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టటానికి చర్యలేమిటో ఎక్కడా కనపడటం లేదు. ఎవరూ చెప్పటం లేదు. ఎంత త్వరగా రామాలయ నిర్మాణం పూర్తి అయితే అంత త్వరగా కరోనా అంతం అవుతుందని రాజస్ధాన్‌లోని దౌసా బిజెపి ఎంపీ జస్‌కౌర్‌ మీనా ప్రకటించారు. కరోనా వైరస్‌ నిర్మూలనకు రామాలయ నిర్మాణానికి లంకె ఏమిటో తెలియదు. తన ఆలయం పూర్తి అయిన తరువాతే కరోనా సంగతి చూస్తానని రాముడు అలిగి కూర్చున్నాడా అని ఎవరైనే అంటే అదిగో మా మనోభవాలను దెబ్బతీస్తున్నారని దెబ్బలాటకు వస్తారు.
రిజర్వుబ్యాంకు జూన్‌ 30న ప్రకటించిన వివరాల మేరకు 2020 మార్చి నెలాఖరుకు మన విదేశీరుణం 558.5 బిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. మోడీ అధికారానికి వచ్చిన 2014లో ఈ మొత్తం 446.2బిలియన్‌ డాలర్లు. ఈ కాలంలో మన విదేశీ అప్పుల గురించి సామాజిక మాధ్యమంలో మోడీ మద్దతుదారులు చేసిన ప్రచారాలు అన్నీ ఇన్నీకావు. మోడీ కొత్తగా అప్పులు చేయలేదు, అంతకు ముందు పాలించిన వారు చేసిన అప్పులను తీర్చేశారు. ఇలా ప్రచారాలు సాగాయి, ఇంకా చేస్తూనే ఉన్నారు. అదే వాస్తవం అయితే ఆరు సంవత్సరాలలో 112 బిలియన్‌ డాలర్ల అప్పులు ఎలా పెరిగినట్లు ?
రిజర్వుబ్యాంకు వెల్లడించిన అంకెల మేరకు పైన పేర్కొన్న సంవత్సరాల మధ్యకాలంలో ముందుకు వచ్చిన ధోరణులు, కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. జిడిపిలో విదేశీ అప్పు శాతం 23.9 నుంచి 20.6కు తగ్గింది. తీసుకున్న అప్పులకు వడ్డీ, అసలు మొత్తం కలిపి జిడిపిలో 5.9 నుంచి 6.5శాతానికి పెరిగింది. వాణిజ్య రుణాల మొత్తంతో పాటు వాటికి చెల్లించే అధిక వడ్డీ ఈ పెరుగుదలకు కారణం. అప్పులో రాయితీలతో కూడిన రుణాల శాతం 10.4 నుంచి 8.6కు తగ్గింది.
అంతర్గత అప్పు 2014-2020 సంవత్సరాల మధ్య 1,160.56 బిలియన్‌ డాలర్ల నుంచి 2,219.37 బి.డాలర్లకు చేరిందని, ఇది 2024 నాటికి 3,299.94 బి.డాలర్లకు చేరుతుందని స్టాటిస్టా డాట్‌ కామ్‌ పేర్కొన్నది. భారత అప్పు జిడిపిలో 87.6శాతానికి పెరగనుందని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ప్రధాన ఆర్ధిక సలహాదారు డాక్టర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ జూలై 20న రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు. దానిలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.” 2012లో రు.58.8లక్షల కోట్లుగా (జిడిపిలో 67.4శాతం) ఉన్న అప్పు 2020 ఆర్ధిక సంవత్సరానికి రు. 146.9లక్షల కోట్లకు(జిడిపిలో 72.2శాతం) పెరిగింది. వర్తమాన సంవత్సరంలో పెద్ద మొత్తంలో అప్పు చేయనున్నందున అది రు. 170లక్షల కోట్లకు(జిడిపిలో 87.6శాతం) చేరనుంది. విదేశీ అప్పు విలువ రు.6.8లక్షల కోట్లు(జిడిపిలో 3.5శాతం) కాగా మిగిలిందంతా స్వదేశీ అప్పు. దేశ అప్పులో రాష్ట్రాల వాటా 27శాతం. జిడిపి కుప్పకూలిన కారణంగా అప్పు నాలుగుశాతం పెరగనుంది. ఖజానా బాధ్యత మరియు బడ్జెట్‌ యాజమాన్యం(ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టం ప్రకారం జిడిపి-అప్పు దామాషాను 2023 నాటికి 60శాతానికి తగ్గించాల్సి ఉంది.అయితే 2030 నాటికి మాత్రమే అది సాధ్యమయ్యేట్లు కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాలలో వడ్డీ ఖర్చు తగ్గుతుంది.”
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల నుంచి అప్పులు తీసుకోవాల్సి రావటంతో అవి విధించిన షరతుల మేరకు 2003లో ఖజానా బాధ్యత మరియు బడ్జెట్‌ యాజమాన్యం(ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టాన్ని చేశారు. అయితే దానికి మినహాయింపులకు కూడా చట్టంలోనే అవకాశం కల్పించారు. చేసిన అప్పులను చెల్లించగలిగే విధంగా చూసే ఏర్పాటులో ఈ చట్టం ఒక భాగం. పరిమితికి మించి అప్పులు చేయరాదు, ద్రవ్యలోటును పెంచకుండా క్రమశిక్షణ పాటించాలి అన్నది ప్రధాన అంశం.2009 నాటికి రెవెన్యూ లోటు లేకుండా చేయాలని అయితే జిడిపిలో అరశాతం వరకు ఉండవచ్చని లక్ష్యంగా నిర్ణయించారు. అదే ఏడాది నాటికి ద్రవ్యలోటును మూడుశాతానికి తగ్గించాలని, 0.3శాతం వరకు ఉండవచ్చని పేర్కొన్నారు. 2007-08లో ద్రవ్యలోటు 2.7, ఆదాయలోటు 1.1శాతం ఉంది. అదే సంవత్సరం ప్రపంచంలోని ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా ఉద్దీపన పధకాలను చేపట్టేందుకు ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట లక్ష్యాలను వాయిదా వేశారు. తరువాత ఈ చట్టానికి 2012, 2015లో సవరణలు చేశారు. 2015నాటికి లక్ష్యాలను సాధించాలని 2012లో సవరణ చేయగా 2018 నాటికి రెవెన్యూ లోటును కనీసం 0.5శాతానికి తగ్గించాలని, ద్రవ్యలోటు 3శాతం, కనీసంగా 0.3శాతంగా ఉండాలని 2015లో సవరించారు.
అయితే 2016లో ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయని వాటిని సమీక్షించాలని ఎన్‌కె సింగ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ఆ మేరకు ద్రవ్యలోటును 2020 మార్చి ఆఖరుకు 3శాతం, 2020-21కి 2.8, 2023 నాటికి 2.5శాతానికి పరిమితం చేయాలని, అప్పును 60శాతానికి పరిమితం చేయాలన్నది వాటి సారాంశం. అప్పుల విషయానికి వస్తే కేంద్రం 40, రాష్ట్రాలు 20శాతానికి పరిమితం చేసుకోవాలని, రెవెన్యూలోటును 0.8శాతానికి తగ్గించుకోవాలని సింగ్‌ కమిటీ చెప్పింది.
అయితే నరేంద్రమోడీ సర్కార్‌ తాను నియమించిన కమిటీ సిఫార్సులను తానే తుంగలో తొక్కింది. మూడుశాతం ద్రవ్యలోటును 3.2శాతంగా 2017లో నాటి ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ పేర్కొన్నారు.2018లో చట్టానికి మరో అరశాతం లోటు పెంచుకోవచ్చని నిర్ణయించారు. ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020లో ద్రవ్యలోటును 3.8శాతంగానూ 2021లో 3.5శాతం ఉంటుందని చెప్పారు. అయితే వాస్తవంలో 2020 ద్రవ్యలోటు 4.59శాతం అని రెవెన్యూలోటు 3.27శాతమని ప్రభుత్వమే వెల్లడించింది.
ఇక వర్తమాన ఆర్ధిక సంవత్సర ద్రవ్యలోటు విషయానికి వస్తే 3.5శాతం అంటే 7.96 లక్షల కోట్ల మేర ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేశారు. అయితే మొదటి మూడు మాసాల్లోనే దానిలో 83.2శాతం అంటే 6.62లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చయ్యాయి. మరో తొమ్మిది నెలల్లో ఖర్చుకు 1.34 లక్షల కోట్లు మాత్రమే ఉంటాయి. కరోనా నేపధ్యంలో ఈ పరిమితికి లోబడేందుకు ఇప్పటికే ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల మీద జనాన్ని లూటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సొమ్మంతా లోటు, ఆదాయ లోటు పూడ్చుకొనేందుకు వినియోగిస్తున్నారు. ప్రస్తుత మాదిరి ఆర్దిక పరిస్ధితి దిగజారుడు కొనసాగితే అనేక పధకాలు, సంక్షేమ చర్యలకు కోతలతో పాటు జనం మీద ఏదో ఒకసాకుతో భారాలు మోపే అవకాశాలు ఉన్నాయి.
భారత్‌ రేటింగ్‌ మాదిరి దేశాలతో పోలిస్తే భారత ప్రభుత్వ అప్పు ఎంతో ఎక్కువగా ఉందని మూడీస్‌ రేటింగ్‌ సంస్ధ పేర్కొన్నది. ఆ దేశాల మధ్యగత (మిడియన్‌) రుణ భారం 53శాతం అయితే 2019లో భారత అప్పు 72శాతంగా ఉంది. 2003లో (వాజ్‌పేయి ఏలుబడి) 84.7శాతంగా ఉన్న అప్పు 2016 నాటికి 67.5శాతానికి తగ్గింది.కరోనాకు ముందు అప్పు పెరుగుదల రేటు ప్రకారమైనా 2024మార్చి నాటికి భారత్‌ అప్పు జిడిపిలో 81శాతం ఉంటుందని మూడీస్‌ మే నెలలో అంచనా వేసింది.
కరోనా ఖర్మకు జనాన్ని వదలి వేశారు, అది బలహీనపడితేనో, లేక జనం తమంతట తాము జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకు మించి చేసేదేమీ లేదని తేలిపోయింది. కరోనా పోరుకు సంకల్పం చెప్పేందుకు చప్పట్లు కొట్టమని, కొవ్వొత్తులు వెలిగించమని మరోమారు కోరే అవకాశం లేదు. కరోనా వదలినా ఆర్ధిక సంక్షోభ ఊబి నుంచి జనం ఎప్పుడు బయటపడతారో తెలియని కొత్త సంక్షోభంలోకి ఒక్కొక్క దేశం చేరుతోంది. మన దేశాన్ని కరోనాకు ముందే ఆ బాటలో నడిపించారు. ఇప్పుడు నిండా ముంచబోతున్నారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ మొక్కజొన్నల దిగుమతి రైతాంగాన్ని దెబ్బతీస్తుందా -హైకోర్టులో రిట్‌ !

27 Monday Jul 2020

Posted by raomk in AP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Telangana

≈ Leave a comment

Tags

maize imports, maize imports by India, maize imports by modi government


ఎం కోటేశ్వరరావు


జూన్‌ 25న నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని ఐక్య జనతా దళ్‌(జెడియు)-బిజెపి-ఎల్‌జెపి, ఇతర చిన్న పార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హౌమం నిర్వహించారు. అంతకు మూడు రోజుల ముందుగా నరేంద్రమోడీ సర్కార్‌ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాని ప్రకారం ఐదులక్షల టన్నుల మొక్క జొన్నలు, పదివేల టన్నుల పాలు, పాలపొడి దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించింది. సాధారణంగా దిగుమతి చేసుకోవాలని ఎవరైనా వాంఛిస్తే ధాన్య రకాలపై 50 నుంచి 60శాతం, పాలు, పాల ఉత్పత్తులపై 30 నుంచి 60శాతం దిగుమతి సుంకాన్ని చెల్లించి తెప్పించుకోవచ్చు. కానీ ప్రపంచ వాణిజ్య సంస్ధ కోటా నిబంధనల మేరకు పైన పేర్కొన్న పరిమాణాలను కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతి చేసుకోనున్నారు.


మొక్కజొన్నలను దిగమతి చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వ్యాపారులు అక్రమ వాణిజ్య పద్దతులను అనుసరిస్తున్న కారణంగా రైతులకు రక్షణ కల్పించాలని కోరుతూ తెలంగాణా హైకోర్టులో దాఖలైన పిటీషన్లలో అనేక మంది రైతులు తమను కూడా ప్రతివాదులుగా చేర్చుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. మొక్కజొన్నలను దిగుమతి చేసుకున్న సంస్దలు వాటిని నూతన విలక్షణ ఉత్పత్తులను మాత్రమే తయారు చేసేందుకు వినియోగించాలనే షరతును పెట్టింది. దిగుమతి చేసుకున్న మొక్కజొన్నలను వేయించి పేలాలుగా తయారు చేస్తే అది కొత్త ఉత్పత్తి కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్నవాటిని తిరిగి వేరే సంచులలో నింపి అమ్మితే కుదరదని అటువంటపుడు కేంద్రం ఏవిధంగా అనుమతించిందని కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ను కోర్టు ప్రశ్నించింది. దిగుమతి చేసుకున్న మొక్కజొన్నల కారణంగా తమకు రావాల్సిన ధరలు పడిపోయాయాని రైతులు వాదించారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని ఆదేశించిన కోర్టు కేసును వాయిదా వేసింది.


కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కబుర్లు చెప్పినా, ఉద్దీపన పధకాలు ప్రకటించినా మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాలకు 90 రూపాయలు పెంచిన తరువాత 2020-21 సంవత్సరానికి రు.1,850గా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దిగుమతి నిర్ణయాన్ని ప్రకటించక ముందే దిగుమతుల కారణంగా మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. క్వింటాలుకు 900 నుంచి 1200 రూపాయల వరకు మాత్రమే రైతులు పొందారని అనేక రాష్ట్రాల వార్తలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల టన్నులను విధిగా దిగుమతి చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం వర్తమాన తరుణంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. లాక్‌ డౌన్‌ సమయంలో కోళ్ల దాణా తయారీదారులు తక్కువ ధరలకు పెద్ద మొత్తంలో మొక్కజొన్నలు కొనుగోలు చేశారు. ఆ సమయంలో గుడ్లు, కోడి మాంస వినియోగం కూడా తగ్గిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్‌ పాడి పరిశ్రమ మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది. వివాహాల సమయంలో ఐస్‌ క్రీమ్‌ పెద్ద ఎత్తున వినియోగించే విషయం తెలిసిందే. వివాహాలకు అతిధులపై తీవ్ర ఆంక్షలున్న కారణంగా ఈ ఏడాది అసలు అడిగిన వారే లేరు. ఇతర ఉత్పత్తులకు సైతం డిమాండ్‌, ధర కూడా గణనీయంగా పడిపోయింది.


మొక్క జొన్న విషయానికి వస్తే ఆసియా ఖండంలో అంతకు ముందు రెండు సంవత్సరాల పాటు డిమాండ్‌ తగ్గి 2019లో మార్కెట్‌ పెరిగింది. చైనా 274 మిలియన్‌ టన్నులతో అగ్రస్ధానంలో ఉండగా ఇండోనేషియా 33, భారత్‌ 28 మిలియన్‌ టన్నులతో వినియోగంలో రెండు మూడు స్ధానాల్లో ఉన్నాయి. అందువలన చైనా వినియోగం, సాగులో, కొనుగోలు విధానాల్లో వచ్చే మార్పులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. తలసరి వినియోగంలో దక్షిణ కొరియా 223 కిలోలతో ప్రధమ స్ధానంలో ఉండగా చైనా 188, వియత్నాం 159 కిలోలతో తరువాతి స్ధానాల్లో ఉన్నాయి. ఉత్పత్తి విషయంలో 2019లో ఆసియాలో గరిష్ట స్ధాయిలో 379 మి.టన్నులు ఉత్పత్తి కాగా ఒక్క చైనా వాటాయే 270 మి.ట, ఇండోనేషియా 33, భారత్‌ 29 మి.టన్నులు ఉంది.మన దేశంలో వినియోగం కంటే ఉత్పత్తి ఎక్కువ కావటంతో కొంత ఎగుమతి చేస్తున్నాము. ఇదే సమయంలో ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల కారణంగా దిగుమతులు కూడా చేసుకోవాల్సి వస్తోంది.చైనా వినియోగం ఎక్కువ, దానికి తోడు ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనలకు అనుగుణ్యంగా దిగుమతి చేసుకుంటున్నది. వర్తమాన సంవత్సరంలో చైనాలో 260-265 మి.ట, భారత్‌లో 28 మి.ట దిగుబడి ఉండవచ్చని అంచనా.


దిగుబడుల విషయానికి వస్తే ప్రపంచంలో చిలీలో సగటున హెక్టారుకు 13 టన్నులు ఉండగా అమెరికా, మరికొన్ని చోట్ల 11, ఐరోపా యూనియన్‌ దేశాల సగటు 8, చైనాలో ఆరు కాగా మన దేశంలో మూడు టన్నులు మాత్రమే వస్తున్నది.2019లో ఆసియా దేశాల సగటు దిగుబడి 5.5 టన్నులు. దిగుమతి చేసుకొనే దేశాలలో 2019లో జపాన్‌ 18, దక్షిణ కొరియా 11, వియత్నాం 11, ఇరాన్‌ 10, మలేసియా 4, చైనా 3.9 మిలియన్‌ టన్నుల చొప్పున దిగుమతి చేసుకున్నాయి. ఈ ఏడాది చైనా 7మిలియన్‌ టన్నులు దిగుమతి చేసుకోవచ్చని భావిస్తున్నారు. రికార్డు స్ధాయిలో ఈ ఏడాది కూడా పంట ఉంటుందని, ధరలు కూడా తక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది వివిధ దేశాలు దిగుమతి చేసుకున్న మొక్కజొన్నల టన్ను వెల చైనా 222 డాలర్లు, మలేసియా 213, ఇరాన్‌ 182, వియత్నాం 177డాలర్లు చెల్లించాయన్నది సమాచారం. 2020 జూలై 20వ తేదీ కరెన్సీ మారకపు విలువ ప్రకారం మన కనీస మద్దతు ధర రూ.1,850 అంటే డాలర్లలో 24.74 అదే టన్ను ధర 247.4 డాలర్లు. మన దేశం దిగుమతి చేసుకొనే వాటి ధర పైన పేర్కొన్న కనిష్ట-గరిష్ట ధరల మధ్య ఉంటుందని అనుకుంటే అది మన రైతాంగాన్ని దెబ్బతీయటం ఖాయం. దిగుమతుల సాకుతో స్ధానిక వ్యాపారులు కారుచౌకగా రైతుల నుంచి కొనుగోలు చేస్తారని గడచిన తరుణంలోనే వెల్లడైంది. ఈ నేపధ్యంలో రైతులకు రక్షణ ఏమిటన్నది సమస్య. ఎన్ని రైతు బంధులు, రైతు భరోసాలు ఇచ్చినా ధరలు పడిపోతే వచ్చే నష్టం అంతకంటే ఎక్కువగానే ఉంటుంది.
గత కొద్ది సంవత్సరాలుగా చైనా మొక్క జొన్న నిల్వలను తగ్గించింది. ఈ కారణంగా 2028 వరకు అవసరాలకు అనుగుణ్యంగా దిగుమతులను పెంచవచ్చని భావిస్తున్నారు. అయితే పన్ను తక్కువగా ఉండే విధంగా కోటా దిగుమతులను పెంచాలని అమెరికా, ఇతర దేశాలు చేస్తున్న వత్తిడికి తలొగ్గి కోటాను మార్చేది లేదని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే చైనా స్పష్టం చేసింది. 2016లో చైనాలో నిల్వలు 260 మిలియన్‌ టన్నులు ఉన్నాయి.2018 నాటికి అవి 80 మిలియన్‌ టన్నులకు తగ్గాయి. ఆ ఏడాది 3.52 మి.టన్నులు దిగుమతి చేసుకోగా 2020లో 4మి.టకు పెరగవచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో కోటా కింద 7.2మి.టన్నులను ఒక శాతం పన్నుతో దిగుమతి చేసుకోనుంది. అదే ఇతరంగా చేసుకొనే దిగుమతులపై 65శాతం పన్ను విధిస్తున్నది. తాము 7.2మి.ట దిగుమతి చేసుకున్నప్పటికీ స్ధానిక రైతాంగం మీద ఎలాంటి ప్రభావం చూపదని, మొత్తం వినియోగంలో రెండుశాతం కంటే ఎక్కువ కాదని అధికారులు చెప్పారు.


గత నాలుగు సంవత్సరాలుగా చైనాలో మొక్కజొన్న ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మూడు నెలల వ్యవధి ఉండే దలియన్‌ వస్తు మార్కెట్‌లో ముందస్తు ధర టన్ను 289 డాలర్లు పలికింది. మన కంటే రెండు రెట్లు అధికదిగుబడి పొందటంతో పాటు మన రైతాంగం గత ఏడాది పొందిన 132డాలర్లతో పోల్చితే ధర కూడా రైతాంగానికి ఎక్కువే గిడుతున్నట్లు ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి.
మన రైతాంగానికి ధరల రక్షణతో పాటు దిగుబడుల పెంపుదల కూడా ఒక ముఖ్యమైన అంశమే అన్నది స్పష్టం. చైనాలో 120 మిలియన్‌ హెక్టార్ల భూమి సాగులో ఉండగా దానిలో ఉత్పత్తి అవుతున్న పంటల విలువ 1,367 బిలియన్‌ డాలర్లని, మన దేశంలో 156 మిలియన్‌ హెక్టార్లలో ఉత్పత్తి విలువు కేవలం 407 బిలియన్‌ డాలర్లే అని నిపుణులు అంచనా వేశారు. రెండు దేశాల్లో అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, పురుగు మందులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ చైనాలో కఠిన మైన నిబంధనలు, బలమైన సంస్కరణలు, ప్రోత్సాహకాలు, పరిశోధనా-అభివృద్దికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయటం వలన చైనా ముందుడుగు వేసేందుకు దోహదం చేశాయి. అశోక్‌ గులాటీ, ప్రెరన్నా టెరవే రూపొందిచిన ఒక నివేదిక ప్రకారం ఒక రూపాయి పరిశోధన-అభివృద్ధికి ఖర్చు చేస్తే జిడిపి రూ.11.20 పెరిగిందని పేర్కొన్నారు. 2018-19లో చైనా వ్యవసాయ పరిశోధనకు 780 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే భారత్‌లో 140 కోట్ల డాలర్లు ఖర్చు చేశారని తెలిపారు.


ప్రొడ్యూసర్‌ సపోర్ట్‌ ఎస్టిమేట్స్‌(పిఎస్‌ఇ -ఉత్పత్తిదారులకు మద్దతు అంచనా)ను ధరల్లో చూస్తే సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలను పరిగణనలోకి తీసుకుంటే 2018-19లో చైనా రైతుల మొత్తం ఉత్పాదక విలువలో 15.3శాతం పొందగా అదే భారత్‌లో 5.7శాతమే అని చైనా వ్యవసాయ సంస్కరణల వలన అక్కడి రైతాంగం గణనీయంగా లబ్ది పొందినట్లు ఆ నివేదిక పేర్కొన్నది. ఫలాన పంట వేస్తేనే అందచేస్తామనే మాదిరి షరతులేమీ లేకుండా రైతులు ఏ పంట వేస్తే దానికి నేరుగా నగదు చెల్లింపు విధానాన్ని అమలు జరిపింది. 2018-19లో చైనా 2007 కోట్ల డాలర్లు అందచేయగా భారత్‌లో పిఎం కిసాన్‌ పధకంలో 300 కోట్ల డాలర్లు అందచేశారు. ఇవిగాక రెండు దేశాల్లోనూ ఇతర సబ్సిడీలు ఉన్నాయి. మైక్రో ఇరిగేషన్‌ పధకాలకు పెద్ద మొత్తంలో చైనా ఖర్చు చేస్తూ 2030 నాటికి 75శాతం భూములకు నీరందించే లక్ష్యంతో పధకాలను అమలు జరుపుతున్నారు. నీటి వాడకం విషయంలో మన కంటే కఠినమైన నిబంధనలను అమలు జరుపుతున్నారు, చార్జీలను వసూలు చేస్తున్నారు.


చైనాలో ప్రస్తుతం మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. అక్కడ పట్టణాల్లో కూడా పరిమితంగా అయినా సాగు చేస్తున్నారు.బీజింగ్‌ మున్సిపాలిటీలో అలాంటి సాగుదార్లను నమోదు చేసి మొక్కల ఆసుపత్రుల ద్వారా చీడపీడల నివారణ సబ్సిడీ పధకాన్ని అమలు జరుపుతున్నారు. రసాయనాల వాడకం, పరిమాణం తగ్గింపు, సహజ పద్దతుల్లో కీటక నివారణ లక్ష్యాలుగా ఇది సాగుతోంది. దీన్ని హరిత తెగుళ్ల నివారణ సబ్సిడీ పధకంగా పిలుస్తున్నారు. దీనిలో భాగంగా మొక్కల ఆసుపత్రులను (మన కళ్లు, కిడ్నీ, ఎముకలు, గుండె, గొంతు,ముక్కు ప్రత్యేక వైద్యశాలల మాదిరి) ఏర్పాటు చేశారు. ఆసుపత్రులను వ్యవసాయ మందుల సరఫరాదారులు, దుకాణదారులతో అనుసంధానించారు.నమోదు చేయించుకున్న రైతులు తమ పంటలకు వచ్చిన తెగుళ్ల గురించి మొక్కల ఆసుపత్రులలో వైద్యులకు వివరిస్తారు. వైద్యులు వాటి నివారణకు అవసరమైన రసాయన లేదా సహజ నివారణ పద్దతుల గురించి సిఫార్సు చేస్తారు. ఇంటర్నెట్‌ ద్వారా ఆయా ప్రాంతాల దుకాణదారులకు వాటిని వెంటనే పంపుతారు. రైతులు అక్కడకు వెళ్లి తమ గుర్తింపును చూపి వైద్యులు సూచించిన వాటిని సస్య రక్షణకు వినియోగిస్తారు. రైతులకు అందచేసిన వాటి వివరాలను ప్రభుత్వానికి పంపిన వెంటనే సబ్సిడీ మొత్తాన్ని ఆయాశాఖలు విడుదల చేస్తాయి. రసాయనేతర సస్య రక్షణ ఉత్పత్తుల వాడకం పెరుగుతుండగా రసాయన ఉత్పత్తుల వినియోగం తగ్గుతున్నట్లు 2015-18 మధ్యకాలంలో వైద్యుల సిఫార్సులను పరిశీలించగా తేలింది. దీని వలన సబ్సిడీ మొత్తాలు కూడా తగ్గుతున్నట్లు గమనించారు. ఫలితాలను మరింతగా మదింపు వేసి విజయవంతమైనట్లు భావిస్తే ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించే ఆలోచనలో ఉన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d