• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

రూపాయి విలువ పతనం- మోడీ నాడేమి చెప్పారు నేడేమి చేస్తున్నారు !

16 Monday Mar 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, India inflation, Indian Rupee, Narendra modi on Rupee fall

Image result for what narendra modi said then and is doing now on rupee fall cartoons

ఎం కోటేశ్వరరావు
రూపాయికి కరోనా వైరస్‌ సోకిందా ?  పతనాన్ని అరికట్టటంలో నరేంద్రమోడీ సర్కార్‌ ఘోరంగా విఫలమైందా ? మోడినోమిక్స్‌ గురించి గతంలో పొగిడిన వారు ఇప్పుడు నోరు మెదపరేం ? గతంలో రూపాయి పతనాన్ని ఎద్దేవా చేసిన వారు ఇప్పుడు ఏమంటారు ? ఇలా ఎన్నో ప్రశ్నలు కేంద్ర పాలకులను చుట్టుముడుతున్నాయి. ఒక్కరూ నోరు విప్పరేం. పోనీ రూపాయి, దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ గురించి నోరు విప్పరు. కానీ సిఎఎ,ఎన్‌పిఆర్‌, ఎన్‌సిఆర్‌ వంటి అనేక వివాదాస్పద విషయాల మీద మడమ తిప్పేది లేదు, మాట మార్చేది లేదు అంటూ నోరు వేసుకొని పడిపోతున్నారే !
రూపాయిని కాపాడుకొనేందుకు రిజర్వుబ్యాంకు రంగంలోకి దిగింది. రానున్న రోజుల్లో రెండు బిలియన్‌ డాలర్లను విక్రయించనున్నట్లు గురువారం నాడు ప్రకటించింది. దాంతో రూపాయి శుక్రవారం నాడు కాస్త కోలుకుంది. సోమవారం నాడు మార్కెట్‌లు ప్రారంభం కాగానే మరోసారి పతనమైంది. రోగం ఒకటైతే మోడీ సర్కార్‌ మందు మరొకటి వేస్తోందా ?
చైనాలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుండగా అనేక దేశాల్లో విస్తరిస్తోంది. ఇదే సమయంలో అనేక దేశాల్లో స్టాక్‌ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. గురువారం నాడు రికార్డు స్దాయిలో పతనమైన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం నాడు కోలుకుంది.ఒక్క రోజులో కరోనా వైరస్‌ తగ్గిందీ లేదు, కొత్తగా పెరిగిందీ లేదు. సోమవారం నాడు తిరిగి భారీ స్ధాయిలో పతనమైంది. అసలేమి జరుగుతోంది ? ఏమి జరగబోతోంది ? ప్రభుత్వం చెప్పదు, చెప్పిన మేథావులకు దేశ వ్యతిరేకులనో, కమ్యూనిస్టులనో మరొకటో ముద్ర వేస్తున్నారు. కమ్యూనిస్టులు, వామపక్ష వాదులు కాని మేథావులకు మన దేశం గొడ్డుపోయిందా ? లేదే, మరి వారెందుకు చెప్పటం లేదు, చెప్పినా మీడియా జనం ముందుకు తేవటం లేదా ?
ఈ పూర్వరంగంలో మన రూపాయి రక్షణ గురించి చూద్దాం. రూపాయి పతనమైతే ఎగుమతిదారులు సంతోషపడతారు, దిగుమతిదారులు ఆగ్రహిస్తారు. రూపాయి విలువ పెరిగితే దిగుమతిదారులు సంతోషిస్తారు, ఎగుమతిదారులు కన్నెర్ర చేస్తారు. మధ్యలో జనం సంగతేమిటి ? 1961లో వంద రూపాయలకు వచ్చే వస్తువులను నేడు కొనాలంటే రూ.7,557 కావాలి మరి ! లేదూ దీన్నే మరొక విధంగా చెప్పాలంటే 59 సంవత్సరాల క్రితం వంద రూపాయలుంటే దాని నిజ విలువ ఇప్పుడు రూ.1.40కి దిగజారింది. ఈ లెక్క ఎలా వచ్చిందంటారా ఎలిమెంటరీ స్కూలు పిల్లలకు చెప్పినా లెక్కవేసి పెడతారు. ప్రతి ఏటా ప్రభుత్వం వినిమయదారుల ధరల సూచీని ప్రకటిస్తుంది.             అందువలన ఒక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. వర్తమాన సంవత్సర వినిమయదారుల సూచీని సదరు ప్రామాణి సంవత్సర సూచీతో భాగహారం చేయగా వచ్చే మొత్తాన్ని వందతో హెచ్చ వేయండి. మీకు ఫలితం వస్తుంది.1961 వినిమయదారుల ధరల సూచి 2.57, 2020 సూచీ 194.25. వీటితో పైన చెప్పిన పద్దతిలో భాగహారం చేస్తే 75.58 వస్తుంది. దీన్ని ద్రవ్యోల్బణ రేటు అంటారు. దీన్ని వందతో హెచ్చవేయాలి. ఇది ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకు 1961 తరువాత గరిష్ట ద్రవ్యోల్బణం 1974లో 28.6, అంతకు ముందు సంవత్సరం రెండవ రికార్డు 16.94. (ఈ కారణంగానే ఆ రెండు సంవత్సరాలలో దేశంలో అనేక చోట్ల ధరల పెరుగుదల వ్యతిరేక ఆందోళనలు తలెత్తాయి) నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు 2013లో ద్రవ్యోల్బణం 10.91. తరువాత క్రమంగా 6.35 నుంచి 2017లో 2.49గా ఉంది. దీన్ని మోడీ సర్కార్‌, బిజెపి పెద్ద ఎత్తున తమ విజయంగా,మోడీ ప్రతిభగా ప్రచారం చేసుకున్నాయి. మరుసటి ఏడాది నుంచి క్రమంగా పెరుగుతూ 2019లో 7.66కు చేరింది, ఈ ఏడాది ఇంకా ఖరారు కాలేదు. దీన్ని ఎలా చెప్పాలి ? 2019లో రూ.7,019కి వచ్చిన సరకుల ధర 2020లో రూ.7,557 అవుతుంది. ఇటీవలి కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే ద్రవ్యోల్బణం తిరోగమనంలో పయనించింది. 1976లో అది గరిష్టంగా మైనస్‌ 7.63, అందువలన 1975లో రూ.312 రూపాయలకు వచ్చిన సరకులు 1976లో రూ.288కే వచ్చాయి.

Image result for what narendra modi said then and is doing now on rupee fall cartoons
రూపాయి విలువ గురించి బిజెపి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పెద్ద రాజకీయం చేశారు. ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం యుపిఏ పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది ‘ అని ముఖ్య మంత్రిగా నరేంద్రమోడీ ఈ మాటలు అన్నారు. అదేమి చిత్రమో, గానీ యుపిఏ నాటి కంటే నేడు మరింత దిగజారినా ప్రధానిగా మోడీ నోటి వెంట ఒక్క మాటా రాదు. ఆ పెద్దమనిషి భక్తులకూ నోట మాట పడిపోయింది. గోమాత శాపమా ?
ఎక్సేంజ్‌ రేట్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ రూపి అని గూగుల్‌ తల్లిని వేడుకుంటే కరుణించి అందచేసే సమచారంలో వికీపీడియాను చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. కళ్లుండీ చూడలేని నమో భక్తుల గురించి జాలిపడదాం. అడ్డంగా వాదిస్తే వాస్తవాలతో పని పడదాం. గత పది సంవత్సరాలలో డాలర్‌తో రూపాయి విలువ వార్షిక సగటు విలువ ఎలా ఉందో దిగువ చూడండి.
ఏడాది రూపాయి విలువ
2004-05    44.93
2005-06    44.27
2006-07    45.28
2007-08    40.24
2008-09    45.91
2009-10    47.41
2010-11    45.57
2011-12    47.92
2012-13    53.21
2013-14    60.50
2014-15    61.14
2015-16    65.46
2016-17    67.07
2017-18    64.45
2018-19    69.92
2019-20 సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు సగటున రూపాయి విలువ 70.40. ఈ ఏడాది గత కొద్ది రోజులుగా పడిపోతూ 2018 అక్టోబరు రెండు నాటి రికార్డు పతనం 74.48కి దగ్గరగా 74.44 వరకు దిగజారింది. ఈ పతనానికి కారణాలేమీ చెప్పలేదు గనుక దీనికి కూడా మోడీ సర్కార్‌ అవినీతే కారణం అనుకోవాలి మరి. ఈ రికార్డు పతనంతో నిమిత్తం లేకుండానే పారిశ్రామిక ప్రగతి, ఎగుమతులు దిగజారాయి. ఇంతగా దిగజారింది కనుకనే రిజర్వుబ్యాంకు డాలర్లను విక్రయించేందుకు పూనుకుంది.
రూపాయి పతనమైతే మన సరకుల ధరలు విదేశాల్లో తగ్గి ఎగుమతులు పెరుగుతాయి కదా ! అలాంటపుడు దాన్ని నివారించేందుకు రిజర్వు బ్యాంకు ఎందుకు పూనుకున్నట్లు ? అసలు విషయం ఏమంటే మన సరకులకు విదేశాల్లో డిమాండ్‌ లేదు. పోనీ నరేంద్రమోడీ విమానాల్లో తిరిగి వెళ్లిన ప్రతి చోటా, మన దేశానికి వచ్చిన ప్రతి విదేశీ నేతను కౌగలింతలతో ముంచెత్తినా వారి నుంచి తాను ప్రశంసలు, పొగడ్తలు పొందటం తప్ప ఎగుమతి మార్కెట్‌ అవకాశాలను కల్పించలేకపోయారు. మన కరెన్సీ పతనాన్ని ఇంకా కొనసాగనిస్తే మనం దిగుమతి చేసుకొనే చమురు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. అది జనం మీద, ఆర్దిక వ్యవస్ధ మీద మరింత భారం మోపుతుంది. ఇప్పటికే రాష్ట్రాలను ఒక్కొక్కటిగా కోల్పోతున్న స్ధితిలో త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలను కాపాడుకొనేందుకు బిజెపి పాట్లు పడుతోంది.
మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీ మన దేశంలో సరకులను తయారు చేసి చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపాయి విలువను కావాలనే పతనం గావిస్తున్నారా ? ఎగుమతి ఆధారిత విధానాలను అనుసరించే దేశాలన్నీ తమ కరెన్సీ విలువలను తగ్గించిన చరిత్ర వుంది. 1990 దశకంలో మన దేశం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా మన ఎగుమతులను పెంచాలనే ఒక దివాళాకోరు ఆలోచనతో నాటి సర్కార్‌ ప్రపంచ బ్యాంకులో పని చేసిన మన్మోహన్‌ సింగ్‌ను ఆర్ధిక మంత్రిగా తీసుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా నాలుగు రోజుల్లో రూపాయి విలువను తొమ్మిదిశాతం వరకు తగ్గించారు. అంతకు ముందు దేశ చరిత్రలో అలాంటి వుదంతం జరగలేదు.
మన దేశాన్ని కేవలం ముడి సరకులు ఎగుమతి దేశంగా వుంచాలని, పారిశ్రామికంగా అభివృద్ది కాకుండా వుంచేందుకు నాటి బ్రిటీష్‌ పాలకులు రూపాయి విలువను ఎక్కువగా వుంచారన్న అభిప్రాయం వుంది. యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అదే పార్టీ ఇప్పుడు రూపాయి పతనమౌతోంటే గుడ్లప్పగించి చూస్తోంది. నోట మాట రావటం లేదు.
నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ కాలం గడుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వచ్చి ఇక్కడ మన కార్మికుల చేత వస్తువులను తయారు చేయించుకొని ఎగుమతి చేసుకోవాలన్నది ఈ నినాదం వెనుక వున్న లక్ష్యం. ఇన్నేళ్లుగా మనం ఎందుకు విఫలమయ్యాము. ధనిక దేశాలన్నీ ఆర్ధిక మాంద్యంతో వుండగా ఇప్పుడున్న పరిశ్రమల వుత్పత్తులకే దిక్కు లేకపోతే కొత్తగా ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్న. అందువలన మన ఆర్ధిక విధానాన్ని మన అవసరాలకు తగినట్లు సమూలంగా మార్చుకొని అంతర్గతంగా వస్తువినియోగానికి డిమాండ్‌ పెంచుకుంటేనే ఏ రంగమైనా అభివృద్ది చెందుతుంది. మన యువతకు వుపాధి దొరుకుతుంది.
విదేశాలకు తక్కువ ధరలకు ఎగుమతులు చేయటానికి మన వనరులన్నీంటినీ వుపయోగిస్తే మన వస్తువులు కొన్న వాడికి తప్ప మనకు లాభం ఏమిటి? ఏ కారణం చేత అయినా కొనే వారు ఎత్తుబడితే మన వస్తువులను ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో వస్తువులు కొనే వారు లేకనే మన వస్తువులు ఎగుమతి కావటం లేదని అందరూ చెబుతున్నదే. అలాంటపుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి మన నరేంద్రమోడీ గారికి మేకిన్‌ ఇండియా పేరు తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే సమస్య?
నరేంద్రమోడీ గారి మేకినిండియా పిలుపును జయప్రదం చేయటం కోసం రూపాయి విలువను మరింత పతనం గావిస్తే మనం దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం వుత్పత్తుల వంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. గుజరాత్‌ నమూనా అంటే ఇదేనా ?
వక్రీకరణలతో జనాన్ని మోసం చేయలేరు, భక్తులు మోడీని అసలు గట్టెక్కించలేరు. రూపాయి పతనాలు గతంలో జరగలేదని ఎవరూ చెప్పటం లేదు. దాన్నొక సమస్యగా చేసింది నరేంద్రమోడీ ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ అన్న మోడీని మీ ఏలుబడిలో సంగతేమిటని అడిగే హక్కు అందరికీ వుంది. ఆయన భక్తులు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసే కిరాయి జనం వున్నారు. యుపిఏ పాలనలో 2013 ఆగస్టు 2న రూపాయి 68.85కు పడిపోయి అప్పటికి కొత్త రికార్డు సృష్టించింది. ఆ తరువాత మోడీ అధికారానికి వచ్చే నాటికి 2014 మే 26నాటికి రు.58.42కు పెరిగింది. అప్పటి నుంచి తాజాగా 74.34కు పతనం అయింది.

Image

అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.’పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వుద్దీపన పధకాన్ని వుపసంహరించిన కారణంగా మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని ” లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని కూడా రవిశంకర ప్రసాద్‌ చమత్కరించారు. అదేమో గానీ నరేంద్రమోడీ వయస్సును మించి పోయింది. దాన్నయినా అదుపు చేయాలి, మోడీ గారిని అయినా అదుపులో పెట్టాలి, లేకపోతే మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గరగా రూపాయిని తీసుకుపోయే అవకాశం కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేనుకు పెత్తనం – నరేంద్రమోడీకి అధికారం !

14 Saturday Mar 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Excise Duty & VAT on Oil, Narendra Modi 2.0, Price Build-up of Petrol

Image result for narendra modi authoritarian

ఎం కోటేశ్వరరావు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చెప్పింది. సౌదీ అరేబియా-రష్యా మధ్య ప్రారంభమైన చమురు యుద్ధం కారణంగా ఒక్కసారిగా చమురు ధరలు 30శాతం వరకు పతనమయ్యాయి. ఒక్క మంత్రి లేదా సామాజిక మాధ్యమంలో ఒక్క బిజెపి కార్యకర్తగానీ ఈ మేరకు వినియోగదారులకు ధరలు తగ్గుతాయి అని చెప్పటం లేదు. గతంలో చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్దం ప్రారంభం కాగానే దాన్ని మనకు అనుకూలంగా మలచుకుంటామని కబుర్లు చెప్పారు. అదేమిటో ఎక్కడా చెప్పరు. కానీ జరుగుతున్నదేమిటి ? ధరలను మరింతగా పెంచారు. దానిలోకి వెళ్లే ముందు అసలేం జరుగుతోందో చూద్దాం.
2013 సెప్టెంబరు 16న మనం దిగుమతి చేసుకొనే రకం చమురు ధరలు, పన్నుల వివరాలు ఇలా ఉన్నాయి
పీపా ధర రూ. 117.58 డాలర్లు.
డాలరుకు రూపాయి విలువ 66.02.
చమురు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రూ.50.02
డీలర్లకు విక్రయించిన ధర              రూ.52.15
ఎక్సైజ్‌ డ్యూటీ, దాని మీద విద్య సెస్‌ రూ   .9.48
డీలర్‌ కమిషన్‌                             రూ. 1.79
ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ 20శాతం            రూ.12.68
వినియోగదారుని వద్ద వసూలు చేసినది రూ. 76.10
2020 మార్చి 14న వివరాలు
డీలర్లకు విక్రయించిన ధర              రూ.28.50
ఎక్సైజ్‌ డ్యూటీ, దాని మీద విద్య సెస్‌ రూ.22.98
డీలర్‌ కమిషన్‌                              రూ. 3.54
ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ 20శాతం           రూ.14.85
వినియోగదారుని వద్ద వసూలు చేసినది రూ.69.87
నరేంద్రమోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా రూపాయి విలువ ఎలా పతనమైందో దిగువ వివరాలు ఉన్నాయి.ఇప్పుడు 74 రూపాయలకు పతనమైంది. అదే పతనం కానట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా పడిపోయిన కారణంగా డీలర్లకు విక్రయించే ధర ఇంకా తగ్గి ఉండేది. వినియోగదారులకు ఇంకా చవకగా అంది వుండేది. గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ పన్ను మొత్తాన్ని రూ.9.48 నుంచి రూ.22.98కి పెంచింది. అదే లేనట్లయితే డీలరు కమిషన్‌ పెంచినా పెట్రోలు రూ.56.37కు వచ్చి ఉండేది.
చమురు ధరలను గణనీయంగా తగ్గించాల్సిన పెద్ద మనిషి శనివారం నాడు పెట్రోలు మీద రూ.19.98గా ఉన్న ఎక్సయిజ్‌ పన్నును రూ.22.98కి పెంచారు. ఈ పెంపుదల దూరదృష్టితో చేసినదని, ప్రస్తుతం క్లిష్టంగా ఉన్న ద్రవ్య స్ధితిలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు వనరులు అవసరమని ఒక అధికారి సన్నాయి నొక్కులు నొక్కారు. గడచిన నాలుగు మాసాల్లో చమురు ధరలు తగ్గిన మేరకు లబ్దిని వినియోగదారులకే గణనీయంగా పోయిందని సమర్ధించుకున్నారు. అంటే తగ్గిన మొత్తాన్ని వినియోగదారులకు బదలాయించకూడదన్నది మోడీ సర్కార్‌ విధానం అన్నది స్పష్టమైంది.పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికేసిందన్నది సామెత. మంచి రోజులను తెస్తానని చెప్పిన నరేంద్రమోడీకి అధికారమిస్తే చేసినదాన్ని ఏమనాలి?
మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము. 2016 డిసెంబరు 14-28 మధ్య ఒక పీపాను 53.05 డాలర్లకు , డాలరుకు రు.67.86 చొప్పున రు.3600కు, 2020 మార్చి 13వ తేదీన పీపా ముడి చమురు ధర రూ.2,342 గా ఉంది. ఇదే రోజు రూపాయి విలువ 73.74గా ఉంది.నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఆయన సమర్ధత కారణంగా ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు మన కరెన్సీ విలువ పెరిగి వుంటే చాలా చవకగా పెట్రోలు, డీజిలు అందుబాటులోకి వచ్చి ఉండేది. ఒక పీపాలో ముడి చమురు 159 లీటర్లు ఉంటుంది. దాన్నుంచి 73 లీటర్ల పెట్రోలు, 36 లీటర్ల డీజిల్‌,20 లీటర్ల కిరోసిన్‌ లేదా విమాన ఇంథనం, ఆరు లీటర్ల ప్రొపేన్‌, 24 లీటర్ల ఇతర ఉత్పత్తులు వస్తాయి. ఇవి రావటానికి ముడి చమురుకు ఇతర ఉత్పత్తులను జత చేయాల్సి ఉంటుంది. ఒక పీపా నుంచి ఒక వంద లీటర్లు పెట్రోలు, డీజిల్‌ అనుకుంటే ఇతర ఉత్పత్తుల మీద వచ్చే ఆదాయం శుద్ధి చేసిన ఖర్చుకు పోతుంది అనుకుంటే మోడీ గారి పన్ను బాదుడు లేనట్లయితే చాలా తక్కువకు జనం పొంది ఉండేవారు. అది మిగతా వస్తువుల ధరలను కూడా తగ్గించేందుకు దోహదం చేసి ఉండేది.
మోడీ సర్కార్‌ ఇతర అన్ని రంగాలలో విఫలమైందని అనేక అంశాలు నిరూపించాయి. మన ఎగుమతులతో జనానికి కలిగిన లబ్ది ఏమిటో తెలియదు గానీ దిగుమతుల్లో సింహభాగమైన ముడిచమురును ఒక ఆదాయవనరుగా మార్చుకొని వినియోగదారులను ఎలా లూటీ చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ లూటీ అనే పెద్దమాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే మోపిన పన్ను భారాన్ని జన సంక్షేమానికి ఖర్చు చేయలేదన్న కారణంగానే.
పెట్రోలియం ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వానికి పదకొండు రకాల ఖాతాల నుంచి గణనీయ మొత్తంలో ఆదాయం వస్తోంది.2014-15లో అంటే మోడీ సర్కార్‌ తొలి ఏడాదిలో వచ్చిన ఆదాయ మొత్తం రూ.1,72,065 కోట్లు, అది 2018-19 నాటికి రూ. 3,48,041 కోట్లకు పెరిగింది, రెట్టింపైంది. ఇదే కాలంలో ఈ మొత్తంలో ఎక్సైజ్‌ పన్ను రూ.99,068 కోట్ల నుంచి రూ 2,14, 369 కోట్లకు పెరిగింది( ఒక ఏడాది రూ 2,42,691 కోట్లు వచ్చింది), అంటే దీని పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది.Image result for narendra modi authoritarian
బిజెపి మరుగుజ్జులు ఈ లూటీని తక్కువ చేసి చూపేందుకు చమురు ధరల పెరుగుదలకు రాష్ట్రాలు విధించే వ్యాట్‌ (పన్ను) కారణమని తప్పుడు ప్రచారం చేస్తారు. రాష్ట్రాలు కూడా పన్ను వేస్తున్నాయి, పెట్రోలియం ఉత్పత్తులను కూడా జిఎస్‌టిలోకి తెచ్చి తమ ఆదాయాన్ని పూడ్చాలని రాష్ట్రాలు చేస్తున్న వినతిని కేంద్రం పట్టించుకోవటం లేదు. దీని వెనుక రెండు కారణాలు ఒకటి జిఎస్‌టి పద్దతిని అమలు జరిపితే రాష్ట్రాలకు పంచకుండా దొడ్డిదారిన పన్నులు వేసి తన బొక్కసానికి చేర్చుతున్న మొత్తాన్ని కేంద్రం కోల్పోవాల్సి ఉంటుంది. రెండవది రాష్ట్రాలకు తగ్గిన మేరకు ఆదాయాన్ని పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలు వ్యాట్‌తో సహా ఆరు రకాల ఖాతాల ద్వారా పొందిన ఆదాయం రూ.1,60,554 నుంచి రూ.2,27,591 కోట్లు ఉంది, దీనిలో వ్యాట్‌ పెరుగుదల రూ.1,37,157 నుంచి రూ.2,01,265 కోట్లు మాత్రమే. కేంద్రం మోపిన భారం ఎక్కువన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సౌదీ-రష్యా మధ్యలో అమెరికా, చమురు యుద్ద కారణాలు, పర్యవసానాలు !

12 Thursday Mar 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

OPEC, OPEC oil war, RUSSIA, Russia- Saudi oil war, Saudi oil war

Image result for behind the oil price war and its implications

ఎం కోటేశ్వరరావు
బస్తీమే సవాల్‌ అంటూ చమురు యుద్ధానికి సౌదీ అరేబియా తెరలేపింది. ఇప్పటికే మేము గోచీతో ఉన్నాం, దాన్ని కూడా లేకుండా చేస్తారా ? చేయండి చూస్తాం అన్నట్లుగా యుద్దానికి సిద్దమే అని రష్యా పేర్కొంది. పోరు శంఖారావం దెబ్బకు 30శాతం వరకు చమురు ధరలు పడిపోయాయి. ఇది ఆరంభమే, ఎవరికి వారు తమ వైఖరులకు కట్టుబడి ఉంటే రానున్న రోజుల్లో ఇంకా పతనమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తరువాత మూడు రోజుల్లో చూస్తే స్వల్ప మార్పులు తప్ప చమురు మార్కెట్‌లో పెను మార్పులు లేవు. యుద్ధం అంటే అంత తేలిక కాదు కనుక ప్రారంభం చేసిన అన్ని యుద్ధాలు కొనసాగలేదు, కనుక ఎప్పుడు ఏమి జరిగేదీ చెప్పలేము, ఏ యుద్దమైనా అది వాంఛనీయం కాదు, నష్టదాయకం కనుక రాకూడదనే కోరుకుందాం. అయితే దానికి దారి తీసిన పరిస్ధితులు పర్యవసానాలను తప్పక చర్చించాల్సిందే.
అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన మేరకు నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చమురు ధరలు తగ్గిస్తుందా? లేక వినియోగదారుల జేబులు కొల్లగొట్టి వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు రాయితీల రూపంలో దోచి పెడుతుందా ? అసలు సౌదీ-రష్యా ఇప్పుడు చమురు ధరల యుద్దానికి దిగాల్సిన అవసరం ఏమిటి? ఎంత కాలం సాగుతుంది? ఎంత మేరకు ధరలు పతనం అవుతాయి ? పర్యవసానాలు ఏమిటి ? ఇలా ఎన్నో అంశాలు జనం నోళ్లలో నానుతున్నాయి.
సోమవారం చమురు ధరలు, స్టాక్‌ మార్కెట్‌ పతనం, మంగళవారం నాడు మన దేశంలో స్టాక్‌ మార్కెట్లకు సెలవు, బుధవారం నాడు నష్టాల పాలు కాలేదు గానీ లాభాలు కూడా రాలేదు. గురువారం నాడు ఐదు రకాల చమురుల్లో పీపా ధర నాలుగు 25 సెంట్ల నుంచి 182 సెంట్ల వరకు పతనం కాగా మరో నాలుగు రకాల ధరలు 85 నుంచి 297 సెంట్ల వరకు పెరిగాయి, అయినప్పటికీ సోమవారం నాటి కంటే దారుణంగా స్టాక్‌మార్కెట్లు పతనమయ్యాయి. సోమవారపు పతనానికి కరోనా వైరస్‌ వ్యాప్తి, చమురు ధరల యుద్దం అని చెప్పారు. కరోనా వైరస్‌ చైనాలో తగ్గుముఖం పట్టింది, ఇతర దేశాల్లో కేసుల సంఖ్య పెరిగింది, కరోనాను ప్రపంచ మహమ్మారిగా గత కొద్ది రోజులుగా పరిగణిస్తున్నారు, బుధవారం నాడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ దానిని అధికారికంగా ప్రకటించటం తప్ప గత మూడు రోజుల్లో పెను మార్పులేమీ లేవు, అయినా స్టాక్‌ మార్కెట్‌ పతనం చాలా తీవ్రంగా ఉండటం విశేషం. బుధవారం నాడు చైనాలోని వైరస్‌ పీడిత ప్రాంతం హుబెరులో పది మంది మరణిస్తే వారిలో ఏడుగురు ఒక్క ఉహాన్‌ నగరానికి చెందిన వారే ఉన్నారు. గత వారం రోజులుగా హుబెరు రాష్ట్రంలోని ఉహాన్‌ మినహా 16నగరాలలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Image result for russia, sowdy oil  war cartoons
చమురు ధరల యుద్దం గురించి చూద్దాం. దీనికి సవాలక్ష కారణాలలో కరోనా వైరస్‌ ఒకటి మాత్రమే. ఒక వేళ ఆ సమస్య లేకపోయినా మరి కొద్ది వారాలు లేదా నెలల్లో చమురు యుద్దం తలెత్తి ఉండేది, కరోనా కాస్త ముందుకు జరిపింది. మన దేశంలో తన బడ్జెట్‌ లోటును పూడ్చుకొనేందుకు రిజర్వుబ్యాంకు దగ్గర డబ్బును లాక్కున్న మోడీ సర్కార్‌ ఎల్‌ఐసితో అనేక ప్రభుత్వరంగ సంస్దలను తెగనమ్మి ఇంకా మిగిలిన లోటును పూడ్చుకొనేందుకు చూస్తున్నది. నరేంద్రమోడీ జిగినీ దోస్తు (కాకపోతే అన్ని సార్లు ఒకరినొకరు ఎలా కౌగిలించుకుంటారు !) డోనాల్డ్‌ ట్రంప్‌ తన స్నేహితుడిని అనుసరిస్తున్నాడు. తాగుబోతులు అన్ని వనరులు అయిపోయిన తరువాత పెళ్లాం పుస్తెలు గుంజుకున్నట్లుగా అత్యవసరాల కోసం నిల్వచేసిన చమురులో కోటీ ఇరవైలక్షల పీపాల చమురును తెగనమ్మి 45బిలియన్‌ డాలర్లు సమకూర్చుకోవాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. అయితే చమురు ధరలు ఢమాల్‌ అనటంతో పరిస్ధితి మెరుగుపడేంత వరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. రష్యా కరన్సీ రూబుల్‌ విలువ మరింత పతనమైంది. మొదటి పర్యవసానం ట్రంప్‌, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మీద వత్తిడిని పెంచితే, రెండవ చర్య వలన ప్రపంచ మార్కెట్‌లో రష్యా నుంచి కొనుగోలు చేసే సరకులు తక్కువ మొత్తాలకు దొరుకుతాయి. తద్వారా రష్యాకు మేలు జరుగుతుంది. ఆంబోతుల కుమ్ములాట లేగదూడలకు ముప్పు తెస్తుంది అంటారు, కానీ ఇక్కడ చమురు ఆంబోతుల పోరు మనవంటి దేశాలకు మేలు చేస్తుంది. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు (తగ్గిన మేరకు లబ్దిని వినియోగదారులకు బదలాయించాలి) నరేంద్రమోడీ సర్కార్‌ వ్యవహరిస్తే జనానికి ఆయాసం తప్ప ఒరిగేదేమీ ఉండదు.
చమురు ఉత్పత్తి చేసే దేశాల సంస్ధతో సహకరించేందుకు తాము సిద్దమే, ఉత్పత్తిని తగ్గించటానికి, పెంచటానికి, ఒప్పందం కుదుర్చుకోవటానికి ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి అంటూనే ఏప్రిల్‌ ఒకటి తరువాత స్వల్ప కాలంలో రోజుకు రెండు, మూడులక్షలు అవసరమైతే ఐదులక్షల పీపాల వరకు చమురు ఉత్పత్తిని పెంచుతామని రష్యా ప్రకటించింది. అవసరమైతే వివాద పరిష్కారానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తామని మెక్సికో ప్రకటించింది. గతంలో చమురు ధరలు పడిపోయిన సమయంలో పెంచేందుకు సహకరించుకోవాలని ఒపెక్‌-రష్యా 2016లో ఒక అవగాహనకు వచ్చాయి. ఇటీవలి కాలంలో చమురు ధరలు కొంత మేరకు తగ్గాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్వరంగంలో వినియోగం తగ్గుతుందనే అంచనాతో రోజుకు పదిహేను లక్షల పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించుదామని సౌదీ అరేబియా ఒక ప్రతిపాదన చేసింది. దానికి రష్యా అంగీకరించలేదు. దాంతో సౌదీ ప్రభుత్వ రంగ చమురు సంస్ద ఆరామ్‌కో రష్యా చమురు మార్కెట్‌ను దెబ్బతీసే విధంగా ఏప్రిల్‌లో సరఫరా చేసే చమురు ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మే లేదా జూన్‌ నెలలో మరోసారి ఒపెక్‌-ఇతర దేశాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరి నెలలో రష్యా రోజుకు 11.289 మిలియన్‌ పీపాల చమురును వెలికి తీసింది. తాజాగా ప్రకటించినట్లు మరో ఐదు లక్షల పీపాలు అదనంగా తీస్తే అది కొత్త రికార్డుగా నమోదు కానుంది. ధరల పెంపుదలకు అందరం చమురు ఉత్పత్తిని తగ్గించుదామని ప్రతిపాదించిన సౌదీ అరేబియా అందుకు రష్యా అంగీకరించకపోవటంతో ఆగ్రహంతో ఏప్రిల్‌ నెలలో ఉత్పత్తిని రోజుకు 12.3 మిలియన్‌ పీపాలకు పెంచి మార్కెట్లను ముంచెత్తాలని తద్వారా ధరలను మరింత పతనం కావించాలని నిర్ణయించింది.దీని పర్యవసానంగా తమ ఆదాయం పడిపోకుండా చూసుకొనేందుకు నైజీరియా ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో రోజుకు 80 మిలియన్ల పీపాలు ఉత్పత్తి అవుతుండగా అమెరికా 15మిలియన్లతో అగ్రస్ధానంలో, తరువాత సౌదీ, రష్యా ఉన్నాయి.

Image result for russia, sowdy oil  war cartoons
ఒక పీపా ధర 25 నుంచి 30 డాలర్లకు పడిపోయినా ఆరు నుంచి పది సంవత్సరాల వరకు తాము తట్టుకొని నిలబడగలమని రష్యా చెబుతోంది. పీపా ధర 12-20 డాలర్లకు పడిపోయినా తట్టుకొనే విధంగా బడ్జెట్‌లను సవరించుకోవాలని అవసరమైతే పదిడాలర్ల కంటే తగ్గినా ఎలాంటి ఢోకాలేకుండా చూసుకోవాలని సౌదీ అరేబియా సిద్దం అవుతోంది. అమెరికాలోని షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి సంస్ధలు ఉత్పత్తిని తగ్గించేందుకు పూనుకున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగితే కొన్ని కంపెనీలు బతుకుతాయి, అయితే అవి అవి ఆక్సిజన్‌ కోసం చూస్తాయని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఉన్న ఉత్పతిలో రోజుకు పది నుంచి ఇరవై లక్షల పీపాల వరకు తగ్గించవచ్చని వార్తలు వచ్చాయి. కేవలం ఐదు కంపెనీలు మాత్రమే ఖర్చుకు తగిన ఆదాయాన్ని పొందుతున్నట్లు చెబుతున్నారు.
2009 తరువాత తొలిసారిగా చమురు వినియోగం ఈ ఏడాది తగ్గనుందని అంతర్జాతీయ ఇంధన సంస్ధ పేర్కొన్నది. గత ద శాబ్ది కాలంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో ఇంథన కంపెనీలు పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నాయి. చమురు ధరల పతనం కారణంగా ఈ కంపెనీల రుణాలను కొనుగోలు చేసిన సంస్ధలు సాధారణంగా పొందే ఒక డాలరుకు 67 సెంట్లకు బదులు 55 నుంచి 60సెంట్ల వరకు మాత్రమే రాబట్టుకోగలవని బర్కలీ పేర్కొన్నది.
చమురు యుద్ధాన్ని సౌదీ అరేబియా ప్రారంభించినప్పటికీ రష్యా లక్ష్యం అమెరికా షేల్‌ అయిల్‌ కంపెనీలే అని కొందరు విశ్లేషిస్తున్నారు.సౌదీ తక్షణ లక్ష్యం రష్యన్‌ మార్కెట్‌ను ఆక్రమించటం అయినప్పటికీ చమురు ఎగుమతి దేశాల సంస్ధ(ఒపెక్‌) తమ మార్కెట్‌ను రోజు రోజుకూ అమెరికాకు అప్పగించటం తనకు ముప్పుగా రష్యా పరిగణిస్తోంది. 2009 నుంచి అమెరికా షేల్‌ అయిల్‌ ఉత్పత్తి పెరుగుతోంది.2019 అమెరికా ఉత్పత్తిలో 63శాతం(రోజుకు 7.7మిలియన్‌ పీపాలు) ఉంది. వారిని దెబ్బతీయటం రష్యన్ల లక్ష్యం. అయితే తాజా పరిణామాల పర్యవసానం రష్యన్లకు సైతం నష్టం కలిగించేదే. ప్రస్తుతం సౌదీ అరేబియా బడ్జెట్‌ అవసరాలకు గాను ఒక పీపా బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 80 డాలర్లు ఉండాలి, అదే రష్యాకు 45 డాలర్లు ఉన్నా తట్టుకోగలదని అంచనా. అమెరికన్‌ ఉత్పత్తిదారుల పరిస్ధితి ఇప్పుడు తాడు మీద నడక మాదిరి ఉంది. చమురు యుద్దం పీపా ధరను ఇరవై డాలర్లకు పతనం కావించవచ్చని గోల్డ్‌మన్‌ సాచస్‌ విశ్లేషకులు చెప్పారు. 2019 వివరాల ప్రకారం ప్రపంచ చమురు నిల్వల్లో 75శాతం ఒపెక్‌ దేశాల్లో ఉండగా ప్రపంచ ఉత్పత్తిలో 42శాతం కలిగి ఉన్నాయి. ఒక దేశంగా ఉత్పత్తిలో అమెరికా ప్రధమ స్ధానంలో ఉన్నప్పటికీ ప్రపంచమార్కెట్‌ను నియంత్రించగల శక్తి ఇంకా ఓపెక్‌దే అని చెబుతున్నారు.
చమురు చరిత్రలోకి వెళితే వాణిజ్యపరంగా తొలిసారి వెలికి తీసి వినియోగించింది అమెరికాయే.1860వ దశకంలో అమెరికాలో అంతర్యుద్ధం కారణంగా పెరిగిన డిమాండ్‌తో పీపా చమురుధర ఇప్పటి ధరలతో పోల్చుకుంటే గరిష్టంగా 120 డాలర్లు ఉండేది. తరువాత కాలంలో గణనీయంగా పడిపోయింది.1900దశకంలో స్పిండిల్‌టాప్‌ చమురు బావిని కనుగొన్న తరువాత అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో చమురు ప్రధాన పాత్ర వహించటం ప్రారంభమైంది. ఒక్క ఏడాది కాలంలోనే 1500 కంపెనీలు పుట్టుకు వచ్చాయి. దాంతో ధరలు మరింతగా తగ్గాయి. 1908లో ఇరాన్‌లో, 1930లో సౌదీ అరేబియాలో చమురు నిల్వలను కనుగొన్న తరువాత చమురు సరఫరా విపరీతంగా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరింతగా విస్తరించటం, వియత్నాం యుద్ధం వంటి కారణాలతో పెరిగిన అవసరాలకు చమురు దిగుమతి చేసుకోవటం ప్రారంభించింది. ఇదే సమయంలో 1960లో ఇరాన్‌, ఇరాక్‌, కువాయిట్‌, సౌదీ అరేబియా, వెనెజులా చమురు ఎగుమతి దేశాల సంస్ధ(ఒపెక్‌)ను ప్రారంభించాయి. తరువాత కొన్ని దేశాలు చేరటం, సంస్ధ నుంచి విడిపోవటం జరిగినా ప్రస్తుతం 15దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అమెరికా, రష్యా వాటిలో లేవు. కొత్తగా బ్రెజిల్‌ను గత ఏడాది ఆహ్వానించారు.

Image result for oil price war
1973లో పాలస్తీనా సమస్యలో అమెరికన్లు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటం అది ఇరుగుపొరుగు అరబ్‌ దేశాలపై దాడులు, భూభాగాల ఆక్రమణల పూర్వరంగంలో ఒపెక్‌ దేశాలు అమెరికాకు చమురు ఎగుమతులను నిలిపివేశాయి. ధరలు కూడా పతనమయ్యాయి. అంతకు ముందు పశ్చిమ దేశాలకు చెందిన ఏడు చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌ను అదుపు చేసేవి, 1973 తరువాత ఒపెక్‌ నిర్ణయాత్మక శక్తిగా మారింది. ధరలు, ఉత్పత్తిని నియంత్రించింది.1991వరకు ఇదే కొనసాగింది. ఆ ఏడాది సోవియట్‌ యూనియన్‌ పతనమైన తరువాత అనేక సంవత్సరాల పాటు రష్యా చమురు ఉత్పత్తిలో సమస్యలు తలెత్తాయి, ఇదే సమయంలో ఆసియన్‌ దేశాలలో ద్రవ్య సంక్షోభం ఏర్పడింది. చమురుకు డిమాండ్‌ విపరీతంగా పడిపోయింది. తరువాత అనేక పరిణామాలు సంభవించినా ఒపెక్‌ నియంత్రణ కొనసాగింది. రష్యా చమురు పరిశ్రమ స్ధిరపడింది. ప్రపంచ చమురు నియంత్రణ రష్యా సహకారం లేనిదే సాధ్యం కాని పరిస్ధితి ఏర్పడింది. అందుకే 2016లో ఒపెక్‌ దేశాలు దానితో సమన్వయం చేసుకున్నాయి. మరోవైపున 2003 నుంచి అమెరికాలో షేల్‌ ఆయిల్‌ వెలికితీత ప్రారంభం, 2014 నుంచి విపరీతంగా పెరగటం వంటి పరిణామాలు, పర్యవసానాలతో ఒపెక్‌, రష్యా ఆధిపత్యానికి గండిపడింది. అమెరికా చమురు ఎగుమతి దేశంగా తయారైంది. అమెరికా అనుభవాన్ని చూసిన తరువాత అనేక దేశాలు షేల్‌ ఆయిల్‌, గ్యాస్‌ నిల్వల వెలికితీతకు పెద్ద ఎత్తున పూనుకున్నాయి. ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగటమే కాదు, ఇరాన్‌, మరొక ఒపెక్‌ దేశమైన వెనెజులా చమురు అమ్మకాలపై రాజకీయ కారణాలతో అనేక ఆంక్షలు విధించింది. వీటిని ఎదుర్కోవటంలో ఒపెక్‌ విఫలమైంది. గతశతాబ్దిలో ప్రపంచ చమురు ధరలను అమెరికా నిర్ణయించేది, తరువాత ఆ స్ధానాన్ని ఒపెక్‌ ఆక్రమించింది, అయితే ఇటీవల తిరిగి అమెరికా నియంత్రణశక్తిగా ముందుకు వస్తోంది. చమురు ధరలు పెరిగినపుడు అమెరికా ఉత్పాదక సంస్దలు పెద్ద మొత్తాన్ని మార్కెట్‌కు విడుదల చేసి లబ్ది పొందుతున్నాయి. ఒపెక్‌ చమురు అవసరం అమెరికాకు తగ్గిపోవటంతో ఆ సంస్ధ నియంత్రణ పని చేయటం లేదు.

2017,18 సంవత్సరాలలో రోజుకు 12లక్షల పీపాల ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్‌ నిర్ణయించి అమలు జరిపింది. అది అన్ని దేశాల కంటే అమెరికా కంపెనీలకే ఎక్కువ లబ్ది చేకూర్చింది. మరోవైపున తన రాజకీయ, ఆర్ధిక పలుకుబడిని ఉపయోగించి తన కంపెనీలకు చమురు ఎగుమతుల అవకాశాలను అందిస్తోంది. ఉదాహరణకు ఇరాన్‌ మనకు మిత్ర దేశం, మన రూపాయలకు చమురు విక్రయించింది. యాభై ఆరు అంగుళాల ఛాతి గలిగిన ధీశాలి అని ప్రశంసలు పొందిన నరేంద్రమోడీ పిరికితనాన్ని ప్రదర్శించి ట్రంప్‌ ఆదేశాలకు లొంగి ఇరాన్‌ బదులు అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారు. 2017లో 19లక్షల టన్నుల చమురును అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటే మరుసటి ఏడాది అది 62లక్షల టన్నులకు పెరిగింది. 2019 తొలి ఆరునెలల్లోనే 54లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నాము.
ఒపెక్‌ దేశాల మార్కెట్‌ వాటా ఒక నాడు 44శాతం ఉంటే నేడు 30శాతానికి పడిపోయింది. గత రెండు సంవత్సరాలలో అది మరింత వేగంగా జరిగింది. చమురు వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది. ఇటీవలి కాలంలో డాలరు రేటు పతనం కావటంతో ఎగుమతి దేశాలకు నష్టదాయకంగా మారుతోంది. ఒపెక్‌ దేశాలు ధరలు పెంచాలను కోవటం వెనుక ఇది కూడా ఒక ప్రధాన కారణం. తాజా చమురు యుద్దానికి నేపధ్యమిది.

Image result for oil price war cartoons
చమురు యుద్దానికి రష్యా ఎందుకు సిద్ద పడుతోంది అన్నది అనేక మందిలో ఉన్న సందేహం లేదా ప్రశ్న. చమురు ధరలు పడిపోయినపుడు అమెరికా షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి తగ్గుతోంది. తమ మీద అమెరికా చీటికి మాటికి ఆంక్షలు విధిస్తూ ఆర్ధికంగా దెబ్బతీస్తోంది. అందువలన దాన్ని దెబ్బతీయాలంటే చమురు ధరలు పతనం కావాలని రష్యా కోరుకుంటోంది. గత ఐదు సంవత్సరాలలో అమెరికా ఆంక్షల కారణంగా వాటిని తట్టుకొని నిలబడే విధంగా రష్యా ఆర్ధిక వ్యవస్ధ ఒక సాధారణ స్దితికి వచ్చింది. దాని దిగుమతులు తగ్గుతున్నాయే తప్ప పెరగటం లేదు. రూబుల్‌ విలువ పతనమైతే ఎగుమతి దార్లకు మేలు, డాలర్ల ఆదాయం పెరుగుతుంది. అందువలన చమురు ధరలు పతనమైనా తమకు ఢోకా లేదని పుతిన్‌ భావిస్తున్నారు. రూబుల్‌ విలువ పతనమైతే తమ ఎగుమతులు పెరుగుతాయని తద్వారా చమురుతో వచ్చే నష్టాన్ని పూడ్చుకోవచ్చన్నది ఆలోచన. రష్యా దగ్గర ఇప్పుడు డాలర్ల నిల్వలు గణనీయంగా ఉన్నాయి, దాని అప్పులు కూడా తక్కువే. పీపా ధర వంద డాలర్లుంటే తప్ప గిట్టుబాటు కాని స్ధితిలో ఒక నాడు రష్యా ఉండేది. తరువాత తీసుకున్న పొదుపు, ఇతర చర్యల కారణంగా 51 డాలర్లు వచ్చినా బడ్జెట్‌ అవసరాలను తీర్చుకొనే స్ధితికి చేరింది. అది ఇప్పుడు మరింతగా తగ్గి 40డాలర్లకు చేరిందని చెబుతున్నారు. సౌదీ అరేబియా 80డాలర్ల ధర అవసరం ఉన్న స్ధితిలో ఉంది.
అమెరికా మీద ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే చమురు ధరల పతనం దాని చమురు ఉత్పత్తి కంపెనీలకు నష్టమైతే, మార్కెటింగ్‌ కంపెనీలకు లాభాలను తెచ్చిపెడుతుంది. ధరలు పతనమై షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి రోజు ఒక మిలియన్‌ పీపాలు తగ్గితే ఎగుమతి దేశ స్ధాయి కోల్పోయి దిగుమతి దేశాల జాబితాలో తిరిగి చేరుతుంది. చమురు స్వయం సమృద్ధికి కూడా అంతరాయం ఏర్పడవచ్చు. ధరలు తగ్గితే దిగుమతుల బిల్లు తగ్గుతుంది, మార్కెటింగ్‌ కంపెనీలకు లబ్ది కలుగుతుంది. ఈ నేపధ్యంలో సౌదీ ప్రారంభించిన చమురు యుద్దం ఎంతకాలం కొనసాగుతుంది? దాని వలన మన ఆర్ధిక వ్యవస్ధ, వినియోగదారులకు లబ్ది కలుగతుందా లేదా అని మరోసారి చూద్దాం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మామాా అల్లుళ్ల బడ్జెట్ల మతలబు ఏమిటి !

08 Sunday Mar 2020

Posted by raomk in Current Affairs, Economics, History, Opinion, Others, Telangana

≈ Leave a comment

Tags

T Harish Rao, Telangana Budget 20-21, Telangana CM

Image result for harish rao budget

ఎం కోటేశ్వరరావు
రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత గత బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రవేశపెడితే వచ్చే ఏడాది బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి టి హరీష్‌ రావు ప్రవేశపెట్టారు. వారిద్దరూ మేనమామ-మేన అల్లుళ్లన్న సంగతి తెలిసిందే. ఇద్దరి బడ్జెట్లకు ఏమైనా తేడా ఉందా ? రాష్ట్రంలో అసలేం జరుగుతోంది అన్నది ఒక్కసారి విహంగ వీక్షణం చేద్దాం.
ఆర్ధిక మంత్రులు అంటేనే అంకెల గారడీ ఆటగాళ్లు. ఈ వర్ణనలో కొత్త దనం ఏమీ లేదు గానీ గారడీ జరిగిందనే చెప్పాలి. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేయాల్సి వస్తే బడ్జెట్‌లో పెరుగుదల పెద్దగా లేదు. ఖర్చు చూస్తే గతం కంటే తగ్గిందన్న పచ్చినిజాన్ని చెప్పకతప్పదు. గతేడాది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో 1,82,017 కోట్ల రూపాయలను ప్రతిపాదిన కెసిఆర్‌ తరువాత వాస్తవ బడ్జెట్‌ పేరుతో 1,46,492 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. ఆ మొత్తాన్ని 1,42,152 కోట్లుగా సవరించిన అంచనాగా పేర్కొన్న హరీష్‌ రావు తన బడ్జెట్‌ 1,82,914 కోట్లుగా ప్రతిపాదించారు. దీనిలో వాస్తవంగా ఎంత ఖర్చు చేస్తారో ఏడాది తరువాత గానీ తెలియదు.2018-19 సంవత్సర బడ్జెట్‌ను 1,74,454 కోట్లుగా ప్రతిపాదించి దాన్ని 1,61,223 కోట్లకు సవరించారు, దాన్నింకా సవరించి తాజా తాత్కాలిక లెక్కల ప్రకారం ఖర్చు చేసిన మొత్తం 1,57,150 కోట్ల రూపాయలు. అందువలన మార్చినెలతో ముగిసే బడ్జెట్‌ ఖర్చు 1,42,152 కోట్ల కంటే తక్కువే ఉంటుంది తప్ప పెరిగే అవకాశం లేదు. అంటే అంతకు ముందు ఏడాది కంటే కనీసం 20వేల కోట్ల రూపాయల ఖర్చు తగ్గిపోయినట్లే. ఇది అభివృద్ధి అని పాలకులకు అనుగుణ్యంగా ఎవరైనా పొగడకపోతే సన్నాసుల భాష రంగంలోకి వస్తుంది.
తగ్గింపు, కోతలు దేనికి ఉంటాయంటే సంక్షేమ కార్యక్రమాలకు పెడితే జనం ఓట్లు వేయరు గనుక ఆస్ధుల సృష్టికి తోడ్పడే పెట్టుబడి వ్యయాలకు కోత పెడుతున్నారు. అది ఎంతకాలం అంటే ఎంతకాలం సాగితే అంతకాలం .2017-18లో పెట్టుబడి వ్యయం ఖరారైన లెక్కల ప్రకారం రూ.57,768 కోట్ల రూపాయలైతే, తరువాత అది గణనీయంగా పడిపోయింది. 2018-19 బడ్జెట్‌ అంచనా రూ.48,999 కోట్లు కాగా సవరించిన మొత్తం రూ.42,196 కోట్లు, 2019-20 బడ్జెట్‌ ప్రతిపాదన రూ.35,436 కోట్లు కాగా సవరించిన ఖర్చు రూ.13,165 కోట్లు మాత్రమే. అయినా వచ్చే ఏడాది దాన్ని రూ.22,061 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే రాబోయే సంవత్సరం కూడా కాంట్రాక్లర్ల నుంచి ప్రజాప్రతినిధులు కమిషన్లు పొందే అవకాశాలు మరింత తగ్గిపోతాయనే చెప్పాలి. ఎన్నికల్లో వారు పెట్టిన పెట్టుబడులను రాబట్టుకొనేందుకు ఏ ఇతర మార్గాలు వెతుక్కుంటారో చూడాలి. నిధులు లేకపోతే పనులు జరగవు, కాంట్రాక్టర్లు ఉండరు, కమిషన్లు ఉండవు. సంక్షేమ పధకాలకు కేటాయిస్తున్నందుకు సంతోషించాలా, ఆస్ధుల కల్పన నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసించాలా ?
రాబడులు పరిమితం అయి, పెట్టుబడి వ్యయాన్ని మరింతగా కుదించిన తరువాత సంక్షేమ పధకాలకే కోత. రెండు పడక గదుల ఇండ్ల గురించి కొండంత రాగం తీసిన కెసిఆర్‌ ఆచరణలో వైఫల్యం కావటానికి కారణమిదే. అందుకే ఈ బడ్జెట్‌లో కూడా స్వంత ఇంటి స్ధలం ఉన్నవారిని కట్టుకొనేందుకు ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. లేని వారికి ఇండ్ల స్ధలం ఎందుకు ఇవ్వరు ? అయితే పెట్టుబడి వ్యయం బడ్జెట్‌ కేటాయింపుల్లో తగ్గుతున్నప్పటికీ నీటి పారుదల మరికొన్ని రంగాలలో అప్పులు తెచ్చి పెట్టుబడి వ్యయంగా ఖర్చు పెడుతున్నారు. బడ్జెట్‌ కేటాయింపులకు వడ్డీ చెల్లింపు ఉండదు, బయటి నుంచి తెచ్చే అప్పులకు వడ్డీ అదనం. ఇది వినియోగదారుల మీద లేదా అంతిమంగా ప్రభుత్వం మీద భారంగా మారనుంది. ఈ ధోరణి పెరిగితే రాబోయే రోజుల్లో వినియోగ చార్జీల మోత మోగటం లేదా ఎత్తి పోతల వంటి పధకాలు నామమాత్రం కావటం లేదా మూతపడటం తప్ప మరొక మార్గం ఉండదు.
స్వంత డబ్బా కొట్టుకోవటంలో పాలకులకు మించిన వారు మరొకరు ఉండరు. తెలంగాణా అందుకు మినహాయింపు కాదు, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామంటారు. కొన్ని కీలక రంగాలలో కేటాయింపులే తక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు గ్రామీణాభివృద్ధిని తీసుకుంటే 2019-20 బడ్జెట్‌లో కేటాయింపు 3.5శాతం అయితే అంతకు ముందు సంవత్సరంలో వివిధ రాష్ట్రాల సగటు 6.1శాతంగా ఉంది.ఇదే విధంగా విద్యకు 7.5 అయితే రాష్ట్రాల సగటు 15.9, ఆరోగ్యానికి 4శాతం అయితే రాష్ట్రాల సగటు 4.5శాతంగా ఉంది. పెన్షన్ల వంటి వాటికి అదనంగా ఇచ్చే రాష్ట్రాలలో తెలంగాణా ఒకటి.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి. హరీష్‌ రావు ప్రసంగంలో చెప్పినదాని ప్రకారం గత ఐదు సంవత్సరాలలో స్వంత రాబడి సగటు పెరుగుదల రేటు 21.5శాతం ఉంటే ఫిబ్రవరి నెలలో 6.3శాతానికి పడిపోయింది. ఈ పూర్వరంగంలో వచ్చే ఏడాది బడ్జెట్‌ లోటును రూ.33,191 కోట్లుగా పేర్కొన్నారు. దీన్ని పూడ్చుకోవాలంటే ఉన్న అవకాశాలేమిటి? అప్పులు తీసుకురావటం, కెసిఆర్‌ చెప్పినట్లు విద్యుత్‌ ఛార్జీలు, మరోసారి ఆర్‌టిసి బస్సు ఛార్జీల పెంపు, ఇంకా తన పొదిలో ఏమున్నాయో తెలియదు. మరో మార్గం ప్రభుత్వ ఆస్తులు అవి భూములు లేదా మిగిలిన ప్రభుత్వరంగ సంస్దల అమ్మకం వలన గానీ రాబట్టుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన దాని ప్రకారం పన్ను ఆదాయాన్ని 71వేల కోట్ల నుంచి 85వేల కోట్లుగానూ, పన్నేతర ఆదాయం 12 నుంచి 30వేల కోట్లకు పెరుగుతుందని చూపారు. ఈ మొత్తాలను పైన పేర్కొన్న వనరుల నుంచి సేకరిస్తారు. ఇప్పటికే తెలంగాణాలో జనం తప్పతాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వారి నుంచి ఈ ఏడాది రూ.12,600 కోట్లను రూ.16,000 కోట్లకు పెంచనున్నారు. ఇది తాగుడును మరింతగా పెంచటం లేదా మద్యం రేట్లను పెంచటంద్వారాగానీ రాబడతారు.
ఇక వృద్ది విషయానికి వస్తే ప్రభుత్వం చెబుతున్న సీన్‌ కనిపించటం లేదు. 2016 మార్చి నుంచి 2019 మార్చినెల వరకు మూడు సంవత్సరాలలో జిఎస్‌డిపి వృద్ధి రేటు వ్యవసాయం, వస్తూత్పత్తి, సేవారంగాలలో 14,2,14.3,15శాతాల చొప్పున ఉంది. వ్యవసాయ రంగంలో 17.3 నుంచి 10.9శాతానికి పడిపోయింది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో ఆ రంగంలో దిగజారుడు ఆందోళన కలిగించేదే.

Image result for harish rao budget
రుణభారం ఏటేటా పెరుగుతున్నది. 2017-18లో అన్ని రకాల ప్రభుత్వ రుణాల మొత్తం రూ. 1,52,190 కోట్లు కాగా 2020-21నాటికి ఆ మొత్తం 2,29,205 కోట్లుగా చూపారు. ఇవి గాక మిషన్‌ కాకతీయ, భగీరధ వంటి పధకాలకు తీసుకున్న అప్పులు మరో 40వేల కోట్లు అదనం. ఇతర సంస్దలు తీసుకున్నవాటిని కూడా చేర్చితే ఇంకా పెరుగుతాయి. దీనికి అనుగుణ్యంగానే చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా పెరుగుతుంది. వివిధ పధకాలకు కేటాయింపులు ఘనంగా జరిపినా చివరికి వాటిలో ఖర్చు చేసేదెంత అన్నది ప్రతి బడ్జెట్‌లోనూ ప్రధానమైన ప్రశ్నగా ముందుకు వస్తున్నది. ఆదాయరాబడి గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు గనుక ఈ బడ్జెట్‌కు అదే ప్రశ్నను మరింత గట్టిగా వేయాల్సి ఉంటుంది.
భజన చేయు విధము తెలియండీ భక్తులారా అన్నట్లుగా రెండు బడ్జెట్లకు కొట్టచ్చినట్లు కనిపించే మార్పు ఏమంటే కెసిఆర్‌ భజన. గత బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మామ తన గురించి తాను పొగడుకోలేరు. దాన్ని భర్తీ చేయాలి, గనుక ఈ ఏడాది గవర్నర్‌ ప్రసంగంలో , ఆర్ధిక మంత్రి ప్రసంగంలోనూ అసలు, వడ్డీతో సహా భజన చేయించుకున్నారు. బడ్జెట్‌ ప్రసంగ పాఠం 79 పేజీల్లోనూ అంతకంటే ఎక్కువగానే కెసిఆర్‌ను ఆకాశానికి ఎత్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మిడతల దండుపై బాతులు, కోళ్లతో చైనా యుద్దం !

02 Monday Mar 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Environment, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China duck troops, locust attack, Plague of Locusts, worst locust attack

Image result for china duck army

ఎం కోటేశ్వరరావు

అవును, వినటానికి ఆశ్చర్యంగానే ఉంది, పచ్చి నిజం. ఒక వైపు కోవిద్‌-19(కరోనా వైరస్‌)ను అదుపులోకి తెచ్చేందుకు అపూర్వరీతిలో ప్రయత్నిస్తున్న చైనా మరోవైపు ముంచుకు వస్తున్న మిడతల దండు ముప్పును ఎదుర్కొనేందుకు తన బాతులు, కోళ్ల వీరులను యుద్ధానికి తరలిస్తోంది. ఎత్తయిన, మంచుతో ఉండే హిమాలయాల కారణంగా మిడతలు చైనా మీద దాడి చేసే అవకాశాలు పరిమితమే అయినప్పటికీ ఇరుగుపొరుగుదేశాలకు సాయ పడేందుకు, తమ దేశంపై దాడి చేస్తే ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకొంటోంది. రసాయనాలతో మిడతలను సంహరించే అవకాశాలున్నా పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ఎరిగిన చైనా సాధ్యమైన మేరకు వాటితో నిమిత్తం లేకుండా హానిలేని ఫంగస్‌లను కూడా పెద్ద ఎత్తున తయారు చేస్తోంది.
గత కొన్ని దశాబ్దాలలో లేని విధంగా కొద్ది వారాలుగా తూర్పు ఆఫ్రికాలోని అనేక దేశాలలో పంటలను తుడిచి పెట్టిన మిడతలు ఇప్పుడు సౌదీ అరేబియా, పాకిస్ధాన్‌, మన దేశం, చైనా వైపు పయనిస్తున్నాయి. దాదాపు 360 నుంచి 400 బిలియన్ల మిడతలు దాడుల్లో ఉన్నట్లు అంచనా. చైనా పశ్చిమ సరిహద్దు రాష్ట్రమైన గ్జిన్‌జియాంగ్‌ సరిహద్దుల్లో ఉన్న పాకిస్ధాన్‌, భారత్‌ ప్రాంతాలకు విస్తరిస్తున్న మిడతలను ఎదుర్కొనేందుకు ఇప్పటికే లక్ష బాతు సైన్యాన్ని చైనా సిద్దం చేసింది. వాటిని రాబోయే రోజుల్లో పాకిస్ధాన్‌లోని సింధు, పంజాబ్‌, బెలూచిస్తాన్‌ రాష్ట్రాలకు తరలించేందుకు ఇప్పటికే చైనా అధికారులు కొన్ని ప్రాంతాలను సందర్శించి తీసుకోవలసిన చర్యల గురించి అధికారులు, రైతులతో మాట్లాడారు. బాతులకు నీరు అవసరమైనందున నీరు లేని ఎడారి ప్రాంతాలలో వాటిని వినియోగించటం గురించి పరిశీలన చేస్తున్నారు. మిడతల దండు దాడులతో ఇప్పటికే పాక్‌ ప్రధాని జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు. పంటల నష్టంతో ఆహారకొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

Image result for china duck army
రసాయనాలతో మిడతలను హతమార్చవచ్చుగానీ, అది మరికొన్ని కొత్త సమస్యలను సృష్టిస్తుంది, అందువలన చైనీయులు సహజంగా మిడతల పని పట్టే పద్దతులను పాతిక సంవత్సరాల క్రితమే ప్రయోగించి జయప్రదమయ్యారు. ఇప్పుడు పెద్ద ఎత్తున నివారణ చర్యలకు సిద్దం అవుతున్నారు. ఒక్కొక్క కోడి రోజుకు 70మిడతలను తింటే ఒక బాతు 200లను ఆరగిస్తుంది. ఒక బాతు నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలోని మిడతలను అదుపు చేయగలదు. ప్రకృతిలో మిడతలు ఒక భాగం. కొన్ని సందర్భాలలో అవి అలవిగాని రీతిలో విపరీతంగా పెరిగిపోవటానికి నిర్దిష్టంగా ఫలానా పరిస్ధితులు కారణమని చెప్పలేని స్దితి. అందువలన వాటిని పర్యవేక్షించి తీవ్రతను అంచనా వేసి చర్యలు తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు. బాతులతో పాటు గంటకు 16000 హెక్టార్లలోని మిడతలపై రసాయనాలు చల్లి హతమార్చేందుకు చైనా 50 డ్రోన్లను, విమానాలను కూడా అందచేసేందుకు పాక్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. రసాయనాలను ఉపయోగించినపుడు మిడతలతో పాటు మానవాళి, పంటలకు ఉపయోగపడే పరపరాగ సంపర్కానికి దోహదం చేసే తేనెటీగల వంటివి కూడా అంతరిస్తాయి. దాని వలన జరిగే నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకొని సహజ పద్దతుల్లో ఎదుర్కొనేందుకు, తక్కువ ఖర్చుతో కూడిన గువోషాఓ రకం బాతులు మిడతలను తినటంలో ఎంతో నైపుణ్యం గలవిగా పరిగణిస్తున్నారు. వాటిని చైనా ప్రత్యేకంగా ఉత్పత్తి చేస్తున్నది. గాలి వాలును బట్టి హిమాలయాలు అడ్డుగా ఉన్నందున, చలి కారణంగా చైనాకు మిడతల దండు ముప్పు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయినా ముందు జాగ్రత్తగా బాతు, కోళ్ల సైన్యాన్ని సన్నద్ద పరుస్తున్నారు. అవసరమైన పాకిస్దాన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
తాజా దండు ప్రారంభాన్ని గతేడాది జూన్‌లో గమనించారు. అయితే అది ఈ ఏడాది జనవరి నాటికి అదుపు తప్పి పెరిగిపోయింది. తూర్పు ఆఫ్రికాలోని కెన్యాలో జనవరినెలలో ఐదువేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేంద్రీకృతమై పదివేల కిలోమీటర్లకు పెరిగి అక్కడి పంటలు, పచ్చదనాన్ని హరించి నుంచి గాలివాలును బట్టి పరిసర దేశాల మీద దాడి చేస్తున్నాయి. ఆహార భద్రతకు అసాధారణ ముప్పు వచ్చిందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్ధ ప్రకటించింది. గతేడాది చివరిలో ఎమెన్‌, మరికొన్ని దేశాలలో భారీ వర్షాలు పడటంతో మిడతలు తామర తంపరగా పెరగటానికి అనువైన పరిస్ధితి ఏర్పడింది.
ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో పదిహేను కోట్ల మిడతలు ఉంటాయని, గాలి తీవ్రతను బట్టి రోజుకు గరిష్టంగా 150కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.ఒక రోజులో 35వేల మంది ఎంత ఆహారం తింటారో ఒక చదరపు కిలోమీటరులో విస్తరించిన మిడతలు రోజులో అంత మొత్తాన్ని ఖాళీ చేస్తాయని అంచనా. వాతావరణాన్ని బట్టి ఒక దండు దండయాత్ర ఒకటి నుంచి రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఏడాదిలో రెండు నుంచి ఐదు తరాలు వృద్ధి చెందుతాయి. ఒక మిడత గుడ్డు నుంచి సంపూర్ణంగా ఎదగటానికి మూడునెలల సమయం పడుతుంది. ఒకేసారి అనేక గుడ్లను పెడతాయి.
చైనా విషయానికి ముఖ్యంగా ఆహార భద్రతను గమనంలో ఉంచుకొని దేన్నీ తక్కువగా చూడటం లేదు. గతేడాది దాదాపు కోటి హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి, ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కారణంగా దేశంలోని 44కోట్ల పందులలో సగాన్ని హతమార్చాల్సి వచ్చింది. అక్కడి వారి ఆహారంలో పంది మాంసం ప్రముఖపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Image result for china duck army
కేవలం మిడతలను మాత్రమే హతమార్చే ఫంగస్‌కూడా అందుబాటులో ఉంది. పదిహేను సంవత్సరాల క్రితం మిడతల దండు నివారణకు దానిని ఉపయోగించి ఫలితాలు సాధించారు. అయితే అవి మిడతలను సంహరించేందుకు ఎక్కువ వ్యవధి తీసుకుంటున్నాయి. చైనాలో ఈ బయో ఫెస్టిసైడ్స్‌ను కూడా వినియోగిస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో ప్రస్తుత వినియోగానికి చైనాలోని ఫ్యాక్టరీలు వేలాది టన్నుల ఫంగస్‌ రకాలను తయారు చేస్తున్నాయి. వాటిలో కొన్ని జన్యుమార్పిడి రకాలు కూడా ఉన్నాయి. కరోనా వైరస్‌ కారణంగా తాత్కాలికంగా మూతవేసిన వాటిలో ఈ ఫంగస్‌ను తయారు చేసేవి కూడా ఉన్నాయి. అయితే ఆఫ్రికా అవసరాల రీత్యా వాటిని తెరిచి పెద్ద ఎత్తున ఫంగస్‌ను తయారు చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కోడి కత్తి కాదు తెలుగువారికి డోనాల్డ్‌ ట్రంప్‌ ” కోడి కాలు, పాల ” కేసులు ముఖ్యం ?

23 Sunday Feb 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Dairy Farmers, Donald Trump India tour, Poultry Industry

Image result for poultry and milk products cases not chicken knife case important for telugus

ఎం కోటేశ్వరరావు
కేంద్రంతో సంబంధం, రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన కోడి కత్తి కేసు ఏమైందో మీకు తెలుసా ! నాకూ తెలియదు, అలాంటి సంచలనాత్మక కేసులు ఎన్నో మరుగునపడ్డాయి, దాని వలన రాజకీయ వ్యాపారులకు తప్ప జనానికి నష్టం లేదు. కానీ కోడి కాలు, పాల కేసు అలాంటిది కాదు. రెండు రాష్ట్రాల్లోని పాడి, కోళ్ల పరిశ్రమను, వాటి మీద ఆధారపడిన వారినీ దెబ్బతీస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు వచ్చిన ఆహ్వానాన్ని, సంతోషంగా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ విందులో కోడి కాలు, పెరుగు లేకుండా ఉండదు. విందును ఆరగించబోయే ముందు తనకు వడ్డించి కోడి కాలు, పెరుగు స్వదేశీయా, అమెరికాదా అని కెసిఆర్‌ కనీసం సందేహిస్తారా ? అందని ద్రాక్ష పుల్లన అలాగే ఆహ్వానం రాలేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డికి అది గొప్ప విందేమీ కాదు. కనీసం ఆయన అయినా కోడి కత్తి కేసుతో పాటు కోడి కాలు, పాల కేసులను పట్టించుకుంటారా ?
ఒకటి కొంటే రెండు ఉచితంగా ఇస్తాం అన్నట్లుగా అమెరికా సర్కార్‌ మన దేశంతో ”కోడి కాళ్ల ” బేరం ఆడుతోంది. లేకుంటే మన కాళ్లు విరగ్గొడతామని బెదిరిస్తోంది. గతంలో మా కాళ్లు మాకున్నాయి మీ కాళ్లు అక్కర లేదంటూ మన సర్కార్‌ నిషేధం విధించింది. అప్పటి నుంచి వత్తిడి తెస్తున్న అమెరికా ఇప్పుడు విజయవంతమైనట్లు వార్తలు వచ్చాయి. విదేశీ వద్దు-స్వదేశీ ముద్దు అంటూ జపం చేసిన కాషాయ స్వదేశీ జాగరణ మంచ్‌ మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఏమైందో తెలియదు. ప్రస్తుతం మన దేశం అమెరికాతో 17 బిలియన్‌ డాలర్ల మేరకు వాణిజ్య మిగులులో ఉంది. మన దేశంతో ఉన్న ఆ వాణిజ్య లోటును అమెరికా పూడ్చుకోవాలంటే తనకు అవసరం లేని వాటిని మన మీద రుద్ది లబ్దిపొందాలని చూస్తోంది.
అమెరికా జనం కోడి కాళ్లను తినరు. అందువలన అక్కడి కోల్ట్‌ స్టోరేజీల్లో అవి పెద్ద ఎత్తున నిల్వలుండిపోయాయి. వాటిని మన మార్కెట్లో విక్రయానికి అనుమతిస్తే మన దేశంలోని వేలాది కోళ్ల ఫారాలు మూతపడతాయి. వాటితో పాటు అనుబంధ రంగాలలో కనీసం 40లక్షల మందికి ఉద్యోగాలు పోతాయని అంచనా. ఈ కారణంగానే గత పాలకులు వాటి మీద నిషేధం విధించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ను కౌగలించుకున్న నరేంద్రమోడీ ట్రంప్‌ను పడేయాల్సింది పోయి తానే పడిపోయారు. కోడి కాళ్ల దిగుమతులపై ఉన్న పన్ను మొత్తాన్ని వంద నుంచి 25శాతానికి తగ్గించి దిగుమతులకు వీలు కల్పిస్తామని ఆమోదం తెలపగా, కాదు పదిశాతానికి తగ్గించాలని అమెరికా పట్టుబడుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్ద రాయిటర్స్‌ తెలిపింది. ఇది నిజానికి స్పందన తెలుసుకొనేందుకు వదిలిన లీకు వార్త తప్ప మరొకటి కాదు. దీని మీద మన దేశంలో తీవ్ర వ్యతిరేకత రావటంతో అబ్బే అలాంటిదేమీ లేని ప్రభుత్వం ప్రకటించింది. అయినా ట్రంప్‌ రాక సందర్భంగా లేదా తరువాత అయినా దానికి అంగీకారం తెలపవచ్చని భావిస్తున్నారు.
కోడి కాళ్ల దిగుమతులపై అమెరికా కోరిన విధంగా పన్ను తగ్గిస్తే అది ఆ ఒక్కదేశానికే పరిమితం కాదు. బ్రెజిల్‌ వంటి ఇతర అనేక దేశాల నుంచి చౌకగా దిగుమతులు వెల్లువెత్తుతాయి. అదే జరిగితే మన కోళ్ల పరిశ్రమ ఒక్కటే కాదు, కోళ్ల దాణాకు అవసరమైన మొక్కజొన్న, సోయా రైతులు కూడా ప్రభావితం అవుతారు. నాటు కోళ్లను పెంచే సామాన్య గృహస్తుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధ ద్వారా అమెరికా మన మీద తెస్తున్న వత్తిడి అంతా ఇంతా కాదు. బర్డ్‌ ఫ్లూ నివారణ చర్యల్లో భాగంగా 2007 మన ప్రభుత్వం అమెరికా నుంచి కోళ్ల ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఫ్లూ సమస్య తొలగిన తరువాత కూడా అది కొనసాగింది. అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్దకు ఫిర్యాదు చేసింది.2014లో అమెరికా కేసు గెలిచింది. 2017లో కోడి కాళ్ల దిగుమతులను మోడీ సర్కార్‌ అనుమతించింది. మన దేశమే కోళ్ల ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అలాంటిది అమెరికా నుంచి దిగుమతులను పరిశ్రమ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ప్రస్తుతం వందశాతం పన్ను ఉన్నప్పటికీ అమెరికా నుంచి వస్తున్న కోడి కాళ్ల దిగుమతుల కారణంగా అనేక చోట్ల చిన్న చిన్న కోళ్ల ఫారాలు మూతపడ్డాయి. అమెరికా తన వద్ద ఉన్న నిల్వలను వదిలించుకొనేందుకు కారుచౌకగా ఎగుమతులు చేసేందుకు పూనుకుంది. మన దేశంలో కోడి కాళ్లు ఆయా సీజన్లనుబట్టి కిలో రూ.150 నుంచి 250 వరకు ధరలు పలుకుతున్నాయి. అమెరికా నుంచి పది హేను రూపాయలకే అందుబాటులోకి వస్తాయని అంచనా. అక్కడి వాస్తవ ధరకంటే తక్కువ చూపి సబ్సిడీలతో ఎగుమతులు చేస్తారు. అందువలన మన దేశం దిగుమతి పన్ను వంద కాదు మూడు వందల శాతం వేసినా మన మార్కెట్‌ కంటే తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో కోడి కాళ్ల సగటు బరువు 70 నుంచి 90 గ్రాములుంటాయి. అదే అమెరికా కాళ్ల సగటు 160 నుంచి 180 గ్రాములు.
ఇక పాలు, పాల ఉత్పత్తుల విషయానికి వస్తే అమెరికా గత ఏడాది కాలంగా ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం చూస్తోంది. వాణిజ్య యుద్ధానికి దిగిన కారణంగా అమెరికా ఉత్పత్తుల మీద చైనా 20శాతం, మెక్సికో 28శాతం చొప్పున దిగుమతి పన్ను పెంచాయి. దాంతో ఉత్పత్తుల నిల్వలు పెరిగిపోతున్నాయి. గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా గతేడాది అమెరికా గోదాముల్లో 1.4బిలియన్‌ పౌండ్ల(పౌను అరకిలోకు సమానం) జున్ను నిల్వలు మిగిలిపోయాయి. ఇక పాలపొడి సంగతి సరేసరి. మరోవైపు న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌ నుంచి పోటీ పెరుగుతోంది. 2023వరకు ఈ పన్నులు కొనసాగితే అమెరికా పాల రైతులు 12.2బిలియన్‌ డాలర్లు నష్టపోతారు. ఈ కారణంగా తన ఉత్పత్తులను మన మీద రుద్దేందుకు అమెరికా పూనుకుంది.2018లో అమెరికా పాల ఉత్పత్తులకు మన మార్కెట్‌ను తెరిచేందుకు మోడీ సర్కార్‌ సూత్రప్రాయంగా ఆమోదించింది. అది అమల్లోకి వస్తే దాదాపు ఎనిమిది కోట్ల మంది మన రైతులు ప్రభావితులౌతారు.

Image result for trump , india ,poultry and milk products cartoons
మొహమాటానికి పోతే…. ఏదో అయిందన్నది ఒక ముతక సామెత. డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆహ్వానం పలికి నరేంద్రమోడీ అదే ఇబ్బందులను కొని తెచ్చుకున్నారా ? గత ఏడాది హౌడీ మోడీ కార్యక్రమానికి అమెరికా వెళ్లిన నరేంద్రమోడీ పనిలో పనిగా మీరు ఒకసారి మా దేశానికి రండి అని ట్రంప్‌కు ఆహ్వానం పలికారు. అక్కడికి వచ్చిన జనాన్ని చూసి డంగై పోయిన ట్రంప్‌తో వీళ్లదేముంది, మీరు ఊహించలేరు, మాదేశం వచ్చినపుడు మిలియన్ల మంది మీకు దారిపొడవునా స్వాగతం పలుకుతారు చూడండి అని నరేంద్రమోడీ గొప్పగా చెప్పి ఉండాలి. లేకపోతే మిలియన్ల మంది నాకోసం వస్తారని మోడీ చెప్పారు, వారు 50 నుంచి 70లక్షల మంది వరకు ఉంటారని మోడీ చెప్పారు అని ఒకసారి, అరవై నుంచి కోటి మంది వరకు వస్తారని మోడీ చెప్పినట్లుగా మరోసారి అమెరికాలో ట్రంప్‌ ప్రకటించారు. అది మన మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది. రేపు మూడో కుర్ర భార్య, మొదటి భార్య కూతురు, అల్లుడితో సహా వస్తున్న ట్రంప్‌ జనాన్ని చూసి ఎంత మంది ఉంటారని తన వాళ్లను ప్రశ్నించకమానరు. మీ స్వాగతం గురించి మీ మోడీ చెప్పినవన్నీ జుమ్లా(ఏదో అవసరానికి అలా చెబుతాం)యే. మిలియన్ల మంది ఎక్కడా కనిపించలేదు, భారత్‌ మనలను సరిగా చూసుకోవటం లేదు, మోడీ అలాంటి వ్యక్తి కాదు అన్నారు, ఇప్పుడు చూడండి ఎలా అవమానించారో, ఇంత తక్కువ సంఖ్యలో జనమా, ఇది వచ్చే ఎన్నికల్లో మీకు నష్టం కలిగించదా అని భార్య, కూతురు, అల్లుడు నిషఉ్టరాలాడకపోరు. ట్రంప్‌ను చూసేందుకు గుజరాత్‌లో ఎంత మంది వచ్చిందీ కొందరు విలేకర్లయినా నిజాలను రాయకుండా ఉండరు కదా ! స్వాగతం పలికే జన సంఖ్య గురించి మోడీ ఆంగ్లం ట్రంప్‌కు అర్ధం కాలేదో లేక మోడీయే ట్రంప్‌కు అర్ధమయ్యే రీతిలో చెప్పలేదో ఏం జరిగిందో చెప్పటానికి ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు గనుక దీన్ని వదలివేద్దాం.

Image result for poultry and milk products cases not chicken knife case important for telugus
డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలేవీ ఉండవు అని అమెరికా అధికారులు మరింత స్పష్టంగా చెప్పారు. అలాంటపుడు ట్రంప్‌ ఎందుకు వస్తున్నట్లు ? మన ప్రధాని ఎందుకు ఆహ్వానించినట్లు ? ఈ ఏడాది నవంబరు 3న జరిగే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అమెరికా కార్పొరేట్లకు గరిష్ట లబ్ది చేకూర్చేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశంతో సహా అన్ని దేశాలపై వత్తిడి పెంచుతున్నారు. దీనికి నరేంద్రమోడీ లొంగుతారా ? లేకపోతే మన దేశం మీద అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం, ప్రపంచ వాణిజ్య సంస్ధ ద్వారా తెస్తున్న వత్తిడి మరింత పెరుగుతుంది. మరి మన మోడీ తట్టుకొని నిలుస్తారా, దేశపిత వంటి మెరమెచ్చు మాటలకు జావగారి లొంగిపోతారా, కోట్లాది మంది రైతాంగ జీవితాలను ఫణంగా పెడతారా ?అమెరికాకే అగ్రస్ధానం అన్న ట్రంప్‌ వైఖరికి అనుగుణ్యంగానే ఈ పర్యటన సాగనున్నట్లు స్పష్టమై పోయింది. మన ప్రయోజనాలే మనకు ముఖ్యం అని చెప్పే మన ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు రాజీపడుతున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ పాలనలో ఈ వాస్తవాలను కాదనే ధైర్యం ఉందా !

16 Sunday Feb 2020

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Narendra Modi, Narendra Modi governance, RBI

Image result for modi governance cartoons
ఎం కోటేశ్వరరావు
దేశమంతటా ఎన్‌ఆర్‌సి గురించి అబ్బే అసలు ఆలోచన కూడా చేయలేదని నరేంద్రమోడీ-అమిత్‌ షా పలికిన ‘సత్య’ వ్యాక్యాలతో వారు అపర సత్యహరిశ్చంద్రులని నమ్మే వారిలో చాలా మందికి దూల తీరింది. వారు కాదన్నా ఎన్‌ఆర్‌సి పెట్టాలంటూ వీరంగం వేసే వారు ఉన్నారు. మోడీ గారి పాలనలో అప్పులు చేయలేదని చెప్పటం కూడా ‘సత్యవాక్పరిపాలన’లో భాగమే. నేతలు అబద్దాలు చెప్పవచ్చు, అంకెలు, అందునా రిజర్వుబ్యాంకు చెప్పదు కదా (ఏమో ఇప్పుడు దాని మీద కూడా అనుమానాలు రావచ్చు)
రిజర్వుబ్యాంకు నివేదికల్లో చెప్పిన దాని ప్రకారం 2014 మన్మోహన్‌ సింగ్‌ గారు దిగిపోయే నాటికి మన స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం :64,11,200 కోట్లు. దీనిలో స్వదేశీ 60,45,007 కోట్లు కాగా విదేశీ 3,66,193 కోట్లు.
నేను గానీ వస్తే మంత్ర దండం వేసి అప్పులు తీర్చివేస్తా, కొత్త అప్పులు చేయను, విదేశాల నుంచి నల్లధనపు నిల్వలు తెస్తా అని ఊరూ వాడా టాంటాం వేసిన నరేంద్రమోడీగారు ఎంత నల్లధనం తెచ్చారో మనకైతే తెలవదు. కానీ అప్పులు మాత్రం 2019 సెప్టెంబరు 15న ఆర్‌బిఐ ప్రచురించిన సమాచారం ప్రకారం 2019 మార్చినెల నాటికి మొత్తం అప్పును 1,02,55,099 (అరవైనాలుగు లక్షల కోట్ల నుంచి అక్షరాలా ఒక కోటీ రెండు లక్షల యాభైఐదు వేల తొంభై తొమ్మిది కోట్లకు) పెంచారు. పోనీ ఇంతా చేసి అభివృద్ధి సాధించారా అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు కూడా ఉంచకపోగా ఐదుశాతానికి లోపుగా దిగజార్చారు.
ఎడా పెడా విదేశాలకు ఎందుకు తిరుగుతున్నారు ప్రధాని గారూ అంటే దేశ పలుకుబడి పెంచటానికి అని చెప్పారు. ఆయన భక్తులైతే మోడీ పలుకుబడితో రాయితీలతో కూడిన అప్పులను పెద్ద మొత్తంలో తెస్తున్నారని భజన చేశారు. ఇది కూడా అబద్దమే. మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో విదేశీ రుణాల(అన్ని రకాలు కలిపి)లో రాయితీలతో ఉన్న మొత్తం 35.8శాతం నుంచి 10.4శాతానికి పడిపోయింది. విదేశాల్లో పలుకు బడి పెంచి, విశ్వసనీయతను పెంచామని చెప్పిన మోడీ గారి ఏలుబడిలో 2019 నాటికి ఆ మొత్తం 8.7శాతానికి పడిపోయింది. విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచుతామని చెప్పారు.
2014-15లో (మోడీగారి తొలి ఏడాది) రూపాయల్లో అన్ని రకాల విదేశీ పెట్టుబడుల ప్రవాహ విలువ రూ.4,49,072 (డాలర్లలో 73456 మిలియన్స్‌) ఉండగా 2019 మార్చినాటికి ఆ మొత్తాలు రూ.2,12,179 కోట్లకు(30094 మిలియన్‌ డాలర్లు) పడిపోయింది. ట్రంప్‌తో సహా విదేశీ నేతలందరినీ కౌగలించుకోవటం, ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయని ఫొటోలకు ఫోజులివ్వటం తప్ప ఎందుకు విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయో ఎవరైనా చెప్పగలరా ? మన ఆర్ధిక వ్యవస్ధ మీద, దాన్ని నడిపించే నరేంద్రమోడీ మీద విశ్వాసం తగ్గటానికి ఇది సూచిక కాదా ? గత ఆరు సంవత్సరాలలో ముస్లిం, క్రైస్తవ మైనారిటీల వ్యతిరేకతను రెచ్చగొట్టటం, భావోద్వేగాలను రేకెత్తించటం మీద పెట్టిన శ్రద్ద ఆర్ధిక వ్యవస్ధను బాగు చేసేందుకు పెట్టి ఉంటే ఇలా జరిగేదా ? మోడీ అభిమానులు వెనక్కు తిరిగి ఆలోచిస్తారా ?

Image result for modi governance cartoons
మోడీ ఏలుబడిలో ఉపాధి తగ్గిందా పెరిగిందా ! ఆర్‌బిఐ సమాచారం ఏమి చెబుతోంది !
భజన బృందం అంటే చెవుల్లో పూలు పెట్టుకొని ఎలా చేయమంటే అలా భజన చేస్తుంది. కానీ అందరికీ కుదరదే. దేశంలో ఎందరికీ ఉపాధి కల్పించారన్నది ఒక బ్రహ్మపదార్ధం. రిజర్వుబ్యాంకు కమ్యూనిస్టు సంస్ధ కాదు, దానిలో పని చేసే వారు తుకడే తుకడే గ్యాంగ్‌ కాదు. 2019 సెప్టెంబరు మాసాంతానికి ఆర్‌బిఐ అందించిన సమాచారంలో ఉపాధి గురించి ఈ అంశాలున్నాయి.
1996-97లో ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య దేశ చరిత్రలో గరిష్టం : 195.6లక్షలు
2011-12 నాటికి ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య :176.1లక్షలు
1996-97లో ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 86.9లక్షలు
2011-12 నాటికి ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య :119.7లక్షలు
1996-97లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 374.3లక్షలు
2011-12 లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 401.7లక్షలు
2011-12 తరువాత ప్రభుత్వ రంగం, ప్రయివేటు రంగంలో ఎంతెంత మంది ఉన్నారో విడివిడిగా లెక్కలు లభ్యం కాలేదని ఆర్‌బిఐ పేర్కొన్నది. అయితే మొత్తంగా రిజిస్టర్లలో ఉన్న సంఖ్య సంవత్సరాల వారీ దిగువ విధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ సమాచారాన్ని ఉటంకిస్తూ ఆర్‌బిఐ తన గణాంక పుస్తకంలో పేర్కొన్నది.
2012-13లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 447.9లక్షలు
2013-14లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 468 లక్షలు
2014-15లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 482.6 లక్షలు
2015-16లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 435 లక్షలు
తరువాతి సంవత్సరాల సమాచారాన్ని ఆర్‌బిఐ ఇవ్వలేదు.

Image result for modi governance cartoons
ధరల పెరుగుదల లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, దానికి రుజువుగా ద్రవ్యోల్బణం ఎంత తక్కువ ఉందో చూసుకోమంటారు. 2014 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో వినియోగదారుల ధరల సూచిక 112.2 కాగా 2019 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో అది 139.6కు పెరిగింది. తరువాత 2020జనవరి నాటికి 145.7కు పెరిగింది. దీన్నేమంటారు ? ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు, కొంత మేరకు చెల్లించే యాజమాన్యాలుంటే కార్మికులకు కరవు భత్యం పెరుగుతుంది. అసంఘటిత రంగంలోని కార్మికులు, ఇతరులు, నిరుద్యోగల పరిస్దితి ఏమిటి ? కాబట్టి భక్తులారా గుడ్డి అభిమానం లేదా దురభిమానంతో మీరు ఎలాగైనా రెచ్చిపోవచ్చు, సామాన్యులారా మోడీ ఏలుబడి గురించి మీకై మీరు నిర్ణయించుకోవచ్చు. దీనిలో పేర్కొన్న అంకెలు వాస్తవం కాదని ఎవరైనా నిరూపిస్తే సంతోషం, లేకపోతే స్వంత బుర్రలతో ఆలోచించటం ప్రారంభించండి, ఇంతకంటే దేశభక్తి మరొకటి లేదు. నేనైతే రాసిన దానికి కట్టుబడి ఉన్నా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ : కాసుల లాభనష్టాల బేరీజులో కార్పొరేట్‌ లోకం !

09 Sunday Feb 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus, Coronavirus and pharmaceutical companies, Coronavirus outbreak, Novel Coronavirus, Wuhan

Image result for coronavirus corporates making profit and loss impact assessment

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు చైనా తన సర్వశక్తులను వడ్డుతోంది.కరోనా లేదా మరొక వైరస్‌ దేనికీ జాతి, మతం, రంగు, ప్రాంతం, ఖండం అనే విచక్షణ ఉండదు, సరిహద్దులను అసలే ఖాతరు చేయదని గతంలో వ్యాప్తి చెందిన అనేక వైరస్‌లు నిరూపించాయి. అందువలన అలాంటి వాటిని నిరోధించేందుకు యావత్‌ దేశాలు కృషి చేయాల్సి వుంది. కానీ అమెరికా వంటి కొన్ని రాజ్యాలు సహకరించకపోగా తప్పుడు ప్రచారాన్ని వ్యాపింప చేస్తున్నాయి. మరోవైపు వైరస్‌ వ్యాప్తివలన చైనా, ప్రపంచానికి కలిగే ఆర్ధిక నష్టం గురించి లెక్కలు వేసుకుంటున్నాయి. వాటి గురించి కూడా అతిశయోక్తులు, అర్ధ సత్యాలను వ్యాప్తి చేస్తున్నారు. మరికొందరు ప్రబుద్దులు చైనా కమ్యూనిస్టు పార్టీ, అక్కడి సోషలిస్టు వ్యవస్ధ మీద ఉన్న కసిని కరోనా పేరుతో తీర్చుకొని మానసిక సంతృప్తిని పొందుతున్నారు. ఒకవైపు వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు దాన్నుంచి లాభాలను ఎలా పిండుకోవాలా అని ఔషధ దిగ్గజ సంస్ధలు చూస్తున్నాయి.
ఆర్ధిక నష్టం గురించి ఎవరూ ఇదమిద్దంగా అంచనా వేయలేదు. వైరస్‌ ప్రభావం ఎంతకాలం ఉంటుంది, దాని తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది అనేది కూడా ఇప్పటికిప్పుడే చెప్పలేరు. కరోనాతో నిమిత్తం లేకుండానే సోవియట్‌ యూనియన్‌ మాదిరి చైనా సోషలిస్టు వ్యవస్ధ కూడా కుప్పకూలిపోతుందని అనేక మంది కలలు కన్నారు, ఆకాంక్షించారు. ముహార్తాలు కూడా పెట్టారు. అవి నిజం గాకపోవటంతో నీరసపడిపోయారు. ఇప్పుడు కరోనా కూడా అలాంటి వారిని నీరసపరచటం ఖాయం.
ప్రపంచ కార్పొరేట్ల పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ‘ ఆసియా నిజమైన వ్యాధిగ్రస్ధ చైనా ‘ శీర్షికతో వాల్టర్‌ రసెల్‌ మీడ్‌ అనే ఒక కాలేజీ ప్రొఫెసర్‌ తనలో ఉన్న విద్వేషాన్ని వెళ్లగక్కాడు. చైనీయులు మురికి, రోగిష్టి మనుషులనే గత కాలపు పశ్చిమ దేశాల దురహంకారం ఇంకా కొనసాగుతోందనేందుకు ఇది ఒక సూచిక. దీని మీద తీవ్రమైన ఆగ్రహం వెల్లడైంది, చైనా అధికారికంగా నిరసన కూడా తెలిపింది. వాటి మీద వ్యాఖ్యానించేందుకు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నిరాకరించింది. శ్వేతజాతీయులకు వచ్చే రోగాల కంటే చైనీయులు, ఇతర ఆసియావాసులకు వచ్చే జబ్బులు ప్రమాదకరమైన వంటూ పందొమ్మిదవ శతాబ్దంలోనే పశ్చిమ దేశాల వారు జాత్యంహకారం వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కరోనాను కూడా చైనా జాతికి అంటకట్టే ప్రయత్నం జరుగుతోంది.
చైనా నిపుణుల అంచనా ప్రకారం ఫిబ్రవరి 15వరకు వైరస్‌ వ్యాప్తి చెందవచ్చు, తరువాత తగ్గుముఖం పడుతుంది. మేనెల మధ్యనాటికి పూర్తిగా అదుపులోకి వస్తుంది.ఈ లోగా చైనా ఆర్ధిక వ్యవస్ధకు జరిగే పరిమిత హాని తరువాత కాలంలో పూడ్చుకోవచ్చు. ఎంత ప్రభావం పడినా చైనా జిడిపి 5.6-5.8శాతం మధ్య వుండవచ్చని అంచనా వేస్తున్నారు.

Image result for coronavirus, corporates cartoons
కరోనా వైరస్‌ ప్రస్తుతం సోకిన ప్రాంత విస్తీర్ణం ఎంత? ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 70శాతం ఉహాన్‌ నగరం ఉన్న హుబెరు రాష్ట్రంలోనే ఉన్నాయి. మరణించిన వారిలో 97శాతం మంది ఈ రాష్ట్రానికి చెందిన వారే. తరువాత తూర్పు రాష్ట్రమైన ఝియాంగ్‌లో వెయ్యిలోపు కేసులు నమోదయ్యాయి. వలస వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉండే బీజింగ్‌, షాంఘై నగరాలలో ఒక్కొక్కరు మాత్రమే మరణించారు. చైనా జిడిపి తొలి మూడు నెలల్లో 5.2శాతం ఉంటుందని, తరువాత ఏడాది మొత్తం 5.8శాతం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కనిష్టంగా తొలి త్రైమాసికంలో 4.8శాతం, మొత్తం ఏడాదిలో 5.5శాతం ఉంటుందని మరొక అంచనా.చైనాలో అందరూ చెబుతున్నంత అభివృద్ధి లేదని, అంకెల గారడీ చేస్తారని చెప్పే నోళ్లు దీని గురించి ఏమంటాయో తెలియదు.
ఉహాన్‌ పరిసర ప్రాంతాలలో ఆటో, టెలికమ్యూనికేషన్స్‌,ఎలక్ట్రానిక్స్‌, బయోమెడిసిన్‌ సంబంధమైనవి పెద్ద పరిశ్రమలు.హుబెరు రాష్ట్రం, ఉహాన్‌ నగర ప్రాధాన్యత ఏమంటే దేశం మధ్యలో ఉండటంతో రవాణా, వాణిజ్యం, పెట్టుబడులు, టూరిజం వంటి సేవారంగం కీలకమైన అంశాలు. ఒకసారి వ్యాధి వ్యాప్తి అదుపులోకి వచ్చిన తరువాత అవన్నీ సాధారణ స్ధితికి చేరుకుంటాయి.
2003లో సారస్‌ వ్యాప్తి సమయంలో ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా కేవలం ఐదుశాతమే, ఇప్పుడు 16శాతానికి పెరిగినందున ప్రభావం ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఇటీవలి సంవత్సరాలలో చైనాలో వచ్చిన ప్రధాన మార్పుల్లో స్ధానిక వినియోగం పెరగటం ఒకటి. అందువలన మార్కెట్‌ చోదిత పెట్టుబడులు వెనక్కు పోవటం సాధ్యం కాదన్నది ఒక అభిప్రాయం. చైనాలో కార్మికుల వేతనాలు పెరగటం తదితర ఉత్పాదక ఖర్చుల పెరుగుదల కారణంగా లాభాలు తగ్గి ప్రస్తుతం విదేశీ పెట్టుబడులలో 70శాతం ఉత్పాదక రంగం నుంచి సేవారంగానికి మరలాయి. వ్యాధి తగ్గుముఖం పట్టిన తరువాత సేవారంగం తిరిగి పుంజుకుంటుంది. అందువలన తాము ఎలాంటి ఆందోళనకు గురికావటం లేదని చైనీయులు చెబుతున్నారు. ఇప్పటికే గట్టిగా తట్టుకొని నిలిచిన తమ సమాజాన్ని వ్యాధి గ్రస్త దేశమని నోరు పారవేసుకుంటున్నవారు త్వరలో వైరస్‌ను ఎలా ఓడిస్తామో కూడా చూస్తారనే విశ్వాసాన్ని వెల్లడిస్తున్నారు.
చైనా వ్యాధి నిరోధకానికి ప్రాధాన్యత ఇస్తున్నది. గతంలో స్పానిష్‌ ఫ్లూ వంటి ప్రమాదకర వైరస్‌ వ్యాప్తి సమయంలో అమెరికాతో సహా ఏ దేశంలోనూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. హుబెరు రాష్ట్రం, పరిసర ప్రాంతాలలో దాదాపు పది కోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసి వ్యాధి వ్యాపించకుండా చూస్తున్నది. వారికి అవసరమైన ఇతర సాయం చేస్తున్నది. ఇంత పెద్ద సంఖ్యలో జనం ఇండ్లకే పరిమితం అయితే అది ఆర్దిక వ్యవస్ధ మీద, ప్రభుత్వ ఖజానా మీద ప్రభావం చూపకుండా ఎలా ఉంటుంది. చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా, విడివస్తువులను అందచేసే గొలుసులో ఒక ప్రధాన లంకెగా ఉన్నందున ఆ గొలుసులో ఉన్న ఇతర దేశాలు కూడా ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ఎలా ఉంటాయి. కనుకనే కార్ల నుంచి వీడియో గేమ్‌ల వరకు ప్రపంచ సరఫరా గొలుసుకు అంతరాయం కలిగితే తీవ్ర నష్టం జరగనుందని అనేక దేశాలు భయపడుతున్నాయి. అయితే జరిగే నష్టం, పడే ప్రభావం ఎంత ఉంటుందో ఎవరూ ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు. లండన్‌ కేంద్రంగా పని చేసే కాపిటల్‌ ఎకనమిక్స్‌ అనే సంస్ధ ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు 280బిలియన్‌ డాలర్ల మేర నష్టం కలిగించవచ్చని అంచనా వేసింది.
షాంఘై, హాంకాంగ్‌లోని వినోద కేంద్రాలను గత వారం రోజులుగా మూసివేసిన కారణంగా రెండవ త్రైమాసికంలో తమ ఆదాయం 17.5కోట్ల డాలర్లు తగ్గిపోవచ్చని డిస్నీ ఆర్ధిక అధికారి చెప్పారు.చైనా నూతన సంవత్సరాది సందర్భంగా విడుదల చేయదలచిన ఐదు చిత్రాలను నిలిపివేసినట్లు కెనడా కంపెనీ ఐమాక్స్‌ పేర్కొన్నది. చైనాలోని మకావో దీవిలో 41కాసినోలను మూసివేశారు. వీటిలో ఎక్కువ భాగం అమెరికా జూదశాలలే. ప్రతి రోజూ తమకు 24 నుంచి 26 మిలియన్‌ డాలర్ల మేరకు నష్టమని వయన్‌ రిసార్ట్స్‌ తెలిపింది.
ఆపిల్‌,క్వాల్‌కామ్‌ కంపెనీలు తమ నష్టాలను అంచనా వేస్తున్నాయి. హుండరు వంటి కార్ల కంపెనీలు చైనా నుంచి విడిభాగాలు ఆలస్యమయ్యే కారణంగా దక్షిణ కొరియాలో ఉత్పత్తి కేంద్రాలను తాత్కాలిక మూసివేస్తున్నట్లు తెలపింది. చైనాలో పరిస్ధితులు మెరుగుపడుతున్నట్లు చైనా ప్రభుత్వం చెప్పగానే వారం రోజులు తిరిగి ఉత్పత్తిని ప్రారంభిస్తామని డైల్మర్‌, ఓక్స్‌వాగన్‌ ప్రకటించాయి. విడిభాగాల సరఫరా అంతరాయం కారణంగా ఐరోపాలోని తమ ఉత్పత్తి కేంద్రాలకు అంతరాయం ఉంటుందని ఫియట్‌ ఛిస్లర్‌ పేర్కొన్నది.
గత కొద్ది వారాలుగా అనేక విమాన సంస్ధలు చైనా సర్వీసులను రద్దు చేశాయి, వాటి నష్టాలను అంచనా వేస్తున్నారు. ఎయిర్‌ చైనా ఎక్కువగా ఆదాయాన్ని కోల్పోనుంది.స్టార్‌బక్స్‌ మెక్‌డోనాల్డ్‌ వంటి సంస్ధలు అనేక దుకాణాలను తాత్కాలికంగా మూసివేశాయి, మొత్తంగా చూస్తే తమ లాభాల మీద ప్రభావం పెద్దగా పడదని అంటున్నాయి.
వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాలలో కార్మికుల కొరత కారణంగా వేతనాలు పెద్ద ఎత్తున పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నూతన సంవత్సరాది సెలవులు, ఇదే సమయంలో వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా ఇండ్లకు పరిమితమై విధుల్లోకి రాని కార్మికులకు పొడిగించిన సెలవు రోజులకు సైతం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనా నుంచి పర్యాటకులను అనుమతించరాదని థారులాండ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన విహారయాత్రల రంగానికి 10కోట్ల డాలర్ల మేర నష్టమని అంచనా వేశారు.
వైరస్‌ వార్తలు వెలువడిన తరువాత న్యూయార్క్‌, లండన్‌లోని చమురు మార్కెట్‌లో ధరలు 15శాతం పడిపోయాయి. చమురు ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలున్న రష్యా, మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా, గల్ఫ్‌ , ఇతర దేశాలకు, చివరికి అమెరికాలోని షేల్‌ చమురు కంపెనీలకు కూడా ఆ మేరకు నష్టం ఉండవచ్చు. ఇదే సమయంలో దిగుమతులపై ఆధారపడిన చైనాకు దిగుమతి బిల్లుతో పాటు అంతర్గతంగా చమురు డిమాండ్‌ తగ్గిపోయి అక్కడి ఆర్ధిక వ్యవస్ధకు ఆమేరకు లబ్ది కూడా చేకూరనుంది.
అమెరికా-చైనా మధ్య కుదిరిన సర్దుబాటు అవగాహన మేరకు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ పెరిగే అవకాశాలకు ఇప్పుడు పరిమితంగా అయినా గండి పడింది. వైరస్‌ కారణంగా చైనాలో పరిశ్రమలు మూతపడితే ఆ మేరకు తమకు ఉపాధి, ఇతరత్రా మేలు జరుగుతుందని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి విల్బర్‌ రోస్‌ సంతోషం వ్యక్తం చేశారు, అయితే మొత్తంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధకూ ప్రతికూలమే అని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. చైనా యువాన్‌ విలువ పడిపోతే అది అమెరికాకు దెబ్బ.

Image result for coronavirus political cartoons
చైనాతో పెద్దవ్యాపార భాగస్వామిగా ఉన్న మనదేశం మీద పడే ప్రభావం గురించి కూడా కార్పొరేట్‌ సంస్ధలు మదింపు వేస్తున్నాయి. మన దేశం గతేడాది మొత్తం దిగుమతుల్లో 14శాతం చైనా నుంచి తీసుకోగా ఎగుమతుల్లో మన వస్తువులు ఐదుశాతం చైనా వెళ్లాయి. ఆకస్మిక పరిణామంగా వైరస్‌ వ్యాప్తి వలన వెంటనే దిగుమతుల ప్రత్నామ్నాయం చూసుకోవటం అంత తేలిక కాదు, అదే సమయంలో పరిమితమే అయినా అసలే ఇబ్బందుల్లో ఉన్న మన ఆర్ధిక పరిస్దితి మీద ఎగుమతులు తగ్గితే ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్‌మీద ప్రభావం ఎక్కువ. చైనా నుంచి పర్యాటకులు ఇటీవలి కాలంలో బాగా పెరిగినందున ఆ రంగం మీద ప్రభావం తీవ్రంగా పడవచ్చు, విమానరంగం కూడా ప్రభావం కానుంది. చైనాలో వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా పెద్ద సంఖ్యలో సినిమా ధియేటర్లను మూసివేసినందున బాలీవుడ్‌ కూడా ఏంతో కొంత నష్టపోనుంది. అసలే కార్లు, ఇతర మోటారు వాహనాల అమ్మకాలు తగ్గాయి, ఇప్పుడు చైనా నుంచి విడిభాగాలు నిలిచిపోతే నష్టం ఇంకా పెరుగుతుందనే అందోళన ఉంది.
కరోనా వైరస్‌ గురించి ఒకవైపు అతిశయోక్తులు, చైనా వ్యతిరేకతను ప్రచారం చేస్తున్న పశ్చిమ దేశాలు మరోవైపు దాన్నుంచి లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నాయి. వ్యాధుల నివారణ, చికిత్సకు వాక్సిన్‌లు, ఔషధాల తయారీ అవసరమే అయితే అయితే చరిత్రను చూసినపుడు జన కల్యాణం కోసం గాక కాసుల కోసమే కార్పొరేట్‌ కంపెనీలు ప్రయత్నించాయి. కరోనా వైరస్‌ వాక్సిన్‌ తయారీకి కొన్ని సంవత్సరాలు పడుతుందని, అందుకోసం వంద కోట్ల డాలర్లు ఖర్చవుతుందని పోలాండ్‌ నిపుణుడు ఒకరు చెప్పగా మరొక అంచనా 150 కోట్ల డాలర్ల వరకు ఉంది. అది ఎంతో ఖరీదైనదిగా ఉన్నప్పటికీ, తక్షణమే అది ఉపయోగంలోకి రాకపోయినా భవిష్యత్‌లో నష్టాల నివారణకు తోడ్పడుతుంది. అయితే ఇలాంటి వైరస్‌ల నిరోధానికి వాక్సిన్‌ల తయారీ యత్నాలు గతంలో పెద్దగా ముందుకు సాగలేదు. 2003లో వచ్చిన సారస్‌, 2012లో తలెత్తిన మెర్స్‌కే ఇంతవరకు తయారు కాలేదు. ఎబోలా వాక్సిన్‌ పరిస్దితీ అంతే. గతేడాది ఆమోదం పొందిన వాక్సిన్‌ మీద ప్రయోగాలు చేసేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తాలినోమిక్స్‌ : మోడీ మజిలీలో మరో కాకమ్మ కథ !

03 Monday Feb 2020

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

modinomics, Narendra Modi Achhedin, pakodanomics, Thalinomics

Image result for thalinomics"

ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ ”సుప్రసిద్ధ ఆర్ధికవేత్త ”, కాదని ఎవరైనా అంటే సంఘపరివారం రంగంలోకి దిగి కాళ్లు, చేతులు విరగ్గొడుతుంది. పోలీసులు చూస్తుండగానే తుపాకులతో కాల్పిస్తుంది( న్యూఢిల్లీ షాహిన్‌ బాగ్‌ మోడల్‌). ఆ పెద్దమనిషి కేవలం ఒక ప్రధాన మంత్రి మాత్రమే కాదు, తలచుకుంటే ఫిరంగులు, ట్యాంకులు, విమానాలు, అణ్వాయుధాలతో నిమిత్తం లేకుండా ”నోటి మాటల”తో ఇరుగు పొరుగుదేశాల మీద యుద్ధం చేసి ఓడించగల యోధుడు. మోడినోమిక్స్‌ ద్వారా ఒక్క భారత్‌కే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్ధిక వృద్ధికి ఆయన చేసిన కృషికి 2018 సియోల్‌ శాంతి బహుమతి పొందినట్లు మన విదేశాంగశాఖ స్వయంగా ప్రకటించింది. అర్ధశాస్త్ర పట్టా పుచ్చుకున్న మన్మోహన్‌సింగ్‌ అమాయకుడు, పదేండ్లు పదవిలో ఉండి కూడా ఒక్క మామూలు అవార్డును కూడా పొందలేకపోయారు. విదేశాంగశాఖ చెప్పినదాని ప్రకారం ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును పొందిన, తొలిభారతీయుడిగా కేవలం మూడున్నర సంవత్సరాలలో మోడీ ఆ ఘనతను సాధించారంటే మామూలు విషయమా ? మోడీ నిజం, గతేడాది ఎన్నికల ముందు ఫిబ్రవరిలో ఆ అవార్డును పుచ్చుకున్నది వాస్తవం.
” అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచేందుకు ఆయన అంకిత భావం, ప్రపంచ ఆర్ధిక వృద్ధి పెంపుదల, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ది పెంపుదలతో భారత పౌరుల మానవాభివృద్ధికి కృషి, అవినీతి వ్యతిరేక మరియు సామాజిక ఏకీకరణం ద్వారా ప్రజాస్వామ్యం మరింతగా అభివృద్ధి చెందించే ప్రయత్నాలకు గుర్తింపు ఇది, క్రియాశీలకమైన విదేశాంగ విధానంతో ప్రపంచ వ్యాపితంగా వున్న దేశాలతో వ్యవహరించి మోడీ సిద్దాంతాలు, ఆసియా పసిఫిక్‌ దేశాలతో సానుకూల విధానంతో ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతికి ప్రధాని చేసిన కృషిని కూడా ఎంపిక కమిటీ గుర్తించింది ” అని కూడా మన విదేశాంగశాఖ ప్రకటన పేర్కొన్నది.అలాంటి మేథావి ఏలుబడిలో దేశం అథోగతిలోకి పోవటం ఏమిటో ఎంత ఆలోచించినా తాజా ఆర్దిక సర్వే మాదిరి అర్ధం కావటం లేదు.
నరేంద్రమోడీకి ఈ అవార్డు ఇవ్వటం అంటే గతంలో దాన్ని పుచ్చుకున్న ప్రముఖులందరనీ అవమానించటమే అని దక్షిణ కొరియా మానవహక్కుల సంఘాల వారు అక్కడి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆర్ధిక విషయాలలో ఆయన సాధికారత గురించి గాక అధికారంలో ఉండి 2002లో గుజరాత్‌లో కావాలనే ముస్లింలపై దాడులను అనుమతించారన్నది వారు చెప్పిన కారణం.
ప్రధాని మోడినోమిక్స్‌ ఉద్యోగాల విషయం అడగ్గానే పకోడనోమిక్స్‌గా మారింది. ఇన్ని గ్యాస్‌ కనెక్షన్లిచ్చాం, ఇన్ని మరుగుదొడ్లు కట్టించాం అని పాడిందే పాట ఎన్ని రోజులు పాడతారు ! అందుకే మోడీ భక్తులకు మరో నినాదాన్ని యంత్రాంగం అందించింది. అదే తాలినోమిక్స్‌. రానున్న రోజుల్లో ఇంకే మిక్స్‌ వస్తాయో తెలియదు. ఆరు సంవత్సరాలు కూడా గడవక ముందే ఇన్ని ఆర్ధిక విధానాలతో ఏ దేశాన్ని అయినా, ఏ ప్రధాని అయినా ఇన్ని గంతులు వేయించారా ? లేదు, కచ్చితంగా లేరు. మామూలు వారికి ఇది సాధ్యమా అంటే వెంకయ్య నాయుడు చెప్పినట్లు మోడీ వంటి దేవదూతలకు తప్ప ఇతరులకు సాధ్యం కానే కాదు అని చెప్పాలి. అనగా అనగా ఒక ప్రధాని అని భవిష్యత్‌లో ఎవరైనా కథలు, గాధలు చెప్పుకోవాలంటే వారికి విషయాలు తెలియాలి గనుక క్లుప్తంగా అయినా కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పుకుందాం.
మోడినోమిక్స్‌ గురించి గతంలో గొప్పగా పొగిడి, ఆహా ఓహౌ అన్నవారందరూ ఇప్పుడు నత్తి నత్తిగా మాట్లాడుతున్నారు. ఊరించిన ఉద్యోగాలెక్కడ మగానుభావా అని అడిగితే లెక్కలు కట్టటంలో మనవాళ్లు ఉత్తవెధవాయలు, పకోడీలు అమ్ముకొనే వారికి కూడా ఉపాధి కల్పించినట్లే కదా అలాంటి వారి లెక్కలన్నీ వేయలేదు అని స్వయంగా మోడీగారు 2018లో సెలవిచ్చిన విషయం, అది పకోడానోమిక్స్‌గా ప్రాచుర్యం పొందిన సంగతి మరోసారి గుర్తు చేస్తే మోడీ భక్తులు విరుచుకుపడతారు. తమ ప్రధాని కల్పించిన ఉపాధిలో భాగంగా పకోడీలు, బజ్జీలు, గుంటపునుగులు, పులిబొంగరాలు వేసుకొని బతుకుతున్నవారెందరో రెండు సంవత్సరాల తరువాత కూడా ఆయన అధికార యంత్రాంగం చెప్పలేకపోయింది. ఆఫ్టరాల్‌ మా ఐదు రూపాయల బిస్కెట్‌ పాకెట్‌కొనేందుకు సైతం వినియోగదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారని బ్రిటానియా కంపెనీ ఎండీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాంటిది అంతకంటే ఎక్కువ వెల ఉండే పకోడీలు, బజ్జీలు తినే వారెందరన్నది అడగకూడని ప్రశ్న.

Image result for thalinomics cartoons"
మోడీ గారు అచ్చేదిన్‌ గురించి 2014ఎన్నికల సమయంలో ఎన్నో కబుర్లు చెప్పారు, తరువాత అసలు వాటి ఊసే ఎత్తలేదు. కానీ చడీ చప్పుడు లేకుండా జనానికి మంచి రోజులు ఎలా వచ్చాయో బడ్జెట్‌కు ముందు వెల్లడించిన ఆర్ధిక సర్వేలో మోడీ యంత్రాంగం ఎంతో వినమ్రంగా చెప్పింది. బహుశా కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో అలా ఉందేమో వాట్సప్‌ యూనివర్సిటీ పండితులు చెప్పాలి. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది గానీ కొద్ధి సంవత్సరాల క్రితం వరకు పట్టణాలలో శాఖాహారానికి ఆర్యవైశ్య లేదా బ్రాహ్మణ భోజన హౌటళ్లు అని పేరు పెట్టే వారు. మాంసాహార హౌటళ్లకు మిలిటరీ అని తగిలించే వారు. అధికార యంత్రాంగానికి కనిపించిన దృశ్యాలు, వినిపించిన మాటలు, సేకరించిన లెక్కలు వెల్లడించిన దాని ప్రకారం మోడీ గారి పాలనలో 2019-20లో ధరలు కాస్త పెరిగినా 2015-16 నుంచి అప్పటి వరకు ఆర్యవైశ్య భోజనం మరియు మిలిటరీ భోజనం చేసే వారికి రోజులు బాగున్నాయట. 2014లో అధికారానికి వచ్చిన తరువాత మోడీ సర్కార్‌ తెచ్చిన అనేక సంస్కరణ చర్యలు, పెరిగిన వ్యవసాయ ఉత్పాదకత సామర్ధ్యం, ధరల పారదర్శకతకు వ్యవసాయ మార్కెట్‌లు బాగా పని చేసిన కారణంగా సగటు పారిశ్రామిక కార్మికుల పరిస్ధితి ఏ భోజనం కావాలంటే దాన్ని పొందేవిధంగా తయారైందట. ఎలా ?
2006-07 నుంచి 2019-20 మధ్యకాలంలో కార్మిక కుటుంబాలకు శాఖాహారం అందుబాటులోకి రావటం 29శాతం, మాంసాహారం 19శాతం పెరిగిందట.మోడీ గారు అధికారానికి రాక ముందు మాదిరి ధరలు పెరుగుతూనే ఉంటే ఐదుగురు సభ్యులున్న ఒక కుటుంబం ఏడాదికి అదనంగా శాఖాహారం మీద అయితే సగటున రూ.10,887, మాంసాహారానికి రూ. 11,787 అదనంగా ఖర్చు అయ్యేదని, మోడీ గారు వచ్చి తీసుకున్న చర్యల కారణంగా ధరలు తగ్గినందున ఆమేరకు ఆదా అయినందున అంత మొత్తం ఏడాదికి వచ్చిన లబ్దిగా పరిగణించాలట.
జనమంతా చెవుల్లో కమలం పూలు పెట్టుకొని వింటున్నారనే అంచనాతో ఇలాంటి కబుర్లు చెబుతున్నారా ? లేకపోతే ఈ కథలేమిటి? నిరుద్యోగం నాలుగున్నరదశాబ్దాల రికార్డు స్ధాయిలో ఆరున్నరశాతం పెరిగిందేమంటే లెక్కలన్నీ తప్పు అంటిరి. మరోవైపు ఈ లబ్ది కబుర్లకు ఆధారాలేమిటి? నిరుద్యోగం గురించి అయినా నిత్యావసర వస్తువుల గురించి అయినా అదే యంత్రాంగం సేకరించిన అంకెలే కదా ? నిరుద్యోగం విషయంలో తప్పుడు లెక్కలైతే మరి ఈ తాలినోమిక్స్‌ గణాంకాలకు ఆధారం ఏమిటి, లబ్ది వచ్చిందని ఎలా చెబుతారు. పోనీ నాలుగేండ్లు ధరలు తగ్గించిన పెద్దలు ఐదవ ఏడాదిలో ఎందుకు పెంచినట్లు? ఈ కాలంలో నిజవేతనాలు పడిపోయాయని అంకెలు ఘోషిస్తున్నాయి. ఆహార ఖర్చు తగ్గి ఆదా అయితే ఆ సొమ్మును ఇతర వస్తువుల కొనుగోలుకు వినియోగిస్తారు, అంటే వస్తు వినియోగం పెరుగుతుంది. మరో వైపున వినియోగం తగ్గి మాంద్యంలోకి పోలేదు గానీ మందగించిందని కేంద్ర మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతారు. పాలనను పక్కన పెట్టి సుమతీశతకాన్ని బట్టీ పట్టి ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకోవటం అంటే ఇదేనా !
కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా వినియోగదారుల ధరల సూచికను ప్రకటిస్తుంది, దాని ప్రాతిపాదికన పెరుగుదలకు అనుగుణ్యంగా కరవు( ధరల) భత్యం చెల్లిస్తుంది. తాలినోమిక్స్‌కు గణాంకాలను తీసుకున్న 2006 నుంచి 2018 వరకు వార్షిక సగటు 123 పాయింట్ల నుంచి 294.33 వరకు పెరిగింది. దీనిలో నరేంద్రమోడీ ఖాతాలో 2014లో 246.91నుంచి వేయాల్సి ఉంది. ధరలు నిజంగా తగ్గితే మరి సూచిక ఎలా పెరిగినట్లు ? ఎక్కువా, తక్కువా అన్నది తప్ప ఏ ఒక్క సంవత్సరం కూడా సూచిక నిలకడగా లేదా అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే తగ్గిన దాఖలాలు లేవు. అలాంటపుడు తాలి లెక్కలు మాత్రమే కట్టి భారం తగ్గింది లేదా దాన్నే లబ్ది అనుకోమంటే ఎలా? వినియోగదారుల ధరల సూచిక, కరవు భత్యం లెక్కింపు వాస్తవాలను ప్రతిబింబించటం లేదని ఉద్యోగ, కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాయి. పెరిగిన ఇతర వస్తువులు, సేవల మాటేమిటి ? వాటి భారం ఎంతో జనానికి చెప్పాలా లేదా ? 2016 జూలైలో రెండుశాతం పెరిగిన డిఏ 2017 జనవరికి నాలుగు అయింది. 2018 జనవరికి 7, 2019 జనవరికి 12శాతానికి పెరిగింది. అయితే 2019 జూలైకి ఏకంగా 17శాతం అయింది. అంతకు ముందు ఆరు విడతల సగటు రెండుశాతం అయితే 2019 మొదటి ఆరునెలల్లో అది ఐదుశాతానికి చేరింది. జూలై నుంచి డిసెంబరుకు మరో నాలుగుశాతం ఖరారు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ఒక్క ఏడాదిలోనే తొమ్మిదిశాతం అంటే మూడు సంవత్సరాల పొదుపు లేదా లబ్ది ఒక్క ఏడాదిలో కొట్టుకుపోయినట్లే కదా !

Image result for thalinomics cartoons"
ధరలు తగ్గి ఆహారం అందుబాటులోకి వచ్చిందని అనుకుంటే మరోవైపున దేశంలో ఆకలి సూచిక సంగతేమిటి? 2017,18,19 సంవత్సరాలలో ఆహార సూచికలో విశ్లేషణలోకి తీసుకున్న 117 దేశాలలో మన దేశం 100,103,102 స్ధానాల్లో ఉంది. ఇదెలా ? మెరుగుపడాల్సిందిపోయి దిగజారటం ఏమిటి ? పొద్దున్న లేస్తే పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, వాటి దారిద్య్రం గురించి చెబుతారు. ఆకలి సూచికలో శ్రీలంక 66, మయన్మార్‌ 69, నేపాల్‌ 73, బంగ్లా 88, పాకిస్ధాన్‌ 94వ స్ధానాల్లో ఉన్నాయి. ఈ సూచికను చూసి లెక్కలు సరిగా వేయలేదని మన నీతి ఆయోగ్‌ అధికారులు చిర్రుబుర్రులాడతారు. ఒక ఏడాది అనుభవం చూసిన తరువాత అయినా సూచిక తయారు చేసే వారికి సరైన వివరాలు ఇవ్వకుండా ఏమిటీ వ్యవహారం. గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారా లేక మన అసలు సరకు ఇదేనా ?
మన పొరుగునే ఉన్న చైనా అభివృద్ది గురించి చెబితే కొంత మందికి తేళ్లు జెర్రులు పాకినట్లు ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం లేదండీ అంటారు. ఆకలి సూచికలో అది 25వ స్ధానంలో ఉంది. ఆకలి సూచిక మార్కుల ప్రాతిపదికను చూస్తే ఐదు, అంతకంటే తక్కువ వచ్చిన దేశాలకు ఒకటవ స్ధానం ఇచ్చారు. అలాంటివి 17 ఉన్నాయి. ఐదు-ఆరు మధ్య వచ్చిన దేశాలు ఐదు కాగా ఆరు-ఏడు మధ్య మార్కులు తెచ్చుకున్న ఐదు దేశాలలో చైనా 6.5 మార్కులతో మధ్యలో ఉంది. మరి మన మార్కులు 30.3, పాలకులు మన దేశాన్ని ఆఫ్రికా దేశాల సరసన నిలబెట్టారు. ప్రజాస్వామ్యం ఉన్న మన దేశంలో స్వేచ్చగా జనాన్ని ఆకలితో మాడుస్తుండగా లేదని చెబుతున్న చైనాలో , ఇరుగు పొరుగు పేద దేశాలలో బలవంతంగా కడుపు నింపుతున్నారని చెబుతారా ?
మోడినోమిక్స్‌, పకోడానోమిక్స్‌, తాలినోమిక్స్‌ అన్నింటికీ మోడీషామిక్స్‌దే బాధ్యత. జిడిపి వృద్ధి రేటు ఎందుకు పడిపోతోందో చెప్పటానికి మోడీషాలకు సందర్భమూ రాదు, నోరు అంతకంటే రాదు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రం పాకిస్ధాన్‌తో యుద్దం, ఉగ్రవాదం, తుకడే తుకడే గ్యాంగుల భాష వస్తోంది. సిఏఎ, ఎన్‌ఆర్‌సి,ఎన్‌పిఆర్‌ వంటి అంశాల మీద జనాన్ని తప్పుదారి పట్టిస్తారు గాని దిగజారుతున్న ఉన్న జిడిపి, ఎగబాకుతున్న ధరలను ఎలా దారి మళ్లిస్తారో చెప్పరు.
కేంద్ర ప్రభుత్వం సేకరించే ఆహార వస్తువుల ధరల వివరాల ప్రాతిపదిక తాలినోమిక్స్‌ను రూపొందించారు. ఆగ్రనోమిక్స్‌ ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయం ఎంతవరకు వచ్చిందో, పెట్రోనోమిక్స్‌ ద్వారా గత ఆరు సంవత్సరాలలో జనం జేబుల నుంచి ఎంత కొల్లగొట్టారో, ఏతా వాతా జనానికి ఏ విధంగా మేలు చేకూర్చారో మోడీ సర్కార్‌ జనానికి వెల్లడిస్తే అసలు విషయాలు తెలుస్తాయి. తాలినోమిక్స్‌ గురించి మరింత వివరంగా మరోసారి చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

దిగుబడుల పెరుగుదలకు దున్నకం తగ్గించాలా !

26 Thursday Dec 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Agricultural, Reduced soil tilling, Smart Agriculture, soils, yields

Image result for could Reduced soil tilling helps both soils and yields

 

 

 

 

 

 

 

 

ఎం కోటేశ్వరరావు
భూమిని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిదానికీ దున్నకూడదు, ఎంత తక్కువ దున్నితే అంతగా భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, దిగుబడులు కూడా పెరుగుతాయని తమ అధ్యయనంలో తేలిందని తాజాగా కొందరు పరిశోధకులు చెప్పారు. రైతాంగం ముఖ్యంగా మన వంటి వర్ధమాన దేశాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటం ఒక అంశమైతే, పంట మార్కెటింగ్‌ మరొక అంశం. ప్రపంచ వాణిజ్య సంస్ద ఉనికిలోకి రాక ముందే ప్రపంచీకరణ, దానిలో భాగంగా నయా ఉదారవాద విధానాలు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. మన దేశంలో ఆ విధానాలు అమలులోకి వచ్చిన 1991 తరువాత అంతకు ముందు తలెత్తినదాని కంటే వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం దానికి సూచికగానే ఆత్మహత్యలన్న విషయం తెలిసిందే. వ్యవసాయం గిట్టుబాటు కానందున అనేక మంది వ్యవసాయ మానివేస్తే, అంతకంటే ఎక్కువగా మరోపని లేక కౌలు రైతులు ఉనికిలోకి వచ్చారు. పశ్చిమ దేశాలతో పోల్చితే మన దేశంలో వ్యవసాయ కమతాల సంఖ్య, వాటి మీద పని చేసే వారి సంఖ్యా ఎక్కువే.
తాజా సమాచారం ప్రకారం మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడుతున్నవారు 58శాతం ఉన్నారు.మన కంటే వెనుకబడిన, దారిద్య్రంతో మగ్గుతున్న దే శాలలో తప్ప మరే ఇతర వర్ధమాన దేశంలో ఇంత సంఖ్యలో లేరు. గడచిన ఆర్దిక సంవత్సరంలో 28.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశాము. 2015-16లో ఒక రైతు కుటుంబ సగటు ఆదాయం రూ.96,703ను 2022-23 నాటికి రూ.2,19,724 చేస్తామని నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ వాగ్దానం చేసింది. ఇది ఎలా జరుగుతుందో ఇప్పటి వరకైతే అంతుబట్టలేదు, నరేంద్రమోడీ ఇటీవలి కాలంలో దాని గురించి మాట్లాడటం లేదు. దీని గురించి మరో సందర్భంలో చూద్దాం. మన దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు, వందల, వేల ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఐరోపా, అమెరికాల్లో ఉండే రైతుల సమస్యలు వేరుగా ఉంటాయి. అయితే దేశం ఏదైనా భూమి ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కడైనా ఒకటే. తగ్గుతున్న భూసారం, దెబ్బతింటున్న భూమి ఆరోగ్యం.ఈ సెగ మనకు తగిలిన కారణంగానే ఇప్పటికే మన రైతాంగానికి పది కోట్ల మేరకు భూ ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు. ఒక మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఈ తరం సూపర్‌ తిండి తింటున్నది కనుకనే మా తరం మాదిరి గట్టిగా ఉండటం లేదని వృద్ధులు అనటం వింటాం. దానిలో పాక్షిక సత్యం లేకపోలేదు. ఈ అంశాలన్నీ ఒక ఎత్తయితే ఇటీవలి కాలంలో భూమి ఆరోగ్యం దిగజారుతోందన్న అంశాలు రైతాంగాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. భూ ఆరోగ్య బాగుకు అయ్యే ఖర్చుకూడా రైతుమీదే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఇది మునిగే పడవకు గడ్డిపోచకూడా భారం మాదిరే అన్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా 2.4 కోట్ల ఎకరాల భూమి సారం లేనిదిగా తయారు అవుతున్నదన్నది ఒక అంచనా. ఇది ప్రపంచ ఆహార భద్రతను ప్ర శ్నార్దకం చేయటంతో పాటు భూమి మీద వత్తిడిని పెంచటంతో పాటు మన వంటి దేశాలలో రైతు మీద భారాన్ని కూడా మోపనుంది.
దీనికి రైతులు వ్యక్తిగతంగా చేయగలిగింది పరిమితం, ప్రభుత్వాలు మాత్రమే పరిష్కరించగలిగిన అంశం. వ్యవసాయ అభివృద్ధి, విస్తరణ, పరిశోధన బాధ్యతల నుంచి వైదొలిగే విధానాలు అనుసరిస్తున్న పాలకుల నుంచి ఏమి ఆశించగలమన్నది ఒక ప్రశ్న. ఈ నేపధ్యంలో ప్రపంచంలో ఏమి జరుగుతోంది, శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారో చూద్దాం. ఒక దేశంలో జరిగిన అధ్యయనాలు మరొక దేశానికి లేదా ప్రాంతానికి మక్కీకి మక్కీ వర్తించకపోవచ్చుగానీ, ఆయాదేశాల, ప్రాంతాలకు సంబంధించి ఏమి చేయాలన్నదానికి దారి చూపుతాయి.

Image result for could Reduced soil tilling helps both soils and yields
కొన్ని అంశాలు విపరీతంగా కూడా అనిపించవచ్చు, వాటి మంచి చెడ్డలను శాస్త్రవేత్తలు మాత్రమే వివరించగలరు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన పరిశోధన అంశాల సారం ఏమంటే భూమిని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిదానికీ దున్నకూడదు, ఎంత తక్కువ దున్నితే అంతగా భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, దిగుబడులు కూడా పెరుగుతాయని చెబుతున్నారు.1930దశకంలో అమెరికా, కెనడాలలో తీవ్రమైన దుమ్ము తుపాన్లు,వర్షాభావ పరిస్ధితులు ఏర్పడి, కొన్ని చోట్ల సాగు నిలిపివేయాల్సి వచ్చింది.కొంత కాలం దున్నకం నిలిపివేసిన తరువాత పంటల దిగుబడి అక్కడ పెరిగిందని, భూ ఆరోగ్య మెరుగుదల, దిగుబడుల పెరుగుదలకు దాన్నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.
రైతులు సాధారణంగా సాగుకు ముందు పాటు కలుపు మొక్కల తొలగింపుకు, ఎరువులు వేసే సమయంలోనూ దున్నటం, విత్తే సమయంలో దున్నటం తెలిసిందే. ఇలా ఎక్కువ సార్లు దున్ని భూమిలో కలుపు మొక్కలు లేకుండా చేయటం వలన స్వల్పకాలంలో దిగుబడులు పెరగవచ్చుగానీ దీర్ఘకాలంలో భూమి సారం తగ్గుతుందట.భూమికి మేలు చేసే బాక్టీరియా, ఇతర క్రిమి కీటకాలు అంతరిస్తున్నాయి. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ(ఎఫ్‌ఏఓ) 2015నివేదిక ప్రకారం గత నాలుగు దశాబ్దాల కాలంలో మూడో వంతు సాగు భూమిలో సారం తగ్గిందట. పదే పదే భూమి దున్నకం, దాని పర్యవసానాల గురించి అమెరికాలోని సోయా, మొక్కజొన్న సాగు చేసే భూముల మీద చేసిన అధ్యయనం మేరకు ఎంత తక్కువగా దున్నితే అంత మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.తక్కువ సార్లు దున్నితే ఆరోగ్యకరమైన భూ యాజమాన్య పద్దతులను ప్రోత్సహించటంతో పాటు, కోతనిరోధం, నీటిని నిలుపుకోవటం మెరుగుపడుతుంది.యంత్రాలను వినియోగించకపోవటం లేదా పరిమితంగా దున్నటం ద్వారా గత సంవత్సరపు పంట కోసిన తరువాత మిగిలే సోయా, మొక్కజన్న దుబ్బులు కూడా భూమికి మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిమిత దున్నకపు పద్దతులను ప్రస్తుతం అమెరికా ఖండ దేశాలు, ఓషియానా ప్రాంతంలో 37 కోట్ల ఎకరాల్లో వినియోగిస్తున్నారు.పరిమిత దున్నక సాగు అమెరికా మొక్కజొన్న పొలాల్లో 2012-17 మధ్య పదిహేడు శాతం పెరిగింది. అయితే మొత్తం సాగులో ఇది 3.4శాతమే. అయితే దిగబడులు, లాభాలు తగ్గుతున్నాయని రైతాంగం ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. గతంలో ఈ పద్దతులను కొన్ని పరిశోధనా కేంద్రాల్లోనే అమలు జరిపారు, అక్కడ కూడా ఉత్పాకత మీద పడే ప్రభావం గాక భూసార మెరుగుదల గురించే కేంద్రీకరించారు.
స్టాన్‌ఫోర్డ్‌ బృందం ఎక్కువ సార్లు దున్నే ప్రాంతాలు, పరిమిత దున్నకపు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి అధ్యయనానికి 2005 నుంచి 2016వరకు కంప్యూటర్లలో సేకరించిన సమాచారంతో పాటు ఉపగ్రహ చిత్రాలద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. దీనిలో పంటల దిగుబడులపై వాతావరణ మార్పులు, పంటల తీరు తెన్నులు, భూమి స్వభావం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాలలో అధ్యయనానికి ఎంచుకున్న కేంద్రాల సమాచారాన్ని విశ్లేషించారు. దీర్ఘకాలం పాటు పరిమితంగా దున్నిన పొలాల్లో సగటున మొక్కజొన్న దిగుబడి 3.3, సోయా 0.74 శాతం చొప్పున ఎక్కువ సార్లు దున్నిన పొలాలతో పోల్చితే పెరిగినట్లు వెల్లడైంది. కొన్ని కేంద్రాల్లో ఈ దిగుబడులు గరిష్టంగా 8.1,5.8 శాతాల చొప్పున ఉన్నాయి. కొన్ని చోట్ల 1.3, 4.7 శాతాల చొప్పున మొక్కజన్న, సోయా దిగుబడులు తగ్గినట్లు కూడా గమనించారు. ఇంతటి తేడాలు రావటానికి భూమిలో నీరు, ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులు ప్రధానంగా పని చేసినట్లు వెల్లడైంది. ఎక్కువ సార్లు దున్నే ప్రాంతాలలో నేలలు పొడిబారటం, నీటిని నిలువ చేసే సామర్ధ్యం తగ్గగా తక్కువ సార్లు దున్నిన ప్రాంతాలలో నేలలో తేమ దిగుబడులు పెరిగేందుకు ఉపయోగపడింది.
అధ్యయనం వెల్లడైన ధోరణులను వెల్లడించింది తప్ప ఇంకా నిర్దిష్ట నిర్ధారణలకు రాలేదు. మరింత విస్తృత అధ్యయనాలు జరపాల్సి ఉంది.1980దశకం నుంచి ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు.తక్కువ సార్లు దున్నిన చోట రైతులు పూర్తి స్ధాయిలో లబ్ది పొందేందుకు మొక్కజొన్న విషయంలో పదకొండు సంవత్సరాలు పడితే సోయా విషయంలో రెట్టింపు వ్యవధి తీసుకుంది. తక్కువసార్లు దున్నకం వలన భూమి సారం అభివృద్ధి చెందటం ఒకటైతే యంత్రాల వాడకం, వాటికి అవసరమయ్యే ఇంధనం, కార్మికుల ఖర్చు తగ్గింది. భూసారం పెరిగే కొలదీ దిగుబడులు పెరగటాన్ని గమనించారు.2017 అమెరికా వ్యవసాయ గణాంకాల ప్రకారం దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నట్లు, అమెరికాలోని పంటలు పండే భూమిలో 35శాతం వరకు తక్కువ సార్లు దున్నే పద్దతులను అనుసరిస్తున్నట్లు వెల్లడైంది. పరిశోధనా కేంద్రాల నుంచి వెల్లడైన సమాచారానికి, సాగు చేస్తున్న రైతాంగ అనుభవానికి అనేక మార్లు పొంతన కుదరకపోవటంతో రైతుల్లో పూర్తి విశ్వాసం ఇంకా ఏర్పడ లేదు. ఫలితంగా కొందరు రైతులు ఈ పద్దతికి మళ్లేందుకు ముందుకు రాని పరిస్ధితి కూడా ఉంది. తక్కువ ఉత్పాదకత ఉండే భూములను సారవంతవమైనవిగా మార్చవచ్చని క్వీన్‌లాండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. స్ధానిక, గిరిజన తెగల సహకారంతో నిస్సారమైన భూములను చాలా చౌకగా, తక్కువ వ్యవధిలోనే పదిల పరచవచ్చంటున్నారు.
ప్రపంచ వ్యవసాయ రంగంలో తీవ్రమైన పోటీ, ఇటీవలి కాలంలో ఉత్పత్తుల ధరలపతనం వంటి అనేక అంశాలు కొత్త పరిశోధనలకు తెరలేపుతున్నాయి. అయితే ఇవి చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉండే మన వంటి వ్యవసాయ పరిస్దితులున్న చోట పరిశోధనల ఫలితాలను ఎలా వుపయోగించుకోవాలి, ఎలా వర్తింప చేసుకోవాలి అన్నది ఒక పెద్ద సవాలే. అయినా ఎంత మేరకు వీలైతే అంతమేరకు వినియోగించుకోవటం తప్ప మరొక మార్గం కనిపించటం లేదు.సూక్ష్మ వ్యవసాయం, మార్కెట్‌ పద్దతుల గురించి ప్రస్తుతం అనేక చోట్ల కేంద్రీకరిస్తున్నారు. గ్లోబల్‌ మార్కెట్‌ ఇన్‌సైట్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ అనే సంస్ధ తాజాగా విడుదల చేసిన అధ్యయనం ప్రకారం 2025 నాటికి ప్రస్తుతం ఉన్న నాలుగు బిలియన్‌ డాలర్లుగా ఉన్న సూక్ష్మ వ్యయవసాయ మార్కెట్‌ పన్నెండు బిలియన్‌ డాలర్లవరకు పెరగవచ్చని అంచనా వేసింది.

Image result for could Reduced soil tilling helps both soils and yields
స్మార్ట్‌ ఫోన్ల మాదిరి స్మార్ట్‌ వ్యవసాయ పద్దతులకు గాను సమాచారాన్ని, సమాచార వ్యవస్ధలను వినియోగించుకొని రైతాంగానికి తోడ్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. పంటల స్ధితిగతులను తెలుసుకొనేందుకు, కంప్యూటర్‌ వ్యవస్ధలతో పాటు డ్రోన్ల వినియోగం కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. సూక్ష్మ వ్యవసాయ పద్దతులంటే పరిమిత ప్రాంతాలలో సైతం ఎలాంటి పంటలను సాగు చేయాలి, ఎంత నీరు, ఎరువుల వినియోగం వంటి నిర్ధిష్ట సూచనలు చేసే వ్యవస్ద ఏర్పాటు. ఇందుకోసం 2017లో డచ్‌ ప్రభుత్వం పంటల సమాచార సేకరణకు ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు అవసరమైన నిధులను విడుదల చేసింది. గగనతలం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ద్రోన్స్‌, సెన్సర్లు, జిపిఎస్‌ వ్యవస్ధలు, స్మార్ట్‌ ఫోన్ల వినియోగం 2025నాటికి 70శాతం వరకు ఉండవచ్చని అంచనా. మెరుగైన, పొదుపు పద్దతుల్లో నేల, నీటి వినియోగానికి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. రానున్న ఆరు సంవత్సరాలలో పరికరాలను గరిష్టంగా, జాగ్రత్తగా వినియోగించటం దగ్గర నుంచి సూక్ష్మ వ్యవసాయ సేవల వరకు మార్కెట్‌ పెరుగుదల రేటు 27శాతం ఉంటుందని అంచనా. పొలాల్లో ఎక్కడ ఏ లోపం ఉందో తెలుసుకొనేందుకు, వాటి నివారణకు తగు చర్యలను తీసుకొనేందుకు 3డి మాపింగ్‌తో సహా అనేక పద్దతులు అందుబాటులోకి వచ్చాయి.
అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో జరుపుతున్న పరిశోధనలన్నీ కార్పొరేట్‌ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో చేస్తున్నవే, వాటిని వినియోగించుకోగలిగింది కార్పొరేట్‌ సంస్ధలే అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఆ ఫలితాలను మన వ్యవసాయ రంగానికి ఎలా వర్తింప చేయాలి, వినియోగించుకోవాలి అన్నది మన ప్రభుత్వాలు చేయాల్సిన పని. వ్యవసాయ విస్తరణ, అభివృద్ధి వ్యవస్ధ, సిబ్బంది నియామకం పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించిన ఫలితాల పర్యవసానాలను చూస్తున్నాము. యూరియా, క్రిమి, కీటక నాశనులను అవసరానికి మించి వాడుతున్నందున జరుగుతున్న నష్టాల గురించి చెబితే చాలదు, ఇతర ఎరువుల ధరలు ఆకా శాన్ని అంటిన కారణంగా సబ్సిడీ వున్నందున రైతాంగం యూరియాను ఎక్కువగా వాడుతున్నారన్నది తెలిసిందే. అందువలన రైతాంగాన్ని చైతన్యపరచటంతో పాటు, భూ సారం, ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవటం, అందుకు అవసరమైన సబ్సిడీలు, బడ్జెట్‌ కేటాయింపులు చేయటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d