• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Readers News Service

ప్రపంచీకరణకు వ్యతిరేకతపై కార్పొరేట్లలో ఆందోళన

27 Wednesday Jul 2016

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

anti globalization movement, corporates, corporates worry, G 20, globalization, IMF, WB

నేను ప్రపంచీకరణకు అనుకూలమే అయినప్పటికీ ప్రపంచీకరణ వ్యతిరేకులు ముందుకు తెస్తున్న ముఖ్యమైన సమస్యల కారణంగా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పాలి: అమర్త్యసేన్‌

ఎం కోటేశ్వరరావు

   రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తమ లాభాలను కాపాడుకొనేందుకు ముందుకు తెచ్చిన ప్రపంచీకరణకు నూరేళ్లు నిండనున్నాయని కార్పొరేట్లలో ఆందోళన మొదలైందా? గత కొద్ది రోజులుగా పశ్చిమ దేశాల పత్రికలలో వెలువడుతున్న వ్యాఖ్యలు వారి మనోభావాలకు అద్ధం పడుతున్నాయి.జూలై మూడవ వారంలో చైనాలోని చెంగుడులో జరిగిన జి 20 దేశాల ఆర్ధిక మంత్రుల, రిజర్వుబ్యాంకుల గవర్నర్ల సమావేశంలో అనేక మంది ప్రపంచీకరణకు పెరుగుతున్న ప్రతిఘటన గురించి ఆందోళన వెలిబుచ్చారు. ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని ఓటింగ్‌ నిర్వహించిన నెల రోజుల తరువాత జరిగిన ఈ సమావేశంలో సహజంగానే దాని పర్యవసానాల గురించి చర్చ జరిగింది. అభివృద్ధి, ఆర్ధిక సరళతతో కలిగిన లబ్దిని సభ్య దేశాలు, అన్నిదేశాల మధ్య పంపకానికి ఇంకా ఎంతో చేయాలనటంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టినా లాగార్డే వ్యాఖ్యానించగా పశ్చిమ దేశాలలో ప్రపంచీకరణకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ హెచ్చరించాడు.అయితే ఈ సమావేశంలో ఆ దిశగా ఎలాంటి నిర్ధిష్ట ప్రతిపాదనలు రాలేదు.అమెరికా విత్త మంత్రి జాకబ్‌ జె లీ విలేకర్లతో మాట్లాడుతూ పొదుపు చర్యలపైగాక అభివృద్ధి గురించి ఏకాభిప్రాయం వ్యక్తమైందని అన్నారు. ఈ సమావేశం ఏదైనా ఒక సందేశం అందించిందంటే జరుగుతున్న పరిణామాల పట్ల ప్రపంచవ్యాపితంగా ఓటర్లు సంతోషంగా లేరన్నదే అది అని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న ఎఎంపి కాపిటల్‌ ఇన్వెస్టర్స్‌ అధికారి షేన్‌ ఆలివర్‌ వ్యాఖ్యానించాడు.

   చెంగ్‌డు సమావేశం ముగిసిన కొద్ది సేపటి తరువాత నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైన డోనాల్డ్‌ ట్రంప్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కార్యకలాపాలను వెలుపలి దేశాలకు తరలించిన అమెరికన్‌ కంపెనీల వస్తువులపై పన్నులు వేయాలన్న తన ప్రతిపాదనను అడ్డుకొనేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) ప్రయత్నించిందని,ఈ కారణంగా తిరిగి సంప్రదింపులు జరిపేందుకు లేదా దాని నుంచి బయటకు పోవటం గురించి ఆలోచిస్తామని బెదిరించాడు. ఆర్ధిక వ్యవస్ధలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు ఒక్క జూన్‌ నెలలో చైనా మార్కెట్‌లోకి 244 బిలియన్‌ డాలర్ల విలువగల కొత్త రుణాలను విడుదల చేసింది. దీంతో వినిమయం, సేవల వినియోగాన్ని పెంచటం ద్వారా తగ్గుతున్న ఆదాయాన్ని నిలుపుకొనేందుకు చర్యలు తీసుకుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా, చైనా, జపాన్‌ తరువాత అతి పెద్ద ఆర్ధిక శక్తిగా వున్న దక్షిణ కొరియా వుపాధికి వూతమిచ్చేందుకు 987 కోట్ల డాలర్ల అనుబంధ బడ్జెట్‌ను ప్రతిపాదించగా కెనడా 838 కోట్ల డాలర్ల మేరకు అదనంగా ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ కూడా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని అదుపు చేసే చర్యలలో భాగమే.

   ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటున్నప్పటికీ అవసరమైనదాని కంటే బలహీనంగా వుందని,అనేక సవాళ్లున్నాయని జి 20 ప్రకటన పేర్కొన్నది. వుక్కు వంటి పరిశ్రమలలో అవసరానికి మించిన సామర్ధ్యం వలన కేవలం వాణిజ్యం మాత్రమే గాక కార్మికులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని కూడా ప్రకటన వ్యాఖ్యానించింది.

    స్వేచ్ఛా వాణిజ్యానికి దాడి ముప్పు వుంది, అయితే అది ఎప్పటి కంటే ఎంతో ప్రాధాన్యత కలిగిందని ఫార్చ్యూన్‌ పత్రిక వ్యాఖ్యాత అలన్‌ మురే పేర్కొన్నారు. దాని సారాంశం ఇలా వుంది. గత అర్ధశతాబ్ది కాలంలో కీలకమైన వాణిజ్య ధోరణిగా వున్న ప్రపంచీకరణ తిరోగమనంలో వుంది. తమ వుద్యోగాలు హరించుకుపోవటానికి ఇదే కారణమని అమెరికా, బ్రిటన్‌లో మిలియన్ల మంది ఓటర్లు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పౌరుల్లో కలిగిన పెద్ద కుదుపు బ్రెక్సిట్‌ రూపంలో వెల్లడైంది. ప్రపంచీకరణను సమర్ధించాలని ఇప్పుడెవరూ కోరుకోవటం లేదని వెల్లడిస్తున్నది. ప్రపంచీకరణ విజయం హరించుకుపోతున్నదని ఫార్చ్యూన్‌ పత్రిక రూపొందించిన ఐదువందల ప్రపంచ కంపెనీల జాబితా వివరాలు నిర్ధారిస్తున్నాయి. 2015లో వాటి అమ్మకాలు 11.5శాతం తగ్గి 27.6లక్షల కోట్ల డాలర్లకు పడిపోయాయి.ఆదే రీతిగా లాభాలు కూడా పడిపోతున్నాయి. ప్రపంచీకరణ విమర్శకులు చెబుతున్నదానికంటే పరిస్థితి మరింత సంక్లిష్టంగా వుందన్నది వాస్తవం.

   మెక్సికో మాజీ మంత్రి, ప్రొఫెసర్‌ జార్జ్‌ జి కాస్టేండా ప్రపంచీకరణ గురించి మరో రూపంలో విమర్శించారు.’అసమర్ధ నాయకత్వం రూపొందించిన పనికిమాలిన ప్రపంచీకరణ’ అనే శీర్షికతో విశ్లేషించారు. దాని సారాంశం ఇలా వుంది. 1950 దశకం నుంచీ ఐరోపా దేశాలు ప్రాంతీయ సమగ్రత వలన కలిగే లాభ నష్టాల గురించి చర్చిస్తున్నాయి. అయితే ప్రపంచకీరణ, స్వేచ్ఛా వాణిజ్యం, వలస వాటి ఆర్ధిక పర్యవసానాల కేంద్ర అంశంగా ఆ చర్చ సాగిందని బ్రెక్సిట్‌తో స్పష్టమైంది.ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని తీర్పు నిచ్చి బ్రిటన్‌ పౌరులు తప్పు చేశారు. విడిపోవాలనే ప్రచారం వెనుక వున్న కారణాన్ని కలసి వుండాలని కోరుకొనే వారు కూడా విస్మరించి తప్పు చేశారు. ఆ ప్రభావశీల కారణాలు ఒక్క బ్రిటన్‌ లేదా ఐరోపా యూనియన్‌ సభ్య దేశాలు, ప్రపంచమంతటా వున్న ప్రజాస్వామిక దేశాలన్నింటా వున్నాయని వారు గుర్తించలేదు. అసమర్ధ రాజకీయ నాయకత్వం ప్రపంచవ్యాపితంగా కొత్త ప్రమాదాలను ప్రేరేపిస్తున్నది. ఐరోపా వాసులను ఒక్కటిగా చేయాలని సాగుతున్న ప్రయత్నం సాకారం కావటం అంత సులభం కాదు. దానితో పాటు అనేక సమస్యలను పరిష్కరించాల్సి వుంది. ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్యం, వలస, అసమానత సమస్యలను దీర్ఘకాలంగా అ న్ని చోట్లా ధనిక దేశాలు విస్మరించాయి. 1990దశంలో అమెరికా అధ్యక్షులు జార్జిడబ్లు బుష్‌, బిల్‌క్లింటన్‌ మెక్సికో పాలకుల స్వేచ్ఛా వాణిజ్య మానసిక స్ధితి దాని వలన ప్రతికూలంగా ప్రభావితమయ్యేవారికి పరిహారం అందించటాన్ని రాజకీయంగా వాస్తవంలో అసాధ్యం చేశారు. ఈ విధానం విఫలం చెందిన 20 సంవత్సరాల తరువాత మనస్సు విరిగిన ఓటర్లు రిపబ్లికన్‌ పార్టీ డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ బెర్నీ శాండర్స్‌ వైపు చేరటం ఆశ్చర్యం కాదు. ఆకర్షించే నినాదాలతో ఇద్దరూ వారిని బుట్టలో వేసుకున్నారు. ఇద్దరూ భిన్నమైన నినాదాలు ఇచ్చినప్పటికీ ఓటర్లు ఆకర్షితులు కావటానికి కారణం మాత్రం గత రెండు దశాబ్దాల విఫల విధానాలే. వాటిని సరిచేసేందుకు జరిగే ఏ ప్రయత్నమైనా వాస్తవాల ప్రాతిపదికనే జరగాలి.

   2008-2009 సంవత్సరాల తీవ్ర మాంద్యం తరువాత అమెరికా వుత్పాదక రంగంలో అనేక కొత్త వుద్యోగాల కల్పన జరిగిందని తెలుసుకుంటే వుభయుల మద్దతుదార్లు ఆశ్చర్యపోతారు. మిలియన్ల కొద్దీ వుత్పాదక వుద్యోగాలను చైనా, మెక్సికో వంటి దేశాలకు బదిలీ చేసిన తరువాత ఈ కల్పన కొంత మేరకు ఆ గండిని పూడ్చిందని, అయితే పోయిన వాటికంటే కొత్తగా ఎక్కువ సృష్టించవచ్చని ఎవరైనా వాదించవచ్చు. వుద్యోగాల బదిలీ తరువాత అమెరికా మరింత పోటీదారుగా తయారైంది, అందుకు చైనాకు కృతజ్ఞతలు చెప్పాలి. వేరే దేశాలకు వుద్యోగాలు తరలి పోయిన తరువాత అమెరికాలో కల్పించిన వుద్యోగాలు ఎలాంటివన్నది ప్రధాన సమస్య. ఆర్ధిక పర్యవసానాలను విధాన నిర్ణేతలు విస్మరించారు. యాభై, అరవయ్యవ పడిలో వున్న కార్మికులు గంటకు 30 డాలర్ల వుద్యోగాలు, ఆరోగ్యసంరక్షణ, పెన్షన్‌ లబ్దులను కోల్పోయి అంతకు ముందు పొందిన వేతనాల కంటే సగానికి, ఇతర లబ్దులేమైనా మిగిలి వుంటే ఆ కొన్నింటిని మాత్రమే పొందటానికి సిద్ద పడ్డారన్నది మరిచిపోకూడదు. విధాన నిర్ణేతలు ప్రపంచీకరణ బాధితుల గురించి పట్టించుకోలేదు, ఎందుకంటే వారిని పట్టించుకోవాలన్న అవసరం వుందని వారు అనుకోలేదు. మార్కెట్టే అన్నింటినీ తనంతట తానే పరిష్కరిస్తుందని భావించారు కానీ జరగలేదు, విధాన నిర్ణేతలకు అది పాఠం నేర్పలేదు. గతేడాది పసిఫిక్‌ దేశాల భాగస్వామ్య ఒప్పందం సానుకూలంగా కుదరింది కానీ అమెరికన్‌ కార్మికుల రక్షణకు చేసిందేమీ లేదు.

   మెక్సికోలో కూడా ఇదేమాదిరి ప్రపంచీకరణ వ్యతిరేకత పెల్లుబికింది. నాఫ్టా గురించి ఎక్కువగా చెప్పారు, ఎక్కువగా విమర్శలకు గురైంది. ఆ ఒప్పందం ఎగుమతులు పెంచుతుందని భావించారు, అలాగే జరిగింది గానీ అమెరికా దిశగా వలసలను తగ్గించలేకపోయింది. అనేక మెక్సికో పరిశ్రమలు, వాణిజ్య, వ్యవసాయ సంస్ధలు మరింతగా పోటీ పడేవిధంగా తయారయ్యాయి, జిడిపి దామాషాలో చూస్తే చాలా తక్కువగా , తాత్కాలికంగా విదేశీ పెట్టుబడులు పెరిగాయి. నాఫ్టా వలన మెక్సికో అనేక సంస్కరణల మధ్య చిక్కుకుపోయింది తప్ప వాగ్దానం చేసినట్లుగా అభివృద్ధి జరగలేదు.1994 నుంచీ వృద్ధి చెందుతున్న మార్కెట్‌ ప్రమాణాల ప్రకారం చూస్తే తక్కువగా వార్షిక పెరుగుదల రేటు 2.5శాతం మాత్రమే వుంది. వుత్పాదకత, వుపాధి, వేతనాలు కూడా ఆశాభంగం కలిగించాయి. ఈ ఒప్పందం తరువాత ప్రపంచీకరణ ప్రతికూల ప్రభావాలను అధిగమించేందుకు అవసరమైన వుత్పాదక రంగ కార్మికులకు వేతన పెంపుదలను ఎన్నడూ అమలు జరపలేదు. యావత్‌ దేశం నేడు మూల్యం చెల్లిస్తున్నది, మెక్సికన్లు అసంతృప్తితో వున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచటానికి ఆ ఒప్పందం దోహదం చేసింది, 2018లో జరిగే సాధారణ ఎన్నికల ఫలితాన్ని అది ప్రభావితం చేయగలదు. ఈ నాటి కొత్త విషయం ఏమిటంటే ఐరోపా, వుత్తర అమెరికా ఖండంలో ప్రజావ్యతిరేకతను గతం కంటే మెరుగ్గా అదుపు చేయగలమని విధాన నిర్ణేతలు విశ్వసించారు.బ్రిటన్‌లో ఓటర్ల తీర్పును చూసిన తరువాత అమెరికా, మెక్సికో ఏ దేశమూ కూడా వాటి నాయకత్వాల తప్పిదాలకు అతీతంగా వుంటుందని చెప్పలేము.

   బ్రెక్సిట్‌ సందర్బంగా బ్రిటన్‌ కార్పొరేట్‌లు స్ధూలంగా రెండుగా చీలిపోయారన్నది స్పష్టం. ఒకటి యూనియన్‌లోనే వుండి లబ్ది పొందాలని చూడగా విడిపోయి ఎవరికి వారం తేల్చుకుందామనే వైఖరిని మరొకటి తీసుకుంది. దున్న, ఎద్దు కాడి మాదిరి. ఎండ ముదరగా ఎద్దు నీడ వైపు లాగితే దున్న ఎండవైపుకు మొగ్గుతుందన్నట్లుగా పెట్టుబడిదారీ వ్యవస్ధలో, అందునా అవసరాలకు మించి వుత్పత్తులు జరుగుతున్నపుడు వుత్పాదక రంగంలో ఎగుమతులపై ఆధారపడిన వారి వైఖరి ఒక విధంగానూ దిగుమతులపై ఆధారపడిన వారి వైఖరి మరొక విధంగానూ వుండటం అని వార్యం.

    వుదాహరణకు ఈ విరుద్ధ ప్రయోజనాల మధ్య కరెన్సీ విలువ పైకీ కిందికీ లాగబడుతోంది.బలమైన డాలరు కారణంగా తమ ఆదాయం, లాభాలపై సంవత్సరాల తరబడి ప్రతికూల ప్రభావం పడటంపై విచారించిన అమెరికన్‌ కార్పొరేట్లు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. దాని ప్రభావం ఈఏడాది తొలి త్రైమాసికంలో డాలరు విలువ ఐదునెలల కనిష్టానికి పడిపోయింది. బలహీనపడిన డాలరు అమెరికా ఎగుమతులు పెరగటానికి దోహదపడింది.ఈ ఏడాది తమ లాభాలు పెరగటానికి ఇదొక కారణమని ఔషధ రంగంలోని ఫైజర్‌,ఎలీలిలీ, డ్యూపాంట్‌ కంపెనీలు పేర్కొన్నాయి. హోటల్‌ రూములలో చేరేవారి సంఖ్య పెరిగింది, టూరిజం లాభపడింది, న్యూయార్క్‌ నగరానికి ఐరోపా యాత్రికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇదే విధంగా మరికొంత కాలం డాలరు విలువ తక్కువగా వుంటే పెట్టుబడులు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. డాలరు విలువ ఎక్కువగా వున్న కారణంగా గతేడాది కార్పొరేట్‌ కంపెనీలు 112 బిలియన్‌ డాలర్ల ఆదాయం కోల్పోయాయి.డాలర్లు ఆవిరైంది.

   ప్రపంచీకరణ కార్మికులకు ఎంత నష్టదాయకమో కొన్ని కార్పొరేట్‌ సంస్ధలకు కూడా అదే పరిస్ధితిని సృష్టిస్తోంది. అందువలన కార్పొరేట్‌ సంస్ధల మధ్య కూడా మిత్ర వైరుధ్యం పెరగటం అనివార్యం. అది శతృవైరుధ్యంగా మారినపుడు పరిణామాలు ఎలా వుంటాయనేది ఇపుడే వూహించలేము. అనేక దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ప్రపంచీకరణ స్ధూలంగా కార్పొరేట్లకు లాభదాయకం-కార్మికవర్గానికి నష్టదాయకం అన్నది ఇటీవలి కాలంలో మరింత స్పష్టమైంది. ఇప్పటి వరకు ప్రపంచీకరణ అమలుకు ఒక సాధనంగా వుపయోగపడిన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల అధిపతులే వారు రానున్న రోజులలో ప్రపంచీకరణకు మరింత వ్యతిరేకత వ్యక్తం కానుందని ముందస్తు హెచ్చరికలు చేయటమే కొత్త విషయం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పత్తి ధరపై చైనాకు తగ్గుతున్న ఎగుమతుల ప్రభావం వుంటుందా ?

26 Tuesday Jul 2016

Posted by raomk in AP NEWS, CHINA, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Telangana

≈ Leave a comment

Tags

cotton, cotton farmers, cotton imports, indian farmers, yarn

ఎం కోటేశ్వరరావు

    ఎగువన వున్న తుంగభద్ర జలాశయమే పూర్తిగా నిండలేదు, అనూహ్యమైన వాతావరణ మార్పులు సంభవిస్తే తప్ప ఈ ఏడాది కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలు నిండటం అనుమానమే. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం పడిన కొద్ది పాటి వర్షాలకే మరో మార్గం కానరాక ఎన్నో ఆశలతో ఈ ఏడాది కూడా పత్తి సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే సీజన్‌కు క్వింటాలుకు పొడవు పింజ పత్తిరకాల మద్దతు ధర మరో అరవై రూపాయలు పెంచి రు.4,160గా ప్రకటించి ఎంతో మేలు చేసినట్లుగా చెప్పుకుంటోంది. ఏవి మోడీ 2022 నాటికి వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేస్తామని మొన్న చేసిన చేసిన వాగ్దానాల అమలు ఎక్కడ అని ఎవరైనా అడిగితే దేశ భక్తులు కాదని ముద్ర వేసే ప్రమాదం లేకపోలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులను అడిగితే ఒకరు వైఎస్‌ఆర్‌సిపి మీద మరొకరు తెలుగుదేశం, కాంగ్రెస్‌ మీద విరుచుకుపడి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తారు. చంద్రబాబు నాయుడికి నరేంద్రమోడీతో రోజురోజుకూ మరింతగా బిగుస్తున్న స్నేహ ధర్మం అడ్డు వచ్చి, పత్తి వేసుకోవద్దని ముందే సలహా ఇచ్చాం కదా అని చంద్రశేఖరరావు కూడా దీని గురించి పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్‌లో అనధికారికంగా అన్నీ తానే అయినట్లు వ్యహరిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న(ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వం వాటిని ఖండించలేదు) లోకేష్‌, తెలంగాణాలో తానే ముఖ్యమంత్రిని అన్నట్లుగా హడావుడి చేస్తున్న మంత్రి కెటిఆర్‌కు గానీ తమ రాష్ట్రాలలో పత్తి ఒక ప్రధాన పంట అనిగానీ రైతాంగంపై దాని ధరలు, మార్కెటింగ్‌ తీవ్ర ప్రభావం చూపుతాయని గానీ అనుకుంటున్నారో లేదో తెలియదు.

   చైనా ప్రస్తావన తేవటం కొంత మందికి ఆగ్రహం తెప్పించవచ్చు. ఏం చేస్తాం, వాస్తవాల మీద ఆధారపడినపుడు ప్రపంచమే చైనాను విస్మరించజాలదు, మన మార్కెట్‌ను కూడా చైనా వస్తువులు ముంచేస్తున్నపుడు మనం దూరంగా ఎలా వుంటాం.నిత్యం చైనాను కట్టడి చేయాలని, దాని వస్తువులను నిషేధించాలని వీరంగం వేస్తున్నవారితో సహా మన పత్తి, నూలును చైనా కొనటం నిలిపివేస్తే ఎవరూ చేసేదేమీ లేదు,పరిస్ధితి మరింత దిగజారుతుంది. అందుకే నరేంద్రమోడీ సర్కార్‌ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఏప్రిల్‌ చివరి వారంలో జెంగ్‌జౌ వస్తు మార్కెట్‌లో ఒక్క రోజులోనే 4.1కోట్ల బేళ్ల పత్తి లావాదేవీలు జరిగాయి. ఒక బేలు పత్తితో 215 జతల జీన్స్‌ తయారు చేయవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఆ ఒక్క రోజు అమ్మిన పత్తితో భూమ్మీద ప్రతి ఒక్కరికీ కనీసం ఒక జీన్స్‌ పాంట్స్‌ తయారు చేయటానికి సరిపోతుందని అంచనా.

  వ్యవసాయం గురించి అనుచితంగా మాట్లాడిన చంద్రబాబు పర్యవసానాలతో పది సంవత్సరాలపాటు అధికారానికి దూరంగా వుండి, కంగుతిని తరువాత ఓట్ల కోసం సవరించుకున్నారు. ఆచరణలో ఏం చేస్తున్నారు? ప్రధాని నరేంద్రమోడీ, ఇద్దరు తెలుగు చంద్రులు, వారి వారసులు పోటీ పడి విదేశీ పర్యటనలు చేస్తున్నారు. లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు తెస్తున్నట్లు పుంఖాను పుంఖాలుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. వాటిలో పదిశాతం లేదా ప్రయాణ, ప్రచార ఖర్చులు ఏది ఎక్కువైతే ఆ మొత్తం వాస్తవ రూపం దాల్చినా మంచిదే. ఆ పెట్టుబడులు వందల కొలదీ చేసుకున్నామని చెబుతున్న ఒప్పందాలలో రైతాంగానికి పనికి వచ్చేవి ఎన్ని? పొగాకు అమ్ముడు పోక రైతాంగం దిక్కుతోచకుండా వుంటే కొనటానికి కేంద్రాన్ని ఒప్పించలేని పెద్దలు తల్లికి తిండి పెట్టని కొడుకులు పిన్నికి బంగారు తొడుగులు వేయిస్తామన్నట్లుగా వ్యవసాయం గురించి చెపితే రైతులు చెవులో పూలు పెట్టుకొని నమ్మాలా ? అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గిన కారణంగా దిగుమతి చేసుకున్న ఎరువుల ధరలు తగ్గితే వ్యాపారులు ఆమేరకు తగ్గించకుండా వసూలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, వాటిపై నియంత్రణ వుందా ?

    మన పత్తికి ఇప్పుడున్నదాని కంటే మంచి ధర రావాలంటే చైనాకు మరిన్ని ఎగుమతులు జరిగితే తప్ప రాదన్నది స్పష్టం. 2015లో మన దేశం నుంచి చైనాకు ఎగుమతి చేసిన నూలు, దానికి వచ్చిన రేటు 12,17శాతం చొప్పున తక్కువగా వున్నాయని తాజా సమాచారం. ముందే చెప్పుకున్నట్లు తన దగ్గర వున్న అపార పత్తి నిల్వలను చైనా మార్కెట్‌కు విడుదల చేస్తోంది. ఈ స్ధితిలో మన పత్తి రైతులకు ధర గతం కంటే ఎలా మెరుగుపడుతుందో తెలియని స్ధితి. మిలియన్ల మంది పత్తి రైతులు, వారి పొలాల్లో పని చేసే వ్యవసాయ కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా పారిశ్రామిక, వ్యాపారాలలో పెట్టుబడుల ఎండమావులు వెంట తిరిగితే ప్రయోజనం వుంటుందా ?

    గతేడాది చైనాకు ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. అయితే వియత్నాం, బంగ్లాదేశ్‌ కొంత మేరకు దిగుమతులు పెంచటంతో పత్తి ధర సీజన్లో మద్దతు ధరకు అటూఇటూగా అయినా వుంది.ఈ ఏడాది వారు కూడా తమకు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే మన రైతాంగ పరిస్ధితి ఏమిటి ? రైతులు పచ్చగా లేకుండా లోకేష్‌ బాబుతో కలసి చంద్రబాబు అంతర్జాతీయ స్ధాయిలో రాజధాని అమరావతిని నిర్మించినా, చంద్రశేఖరరావు అండ్‌ ఫ్యామిలీ భాగ్యనగరాన్ని మరింతగా అభివృద్ధి చేసినా ప్రయోజనం ఏమిటి ?

    తమకు నష్టాలు వస్తున్నాయనే పేరుతో నూలు మిల్లులు వారానికి కొన్ని గంటల పాటు వుత్పత్తిని తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఈ ఏడాది జూన్‌లో మన దేశం నుంచి పత్తి నూలు 8.2 కోట్ల కిలోలు 74 దేశాలకు ఎగుమతి అయింది. మేనెలతో పోల్చితే కిలోకు ఏడు సెంట్ల ధర పెరిగినా ఏడాది క్రితంతో పోల్చితే 24 సెంట్లు తక్కువ.ఈ స్ధితిలో ఈ ఏడాది నూలు ఎగమతిదారులు ఏ ధైర్యంతో పత్తిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు? గతం కంటే దిగుమతులు తగ్గినప్పటికీ మన పత్తి, నూలు ఎగుమతులు చైనాకే ఎక్కువగా జరుగుతున్నాయి.

     ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖకు కొత్తగా వచ్చిన కమిషనర్‌ తన ప్రత్యేకతను ముఖ్యమంత్రి ముందు ప్రదర్శించుకొనేందుకు లేదా తాము ఎన్ని విజయాలు సాధించినా వాటి సమాచారం జనంలోకి వెళ్లటం లేదన్న ముఖ్యమంత్రి ఆగ్రహం వల్లగానీ సమాచార శాఖ కొత్తగా పరిశోధన అవలోకన( రిసర్చ్‌ రిఫరెన్సు) విభాగాన్ని ఏర్పాటు చేసి పుంఖాను పుంఖాలుగా పొత సమాచారాన్ని కొత్తగా మీడియాకు అందచేస్తున్నది. వాటిలో కొన్ని ఇలా వున్నాయి. 2050 నాటికి అంటే మరో 34 సంవత్సరాల నాటికి అమరావతి నగరంలో 12లక్షల వుద్యోగాలు సేవల రంగంలో మూడు లక్షల వుద్యోగాలు పరిశ్రమల రంగంలోనూ కల్పించేందుకు చంద్రబాబు కృషి. ఇందుకు గాను మౌలిక వసతుల కల్పనలా భాగంగా 3,746 కిలోమీటర్ల జాతీయ రహదారులకు(ఇవి ఇతర ప్రాంతాలలో కూడా వుంటాయనుకోండి) గాను రు.34,732 కోట్లు, అమరావతి రింగురోడ్డు, ఇతర 720 కిలోమీటర్ల రోడ్డకు రు.30వేల కోట్లు,రేవులను కలిపే 419 కిలోమీటర్ల ప్రధాన రహదారులకు రు.4,306 కోట్లు ఇంకా మరికొన్ని రోడ్ల గురించి సమాచార శాఖ తెలిపింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అశోక్‌గజపతి రాజు అర్ధికశాఖ మంత్రిగా వుండగా కూడా ఇలాగే రోడ్ల నిర్మాణం, వాటికి విదేశీ అప్పుల గురించి వాటి ద్వారా జరిగే అభివృద్ధి గురించి వూదరగొట్టిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తిరిగి ఇప్పుడు అదే జరుగుతోంది. రోడ్లు వేస్తే కాంట్రాక్టర్లు వస్తారు, కాంట్రాక్టర్లు వస్తే కొంత మందికి జేబులు నిండుతాయి, జనానికి టోలు ఫీజు రూపంలో జేబులు ఖాళీ అవుతాయి. రోడ్లు వేయటానికి ముందు, తరువాత తమ వుత్పత్తులకు వస్తున్న రేట్లలో తేడా ఏముందో మదనపల్లి టమాటో రైతులు చెప్పాలి. వుల్లి ధరలు పెరిగి వినియోగదారులకు, తగ్గి రైతులకు కన్నీరు తెప్పించిన విషయం కర్నూలులో ఏ రైతును అడిగినా చెబుతారు.పత్తి, పొగాకు ధరల గురించి వేరే చెప్పనవసరం లేదు.

   కొన్ని రోడ్ల నిర్మాణానికే దాదాపు 70వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్‌ రైతులకు ఏం చేస్తోంది? పదిహేడు లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల వుత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న ఖర్చు 120 కోట్లు అని సమాచార శాఖ పేర్కొన్నది. పాతిక కిలోమీటర్ల రోడ్డు వేయటానికి అయ్యేఖర్చును కూడా వ్యవసాయంపై పెట్టటానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Gazette Notification relating to 7th Pay Commission Recommendations

26 Tuesday Jul 2016

Posted by raomk in Current Affairs, employees, INDIA, NATIONAL NEWS, Pensioners

≈ Leave a comment

Tags

7th Pay Commission Recommendations, Gazette Notification, Ministry of Finance

          The Ministry of Finance has issued Gazette Notification with regard to 7th Pay Commission Recommendations.

For more details, please see.

Resolution on Cabinet Decision

Revised Pay Rules 2016

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో తగ్గుతున్న ఆరోగ్య భారం-భారత్‌లో పెరుగుతున్న రోగ రుణ భారం

23 Saturday Jul 2016

Posted by raomk in CHINA, Economics, Health, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

China, healthcare costs, healthy china, INDIA, world bank on china health

Image result for china healthcare

ఎం కోటేశ్వరరావు

   మన ప్రభుత్వాలు అమలు జరుపుతున్న దారిద్ర నిర్మూలన పధకాలు కాగితాల మీద దరిద్రుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఎంత ఆదాయం వస్తే, ఎంత ఖర్చు చేస్తే దారిద్య్రంతో వున్నట్లు అనే కొలబద్ద నిర్ణయంలోనే తిరకాసు వున్న విషయం తెలిసిందే. లెక్కలు చూపేందుకు పడుతున్న తాపత్రయం దారిద్య్ర నిర్మూలనలో లేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే పాలకులు విధానాల కారణంగా అనారోగ్యం పాలైన పేద, మధ్యతరగతి కుటుంబాలన్నీ తట్టుకోలేని ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పుల పాలు కావలసి వస్తోందని ప్రతి కుటుంబ సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రతి ఏటా 6.3 కోట్ల మంది ఈ అప్పుల వూబిలో దిగుతున్నారు. తాజాగా జూలై 22వ తేదీన ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్ధ, చైనా ప్రభుత్వం హెల్తీ చైనా (ఆరోగ్యవంతమైన చైనా) పేరుతో ఒక పెద్ద విశ్లేషణాత్మక నివేదికను వెల్లడించాయి. దానిలో చైనాలో జరిగిన అభివృద్ధి కారణంగా తలెత్తిన సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలా అనే అంశాలను చర్చించారు. దానిలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

  ప్రస్తుతం మొత్తం చైనా ఆరోగ్యఖర్చులో అక్కడి ఆసుపత్రుల వాటా 54శాతం వుండగా, ఓయిసిడి(ఐరోపా ఆర్ధిక, అభివృద్ధి సంస్ధ ) దేశాలలో అది 38 శాతంగా వుంది.

   1980-2000 సంవత్సరాల మధ్య చైనాలో ఆసుపత్రి పడకల సంఖ్య 1.19 నుంచి 2.17 మిలియన్లకు , తరువాత 13 సంవత్సరాలలో 2013 నాటికి 4.58 మిలియన్లకు పెరిగాయి. ఇదే సమయంలో అత్యధిక ఓయిసిడి దేశాలలో పడకలను కుదించారు, కొన్ని దేశాలలో అది 30శాతం వరకు వుంది.

   2002-2013 మధ్య టెరిటరీ, సెకండరీ ఆసుపత్రుల సంఖ్య 82,29శాతం చొప్పున పెరగ్గా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య ఆరుశాతం తగ్గింది.ఆసుపత్రులలో చేరటం 2003లో 4.7శాతం వుండగా 2013లో 14.1శాతానికి చేరింది.

    ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల నిపుణుల సంఖ్య 36శాతం తక్కువగా వుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలపై విశ్వాసం లేక అన్ని అర్హతలు కలిగిన ఆరోగ్య కార్యకర్తలు లేని కారణంగా గ్రామీణ ప్రాంత రోగులు వాటికి వెళ్లకుండా నేరుగా పై తరగతి ఆసుపత్రులకు వెళ్లటం ఎక్కువైంది.

  వైద్య రంగంలో వేతనాలు ఆకర్షణీయంగా లేని కారణంగా దాదాపు 40శాతం మంది మెడికల్‌ గ్రాడ్యుఏట్లు ఆసుపత్రులలో చేరకుండా ఔషధాలు, వైద్య పరికరాల పరిశ్రమలలో చేరుతున్నారు.

  మెడికల్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య 2003-13 మధ్య రెట్టింపైంది. వారిలో నర్సింగ్‌ సిబ్బంది 108శాతం, ఫిజిషియన్స్‌లో 41 శాతం పెరుగుదల కనిపించింది.అయినప్పటికీ నర్సింగ్‌ సిబ్బంది, ఇతరుల కొరత ఇంకా ఎక్కువగానే వుంది.

    అవసరానికి మించి మందులు రాయటం ఒక ప్రధాన సమస్యగా వుంది.సగటున మూడు మందులు రాస్తున్నారు. ఇంజెన్ల రేటు 53శాతం వుంది, ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన సిఫార్సు కంటే ఇవి రెండు ఎక్కువే. రాస్తున్న మందులలో యాంటీబయటిక్స్‌ సగం వుంటున్నాయి.

  గ్రామీణ వైద్యులు కేవలం 26శాతం కేసులలో వ్యాధిని సరిగా నిర్ధారిస్తున్నారని ఒక సర్వేలో తేలింది.అవసరంలేని, హానికరమైన మందుల సిఫార్సు చేయటం 64శాతం కేసులలో కనిపించింది.

    వైద్య సేవలకు ఫీజు చెల్లించే ఏజన్సీ ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఔషధాలపై ఇస్తున్న లాభాల కారణంగా ఆసుపత్రుల రంగంలో, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. స్థూలజాతీయాదాయం (జిడిపి) పెరుగుదల రేటు కంటే ఆరోగ్య ఖర్చుల పెరుగుదల రేటు ఎక్కువగా వుంది. ఏటా 8.4శాతంగా వుంది.జిడిపిలో ఆరోగ్య సంరక్షణ ఖర్చు 2015లో 5.6శాతం వుండగా 2035 నాటికి 9.1శాతం పెరగవచ్చని అంచనా.ఇది డాలర్లలో 467.2 మిలియన్ల నుంచి 2.4 బిలియన్లకు పెరుగుతుంది.

   ప్రపంచబ్యాంకు అంచనా ప్రకారం మెరుగైన వ్యాధుల యాజమాన్య పద్దతులను పాటిస్తే ఆరోగ్య ఖర్చు తగ్గి జిడిపిలో మూడు శాతం పొదుపు అవుతుంది. మరింత మెరుగైన ఆరోగ్య వ్యవస్ధ, సంరక్షణ,ఆరోగ్యం సమకూరే విధంగా సంస్కరణలు చైనాలో అమలు జరిగితే ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించినట్లు అవుతుంది.

    జీవితకాలం పెరిగిన కారణంగా ప్రస్తుతం 65 సంవత్సరాల వయసు దాటిన వారు చైనాలో 14 కోట్ల మంది వున్నారు.వీరి సంఖ్య 2030 నాటికి 23 కోట్లకు పెరుగుతుందని అంచనా.

  రెండు దశాబ్దాల క్రితం అప్పుడే అంటు వ్యాధులు, పుట్టిన పిల్లలకు వచ్చే వ్యాధులు, పౌష్టికాహారం,తల్లుల ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తిన వ్యాధులు 41శాతం వుండేవి. ఇప్పుడు ఓయిసిడి దేశాలలో మాదిరి చైనాలో దీర్ఘకాల, అంటు లక్షణం లేని వ్యాధుల కారణంగా 85 శాతం మంది మరణిస్తున్నారు. మొత్తం మరణాలలో మూడింట రెండువంతులకు హృదయ, క్యాన్సర్‌ వ్యాధులు కారణం అవుతున్నాయి. పెద్ద వారిలో అధిక బరువు సమస్య 1991-2009 మధ్య మూడు రెట్లు 11.8 నుంచి 29.2శాతానికి పెరిగింది. ఇది పురుషులలో ఎక్కువగా వుంది. నలభై తొమ్మిదిశాతం చైనా పురుషులు రోజూ పొగతాగుతున్నారు. ఇది ఓయిసిడి దేశాలతో పోల్చితే రెండు రెట్ల కంటే ఎక్కువ. మద్యం వినియోగం 2000-2010 మధ్య రెట్టింపైంది. సగటున తలకు 5.8లీటర్లు వుంది.

   2009లో చైనా పెద్ద ఎత్తున ఆరోగ్య సంస్కరణలు ప్రారంభించింది.నూట ముప్ఫై కోట్ల మందికి మూడు లక్షల కోట్ల యువాన్లను ఖర్చు చేయాలని తలపెట్టింది. ఫలితంగా దాదాపు నూటికి నూరుశాతం మందికి ఆరోగ్యబీమా సమకూరింది. దశాబ్దకాలంలో ఆరోగ్య సంరక్షణకు జేబులోంచి ఖర్చు చేయాల్సిన మొత్తం 60 నుంచి 30శాతానికి తగ్గింది. అయితే గ్రామీణ జనాభా మాత్రం మొత్తం ఖర్చులో సగం తమ జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. మెరుగుదల అంతటా సమంగా లేదని ఇది వెల్లడిస్తోంది.

    వందల సంవత్సరాలుగా అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిలో ఎంతో ముందున్న ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అర్ధికంగా,రాజకీయ, సైనిక రంగాలలో ఎంతో ముందున్నా మొత్తం జనానికి ఆరోగ్యబీమా కల్పించటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికీ మూడు కోట్ల మందికిపైగా (2014) 10.4 శాతం జనానికి ఆరోగ్యబీమా లేదు. వారికి జబ్బు చేస్తే మన దేశంలో సామాన్య, మధ్యతరగతి మాదిరి అప్పులపాలు కావాల్సిందే. బీమా లేని వారి సంఖ్య ఏటా ఏడుశాతం పెరుగుతున్నదని ఒకవైపు సర్వేలు తెలుపుతున్నాయి.2018 నాటికి బీమా సౌకర్యం లేనివారి సంఖ్యను 2.4కోట్లు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఆ సమస్య మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. వలస వచ్చిన వారిలో నమోదు కాని వారికి బీమా సౌకర్యం వర్తించదు, వారి సంఖ్య దీనికి అదనం. ఎంతన్నది అమెరికా ఎన్నడూ చెప్పదు. మన దేశంలో బీమా సౌకర్యం గురించి చెప్పుకోనవసరం లేదు. ప్రభుత్వ వుద్యోగులు, కొందరు ప్రయివేటు వుద్యోగులకు మినహా మిగతా సామాన్య జనంలో చాలా పరిమితంగానే బీమా పధకాలలో వున్నారు. వైద్యానికి జేబులోంచి ఖర్చు చేసే మొత్తం 85శాతం వరకు వుంటోంది.

   ఇక్కడ ఒక సమస్య గురించి ప్రస్తావించక తప్పదు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటాం. పీల్చటానికి కావాల్సినంత కాలుష్య గాలి, తాగటానికి తగినన్ని కాలుష్య జలాలు వుచితం తప్ప వాటి కారణంగా వచ్చే రోగాల బారిన పడితే అంతే సంగతులు. గాలి, నీటి కాలుష్యానికి పాల్పడేవారిని కాపాడటం తప్ప వారి బారిన పడేవారిని ఆదుకొనేందుకు ముందుకు రాని ప్రజాస్వామ్యం ! డబ్బు లేక కాదు సుమా, డబ్బు లేకపోతే ఏటా ఆరులక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్‌ సంస్ధలు, ధనికుల వజ్రవైఢూర్యాల దిగుమతులకు పన్ను రాయితీలివ్వటం ఎలా సాధ్యం? అడిగితే జవాబు చెప్పరు. మరి అత్యంత సంపద్వంతమైన భూతల స్వర్గం అమెరికాలో కూడా అందరికీ వైద్యం అందుబాటులో ఎందుకు లేకపోయింది ?

  మొత్తం 130 కోట్ల మందికి నాణ్యమైన వైద్య సౌకర్యం అందించే స్ధితికి ఇంకా చైనా చేరుకోకపోయినప్పటికీ రోగాల కారణంగా జనం అప్పుల పాలు కావటం అక్కడ లేదు. చిన్నదో పెద్దదో ఏదో ఒక బీమా ప్రతి ఒక్కరికీ వుంది.రెండువందల యాభై సంవత్సరాల స్వాతంత్య్రం, అభివృద్దిలో అమెరికా సాధించలేని విజయాన్ని చైనా అందులో నాలుగో వంతు కాలంలోనే సాధించటం ఎలా సాధ్యమైంది ? మనం ఆ బాటలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి వుంది. చైనా నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రజాస్వామ్యం అన్న జవాబు వెంటనే సిద్దంగా వుంటుంది.చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడటం ముఖ్యం అన్నారు. అలాగే మంచి గాలి కోసం కిటికీ తెరిస్తే గాలితో పాటు ఈగలూ,దోమలూ కూడా వస్తాయి, వాటిని అరికట్టగలం అన్నారు. సంస్కరణలు అంటే విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానానికి చైనా మార్కెట్‌ను తెరవటం. అది జరిగింది. అభివృద్ధితో పాటు అవినీతి, అక్రమాల వంటి అవలక్షణాలూ పుష్కలంగానే ప్రవేశించినట్లు అక్కడ జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దానిని చైనీయులేమీ దాచుకోవటం లేదు.

    కౌలుగడువు తీరి వాటిని తనలో విలీనం చేసుకొనే సందర్భంగా హాంకాంగ్‌, మకావో దీవులలో 2050 వరకు పెట్టుబడిదారీ విధానాన్ని అనుమతిస్తామని  చైనా ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అంటే దాని ప్రకారం బిలియనీర్లను అనుమతించటంతో పాటు వారు పెరగటానికి కూడా కమ్యూనిస్టుపార్టీ అంగీకరించినట్లే. ఈ కారణంగానే 2050 వరకు తమ పెట్టుబడులకు ఎలాంటి ఢోకాలేదనే ధీమాతో చైనాలో పెట్టుబడులు, ఫ్యాక్టరీలు, వ్యాపారాలు పెట్టటానికి ధైర్యంగా ముందుకు వచ్చి డబ్బు కుమ్మరించారు. దీనిని చూసి కొంత మంది చైనాలో వున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదు, అది కమ్యూనిజం బాటలో పయనించటం లేదు అని విమర్శిస్తున్నారు. చైనా ప్రభుత్వ కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి, బిలియనీర్లు తయారయ్యేందుకు వీలు కల్పిస్తోంది కనుక అధికారిక పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశం అని వర్ణిస్తున్నవారూ లేకపోలేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశాల కంటే భిన్నంగా చైనాలో జీవన ప్రమాణాలు, ఆదాయాలూ పెరుగుతున్నాయా లేదా అంటే పెరుగుతున్నాయి. పెట్టుబడిదారీ దేశం అయితే అది ఎలా సాధ్యం ? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఐరోపాలోని ధనిక దేశాలు కూడా కొన్ని సంక్షేమ చర్యలు అమలు జరిపినంత మాత్రాన వాటిని సోషలిస్టు దేశాలు అనటం లేదు అలాగే అమలు జరుపుతున్న చైనాను మాత్రం సోషలిస్టు దేశంగా ఎలా అంగీకరిస్తాం అనే వారు లేకపోలేదు. సోషలిజం, కమ్యూనిజం భావనల వ్యాప్తిని అడ్డుకొనేందుకు రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐరోపాలోని ధనిక దేశాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపాయి. కానీ గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా 2008 సంక్షోభం ప్రారంభమైన తరువాత వాటన్నింటినీ ఒక్కటొక్కటిగా రద్దు లేదా కోత పెడుతున్నాయి. ఇదే సమయంలో చైనాలో సంక్షేమ చర్యలు మరింతగా పెరుగుతున్నాయి తప్ప తగ్గుతున్నట్లు సమాచారం లేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అమలు జరుపుతున్న ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలన్నీ సంక్షోభం లేదా ఒకటి రెండు శాతం అభివృద్ధి రేటుతో మాత్రమే ముందుకు పోతుండగా చైనాలో గతంతో పోలిస్తే కొంత మేరకు తగ్గినా ఎనిమిదిశాతం వరకు అభివృద్ధి వుంది, ఇలా ఎందుకు జరుగుతోంది ?

    చివరిగా ఒక్క విషయం. మన కంటే సాగు భూమి తక్కువ, జనాభా ఎక్కువ వున్న దేశం చైనా. మనదేశంలో 65 ఏండ్లు దాటిన వృద్ధులు జనాభాలో 5.8 శాతం వుంటే అక్కడ 9.6 శాతం వున్నారు. అ ంటే వృద్దాప్య పెన్షన్లు, వారి సంక్షేమ ఖర్చూ ఎక్కువే. మన సగటు జీవన కాలం 67.8 అయితే అక్కడ 75.15 వుంది. మన పట్టణ జనాభా 31శాతం అయితే అక్కడ 50శాతం దాటింది.మన దేశంలో ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆసుపత్రి పడక వుంటే చైనాలో 3.8 వున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చైనాతో పోల్చితే మనకు అనుకూలమైనవీ, ప్రతికూలమైన పరిస్ధితులూ వున్నాయి. చైనాలో అమలు జరుపుతున్న సంస్కరణలు అక్కడ సామాన్య జనజీవితాలను మెరుగు పరచటంతో పాటు ధనికులనూ పెంచుతున్నాయి.మన దేశంలో కేవలం ధనికులను మాత్రమే పెంచుతున్నాయి.

   చైనా తనదైన ప్రత్యేక శైలిలో సోషలిజాన్ని నిర్మిస్తున్నట్లు మొదటి నుంచి చెబుతోంది. సోషలిజాన్ని ఫలానా మార్గంలో సాధించాలని లేదా ఫలానా విధంగానే నిర్మించాలని మార్క్సిస్టు మహోపాధ్యులెవరూ నిర్ధేశించలేదు. కొన్ని అంచనాలు, జోశ్యాలు, ఊహలు మాత్రమే చేశారు. అత్యంత వెనుకబడిన ఆఫ్రికా దేశాలలో, ఎంతో పురోగతి సాధించిన అమెరికా ఖండ దేశాలలో భౌతిక పరిస్ధితులు భిన్నంగా వున్నపుడు రెండు చోట్లా ఒకే విధంగా సోషలిస్టు వ్యవస్ధను సాధించటం ఎలా సాధ్యం. దేని మార్గం దానిదే. అందువలన చైనాలో జరుగుతున్నదానిని చూసి కొన్ని నిర్ధారణలకు రావాల్సిన అవసరం లేదు, చైనా అయినా మరొక కమ్యూనిస్టుపార్టీ గురించి అయినా విమర్శనాత్మక దృష్టితో చూడటం, సద్విమర్శలు చేయటంలో తప్పులేదు. ప్రపంచ వ్యాపితంగా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన స్ధితిలో కమ్యూనిజాన్ని తెగనాడితే లబ్దిపొందేది కమ్యూనిస్టు వ్యతిరేకులు మాత్రమే.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంతరాష్ట్ర మండలిలో తెలుగు చంద్రులేం ప్రసరించారు ?

18 Monday Jul 2016

Posted by raomk in AP, BJP, CPI(M), Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, inter state council meet, Inter-State Council, ISC, KCR, Modi

ఎం కోటేశ్వరరావు

     పది సంవత్సరాల తరువాత జూలై 17న న్యూఢిల్లీలో సాదాసీదాగా అంతరాష్ట్ర మండలి సమావేశం జరిగింది. కేంద్రం-రాష్ట్ర సంబంధాలు, ముఖ్యంగా నిధులు, విధుల బదలాయింపులు, రాష్ట్రాల హక్కుల గురించి చర్చ జరుగుతుందని ఎవరైనా భావిస్తారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం ఎలా వ్యవహరిస్తున్నదో దశాబ్దకాలం పాటు అసలు సమావేశం జరగపోవటమే తేటతెల్లం చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్‌-బిజెపి దొందూ దొందే. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ మదన్‌ మోహన్‌ పంఛి అధ్యక్షతన 2007 ఏప్రిల్‌ 27న బాధ్యతలు స్వీకరించిన కమిషన్‌ 2010 మార్చి 30 కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఎలాంటి ప్రచార ఆర్బాటాలు లేకుండా తన పని తాను చేసిన కమిషన్‌గా ఇది పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి ఆ కమిషన్‌ నివేదికకు కాంగ్రెస్‌ హయాంలో నాలుగు సంవత్సరాలు, బిజెపి ఏలుబడిలో రెండు సంవత్సరాలు దుమ్ము పేరుకు పోయింది.దీనిలోని సిఫార్సులను ఏకాభిప్రాయంతోనే కేంద్రం అమలు జరుపుతుందని ముక్తాయింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర అంతరాష్ట్ర మండలి సమావేశ ముగింపులో చెప్పారు. అంటే దీని సిఫార్సులు ఎప్పుడు ఆమోదం పొందుతాయో తెలియని స్ధితి.

    తెల్లవారే సరికి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్ధానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టగలిగిన బిజెపికి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఆసక్తి, అన్నింటికీ మించి నిజాయితీ వుంటే ఈ నివేదికపై సమావేశం జరపటానికి రెండు సంవత్సరాల వ్యవధి తీసుకోవాల్సిన అవసరం లేదు. సమాఖ్య స్పూర్తిని, రాజ్యాంగ నిబంధనలను దెబ్బతీయటంలో కాంగ్రెస్‌ రికార్డును తిరగరాసేందుకు బిజెపి పూనుకుందని వుత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు చేసిన పనులను బట్టి స్పష్టమైంది. తమది భిన్నమైన పార్టీ అని స్వంత డబ్బా కొట్టుకొని ఇతరులను విమర్శించే నైతిక హక్కును అది కోల్పోయింది. పూంఛీ కమిషన్‌ సిఫార్సులకు వ్యతిరేకంగా అది వ్యవహరించింది.తమది పనిచేసే ప్రభుత్వమని, కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అని చెప్పుకున్న పార్టీ, ప్రభుత్వం ఈ సమావేశ ఏర్పాటుకు ముందే కమిషన్‌ చేసిన సిఫార్సులలో వేటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందో వేటిని తిరస్కరించిందో, వేటిపై చర్చ జరగాలని కోరుకుంటోందో ఒక వైఖరిని తీసుకొని రాష్ట్రాల ముందు వుంచితే వాటి మంచి చెడ్డలపై మధనం జరిగి, ఒక కొలిక్కి వచ్చేందుకు దారి చూపేది. అదేమీ లేకుండా మొక్కుబడిగా సాగదీసేందుకు పూనుకుంది.

    ఇప్పటికే కేంద్రం-రాష్ట్రాల మధ్య వున్న సంబంధాలు, సత్సంప్రదాయాలు, వివిధ సమస్యలపై కోర్టులు వెలువరించిన అభిప్రాయాలతో కమిషన్‌ తాను వుచితం అనుకున్న సమస్యలన్నింటిపైన అభిప్రాయాలు తెలిపే విధంగా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాల కాంగ్రెస్‌, మధ్యలో అధికారంలోకి వచ్చి స్వల్పకాలమే వున్న జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాలుగానీ గతంలో వివిధ కమిషన్లు చేసిన సిఫార్సులను తుచ తప్ప కుండా లేదా వాటి స్ఫూర్తిని గానీ అమలు జరిపిన పాపాన పోలేదు. అందువలన కమిషన్లు అంటే సాగదీయటానికి, రిటైరైన న్యాయమూర్తులు, వున్నతాధికారులకు వుపాధి కల్పన అంశాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు, దాంతో జనానికి వాటిమీద విశ్వాసం పోయింది.పూంఛీ కమిషన్‌ సిఫార్సులు కూడా గత కమిషన్ల జాబితాలో చేరతాయా ?

    పూంఛీ కమిషన్‌ చేసిన ప్రధాన సిఫార్సుల సారాంశం ఇలా వుంది.కల్లోలం సంభవించిన నిర్దిష్ట ప్రాంతాలను పరిమిత కాలం పాటు కేంద్రం తన పాలన కిందకు తెచ్చుకొనేందుకు ఆర్టికల్‌ 355,356ను సవరించాలి. ఒక జిల్లా లేదా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో స్ధానిక అత్యవసర పరిస్ధితిని ప్రకటించేందుకు కేంద్రానికి అధికారం ఇచ్చే విధంగా 355,356 ఆర్టికల్స్‌ను సవరించాలి. అయితే అలాంటి అత్యవసర పరిస్థితి వ్యవధి మూడునెలలకు మించి వుండకూడదు. మత హింసాకాండ తలెత్తినపుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా స్వల్పకాలం పాటు కేంద్ర దళాలను దించేందుకు కేంద్రానికి అనుమతిచ్చే విధంగా మత హింసాకాండ బిల్లుకు సవరణ చేయాలి. సాయుధ దళాలను దించేందుకు రాష్ట్రాల అనుమతి ఆటంకంగా మారకుండా సవరణ చేయాలి.అయితే బలగాల మోహరింపు ఒక వారానికి మాత్రమే పరిమితం చేయాలి. అంతకు మించి వుండేందుకు రాష్ట్రాల అనుమతి తీసుకోవాలి.ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి ఎన్నికలకు ముందు వున్న ఎన్నికల కూటమిని ఒక రాజకీయ పక్షంగా పరిగణిస్తూ స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించాలి. ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో గవర్నర్లు ఏ పద్దతిని పాటించాలో కూడా స్పష్టం చేయాలి.ఎన్నికలకు ముందు వున్న కూటములలో ఎక్కువ సంఖ్య వున్నదానిని ఆహ్వానించాలి.ఎన్నికల అనంతరం ఏర్పడే కూటములలోని పార్టీలన్నీ ప్రభుత్వంలో చేరే విధంగా నిర్దేశించాలి. ఒక మంత్రిపై చర్య తీసుకోకూడదని మంత్రివర్గం చేసిన సిఫార్సును తోసిపుచ్చి చర్యకు అనుమతి మంజూరు చేసే అధికారం గవర్నర్లకు వుండాలి. గవర్నర్లను విశ్వవిద్యాలయాల చాన్సలర్లుగా చేసే సాంప్రదాయాన్ని రద్దు చేయాలి. గవర్నర్లుగా నియమితులయ్యే వారు స్ధానిక స్ధాయిలలో కూడా నియామకానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుండాలి. గవర్నరు సంబంధిత రాష్ట్రానికి చెందకూడదు, ప్రముఖ వ్యక్తి అయివుండాలి. గవర్నర్లను నిరంకుశంగా తొలగించకూడదు, గవర్నర్లను రాజకీయ ఫుట్‌బాల్‌ మాదిరి పరిగణించటాన్ని నిలిపివేయాలి.గవర్నర్లను ఐదేళ్ల కాలానికి నియమించాలి, మధ్యలో వారిని తొలగించాలంటే అసెంబ్లీ అభిశంసన ద్వారా మాత్రమే జరగాలి. తొలగింపునకు కారణం బాధ్యతల నిర్వహణకు సంబంధించినదై వుండాలి. గవర్నర్‌ నియామకంలో ముఖ్యమంత్రి పాత్ర వుండాలి. గవర్నర్ల నియామకానికి ప్రధాని, హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్‌, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలి.ఈ క్రమంలో వుపరాష్ట్రపతికి కూడా ప్రమేయం కల్పించవచ్చు.ఈ సిఫార్సులపై కూలంకషంగా చర్చ జరగాలి. అంతరాష్ట్ర మండలి సమావేశాలు ఏడాదికి మూడు సార్లు జరపాలి. జాతీయ సమగ్రతా మండలిని కనీసం ఏడాదికి ఒకసారి సమావేశ పరచాలి. ఎక్కడైనా మతపరమైన సమస్య తలెత్తినపుడు వెంటనే మండలిలోని ఐదుగురు సభ్యులను అక్కడికి పంపి నివేదిక తెప్పించుకోవాలి. రాష్ట్రాలపై ఏకాభిప్రాయ బాధ్యతను పెట్టబోయే ముందు కేంద్రం తన వైఖరి ఏమిటో తెలపాలి. నరేంద్రమోడీ అధికారానికి రాకముందే ఈ సిఫార్సులను చేశారు. ఒక వేళ వాటిని బిజెపి లేదా ఎన్‌డిఏ ఆమోదిస్తున్నట్లయితే వాటి స్ఫూర్తితో నిర్ణయాలు చేసి వుండవచ్చు. ఆచరణలో గవర్నర్ల విషయంలో సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించటాన్ని మనం చూశాము.

   నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగా అన్నట్లుగా కేంద్రం మొక్కుబడిగా నిర్వహించిన ఈ సమావేశం సందర్భంగా కొందరు ముఖ్యమంత్రులు, పార్టీలు కూడా అదే విధంగా వ్యవహరించాయి. అంతరాష్ట్ర మండలి సమావేశ ప్రారంభంలో ప్రధాని ప్రసంగిస్తూ పన్నుల వాటాను 32 నుంచి 42కు పెంచామని, 2014-15తో పోలిస్తే రాష్ట్రాలకు మరుసటి ఏడాది 21శాతం ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారు. మరోవైపు వాస్తవాలు అంకెలు వేరే సందేశాన్ని ఇస్తున్నాయి. రాష్ట్రాలకు ఇస్తున్న గ్రాంట్లలో గణనీయమైన కోత పెడుతున్నది కేంద్రం. ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో ఒక ముఖ్యమైన అంశం. కేంద్రం గొప్పగా చెబుతున్న 32 నుంచి 42 శాతం పన్నుల బదిలీ 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం జరుగుతుంది. బదిలీ 2015 ఏప్రిల్‌ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వ్యవధిలో జరపాలి. అంటే ఐదేండ్ల వరకు క్రమంగా పెంచుకుంటూ పోయి ఐదవ ఏట నుంచి ప్రతి ఏటా పదిశాతం నిధుల బదిలీ జరుపుతారు.దీనికి అనుగుణంగా 2015-16లో రాష్ట్రాలకు జిడిపిలో 6.3శాతం నిధులను బదలాయించాలని ప్రతిపాదించారు.సవరించిన అంచనాల ప్రకారం అది 6.1శాతానికి తగ్గింది. వాస్తవ బదిలి తరువాత గానీ తెలియదు.కేంద్రం నుంచి రాష్ట్రాలకు రెండు రకాలుగా బదిలీ జరుగుతుంది. ఒకటి పన్నుల బదిలీ. దానికేమీ షరతులు వుండవు.రెండవది గ్రాంట్లు. వీటికి సవాలక్ష షరతులు విధిస్తారు. ఇది కూడా కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో వివాదాస్పద అంశమే. గతేడాది జిడిపిలో 3.4శాతం పన్నులను రాష్ట్రాలకు బడ్జెట్‌లో చూపారు. అది సవరించిన అంచనాలలో 3.7శాతానికి పెరిగింది. చూశారా మేం ఎంత వుదారంగా వున్నామో కేంద్రం గొప్పలు చెప్పుకోవచ్చు. పన్నులలో వాటాను పెంచినప్పటికీ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది సర్‌చార్జీలు, సెస్‌ల రూపంలో వసూలు చేసి కేంద్ర ఖజానాకు చేర్చిన మొత్తం పన్ను ఆదాయంలో 6.1 నుంచి 8.1 శాతానికి పెరిగింది.ఈ మొత్తంలో రాష్ట్రాలకు వాటా వుండదు. గ్రాంట్లుగా రాష్ట్రాలకు బడ్జెట్‌లో 2.9శాతం చూపి సవరించిన దానిలో 2.4కు తగ్గించారు.వర్తమాన సంవత్సరంలో ఈ కేటాయింపులు ఎలా అమలు జరుగుతాయో చూడాల్సి వుంది. అందువలన ఆర్ధిక మంత్రి, నరేంద్రమోడీ ఏం చెప్పినప్పటికీ ఆచరణ ఏమిటన్నదే గీటురాయి. సేవా, రైతుల పేరుతో వసూలు చేసే సెస్సులన్నీ కేంద్ర ఖాతాకే పోతాయి అంటే కేంద్రానికి చేరే నిధుల శాతం మరింతగా పెరుగుతుంది.

    కేంద్ర పధకాల పేరుతో రాష్ట్రాలపై మోపుతున్న భారాల గురించి తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వంటి వారు ప్రముఖంగా తమ వైఖరిలో వెల్లడించారు.కేంద్ర ప్రాయోజిత పధకాలన్నీంటికీ గ్రాంట్ల రూపంలో తొలుత కేంద్రం నిధులు కేటాయిస్తుంది. తరువాత అసలు కధ మొదలౌతుంది. నరేంద్రమోడీ చెప్పినట్లు పన్నుల వాటా ఖరారు గాక ముందు కేంద్రం నుంచి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు బదిలీ అయ్యాయి. పన్నుల వాటాను 42శాతానికి పెంచేందుకు అంగీకరించిన కేంద్రం,ఆ వెంటనే ఎలక్ట్రానిక్‌ పాలన, మోడల్‌ స్కూళ్ల వంటి ఎనిమిది పధకాలకు అంతకు ముందు వున్న 60:40 దామాషాలో వున్న నిధుల కేటాయింపులో కేంద్ర వాటాను తగ్గించింది. మిగతా పధకాలకు నిధుల విడుదలకు షరతులను కఠినతరం గావించింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్మే నిధుల మొత్తం పెరిగిన తరువాత రాష్ట్రాల రుణ భారం, ఆర్దిక వత్తిడి తగ్గాలి. అయితే బడ్జెట్లలో చూపిన దానికంటే 16 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు తీసుకున్నట్లు జపాన్‌ సంస్ధ నోమురా నివేదిక తెలిపింది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటాన్ని కేరళ ముఖ్యమంత్రి తప్పుపట్టారు. పూంఛీ కమిటీ సిఫార్సులపై చర్చకు ఒక స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

     తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో చేసిన ప్రసంగ పూర్తి పాఠాలను మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు తన రీతికి తగినట్లుగా 13పేజీల ప్రసంగం చేస్తే చంద్రశేఖరరావు ఏడు పేజీలకే పరిమితం అయ్యారు. అందువలన వారిద్దరూ ఏం చెప్పారనే అంశాన్ని పరిశీలించుదాం. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రసంగ సారాంశం ఇలా వుంది. జాతీయ రహదారులకు కేంద్రం కేటాయింపులు పెంచటం మంచిదే అదే సమయంలో సాగునీరు, విద్య, ఆరోగ్య రంగానికి కూడా నిధులు పెంచాలి. సాగునీటి రంగంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక భారీ పధకానికి కేంద్రం నిధులు ఇవ్వాలి.వుమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి కేంద్రం ఏదైనా నూతన చట్టం లేదా వున్న వాటికి సవరణలు తీసుకురాదలిస్తే ప్రతి సందర్భంలోనూ రాష్ట్రాల ఆమోదం తీసుకోవాలి. ఒక వేళ ఆర్ధికంగా భారం మోపేదైతే కేంద్రమే పూర్తిగా చెల్లించాలి. వుదాహరణకు విద్యాహక్కు చట్టాన్ని అమలు జరపాలంటే ఏటా తెలంగాణా ఒక్కదానికే 300 కోట్ల రూపాయలు అవసరం. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మోడల్‌ స్కూళ్ల వంటి వాటికి ఇప్పుడు నిధులు పూర్తిగా నిలిపివేశారు, వేతనాలు, ఇతర ఖర్చులు రాష్ట్రాలకు భారం అవుతున్నాయి. కేంద్రం ప్రకటించే ఏ పధకానికైనా మధ్యలో నిధులు నిలిపివేయటం గాక దాని నిర్వహణకు అయ్యే పూర్తి మొత్తాన్ని కేంద్రమే భరించాలి. వుమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వ సంస్ధల ఏకపక్ష అదుపును నివారించాలి. వుదాహరణకు విశ్వవిద్యాలయాలు నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఇవ్వకుండా కాలేజీలకు ఏఐసిటిఇ అనుమతులు ఇవ్వరాదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన సమాయానికి ఈ సంస్ధ అనుమతులు ఇచ్చిన ఇంజనీరింగ్‌ కాలేజీలు 356వరకు వున్నాయి.తగిన వసతులు లేని కారణంగా విశ్వవిద్యాలయాలు అనుబంధాలను రద్దు చేసిన కారణంగా వాటి సంఖ్య 172కు పడిపోయాయి. కొద్ది సంఖ్యలో వున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు యుజిసి నిధులలో 65శాతం, మిగతావాటన్నింటికీ కలిపి 35శాతం నిధులు ఖర్చు చేయటం అన్యాయం.గవర్నర్ల ఎంపికలో రాష్ట్రాలను సంప్రదించాలి. ఏదైనా ఒక బిల్లును నిరవధికంగా నిలిపివుంచే విచక్షణాధికారం గవర్నర్లకు వుండకూడదు, ఒక కాలపరిమితి నిర్ణయించాలి. విశ్వవిద్యాలయాలకు గవర్నర్లను ఛాన్సలర్లుగా చేయరాదన్న పూంఛీ కమిషన్‌ సిఫార్సుకు మద్దతు ఇస్తున్నాం, దానిని ఇప్పటికే అమలు జరిపాము. అంతరాష్ట్ర నదీ జలవివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్‌ నిర్ణీత వ్యవధిలో ఇచ్చే విధంగా నిర్ధేశించాలి, కేంద్రం మరింత నిర్ణయాత్మక పాత్ర వహించాలి.

      ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రసంగ సారాంశం ఇలా వుంది. సర్కారియా, ప్రస్తుత పుంఛీ కమిషన్‌ సిఫార్సులకు విరుద్దంగా ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేశారు. అది అశాస్త్రీయంగా వుండటమే గాక మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బందులను కలిగించింది.అందరికీ వర్తించేదిగా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి భిన్న ప్రమాణాలను పాటించారు. వుదాహరణకు జనాభాలో 58శాతం వున్న రాష్ట్రానికి వుమ్మడి రాష్ట్ర ఆదాయంలో 46శాతమే కేటాయించారు. అప్పులను జనాభా ప్రాతిపదికన, ఆస్థులను మాత్రం ఎక్కడివి అక్కడే అన్న పద్దతిలో పంచారు. విద్యుత్‌ రంగంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. రాష్ట్ర దుస్థితిని తగ్గించేందుకు ప్రధాన మంత్రి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది.పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేందుకు కేంద్రం మౌలిక సదుపాయాల కల్పన, ఆర్ధికంగానూ ఎంతో సాయం చేయాల్సి వుంది.రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రధాన మంత్రి చేసిన హామీలన్నింటినీ అమలు జరిపేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రత్యేక రాష్ట్ర తరగతి హోదా, రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి పూర్తి చేయటం, విశాఖ రైల్వే జోన్‌ మంజూరు, పరిశ్రమలకు పన్నుల రాయితీలు కల్పిస్తూ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక పధకం, వనరుల లోటు పూడ్చేందుకు అవసరమైన గ్రాంటు మంజూరు చేయాలి. చివరి రాష్ట్రంగా వున్నందున ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నది, గోదావరి, కృష్ణ బోర్డులను ఈ రోజు వరకు వేయలేదు.

     గవర్నరన్లు ఐదేండ్ల వ్యవధికి నియమించాలన్న పూంఛీ సిఫార్సుల వంటికి కొన్ని ఆచరణ సాధ్యం కాదు, తగిన విధంగా లేవు.గవర్నర్ల అభిశంసనకు అనుసరించాల్సిన పద్దతిపై సిఫార్సు అంగీకారం కాదు. బిల్లుల ఆమోదం, సూచనలకు ఆరునెలల వ్యవధి అవసరం లేదు, ఒక నెల చాలు. స్ధానికంగా అత్యవసర పరిస్ధితి విధింపునకు 355,356 ఆర్టికల్‌ను సవరించకూడదు. అది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని అతిక్రమించటమే. ఆర్ధిక మంత్రుల సాధికార కమిటీ పనితీరును చూసిన తరువాత ఇతర రంగాలకు అలాంటి సాధికార కమిటీలను వేయటం సరైంది కాదు. రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తే పెద్ద రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం. కేంద్ర బలగాలను ఏకపక్షంగా నియమించటం ఫెడరలిజం సూత్రానికే విరుద్దం.జల వివాదాలపై ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులపై అప్పీలుకు సుప్రీం కోర్టుకు వెళ్లాలనటం సరైంది కాదు, రాజ్యాంగ బద్దంగా అప్పిలేట్‌ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి.

    ఇద్దరు ముఖ్య మంత్రులు చేసిన ప్రసంగ పాఠాలను చూసినపుడు చంద్రశేఖరరావు ఆర్ధికాంశాలపై ఎక్కువగా కేంద్రీకరించారు.చంద్రబాబు నాయుడు వాటిని దాదాపుగా విస్మరించారు. ఎవడబ్బ సొమ్మంటూ కేంద్రంపై ధ్వజమెత్తిన ఎన్‌టిరామారావు వారసులమని చెప్పుకొనే చంద్రబాబు నాయుడు ఏపీకి ఇస్తామన్న నిధుల గురించి అడిగారు తప్ప రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులు, విధుల గురించి విస్మరించటం విస్మయం గొలుపుతోంది. మాకు మా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే చాలు ఇంకేమీ లేదు, బంగారు తెలంగాణాగా మార్చుకుంటాం అని వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చిన చంద్రశేఖరరావుకు కేంద్ర పధకాల భారపు సెగతగలటం, తెలంగాణాను బంగారంగా మార్చటం సాధ్యం కాదని అర్ధమైందేమో అనివార్యంగా నిధుల గురించి నిర్మొహమాటంగా చెప్పాల్సి వచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మొక్కజొన్న తోటల్లో చీకట్లు ముసరనున్నాయా ?

16 Saturday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Telangana

≈ Leave a comment

Tags

corn, corn imports, corn msp, corn prices, india corn imports

ఎం కోటేశ్వరరావు

    అమెరికాలో సాధారణం కంటే ఎక్కువగా సాగు చేశారన్న అక్కడి వ్యవసాయశాఖ అంచనాతో ప్రపంచ మార్కెట్‌లో మొక్క జొన్నల ధరలు పడిపోయాయి. మన దేశంలో పత్తి సాగును తగ్గించిన రైతాంగం మొక్కజొన్న వైపు మొగ్గిందనే వార్తలతో తన విత్తన వ్యాపారం మూడు జొన్న కర్రలు ఆరు పొత్తులుగా పెరుగుతుందని మోన్‌శాంటో కంపెనీ లాభాల లెక్కలు వేసుకొంటోంది. గత రెండు సంవత్సరాలుగా వుత్పత్తి తగ్గిన కారణంగా దొంగ నిల్వదారుల చర్యలను వమ్ము చేసేందుకు, ధరలను తగ్గించేందుంటూ మొక్కజొన్నల దిగుమతికి అనుమతిస్తూ నరేంద్రమోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకోవటంతో టన్ను పద్దెనిమిదివేలు వున్న ధర అమాంతం పద్నాలుగు వేలకు పడిపోయింది.అనేక రికార్డులను బద్దలు చేస్తున్న మోడీ సర్కార్‌ పాతిక సంవత్సరాల క్రితం గరిష్టంగా వున్న రెండున్నరలక్షల టన్నుల దిగుమతి రికార్డును బద్దలు కొడుతూ ఐదు లక్షల టన్నులకు అనుమతించింది. వాటిపై దిగుమతి పన్నుకు పూర్తి మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయ పర్యవసానాలు ఎవరికి మేలు చేస్తాయి, ఎవరికి కీడు చేస్తాయి ?

     మొక్క జొన్నలు ప్రధానంగా కోళ్ల, పశుదాణా, గంజి పౌడరు తయారీకి వినియోగిస్తారు. ధరలు ఎక్కువగా వున్నాయి కనుక ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతులకు అనుమతివ్వాలని వ్యాపారులు చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గిందా? లేక తమ వద్ద పేరుకుపోతున్న నిల్వలను తగ్గించుకొనేందుకు అమెరికా సర్కార్‌ చేసిన వత్తిడికి మోడీ సర్కార్‌ లొంగి పోయిందా ? ప్రభుత్వం అంటే సమాజంలో అన్ని తరగతులకు సమన్యాయం చేయాల్సిన బాధ్యత కలిగినది. గత నాలుగు సంవత్సరాలుగా పెరిగిన వ్యవసాయ ఖర్చులతో పోల్చుకుంటే మొక్కజొన్నలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తక్కువే. క్వింటాలుకు రు.1310 నుంచి 1365కు మాత్రమే పెంచింది.అంటే ఏడాదికి సగటున 14 రూపాయలకు లోపు, ఇదే సమయంలో గుడ్డు ధరలు ఎంత పెరిగాయి? రైతులకు హైదరాబాదులో 2013 జూలైలో ఒక గుడ్డుకు సగటున 306.7పైసలు లభిస్తే అదే 2016 జూలైలో 360 పైసలకు పెరిగింది. ఇక వినియోగదారుల విషయానికి వస్తే 311 నుంచి 414.80పైసలకు పెరిగింది. ఇవి జాతీయ గుడ్ల సమన్వయ కమిటి ప్రకటించిన రేట్లు, చిల్లర దుకాణాలలో హైదరాబాదులో గత కొద్ది వారాలుగా ఐదు రూపాయలు అమ్ముతున్నారు. ఒక గుడ్డుకే ఇంత ధర పెరిగితే మొక్క జొన్నలకు క్వింటాలకు నాలుగు సంవత్సరాలలో 55 రూపాయలు పెరచటాన్ని ఏమనాలి? టోల్‌ టాక్సు పెంపుదలకు ద్రవ్యోల్బణం, వుద్యోగులు, కార్మికుల వేతనాలు, కరవు భత్యం పెంపుదలకు ఇలా ప్రతి దాని ధరల పెంపుదలకు ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్న సర్కార్‌ మొక్కజొన్నల మద్దతు ధరల పెంపుదలకు దానిని ఎందుకు వర్తింపచేయటం లేదు ? వరుసగా 2012 నుంచి 2015 వరకు వినియోగదారుల (సిపిఐ) ద్రవ్యోల్బణం 11.17,9.13,5.86,6.32 శాతం చొప్పున పెరిగింది. ప్రభుత్వం 2013-14 సంవత్సరానికి మొక్క జొన్నలకు ప్రకటించిన మద్దతు ధర రు.1310. అంతకు ముందు 2012 (డిసెంబరు నుంచి డిసెంబరు) ద్రవ్యోల్బణం రేటు 11.17శాతం అంటే 2012-13 సంవత్సరానికి గాను క్రితపు ఏడాది ప్రకటించిన రు.1175 మీద రు.131 పెంచాల్సి వుండగా నాలుగు రూపాయలు కలిపి 1310 చేశారు. మరుసటి ఏడాది ద్రవ్యోల్బణం రేటు 9.17 శాతానికి గాను 2014-15లో 119 రూపాయలు కలిపి రు.1429కి పెంచాల్సి వుండగా రు.1310నే కొనసాగించారు. 2015-16కు గాను మరో 83పెంచి రు.1512 కు బదులు 1325, 2016-17కు 95 రూపాయలు పెంచి రు1607 బదులు రు.1365గా మాత్రమే నిర్ణయించారు. సీజన్‌లో ప్రభుత్వ మద్దతు ధరలకు అటూ ఇటుగా మాత్రమే బహిరంగ మార్కెట్‌లో రైతాంగానికి దక్కుతున్న విషయం తెలిసిందే.

    తెలంగాణాలో దాదాపు ఎనిమిది లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో రెండున్న లక్షల హెక్టార్లలో మొక్క జొన్న సాగు అవుతోంది. తెలంగాణాలో ఇదే మూడవ పెద్ద పంటగా వుంది. అందువలన అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో వచ్చే మార్పులు తెలంగాణా రైతాంగంపై ప్రధానంగా ప్రభావం చూపుతాయని వేరే చెప్పనవసరం లేదు. చైనా నుంచి డిమాండ్‌ తగ్గటం కారణంగా ప్రపంచ మార్కెట్లో గణనీయంగా ధరలు పడిపోయాయి. దీనికి తోడు అమెరికాలో పెద్ద ఎత్తున నిల్వలు వుండిపోయాయి. కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున మొక్క జొన్నలు దిగుమతి చేసుకొనేందుకు నిర్ణయించిందంటే భారీ మొత్తంలో ఎగుమతి సబ్సిడీలు పొందే అమెరికా వ్యాపారులు ముందుగా లబ్ది పొందుతారు.మన దేశంలో సాధారణ వినియోగం ఏటా 20మిలియన్‌ టన్నులు వుంది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే మన దేశంలో మొక్క జొన్నల వుత్పత్తి 2015-16లో 23.67 నుంచి 21.02 మిలియన్‌ టన్నులకు పడిపోయినట్లు అంచనా. ఇది సాధారణ వినియోగం కంటే స్వల్పంగా ఎక్కువే. అంతకు ముందు 17 మిలియన్‌ టన్నులకు పడిపోయిన సందర్బాలలో కూడా మనం దిగుమతులు చేసుకోలేదు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి లేకున్నా దిగుమతులకు నిర్ణయించటం గమనించాల్సిన అంశం. మన దేశంలో ఆహార వినియోగం 17-20శాతం కాగా, దాణాగా 60-62శాతం, మిగిలింది విత్తనాలు, పారిశ్రామిక వినియోగంలో వున్నట్లు ఫిక్కీ నివేదిక పేర్కొన్నది.మాంసానికి పెంచే బ్రాయిలర్‌ కోడికి ఐదు వారాలలో 3.6 నుంచి 4 కిలోలు, గుడ్లు పెట్టే కోడికి ఏటా 42-47కిలోలను దాణా వేస్తారు. ఇది ప్రధానంగా మొక్కజొన్నలతో తయారు చేస్తారు. మొక్క జొన్నలకు ప్రత్యామ్నాయంగా వున్న జొన్నల లభ్యత సమస్యగా వుండటంతో మొక్కజొన్నలపైనే ప్రధానంగా పరిశ్రమ ఆధారపడుతోంది.

     వర్షాభావం కారణంగా రెండు సంవత్సరాలుగా వుత్పత్తి తగ్గినప్పటికీ ఈ ఏడాది సాగు 20-30శాతం వరకు పెరగవచ్చని, పత్తిసాగు తగ్గుతుందని కన్సెల్టెన్సీలు తమ ఖాతాదార్లకు సమాచారం పంపాయి. ఈ కారణంగానే మోన్‌శాంటో పెద్ద ఎత్తున విత్తనాలను రంగంలోకి దించి లాభాలను పెంచుకోవచ్చని అంచనా వేసుకున్నది.దానికి అనుగుణంగానే స్టాక్‌ ఎక్సేంజ్‌లలో దాని షేరు విలువ కూడా పెరిగింది.

     మార్కెట్‌ మాయాజాలం విషయానికి వస్తే 2011-12లో అమెరికాలో టన్ను మొక్కజొన్న ధర 295-300డాలర్ల మధ్య వుండగా మన దేశ కనీస మద్దతు ధర నాటి రూపాయి విలువలో 9800, డాలర్లలో 211 వుంది. 2014-15లో అమెరికా ధర 170-175 డాలర్లకు పడిపోగా మన దేశంలో 13,100 రూపాయలకు, 215 డాలర్లకు పెరిగింది. అందువలన దిగుమతులు చౌకగా మారాయి. ఈ కారణంగా మన ప్రభుత్వ దిగుమతులపై పన్ను విధించి దిగుమతులను నిరుత్సాహపరచింది. ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో జూలై 14న రోజువారీ మండీ ధర 164 డాలర్లు కాగా జూలై 16వ తేదీ ముందస్తు మార్కెట్‌ ధర 142 డాలర్లు వుంది.మన రూపాయి విలువ తగ్గిన కారణంగా పన్నెండు వేల రూపాయలకే టన్ను మొక్కజొన్నలు వస్తాయి. జూలై 16న తెలంగాణాలోని వివిధ మార్కెట్లలో క్వింటాలు ధర 1100 నుంచి 1680, ఆంధ్రప్రదేశ్‌లో 1310-1500 మధ్య వుంది. గతేడాది పత్తి రైతుల అనుభవం చూస్తే వారు పూర్తిగా అమ్ముకున్న తరువాత క్వింటాలు ఆరువేల రూపాయల వరకు పెరిగింది, దానితో విదేశీ కంపెనీలు లాభపడ్డాయని తాము నష్టపోయామని నూలు మిల్లుల యజమానులు గగ్గోలు పెట్టటంతో కొద్ది రోజుల పాటు మిల్లులను మూసివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మొక్క జొన్నల విషయంలో పంట చేతికి వచ్చే తరుణానికి దిగుమతుల కారణంగా గతేడాది కంటే ధరలు తగ్గితే అందుకు బాధ్యత కేంద్రానిది, కేంద్ర చర్యలపై నోరు మెదపని రాష్ట్రాలది అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Index Numbers of Wholesale Price in India rose by 1.4 percent

14 Thursday Jul 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Index Numbers, Index Numbers of Wholesale Price, Wholesale Price in India

The official Wholesale Price Index for ‘All Commodities’ (Base: 2004-05=100) for the month of June, 2016 rose by 1.4 percent to 182.0 (provisional) from 179.4 (provisional) for the previous month.

INFLATION

The annual rate of inflation, based on monthly WPI, stood at 1.62% (provisional) for the month of June, 2016 (over June, 2015) as compared to 0.79% (provisional) for the previous month and -2.13% during the corresponding month of the previous year.  Build up inflation rate in the financial year so far was 3.82% compared to a build up rate of 1.70% in the corresponding period of the previous year.

Inflation for important commodities / commodity groups is indicated in Annex-1 and Annex-II.

The movement of the index for the various commodity groups is summarized below:-

PRIMARY ARTICLES (Weight 20.12%)

The index for this major group rose by 2.9 percent to 262.8 (provisional) from 255.3 (provisional) for the previous month. The groups and items which showed variations during the month are as follows:-

The index for ‘Food Articles’ group rose by 2.9 percent to 279.0 (provisional) from 271.1 (provisional) for the previous month due to higher price of fruits & vegetables and urad (8% each), gram (7%), tea and maize (3% each), rice and wheat   (2% each) and barley, milk, mutton and fish-marine (1% each).  However, the price of moong (4%), poultry chicken and ragi (2% each) and pork, bajra, beef & buffalo meat and masur (1% each) declined.

The index for  ‘Non-Food Articles’ group rose by 2.1 percent to 231.2 (provisional) from 226.4 (provisional) for the previous month due to higher price of linseed (12%), raw cotton (11%), fodder (5%), raw jute (4%), cotton seed (3%),      raw rubber,  rape & mustard seed, raw wool and groundnut seed (2% each) and sunflower (1%).  However, the price of      flowers (9%), safflower (kardi seed) (5%), copra (coconut) (4%), castor seed (3%),  gingelly seed, guar seed and niger seed (2% each) and raw silk and mesta (1% each) declined.

The index for ‘Minerals’ group rose by 6.9 percent to 199.0 (provisional) from 186.2 (provisional) for the previous month due to higher price of manganese ore (17%), crude petroleum (11%), iron ore (5%), copper ore (2%) and chromite (1%). However, the price of sillimanite (6%), phosphorite (2%) and magnesite (1%) declined.

FUEL & POWER (Weight 14.91%)

The index for this major group rose by 3.4 percent to 186.5 (provisional) from 180.3 (provisional) for the previous month due to higher price of furnace oil (13%), aviation turbine fuel (11%), high speed diesel (8%), petrol (5%), kerosene (2%) and LPG (1%).  However, the price of non-coking coal (12%) and bitumen (2%) declined.

MANUFACTURED PRODUCTS (Weight 64.97%)

The index for this major group rose by 0.2 percent to 156.0 (provisional) from 155.7 (provisional) for the previous month. The groups and items for which the index showed variations during the month are as follows:-

The index for ‘Food Products’ group rose by 0.9 percent to 186.9 (provisional) from 185.3 (provisional) for the previous month due to higher price of tea dust (unblended) (5%), sooji (rawa) (4%), vanaspati (3%), oil cakes, cotton seed oil,     mixed spices, wheat flour (atta), groundnut oil and tea dust (blended) (2% each) and gur, sugar, tea leaf (unblended),     palm oil,  powder milk, gola (cattle feed), maida and mustard & rapeseed oil (1% each).  However, the price of tea leaf (blended) (5%), processed prawn (3%), gingelly oil (2%) and copra oil (1%) declined.

The index for ‘Beverages, Tobacco & Tobacco Products’ group rose by 0.8 percent to 220.7 (provisional) from 219.0 (provisional) for the previous month due to higher price of imfl – blended (5%) and cigarette (3%).  However, the price of      beer (4%), rectified spirit (2%) and dried tobacco and soft drinks & carbonated water (1% each) declined.

The index for ‘Textiles’ group rose by 0.2 percent to 140.9 (provisional) from 140.6 (provisional) for the previous month due to higher price of gunny and hessian cloth (2%), tyre cord fabric, jute yarn, jute sacking cloth and cotton yarn (1% each).  However, the price of   man made fabric and jute sacking bag (1% each) declined.

The index for ‘Wood & Wood Products’ group declined by 0.2 percent to 196.6 (provisional) from 197.0 (provisional) for the previous month due to lower price of  plywood & fibre board (2%).  However, the price of timber / wooden planks and processed wood (2% each) moved up.

The index for ‘Paper & Paper Products’ group rose by 0.3 percent to 155.9 (provisional) from 155.4 (provisional) for the previous month due to higher price of paper rolls (2%) and newsprint (1%).

The index for ‘Leather & Leather Products’ group declined by 0.1 percent to 145.5 (provisional) from 145.7 (provisional) for the previous month due to lower price of leather handbags/wallets (3%), footwear/safety boot (2%) and other leather foot wear (1%).  However, the price of leather gloves (2%) and crome tanned leather and leather shoe upper (1% each) moved up.

The index for ‘Rubber & Plastic Products’ group rose by 0.1 percent to 146.1 (provisional) from 146.0 (provisional) for the previous month due to higher price of plastic products (1%).  However, the price of tubes (7%) and rubber products     (1% each) declined.

The index for ‘Chemicals & Chemical Products’ group rose by 0.5 percent to 150.9 (provisional) from 150.1 (provisional) for the previous month due to higher price of ammonium sulphate (4%), rubber chemicals (2%) and basic organic chemicals, paints, urea, polymers, non-cyclic compound, basic inorganic chemicals, antibiotics and dye & dye intermediates (1% each).  However, the price of lacquer & varnishes (1%) declined.

The index for ‘Non-Metallic Mineral Products’ group declined by 0.6 percent to 177.7 (provisional) from 178.7 (provisional) for the previous month due to lower price of marbles (8%) and asbestos corrugated sheet (4%).  However, the price of railway sleeper and polished granite (2% each) and lime (1%) moved up.

The index for ‘Basic Metals, Alloys & Metal Products’ group declined by 0.6 percent to 153.9 (provisional) from 154.9 (provisional) for the previous month due to lower price of rounds (5%), wire rods and billets (4% each), sponge iron,     pencil  ingots and angles (3% each),  melting scrap, gp/gc sheets, joist & beams and rebars (2% each) and steel structures,     plates,  pressure cooker, HRC, utensils (other than aluminium), CRC and metal containers (1% each).  However, the price of furniture (4%), silver (2%) and gold & gold ornaments, pipes/tubes/rods/strips, aluminium and steel: pipes & tubes (1 % each) moved up.

The index for ‘Machinery & Machine Tools’ group declined by 0.1 percent to 135.3 (provisional) from 135.5 (provisional) for the previous month due to lower price of fibre optic cable (10%), electric motor starters (4%), grinding /wet coffee machinery (3%) and pvc insulated cable, ball/roller bearing, electric motors and machine tools (1% each).  However, the price of lifts (2%) and heating elements, engines, insulators, industrial valves and washing / laundry machines (1%each) moved up.

The index for ‘ Transport, Equipment & Parts ‘ group rose by  0.1  percent to 139.4 (provisional) from 139.3 (provisional) for the previous month due to higher price of tractors (2%)

FINAL INDEX FOR THE MONTH OF APRIL, 2016 (BASE YEAR: 2004-05=100)

For the month of April, 2016, the final Wholesale Price Index for ‘All Commodities’ (Base: 2004-05=100) stood at 177.8 as compared to 177.0 (provisional) and annual rate of inflation based on final index stood at 0.79 percent as compared to 0.34 percent (provisional) respectively as reported on 16.05.2016.

Annexure-I

Wholesale Price Index and Rates of Inflation (Base Year: 2004-05=100)

Month of June, 2016
Commodities/Major Groups/Groups/Sub-Groups Weight WPI June- 2016 Latest month over month Build up from March Year on year
2015-16 2016-17 2015-16 2016-17 2015-16 2016-17
ALL COMMODITIES 100.00000 182.0 0.62 1.45 1.70 3.82 -2.13 1.62
PRIMARY ARTICLES 20.11815 262.8 2.01 2.94 4.23 6.79 -0.48 5.50
Food Articles 14.33709 279.0 2.63 2.91 3.45 7.51 3.12 8.18
Cereals 3.37323 245.6 0.22 1.87 -0.04 1.78 -0.39 6.32
Rice 1.79348 245.2 1.19 2.34 1.54 2.72 -1.62 3.37
Wheat 1.11595 225.2 -1.08 1.76 -2.18 -1.31 1.84 6.83
Pulses 0.71662 400.2 11.07 3.73 22.61 15.50 36.78 26.61
Vegetables 1.73553 297.3 13.12 17.09 17.30 39.97 -6.82 16.91
Potato 0.20150 248.7 8.54 11.57 0.00 54.38 -51.60 64.48
Onion 0.17794 255.4 12.98 3.03 7.58 -6.65 19.07 -28.60
Fruits 2.10717 260.9 -1.64 0.42 0.98 9.85 7.60 5.97
Milk 3.23818 258.0 0.08 0.94 1.05 1.61 5.18 3.24
Egg, Meat & Fish 2.41384 305.4 3.02 0.13 -1.31 1.53 -2.25 6.67
Non-Food Articles 4.25756 231.2 0.92 2.12 7.95 5.19 1.16 5.72
Fibres 0.87737 238.8 0.05 8.25 8.07 14.31 -11.63 14.26
Oil Seeds 1.78051 224.1 1.11 0.90 6.95 5.91 3.06 2.52
Minerals 1.52350 199.0 -1.26 6.87 3.21 3.16 -27.64 -20.75
FUEL & POWER 14.91021 186.5 0.73 3.44 2.93 8.18 -8.86 -3.62
Liquefied petroleum gas 0.91468 161.2 -0.31 0.56 0.06 0.69 -4.85 -0.98
Petrol 1.09015 166.0 2.36 4.80 10.18 11.56 -7.10 -8.74
High speed diesel 4.67020 214.4 1.15 7.68 4.33 16.97 -9.86 1.13
MANUFACTURED PRODUCTS 64.97164 156.0 -0.06 0.19 0.19 1.23 -0.77 1.17
Food Products 9.97396 186.9 0.12 0.86 1.41 4.06 -0.46 8.35
Sugar 1.73731 207.8 -2.25 0.78 -5.56 9.20 -13.26 26.09
Edible Oils 3.04293 154.3 1.43 1.25 3.04 3.07 2.83 3.42
Beverages, Tobacco & Tobacco Product 1.76247 220.7 0.05 0.78 1.38 4.20 3.99 7.14
Cotton Textiles 2.60526 158.5 0.38 0.57 0.76 1.73 -4.96 -0.25
Man Made Textiles 2.20573 128.4 -0.07 -0.31 0.98 -0.54 -1.03 -4.11
Wood & Wood Products 0.58744 196.6 0.10 -0.20 3.69 -0.20 5.24 -0.05
Paper & Paper Products 2.03350 155.9 0.00 0.32 0.26 0.06 2.54 1.70
Leather & Leather Products 0.83509 145.5 0.21 -0.14 1.48 -0.21 -0.96 0.76
Rubber & Plastic Products 2.98697 146.1 0.34 0.07 0.88 0.55 -0.33 -2.34
Chemicals & Chemical Products 12.01770 150.9 0.13 0.53 0.40 0.87 -1.17 -0.40
Non-Metallic Mineral Products 2.55597 177.7 0.40 -0.56 -1.06 -0.39 4.62 0.51
Cement & Lime 1.38646 174.8 0.81 -0.34 -2.25 -0.51 4.95 0.63
Basic Metals Alloys & Metal Product 10.74785 153.9 -0.94 -0.65 -1.98 0.33 -4.91 -3.02
Iron & Semis 1.56301 135.5 -1.42 -1.95 -2.15 -0.59 -9.67 -7.00
Machinery & Machine Tools 8.93148 135.3 0.15 -0.15 0.15 0.15 0.52 0.07
Transport Equipment & Parts 5.21282 139.4 0.00 0.07 0.29 0.29 1.18 1.23

 

 


 Annexure-II
 
Trend of Rate of Inflation for some important items during last six months
 
Commodities/Major Groups/Groups/Sub-Groups Weight (%) Rate of Inflation for the last six months
June-16 May-16 Apr-16 Mar-16 Feb-16 Jan-16
ALL COMMODITIES 100.00 1.62 0.79 0.79 -0.45 -0.85 -1.07
PRIMARY ARTICLES 20.12 5.50 4.55 3.41 2.97 2.03 4.30
Food Articles 14.34 8.18 7.88 4.70 4.09 3.91 6.46
Cereals 3.37 6.32 4.60 4.24 4.41 3.30 2.91
Rice 1.79 3.37 2.22 1.75 2.18 -0.08 -0.13
Wheat 1.12 6.83 3.85 5.00 5.89 6.03 5.54
Pulses 0.72 26.61 35.56 36.55 34.41 38.37 45.03
Vegetables 1.74 16.91 12.94 2.90 -2.03 -2.94 12.71
Potato 0.20 64.48 60.01 40.84 6.55 -7.39 -17.08
Onion 0.18 -28.60 -21.70 -17.89 -17.71 -10.20 7.45
Fruits 2.11 5.97 3.80 -1.81 -2.58 -1.66 -2.03
Milk 3.24 3.24 2.36 2.83 2.67 1.74 1.42
Egg, Meat & Fish 2.41 6.67 9.75 3.27 3.69 3.40 5.90
Non-Food Articles 4.26 5.72 4.48 7.26 8.49 7.09 9.35
Fibres 0.88 14.26 5.60 5.17 8.01 10.17 7.97
Oil Seeds 1.78 2.52 2.73 6.07 3.52 3.46 5.76
Minerals 1.52 -20.75 -26.78 -18.69 -20.72 -27.65 -29.27
FUEL & POWER 14.91 -3.62 -6.14 -4.83 -8.30 -7.06 -9.89
Liquefied petroleum gas 0.91 -0.98 -1.84 -1.84 -1.60 -0.37 -1.26
Petrol 1.09 -8.74 -10.86 -4.18 -9.87 -1.03 -5.45
High speed diesel 4.67 1.13 -5.01 -3.94 -9.79 -7.75 -13.00
MANUFACTURED PRODUCTS 64.97 1.17 0.91 1.04 0.13 -0.52 -1.17
Food Products 9.97 8.35 7.54 8.72 5.58 4.34 2.79
Sugar 1.74 26.09 22.30 17.34 9.05 5.23 -0.55
Edible Oils 3.04 3.42 3.60 5.41 3.38 2.40 1.64
Beverages, Tobacco & Tobacco Product 1.76 7.14 6.36 7.23 4.23 2.91 2.13
Cotton Textiles 2.61 -0.25 -0.44 -0.44 -1.20 -1.27 -2.14
Man Made Textiles 2.21 -4.11 -3.88 -2.79 -2.64 -2.34 -2.72
Wood & Wood Products 0.59 -0.05 0.25 2.97 3.85 3.80 3.49
Paper & Paper Products 2.03 1.70 1.37 1.37 1.90 2.64 2.78
Leather & Leather Products 0.84 0.76 1.11 2.31 2.46 2.96 1.75
Rubber & Plastic Products 2.99 -2.34 -2.08 -1.75 -2.02 -1.89 -2.15
Chemicals & Chemical Products 12.02 -0.40 -0.79 -0.66 -0.86 -0.73 -1.32
Non-Metallic Mineral Products 2.56 0.51 1.48 0.17 -0.17 0.62 1.83
Cement & Lime 1.39 0.63 1.80 0.11 -1.13 -0.92 1.05
Basic Metals Alloys & Metal Product 10.75 -3.02 -3.31 -4.46 -5.25 -7.89 -9.30
Iron & Semis 1.56 -7.00 -6.50 -8.53 -8.46 -12.82 -13.46
Machinery & Machine Tools 8.93 0.07 0.37 0.52 0.07 -0.15 -0.44
Transport Equipment & Parts 5.21 1.23 1.16 1.38 1.24 1.39 1.46

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

బ్రిటన్‌పై ఐరోపా ధనిక దేశాల ఆగ్రహం

26 Sunday Jun 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

brexit, EU, European Union, Europeans angry

ఎం కోటేశ్వరరావు

    కొన్ని గంటల్లోనే ఎంత తేడా !’విడాకులివ్వాలని నిర్ణయించుకున్న తరువాత రోషం, పౌరుషం వున్నవాళ్లెవరైనా వెంటనే ఇల్లు వదలి వెళ్లి పోవాలి.ఇక్కడే వుండి మరో నాలుగు నెలల తరువాత నోటీసు పంపుతాను అనటం ఏమిటి? మనం ఏమైనా పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకుంటున్నామా లేక మన మధ్య సన్నిహితమైన ప్రేమ ఏడిచింది గనుకనా ? వెంటనే పరిష్కారం చేసుకోవాలి. ‘ ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని బ్రిటన్‌ నిర్ణయించుకున్నట్లు ఓటింగ్‌ వివరాలు ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే యూనియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు పెరీ మాస్కోవిసీ అన్న మాటల సారాంశమిది. విడిపోవాలనుకున్న తరువాత కొత్త పితలాటకాలు పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వెళ్లి పోతే మంచిది అని ఫ్రెంచ్‌ విదేశాంగ మంత్రి జీన్‌ మార్క్‌ రాల్ట్‌ తో సహా అనేక మంది ఐరోపాయూనియన్‌ విదేశాంగ మంత్రులు బ్రిటన్‌కు సూచించారు. రాజీనామా ప్రకటించిన ప్రధాని కామెరాన్‌ వెంటనే వైదొలిగితే మంచిది, వైదొలగే ప్రక్రియను సాగదీయ కుండా నిబంధనావళిలోని ఆర్టికల్‌ 50 అమలును వెంటనే కోరాలని, మిగిలిన వారు పీఠముడి పడిన పరిస్థితిలో వుండకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి బ్రిటన్‌కు సలహా ఇచ్చారు. వెళ్లిపోతామని ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఎక్కువ కాలం కొనసాగటం బ్రిటన్‌కు మర్యాద కాదు అని కూడా ఫ్రెంచి మంత్రి వ్యాఖ్యానించాడు. అక్టోబరులో తన వారసుడు వచ్చే వరకు వెళ్లి పోయే చర్చలను ప్రారంభించే అవకాశం లేదని కామెరాన్‌ ప్రకటించిన నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. నాలుగు నెలల పాటు ఎలుకా-పిల్లి మాదిరి వ్యవహరించటం మంచిది కాదని లక్సెంబర్గ్‌ మంత్రి, మేం తరువాత పేజీ తిప్పి ముందుకు పోవాలని నెదర్లాండ్స్‌ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రారంభం నుంచి ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ ధోరణి వేరుగానే వుంది. పీడా విరగడైంది, ఒక తలనొప్పి పోయిందనే భావం మంత్రుల వ్యాఖ్యలలో వెల్లడైంది.

    అయితే తిరిగి ఓటింగ్‌ జరిపి మరోసారి అభిప్రాయం తీసుకోవాలంటూ బ్రిటన్‌లో లక్షల మంది పార్లమెంట్‌కు వినతి పత్రంపై సంతకాలు చేశారు. ఐరోపా యూనియన్‌ విదేశాంగ మంత్రులు కుర్రకారు మాదిరి బ్రిటన్‌లేని ఐరోపా యూనియన్‌ గురించి చర్చించాలంటూ విరుచుకుపడితే పెద్దమనిషి మాదిరి జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కుర్రాళ్లూ తొందర పాటు వద్దంటూ బ్రిటన్‌తో సంబంధాలు తెగకుండా దౌత్యానికి తెరతీశారు. విడిపోయిన తరువాత కూడా బ్రిటన్‌ను సహ సభ్యురాలిగా పరిగణించాలనే ప్రతిపాదన జర్మనీ నుంచి వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. ఫ్రెంచి నేతలు బ్రిటన్‌పై కాలుదువ్వుతున్న నేపధ్యంలో తాము బ్రిటన్‌కు వ్యతిరేకం కాదన్న సందేశం ఈ రూపంలో జర్మనీ పంపిందా అంటే కాదని చెప్పలేము. మొత్తానికి ఐరోపా యూనియన్‌లోని సభ్య దేశాల మధ్య విబేధాల వెల్లడికి, బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల జనం అసంతృప్తికి ఈ పరిణామాలు అద్దం పట్టాయి. బ్రిటన్‌లో అధికార, ప్రతిపక్షాలు రెండింటిలో ఈ పరిణామం ప్రకంపనలు సృష్టిస్తే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఒక్కసారిగా వులిక్కిపడింది. మరో తీవ్ర సంక్షోభానికి ఈ పరిణామం నాంది పలికిందా అని భయపడుతున్నది. ఓటింగ్‌ ఫలితాలు వెల్లడి అయిన తరువాత బ్రిటన్‌ సాధారణ ప్రజానీకానికి అంతకు ముందు మాదిరే మరో రోజు గడిచిందన్న వార్తలు వచ్చాయి.

   రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికార వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు అగ్రదేశంగా వున్న బ్రిటన్‌ తన వలసలను, మార్కెట్లను, పూర్వ ప్రాభవాన్ని కోల్పోయింది.మాజీ రాజు,జమిందారుల మాదిరి పూర్వీకులు సమకూర్చిన అడ్డగోలు సంపాదన మిగిలింది కనుక బెట్టు చేసే మాదిరి దాని పరిస్థితి. రెండు ప్రపంచ యుద్ధాలలో ఏ మాత్రం దెబ్బతినపోగా అటూ ఇటూ ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకున్న అమెరికా పెట్టుబడిదారీ దేశాలలో అగ్రగామిగా ముందుకు వచ్చి ద్విముఖ వ్యూహం అనుసరించింది. సోవియట్‌ నాయకత్వంలో ముందుకు వచ్చిన సోషలిస్టు కూటమి దేశాలను దెబ్బకొట్టటం, పెట్టుబడిదారీ కూటమిలోని ఐరోపాలోని సామ్రాజ్యవాద దేశాలు తిరిగి తనకు పోటీగా తయారు కాకుండా చూసుకొనేందుకు నాటో సైనిక కూటమిని రుద్ది వాటి జుట్టుపట్టుకు కూర్చోవటం. ఐరోపా పునరుద్దరణ పేరుతో మార్కెట్లను తనఅదుపులోకి తెచ్చుకోవటం, ఆసియాలో మరో సామ్రాజ్యవాద దేశమైన జపాన్‌ను తన రక్షణ ఒప్పందంతో కట్టిపడవేయటం వంటి ఎత్తుగడలకు తెరతీసింది. గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుసు అన్నట్లుగా అమెరికా దురాలోచన పసిగట్టిన ఐరోపా దేశాలు యుద్ధం ముగిసిన వెంటనే తమలో తాము సహకరించుకొనేందుకు గల అవకాశాలను వెతకటం ప్రారంభించాయి. యుద్ధంలో ఓడిపోయిన కారణంగా మిలిటరీలు రద్దయిన జర్మనీ, జపాన్‌ మిలిటరీకి ఖర్చు లేదు కనుక ఆ సొమ్మును పరిశోధన, అభివృద్ధికి కేటాయించి అచిర కాలంలోనే తిరిగి పట్టాలెక్కాయి. మార్కెట్లు, వలసలను కోల్పోయిన ఐరోపా దేశాలు దెబ్బలు తగిలిన వారందరూ ఒక చోట చేరి ఒకరి గాయానికి మరొకరు మందు రాసినట్లుగా తమలో తాము సహకరించుకొనే ప్రక్రియ 1948లోనే ప్రారంభమైంది. ఆక్రమంలో అంటీ ముట్టనట్లుగా వుండి పాతిక సంవత్సరాల తరువాత 1973లో బ్రిటన్‌ ఐరోపా ఆర్ధిక యూనియన్‌లో చేరింది.

    1948లో హేగ్‌లో జరిగిన ఐరోపా సదస్సుకు ఆ ఖండం నుంచి ప్రతినిధులతో పాటు అమెరికా, కెనడాల నుంచి పరిశీలకులు హాజరయ్యారు. ఐరోపాలో రాజకీయ, ఆర్ధిక సహకారానికి ల అవకాశాలను పరిశీలించేందుకు ఆ సదస్సు తీర్మానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిన, గెలిచిన దేశాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్న పూర్వరంగంలో ఈ ఆలోచన వచ్చింది. 1952లో ఐరోపా బొగ్గు, వుక్కు సమాజం ఏర్పాటుతో ప్రారంభమై నేటి ఐరోపా ఆర్ధిక యూనియన్‌గా పెరిగి పెద్దదై 1992లో మాస్ట్రిచ్‌ ఒప్పందంతో నేటి ఐరోపా యూనియన్‌ ప్రారంభమైంది.అది ఏర్పడిన మరో పాతిక సంవత్సరాలకు బ్రిటన్‌ దాని నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ప్రస్తుత యూనియన్‌కు జర్మనీ ఇంజను వంటిదైతే మిగతా సభ్యదేశాలు మోటారు వాహనంలోని ఇతర భాగాల వంటివి.తన పెత్తనం లేని యూనియన్‌లో బ్రిటన్‌ ప్రారంభం నుంచి ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగానే వ్యవహరించింది. బహుశా ఈ కారణంగానే ఫ్రెంచి మంత్రి అలాంటి వ్యాఖ్య చేసి వుండవచ్చు. జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్‌, ఇటలీ, లక్బెంబర్గ్‌ దేశాల మంత్రులతో సమావేశమైన తరువాత ద్రవ్య, రాజకీయ పరమైన పర్యవసానాలు సంభవించే అవకాశం వున్నందున సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోయే ప్రక్రియను ప్రారంభించాల్సి వుందన్నారు.

     వివాహం అంటే అనుకున్నతరువాత ఆగలేని వారు చివరికి ఆంజనేయ స్వామి గుడిలో అయినా 24 గంటల లోపే చేసుకోవచ్చు. కానీ విడాకులు అలా కాదు. చట్ట ప్రకారమే కనీస వ్యవధి, పెద్ద తతంగం వుంటుంది. అలాగే ఐరోపా యూనియన్‌ నుంచి ఏ సభ్య దేశమైనా విడిపోవాలన్నా అన్నీ సక్రమంగా జరిగితే అనే షరతుకు లోబడి లావాదేవీల పరిష్కారానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. అవసరమనుకుంటే ఆ వ్యవధిని ఇంకా పొడిగించుకోవచ్చు. లేదూ ఏదో తొందర పడి విడిపోవాలనుకున్నాం, ఇంకా నోటీసు ఇవ్వలేదు కనుక కొనసాగే అవకాశం ఇవ్వాలని అని బ్రిటన్‌ కోరుతుందా ? ఇంతవరకు ఏ దేశమూ అలా అడిగిన దాఖలా లేదు కనుక అటువంటి పరిస్థితే వస్తే ఏం చేస్తారో చూడాల్సి వుంది. విడిపోవాలి, కలసి వుండాలి అని ఓటు చేసిన వారి మధ్య తేడా కొన్ని లక్షలు మాత్రమే.ఫలితాలు వెల్లడైన తరువాత అనేక మంది తాము ఆలోచించకుండానే ఓట్లు వేశామని గగ్గోలు పెడుతున్నారు. ఐదు ప్రాంతాలలో ఇంగ్లండ్‌, వేల్స్‌లో మెజారిటీ విడిపోవటానికి ఓటు వేయగా లండన్‌, స్కాట్లండ్‌, వుత్తర ఐర్లండ్‌ ప్రాంతాల వారు అత్యధికులు కలసి వుండటానికి మొగ్గు చూపారు.అయితే మొత్తం జనాభాలో ఇంగ్లండ్‌లోనే 53శాతం వున్నందున అక్కడి వారు స్వల్ప మెజారిటీతో విడిపోవటానికి మొగ్గు చూపినా మొత్తం ఫలితాన్ని వారే నిర్ణయించారు. విడిపోవాలనే నిర్ణయ పర్యవసానాల గురించి గగ్గోలు పెడుతున్న జనం తిరిగి ఓటింగ్‌ జరపాలని ప్రభుత్వానికి విన్న వించుకున్నారు. రాజ్యాంగం ప్రకారం లక్ష మంది ఏదైన ఒక పిటీషన్‌పై సంతకం చేస్తే దానిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి. అలాంటిది పిటీషన్‌పై సంతకాలు ప్రారంభమైన కొన్ని గంటలలోనే పన్నెండు లక్షల మంది సంతకాలు చేయటానికి ఒకేసారి పూనుకోవటంతో అధికారిక వెబ్‌సైట్‌ కుప్పకూలింది.

   బ్రిటన్‌ సామాన్య జనం ఎటువైపు మొగ్గారు ?ప్రాధమిక విశ్లేషణలను బట్టి అక్కడి వెనుక బడిన ప్రాంతాల జనం ఎక్కువ మంది విడిపోవటానికి ఓటు వేశారు. పరిశ్రమలు మూతపడటం తప్ప తెరవని, కొత్త పెట్టుబడులను నోచుకోని ప్రాంతాలు, ఐరోపా యూనియన్‌ నిబంధనల పేరుతో అమలు జరుపుతున్న పొదుపు చర్యలకు ఎక్కువగా ప్రభావితులైన వారు, ఇక్కడ వున్నవారే దారిద్రరేఖకు దిగువకు దిగిపోతుంటే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చేవారిని అనుమతిస్తారా అంటూ అసంతృప్తికి గురైన వారు ఇలా ఏదో ఒక కారణంతో ప్రతికూల పర్యవసానాలకు ప్రభావితులైన వారందరూ విడిపోవటానికే మొగ్గు చూపారు. దీని పర్యవసానాల గురించి అనేక వ్యాఖ్యానాలు పరస్పర విరుద్దంగా వెలువడుతున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం మాదిరి అనిపించినప్పటికీ సంక్షిప్తంగా ఎలా వున్నాయో చూద్దాం.

   విడిపోయేందుకు మొగ్గు చూపారనగానే ప్రపంచ వ్యాపితంగా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. తరువాత స్వల్పంగా కోలుకున్నప్పటికీ వెంటనే అనిశ్చితి తొలగలేదు. తక్షణమే అతిగా స్పందించినట్లు కొందరు భావించారు. ఐరోపా చీకట్లోకి పోనుంది, ఐరోపా నాయకులు అసలు సమస్యలపై దృష్టి సారించకపోతే 1933 నాటి ఆర్ధిక సంక్షోభానికి దారి తీయవచ్చు. ఐరోపా తిరిగి అభివృద్ధి బాట పడుతుంది. ఐదు సంవత్సరాలలో బ్రిటన్‌ సమాఖ్యగా వుండజాలదు. స్కాట్లండ్‌ స్వతంత్ర దేశంగా మారి ఐరోపా యూనియన్‌లో చేరుతుంది. ఐర్లండ్‌లో వుత్తర ఐర్లండ్‌ విలీనం అవుతుంది. బ్రిటన్‌ తిరిగి పూర్వ వైభవం పొందుతుంది. అనేక దేశాలు ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోతాయి. అమెరికా-బ్రిటన్‌ మధ్య ప్రత్యేక అనుబంధం మరింత గట్టి పడవచ్చు, అమెరికా సాయంతో తన పలుకుబడి పెంచుకొనేందుకు బ్రిటన్‌ ప్రయత్నిస్తుంది. నాటోను సాధనంగా చేసుకుంటుంది. అమెరికా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకుంటుంది. బ్రిటన్‌ రానున్న ఐదు నెలల కాలంలో మాంద్యంలోకి జారిపోతుంది. అనేక దేశాలను అది ప్రభావితం చేస్తుంది. ఐరోపా అంతటా ప్రజాకర్షక నినాదాల పార్టీలకు ఆదరణ పెరుగుతుంది. జర్మనీ మరింత పలుకుబడి కలిగిన దేశంగా మారుతుంది. మిగతా దేశాలు కూడా పలుకుబడి పెంచుకొనేందుకు ప్రయత్నిస్తాయి.ఐరోపా యూనియన్‌ పెత్తనాన్ని తగ్గించేందుకు పూనుకుంటాయి. ఐదు సంవత్సరాలలో ఐరోపా ప్రపంచ శక్తి స్ధానాన్ని కోల్పోతుంది. ఐరోపా ఐక్యత దెబ్బతిని రష్యా పలుకుబడి పెరగవచ్చు. పుతిన్‌ మరింత బలపడతారు .ఈ పరిణామం అమెరికా నాయకత్వంలోని నాటోను మరింత పటిష్ట పరచవచ్చు. ఐరోపా యూనియన్‌ మరిన్ని రక్షణ చర్యలను తీసుకోవచ్చు. జనం పొదుపు చర్యలను తగ్గించమని డిమాండ్‌ చేస్తారు. స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీ వామపక్షం వైపు వెళ్ల వచ్చు. డాలరు బలపడి, వాణిజ్యలోటు, జాతీయ వాదాలు పెరగవచ్చు.

    బ్రిటన్‌ నిర్ణయ ప్రభావం భారత్‌పై ఎలా పడుతుందనేది కూడా మిశ్రమ స్పందనగా వుంది. దీని గురించి రానున్న రోజుల్లో మరింత స్పష్టత రావచ్చు. సోమవారం నాడు జరిగే ఐరోపా యూనియన్‌ సమావేశం తరువాత అనేక అంశాలపై మరింత వివరణ, విశ్లేషణలు వెలువడతాయి. ఇప్పుడు చేసే వన్నీ కూడా అయితే గియితే అన్న అంచనాలపైనే వుంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా-భారత్‌ సంస్కరణలకు తేడా ఏమిటి ?

25 Saturday Jun 2016

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

China, economic reforms, FDI, INDIA, subsidies

ఎం కోటేశ్వరరావు

      ఎదుటి వారి ప్రతికూలతలను తమ అనుకూలతలుగా మార్చుకోవటం లాభార్జనా పరుల నిరంతర ప్రయత్నం. జౌళి రంగంలో అటువంటి అవకాశాలనే తమ లాభాలకు వినియోగించుకోవాలని స్వదేశీ, విదేశీ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు తహతహలాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న లేదా ప్రచారం చేస్తున్నదాని ప్రకారం రానున్న మూడు సంవత్సరాలలో జౌళి రంగంలో 11 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే ఆ రంగంలో మన ఎగుమతులు 30 బిలియన్‌ డాలర్లు పెరుగుతాయి. కోటి మందికి ప్రత్యక్ష, పరోక్ష వుపాధి లభిస్తుంది. దీని కోసం ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవ్వటానికి, ఇంకా కొన్నివేల కోట్ల పన్ను, ఇతర పరోక్ష రాయితీలు ఇవ్వటానికి కొత్త ప్రోత్సాహక పధకాన్ని ప్రకటించింది. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఇంత తక్కువ ఖర్చుతో అంత పెద్ద మొత్తం ప్రయోజనం కలుగుతుందంటే ఎవరు కాదంటారు? ఈ రంగంలో ఇప్పటికే మన కంటే ఎంతో ముందున్న బంగ్లాదేశ్‌ వంటి దేశాలు ఎంత పేదవైనా వాటి మార్కెట్‌ను నిలబెట్టుకోవటానికి ఇంతకంటే ఎక్కువ రాయితీలు ఇవ్వలేవా అన్నది అర్ధంగాని ప్రశ్న.

      మన ఆత్రాన్ని సొమ్ము చేసుకొనేందుకు, వూరించి ముందుకు దూకించేవారు ఎప్పుడూ వుంటారు. మన కేంద్ర ప్రభుత్వం రానున్ను మూడు సంవత్సరాలలో 17 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను 40 దాటిస్తామని చెబుతుంటే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా మూడేండ్లలో 40 ఏమిటి పది సంవత్సరాలలో 150 బిలియన్‌ డాలర్ల సత్తా మీకు వుందని మన సిఐఐ(కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) నియమించిన అమెరికా సంస్ధ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బిసిజి) ఒక నివేదిక ఇచ్చింది.దాని ప్రకారం 2025 నాటికి భారత జౌళిరంగం 300 బిలియన్‌ డాలర్ల విలువకు చేరుతుందని, 150 బిలియన్‌ డాలర్ల విదేశీమారక ద్రవ్య ఆర్జనతో పాటు ఐదు కోట్ల మందికి అదనంగా వుపాధి కల్పించవచ్చని, వారిలో మూడున్నర నుంచి నాలుగు కోట్ల మంది మహిళలు వుంటారని లెక్కలు చెప్పింది. దీనికి గాను అది చెప్పిన ఆధారాలు ఏమిటంటే చైనా యువాను విలువతో పాటు అక్కడ వేతనాలు పెరుగుతున్నాయి కనుక పరిశ్రమలు అక్కడి నుంచి తరలి పోతున్నాయి, అందువలన చైనాతో పాటు అలాంటి ఇతర దేశాల వాటిని భారత్‌ ఆకర్షిస్తే 280 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతుల మార్కెట్‌ను పట్టుకోవచ్చని ఆ నివేదిక మన ముందు ఒక రంగుల కలను సాక్షాత్కరింప చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌, వియత్నాం దేశాలు ముందు పీఠీన వున్నప్పటికీ, ఆఫ్రికాలో ఇథియోపియా వంటి కొత్త కేంద్రాలు వునికిలోకి వస్తున్నప్పటికీ,అమెరికాలో తిరిగి పెద్ద ఎత్తున వుత్పత్తి జరిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ భారత్‌కు ఈ అవకాశాలు వుంటాయని బిసిజి నమ్మబలికింది.

   మన జనానికి వుపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందే. అందుకు తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ ప్రజల, దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి చేయాలా అన్నదే సమస్య.స్వాతంత్య్రానికి ముందు బ్రిటన్‌ తన గ్లాస్గో (పాత తరం వారికి గ్లాస్గో పంచెలు ఇప్పటికీ గుర్తు వుంటాయి) తదితర నగరాలలో వున్న వస్త్ర కర్మాగారాల కోసం మన దేశాన్ని పత్తి సరఫరా చేసే దేశంగానూ, అక్కడ తయారైన వుత్పత్తులను విక్రయించే మార్కెట్‌గానూ మార్చిందన్నది తెలిసిందే. అప్పుడు దాని వుత్పత్తులకు ప్రపంచంలోని వలస దేశాలన్నింటినీ మార్కెట్‌లుగా మార్చి తన పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చింది. ఇప్పుడు కూడా బ్రిటన్‌ తన కర్మాగారాలకు అవసరమైన పత్తిని ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు. కానీ ఆ పని చేయదు. ఎందుకంటే అలా దిగుమతి చేసుకొని తన కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇచ్చి వుత్పత్తి చేయిస్తే అక్కడి కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు ఎలా వుంటాయి. అందువలన ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చౌకగా శ్రమశక్తి దొరుకుతుందో అక్కడే తనకు కావాల్సిన దుస్తులను తయారు చేయించుకుంటే అదే లాభసాటిగా వుంటోంది కనుక ఏకంగా తన ఫ్యాక్టరీలను ఆయా దేశాలకు తరలించటం లేదా కొత్త ఫ్యాక్టరీలను పెట్టి తయారు చేయిస్తున్నది.ఇదేదో బ్రిటన్‌ ఒక్కటే చేస్తున్నది కాదు, అన్ని ధనిక దేశాలదీ ఇదే బాట. నీరు పల్లంవైపు, పెట్టుబడిదారుడు లాభాలవైపు పయనిస్తాడు. గతంలో దేశాలను అక్రమించుకుంటే లాభాలు, ఇప్పుడు శ్రమశక్తితో తమకు కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకుంటే, ఇతర దేశాల దగ్గర లేని ఆధునిక పరిజ్ఞానంతో తన దగ్గర తయారయ్యే వస్తువులకు మార్కెట్లను పట్టుకుంటే సిరులు, అందుకే పద్దతులను మార్చారు.

    అమెరికా వాణిజ్యవేత్తలు, బంగ్లాదేశ్‌, వియత్నాం, చైనాల నుంచి దుస్తులు, బొమ్మలు, ఇతర సామగ్రిని దిగుమతి చేసుకొని, తమ వద్ద పాతబడిపోయిన అణు కర్మాగారాలు, మిలిటరీ ఆయుధాలను మన వంటి దేశాలకు అంట గట్టి లాభాలు పొందుతున్నారు. ఇవేవీ లేకపోతే పెట్టుబడి పెట్టనవసరం లేదు, ఫ్యాక్టరీ కట్టనవసరం లేదు, వ్యాపార దుకాణాలూ తెరవనవసరం లేదు. లాభాల బాటలో వున్న మన వంటి దేశాల కంపెనీల వాటాలను వుదయం కొనుగోలు చేసి సాయంత్రానికి వాటి విలువ పెరిగితే అమ్ముకొనీ లబ్ది పొందుతున్నారు. ఈ పని చేయటానికి సూట్‌ కేసులతో మన ముంబయ్‌ రానవసరం లేదు, సినిమాలలో చూపినట్లు ఏ విలాస కేంద్రంలోనో మందు, మగువలతో కూర్చొని ఇంటర్నెట్‌తో మీటలు నొక్కితే చాలు.

    భారత్‌ను చైనాతో పోల్చితే కొంత మందికి తేళ్లూ జెర్రులు పాకినట్లుంటాయి. అది నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం దానికీ దీనికీ పోలికా అని రంకెలు వేస్తారు. చైనా మాదిరి సంస్కరణలను మన దేశంలో సంస్కరణలు అమలు జరిపితే వ్యతిరేకిస్తారు అని కమ్యూనిస్టుల మీద నిందలు వేసేటపుడు మాత్రం వారికి అప్పుడు చైనా కావాలి. కానీ వారే మరో సందర్భంలో త్వరలో మన దేశం చైనాను అధిగమించబోతోందని లొట్టలు వేసుకుంటూ చెబుతూ తమ జబ్బలను తామే చరుచుకొని శభాష్‌ అని చెప్పుకుంటారు.అంతెందుకు కమ్యూనిస్టులను వ్యతిరేకించే మన వ్యాపారులు గత కొద్ది సంవత్సరాలుగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతోనే వ్యాపారాలు చేసి లాభాలు పోగు చేసుకోవటం లేదా? వారికి అక్కడి కమ్యూనిజం అడ్డం రావటం లేదేం? ఇది అన్యాయం కదా !

    ‘ఆసియా బ్రీఫింగ్‌’ అనే ఒక పత్రిక వుంది. అదేమీ కమ్యూనిస్టు, వామపక్ష పత్రిక కాదు. పెట్టుబడిదారుల సేవలో వుంటుంది. మూడు సంవత్సరాల క్రితం ఒక విశ్లేషణలో రెండు దేశాలలో వున్న కనీస వేతనాల గురించి ఒక పోలికను ఇచ్చింది.http://www.asiabriefing.com/news/2013/07/comparison-minimum-wages-in-china-and-india/ దానిలో రెండు దేశాలలోని కొన్ని ప్రధాన నగరాలలో కనీస వేతనాలు ఎలా వున్నాయో తెలిపింది. వాటిని దిగువ చూడవచ్చు.2013 జూలై 18న ప్రచురించిన ఆ వ్యాసంలో నాడు డాలరు విలువ రు.59.42గానూ, యువాన్లు 6.14గానూ వున్నాయి.

పట్టణం              నెలవేతనం స్ధానిక కరెన్సీ          అమెరికా డాలర్లలో

ఢిల్లీ                        6,448                                110

హైదరాబాదు              4,940                                  83

ముంబై                    4,940                                  83

జైపూర్‌                     4,030                                 68

అహమ్మదాబాదు         3,900                                 65

చెన్నయ్‌                  3,041                                51

షాంఘై                    1,620                                264

గ్వాంగ్‌జు                  1,550                                253

హాంగ్‌జౌ                   1,470                                240

టియాన్‌జిన్‌               1,500                                245

బీజింగ్‌                     1,400                                228

దలియన్‌                   1,300                               212

     కనీస వేతనాలపై కార్మికుల సంక్షేమ చర్యలకు గాను యజమానులు అదనంగా సగటున 30 నుంచి 50శాతం వరకు చెల్లించాలని, అదే భారత్‌లో గరిష్టంగా పదిశాతానికి మించి లేదని కూడా ఆ పత్రిక విశ్లేషణ పేర్కొన్నది. చైనాలో కనీస వేతనాలు, సంక్షేమ చర్యలకు యాజమాన్యాలు చెల్లించాల్సిన మొత్తాలు ఏటికేడు పెరుగుతున్నాయి తప్ప ఏదో ఒకసాకుతో కోత పెట్టటం లేదు. అందుకనే విదేశీ ప్రయివేటు యజమానులు చైనాలో తమకు గిట్టుబాటు కావటం లేదని సణగటం మొదలు పెట్టటమే కాదు, ఎక్కువ లాభాలు వచ్చే ప్రాంతాలకు వలసపోవటం ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ ఆదేశాలను అమలు జరపకపోయినా లేక కోత పెట్టినా అక్కడ కార్మికులు ప్రతిఘటించటమే కాదు, అవసరమైతే సమ్మెలకు కూడా దిగుతున్నారు. కనీస వేతనాల పోలిక చేసిన ఆసియా బ్రీఫింగ్‌ పత్రిక కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే పరిశ్రమల కార్యకలాపాల ప్రారంభానికి భారత్‌ కీలకం అని మూడు సంవత్సరాల నాడే తన వ్యాఖ్యలో పేర్కొన్నది. అంటే ఘనత వహించిన నరేంద్రమోడీ అధికారానికి రాక ముందే అని వేరే చెప్పనవసరం లేదు.ఎఫ్‌డిఐలు ఎక్కడ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయో ప్రపంచ పెట్టుబడిదారులకు సలహాలు ఇచ్చేందుకు 1992లో ఏర్పాటయిన డిజాన్‌ షిరా అండ్‌ అసోసియేట్స్‌ స్థాపకుడు క్రిస్‌ డేవన్‌ షైర్‌ విల్స్‌ రాసిన వ్యాసంలో పై వివరాలు పేర్కొన్నారు.

    కార్మికులకే కాదు, రైతాంగానికి మద్దతు ధరలు ఇవ్వటంలోనూ, సగటు దిగుబడులను పెంచే వంగడాలు, ఇతర పెట్టుబడులను సమకూర్చటంలోనూ అక్కడి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటున్నది. పత్తికి ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని ధరలను ఇవ్వటమే కాదు, వుత్పత్తి కేంద్రాలనుంచి కొనుగోలు కేంద్రాలకు చేర్చే రవాణా ఖర్చులను కూడా భరిస్తున్నది. ఇదంతా రెండు దేశాలలో సంస్కరణలు అమలు జరిగిన తరువాత తలెత్తిన పరిస్థితి. అందువలన ఏ సంస్కరణలను వ్యతిరేకించాలి? వేటిని సమర్ధించాలి ? కావాలంటే జనానికి మేలు చేసే సంస్కరణలకు ముందు తగిలిస్తున్నట్లు ప్రధాని పేరు తగిలించి అమలు జరపండి ఇబ్బంది లేదు. అవేమీ లేకుండా కార్మికులు కడుపుకట్టుకొని పెట్టుబడిదారులు,వ్యాపారులకు లాభాలు చేకూర్చాలని చూస్తే జనమే కాదు, దేశం కూడా నష్టపోతుంది.

   విచక్షణా రహితంగా విదేశీ కంపెనీలను, దిగుమతులను అనుమతిస్తే దేశీయ పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతింటాయి.అందుకే ఇక్కడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రక్షణ చర్యలు కోరుతున్నారు. ఇదే సమయంలో ఇతర దేశాలలో ఎక్కడ లాభసాటిగా అక్కడకు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. జపాన్‌ తన సామాన్యుల కారు మారుతీ తయారీని భారత్‌లో ప్రారంభిస్తే విలాసవంతమైన జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ కార్ల ఫ్యాక్టరీని మన టాటా మోటార్స్‌ చైనాలోని చాంగుషులో ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పేరుతో ఇక్కడ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోమని చెబుతున్నారు.చైనా కూడా అదే పని చేసింది. అదే సమయంలో తన అంతర్గత వినియోగాన్ని కూడా పెంచే క్రమంలో తన పౌరుల ఆదాయాలను గణనీయంగా పెంచింది. అందుకే ప్రపంచ ధనిక దేశాలలో తీవ్ర మాంద్యంతో ఎగుమతులు దెబ్బతిన్నప్పటికీ దాని ఆర్ధిక వ్యవస్ధపై పెద్ద ప్రభావం పడలేదు. అటువంటి పరిస్థితి మన దేశంలో వుందా ? విధానాలు అందుకు అనుగుణంగా వున్నాయా ? గౌరవంగా బతికేందుకు అవసరమైన వేతనాలు పొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గటం, స్వల్పవేతన వుద్యోగులు, కార్మికుల సంఖ్య పెరగటం దేనికి సూచిక ?

     సులభంగా వ్యాపారం చేసేందుకు అవకాశాల పేరుతో ప్రతి ఏడాదీ ప్రపంచబ్యాంకు ఒక సూచికను తయారు చేస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన సమయంలో ప్రపంచంలోని 189 దేశాలలో భారత్‌ 134వ స్థానంలో వుంది, దానిని 50లోపుకు చేరుస్తానని ప్రపంచ పెట్టుబడిదారులకు మోడీ హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాల తరువాత అది 130 స్థానంలో వుంది. ఆ యావలో మోడీ కార్మికులకు, సామాన్య జనానికి, దేశం మొత్తానికి హాని కలిగించే విధంగా మన ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా బార్లా తెరిచేందుకు పూనుకున్నారు. బ్రిటీష్‌ వ్యాపారులు స్ధానిక రాజులు, రంగప్పలను లోబరుచుకొని మొత్తం దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు స్వతంత్ర పాలనలో ఏకంగా ప్రభుత్వమే జనం పేరుతో అన్ని దేశాల వారికి దేశాన్ని అప్పగించేందుకు పూనుకుంది. ఏడుపదుల స్వాతంత్య్రం వెనక్కు పోతోందా? ముందుకు పోతోందా ? ఏది దేశ భక్తి? ఏది దేశద్రోహం, ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Telangana should intensify ‘ease of doing business’ to attract investors in large nos.: ASSOCHAM  

24 Friday Jun 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Telangana

≈ Leave a comment

Tags

ASSOCHAM, investment, investors, Telangana

 

Investment projects attracted by state in transport services sector facing time & cost overruns

The state of Telangana needs to intensify focus on ease of doing business thereby adhering to the principle of ‘minimum government, maximum governance,’ to become top investment hub thereby promoting more efficient and effective business practices across the state, apex industry body ASSOCHAM said today.

“Telangana should make efforts to ease the process of doing business for all categories of industries with special focus on small and medium enterprises that hold potential to create more employment,” said Mr D.S. Rawat, secretary general of The Associated Chambers of Commerce and Industry of India (ASSOCHAM) while releasing a study titled ‘Analysis of infrastructure investment in India,’ along with chamber’s Telangana Development Council chairman, Mr Srikanth Badiga at a press conference held in Hyderabad.

States across India had attracted total investments worth over Rs 53 lakh crore in different categories of infrastructure sector – transport services (71 per cent share), miscellaneous services like storage & distribution, health, education, recreational services and others (13 per cent), communication services (5 per cent), wholesale and retail trading (5 per cent), information technology (4 per cent), hotels and tourism (2 per cent).

Public sector accounted for highest share of 59 per cent in the total investments attracted by infrastructure sector, this is worrisome as India needs to look for more private sector participation in perking up infrastructure across the country, but it is seen that over the years reliance on public sources have increased.

“So far public investments have been the dominant form of infrastructure financing in India, but this is expected to change as large deficits and other commitments together with social obligations will constrain government’s financial flexibility, thus there will be a greater need to mobilise private sector capital that can be invested into infrastructure,” noted the study.

At the state level, public sector investment shows that in 2015 public sources had highest share of over 95 per cent in investments attracted by Chhattisgarh followed by Bihar (92 per cent), Uttarakhand (87 per cent), Himachal Pradesh (80 per cent) and Madhya Pradesh (77 per cent) amid top five states in terms of public investments.

While on an average, public sector sources accounted for over 59 per cent share in terms of investments attracted by infrastructure sector across India. Though in West Bengal (59 per cent), Tamil Nadu (58 per cent), Odisha (50 per cent), Uttar Pradesh (47 per cent), Gujarat (27 per cent) and Haryana (10 per cent) public investments’ share was below that of the country’s average share thereby implying that these six states would be leading in terms of private sector’s contribution to infrastructure sector.

While the total investments attracted by infrastructure sector across India have increased at a compounded annual growth rate (CAGR) of over 10 per cent between 2010-2015 thereby increasing from over Rs 32 lakh crore to over Rs 53 lakh crore.

Investments attracted by transport services sector have increased at maximum growth of over 13 per cent followed  by miscellaneous services (6.5 per cent), communication (5 per cent), wholesale and retail (two per cent), hotels and tourism (two per cent) and IT (one per cent).

Infrastructure investment attracted by transport services sector:

“Transport services have garnered highest share of over 71 per cent in terms of investments worth over Rs 53 lakh crore attracted by infrastructure sector across the country as of 2015 followed by miscellaneous services (13 per cent), communication (five per cent), wholesale and retail trading (five per cent), information technology (four per cent) and hotels & tourism (two per cent),” highlighted the study.

However, investments attracted by the transport services sector have registered steep cost escalation of 47 per cent thereby exceeding the actual cost of projects by a whopping Rs five lakh crore, besides these projects are also facing an average delay of over 44 months.

Investment projects attracted by Telangana in transport services sector have registered highest cost escalation rate of about 89 per cent and are facing delay of over 51 months as of 2015, noted the study prepared by The ASSOCHAM Economic Research Bureau (AERB).

“It is highly imperative for the government of Telangana to perk up transportation, communication, water and energy networks across the state to promote accessibility, quality of infrastructure and attract domestic firms and global investors,” said Mr Rawat.

Punjab (65 per cent), Jharkhand (59 per cent), West Bengal (58 per cent) and Gujarat (56 per cent) are other among top five states to have recorded high cost escalation rate in delayed transport services investment projects.

Infrastructure investments’ scenario in Telangana:

Telangana has recorded a meagre two per cent share in investments attracted by infrastructure sector from both public and private sources across India as of 2015 and there has been literally no change in its share in 2010.

It also registered 10.2 per cent CAGR in investments attracted by infrastructure sector during the course of past five years which is similar to the national average growth rate in this regard.

Telangana recorded third highest growth rate of over 36 per cent after Chhattisgarh (44 per cent) and Himachal Pradesh (38 per cent) in investments made by the public sources in infrastructure sector across India.

“While in terms of investments made by the private sector in infrastructure sector in India, Telangana had seen a negative growth of about five per cent, as such the state needs to mobilise private sector capital that can be invested into infrastructure,” suggested the ASSOCHAM study.

Besides, the state recorded under implementation rate of about 83 per cent which is way ahead than national under implementation rate of 58 per cent, this implies that most of the infrastructure projects in Telangana and across India are still in the process and are yet to be completed.

“This does not augur well for both the state and the country as actual benefits of an investment are only derived upon completion,” the study asserted.

Suggestions:

In its study, ASSOCHAM has suggested various measures like reducing delay in creating businesses, obtaining approvals, enforcing contracts; providing sufficient legal protection for investors; ensuring more transparent and predictable government decision making thereby minimising political and regulatory risks.

Co-ordination between government agencies together with a single window clearance system should be implemented with specific guidelines for time bound approvals. Besides, land acquisition and environment clearances continue to remain critical concerns for infrastructure developers as such these issues should be addressed proactively to balance the interests of all stakeholders.

There is also an urgent need to fill-up the skills related gap in handling infrastructure projects and the government should create a skill ecosystem in partnership with private players with a view to formalise professional training for project managers, suggested ASSOCHAM.

It also added that there is a need to improve depth and liquidity of corporate bond market to provide additional source of funding for infrastructure companies.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d