• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Religious Intolarence

NO additional Railway lines  construction through extra budgetary resources in Andhra pradesh,Telangana             

18 Thursday Feb 2016

Posted by raomk in AP NEWS, BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

additional Railway lines, ANDHRA PRADESH, Indian Ralways, Railway lines, Telangana

 

The Cabinet Committee of Economic Affairs, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved construction of six Railway Lines and a Railway bridge to cater to both increased passenger and freight needs in various areas of the country. The proposals will cost over Rs.10,700 crore and most part of the expenditure will be met through extra budgetary resources (Institutional Financing). Details of the six approved projects are as follows:

1)   Doubling of Hubli-Chickajur railway line

Doubling of 190 km long Hubli-Chickajur broad gauge single railway line has been approved. The total estimated expenditure will be Rs.1294.13 crore. The project is likely to be completed in 4¼ years during 13th Plan period and will cover the areas of Chitradurga, Davangere, Haveri and Dharwad.

Entire route from Pune-Miraj-Hubli-Bengalore has been identified for doubling which will not only improve smooth flow of traffic but also boost overall development of the region.

This stretch is part of an important rail link of passenger trains between Mumbai and Bangalore and goods trains to the ports at Mangalore.  On this route, doubling between Bangalore-Tumkur and Arsikere-Chickajur have already been completed.  On balance portion, doubling work between Hubli-Londa part of Hubli-Londa-Vasco-da-Gama, is also in progress.

2)   Construction of Wardha (Sewagram) – Ballarshah 3rd railway line

Construction of Wardha (Sewagram) – Ballarshah 3rd railway line of 132 km will be taken up at an estimated completion cost of Rs.1443.32 crore.  The project is likely to be completed in five years during 13th Plan period and will be located in Wardha and Chandrapur districts.

The line capacity utilization of the section is saturated and running of additional Mail/Express and Goods traffic over the section cause detention to the trains.  Wardha (Sewagram) – Ballarshah section is very important from goods originating point of view of Nagpur Division where many collieries and many sidings are proposed on the section.

3)   Doubling of Ramna-Singrauli railway line

Doubling of 160 km long Ramna – Singarauli railway line has been approved at a cost Rs.2675.64 crore and is likely to be completed by 2019-20.   The project will cover the districts of Garhwa in Jharkhand, Singrauli in Madhya Pradesh andSonbhadra in Uttar Pradesh.

The Ramna-Singrauli section falls in Dhanbad Division of East Central Railway.  At present traffic utilization of the section is 105%, resulting in detention of trains and loss of revenue.  In order to attain the desired fluidity and increase in the sectional capacity, doubling of this single line section is very essential from operational point of view.  The project will serve the freight and passenger traffic needs in the jurisdiction of Northern Coal Fields and series of power plants and associated small scale industries in and around Anpara and Shaktinagar, namely Anpara Super Thermal Power Plant, RihandSuper Thermal Power Plant, Renusagar Hydro Power Plant,Singrauli Super Thermal Power Plant, Vidhyachal Super Thermal Power Plant.

4)   Construction of 3rd railway line between Anuppur-Katni

Construction of 165 km long 3rd railway line between Anuppur-Katni in Madhya Pradesh has also been apporved at a cost of Rs.1595.76 crore. The project is likely to be completed in 5 ¼ years spanning over 12th and 13th plan period.

The project would cover the districts of Anuppur, Shahdol, Umaria and Katni districts of Madhya Pradesh.

There has been tremendous surge in coal and one mining which has been geared up in the recent past and ambitious plans for an enormous leap forward in the ensuing years to tap these resources lying hitherto untapped.  As a result of the rapid industrialization, number of industrial townships have also grown up along the project line.  These developments have resulted in large demand for additional coaching services on the section.  With this anticipated increase of freight traffic, the capacity utilization will reach upto 175%.  Apart from this substantial additional coal traffic from IB valley, Korba area, East Corridor and Gevra Road – Pendra Road Project would be channelized through this route to the respective destinations. In order to meet the growth in the freight and passenger traffic, tripling of 3rd line between Anuppur-Katni is essential.

 

5)   Doubling of Katni-Singrauli railway line

Construction of doubling of 261 km long Katni – Singarauli railway at a cost of Rs.2084.90 crore has been approved. The project will be completed in 5 ¼ years.  The project would cover the districts of Katni, Shahdol, Sidhi and Singrauli in Madhya Pradesh.

Katni-Singrauli is a critical and busy section carrying coal from Northern Coal Fields towards Western and Northern thermal power plants.  This section intersects Allahabad-Mumbai route at Katni.  Provision of doubling between Katni-Singrauli section would provide the necessary line capacity for introduction of additional mail/express and passenger trains to serve the people of the area and transportation of coal from collieries.  This will also boost overall development of the region.

6)   Construction of additional Bridge and doubling project of Rampur Dumra-Tal-Rajendrapul

Construction of additional Bridge and doubling project of Rampur Dumra-Tal-Rajendrapul sector in Bihar at a cost of Rs.1700.24 crore has also got CCEA’s approval today.

The project is likely to be completed by 2019-20.  The project is located in Begusarai and Patna districts of Bihar.

The existing rail-cum-road bridge at Hathidah has single line track and doubling is not possible.  Present traffic utilization of the section is 123.5%.  At present this is the only railway bridge connecting both North and South Bihar.  Existing single line has resulted in heavy detention of goods and passenger traffic.

In order to streamline the operation of traffic in this single line section, it is very essential that one additional bridge and doubling of this section is undertaken.  By providing this facility, there will be ample fluidity in maintaining train operations as well as introduction of more passenger/goods trains in the section and it will augment line capacity too.  This will also facilitate in minimizing the running time of trains between Kiul-Barauni and Mokama-Barauni section and will ease out the existing operational constraints in this section.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జెఎన్‌యులో జరుగుతున్న ఘటనలకు మూలం ఏమిటి ?

17 Wednesday Feb 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ABVP, Anti communist, ANTI NATIONAL, BJP, democracy, JNU, JNU ROW, RSS, students

ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో  సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి.

ఎం కోటేశ్వరరావు

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలను అణచేపేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అణచివేత వైఖరి బంగారం లాంటి ఒక యువశాస్త్రవేత్త వేముల రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైంది.ఈ వుదంతంపై జరుగుతున్న ఆందోళన ఇంకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వుంది. ఒక వుదంతం జరిగితే దాన్నుంచి మంచో చెడో ఏదో ఒకటి నేర్చుకోవాలన్నది సమాజం నేర్పిన పాఠం. హైదరాబాదు వుదంతం నుంచి కేంద్రం ప్రభుత్వం ఏమి నేర్చుకున్నది? తన భావజాలానికి వ్యతిరేకులుగా వున్న వారిని అణచివేసేందుకే ముందుకు పోవాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దానిలో భాగమే న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో వామపక్ష భావజాలం వున్న విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలపై దేశద్రోహ ముద్రవేసి అరెస్టులకు పూనుకున్నది. దానిలో భాగంగానే విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ తదితరుల అరెస్టు. హైదరాబాదు వుదంతంలో స్ధానిక ఎంఎల్‌ఏ,ఎంఎల్‌సిలు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ లేఖలు, ఇతర రూపంలో విశ్వవిద్యాలయ అధికారులపై వత్తిడి, ఏబివిపి విద్యార్ధులతో అసత్య కేసుల నమోదు వంటి పనులు చేశారు. న్యూఢిల్లీలో ఏకంగా బిజెపి ఎంఎల్‌ఏ ఒపి శర్మ కోర్టుకు వచ్చిన విద్యార్ధులు, అధ్యాపకులు, జర్నలిస్టులపై ఏకంగా పోలీసుల సమక్షంలో చేయి చేసుకున్నాడు. అంతే కాదు తనకు చిన్నప్పటి నుంచి జాతి వ్యతిరేకులుగా వున్నవారిపై దాడి చేయటం అలవాటని ఆ పెద్దమనిషి సమర్ధించుకున్నాడు.అంటే అధికార యంత్రాంగాన్ని వుపయోగించుకోవటమే కాదు, తమతో విబేధించేవారిపై సంఘపరివార్‌ కార్యకర్తలు ప్రత్యక్షంగా గూండాగిరీ చేయటానికి కూడా సిద్ధం అవుతున్నారనుకోవాలా ? ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే సందర్బంగా భజరంగ్‌దల్‌, విశ్వహిందూ పరిషత్‌ ఇతర వారి అనుబంధ సంఘాల కార్యకర్తలు వీధులు, పార్కుల వెంట తిరిగి అనుమానం వచ్చిన యువతీ యువకులను కొట్టటాన్ని మాత్రమే చూశాము.ఇప్పుడు వారు విశ్వవిద్యాలయాల వ్యవహారాలలో కూడా జోక్యం చేసుకుంటున్నారు.జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్న విద్యార్ధులు, అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రతి ప్రదర్శన చేశారు. అలాంటి వారికి కేంద్రంగా వుందంటూ పనిలో పనిగా అసలు ఆ విశ్వవిద్యాలయాన్నే మూసివేయాలని కూడా డిమాండ్‌ చేశారు.

జెఎన్‌యులో ఏం జరిగింది? అసలు జాతి వ్యతిరేకత అంటే ఏమిటి? అన్నది ప్రతివారిలోనూ వస్తున్న సందేహం? విద్యార్ధులు ఏవైనా తప్పులు చేస్తే వారిని సరిదిద్దాలా లేక జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి జైళ్లకు పంపాలా ? ‘ఫిబ్రవరి తొమ్మిది రాత్రి నిజంగా ఏం జరిగింది ?’ అనే శీర్షికతో హిందూస్ధాన్‌ టైమ్స్‌ పత్రిక ఫిబ్రవరి 16న ఒక విద్యార్ధి కధనాన్ని ప్రచురించింది. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో శిక్ష పడిన అప్జల్‌ గురు స్మారకార్ధం ‘ఏ కంట్రీ వితౌట్‌ పోస్టాఫీసు’ అనే పేరుతో ఒక విద్యార్ధి సంఘం ఒక మీటింగ్‌ ఏర్పాటు చేసింది. దాని గురించి హర్షిత్‌ అగర్వాల్‌ అనే విద్యార్ధి క్వోరా వెబ్‌సైట్‌లో రాసిన అంశాలను హిందూస్థాన్‌ టైమ్స్‌ పేర్కొన్నది.’ ఫిబ్రవరి తొమ్మిదిన డిఎస్‌యు అంటే డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పేరుతో వ్యవహరించే విద్యార్ధి సంఘం ఒక సాంస్కృతిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వారు పేర్కొన్నట్లుగా కాశ్మీరీ పౌరుల ప్రజాస్వామిక హక్కయిన స్వయంత్రిపత్తి పోరాటానికి మద్దతుగా మరియు న్యాయవ్యవస్ధ హత్యకు గురైన అప్జల్‌ గురు మరియు మక్బూల్‌ భట్ల సంస్మరణగా ఆ సభ జరిగింది. క్యాంపస్‌(జెఎన్‌యు)లోని మరియు వెలుపలి నుంచి పెద్ద సంఖ్యలో కాశ్మీరీ విద్యార్ధులు ఈ కార్యక్రమానికి వచ్చారు.’ డిఎస్‌యు మావోయిజాన్ని నమ్మే విద్యార్ధులతో కూడిన ఒక చిన్న వుగ్రవాద వామపక్ష సంస్ద. వారు ఏ అర్ధంలో చూసినా టెర్రరిస్టులు గానీ నక్సల్స్‌గానీ కాదు. నేను రెండు సంవత్సరాలకుపైగా కాంపస్‌లో వుంటున్నాను. వారు ఎప్పడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడటం గురించి రాజ్యాన్ని కూలదోయటానికి ఒక రాయి వేయటం వంటివిగానీ నేను చూడలేదు. వారి మీటింగ్‌ ప్రారంభం కావటానికి 20 నిమిషాల ముందు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ అధికారయంత్రాంగానికి ఒక లేఖ రాసింది.కాంపస్‌ వాతావరణానికి హానికరం గనుక ఆ సమావేశానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరింది. ఘర్షణలు జరుగుతాయనే భయంతో అధికారయంత్రాంగం అనుమతి నిరాకరించింది. జెఎన్‌యు అన్ని రకాల గళాలను వినటానికి ఒక అనువైన ప్రజాస్వామిక భావనల కేంద్రం. భావాలు తీవ్రవాదంతో కూడినప్పటికీ వ్యక్తం చేయటాన్ని గౌరవిస్తారు. ఇపుడు ఎబివిపి అటువంటి దాన్ని అడ్డుకుంటోంది. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో తమ సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి. సభజరగాల్సిన బ్యాడ్‌మింటన్‌ కోర్టు వద్దకు అధికార యంత్రాంగం భద్రతా సిబ్బందిని పంపింది. అయితే మైకులను వినియోగించటానికి మాత్రం అనుమతి నిరాకరించింది. అందుకు నిర్వాహకులు అంగీకరించి మైకులు లేకుండానే సభ జరుపుకోవాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఎబివిపి తన కార్యకర్తలను సమీకరించి హాజరైన విద్యార్ధులు, నిర్వాహకులను బెదిరించటం ప్రారంభించింది. ఏ కాశ్మీర్‌ హమారా హయ్‌, సారా కా సారా హయ్‌ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిస్పందనగా సభ నిర్వాహకులు హమ్‌ క్యా చాహతే అజాదీ అని నినాదాలు చేశారు.తరువాత తుమ్‌ కితనే అఫ్జల్‌ మారోగె, హర్‌ ఘర్‌ సె అఫ్జల్‌ నికేగా అని నినదించారు. జెఎన్‌యు బయటి నుంచి వచ్చిన కాశ్మీరీ విద్యార్ధుల బృందం ఒకటి సభకు వచ్చిన వారి మధ్యలో ఒక వలయంగా ఏర్పడ్డారు. నన్ను నమ్మండి వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారు లేరు. ఆ కార్యక్రమం సందర్బంగా నేను కొద్ది సేపు వున్నాను. వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారిని నేను గుర్తించలేదు. దశాబ్దాల తరబడి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్ట అణచివేతకు గురైన కాశ్మీరీ విద్యార్ధులు ఏబివిపి వారిని చూడగానే భారత వ్యతిరేక నినాదాలు చేశారు. నేను దాదాపు రెండున్నర సంవత్సరాలుగా జెఎన్‌యులో వున్నాను. అటువంటి నినాదాలు నేను ఎక్కడా వినలేదు, డిఎస్‌యును మినహాయిస్తే ఏ వామపక్ష పార్టీ భావజాలానికి దగ్గరగా లేవు. పాకిస్ధాన్‌ జిందాబాద్‌ అనే నినాదానికి సంబంధించి అది వివాదాస్పాదం. నేను అక్కడ వున్నంత వరకు ఆ నినాదాన్ని వినలేదు. అటువంటి నినాదం చేసినట్లు ఒక వీడియో వుంది. అయితే అది స్పష్టంగా లేదు, కాశ్మీరీ విద్యార్ధులు చేశారా లేదా ఎబివిపి కుట్ర అన్నది తెలియటం లేదు.జెఎన్‌యు విద్యార్ధి సంఘనాయకుడు కనయ్య కుమార్‌ ఎలాంటి నినాదాలు చేయలేదు.అతను ఎఐఎస్‌ఎఫ్‌( సిపిఐ విద్యార్ధి విభాగం) సభ్యుడు మావోయిస్టు లేదా వేర్పాటు వాదానికి వారు వ్యతిరేకం’ అని అగర్వాల్‌ పేర్కొన్నాడు.

ఇక్కడ సమస్య ఏబివిపి అభ్యంతర పెట్టినా అడ్డుకున్నా ఆ సభ జరిగింది. సభ జరగటానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు సహకరించాయనే దుగ్డతో ఎలాగైనా నిరంకుశ,అణచివేత చర్యల ద్వారా వారిని బెదిరించాలి, విశ్వవిద్యాలయంలో తమ పలుకుబడిని పెంచుకోవాలన్నది తప్ప మరొకటి కనిపించటం లేదు. పోలీసులను వినియోగించి తప్పుడు కేసులు బనాయించటాన్ని దేశ, విదేశాలలో లోని అనేక మంది విద్యావేత్తలు, విద్యార్ధులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పలు సంస్ధలు దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేకం పేరుతో తమ వ్యతిరేకులను, ముఖ్యంగా వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు చూస్తున్నాయి. ప్రజాస్వామిక పద్దతులలో చర్చల ద్వారా ఒప్పించి తమ భావాలను ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, మద్దతుదార్లను కూడగట్టుకోవచ్చు. కానీ తమ వాదనలో పసలేనపుడు ఎదుటివారిపై భౌతికదాడులకు దిగి నోరు మూయించటం ప్రజాస్వామ్యమా ? ఫాసిజమా ? జెఎన్‌యు విద్యార్ధులకు మద్దతు ఇస్తున్నందుకు ఢిల్లీలోని సిపిఎం కేంద్రకార్యాలయంపై దాడికి ప్రయత్నించటం, తరువాత పాటియాల కోర్టు ఆవరణలో బిజెపి ఎంఎల్‌ఏ నాయకత్వంలో పరివార్‌ మద్దతుదారులైన న్యాయవాదులు కూడా నల్లకోట్లు వేసుకొని విద్యార్ధులు, అధ్యాపకులు, వార్తల సేకరణకు వచ్చిన జర్నలిస్టులపై దాడులు చేయటం, మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా దాడులకు దిగటం ప్రమాదకర పోకడలకు నిదర్శనం.

అఫ్జల్‌ గురువంటి వుగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేయటం ద్వారా వుగ్రవాదులపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను అవమానించటమే అని వారి త్యాగాలను అపహాస్యం చేయటమే అని మనోభావాలను రెచ్చగొడుతూ తమ తప్పుడు చర్యలను సమర్ధించుకొనేందుకు సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది.పంజాబు, కాశ్మీరులలో అమెరికా కుట్రలో భాగంగా పాకిస్ధాన్‌ కేంద్రంగా వున్న వుగ్రవాదులు జరిపిన దాడులలో ఎందరో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ పార్టీలలో వారిని ఎదుర్కొని ఎందరో నాయకులు, కార్యకర్తలను కోల్పోయిన సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు , అకాలీదళ్‌ తప్ప దేశభక్తి,దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పుకొనే బిజెపి , ఇతర పార్టీలకు చెందిన వారు ఎందరున్నారో చెప్పమనండి. బిజెపి కుహనా (నకిలీ) దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేక పోరాట బండారం గురించి గతేడాది జూలైలో మన రిసర్చ్‌ మరియు ఎనాలసిస్‌ వింగ్‌( రా)లో పనిచేసిన మాజీ అధికారి ఎఎస్‌ దౌలత్‌ గతంలో బిజెపి అధికారంలో వున్నపుడు 1999లో కాందహార్‌ విమాన హైజాక్‌ వుదంతంలో వ్యవహరించిన తీరు గురించి వివరించారు. వందలాది మంది పౌరుల, భద్రతా సిబ్బంది ప్రాణాలు తీసిన వుగ్రవాదులతో రాజీపడిన వాజ్‌పేయి సర్కార్‌ ముగ్గురు కరడు గట్టిన తీవ్రవాదులను విడుదల చేసింది. పోనీ విమాన ప్రయాణీకుల ప్రాణాలు కాపాడేందుకు ఆ పనిచేసిందని సరిపెట్టుకోవచ్చు.కానీ పాకిస్ధాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హిజబుల్‌ ముజహిదీన్‌ అధిపతి సయీద్‌ సలావుద్దీన్‌ కుమారుడికి 1999లో బిజెపి ప్రభుత్వం మనదేశంలోని ఒక మెడికల్‌ కాలేజీలో సీటు ఇప్పించటం దేశ భక్తా, వుగ్రవాదులతో కుమ్మక్కా? ఏ ప్రయోజనం ఆశించి చేసినట్లు ఇంతవరకు దాని గురించి ప్రభుత్వం నోరు విప్పదు. ఆ విమాన హైజాక్‌ వుదంతంలో అది అమృతసర్‌ నుంచి బయలుదేరి వెళ్లటానికి అనుమతించటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది అమృతసర్‌ నుంచి వెళ్లిన తరువాత వుగ్రవాదులది పైచేయి అయిందని రా మాజీ అధికారి వ్యాఖ్యానించారు. నాటి బిజెపి ప్రభుత్వం రాజీపడి మన జైళ్లలో వున్న ముగ్గురు వుగ్రవాదులను విడుదల చేసింది.

నినాదాలు చేయటం చట్ట ప్రకారం వ్యతిరేకం, అందుకు పాల్పడిన వారిని శిక్షించవచ్చు, కానీ కాశ్మీర్‌లో ప్రతిరోజూ అనేక కారణాలతో అక్కడి పౌరులు ఏదో ఒకచోట నిరసన తెలుపుతూ భారత వ్యతిరేక నినాదాలు చేస్తూనే వున్నారు. వారందరినీ దేశవ్యతిరేకులుగా పరిగణించి జైళ్లలో పెడితే సమస్య పరిష్కారం అవుతుందా ? లేదు కొందరు నినాదాలు చేసినంత మాత్రానే కాశ్మీర్‌ విడిపోయి వుంటే ఈ పాటికి అ పని ఎప్పుడో జరిగి వుండేది. కానీ బిజెపి అలాంటి వుదంతాలను సాకుగా చూపి నకిలీ దేశభక్తిని ప్రదర్శిస్తోంది. చరిత్రలోకి వెళ్లేట్లయితే అసలు కాశ్మీర్‌ భారత్‌లో విలీనం విషయంలో నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ తటపటాయింపులు, విలీనానికి ఒక దశలో విముఖత, దానికి నేటి బిజెపి, అంతకు ముందు జనసంఘరూపంలో వున్న, సంఘపరివార్‌కు చెందిన వారంతా రాజుకు మద్దతుగా విలీనానికి విముఖత తెలిపిన వారే అన్నది చరిత్రలో నమోదయ్యే వుంది. రాజుకు వ్యతిరేకంగా నాడు షేక్‌ అబ్దుల్లా పోరాడి కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు కారకుడయ్యాడు కనుకనే విలీనం తరువాత ప్రధానిగా షేక్‌ అబ్దుల్లాను నియమించమని నాటి రాజు హరిసింగ్‌ స్వయంగా బ్రిటీష్‌ ప్రభుత్వానికి రాశారు. నాడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, యువతలో నిరుద్యోగం, దారిద్య్రం వంటి కారణాలకు తోడు నిరంతరం పాకిస్ధాన్‌, అమెరికా తదితర సామ్రాజ్యవాదుల కుట్రకారణంగా కాశ్మీర్‌ వేరుపడి స్వతంత్ర రాజ్యం ఏర్పడాలనే భావనలు అక్కడ తలెత్తాయి. దానికి తోడు కాశ్మీర్‌కు రాజ్యాంగబద్దంగా కల్పించిన రక్షణలైన ఆర్టికల్‌ 370కు వ్యతిరేకంగా సంఘపరివార్‌ రాజకీయ రూపం ఎలా వున్నప్పటికీ నిరంతరం కాశ్మీరీయులకు వ్యతిరేకంగా ఏదో ఒక రూపంలో రెచ్చగొడుతూనే వున్న అపర దేశభక్తులు వారు. కాశ్మీర్‌లో తలెత్తిన వేర్పాటు వాద ధోరణులు, పాక్‌, అమెరికా సామ్రాజ్యవాదుల వుగ్రవాదుల కార్యకలాపాలను ఒకేగాటన గట్టిన కాంగ్రెస్‌, బిజెపి పాలకుల వైఖరి కారణంగా ఎవరు వేర్పాటు వాదో, ఎవరు వుగ్రవాదో తెలియని స్ధితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రెండుశక్తులను దగ్గరయ్యేట్లు చేశారు. అంతే కాదు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మిజోరాం, మణిపూర్‌,అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సోం, తదితర రాష్ట్రాలన్నింటా వేర్పాటు వాదశక్తులు తలెత్తి సాయుధ పోరాటాలను కూడా సాగించిన విషయంతెలిసిందే. ఆ రాష్ట్రాలలో వాటికి ప్రభావితులైన యువతరాన్ని దేశద్రోహులుగా పరిగణించి జైళ్లలో పెడితే ఈశాన్య ప్రాంతంలో పరిస్ధితులు వేరే విధంగా వుండేవి. అందువలన కొత్తబిచ్చగాడికి పంగనామాలెక్కువ అన్నట్లు అసలు ఏనాడూ దేశభక్తులుగా లేని సంఘపరివార్‌ శక్తులు ఈనాడు తాము చెప్పిందే దేశభక్తి దానికి భిన్నంగా వుండేవారందరూ దేశద్రోహులే అన్నట్లు మాట్లాడుతూ నానా యాగీ చేయటమే కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేసి అణచివేసేందుకు పూనుకుంది.

సంఘపరివార్‌ నాయకులలో ఒకరైన వీర సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి వారికి విధేయుడిగా పనిచేస్తానని 1914లోనే రాసిన లేఖ వారి దేశభక్తికి పెద్ద నిదర్శనం. దానికి అనుగుణంగానే తరువాత ఎక్కడా సంఘపరివారెవరూ స్వాతంత్య్ర వుద్యమంలో మనకు కనపడరు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి రాసిన లేఖ బయటపడగానే ఈ దేశభక్తులు కొత్త పల్లవి అందుకున్నారు. చరిత్రలో చాలా మంది ఒక ఎత్తుగడగా తమ శ త్రువులకు లొంగిపోయినట్లు లేఖలు రాసినట్లుగానే సావర్కర్‌ కూడా బ్రిటీష్‌ వారికి లేఖ రాసిన మాట నిజమే అని హాస్యాస్పదమైన ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్య్ర వుద్యమంలో ఈ కాషాయ దళం భాగస్వామి అయి వుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన గాడ్సే జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసి వుండేవాడు కాదు. గాంధీ హత్య జరిగిన రెండు దశాబ్దాల తరువాత సంఘపరివార్‌ అధికారిక పత్రిక ఆర్గనైజర్‌లో 1970 జనవరి 11 సంచిక సంపాదకీయంలో ఇలా రాశారు.’ పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూకు మద్దతుగా గాంధీజీ దీక్షకు దిగారు, ఈ క్రమంలోనే జనాగ్రహం స్వయంగా ఆయనపైకి మళ్లింది. కాబట్టే నాధూరామ్‌ గాడ్సే ‘ప్రజలకు’ ప్రాతినిధ్యం వహించాడు మరియు జనాగ్రహానికి స్పందన అన్నట్లుగా హత్యకు పాల్పడ్డాడు’ అని నిస్సిగ్గుగా గాడ్సేసు, గాంధీజీ హత్యను సమర్ధించారు.అంతకు ముందు 1961లో దీన దయాళ్‌ వుపాధ్యాయ ఇలా చెప్పారు.’ గాంధీజీపై అన్ని రకాల గౌరవభావంతో మనం ఆయనను జాతిపిత అని పిలవటం మానివేద్దాం. మనం జాతీయవాద పాత ప్రాతికను అర్ధం చేసుకుంటే అది హిందూయిజం తప్ప మరొకటి కాదని మనకు స్పష్టం అవుతుంది.’ అన్నారు. 1989 అక్టోబరు 17నాటి సంపాదకీయంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఇలా వ్యాఖ్యానించింది.’ శ్రీ అద్వానీ భారత మాతను ముందుకు తెస్తున్నారంటే ఇప్పటివరకు జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మాగాంధీని నిరాకరించటమే అవుతుంది’ అన్నది. గాడ్సేను కీర్తిస్తూ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు గోవాలో అధికారంలో వున్న బిజెపి నాయకుడు అంగీకరించటమే గాక, తాను అధ్యక్షుడిగా వున్న ప్రభుత్వానికి చెందిన రవీంద్ర భవన్‌ను వేదికగా కూడా ఇచ్చిన ఆ పెద్దమనిషి దేశభక్తుడు, దానిని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, తిమ్మినిబమ్మిని చేయటం అంటే ఇదే.ఈ లెక్కన బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏది చెబితే దాన్ని దేశ ప్రజలందరూ అంగీకరించాలి. అది హిందూయిజాన్ని జాతీయ వాదం అంటే అంగీకరించాలి, ఆ ప్రాతిపదికన దేశ భక్తులు ఎవరో ఎవరు కాదో నిర్ణయించేది వారే. వారి జాబితాలో వున్న గాడ్సే లాంటి వారందరూ దేశ భక్తులు, ఎవరైనా కాదంటే దేశద్రోహులు, కాదని గట్టిగా వాదిస్తే వారిపై దాడి చేసి ఒప్పిస్తారు. హైదరాబాదు కేంద్రీయ విద్యాలయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది కనుక మంత్రులతో వత్తిడి చేయించి ఐదుగురు అంబేద్కరిస్టు దళిత విద్యార్ధులపై చర్య తీసుకొనేట్లు వత్తిడి చేశారు. జెఎన్‌యులో డిఎస్‌యు సభకు అధికారులే షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు కనుక తమ చేతిలో వున్న పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించారు.అరెస్టయిన వారిని కోర్టులో ప్రవేశ పెట్టేందుకు తీసుకువస్తున్న సందర్భంగా చూసేందుకు వచ్చిన విద్యార్ధులు, అద్యాపకులు, వార్తలు సేకరించేందుకు వచ్చిన జర్నలిస్టులపై బిజెపి ఎంఎల్‌ఏ, న్యాయవాదులుగా వున్న పరివార్‌ కార్యకర్తలు దాడికి దిగారు. బిజెపికి మార్కు ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? దీన్ని నోర్మూసుకుని జనం అంగీకరించాలా ? మధ్య యుగాలలో శైవులు, వైష్ణవులు తమ మతాలను అనుసరించని వారిని, వ్యతిరేకించిన జైన, బౌద్ధ మతాలవారిని, చార్వాకులు, లోకాయతులపై భౌతికంగా దాడి చేసి హతమార్చారని, జైన, బౌద్ధ కేంద్రాలను వీర శైవమతస్దులు శివాలయాలుగా మార్చివేశారని చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు తిరిగి బిజెపి, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్నదానికి గతంలో జరిగినదానికీ పెద్ద తేడా కనిపించటం లేదు. జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ యూదులు, కమ్యూనిస్టులపై వ్యతిరేకతను రెచ్చగొడితే మన దేశంలో సంఘపరివార్‌ ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులపై జనాన్ని వుసిగొల్పుతున్నది.అలాంటి శక్తులకు ఐరోపాలో, ప్రపంచంలో ఇతర చోట్ల ఏమి జరిగిందో మరోసారి చెప్పాల్సిన పనిలేదు.

సంఘపరివార్‌ ఇలాంటి దాడులకు ఎందుకు పూనుకున్నది, విశ్వవిద్యాలయాలను అది వేదికగా ఎందుకు చేసుకున్నది అన్నది అనేక మందిలో నలుగుతున్న సందేహం. విశ్వవిద్యాలయాలెప్పుడూ పురోగామి కేంద్రాలు తప్ప తిరోగాములకు ఆలవాలం కాదు. ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రతి భావాన్ని వ్యక్తం చేసే విశాల ప్రజాస్వామిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. సహజంగానే అవి వివిధ వామపక్ష, ప్రజాస్వామిక భావజాల కేంద్రాలుగా వున్నాయి. సంఘపరివార్‌కు చెందిన అఖిలభారతీయ విద్యార్ధి పరిషత్‌ చరిత్రను వెనక్కు నడపాలని చూసే ఒక తిరోగామి శక్తి. సైద్ధాంతిక చర్చలో అది ప్రతి చోటా పాడిందే పాడరా అన్నట్లు సభ్య సమాజం ఎప్పుడో తిరస్కరించిన భావజాలాన్నే ముందుకు తెస్తోంది. సహజంగానే అది విద్యార్ధులలో తిరస్కరణకు గురి అవుతోంది. అందువలన వాటిని ఎలాగైనా తమ అదుపులోకి తెచ్చుకోవాలని, వాటిని కూడా మత కేంద్రాలుగా మార్చాలన్నది ఎప్పటి నుంచో వున్న దాని పధకం. ఇప్పుడు కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారంలో వుంది కనుక అధికారిక సంస్ధలన్నింటినీ తన భావజాలంతో వున్నవారు లేదా వారి కనుసన్నలలో నడిచే వారితో నింపుతోంది. పూనా ఫిలిం సంస్ధ వంటి ప్రఖ్యాత అకేంద్రానికి మహాభారత్‌ సీరియల్‌లో గుడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర ధరించటం మినహా మరొక అర్హతలేని చిన్న నటుడిని అధిపతిగా నియమించటాన్ని అక్కడి విద్యార్ధులు వ్యతిరేకించి నెలల తరబడి ఆందోళన జరిపినా పోలీసు బలప్రయోగంతో అణచివేసింది తప్ప ప్రజాభిప్రాయాన్ని మన్నించలేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఎంఎం కలుబర్గిని హిందూత్వ శక్తులు హత్య చేసిన కారణంగానే ఆ చర్యను ఖండించేందుకు అకాడమీ ముందుకు రాలేదన్నది తెలిసిందే. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలిగే వ్యక్తిని వైస్‌ఛాన్సలర్‌గా నియమించిన వెంటనే మంత్రులు వత్తిడి చేయటం తదనంతర పరిణామాలో వేముల రోహిత్‌ అనే దళిత విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. దానిలో కూడా అతడు దళితుడు కాదు, బిసి అని తప్పుడు ప్రచారం చేసి సమస్యను పక్కదారి పట్టించాలిని చూశారు. దళితుడు కాకపోతే బిసి అయినా ఒక విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడేట్లు చేయటం ఏమిటి ? అసలు సమస్య అతను దళితుడా, బిసి అని కాదు, సంఘపరివార్‌ భావజాలాన్ని వ్యతిరేకించాడు అందుకే అంతటి కక్షగట్టారు. ఇటువంటి సంఘపరివార్‌ వ్యతిరేక, వామపక్ష భావజాలానికి కేంద్రంగా వున్న ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనే తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకుంటే మిగతా విశ్వవిద్యాలయాలన్నీ తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవటం సులభం అని అక్కడ తమ పధకాన్ని అమలు జరుపుతున్నారు. అక్కడి పరిణామాలకు అదే మూలం. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దేశమంతటా వేర్పాటు వాదానికి వ్యతిరేక ప్రచారం పేరుతో జాతీయవాదాన్ని ప్రచారం చేయాలని బిజెపి పధకం వేసింది.

అన్నింటి కంటే కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఏలుబడికి ఇరవై నెలలు నిండింది. రూపాయి విలువ దగ్గర నుంచి ఎగుమతుల వరకు అన్ని రంగాలలో ప్రతికూల పరిస్ధితులు ముసురుకుంటున్నాయి.స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. నరేంద్రమోడీ వచ్చిననాటికి సూచీలు పతనమయ్యాయి. ధరలు తగ్గటం లేదు, అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమైనా పన్నులు విధిస్తూ స్ధానికంగా ధరలు తగ్గకుండా చూస్తున్నారు. కొత్తగా పరిశ్రమలు రావటం లేదు, వున్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. అంకెల్లో చెబుతున్న అభివృద్ధి అంతా వుపాధి రహితమే. వేతన కమిషన్‌ సిఫార్సులపై వుద్యోగులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. రైల్వే వంటి చోట్ల సమ్మె బ్యాలట్‌ తీసుకొనే వరకు వచ్చింది. మిగతా రంగాలలో కూడా ఆందోళనకు రంగం సిద్ధం అవుతోంది. స్వచ్ఛభారత్‌, మేకిన్‌ ఇండియా వంటి వన్నీ నినాదాలకే పరిమితం తప్ప మరొకటి కాదు. ఈ పూర్వరంగంలో ఒకవైపు సంఘపరివార్‌కు చెందిన భజరంగదళ్‌, విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్ధలు రామాలయ నిర్మాణ సమస్యను మరోసారి ముందుకు తెస్తున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి జనం దృష్టిని పక్కదారి పట్టించేవే. జెఎన్‌యు, ఇతర విశ్వవిద్యాలయాలలో రాజేసిన కాష్టం కూడా దానిలో భాగమే అంటే కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేనికీ ‘అసహనం’, ఎందుకా ‘సహనం ‘ ఓ మహాత్మా ! ఓ మహర్షీ !!

13 Saturday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

Intolerance, Reservations, Tolerance

 

ఎం కోటేశ్వరరావు

     ఇటీవలి కాలంలో సామాజిక మీడియాలో రిజర్వేషన్లు,సామాజిక వివక్షపై జరుగుతున్న చర్చలలో రెండు రకాల ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. భాష, భావం తీరుతెన్నులు చూస్తే వుభయులూ తీవ్ర స్ధాయిలోనే వున్నట్లు కనిపిస్తోంది. ఒకటి వేల సంవత్సరాల అణచివేత, అమానుష వివక్షపై ఎందుకీ సహనం అన్న ఆగ్రహంతో కూడిన జ్వాల. రెండవది దీనికి బాధ్యత తమది కానపుడు దాని పర్యవసానాలను తామెందుకు అనుభవించాలన్న ఆక్రోశం, దాని నుంచే దళితులు, గిరిజనులు, ఓబిసిలకు రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగిస్తారు అనే తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. పుట్టుక అన్నది యాదృచ్చికం. కానీ ఒక చోట పుట్టిన వారికి ఒక ముద్రవేసి ఒక విధంగానూ, మరొక చోట పుట్టిన వారికి మరో తోక తగిలించి వేరే విధంగా చూడటం అన్నది కాదనలేని వాస్తవం. రిజర్వేషన్ల వయస్సు ఏడు పదులు, మరి అమానుష వివక్ష, అణచివేత ఎంత కాలం నుంచి కొనసాగుతోంది, ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, చెప్పేవారెవరు ?

      రిజర్వేషన్ల గురించి రానున్న రోజుల్లో మరోసారి తీవ్ర చర్చకు తెరలేవ నుంది.ప్రయివేటు రంగంలో కూడా వుద్యోగాలలో రిజర్వేషన్‌ విధానాలను పాటించాలని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్‌సిబిసి) కేంద్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగంలో వున్న రిజర్వేషన్లనే తొలగించాలని తాము కోరుతుంటే ప్రయివేటు రంగంలో కూడా అమలు జరపాలని సిఫారసు చేయటం ఏమిటని రిజర్వేషన్‌ వ్యతిరేకులు మండిపడుతున్నారు. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల కారణంగా అప్పటి నుంచి క్రమంగా ప్రభుత్వరంగంలో పెట్టుబడులు నిలిచిపోయాయి. అటు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ కొత్త పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి రాలేదు. హెచ్‌ఎంటి, ఐడిపిఎల్‌ , భెల్‌ వంటి కొన్నింటిని ఒక పధకం ప్రకారం మూతపడేట్లు చేశారు. అవి పోగా వున్నవాటిలో యాంత్రీకరణ, పాక్షిక ప్రయివేటీకరణ వంటి చర్యల ద్వారా 2006 -12 మధ్య కాలంలో ప్రభుత్వ రంగంలో 3.3శాతం వుద్యోగాలు తగ్గిపోగా, ఇదే సమయంలో ప్రయివేటు రంగంలో 35.7శాతం పెరిగాయి. ప్రయివేటు రంగం అందరికీ గౌరవ ప్రదమైన జీవనానికి వుపాధి కల్పించి వుంటే అసలు ఈ రిజర్వేషన్ల అనుకూలం లేదా వ్యతిరేకత సమస్య తలెత్తి వుండేది కాదు. ఈనేపధ్యంలోనే ఈ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. దానికి అనుగుణ్యంగానే ఎన్‌సిబిసి సిఫారసు వెలువడింది. ఇప్పటికే ఈ డిమాండ్‌పై పలు చోట్ల ప్రచార ఆందోళన చేపట్టిన వామపక్షాలు, అవి పనిచేసే ప్రజాసంఘాలు సహజంగానే ఈ పరిణా న్ని హర్షిస్తాయి. తమ వుద్యమాలను మరో మెట్టు ముందుకు తీసుకుపోతాయి.

     ప్రస్తుతం అధికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారస్‌ను తిరస్కరిస్తుందా? ఆమోదిస్తుందా? ఆమోదిసే,్త అమలు జరుపుతుందా? ఎప్పటి నుంచి? ఎంత కాలం అమలు జరుపుతుంది వంటి అనేక ప్రశ్నలు ముందుకు వస్తాయి. ఇవన్నీ చర్చకు తెరలేపుతాయి. బిజెపి, కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె, అన్నాడిఎంకె వంటి ప్రాంతీయ పార్టీలన్నీ పాలకవర్గ పార్టీలే. అధికారంలో లేనపుడు సామాన్య జనం పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే వారిని మర్చిపోయి పెట్టుబడిదారులు, భూస్వాముల సేవలో తరిస్తూ వారి ప్రయోజనాలను కాపాడే వారిని పాలకవర్గ పార్టీలు అంటారు.మిగతావాటిలో సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు కొన్ని సందర్బాలలో అక్కడక్కడా అధికారానికి వచ్చినప్పటికీ వాటిని పాలకవర్గ పార్టీలుగా పరిగణించటం లేదు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో డెమోక్రటిక్‌, లేబర్‌, సోషలిస్టు పార్టీల పేరుతో వున్నవి కూడా ప్రతిపక్షంలో వుండగా ఏమి చెప్పినా సామాజికాంశాలలో తరతమ తేడాలు తప్ప ఆర్ధిక విషయాలలో మిగతా పార్టీలకు ఏమాత్రం తీసిపోవు కనుక వాటిని కూడా పాలకవర్గ పార్టీలే అంటున్నారు.

       ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల విషయానికి వస్తే ఎన్‌సిబిసి సిఫార్సును బిజెపి స్వాగతించింది. అయితే సాధ్వీ సావిత్రీ అదియును నీ పతిప్రాణంబు దక్క అని యముడు షరతు పెట్టినట్లు ఒక చిన్న మెలిక పెట్టింది. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు జరపటానికి అనువైన పరిస్ధితులు వచ్చినపుడు మాత్రమే అమలు జరపాలి తప్ప బలవంతంగా చేయకూడదు అని బిజెపి ప్రతినిధి విజయ్‌ సోంకార్‌ శాస్త్రి ముక్తాయింపు ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఏ ప్రభుత్వం ఈ దిశగా ఏమీ చేయలేదని కూడా విమర్శించారు. అమలుకు అనుకూలమైన పరిస్ధితులంటే ఏమిటో, అవి ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పలేదు. ప్రతి పక్ష కాంగ్రెస్‌ కూడా స్పందించింది.’ ఎల్లవేళలా సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు తాము చర్యలు తీసుకున్నామని,అందుకోసం ఎస్‌సి,ఎస్‌టి మరియు ఓబిసిల రిజర్వేషన్లు అమలు జరిపేందుకు తాము చట్టాలు తెచ్చామని, ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్ల గురించి తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నామని కాంగ్రెస్‌ గుర్తు చేసింది.

       ఈ సమస్యపై ప్రతిపక్షాలు దెబ్బలాటలకు కవ్వించే అవకాశం వున్నందున బిజెపి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ పార్టీ మేథావులు అప్పుడే ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.ఈ సవాలును తేలికగా తీసుకోవద్దంటూ రిజర్వేషన్ల ఫలాలు దిగువకు సక్రమంగా అందాల్సిన వారికి అందనందున వాటిని సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగత్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అయినా బీహార్‌ ఎన్నికలలో బిజెపి భారీ మూల్యం చెల్లించించిందని వారు గుర్తుకు తెచ్చారు. రాజ్యాంగం ఆర్టికల్‌ 16లో ప్రభుత్వరంగంలో రిజర్వేషన్ల గురించి మాత్రమే వుందని ప్రయివేటు రంగం గురించి ఏ కోశానా ప్రస్తావన లేదని, అయితే రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పని చేయవచ్చని, దీని వలన తాత్కాలికంగా బిజెపి రాజకీయ ప్రయోజనం పొందినప్పటికీ మండల్‌ తరహా ఘర్షణలు చోటు చేసుకోవచ్చని, ఓబిసిల తరువాత మతపరమైన మైనారిటీలు కూడా తమకూ అమలు జరపాలని కోరతారని, ఆర్ధిక వ్యవస్ధకు ఎంతో నష్టం కలిగిస్తుందని కాషాయ మేథావులు హెచ్చరిస్తున్నారు. యుపిఏ-2 హయాంలో పారిశ్రామికవేత్తలు బయటి దేశాలలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రాధాన్యత ఇవ్వటంతో పెట్టుబడులు బయటకు పోయాయని, ఇప్పుడు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే మేథావులు కూడా వలస పోతారని బెదిరిస్తున్నారు. సామాజికంగా వెనుక బడిన తరగతుల వారికి కావాలంటే వుచిత విద్య, విద్యా రుణాల సౌకర్యం వంటివి కలిగించాలని ఎంతో వుదారంగా సలహాలు ఇస్తున్నారు.

     ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు వుద్రేకాలను తగ్గించుకొని ఆలోచించటం అవసరం. సమాజంలోని మెజారిటీ ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసి సామాజిక తరగతుల శ్రమ స్వేదంతో సృష్టించబడేదే సంపద. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రమలో ఏ మాత్రం పాత్రలేని కొన్ని సామాజిక తరగతులు వునికిలో వుండటం మన సమాజ ప్రత్యేకత. దానికి కూడా తమకు అనుకూలమైన నియమనిబంధనలను రూపొందించారు. సామాజిక పరిణామ క్రమంలో వివిధ రూపాలలో అధికారిక వ్యవస్ధలు వునికిలోకి వచ్చాయి.అవి సమాజ పురోభివృకి ఆటంకంగా మారినపుడు వాటిని తొలగించి మెరుగైన కొత్త వ్యవస్ధలను ఏర్పాటు చేసుకుంది సమాజం. భూస్వామిక వ్యవస్ధ తమకు ఆటంకం అని భావించినపుడు ఐరోపా దేశాలలో పెట్టుబడిదారులు ఆ భూస్వామిక వ్యవస్ధను నామరూపాలు లేకుండా నాశనం చేశారు. ఫ్రెంచి విప్లవం అంటే అదే. అటువంటిది మన మన దేశంలో జరగలేదు. బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఆక్రమించి తమకు అవసరమైన కొన్ని పరిశ్ర మలను ప్రోత్సహించారు తప్ప మన దేశాన్ని తమకు అవసరమైన ముడిసరకులను అందచేసే దేశంగానే వుంచారు. అందుకే భూస్వాములతో రాజీపడి వారిని కూడా కొనసాగించారు. ఈ కారణంగానే ప్రస్తుతం మన దేశంలో పెట్టుబడిదారుల నాయకత్వంలో భూస్వాములు కూడా అధికార వ్యవస్ధలో పెత్తనం సాగిస్తున్నారు. ఇటువంటి ప్రత్యేక పరిస్ధితి ప్రపంచంలో మరోచోట కనపడదు.అందువలననే మన సమాజంలో కూడా భూస్వామిక, పెట్టుబడిదారీ లక్షణాలు రెండూ జంటగా కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రభావంతో కొన్ని అంశాలో పురోగామి వైఖరిని ప్రదర్శించేవారు మరికొన్ని విషయాలలో తిరోగామి భావజాలానికి లొంగిపోతున్నారు. సామాజిక వివక్ష చట్ట ప్రకారం నేరం అని అంగీకరిస్తూనే తమదాకా వచ్చేసరికి సాంప్రదాయం, ఎప్పటి నుంచో వుంది, ఆ మనోభావాలను కూడా మనం అంగీకరించాలి కదా అనే వాదనలతో చట్ట వ్యతిరేకమైన తాతగారి నాన్నగారి భావాలను ముందుకు పెడుతున్నారు. అది సమాజంలో ఘర్షణకు దారితీస్తోంది.

     ప్రయివేటు రంగ రిజర్వేషన్ల విషయంలో కూడా దీన్ని చూడవచ్చు. ప్రయివేటు రంగంలో ఏ చిన్న పరిశ్రమ పెట్టాలన్నా, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కావాలన్నా చేయాల్సింది ఎవరు ? ప్రభుత్వమే. పెట్టుబడి ఇవ్వాల్సింది ఎవరు ప్రభుత్వరంగంలోని బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలే. అంటే ప్రయివేటు రంగం గాలిపీల్చి మనుగడ సాగించాలంటే ప్రభుత్వం లేకుండా ఒక్క క్షణం నడవదు. ప్రభుత్వమంటే ప్రజలు తప్ప మరొకటి కాదు. అందువలన ప్రభుత్వ రంగం పాటిస్తున్న విధానాలను ప్రయివేటు రంగం అమలు జరపాలని కోరటం ప్రజల హక్కు తప్ప దయాదాక్షిణ్యం కాదు. ఎవరైనా తమకు అందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటే ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా తమ స్వంత పెట్టుబడులు, విద్యుత్‌, నీరు, భూమి, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను స్వంతంగా సమకూర్చుకోమనండి. అది సాధ్యం కాదు కనుకనే 2004 నవంబరు 18న దేశంలోని 218 అగ్రశ్రేణి సంస్ధలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సాధికారత కలిగించేందుకు మనసా వాచా కర్మణా తాము చేయాల్సిందంతా చేస్తామని రాతపూర్వంగా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివేదించాయి. అంటే అర్ధం ఏమిటి స్వచ్చందంగా ఆ తరగతుల వారికి తగు స్ధానం కల్పిస్తామని చెప్పటమే కదా? ఆ వాగ్దానాన్ని ఎన్ని సంస్ధలు ఎంత మేరకు అమలు జరిపాయి? రాజ్యాంగంలో హక్కులు కాకుండా ఆదేశిక సూత్రాల పేరుతో అనేక పురోగామి భావాలను అమలు జరపాలని చెప్పారు. కానీ వాటిని హక్కుగా అమలు జరిపే పరిస్ధితి ఇంకా మనకు రాలేదనే పేరుతో మన పాలకులు ఎగవేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటా ఐదారు లక్షల కోట్ల రూపాయలను రాయితీలుగా ఇస్తున్న ప్రభుత్వాలు స్కూళ్లలో పిల్లలకు అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు కట్టించాలంటే డబ్బు లేదంటూ ఇంతకాలం వాయిదా వేశాయా లేదా ? కనుకనే ప్రయివేటు రంగంలో వుద్యోగాల రిజర్వేషన్లు చట్టబద్దంగా అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.

     రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు జరపాల్సింది పది సంవత్సరాలే కదా, అయినా డెబ్బయి సంవత్సరాలుగా అమలు జరుపుతున్నారు, ఇంకా ఎంతకాలం ఇలా అని అనేక మంది ‘అసహనం’ వ్యక్తం చేస్తున్నారు. నిజమే దానిని అర్ధం చేసుకోవాల్సిందే, మనది ప్రజాస్వామ్యం కనుక ఆ భావాల వ్యక్తీకరణను ‘సహించాల్సిందే’, ఎలాంటి మినహాయింపులు లేవు. ఎలాంటి చట్టాలు లేకుండానే వేల సంవత్సరాల పాటు కుల వివక్ష, అణచివేతను సమాజం అమలు జరిపింది. చట్టబద్దంగా రద్దు చేసిన తరువాత కూడా అమలు జరిపేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. దళితులు దేవాలయ ప్రవేశ ం చేస్తే అవి మలిన పడ్డాయనే పేరుతో శుద్ధి చేయటం నేరం. దానికి ఎవరినైనా ఇంతవరకు శిక్షించారా ? వివక్షను ఇంకా రూపు మాపలేదెందుకన్న ‘అసహనం’ ఎందుకు వ్యక్తం చేయరు? అసలు రిజర్వేషన్లకు మూలం ఆ సామాజిక వివక్షే కదా ? దాన్ని నిర్మూలించకుండా దాని పర్యవసానాలను వ్యతిరేకించటం, అసహనం వ్యక్తం చేస్తే ప్రయోజనం వుంటుందా ?

     కుల వివక్షకు వ్యతిరేకంగా ఆరువందల సంవత్సరాల నాడే వేమనతో ప్రారంభించి అంబేద్కర్‌ వరకు ఎందరో సంస్కర్తలు తమ పరిధులు, పద్దతులలో వాటిని నిరసించి వ్యతిరేకించారే మరి సమాజం మొత్తంగా దానిని ఎందుకు నిరసించటంలేదు? ఎక్కడైనా వ్యతిరేకిస్తే సామూహిక దాడులకు పాల్పడటాన్ని ఏమనాలి? ఎక్కడో దక్షిణాఫ్రికాలో, అమెరికాలో నల్లజాతీయుల పట్ల వివక్షను ఖండించే మనం మన చుట్టుపక్కల మానవత్వానికే మాయని మచ్చగా వున్న వివక్ష పట్ల ఎక్కడలేని ‘సహనం ‘ ఎందుకు వహిస్తున్నట్లు? ఆ వివక్షను ఎదుర్కొనే వారి ఆక్రోశానికి ఎవరు సమాధానం చెబుతారు ?

     ఏదేశంలోనూ లేని రిజర్వేషన్లు మన దేశంలోనే ఎందుకు అని ప్రశ్నించే వారు ఎక్కడా లేని వివక్ష, కుల వ్యవస్ధ ఇక్కడ ఎందుకో చెప్పాల్సిన అవసరం లేదా ? అదంతా పూర్వజన్మ సుకృతం ఎవరు ఎంత చేసుకుంటే అంత అనుభవించాలి అని చెబుతారా ? అయితే రిజర్వేషన్లు కూడా అలాంటివే అనుకోవాలి. వేదాలలోనే విజ్ఞానం అంతా నిక్షిప్తమై వుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. తిరోగమన శక్తులు అధికార కేంద్రాలలో తిష్టవేయటంతో ఇటీవలి కాలంలో మరోసారి చెప్పటం ఎక్కువైంది. అదెంత నిజమో ? వాస్తవాలేమిటో కాసేపు పక్కన పెడదాం. ఆ వేదాలను బ్రహ్మ ముఖంలోంచి పుట్టుకు వచ్చారని చెప్పుకొనే బ్రాహ్మణులు మాత్రమే చదవాలని,చెప్పాలన్న రిజర్వేషన్లు అవి పుట్టినప్పటి నుంచి కొనసాగుతున్నాయి కదా ? బ్రాహ్మణులు తప్ప వేరే కులాల వారు చదవకూడదన్న నిషేధం ఇప్పటికీ కొనసాగుతున్నదా లేదా ? వేదాలు, పురాణాలలో చెప్పినట్లు బ్రాహ్మణులు తిరిపెమొత్తుకుని తినాలి తప్ప వుద్యోగాలు చేయకూడదనే నిషేధాలు ఇప్పుడు లేవే ? రిజర్వేషన్లు కూడా జనాభా ప్రాతిపదికగా దామాషా పద్దతి ప్రకారం అమలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదే. వేద పఠనంపై కొనసాగిన రిజర్వేషన్లతో పోల్చితే నేటి వుద్యోగ, విద్యా రిజర్వేషన్ల వ్యవధి ఎంత ? అన్నింటినీ మన ఖర్మ అనుకొని సహిస్తున్నవారు రిజర్వేషన్ల విషయంలో కూడా అలా అనుకోకుండా వ్యతిరేకంగా వీధులకు ఎందుకు ఎక్కుతున్నట్లు ? హింసాకాండకు ఎందుకు పాల్పడుతున్నట్లు ?

    సామాజిక అంశాలలో కొనసాగుతున్న వివక్ష గురించి ఎక్కడలేని ‘సహనం’ వ్యక్తం అవుతోంది. రిజర్వేషన్లపై వెల్లడిస్తున్న వ్యతిరేకత, ఇతర సామాజిక వివక్షపై వ్యక్తం చేయటం లేదంటే అర్ధం దాన్ని సహిస్తున్నట్లే. సమాజంలో ఈ వైఖరి కొనసాగినంత కాలం ఏదో ఒక రూపంలో దాని పర్యవసానాలు సంభవిస్తూనే వుంటాయి. రిజర్వేషన్లు కొనసాగుతూనే వుంటాయి. అయితే రిజర్వేషన్లే అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు ఆశించిన మేలు చేకూర్చలేవని కూడా ఈ కాలంలో రుజువైంది. అందువలన పరిమితంగా వున్న అవకాశాలను చేజిక్కించుకొనేందుకు కొట్లాడుకోవటం కాకుండా అందరికీ అన్ని అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ విధానాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం లేదా ? ఆలోచించండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆవు, ఎద్దుల వేద శాస్త్రాలు నవకల్పనలకు దారి చూపవు

06 Saturday Feb 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

cow, cow sciences, innovations, innovations index, Vedic sciences

ఎం కోటేశ్వరరావు

     ఏ దేశమైనా అభివృద్ధి చెందింది అనటానికి అనేక కొలమానాలు వుంటాయి.  ఎక్కడో ఒక దగ్గర చోటు దక్కితేనే మనం కూడా ఆ రేసులో వున్నట్లు లెక్క. మన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ చెబుతున్నదాని ప్రకారం చైనా కంటే కూడా అభివృద్ధి రేటులో ముందున్నాం. జైట్లీ గారి వేద గణితం ప్రకారం దేశం కంటే చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముందుంది. కావాలంటే పెట్టుబడులకు అనువైన వాతావరణం వున్న రాష్ట్రాలలో మన స్ధానం ఏమిటో ప్రపంచబ్యాంకు నివేదికలను చూడండి అంటారు. వారు చెప్పే మాటలనే తీసుకొనేట్లయితే మనం ఇంక పెద్దగా అభివృద్ధి చెందాల్సిన పని లేదు.

     మన దేశానికి చెందిన సిఐఐతో సహా ప్రపంచంలో అనేక సంస్ధల ప్రతినిధులు, నిపుణులతో కూడిన బృందం రూపొందించే గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌(ప్రపంచ నవకల్పన సూచీ)లో మనం ఎక్కడ అని చూసుకుంటే మన స్ధితి ఏమిటో తెలుస్తుంది. దీనికిగాను అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని భిెన్న సూచికలను తయారు చేస్తారు. ఏడాదికొకసారి ఈ నివేదికను విడుదల చేస్తారు. దీనిలో పైకి పోతున్నామా కిందికి దిగజారుతున్నామా అన్నది వ్యాఖ్యానం లేకుండానే మన స్ధితిని తెలుపుతుంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అమెరికా మొదటి స్ధానంలో వుంది. తరువాత స్ధానంలో ఇప్పుడు చైనా చేరింది. త్వరంలోచైనాను మనం అధిగమించబోతున్నామని మన నేతలు చెబుతున్నారు. బహుశా ఇది కూడా వేదాల్లోనే చెప్పి వుంటారు.

      ఈ ఏడాది నవకల్పన సూచీలలో వంద మార్కులకు గాను 68.3తో స్విడ్జర్లాండ్‌ ప్రధమ స్ధానంలో,60.1తో అమెరికా ఐదవ, 47.47తో చైనా 29వ స్ధానంలో వుంది. 2013 జాబితాలో 36.17 మార్కులతో మన దేశం మొత్తం 71 దేశాలలో 66వ స్ధానంలో వుంది. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన తరువాత అసలు జాబితాలో పేరు లేకుండా పోయింది.మరో సూచిక ప్రకారం 2014లో 76వ స్ధానంలో వున్న మన దేశం 81కి దిగజారింది. 2011 నుంచి దిగజారుతూనే వుంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ అనే సంస్ధ అనేక అంశాలను తులనాత్మకంగా విశ్లేషించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో 90శాతానికి ప్రాతినిధ్యం వహించే 56 దేశాలను అది పరిగణనలోకి తీసుకుంది. తలసరి ప్రాతిపదికన ప్రపంచ నవకల్పనకు తోడ్పడటంలో ఫిన్లాండ్‌, స్వీడన్‌, బ్రిటన్‌ ముందు స్ధానాలలో వున్నాయి. భారత్‌, ఇండోనేషియా, అర్జెంటీనా చివరి దేశాలలో వున్నాయి.ఈ తోడ్పడటం అంటే ఏమిటి అంటే వాటిని అంగీకరించవచ్చు, విబేధించవచ్చు. పన్నులు ఎక్కువగా వుంటే, మేథో హక్కుల పరిరక్షణ బలహీనంగా వుంటే, స్ధానిక రక్షణ విధానాలను అనుసరిస్తే ప్రతికూలంగానూ లేకుంటే అనుకూలంగానూ పరిగణిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్ధితులలో వాటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ తమ ఆర్ధిక వ్యవస్ధలకు దెబ్బతగుల కుండా చూసుకోవటం కత్తిమీద సామువంటిదే. చైనా, వియత్నాం, లావోస్‌, కంపూచియా, క్యూబా వంటి సోషలిస్టు దేశాలు తమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను కాపాడు కుంటూ సంస్కరణలతో ముందుకు పోతున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో తలెత్తిన సంక్షోభం లేదా అననుకూలతలను అవి వినియోగించుకొంటున్నాయి.ఈ క్రమంలో నవకల్పనలకు ప్రోత్సాహమిచ్చిన దేశాలు లబ్ది పొందుతాయని వేరే చెప్పనవసరం లేదు.అటువంటి చొరవ చూపటానికి బదులు వేద విద్య, ఆవు,ఎద్దుల రాజకీయాల చుట్టూ తిప్పుతూ తిరోగమనంవైపు దేశాన్ని నడిపిస్తున్నారనేదే ఇక్కడ విమర్శ.

    ప్రపంచ జనాభాలో ఒకశాతం కంటే తక్కువగా వున్న బ్రిటన్‌ ప్రచురితమైన పరిశోధనాంశాలలో 16శాతం కలిగి వున్నదని ఆ దేశ మంత్రి లూసీ నెవిలే చెప్పారు. ప్రపంచ నవకల్పన సూచీలో రెండవ స్ధానంలో కొనసాగటానికి ఇలాంటి పరిశోధనే ప్రధాన కారణం అని చెప్పనవసరం లేదు.మన దేశంలో పరిశోధనకు కేటాయిస్తున్న నిధులే చాలా తక్కువగా కాగా వాటికి కూడా కోత విధించటానికి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది.ఎంఫిల్‌ లేదా పిహెచ్‌డీలకు నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌లకు కోత విధించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా గతేడాది విద్యార్ధులు యుజిసి ఆక్రమణ వుద్యమం జరిపిన విషయం తెలిసినదే. అన్ని రంగాలలో ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పరిశోధక రంగం నుంచి కూడా తప్పుకొనేందుకు పూనుకుంది. దాని పర్యవసానమే ఇది. సామాజిక శాస్త్రాల పరిశోధనను నిరుత్సాహపరిచేందుకు ఈ చర్య అన్నట్లు కనిపిస్తున్నప్పటికీ సైన్సు పరిశోధనల పరిస్ధితి కూడా ఇంతే. పరిశోధనా రంగంవైపు యువత మొగ్గు చూపకపోవటమే ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లేదన్న విషయాన్ని వెల్లడిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పటేల్‌కు పెద్ద పీట, అంబేద్కర్‌కు నిరాదరణ, నెహ్రూకు అవమానం

04 Thursday Feb 2016

Posted by raomk in BJP, Communalism, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Ambedkar, Jawaharlal Nehru, Modi, Modi Sarkar, Sardar patel

సత్య

ఆధునిక భారత నిర్మాతలలో పెద్దలు ఎవరంటే బహుశా వేదాల్లోంచి తీసిన బిజెపి వేద గణిత స్కేలు ప్రకారం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఎత్తుగా కనిపించి వుంటారు. అందుకే ఆయనకు పెద్ద పీట వేసిందేమో ! గతేడాది అంబేద్కర్‌ 125వ జయంతి, జవహర్‌లాల్‌ నెహ్రూ 125వ జయంతి, వల్లభాయ్‌ పటేల్‌ 75వ వర్ధంతి లేదా 140వ జయంతి గతేడాది వచ్చింది. సహజంగానే అంబేద్కర్‌ 125 జయంతి ని ఒక ప్రత్యేకత సంతరించే విధంగా జరుపుతారని భావిస్తారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం జరిపి ఆ తంగాన్ని ముగించారు. కానీ గతేడాది అక్టోబరు-డిసెంబరు మాసాలలో నరేంద్రమోడీ ప్రభుత్వ తీరు తెన్నులపై సమాచార హక్కు కార్యకర్త శాయి వినోద్‌కు ఎక్కడో తేడా కనిపించింది. రంగంలోకి దిగి సమాచారాన్ని సంపాదించారు.

సర్దార్‌ పటేల్‌ 140 జయంతి(అక్టోబరు 31) సందర్బంగా కేంద్ర ప్రభుత్వ డిఎవిపి సర్దార్‌ పటేల్‌పై ఎనిమిది కోట్ల రూపాయల విలువగల ప్రకటనలు 1,525 విడుదల చేయగా అంబేద్కర్‌పై కోటీ 59లక్షలతో 156, నెహ్రూపై 5.33లక్షలతో నాలుగు ప్రకటనలు విడుదల చేసినట్లు తేలింది. నవంబరు 14ను బాలల దినోత్సవంగా కూడా ఎప్పటి నుంచో జరుపుతున్నారు. గతేడాది విచిత్రమేమంటే ఆ సందర్బంగా నెహ్రూ చిత్రం లేకుండా రాష్ట్రపతి, ప్రధాని బొమ్మలతో కూడిన ప్రకటనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అవార్డుల బహుకరణ పేరుతో విడుదల చేసింది.

వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా బిజెపి పరిస్ధితి తయారైంది. వాస్తవానికి వల్లభాయ్‌ పటేల్‌ను దేశం ఎప్పుడో మర్చిపోయింది. కానీ ఆయనను తిరిగి జనజీవన స్రవంతిలోకి తేవటానికి బిజెపి చేయనియత్నం లేదు.కారణం ఆయన కాంగ్రెస్‌లో మిత, మతవాదులకు దగ్గరగా వుండటమే. అయితే గదేడాది కేంద్ర ప్రభుత్వ ప్రకటనలతో పాటు అనేక కార్యక్రమాలతో పటేల్‌ను ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చింది బిజెపి, ఇంత జరిగాక గతేడాది డిసెంబరులో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో పట్టణ ప్రాంతాలలో ఏదో గెలిచినా గ్రామీణ ప్రాంతాలలో బిజెపి బొక్కబోర్లా పడింది. పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు బిజెపి జిమ్మిక్కులకు మోసపోకపోగా దిమ్మదిరిగే దెబ్బ కొట్టారు. మొత్తం 31 జిల్లా పరిషత్‌లకు గాను 23 చోట్ల కాంగ్రెస్‌ గెలిచింది. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌, ఇతర ప్రముఖ రాష్ట్రమంత్రులు ప్రాతినిధ్యం వహించే గ్రామీణ ప్రాంతాలన్నింటా కాంగ్రెస్‌ జెండా ఎగురవేసింది. ఓటమి తప్పదని ముందే మీడియా పేర్కొన్నప్పటికీ నరేంద్రమోడీ-అమిత్‌ షా మంత్రదండాలు అక్కడేమీ పారలేదు. గుజరాత్‌ అధికారాన్ని సోపానంగా చేసుకొని ఢిల్లీ పీఠమెక్కిన నరేంద్రమోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలను ఆగబగా కబళించాలని చూస్తున్నారు. అయితే గుజరాతే 2017లో బిజెపి చేజారనుందనే వార్తలు ఆ పార్టీ నేతలకు నిదురపట్టనివ్వటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అరుణాచల్‌ రాష్ట్రపతి పాలన కారణాలలో ‘గోవధ ‘ కూడా వుంది.

01 Monday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

Arunachal pradesh, BJP, Governer, President's rule

పంజాబ్‌ గోసేవ కమిషన్‌ అధ్యక్షుడు కిమిటీ భగత్‌ ఒక ప్రకటన చేస్తూ రోడ్లపై వదలి వేసిన ఆవులను స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పరిధిలోకి తేవాలని కోరారు.ఇదెక్కడో బయట చేసిన ప్రకటన కాదు, జలంధర్‌ నగరంలో జరిగిన ఒక అధికారిక సమావేశంలోనే చెప్పారు.

ఎం కోటేశ్వరరావు

     ఈ శాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో కేంద్రం విధించిన రాష్ట్ర పతి పాలన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎన్నోసార్లు అక్రమంగా ఆ అస్త్రాన్ని వాడుకున్న మీకు మా చర్యను విమర్శించే హక్కు లేదని కాంగ్రెస్‌ నేతలను బిజెపి పెద్దలు చీల్చి చెండాడుతున్నారు. రాజభవన్‌ వెలుపల జరిగిన గోవధ కారణంగా అక్కడ శాంతి భద్రతలు దిగజారిపోయాయని గవర్నర్‌ జ్యోతి ప్రసాద్‌ రాజ్‌కోవా కేంద్రానికి పంపిన నివేదికలలో వున్నదంటే నమ్ముతారా ? రాష్ట్ర పతి పాలన విధింపునకు గల కారణాలను తెలపాలని అడిగిన సుప్రీం కోర్టుకు గవర్నర్‌ న్యాయవాది సత్యపాల్‌ జైన్‌ సమర్పించిన ఆధారాలలో గోవధకు సంబంధించిన ఫొటోలు కూడా వున్నాయి.అరుణాచల్‌లో ఆవును మిథున్‌ అని పిలుస్తారు, దానిని రాష్ట్ర జంతువుగా ప్రకటించారు.అసెంబ్లీ సమావేశాలను ముందుగానే జరపాలని గవర్నర్‌ జారీ చేసిన ఆదేశాలను గౌహతి హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసిన తరువాత డిసెంబరు 17న రాజభవన్‌ ఎదుట అనేక మంది కాంగ్రెస్‌ నేతలు పాల్గొని ఆవును బలి ఇవ్వటం కూడా శాంతి భద్రతలు దిగజారాయనటానికి ఒక కారణంగా గవర్నర్‌ పేర్కొన్నారు.

    దేశంలో రాజకీయాలు ఎటు పోతున్నాయి? ఏదైనా ఒక వ్యాసం రాయమంటే అటు తిప్పి ఇటు తిప్పి ఆవు మీద రాసినట్లుగా కాషాయపరివార్‌ ప్రతిదానికీ ఆవును రాజకీయాలలోకి తెస్తోందన్నది ఇంకా అర్ధం కాని వారెవరైనా వుంటే తెలుసుకోవటం మంచిది.ఆవును వధించిన వారిని చంపాలని వేదాలు చెప్పాయని ఈ రోజుల్లో చెప్పటమంటే సమాజాన్ని మధ్యయుగాల్లోకి, అంతకు ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. గొడ్డు మాంసం తినటానికి, అమ్మటానికి వీల్లేదని ఆంక్షలు విధించటం, తిన్నవారిని ఆవు మాంసం తిన్నారనే పేరుతో చంపివేయటం పచ్చి అనాగరికం.

     భారత్‌లో పశువధ శాలలు ఎక్కువగా పాలఫ్యాక్టరీలు ఎక్కువగా అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం పాల ఫ్యాక్టరీలు ఎక్కువ అని. కానీ వాస్తవాలు అలా లేవు మరి. మన కేంద్ర ప్రభుత్వ పశుసంరక్షణ, పాడి పరిశ్రమ, మరియు మత్స్యశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం పశువధ శాలలే ఎక్కువగా వున్నాయి.అధికారికంగా నమోదైన పశువధ శాలలు 1,623, పాల ఫ్యాక్టరీలు 213 , శీతలీకరణ కేంద్రాల వంటివి 793 వున్నాయి. ఆసక్తికరమైన దేమంటే పశుమాంసంపై నిషేధం గురించి బహుళ ప్రచారంలోకి వచ్చిన మహారాష్ట్ర 316 పశువధ కేంద్రాలతో ముందున్నది.తరువాత వరుసగా వుత్తర ప్రదేశ్‌ (285), తమిళనాడు(130) కేరళ(55) పశ్చిమ బెంగాల్‌ (11) సిక్కిం(4) మిజోరం(2) వున్నాయి.ఇవన్నీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినవే అని పాల ఫ్యాక్టరీల కంటే మాంస ఫ్యాక్టరీలకు ఎక్కువగా అనుమతిచ్చారని సమాచార హక్కు కార్యకర్త ఒకరు పేర్కొన్నారు.పైన పేర్కొన్నవి ప్రభుత్వం వద్ద నమోదైనవి మాత్రమే. ఇవిగాక స్ధానిక సంస్ధల వద్ద నమోదైన వధశాలలు 4000, నమోదు కానికి 25వేలు వుండవచ్చని అంచనా. అనేక చోట్ల అనుమతి లేకుండా వధిస్తున్నవి రెట్టింపు వుంటాయని వెల్‌కన్‌ యానిమల్‌ హెల్త్‌ సాంకేతిక విభాగ అధిపతి డాక్టర్‌ అవినాష్‌ శ్రీవాత్సవ అంటున్నారు.

    బీహార్‌ ఎన్నికలలో లబ్ది పొందేందుకు బిజెపి ఆవు రాజకీయం చేసిందని, తమిళనాడులో ఎద్దుల రాజకీయం చేసిందన్న విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.కేరళ, పశ్చిమ బెంగాల్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలలో అవులతో సహా దేని వధపైనా ఎలాంటి నిషేధాలు లేవు.

పశువధ నిషేధం-ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం

    ప్రపంచంలోని పశు సంపదలో 13శాతం(19.1కోట్లు) మన దేశంలోనే వుంది, ప్రపంచ గేదె(బర్రెలు)లలో 56శాతం(11 కోట్లు) మనవే.ఇంత పశుసంపద వున్నపుడు వాటిని మాంసం కోసం వధించకుండా నిషేధిస్తే ఆర్ధిక వ్యవస్ధపై దాని ప్రభావం తప్పుకుండా వుంటుంది. ప్రపంచంలో ఎక్కువగా పాలు వుత్పత్తి చేసే మనదే అయినప్పటికీ వాటిలో 55శాతం గేదె పాలే. మాంస వుత్పత్తిలో ప్రపంచంలో ఐదవ స్ధానంలో వున్నాము.ప్రస్తుతం వున్న చట్టాల ప్రకారం మధ్య, తూర్పు రాష్ట్రాలలో కోడెలు, ఎద్దులను మాత్రమే వధించటానికి అనుమతిస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, ఎంపీ, పంజాబ్‌, రాజస్ధాన్‌,యుపిలలో పూర్తి నిషేధం వుంది. ఈ కారణంగానే ఈ రాష్ట్రాల నుంచి పశుసంపదలను తరలించటం అక్రమంగా పరిగణించి కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఆదివారం నాడు ఢిల్లీలో అదే జరిగింది. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్‌,నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాలలో కొన్ని షరతులకు లోబడి పశువధకు అనుమతి వుంది.

     ఆవు, పశుమాంస రాజకీయాల కారణంగా మాంస ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. రాయిటర్‌ వార్తా సంస్ధ వెల్లడించిన సమాచారం ప్రకారం గత ఏప్రిల్‌-సెప్టెంబరు)ఆరునెలల్లో 13.2శాతం గేదె, దున్న మాసం ఎగుమతులు పడిపోగా 15.5శాతం ఆదాయం పడిపోయింది. తోళ్ల పరిశ్రమపై 25లక్షల మంది వుపాధి పొందుతున్నారు. వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులే అని చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఆ పరిశ్రమలోని వారు కూడా ఎప్పుడేం జరుగుతుందో ఎవరు వచ్చి ఆవుతోళ్లను తీస్తున్నారని దాడులు చేస్తారోనని భయపడుతున్నారు.చివరకు చచ్చిపోయిన ఆవులను ముట్టుకొనేందుకు కూడా భయపడుతున్నారని కాన్పూరుకు చెందిన ఒక తోళ్ల శుద్ది యజమాని వాపోయారు. పులి చర్మకంటే ఆవు చర్మ రవాణా ప్రమాదకరంగా మారిందన్నారు.దీంతో అనేక కంపెనీలు సిబ్బందిని తగ్గించుకున్నాయి.

    సాధారణంగా రైతులు వట్టిపోయిన ఆవులు, గేదెలను విక్రయిస్తారు. వాటిని కొన్నవారు పశువధ శాలలకు తరలిస్తారన్నది అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు మాంసం, వధపై నిషేధం విధించటంతో రైతులు వాటిని వీధులలో వదలి వేస్తున్నారు. అది వారికి ఆర్ధికంగా నష్టంతో పాటు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఎవరైనా వాటిని పట్టుకొని తరలిస్తే సంఘపరివార్‌ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు, వాటిని వీధుల్లో వదలి వేస్తే పర్యావరణ సమస్యలు ముఖ్యంగా పట్టణాలలో రవాణా, తదితర సమస్యలను ముందుకు తెస్తున్నాయి. 2012 గణాంకాల ప్రకారం దేశంలో 53లక్షల పశువులు అటు పాడికి, ఇటు వ్యవసాయానికి పనికిరానివి వున్నాయని అంచనా.వాటిలో పదిలక్షల పశువులను పట్టణాల్లో వదలి వేశారని లెక్కలు చెబుతున్నాయి. వీటికి ఆహారం, వైద్యం ఏవీ అందవు. ఎవరూ బాధ్యత తీసుకోరు. అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలకు ఈ పశువులు కారణమౌతున్నాయి. భారత దేశం ఎదుర్కొంటున్న అపరిశుభ్రత సమస్య లలో ఇలా వదలి వేసిన పశువుల నుంచి కూడా వుత్పన్నమౌతోందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ చెప్పింది. పర్యావరణ సమస్యలతో పాటు అనేక వ్యాధులను ఇవి ఒక చోటి నుంచి మరోచోటికి వ్యాపింప చేస్తున్నాయి.

ఆవులకూ స్మార్ట్‌ సిటీలు !

     నరేంద్రమోడీ సర్కార్‌ సమాజంలోని ధనికులకే కాదు, వారితో సమంగా వీధులలో తిరిగే ఆవులూ, గేదెలకూ స్మార్ట్‌ సిటీలను నిర్మిస్తుందా ? మానవులకు అన్ని వసతులూ ఒకేచోట కల్పించినట్లుగా ఈ పశువులకూ కల్పించని పక్షంలో అవొక సమస్యగా మారేట్లు వున్నాయని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్‌ గోసేవ కమిషన్‌ అధ్యక్షుడు కిమిటీ భగత్‌ ఒక ప్రకటన చేస్తూ రోడ్లపై వదలి వేసిన ఆవులను స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పరిధిలోకి తేవాలని కోరారు.ఇదెక్కడో బయట చేసిన ప్రకటన కాదు, జలంధర్‌ నగరంలో జరిగిన ఒక అధికారికి సమావేశంలోనే చెప్పారు.కొంత మంది కేవలం ఆవులకు మాత్రమే పునరావాసం ఎందుకు కల్పించాలి? మిగతా పశువులను ఎందుకు మినహాయిస్తున్నారని అభ్యంతర పెట్టారు.వీధి కుక్కలు అనేక మందిని బలిగొన్నాయని, వాటిని స్మార్ట్‌ సిటీ పరిధిలోకి ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు. గోవులకు మాత్రమే గోవుల బోర్టు వుంటే అంతరిస్తున్న మిగతా జంతువుల సంగతేమిటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకు మాత్రమే సరిపోయే జంతువుల గురించే మాట్లాడటం సరైనది కాదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

    పంజాబ్‌లోని అనేక పట్టణాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. లూధియానా చుట్టూ ఒక్క్కొ దానిలో 70వేల ఆవులున్న రెండు పెద్ద డైరీలు వున్నాయి. చిన్నవి చాలా వున్నాయి. వట్టి పోగానే వాటినుంచి వీధులలోకి వదలి వేస్తున్నారు. వీధి ఆవుల సంరక్షణకు లూధియానా నగరపాలక సంస్ధ ఏటా కోటీ 30లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది.అయినా సమస్య తీరలేదు.ఏడాది కేడాది పెరుగుతూనే వున్నాయి. నిధుల కొరతను అధిగమించేందుకు పంజాబ్‌ విద్యుత్‌ కార్పొరేషన్‌ ఆవు సెస్సు పేరుతో వినియోగదారులను బాదటం మొదలు పెట్టింది.యూనిటక్‌ పది పైసల వంతున విధిస్తే నెలకు అదనంగా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందట.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమైంది వెంకయ్య గారూ ? మీ సమస్య ఏమిటి ?

31 Sunday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ 1 Comment

Tags

BJP, Dalit, Rahul gandhi, Rohith Vemula, University of Hyderabad (UoH), Vemula Rohit, Venkaiah naidu

లేఖల మీద లేఖలు రాసే మీ తోటి మంత్రి దత్తన్న స్ఫూర్తితో ఒక బహిరంగ లేఖ

      వెంకయ్య నాయుడు గారూ తెలుగు రాష్ట్రాలలో ప్రాసలను గుమ్మరించి వుపన్యాసాలు చెబుతూ జనాన్ని ఆకట్టుకొనే దిట్టలలో మీరు ఒకరు. దానితో సమస్య లేదు. హైదరాబాదు నగరాభివృద్ధికి వాజ్‌పేయి ఆద్యులు-చంద్రబాబు బాధ్యులు అన్నది మీ మాటల పొది నుంచి తాజాగా తీసిన నినాదం. కొత్తవారు ఎవరైనా హైదరాబాద్‌ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే చార్మినార్‌ , హుస్సేన్‌ సాగర్‌, గోల్కోండ కోట, కొండలు, గుట్టలు మొదలు ఇక్కడ లక్షలాది మందికి వుపాధి కలిగిస్తున్న ప్రభుత్వరంగ పరిశ్రమలను వాజ్‌పేయి ప్రధానిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగానే వచ్చాయని అనుకొనే ప్రమాదం లేకపోలేదు.వారికి అంత సీన్‌లేని చెప్పటం అవసరమోమో ఆలోచించండి.

     ఒక బిహెచ్‌యిఎల్‌, ఒక ఇసిఐఎల్‌ ఇలా ఒక్కటంటే ఒక్క కొత్త పరిశ్రమను హైదరాబాదులో వారి హయాంలో నెలకొల్పకపోగా హెచ్‌ఎంటి, ప్రాగా, ఐడిపిఎల్‌, ఇలా ఎన్నో పరిశ్రమలను మూసివేయించి పుణ్యం కట్టుకున్న పెద్దలు అంటే అతిశయోక్తి కాదు.ఈ మాట చెప్పగానే రింగ్‌ రోడ్‌, హైటెక్‌ సిటీ, ఐటి కంపెనీల మాటేమిటి అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. ఒక అందగత్తె గర్వంతో ఒక రోజు తన భర్తతో ఏమండీ నేనే గనుక పుట్టి వుండకపోతే మీరు ఎవరిని వివాహం చేసుకొని వుండేవారు అని అడిగిందట. దానికా భర్త నువ్వు గాక పోయివుంటే నీ అమ్మను చేసుకొని వుండేవాడిని అన్నాడట.

      వాజ్‌పేయి, చంద్రబాబు నాయుడు లేకుండానే ఐటి పరిశ్రమలు బెంగళూరులో,చెన్నయ్‌, పూనేలలో ఎలా వచ్చాయి. నరేంద్రమోడీ వంటి కారణజన్ముడు పుట్టిన గుజరాత్‌లో ఐటి పరిశ్రమలు ఎందుకు రాలేదు, బిజెపి బలంగా వున్న వుత్తరాది ఇతర రాష్ట్రాలలో ఎందుకు రాలేదు అంటే వెంకయ్య గారేమంటారు? చంద్రబాబు మాదిరి అడిగిన వారు ఆ రాష్ట్రాలలో లేకపోయారా ? విజయవాడ, విశాఖ, వరంగల్‌, చివరికి మీ నెల్లూరును ఎందుకు అభివృద్ధి చేయలేదు? కేవలం రాజధాని నగరాలను మాత్రమే అభివృద్ధి చేయాలనేది ఒక విధానమా లేక రహస్య అజెండాగా అమలు జరిపారా ? రింగ్‌ రోడ్‌ విషయానికి వస్తే వారి హయాంలో వేసినదాని కంటే పెద్దదాన్ని రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించారు సార్‌ ?అయినా వాజ్‌పేయి వంటి వ్యక్తి కేవలం హైదరాబాదును మాత్రమే అభివృద్ధి చేసి మిగతా వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆయనేమి జాతీయ నాయకుడు ? అడగటానికి ఇలా చాలా వుంటాయి. ఏదో ఓట్ల కోసం వచ్చారు, అడిగారు అంతవరకు మంచిది, మిగతా విషయాలపై మూసుకుంటే మంచిదేమో ?

      వెంకయ్యగారూ మీరు ఓట్ల కోసం హైదరాబాదు వస్తున్న సమయంలోనే కాంగ్రెస్‌ నేతో రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక రోజు దీక్ష కోసం వచ్చారు. మీ కడుపు మంట ఏమిటి ? కాంగ్రెస్‌, వామపక్షాలు ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ విషయమై రాజకీయాలు చేస్తున్నాయని అంటున్నారు.అసలు ముందు అక్కడి వ్యవహారాలలో జోక్యం చేసుకున్నదెవరు? రాజకీయం చేసిందెవరు ? బిజెపి ప్రజాప్రతినిధులు, మంత్రులు కాదా ? రోహిత్‌ మరణాన్ని దళితేతర సమస్యగా మార్చే అతి పెద్ద రాజకీయానికి తెరతీసిందెవరు ? అసలు మీ సమస్య ఏమిటి ? హైదరాబాదు విశ్వవిద్యాలయంలో అంతకు ముందు చాలా మంది మరణిస్తే, వరంగల్‌లో రాజయ్య కుటుంబంలో మరణాలు జరిగినపుడు ఎందుకు రాలేదు అంటున్నారు ? నిజమే సార్‌ రాలేదు, వాటి వెనుక కూడా మీ మంత్రులు, ఎంఎల్‌సి, ఎంఎల్‌ఏల లేఖలు, హస్తాలు, వత్తిడి వున్నాయా లేక నాటి కాంగ్రెస్‌ మంత్రులు, ప్రజా ప్రతినిధుల వత్తిడులు వున్నాయా చెప్పండి, అన్నింటినీ కలిపి అఖిలపక్ష ఆందోళన చేస్తే దళితులు ఎందుకు ఆత్మహత్య లు చేసుకుంటున్నారో తేలుతుంది. అన్నట్లు గుర్తొచ్చింది, దేశంలో అనేక మంది రోజూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి దాని మీద స్పందించకుండా కూడికలు-తీసివేతల లెక్కలు వేసుకొని ఐదు రోజులు అయినా ఇంకా ఇంత లాభం వస్తుంది అని వేద గణితంలో నిర్ధారణకు వచ్చిన తరువాతే కదా రోహిత్‌ వుదంతం మీద ప్రధాని నరేంద్రమోడీ స్పందించటం రాజకీయం కాదా ?

      హర్యానాలో ఇద్దరు దళితుల పిల్లలను సజీవ దహనం చేసిన దుర్మార్గం మీద ‘ఎవరో రాళ్లు వేసి వీధిలో ఒక కుక్కను చంపితే ప్రభుత్వం ఎలా బాధ్యురాలు అవుతుంది’ అన్న మీ మంత్రి వీకె సింగ్‌ మాదిరి రోహిత్‌ మరణాన్ని కూడా అలాగే తీసుకోవాలనా ? అసలు మీ సమస్య ఏమిటి ? ఈ వుదంతాన్ని అసలు ఖండించాలా వద్దా ? ఖండించాలి అనుకుంటే రాజకీయ వాసనలు తగల కుండా ఎలా ఖండించాలో కావాలనుకుంటే మీ తరహా యతి ప్రాసలను చేర్చి కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఒక పత్రాన్ని రూపొందించి దేశం మీదకు వదలండి , దాన్ని నలుగురి చేతా కనీసం మీకు నొప్పితగలకుండా మోసే తెలుగుదేశం, పోనీలే, పోయింది ఒక దళితుడే మన వాడే కదా అయినా అతని కులమేమిటో నిర్ధారణ కాకుండా స్పందించటేమిటి అసహ్యంగా అన్నట్లు వున్న , దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన తెరాస వంటి పక్షాల చేత ముందు వప్పించండి, తరువాత దాని మీద అందరూ స్పందించి సంతకాలు చేస్తారు. అవేమీ లేకుండా ఎంతగా మాట్లాడినా జనం అదేదో సినిమాలో అడిగినట్లు అసలు నువ్వు ఎవరు ? అన్నట్లుగా అసలు వెంకయ్యగారి ఏమిటి అని అడుగుతూనే వుంటారు.

భవదీయుడు

ఒక పాఠకుడు

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి రోజున గాడ్సే పుస్తకావిష్కరణ

29 Friday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, Goa, Godse

సత్య

తనంతట తానుగా లొంగిపోయి విచారణకు సహకరించిన ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్‌ మెమెన్‌ను వురితీయటం సరికాదన్న హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ అంబేద్కర్‌ విద్యార్ధి సంఘ సభ్యులను జాతి వ్యతిరేక శక్తులని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఇతర సంఘపరివారమంతా నానాయాగీ చేస్తోంది.మరి జాతి పిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాధూరామ్‌ గాడ్సేను కీర్తిస్తూ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు బిజెపినేత పర్యవేక్షణలో వున్న ప్రభుత్వ హాలును అనుమతిస్తే, స్వయంగా రావటానికి ఆ నేత అంగీకరిస్తే అది ఏమౌతుంది? సరిగ్గా మహాత్ముడిని హత్య చేసిన రోజునే పుస్తక ఆవిష్కరణకు ఎంచుకోవటాన్ని కూడా గమనిస్తే వారెంతటి దేశభక్తులో అర్ధం చేసుకోవచ్చు.

ఇదెక్కడో కాదు, బిజెపి ఏలికలోని గోవాలో తలపెట్టారు.’ ఒక వైపు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విదేశీ పర్యటనల్లో మహాత్మాగాంధీ గురించి చెబుతుంటారు ఇక్కడి గోవా ప్రభుత్వమేమో గాంధీ భావజాల మైన శాంతి, అసత్యమాడకపోవటం, సామాజిక న్యాయాన్ని భ్రష్టు పట్టించే వారికి ఎంతో చురుకుగా సాయం చేస్తోందని గోవా ప్రముఖులు ఒక ప్రకటనలో విమర్శించారు. శనివారం నాడు గాంధీ హంతకుడు గాడ్సేపై రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు మార్మగోవాలోని ప్రభుత్వానికి చెందిన రవీంద్ర భవన్‌ను ఎంచుకున్నారు. దానికి అధ్యక్షుడిగా వున్న దామోదర్‌ నాయక్‌ తక్షణమే జాతికి క్షమాపణ చెప్పాలని, అనుమతిని రద్దు చేయాలని పౌర ప్రముఖులు డిమాండ్‌ చేశారు. గాంధీ హంతకుడి గురించి రాసిన పుస్తక ఆవిష్కరణ వుత్సవానికి రవీంద్ర భవనాన్ని వుపయోగించుకొనేందుకు అనుమతించటం ద్వారా బహిరంగంగా ప్రోత్సహించినట్లయిందని, ప్రభుత్వానికి చెందిన వారు పాల్గొనటం అంటే ప్రభుత్వ కార్యక్రమంతో సమానమని, ప్రభుత్వ ప్రతినిధుల జాతి వ్యతిరేక వైఖరిని ఇది వెల్లడిస్తోందని పౌర ప్రముఖులు పేర్కొన్నారు.

కొత్తగా ఏర్పడిన గోవా ఫార్వర్డ్‌ పార్టీ ఒక ప్రకటన చేస్తూ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని తాము సత్యాగ్రహంతో అడ్డుకుంటామని ప్రకటించింది. స్వతంత్ర ఎంఎల్‌ఏ విజయ్‌ సర్దేశాయి దీని గురించి మాట్లాడుతూ ఏదో అమాయకంగా అనుమతించినట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ ఎంచుకున్న రోజును బట్టి అలా భావించటానికి లేదంటూ నిరసనలో తానూ పాల్గొంటానని చెప్పారు. ఇంకా అనేక సంస్ధలు తమ మద్దతు తెలిపాయి. కాగా అనుమతిని రద్దు చేసే ప్రసక్తే లేదని నిర్వాహకులు అందరి మాదిరే హాలును బుక్‌ చేసుకున్నారని రవీంద్ర భవన్‌ నిర్వాహకులు ప్రకటించారు. ఏదైనా అభ్యంతరాలు వెల్లడైతే తాను ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే విషయమై పునరాలోచిస్తాను తప్ప అనుమతిని రద్దు చేసేది లేదని బిజెపి నేత అయిన రవీంద్ర భవన్‌ అధ్యక్షుడు దామోదర నాయక్‌ ప్రకటించారు. గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా పనిచేసిన విషయం తెలిసినదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మిత్రులెవరు? శత్రువులెవరు?

29 Friday Jan 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Readers News Service, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, CPI(M), Dalit, discrimination against dalits india, Rohith Vemula, Vemula Rohit

– వి. శ్రీనివాసరావు

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయ రీసెర్చి స్కాలర్‌ వేముల రోహిత్‌ చక్రవర్తి బలవన్మరణంపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగు తోంది. మూడేళ్ళ క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన దేశ వ్యాప్త నిరసనోద్యమం తర్వాత అంత కన్నా తీవ్రస్థాయిలో జరుగుతున్న ఉద్యమమిది. అప్పటి ప్రభుత్వం చేతులు కాలాక ఆలస్యం గానైనా కొన్ని చర్యలు తీసుకోక తప్పలేదు. కానీ నేటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. దళితోద్ధరణ కోసమే తాను జన్మించినట్లుగా మాటల గారడీతో నమ్మ బలుకుతున్నట్లు నటించే ప్రధాని ఐదు రోజుల మౌనం తర్వాత దీనిపై బలవంతంగా నోరు తెరిచినా చేతల్లో మాత్రం ఏ చొరవా చూపలేదు. పైగా లక్నో సభలో రోహిత్‌ ఘటనపై ప్రధాని స్పందించాలని నిలదీసిన ముగ్గురు దళిత విద్యార్థులను కూడా హాస్టల్‌ ఖాళీ చేయించి ఇంటికి పంపా రు. ముంబాయిలో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై ఆర్‌యస్‌యస్‌ మూక అడ్డంగా దాడి చేసి అనేక మందిని కిరాతకంగా గాయపరిచారు. ఈ దేశంలో న్యాయం చేయక పోయినా, కనీసం న్యాయం చేయమని అడిగే హక్కు కూడా లేదా? ఇలా నోళ్లు కుట్టేస్తారా? ప్రశ్నించేవారిని వేధిస్తారా? ఒక ప్రజాస్వామిక దేశంలో ఫాసిస్టు ప్రభుత్వమా?
రోహిత్‌ బలవన్మరణానికి కారకుడైన వైస్‌-ఛాన్సలర్‌ పొదెల అప్పారావుపై ఇంతవరకు ఎలాంటి చర్యా తీసుకో లేదు. ఆయనపై ఎఫ్‌ఆర్‌ఐ నమోదైనా కనీసం అరెస్టు చేయలేదు. పేరుకు సెలవులో ఉన్నా పదవిలోనే కొనసాగు తున్నాడు. అంతకన్నా దుర్మార్గం అతని స్థానంలో తాత్కాలిక విసిగా ఈ ఘటనకు కారకులైన మరొక శిఖండిని నియమిం చడం. ఇది విద్యార్థులను రెచ్చగొట్టడం కాక మరేమవు తుంది? నిందితులపై చర్య తీసుకోవాల్సిన పోలీసులు వారిని కనీసం విచారించను కూడా విచారించలేదు. తద్విరు ద్ధంగా రోహిత్‌ కుటుంబ చరిత్రను తొవ్వడానికి నానా యాతనలు పడుతున్నారు. అవసరం లేని విషయాల్లో తలదూర్చి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రోహిత్‌, నిర్భయ ఘటనల్లో సారూప్యతలు న్నాయి. నాడు కూడా జరిగిన దుర్మార్గాన్ని పట్టించుకోకుండా నిర్భయ శీలాన్ని శంకించే ప్రకటనలు చేశారు. నాడూ ఇలాగే మనువాదానికి ప్రాతినిధ్యం వహించే ఫ్యూడల్‌ ఛాందస శక్తులు ఆడపిల్లల వస్త్రధారణ గురించి, రాత్రిపూట అబ్బాయి లతో కలిసి సంచరించడంపై సందేహాలు లేవనెత్తారు. అవే శక్తులు ఇప్పుడు రోహిత్‌ కులాన్ని, వామపక్షాల నిజాయితీని శంకిస్తున్నాయి. రోహిత్‌ బతికున్నంత వరకు వేపుకు తిన్నారు. అడుగడుగునా కులవివక్షను ప్రదర్శించారు. ఆఖరికి చనిపోయాక కూడా వదల్లేదు. తనను తాను అంతం చేసుకోవడం ద్వారా ఈ కులరాక్షసి కబంద హస్తాల నుంచి బయట పడాలనుకున్నాడు. కానీ రోహిత్‌ ఆత్మను కూడా వారు వదలదలచుకోలేదు. నీదే కులం అంటూ వెంటాడి పీడిస్తూనే ఉంది. రోహిత్‌ తల్లి రాధిక అతను చనిపోయిన నాటి నుంచి గుండెలవిసిపోయేలా కన్నీళ్ల పర్యంతమవు తూనే ఉంది. కానీ పాలకుల గుండెలు మాత్రం కరగడం లేదు. కేంద్రం గద్దెపై కూర్చున్న పాలకులను ”మను”వ్యాధి పీడిస్తోంది. దెబ్బకు దెయ్యం వదులుతుంది అన్నట్లుగా మనువ్యాధి పీడితులకు పోరాటమే చికిత్స. అదే నేడు విద్యార్థులు ఐకమత్యంతో చేస్తున్న పోరాటం.
ఘటన జరిగిన రోజు నుంచే దీన్ని దళిత-దళితేతర సమస్యగా చిత్రీకరించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ పేరుతో అగ్రకులాలను తమ వైపు తిప్పుకోవాలన్న దుర్బుద్ధి వారిలో కనిపిస్తుంది. కానీ వారి ఆశలను అడియాసలు చేస్తూ కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా విద్యార్థులంతా ఏకమై ఆందోళన చేస్తు న్నారు. తోటి విద్యార్థికి జరిగిన అన్యాయం మరొకరికి జరగ కూడదన్న పట్టుదలతో వారున్నారు. సెమిస్టర్‌ కొద్దిరోజుల్లో ముగియనుండగా తమ చదువులను సైతం లెక్క చేయ కుండా క్లాసులను బహిష్కరించి, విశ్వవిద్యాలయ పాలక వర్గాన్ని నిలదీస్తున్నారు. ఐదుగురు దళిత విద్యార్థుల ”సామాజిక బహిష్కరణ”కు విరుగుడే ఈ తరగతుల సమైక్య బహిష్కరణ. తెరవెనుక నుంచి ఎబివిపి ద్వారా విద్యార్థుల్లో చీలికలు పెట్టడానికి నానా యాతన పడుతున్నాయి బిజెపి, ఆర్‌యస్‌యస్‌లు. విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులే కాదు బయట కూడా దళిత సంఘాలతో పాటు అనేక ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రగతిశీలురు గళం విప్పి వారికి అండగా నిలబడుతున్నారు. ఇదొక సమై క్యతా శంఖారావం. దీన్ని కులం పరిధిలో ఇరికించి బలహీన పరచాలనుకునే వారి కుట్రలు సాగవని విద్యార్థిలోకం నిరూపిస్తోంది.
రాజకీయ శక్తులు జొరబడి ఉద్యమాన్ని రాజకీయం చేస్తున్నాయని బిజెపి మరొక అస్త్రాన్ని బయటకు తీసింది. అసలు ఈ సమస్యంతా బిజెపి రాజకీయ జోక్యంతోనే మొదలైంది. కన్నంలో దొరికిన దొంగలా ఉంది బిజెపి పరిస్థితి. ఆఖరికి దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా ఇతరులు రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఇరు వర్గాలకు చెందిన విద్యార్థుల గొడవను రాజకీయం చేసింది బిజెపి. క్యాంపస్‌లో జొరబడి ఈ ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్‌ చేసేదాకా వదల్లేదు. బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తమ అనుచరుల్ని వెంటేసుకొని వైస్‌ ఛాన్సలర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వాస్తవాలేమిటో తెలుసుకోకుండానే వారిని జాతి వ్యతిరేకులంటూ ముద్ర వేశారు. కేంద్రమంత్రి ఇరానీ చర్య తీసుకునేదాకా వదల కుండా ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు. ఇదంతా వారి రాజకీయ జోక్యాన్నే తెలియచేస్తున్నది. ఆఖరికి అదే తమకు ఎదురు తిరిగేసరికి ఎవరో రాజకీయం చేస్తున్నారంటూ కాకిగోల చేస్తున్నారు.
పనిలో పనిగా తమ కొమ్ముకాసే కొందరు దళిత మేధావులు, సంఘాలను ఉపయోగించుకొని ఉద్యమంపై నీచమైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి కొండంత అండగా నిలబడ్డ వామపక్షాలపై వారి దాడి ఎక్కుపెడుతున్నారు. నానా రకాల ఆరోపణలు చేసి వామ పక్షాలను అప్రతిష్టపాలు చేయాలన్న దుష్టతలంపుతో వ్యవహరిస్తున్నారు. సోషల్‌మీడియాలో ఆర్‌యస్‌యస్‌ నెట్‌వర్క్‌ ద్వారా రకరకాల ఆకాశరామన్న పేర్లతో వామపక్షా లపై విషం కక్కుతున్నారు. తెలిసో తెలియకో కొందరు ఈ వలలో పడిపోతున్నారు. వామపక్షాలు, విద్యార్థిసంఘాలు, దళితసంఘాలు కలసికట్టుగా వ్యవహరించడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఐక్యతను దెబ్బ తీయడానికే వామపక్షాలను కేంద్రంగా చేసుకొని కాలం చెల్లిన విమర్శనాస్త్రాలను తిరిగి తమ అంబులపొది నుంచి బయటకు తీసి సంధిస్తున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వామపక్షాల్లో ప్రత్యేకించి సిపియంలో అగ్రకులాలదే పెత్తనమని, దళితులు నాయకత్వస్థానాల్లో లేరని, అలాంటి వారు రోహిత్‌ సమస్యను ఆసరా చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ అరిగిపోయిన రికార్డులే. గతంలో పట్టించుకోవడం లేదని విమర్శించిన వారే ఇప్పుడు పట్టించుకుంటున్నందుకు అభినందించాల్సింది పోయి విమర్శలెందుకు చేస్తున్నారు? ఇది ఎవరికి ఉపయోగం? ఎవరిని సంతృప్తి పర్చడానికి ఈ అబద్ధాలు వల్లిస్తున్నారు? ఇలాంటి చర్చ సమస్య పరిష్కారానికి తోడ్పడుతుందా? లేక ఉద్యమాన్ని బలహీనపర్చడానికి ఉపయోగపడుతుందా? అలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోహిత్‌, తదితరుల మీద చర్య తీసుకున్నప్పుడు ఎస్‌ఎఫ్‌ఐ ఎక్కడ ఉంది అంటూ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వ్యాసం రాస్తూ అడిగాడు. అతనెక్కడున్నాడో ముందు చెప్పాలి? తన పదవి కోసం బిజెపికి దళిత ఉద్యమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం? ఆయనొకప్పుడు ఏం చేశాడనేది కాదు ఇప్పుడెక్కడున్నాడనేది ముఖ్యం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిపి దళిత సమస్యను చర్చించాలని దళిత శోషిత్‌ ముక్తిమంచ్‌ (డిఎస్‌యంయం) డిమాండు చేస్తూ పార్లమెంటు సభ్యులకు విన్నపం చేసుకోడానికి ఢిల్లీలో ఆయన ఇంటికి వెళ్లిన కార్యకర్తలను బూతులు తిట్టి పంపాడు. అదీ ఆయన నైజం. దీనిపై ఢిల్లీలో నిరసన కూడా వ్యక్తమైంది. ఇలాంటివారే మరికొంత మంది వామపక్షాలపై విరుచుకుపడుతున్నారు. రోహిత్‌ ఆత్మహత్యపై తక్షణమే స్పందించి ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టినందుకే వారికి కంటగింపుగా ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన ప్పుడు చురుగ్గా ఉండే కొంతమంది నాయకులు ఈసారి కనుమరుగయ్యారు. అలాంటి వారికి కూడా వామపక్షాల చొరవ నచ్చడం లేదు. ఏది ఏమైనా వామపక్షాలు తాము నమ్మిన మార్గాన్ని వదిలిపెట్టవు. దళితులు, దళిత ఉద్యమాలు వామపక్ష ఉద్యమ స్రవంతిలో అంతర్భాగం. వారిని విడదీయం అంత సులభం కాదు.
ఐదుగురు దళిత విద్యార్థులపై అన్యాయంగా చర్య తీసున్నప్పటి నుంచి వారి సంఘం(అసా)తో తమకున్న విబేధాలను పక్కన పెట్టి ఎస్‌ఎఫ్‌ఐ చొరవతో వ్యవహరించింది. తాము యూనియన్‌లో గెలిచినప్పటికీ దానితో నిమిత్తం లేకుండా అసాతో సహా అన్ని సంఘాలను కలిపి ”సామాజిక న్యాయం కోసం ఐక్య కార్యాచరణ కమిటీ”ని ఏర్పరచింది. దానిలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఆ సమయంలోనే ఈ రచయిత కూడా వారిని పలకరించాడు. సంఘీభావం తెలిపాడు. ఈ మధ్యలో రోహిత్‌ ఘోరం జరిగింది. దానితో ఉద్యమం మరింత ఊపందుకుంది. అన్ని రిపోర్టులూ ఆ అయిదుగురు విద్యార్థులు ఏ తప్పూ చేయలేదని ఘోషిస్తున్నా కావాలని రాజకీయ ఒత్తిళ్లతో చర్య తీసుకున్నారు. తన కొడుకుపై చర్య తీసుకుంటే ఎందుకు ఇంతవరకు-చని పోయిన తర్వాత కూడా- తనకు తెలియజేయలేదని రోహిత్‌ తల్లి నిలదీస్తుంటే దానికి వారి దగ్గర సమాధానం లేదు. ఇది బాధ్యతారాహిత్యం కాదా? తనకు న్యాయం కావాలని ఆ తల్లి అడుగుతుంటే సమాధా నం చెప్పరా? ఇదేనా విశ్వవిద్యాలయాలు నేర్పించే చదువు? రోహిత్‌ మరణానికి నిరసనగా హైదరాబాద్‌లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఆందోళన సాగుతోంది. వివిధ చోట్ల దళితుల పట్ల ఎంతగా వివక్షత సాగుతుందో కథనాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. ఆఖరికి ప్రఖ్యాతిగాంచిన జవహర్‌లాల్‌ నెహ్రూ యూని వర్శిటీలోనూ దళిత విద్యార్థుల పట్ల వివక్షత కొనసా గుతున్నదంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.
రోహిత్‌ చనిపోయి ఇప్పటికి మూడు వారాలవు తోంది. అప్పటి నుంచి హైదరాబాద్‌ కేందీయ విశ్వవిద్యా లయ విద్యార్థులు సమ్మెలో ఉన్నారు. వారి భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయ యాజమాన్యంపై ఉంది. విద్యా సంవత్సరం నష్టపోతే అందుకు వారిదే బాధ్యత అవుతుంది. విద్యార్థుల కోర్కెలన్నీ చట్టబద్ధమైనవి, న్యాయమైనవి. చట్టాన్ని అమలు చేయమని విద్యార్థులు కోరుతున్నారు. వాటిని ధిక్కరిస్తున్నది కేంద ప్రభుత్వం, విశ్వవిద్యాలయ పాలకవర్గం. తాజాగా తమిళనాడులోని విల్లుపురంలో ముగ్గురు విద్యార్థినులు ఇదే విధంగా వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. దానికి బాధ్యులైన ప్రిన్సిపాల్‌, కరస్పాండెంట్‌ను వెంటనే అరెస్టు చేసి రిమాండుకు పంపారు. కానీ హైదరాబాద్‌లో రోహిత్‌ మరణానికి కారకులైన వారు దర్జాగా, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి ఎదుటివారిపై ఆరోప ణలు చేస్తున్నారు. ఇంతకన్నా వివక్షత ఇంకేమన్నా ఉందా? వైస్‌ఛాన్సలర్‌ను వెంటనే అరెస్టు చేయడం పోలీసు ధర్మం. కానీ వారు కేంద్రం ఒత్తిడితో తమ విధుల్ని నిర్వహించడంలో విఫలమవుతున్నారు. రేపు విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోతే అందుకు పోలీసు కూడా బాధ్యత వహించాలి. సవరించిన ఎస్‌స్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ చట్టం ప్రకారం అలక్ష్యంగా వ్యవహరించే పోలీసులు కూడా శిక్షార్హులే. వెంటనే విద్యార్థుల న్యాయసమ్మతమైన కోర్కెలను పరిష్క రించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. లేకుంటే ఈ తరహా బాధ్యతారాహిత్యం మరింత మంది రోహిత్‌లను బలిచేయడానికే తోడ్పడుతుంది. మనకెందుకులే అని మిగతావారు నోరు మూసుకున్నా లేదా రోహిత్‌ దళితుడు గదా మనకెందుకులే అని ఇతర కులస్తులు అనుకున్నా ఈరోజు రోహిత్‌ అయితే రేపు మరొకరవుతారు. అన్యా యాన్ని ప్రశ్నించకపోతే అదే రేపు మనల్ని బలితీసు కుంటుందని మరచిపోరాదు. అందుకే ప్రతి ఒక్కరూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమానికి అండగా ముందుకు రావాలి. ఈ దేశానికి శత్రువులెవరో, మిత్రులెవరో తెలుసుకోవాలి.
(వ్యాసకర్త సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు)

This article first published in Prajasakti

Share this:

  • Tweet
  • More
Like Loading...

రతన్‌ టాటాను కూడా జాతి వ్యతిరేక శక్తి అనగలరా ?

28 Thursday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Religious Intolarence

≈ Leave a comment

Tags

intalarence, Ratan tata, talarence

సత్య

పాతబడి చివికి పోయిన బట్టను ఎవరైనా ఏం చేస్తారు, భారతీయులం కనుక దేన్నీ ఒక పట్టాన పారవేయటానికి చేతులు రావు , కాబట్టి ఒకసారి అటూ చూసి మరీ పారవేస్తాం. దానికి ఒక చోట చిరుగు కనిపించిందనుకోండి, కొంతమంది మాసిక వేసి దేనికైనా వుపయోగపడుతుందేమో అని ప్రయత్నిస్తారు. మాసికను కుట్టగానే మరో చోట పిగిలి పోతుంది. ఎందుకంటే సూదీ, దారాన్ని కూడా భరించే స్ధితిలో అది వుండదు. ఖాకీ నిక్కర్‌ వాలాల పరిస్ధితి కూడా అలాంటిదే.

అమీర్‌ఖాన్‌, షారూఖ్‌ఖాన్‌, రఘురామ్‌ రాజన్‌,నారాయణ మూర్తి, అమ్రిష్‌ పూరీ, కరణ్‌ జోహర్‌, తాజాగా మన దేశంలో ఇంటింటా వినిపించే టాటా కుటుంబానికి చెందిన రతన్‌ టాటా. ఆయన కూడా కాషాయ తాలిబాన్ల పట్ల పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు గనుక ఆయనను కూడా దేశభక్తిలేని వారి జాబితాలో చేర్చి మన ఖాకీ నిక్కర్‌ వాలాలు పాకిస్థాన్‌ పంపుతారేమో చూడాలి.

రతన్‌ టాటా మన దేశంలోని బడా వాణిజ్య, పారిశ్రామిక గ్రూపులలో ఒక అతి పెద్దదానికి అధిపతి.ఆయన ఈనెల 25న చెన్నయ్‌లోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయ విద్యార్ధులతో మాట్లాడుతూ భారత్‌ ఇప్పుడుగానీ భవిష్యత్‌లో గానీ అభివృద్ధి చెందాలంటే జనానికి నిర్ణయించుకొనే స్వేచ్చ ఇవ్వాలి, ప్రభుత్వం పర్యవేక్షణ కార్యకలపాలను నిర్వహించగలిగి వుండాలి గాని జనమేమి చేయాలో చెప్పే పాత్రధారిగా వుండకూడదు. కేంద్రంలో వున్న పాలకులు, వారి అనుయాయులలో పెరిగిపోతున్న అసహన ధోరణుల గురించి దేశంలో ఎంతో పెద్ద చర్చ జరిగిన తరువాత రతన్‌ టాటా వంటి పెద్ద మనిషి ఈ వ్యాఖ్యలు చేసిన తరువాతైనా భిన్నాభిప్రాయం వింటేనే అసహనానికి గురౌతున్న శక్తులు పునరాలోచిస్తాయా ? అది వారి విజ్ఞతకే వదలి వేద్దాం.

కొత్త దేవుడి వంటి నరేంద్రమోడీ మహిమలపై ఎన్నో ఆశలు, భ్రమలు పెంచుకున్న స్వదేశీ, విదేశీ పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు నరేంద్రమోడీ సర్కార్‌ చెబుతున్నదొకటి చేస్తున్నదొకటి అని ధ్వజమెత్తేందుకు సిద్ధం అవుతున్నారు.ఫస్ట్‌ పోస్ట్‌ అనే ఇంటర్నెట్‌ పత్రిక వ్యాఖ్యాత దినేష్‌ వున్ని కృష్ణన్‌ పారిశ్రామికవేత్తల వాదనను ప్రతిబింబించారు. దాని సారాంశం ఇలా వుంది. ‘నరేంద్రమోడీ 2014 అక్టోబరులో అమెరికన్‌ -భారత్‌ పెట్టుబడిదారుల కౌన్సిల్‌ బృందంతో సమావేశమైనపుడు వాణిజ్యం చేయటం ప్రభుత్వ రోజువారీ కార్యకలాపం కాదు అని చెప్పారు. మోడీ ప్రమాణస్వీకారం చేసి 20నెలలు గడిచింది. ఆయన చెప్పిన దానికి అర్ధం ప్రయివేటీకరణ ఎంతో అవసరం వుందన్నదే. ప్రభుత్వం ఇప్పటికీ 27 ప్రభుత్వరంగ బ్యాంకుల తో సహా 277 ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వహిస్తున్నది. వాటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నాయి. ఈ సంస్ధలు తమకు ఏది ప్రయోజనమో నిర్ణయించుకొనే ముందు మంత్రిత్వశాఖలు ఏం చెబితే దానిని అనుసరించాలి, వాటి నష్టాలకు ఒక పెద్ద కారణం ఇదొకటి అంటే సులభంగా చెప్పాలంటే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెబుతోంది. ప్రభుత్వం వాణిజ్యాన్ని పర్యవేక్షించాలి తప్ప ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో జనానికి చెప్పకూడదని రతన్‌ టాటా చెప్పిన అంశం ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వచ్చే ఏడాది బడ్జెట్‌ తయారీలో వున్నారు.వచ్చే మూడు సంవత్సరాలలో ప్రభుత్వరంగ బ్యాంకులు బేసల్‌-3 ప్రమాణాలను అందుకోవాలంటే రెండున్నరలక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కావాలి. దీనికి గాను ప్రభుత్వం తాను 70వేల కోట్ల రూపాయలు అందచేస్తానని మరో 1.1లక్ష కోట్ల రూపాయలను మార్కెట్ల నుంచి సేకరించమని చెబుతోంది. అసమర్ధంగా నిర్వహిస్తున్నవి, పారు బాకీలు ఎక్కువగా వున్న ప్రభుత్వ రంగ బ్యాంకులలో మదుపు చేయటానికి ఎవరూ ఆసక్తి చూపరు.దాంతో బొచ్చె పట్టుకొని తిరిగి ప్రభుత్వం వద్దకు రావాలి.అది ఖజానాకు మరింత భారం అవుతుంది.ఇప్పటికే జెట్లీ ఏడవ వేతన సంఘం సిఫార్సులను 2016-17లో అమలు జరపటానికి అవసరమైన ఖర్చు గురించి సాముగరిడీలు చేస్తున్నారు. ద్రవ్యలోటును 2015-16లో 3.5శాతానికి తగ్గించటం ముప్పులో పడినట్లు కనిపిస్తోంది, 70వేల కోట్ల రూపాయలను పెట్టుబడుల వుపసంహరణ ద్వారా సేకరించాలని నిర్ణయింస్తే వచ్చింది రు.12,648 కోట్లు మాత్రమే. దీన్ని పూడ్చుకోవాలంటే ప్రభుత్వ ఖర్చును గణనీయంగా తగ్గించటం, లేదా పన్నులు భారీగా పెంచటం,ప్రభుత్వ రంగ సంస్ధల వాటాలను మరింతగా అమ్మటం చేయాల్సి వుంటుంది.

సిద్ధాంత పరంగా 113 ప్రభుత్వ సంస్ధలను వాటాలను అమ్మితే వర్తమాన మార్కెట్‌ ధరలలో 14,5లక్షల కోట్ల రూపాయలను సేకరించవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులలో 2.9లక్షల కోట్ల రూపాయలను పెట్టి అభివృద్దికి వూపు తేవొచ్చు.ఇక్కడ సమస్య ఏమిటంటే గుడ్డిగా ఇంట్లో వున్న వెండి,బంగారాలను నామమాత్రపు ధరలకు అమ్మమనటం లేదు. ఎక్కడ వీలైతే అక్కడ ఆంక్షల తొలగింపునకు ముందు సుముఖత చూపాలి.

గత ఎన్‌డిఏ ప్రభుత్వం మారుతి, బాల్కో, హిందుస్తాన్‌ జింక్‌, విఎస్‌ఎన్‌ఎల్‌, ఐపిసిఎల్‌ వంటి ప్రభుత్వరంగ సంస్ధలను అమ్మివేసినపుడు ప్రపంచం పెద్దగా పట్టించుకోలేదు. ముందుగా చిన్న ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎయిరిండియా వంటి వాటిని అమ్మివేసి వాటి అనుభవంతో మిగతావాటి సంగతి తరువాత చూసుకోవచ్చు. ఈ పూర్వరంగంలో ప్రభుత్వం అనేక కంపెనీల యజమానిగా నడపటం ఏమిటని టాటా సలహా చెప్పినట్లుగా ప్రభుత్వ పర్యవేక్షించాలి తప్ప ఏమిచేయాలో జనానికి( సంస్ధలకు ) చెప్పకూడదని పెద్దగా ధ్వనిస్తున్నది.’ అని పేర్కొన్నారు.

ఇక్కడ వ్యాఖ్యాత అంతరంగం ప్రయివేటీకరణ కోరుతున్న బడా కార్పొరేట్ల వాంఛను చక్కగా ప్రతిబింబించారు. దాన్నే ఇంకొక విధంగా చెప్పాలంటే చెయ్యాల్సినవి చేయకుండా అసహనం వంటి అనసవసర విషయాలపై మోడీ సర్కార్‌ ఆసక్తి చూపుతున్నదనే కార్పొరేట్ల అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d