• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: History

వుడకకే వుడకకే ఓ వుల్లి గడ్డా నీ వెంత వుడికినా నీ కంపు పోదు !

16 Monday Jan 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Father of the Nation, Gandhi's Charkha Pose, KVIC, KVIC calendar, Mahatama Gandhi, mahatma, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

    తెల్లగా వున్నంత మాత్రాన వుల్లి మల్లి అవుతుందా, వుప్పు కప్పురంబు చూడ ఒక్కటిగ నుండు చూడ చూడ రుచుల జాడ వేరయా అన్న ప్రఖ్యాత తెలుగు సామెతలు, సామ్యాల గురించి చాలా మంది వినే వుంటారు. నా చిన్న తనంలో ఫొటో తీయించుకోవటం అన్నది చాలా మందికి ఒక తీరని కల. తిరునాళ్లకు వెళ్లినపుడు లేదా పట్టణాలకు వెళ్లినపుడు అక్కడ స్టూడియోలకు వెళితే మోటారు సైకిలు మీద, గుర్రం మీద కూర్చున్నట్లు ఫొటోలు తీయించుకుంటే చెప్పలేని ఆనందం. ఎందుకంటే అవి ఆ నాడు సామాన్యులకు అందుబాటులో వుండేవి కాదు. ఎవరైనా గ్రామానికి మోటార్‌ సైకిల్‌ మీద వస్తే గ్రామం మొత్తం అబ్బో అన్నట్లుగా చూసేది, ఒకప్పుడు బైసికిలు(సైకిల్‌ను బైసికిలుగా ఆమె నోట మొదటిసారి విన్నాను) ఎక్కినపుడు కూడా అలాగే చూసేవారని మా తాతమ్మ చెప్పేది.

   ఇప్పుడు మన ప్రధాని నరేంద్రమోడీకి కూడా అలాంటి సరదాయే కలిగిందా అన్న అనుమానం వస్తోంది. లూధియానాలో జరిగిన ఒక కార్యక్రమంలో మహాత్మా గాంధీ మాదిరి చరఖా ముందు కూర్చొన్నపుడు తీసిన ఫొటోను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ కాలండర్‌, డైరీలపై ముద్రించారు. అసలు ఖాదీ అంటే సామాన్యులు వాడే ముతక రకం వస్త్రం. ఇస్త్రీ లేకుండా ఖాదీ దుస్తులు ధరిస్తే అదేదో సినిమాలో చెప్పినట్లు చాల బాగోదు. ఇప్పుడు ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీవరకు చిల్లర రాజకీయాలు చేసే వారు, ఫ్యాన్సీగా ధనికులు తప్ప సామాన్యులెవరూ వాడటం లేదు. వాటిని ధరించి పొలాల్లో, ఫ్యాక్టరీలలో పనిచేసే సామాన్యులెవరూ మనకు కనిపించరు. ఖద్దరు మాదిరి కనిపించే మర మగ్గాలు లేదా మిల్లు వస్త్రాలు మార్కెట్‌లో ఖాదీగా చెలామణి అవుతున్నాయన్నది కూడా వాస్తవమే.

    ఇక నరేంద్రమోడీ ఫొటోలంటే పడి చస్తారనేది ఇప్పటికి అనేక సందర్భాలలో రుజువైంది. ప్రధాన మంత్రి కనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం వున్న ఏ శాఖ లేదా సంస్ధ కాలండర్‌లో అయినా ఫొటో వేయటాన్ని తప్పుపట్టనవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో జనంలో స్వాతంత్య్ర కాంక్ష రగిల్చేందుకు గాంధీ ఖాదీ తయారీని విదేశీ వ్యతిరేక స్వదేశీ వుద్యమంగా చేెపట్టారు, స్వయంగా వడికారు. గాంధీ అంటే ఖాదీ, ఖాదీ అంటే గాంధీ అన్న నానుడి వునికిలోకి వచ్చింది. ఇప్పుడు నరేంద్రమోడీ విదేశీ వస్తువులకు మన తలపులను మరింత బార్లా తెరిచి తానొక బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాలనుకుంటున్నారు. దేశానికి ఏ మాత్రం వుపయోగపడినా కూడా తప్పులేదు. అంబానీ జియో వేదిక, ప్రకటనలు చూస్తే మనకు అది కనిపిస్తుంది. ఖాదీ విషయంలో ముఖ్యమంత్రిగా గుజరాత్‌లో, ప్రధానిగా దేశంలో ప్రత్యేకంగా చేసిందేమీలేదు. ఖాదీ నూలు వడికే వారి బతుకుల దైన్య స్ధితే అందుకు నిదర్శనం. తాజా వివాదానికి వస్తే ఖాదీ సంస్ధ కాలెండర్‌పై గాంధీని అనుకరించిన ఫొటో వేయటమే అభ్యంతరకరం. చారిత్మ్రాత్మక గాంధీ ఫొటోకు, నరేంద్రమోడీ పాల్గొన్న ఒక సభలోని చిత్రానికి తేడా ఏమిటంటే ఆయన చొక్కా వేసుకోలేదు, సాదాసీదాగా నిజంగా నూలు వడుకుతున్నపుడు తీసింది. మోడీది డిజైన్డ్‌ చరఖా, ఖాదీ చొక్కా, కుర్తా వేసుకుకొని ఫొటో కోసం ఫోజిచ్చిన చిత్రం. అందుకే చూసే వారికి మొదటి ఫొటో సహజంగా కనిపించింది, రెండవ చిత్రం ఎబ్బెట్టుగా వుంది. బహిరంగ సభలలో మిత్రోం అంటూ సంబోధించే ఫొజుతో వున్న ఏ ఫొటోను అయినా ఒకవైపు, రెండవ వైపు గాంధీ ఫొటోను కాలండర్‌పై ముద్రించి వుంటే ఇంతటి వివాదం తలెత్తి వుండేది కాదు.

   ఖాదీ సంస్ధ కాలండర్‌పై గాంధీ చిత్రాన్ని తొలగించి మోడీ బొమ్మ ముద్రించటంతో అనేక మంది మనోభావాలు గాయపడ్డాయి . అయితే మాకేంటి అంటారా పోనీ అదైనా చెప్పండి. కాలండర్‌పై గాంధీ బొమ్మ స్ధానంలో నరేంద్రమోడీ చిత్రం పెట్టటాన్ని ఖాదీ సంస్ధ సమర్ధించుకున్న తీరు చిత్రంగా వుంది. ప్రధాని బొమ్మ పెట్టి ఆయన అనుగ్రహం పొందేందుకు ఖాదీ సంస్ద అధికారులు ప్రయత్నిస్తే వారి చర్యను సమర్ధించి నరేంద్రమోడీ కార్యాలయం ప్రజల మనోభావాలను గాయపరిచింది. ఇక హర్యానా బిజెపి మంత్రి అనిల్‌ విజె అర్‌ఎస్‌ఎస్‌ పరివార అంతరంగాన్ని బయటపెట్టారు.

   తమ చర్యను ఖాదీ కమిషన్‌ అడ్డంగా సమర్ధించుకొంటోంది. ‘ గాంధీ తత్వశాస్త్రం, ఆశయాలు, ఆలోచనల ప్రాతిపదికనే మొత్తం ఖాదీ పరిశ్రమ ఏర్పడింది. ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌ ఆత్మ ఆయన, అలాంటి గాంధీని విస్మరించే ప్రశ్నే లేదు. నరేంద్రమోడీ ఎంతో కాలం నుంచి ఖాదీని ధరిస్తున్నారు. ఖాదీతో తన స్వంత శైలిని అభివృద్ధి చేసుకుంటూ సామాన్య జనంలోనూ విదేశీ అతిధులలోనూ ఎంతో ప్రాచుర్యం కల్పించారు. వాస్తవానికి ఆయన ఖాదీకి అతిపెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌, ఆయన భావనలు ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌కు సరిపోయాయి. బొమ్మల ముద్రణకు సంబంధించి ఎలాంటి నిబంధనలు, సాంప్రదాయాలు లేవు, గతంలో కూడా ముద్రించని సందర్భాలు వున్నాయని’ కమిషన్‌ చైర్మన్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా చెప్పారు. ప్రధాని కార్యాలయం కూడా అనవసరమైన రచ్చ అంటూ కొట్టి పారవేసిందని, 1996, 2005, 2011,12,13, 16లో గాంధీ ఫొటో లేదని, కాంగ్రెస్‌ యాభై సంవత్సరాల పాలనలో రెండు నుంచి ఏడుశాతం చొప్పున మాత్రమే ఖాదీ అమ్మకాలు పెరిగాయని అదే గత రెండు సంవత్సరాలలో 34శాతం పెరిగాయంటే ఖాదీని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మోడీ చేసిన యత్నాలే కారణమని కార్యాలయ వర్గాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దానిలో వాస్తవాంశాల కొస్తే మోడీ హయాంలో పెరుగుదల ఏడుశాతమే తప్ప 34శాతం కాదని వార్తలు వచ్చాయి. మిగతా విషయాల కొస్తే కార్యాలయ వర్గాలు పేర్కొన్న ప్రకారమైనా కొన్ని తప్ప మిగతా సంవత్సరాలన్నీ గాంధీ బొమ్మనే ముద్రించారు, ఆయన బోధనలనే ప్రచురించారు తప్ప, దాని బదులు మరొక ప్రధాని బొమ్మను ముద్రించినట్లు , వేరే వారి సుభాషితాలను పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం, ఖాదీ కమిషన్‌గానీ చెప్పలేదు. మోడీ ఖాదీ ధరిస్తారు కనుక అమ్మకాలు ఎక్కువ అవుతాయన్నది మరొక వాదన, మిగతా ప్రధానులెవరూ ఖాదీ ధరించలేదా ? చేనేత, ఖాదీ ధరించమని ఏదో ఒక సందర్భంలో చెప్పలేదా ?

    సేనాని అయిన ప్రధాని కార్యాలయమే సమర్ధనకు దిగిన తరువాత సైనికులు మామూలుగా వుంటారా ? ఆదివారం నాడు హర్యానా బిజెపి మంత్రి అనిల్‌ విజ్‌ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించినప్పటి నుంచి దాని విలువ తగ్గిపోతున్నదని, అందువలన వాటిపై కూడా క్రమంగా ఆ బొమ్మ అంతరించిపోతుందన్నాడు.ఖాదీతో గాంధీ పేరు ముడిపడివున్నంత కాలం దాని అమ్మకాలు పెద్దగా లేవు, తగ్గిపోయాయి. కాలండెర్‌పై బొమ్మ తీసివేయటం మంచి పని.మోడీ బొమ్మ పెట్టిన తరువాత 14శాతం పెరిగాయని అనిల్‌ వ్యాఖ్యానించాడు. వాటిపై విమర్శలు రావటంతో హర్యానా ముఖమంత్రి ఖట్టర్‌ ఒక ప్రకటన చేసి అవి అతని వ్యక్తిగత వ్యాఖ్యలని కొట్టిపారవేశారు. పార్టీకి సంబంధం లేదన్నారు. తరువాత తాను అన్న మాటలను వుపసంహరించుకున్నట్లు అనిల్‌ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. బిజెపి నేతలు ఇలాంటి వదరుబోతు వ్యాఖ్యలు చేయటం తరువాత వాటిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించటం ఒక ఎత్తుగడ, ఒక అలవాటు. కడుపులో వున్నదే బయటికి వస్తుంది తప్ప వేరొకటి కాదు. వాటిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించినప్పటికీ అవి తిరుగుతూ వాటిపని అవి చేస్తాయి.

  ఖాదీ వినియోగం పెంపుదలకు నరేంద్రమోడీ ఎంతగానో కృషి చేస్తున్నారనేది ఒక ప్రచారం మాత్రమే. గ్రామాలలో ఖాదీ దారాలను తయారు చేసే కార్మికులకు కనీసవేతనాలు కూడా రావటం లేదని రోజుకు 125-150 మాత్రమే వేతనం వస్తున్నట్లు కొందరు పరిశోధకులు మూడు నెలల క్రితం తమ పత్రంలో ప్రకటించారు.

   కాళ్లు తుడుచుకునే పట్టాలను మన జాతీయ పతాక రంగులు, చిహ్నంతో తయారు చేసి విక్రయించటాన్ని వెంటనే నిలిపి వేయాలని, భారతీయుల మనోభావాలను గౌరవించాలని అంతర్జాతీయ వాణిజ్య దిగ్గజం అమెజాన్‌ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేసింది. ఈ మేరకు మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ముందు ఒక ట్వీట్‌ చేసి పాలనా పద్దతుల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. వుపసంహరించకపోతే అమెజాన్‌ కంపెనీ అధికారుల వీసాలను పునరుద్ధరించబోమని హెచ్చరించారు. తరువాత విదేశాంగ శాఖ వాషింగ్టన్‌లోని మన రాయబారిద్వారా అమెజాన్‌ కంపెనీకి నిరసన తెలియ చేయమని చెప్పారు. ఇలాంటివి పునరావృతం కానివ్వబోమని అమెజాన్‌ కంపెనీ చెప్పిందనుకోండి. నిజానికి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, కానీ ఆ పని చేయకుండా ట్విటర్‌ ద్వారా హెచ్చరించటం విశేషం.మన జాతీయ జెండాను అలా వుపయోగించటం చట్టరీత్యా నేరమే కాకుండా, మన మనోభావాలను దెబ్బతీసిన అంతర్జాతీయ వాణిజ్య సంస్ధకు హెచ్చరికలు చేసిన పాలకులు గాంధీ బొమ్మ స్ధానంలో నరేంద్రమోడీ చిత్రాన్ని పెట్టి మనోభావాలను గాయపరచటాన్ని ఏమనాలి?

    గాంధీని చంపిన గాడ్సే వారసులు తామరతంపరగా చెలరేగుతున్న ఈ తరుణంలో అలాంటి గౌరవం జాతిపితకు ఇస్తారని ఆశించటమే అసహజం. గాంధీ, గాంధీయిజానికి మేము వ్యతిరేకం, దాన్ని ఏడు నిలువుల లోతున పాతేస్తాం, అందుకే గాంధీని జనం మరిచిపోయేట్లు చేయదలచుకున్నాం అని నిజాయితీగా ప్రకటించి చేస్తే అదో పద్దతి. అలాగాక కొందరు అంటున్నట్లు చరఖా ముందు కూర్చొని గాంధీని అనుకరించి ఫొటోలు దిగితే నరేంద్రమోడీ మహాత్ముడు అవుతారా, ఆయనపై పడిన మచ్చలు తొలుగుతాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ట్రంప్‌ ద్వారా రష్యాతో రాజీకి అమెరికన్లు ప్రయత్నిస్తున్నారా ?

14 Saturday Jan 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

anti-Beijing, Beijing, China, Donald trump, Moscow, RUSSIA, Vladimir Putin, Washington, Washington’s new pro-Moscow

ఎం కోటేశ్వరరావు

    భవిష్యత్‌లో తమ దేశం ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదుగుతుందని , దానికి డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి అబద్దాలకోరుగా పేరు తెచ్చుకున్న ఒక అధ్యక్షుడిని తమ వారసులు ఎన్నుకుంటారని గానీ 240 సంవత్సరాల క్రితం స్వాతంత్య్ర సాధనకు పోరాడిన అమెరికన్లు అస్సలు వూహించి వుండరు. వారి చరిత్రలో ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించకుండా, ఏ విధానాన్ని అమలు జరపకుండానే ప్రజలలో పలుకుబడి కోల్పోయి, వివాదాల మధ్య నూతన అధ్యక్షుడు వైట్‌ హౌస్‌లో ఆశీనుడౌతాడని గానీ ఏమాత్రం ఆలోచించి వుండరు. ఇదే సమయంలో ట్రంప్‌ వ్యవహరిస్తున్న అపారదర్శక తీరును చూస్తే తరుణం రాకుండానే ముందే కూసిన కోయిల మాదిరి కొంత మంది విశ్లేషకులకు రష్యాతో అమెరికా పాలకవర్గం సయోధ్యకు అమెరికా పాలకవర్గం పావులు కదుపుతోందా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. వర్తమాన పరిస్థితులలో అది సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా బలంగానే వున్నాయి. ప్రతిదానికీ అయితే గియితే అనే మినహాయింపులు, బొమ్మా బొరుసులూ వున్నప్పటికీ ఎత్తుగడలు, తాత్కాలికంగానే అయినా అంతర్జాతీయ పరిణామాలలో ఏదీ అసాధ్యం కాదని గత చరిత్ర రుజువు చేసింది.

    సాధారణ జనం ఓట్లలో మైనారిటీ, అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీలో మెజారిటీ తెచ్చుకొని అధ్యక్షుడిగా ఎన్నికై ఈ నెల 20న పదవీ బాధ్యతలు స్వీకరించబోయే డోనాల్డ్‌ ట్రంప్‌ తొలి సారిగా, పదవి నుంచి దిగిపోయే బరాక్‌ ఒబామా కొద్ది రోజుల క్రితం చివరి విలేకర్ల సమావేశాలు నిర్వహించారు. గత ఎనిమిది సంవత్సరాల ఏలుబడిని అమెరికన్లతో పాటు ప్రపంచమంతా చూసింది గనుక పదవి నుంచి దిగిపోయే ఒబామా చెప్పిన దానిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. మొత్తం పదవీ కాలమంతా దేశాన్ని దురాక్రమణ యుద్ధాలలో నిమగ్నం చేసి, కోట్లాది కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేసి తగుదునమ్మా అంటూ ప్రపంచ శాంతి బహుమతి స్వీకరించి నోబెల్‌నే అపహాస్యం చేసిన పెద్దమనిషిగా చరిత్రకెక్కాడు. తొలి పత్రికా గోష్టి కంటే ముందే తన మంత్రులను ఎంపిక చేసిన తీరు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తన విధానాలు ఎలా వుండబోతున్నాయో ట్రంప్‌ స్పష్టం చేశారు కనుక తనపై వార్తలు రాసిన కొన్ని మీడియా సంస్ధలకు హెచ్చరికలు చేయటం మినహా పత్రికా గోష్టిలో సరికొత్తగా చెప్పిందేమీ లేదు.

    నిత్యం అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడి కొట్టుకు చచ్చినట్లుగా అమెరికా గూఢచార సంస్ధల పరిస్థితి తయారైందంటే అతిశయోక్తి కాదు. ప్రతి దేశ అంతర్గత వ్యవహారాలలో ఏదో ఒక రూపంలో జోక్యం చేసుకొని, తన పలుకుబడి, ప్రభావాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు ఎదుర్కొనే అమెరికా ఇప్పుడు తమ వ్యవహారాలలో రష్యా జోక్యం గురించి అవుననీ, కాదనీ చెప్పలేక కొట్టుమిట్టాడుతున్న స్ధితిలో వుంది. అది కూడా నాటకంలో అంతర్నాటకం కూడా కావచ్చునని కొందరు అనుకోవచ్చు. నిత్యం మనం చూసే హాలీవుడ్‌ సినిమాలలో సిఐఏ, ఎఫ్‌బిఐ ఏజంట్లు ఎంతో తెలివిగలవారు , అంతిమ విజయం సాధించేవారుగానూ, మిగతా ప్రపంచ దేశాల వారంతా తెలివితక్కువ వాజమ్మలుగా చిత్రించి చూపుతారు. ఇప్పుడు రష్యన్ల ప్రమేయం గురించిన వివాదంలో అమెరికా నిఘా సంస్ధల అధికారులు పరస్పర విరుద్ధంగా చెబుతూ నగుబాట్ల పాలవుతున్నారు. ఎన్నికల సందర్భంగా రష్యన్‌ గూఢచారులు డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలకు సంబంధించిన వ్యక్తిగత రంకు బొంకులు, వ్యాపారలావాదేవీలు, ఇతర విషయాలన్నింటినీ సేకరించారట. అయితే డోనాల్డ్‌ ట్రంప్‌కు విజయం చేకూర్చేందుకు డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారి సమాచారాన్ని మాత్రమే బహిర్గతం చేశారన్నది ఒక కథనం. దౌత్యపరమైన ఎత్తులు జిత్తులలో అదొక భాగం కావచ్చు. అనేక ప్రపంచ వ్యవహారాలలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఒబామా, హిల్లరీ క్లింటన్‌లు అనుసరించిన రష్యా వ్యతిరేక వైఖరికి బదులు తీర్చుకొనేందుకు, తాము తలచుకొంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలనే ప్రభావితం చేయగలమని ప్రపంచానికి తెలియ చెప్పేందుకు కావచ్చు. తాము కోరుకున్న డెమోక్రటిక్‌ పార్టీ ఓడిపోయి డోనాల్ట్‌ ట్రంప్‌ ఎన్నికయ్యాడు కనుక అతగాడిని కూడా అదుపులో పెట్టుకొనేందుకు ఆ పెద్దమనిషి బలహీనతలు, రంకు, బొంకులు తదితర సమాచారం కూడా తమ దగ్గర వుందని సంకేతాలు, శాంపిల్‌ సమాచారాన్ని పంపి బ్లాక్‌ మెయిలు చేసేందుకు పూనుకుందన్నది మరొక ఆరోపణ.

   అన్ని రోడ్లూ రోమ్‌కే అన్నట్లు ఇప్పుడు అమెరికాలో ఎవరు ఏం మాట్లాడినా చివరికి దీని దగ్గరకే వస్తున్నది. ఏ యుద్ధంలో అయినా ముందు బలయ్యేది సత్యం. ఇప్పుడు అమెరికాలో కూడా అదే జరుగుతోంది. విరుద్ధ కథనాలు, సమాచారాలతో జుట్టుపీక్కొనే పరిస్థితి. జోక్యం చేసుకున్నట్లు గూఢచార సంస్ధలు నివేదించాయి, అయితే వాటి దగ్గర ఆధారాలు లేవు. నిజమే అని అంగీకరించటం ట్రంప్‌కు ఇబ్బంది, అమెరికా పరువు పోతుంది. కాదని ఖండిస్తే డెమోక్రటిక్‌ పార్టీ, దాని అనుకూల మీడియా వెల్లడిస్తున్న కధనాలకు సరైన సమాధానం లేదు. తనపై రష్యా సేకరించిందన్న సమాచారం గురించి కథనాలు గుప్పించిన మీడియా సంస్ధలపై ట్రంప్‌ తన అధికారిక తొలి పత్రికా గోష్టిలో విరుచుకుపడ్డారు.బజ్‌ఫీడ్‌ అనే ఆన్‌లైన్‌ మీడియా ట్రంప్‌కు సంబంధించి రష్యన్ల దగ్గర వున్నదనే పేరుతో 35పేజీల సమాచారాన్ని ప్రచురించింది. అదంతా చెత్త అంటూ దీనికి గాను ఆ సంస్ధ పర్యవసానాలను అనుభవిస్తుందని ట్రంప్‌ బెదిరింపులకు దిగారు. ఆ సమాచారమంతా పిల్లలు ఆడుకొనేందుకు దుకాణాల్లో కొనే ఆట కరెన్సీ నోట్ల వంటిది తప్ప మరొకటి కాదని సిఐఏ మాజీ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అది వాస్తవమేనని ఎఫ్‌బిఐ అభిప్రాయపడినట్లు మీడియా రాసింది. తాము ప్రచురించిన అంశాలకు కట్టుబడి వున్నామని, ఏది నిజమో కాదో పాఠకులకు వదలి వేస్తున్నామని బజ్‌ఫీడ్‌ సంపాదకుడు ప్రకటించాడు. ప్రజావేగు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు ఇచ్చిన ఆశ్రయానికి కృతజ్ఞతగా అతనే రహస్య సమాచారాన్ని రష్యన్లకు అందచేసినట్లు కొందరి అనుమానం. రష్యన్లు తమ వద్ద వున్న సమాచారాన్ని అమెరికన్‌ ఏజన్సీలకు చేరవేసే ముందు ట్రంప్‌ వ్యతిరేకులకు కూడా అందించినట్లు వార్తలు వచ్చాయి. తమ అధ్యక్షుడికి రష్యాతో వున్న సంబంధాల గురించి స్పష్టత వచ్చేంతవరకు మీరు ఎలాంటి సమాచారాన్ని అధ్యక్ష భవనం, జాతీయ భద్రతా మండలికి గానీ అందచేయవద్దని, అ సమాచారం రష్యా ద్వారా ఇరాన్‌కు చేరే అవకాశం వుందని అమెరికా నిఘా సంస్ధల అధికారులు ఇజ్రాయెల్‌ సంస్ధలకు చెప్పినట్లు, అది తెలిసి ఇజ్రాయెలీలు నెత్తీనోరు బాదుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. నాటకాన్ని రక్తి కట్టించేందుకు , ట్రంప్‌ను కాపాడేందుకా అన్నట్లు ఆ సమాచారం వాస్తవం కాదని రష్యన్‌ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అయినా సరే దాని మీద రగడ కొనసాగటాన్ని చూస్తే మొత్తం మీద ఎంతో సమర్ధులమని విర్రవీగే అమెరికన్లను ప్రపంచం ముందు వెర్రివారిగా మార్చి రష్యన్లు వినోదం చూస్తున్నారన్నది స్పష్టం.

   రష్యన్లు ట్రంప్‌కు అనుకూలంగా , తమకు వ్యతిరేకంగా వ్యవహరించారనే వుక్రోషంతో హాకింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ 35 మంది దౌత్య సిబ్బందిని తన చివరి చర్యగా ఒబామా సర్కార్‌ బహిష్కరించింది. మామూలుగా అయితే అంతే సంఖ్యలో అమెరికా సిబ్బందిని కూడా రష్యా బహిష్కరించి వుండాలి. అయితే తనదైన దౌత్యనీతిని ప్రదర్శించిన పుతిన్‌ ఆపని చేయకుండా ట్రంప్‌ ఎలా వ్యవహరిస్తాడో చూస్తామంటూ బంతిని ట్రంప్‌ కోర్టుకు నెడుతూ ప్రకటన చేశాడు. పుతిన్‌ ఎంతో హుందాగా వ్యవహరించాడంటూ ట్రంప్‌ స్పందించాడు. ఈ వ్యవహారంలో వెలువడుతున్న పలు విశ్లేషణలు అనేక కొత్త కోణాలను జనం ముందుంచుతున్నాయి. వాటిని పూర్తిగా నమ్మటం లేదా కొట్టి పారవేయకుండా పరిశీలించటం అవసరం.

   అధికారమే పరమావధిగా వుండే పార్టీలు, శక్తులకు శాశ్వత మిత్రులు, శత్రువులు అంటూ ఎవరూ వుండరు. సరే సిద్దాంతాలు, కట్టుబడి వుండటాల గురించి ఆశించకూడదనుకోండి. ఏదో ఒక సాకుతో ఆయారాం గయారాంలు ఎక్కడ అధికారం వుంటే అక్కడికి చేరతారు. తమ మంద పెద్దదిగా వుందా లేదా అని తప్ప చేర్చుకొనే వారికి కూడా సిగ్గూ ఎగ్గూ వుండదు. అలాంటి వారిని జనం ఎందుకు ఎన్నుకుంటున్నారన్న ఒక ప్రశ్న ఎలాగూ వుండనే వుంటుంది. అధికారం, దాని కొమ్ముకాసే కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కమ్యూనిస్టు మినహా మిగిలిన పార్టీలన్నీ దేనికైనా పాల్పడతాయి. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులకు తమ ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి తమ లాభాలకు వుపయోగమా కాదా అని చూస్తారు, సత్తా వుందనుకుంటే దెబ్బలాడుకుంటారు, లేదనుకుంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ రాజీపడతారన్నది ప్రపంచ చరిత్ర సారం. కొందరి విశ్లేషణ ప్రకారం ప్రపంచ పరిణామాలలో అమెరికా సరికొత్త రాజకీయానికి తెరలేపుతున్నదనే అనుమానం కూడా వ్యక్తమౌతున్నది.

    రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్లు ఆసియాలో జపాన్‌పై దాడి చేశారు. అవసరం లేకపోయినా అణు బాంబులు వేసి ప్రపంచం మొత్తాన్ని బెదిరించారు. జపాన్‌ , ఐరోపాలో జర్మనీ మిలిటరీనికూడా రద్దు చేసి నాటో పేరుతో రక్షణ, పునరుద్ధరణ బాధ్యతల్లో అమెరికా తెరవెనుక వుండి పెద్దన్న పాత్ర పోషిస్తోంది. మిలిటరీ ఖర్చు లేకపోవటంతో అందుకయ్యే మొత్తాన్ని పరిశోధన-అభివృద్ధి, పారిశ్రామిక రంగానికి మరల్చి ఆర్ధిక రంగంలో అమెరికాతో ధీటుగా జపాన్‌,జర్మనీలు తయారయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసలు అంతరించటంతో వర్ధమాన దేశాల మార్కెట్లలో కొత్త పద్దతులలో ఎలా ప్రవేశించటమా అన్న ప్రపంచ బడా పెట్టుబడిదారుల ఆలోచన నుంచి పుట్టిందే ప్రపంచీకరణ. ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌-చైనాల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల సమస్యల పూర్వరంగంలో తమ దేశంలో ప్రయివేటు పెట్టుబడులను అనుమతించేందుకు చైనా సంస్కరణల బాట చేపట్టింది. దాంతో అతి పెద్ద చైనా మార్కెట్‌లో ప్రవేశించేందుకు అమెరికన్లు ఐక్యరాజ్యసమితిలో కమ్యూనిస్టు చైనాను అసలైన ప్రతినిధిగానే గాక, తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్‌ కూడా చైనాలో అంతర్భాగమనే వైఖరిని తీసుకున్నారు.

   పెట్టుబడిదారులు ఎప్పటికప్పుడు లాభాల కోసం తమ పద్దతులను మార్చుకుంటూ వస్తున్నారు. మార్కెట్లను పంచుకొనే పోటీలో భాగంగా సామ్రాజ్యవాదుల మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రెండు దశాబ్దాల కాలానికే రెండవ ప్రపంచ యుద్ధానికి సామ్రాజ్యవాదులు తలపడ్డారు. ఆ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసల శకం ముగియటం, బలమైన సోషలిస్టు శిబిరం ఏర్పడటంతో సామ్రాజ్యవాదులు తమ దురాక్రమణ ఎత్తుగడలను, రూపాలను మార్చారు. గతంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటివి తమ దేశాలలో తయారైన పారిశ్రామిక వస్తువులను మన వంటి తమ వలస దేశాలలో విక్రయించి, అవసరమైన ముడిసరకులను దిగుమతి చేసుకొని రెండువైపులా లాభాలను ఆర్జించేవి. ఇప్పుడు తాము ప్రత్యక్షంగా వస్తూత్పత్తిని చేయకుండా, ముడి సరకులను దిగుమతి చేసుకోకుండా కేవలం ఆయుధాల వంటి వాటిని మాత్రమే తయారు చేసి విక్రయిస్తూ పెట్టుబడిని, కొంత మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు తరలించి అక్కడి కార్మికుల చౌక శ్రమ శక్తితో వస్తూత్పత్తి చేసి వాటిని తమ మార్కెట్లకు దిగుమతి చేసుకొని లాభాలు పొందటం ప్రారంభించారు. అందుకే అమెరికా, ఐరోపా ధనిక దేశాల దుకాణాలన్నింటా చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాల తయారీ వస్తువులే వుంటున్నాయి. తమ వద్ద ఇంకా మిగిలి వున్న డాలర్లను వర్ధమాన దేశాల స్టాక్‌ మార్కెట్లలో వాటాల క్రయ విక్రయాలతో ఎలాంటి పరిశ్రమలు, వ్యాపారాలు, కార్మికులు, వుద్యోగులు లేకుండానే లాభాలు సంపాదిస్తున్నాయి.

    ఈ క్రమంలో ధనిక దేశాలలో వస్తూత్పత్తి పడిపోయి, ఆధునిక పరిశ్రమలలో రోబోట్ల వినియోగం పెరిగి కార్మికులకు వుపాధి తగ్గిపోయి సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. చైనా తన వద్ద వున్న అపార మానవ శక్తిని పెట్టుబడిగా పెట్టి జనానికి వుపాధి కల్పించి, వారి జీవన ప్రమాణాలను పెంచటంతో పాటు ప్రపంచం సంపదలలో రెండవ స్ధానంలో వున్న జపాన్‌ను వెనక్కు నెట్టింది. ఆ పోటీలో అమెరికాతో పోటీ పడుతూ దాని మొదటి స్దానానికి సవాలు విసురుతోంది. అంతర్జాతీయ పరిణామాలలో తనకు పోటీగా మారవచ్చనే భయం అమెరికన్లకు పట్టుకుంది. ఈ పూర్వరంగంలో దానిని కట్టడి చేసేందుకు సైనికంగా చైనా చుట్టూ తన స్థావరాలతో పాటు మిత్రులను సమీకరిస్తోంది.

    ప్రస్తుతం పెద్ద సరిహద్దు వున్న రష్యాతో చైనాకు ఎలాంటి పేచీలు లేవు. రెండు దేశాల మధ్య శతృత్వం కూడా లేదు. ఈ పూర్వరంగంలో రష్యాను కూడా తనతో కలుపుకొనే అవకాశాల గురించి అమెరికన్లు ఆలోచిస్తున్నారనేది ఒక విశ్లేషణ. దానిలో భాగంగానే ట్రంప్‌ ఒకవైపు పుతిన్‌ను పొగుడుతూ చైనాతో బస్తీమే సవాల్‌ అన్నట్లుగా రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నాడు. చైనాలో అంతర్భాగమైనా విడిగా వున్న తైవాన్‌ పాలకులతో మాట్లాడటమే గాకుండా ఒకే చైనా విధానానికి ఎందుకు కట్టుబడి వుండాలన్నట్లుగా మాట్లాడుతున్నాడు. చైనా వస్తువులపై పెద్ద మొత్తంలో దిగుమతి సుంకాలు విధిస్తామని కూడా బెదిరింపులకు దిగాడు. అయితే ఇవన్నీ అంత తేలిక కాదు. రష్యా ఆర్ధికంగా ఇబ్బందులలో వున్నప్పటికీ సిరియా, టర్కీ పరిణామాలలో అమెరికాకు తన సత్తాఏమిటో చూపటమే గాక సవాలు కూడా విసిరింది. రష్యా ఇదే విధంగా కొనసాగితే ఐరోపామీద తన పట్టు, పలుకుబడికి విఘాతం కలగవచ్చనే భయం కూడా అమెరికా పాలకవర్గానికి వుంది. మొత్తం మీద ప్రపంచ పెట్టుబడిదారీ విధానం సంక్షోభంలో వున్న పరిస్థితుల్లో ఒక పెట్టుబడిదారీ దేశం మరొక పెట్టుబడిదారీ దేశంతో ఘర్షణ పడే అవకాశాలు లేవు. మార్కెట్లను పంచుకోవటంలో రష్యన్‌ పెట్టుబడిదారీ వర్గం కూడా పోటీ పడుతోంది. చైనా, భారత్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాతో కలసి బ్రిక్స్‌ కూటమి ఏర్పాటు చేయటం దానిలో భాగమే. అమెరికన్ల ఎత్తుగడలు బాగా తెలిసిన రష్యా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. రష్యన్‌ పెట్టుబడిదారులు కూడా అదే కోరుకుంటారు.

  చైనాను రెచ్చగొట్టేందుకు ట్రంప్‌ వినియోగిస్తున్న అస్త్రాలతో పోల్చితే రష్యాను ప్రసన్నం చేసుకొనేందుకు విసురుతున్న పూలదండలు ఆసక్తి కరంగా వున్నాయి. తన విదేశాంగ మంత్రిగా రష్యా అనుకూలుడిగా ముద్రపడిన ఎక్సాన్‌ మోబిల్‌ సిఇవో రెక్స్‌ టిల్లర్సన్‌ను నియమించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎక్సాన్‌ కంపెనీకి రష్యాలోని సైబీరియాలో 50 కోట్ల డాలర్ల చమురు ఒప్పందం వుంది. త్వరలో రష్యాపై వున్న ఆంక్షలను ట్రంప్‌ ఎత్తివేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి అంశాలకు సంబంధించి వస్తున్న వార్తలలో ఎక్కువ భాగం చీకట్లో వేస్తున్న బాణాల వంటివి. ఒక్కోసారి అవే కొత్త పరిణామాలకు నాంది పలుకుతాయి. కొందరు వూహిస్తున్నట్లు రష్యా-అమెరికాలు ప్రపంచ మార్కెట్లను పంచుకొనేందుకు సయోధ్య కుదుర్చుకుంటే ప్రపంచ రాజకీయాలు మరోమలుపు తిరుగుతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మార్పు కోసం మోడీకి ఓటు వేశాను తప్ప ద్వేషం కోసం కాదు !

12 Thursday Jan 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP's social media, BJP’s IT cell, BJP’s trolling army, I am a troll, Narendra Modi, Rahul gandhi, Trolls

సాధ్వి ఖోస్లా

    స్వాతంత్య్ర సమర యోధుల పరంపరనుంచి వచ్చిన కొంత మందికి రెండు విషయాలు మాత్రమే -దేశ భక్తి మరియు గాంధీజీ సిద్ధాంతాలు-ఎరుకలో వుంటాయి. నాకైతే నా రాష్ట్రం పంజాబ్‌ కూడా. పంజాబ్‌ మీద నాకున్న ప్రేమ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు మరియు వాటికి అనుకూలంగా వున్న రాష్ట రాజకీయ పరిసరాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు శక్తి నిచ్చింది. ద్వేష పూరితమైన భారతీయ జనతా పార్టీ మరియు తమను తాము వీరులుగా చెప్పుకొనే దాని సామాజిక మీడియా మరుగుజ్జు యోధులపై పోరాడేందుకు దేశం మీద నాకున్న ప్రేమ బలాన్నిచ్చింది.

    గత మూడు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌ మీద నన్ను అసుసరిస్తున్నారు.ఈ రోజు నేనేమీ కాదు మరియు బిజెపితో నా అనుబంధాన్ని ప్రశ్నిస్తున్నారు. స్వాతి చతుర్వేది పుస్తకం అయామ్‌ ఏ ట్రోల్‌ (నేనో వెంటాడే మరుగుజ్జును )లో నేను వెల్లడించిన వాస్తవాలతో మండిపడుతున్న బిజెపి సామాజిక మీడియా సేనలోని అజ్ఞాత ముఖాలు నన్నొక దుష్టశక్తిగా చిత్రిస్తున్నాయి. ప్రధాన మంత్రి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాలు పలికే గొంతులేమైనా వుంటే వాటిని మూయిస్తారని నేను చెప్పింది వాస్తవమని వారు రుజువు చేస్తున్నారు.నేను బయటపడి వాస్తవాలను బహిరంగ పరచాలన్న నా నిర్ణయం కాంగ్రెస్‌తో నాకున్న స్వల్పకాల అనుబంధం వలన కాదు, అసత్యాలను వేద వాక్యంగా మార్చటాన్ని అపేందుకు చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నమిది. ఎప్పటికప్పుడు వార్తలు అందుతున్న నేటి యుగంలో నిజం కంటే వ్యతిరేక సమాచార ప్రచారాన్ని వాట్సాప్‌, ట్విటర్‌ మరియు ఫేస్‌బుక్‌లలో జనం ఎక్కువగా నమ్ముతున్నారు. ఆ సమయానికి నిజం అడుగున పడిపోయి జరగాల్సిన హాని జరుగుతుంది.

    మన గొప్ప దేశాన్ని గత ప్రభుత్వాలు మలుచుతున్న తీరుతో ఇతర తరుణ వయస్సు భారత పౌరుల మాదిరే నేను కూడా 2013లో అసంతృప్తి చెందాను. నేను మొదటి సారిగా నా ఓటు హక్కును మోడీకి అనుకూలంగా వినియోగించాను, ఎందుకంటే మెరుగైన భారత్‌ గురించి ఆయన దర్శన కోణాన్ని, ఆయనను నమ్మాను. ఆ నమ్మకమే నన్ను 272 మంది మరియు వారితో పాటు వున్న వలంటీర్లతో కూడిన బిజెపి మిషన్‌ (ప్రచార దళం)లో చేరేందుకు ప్రేరణనిచ్చింది.ఆ ప్రచార దళపు ‘సరికొత్త ప్రచార పద్దతులు ‘ వెంటాడటంతో సహా అప్రతిష్టపాలు చేయటం, వాస్తవానికి వక్రభాష్యాలు చెప్పి జనాల న్యాయనిర్ణయాలను అయోమయంలోకి నెట్టటం గురించి నాకు ముందుగా ఏమాత్రం తెలియదు.

     2015 నవంబరులో అమీర్‌ ఖాన్‌ దేశంలో నాడున్న పరిస్ధితుల గురించి తన మనోభావాలను వ్యక్తం చేసినపుడు అరవింద గుప్తా నాయకత్వంలోని బిజెపి ఐటి విభాగం ఎలక్ట్రానిక్‌ వాణిజ్య సంస్ధ అయిన స్నాప్‌డీల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వున్న ఆ నటుడిని తప్పించేందుకు గాను ఒత్తిడి చేస్తూ ఒక సామాజిక మీడియా ప్రచారాన్ని నిర్వహించింది. ఆ నటుడిని వెంటాడాలని, వివిధ వేదికలపై అతనిపై బురద చల్లాలని, అతని సినిమాలు చూడకుండా జనాన్ని రెచ్చగొట్టాలని మాకు (బిజెపి ఐటి విభాగంలోని వలంటీర్లకు) ఆదేశాలు జారీ చేశారు. నా భావజాలం మరియు ఆత్మ బిజెపి మతోన్మాద దళంలో భాగస్వామి అయ్యేందుకు అనుమతించలేదు.భ్రమలు తొలిగిన నేను దాని నుంచి బయటపడ్డాను. వత్తిడి కారణంగా 2016 జనవరిలో స్నాప్‌డీల్‌ అమీర్‌ ఖాన్‌తో తన సంబంధాలను రద్దు చేసుకుంది.

     అటువంటి చర్యల తీవ్ర పర్యవసానాలను మనం గుర్తించలేదు. ఒక నటుడిగా ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇండ్లలో వుంటూ మన హృదయాలను దోచుకున్న వ్యక్తి ఆకస్మికంగా ఒక ‘ముస్లింగా’ మారిపోయాడు. ద్వేషాన్ని వ్యాపింప చేయటానికి సామాజిక మాధ్యమం ఒక ప్రమాదకర సాధనంగా మారిపోయింది, అదికొన్ని సందర్భాలలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కూడా దారితీయవచ్చు. చివరికి మతం కూడా రాజకీయాల మాదిరి మనల్ని విడదీయలేదు.

జాతి వ్యతిరేకిగా ముద్ర

     దాదాపు రెండు సంవత్సరాలు తీవ్ర స్ధాయిలో ప్రధాన మంత్రికి ట్విటర్‌ మీద మద్దతు పలికాను, చురుకుగా బిజెపికి ప్రచారం చేశాను, వారి ఎజండాలలో భాగంగా స్మృతి ఇరానీ, కిరణ్‌ ఖేర్‌ వంటి బిజెపి నాయకులకు తోడ్పడ్డాను. నేను వ్యతిరేకించిన సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ కూటమికి నాయకత్వం లేకపోవటాన్ని, దిగజారిన విధానాలను కూడా విమర్శించాను. ఇదే సమయంలో పంజాబ్‌ మీద వున్న నా అభిమానం రాష్ట్రంలో వున్న భయంకరమైన మాదకద్రవ్యాల వ్యాప్తిని వెల్లడిస్తూ దాని మీద ఒక డాక్యుమెంటరీని తీయించేందుకు కూడా నడిపించింది. ఆందోళన కలిగించే వాస్తవాలను ప్రధాన మంత్రి దృష్టికి తెచ్చేందుకు ట్విటర్‌ ద్వారా ఒక వర్తమానం కూడా పంపాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని మోడీ వాగ్దానం చేశారు, అయితే అందుకు సహాయం చేసేందుకు నేను చేసిన వినతులను విస్మరించారు.

  ప్రధాన మంత్రి నిర్లక్ష్యం నన్ను కాంగ్రెస్‌ వైపు తిరిగేట్లు చేసింది. నేను గట్టిగా బలపరిచిన నరేంద్రమోడీ విస్మరిస్తే నా వినతులను రాహుల్‌ గాంధీ విన్నారు. కాంగ్రెస్‌ వుపాధ్యక్షుడితో కలిసినప్పటి నా చిత్రాలను సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బిజెపి వెంటాడే సేనకు నా కృతజ్ఞతలు. రహస్యంగా వుంచిన వారి క్రీడను నేను బయట పెట్టటాన్ని నా రాజకీయ అజండాలో భాగంగా చూపుతున్నారు. నేను నిర్మించిన డాక్యుమెంటరీని 2016 మార్చి 18న రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. కాంగ్రెస్‌తో నా ఏకైక సంబంధం అది మాత్రమే.

   2014 ఎన్నికలు భారత రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేశాయి. మీడియాలో ప్రచారం ఎలా పొందాలో తెలిసిన ప్రధాన మంత్రి ఇంటర్నెట్‌ ద్వారా జనాలకు చేరువ అవుతున్నారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా జనానికి తెలియచేస్తున్నారు. ఆయనను మిలియన్ల మంది అనుసరిస్తున్నారు, కానీ ఆయన మాత్రం కొద్ది మంది ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుసరిస్తారు. వారిలో ఎక్కువ మంది దూషిస్తూ వెంటాడతారని బాగా తెలిసిన వారే. ప్రధానిని సందర్శించి, శుభాకాంక్షలు తెలిపేందుకు ఇలా దూషించే వారిని ఎప్పటికప్పుడు ఆహ్వానిస్తూ వుంటారు. ఇలా వెంటాడే వారిని ప్రోత్సహించనని బిజెపి చెప్పుకునేట్లయితే ఇలాంటి అక్రమ చర్యలకు వ్యతిరేకంగా ముఖ్యంగా తమ కార్ఖానా నుంచి తయారై బయటకు వస్తున్న వాటి గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదు?

   సామాజిక మాధ్యమ వేదికను నిర్మాణాత్మక అభివృద్ధికి వినియోగించుకోవటానికి బదులు తమ వ్యతిరేక అభిప్రాయాలను వెల్లడించించిన వారిని అవమానించే విధంగా తన దిగువ సేనను వినియోగించుకుంటోంది. ఏ వ్యక్తి, సంస్ధ లేదా సమాజం అభివృద్ధి చెందాలంటే సానుకూల విమర్శలు ఆరోగ్యకరమైనవి, కానీ అసహ్యంగా విమర్శించటం, వ్యక్తిత్వాలను దెబ్బతీయటం అవాంఛనీయం. ప్రధానిని సమర్ధించే పేరుతో జనాలను మరియు వారి వ్యక్తిత్వాలను దెబ్బతీస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల చీకటి చిత్రాన్ని మాత్రమే ఇది బయట పెడుతోంది. వ్యతిరేకుల, జర్నలిస్టుల, రాజకీయనేతలు మరి ఇతరులెవరి ప్రతిష్టనైనా దెబ్బతీయాలని కిరాయి వలంటీర్లకు మార్గదర్శనం చేశారు. భిన్నమైన వైఖరి కలిగి వున్న ఎవరినైనా మోడీ మరియు జాతి వ్యతిరేకిగా వర్ణించారు. ఎంత అసహ్యంగా అయితే అంతగా మహిళలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్‌ గాంధీ,ఆయన తల్లి సోనియాగాంధీలపై తప్పుడు ప్రచారం చేశారు, బర్ఖాదత్‌ వంటి జర్నలిస్టులను చంపేస్తామని, మాన భంగం చేస్తామని బెదిరింపులు చేశారు.

  బిజెపి ప్రచారాన్ని బయటపెట్టిన మాకు అన్ని జీవన రంగాల నుంచి ప్రజామద్దతు వెల్లువెత్తుతున్నది. ఈ అంశం దేశంలోని మారుమూలలకు కూడా ప్రయాణించింది. వ్యతిరేక భావజాలాన్ని అణచివేసేందుకు పాలకపార్టీ సామాజిక మీడియాను వినియోగించుకోవటాన్ని జనం ప్రశ్నిస్తున్నారు.అంతిమంగా బిజెపి సామాజిక మీడియా సేన మరియు మద్దతుదారుల లక్ష్యంగా పుస్తక రచయిత్రి స్వాతి చతుర్వేది మరియు నేను వుంటాము. వారు మాపై బూతులు, కించపరిచే ప్రచారం, బెదిరింపులతో దాడి చేస్తారు. ఇదంతా ఎందుకంటే వారి చీకటి రహస్యం బట్టబయలైంది, నిజం గాయపరుస్తుంది.

   నేను నా ఆత్మ చెప్పినట్లు నడిచాను. వ్యతిరేక భావాలు కలిగి వున్న వ్యతిరేకులు లేదా ప్రముఖులకు వ్యతిరేకంగా కించపరిచే ప్రచారం చేయటానికి సామాజిక మీడియాను ఎలా సాధనంగా చేసుకుంటున్నారో నా అందమైన దేశం, దాని ప్రజలు తెలుసుకోవాలన్నది నా ఆలోచన మరియు విధి.

ప్రేమ కంటే ద్వేషం త్వరగా విస్తరించటం విచారకరం !

నేను మార్పు కోసం నరేంద్రమోడీకి ఓటు వేశాను తప్ప ద్వేషం కోసం కాదు. !

నేను చెప్పాల్సింది చెప్పాను, నేను నమ్మిందే చేశాను, చేసిందే చెప్పాను. ఇది నేను చెబుతున్న నిజం !

స్క్రోల్‌.ఇన్‌ సౌజన్యంతో

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ పెంపకంలో రక్షణలేని రూపాయి పాపాయి !

07 Saturday Jan 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Narendra Modi rule, Rupee, Rupee Fall, rupee value

ఎం కోటేశ్వరరావు

    మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు ఒక రూపాయకు కొన్న ఒక వస్తువు ధర నరేంద్రమోడీ పదవిలోకి వచ్చే నాటికి రు.58.58కి పెరిగింది. రెండున్నర సంవత్సరాల తరువాత జనవరి ఆరవ తేదీన రు.67.96కు చేరింది, డిసెంబరు నాటికి రు.69.50 పెరగవచ్చని కొందరి అంచనా. ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన మంచి రోజులంటే ఇవా ?

    2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న 61.19 రూపాయల నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక్క బిజెపికే సంపూర్ణ మెజారిటీతో నరేంద్రమోడీ సంఖ్యరీత్యా అత్యంత బలమైన ప్రధానిగా అవతరించారు. అయితేనేం రూపాయి విలువ పెరగలేదు కదా పతనమై రు.68.86పైసలను తాకి 2016 నవంబరు 25న సరికొత్త రికార్డును సృష్టించింది. అప్పటి నుంచి 67-68కి అటూ ఇటూగా కదలాడుతోంది.ఈ ఏడాది డిసెంబరు నాటికి నరేంద్రమోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టగలరని రూపాయి మరింత పతనమై 69.50కి చేరవచ్చని రాయిటర్‌ వార్తా సంస్ధ తన విశ్లేషణలో పేర్కొన్నది. అది పక్కా పెట్టుబడిదారులు నడిపే కంపెనీ తప్ప కమ్యూనిస్టులకు, మోడీ విమర్శకులకు ఎలాంటి సంబంధం లేనిది.

    ప్రధాని నరేంద్రమోడీ విధానాలను తప్పు పట్టే వారు బిజెపి, దానిని సమర్ధించే పార్టీలు అధికారంలోకి రాకూడదని కోరుకొనే వారే అనటంలో ఎలాంటి శషభిషలకు తావులేదు. మోడీ ప్రభుత్వ విధానాలు బాగు, బాగు , బహు బాగున్నాయి, వెనక్కు తిరిగి చూడనవసరం లేదని పొగిడేవారి గురించే అనుమానించాలి. ఇటీవలి కాలంలో ఇలాంటి వారు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. మోడీ విధానాలు బాగులేకపోతే ఆయనను అంత ఎక్కువ మంది ఎలా సమర్ధిస్తున్నారు అన్నది వాటిలో ప్రధానమైనది. బలపరిచే, వ్యతిరేకించే సర్వేల బండారం, బాగోతం అందరికీ తెలిసిందే. వాటిని పక్కన పెడితే మోడీని సమర్ధిస్తున్న వారందరూ ఆయన విధానాలకు ఆమోద ముద్ర వేశారనే నిర్ణయానికి వస్తే పప్పులో కాలువేసినట్లే. పెద్ద నోట్ల రద్దు విషయమే తీసుకుంటే తాము ఇబ్బందులు పడినా జనం రెచ్చి పోలేదంటే అర్ధం దేశంలో తొలిసారిగా ఏదో మంచి చేస్తున్నాడు, యాభై రోజులే అంటున్నారు కదా చూద్దాం అని సహించారు తప్ప ఆ నిర్ణయ పర్యవసానాలన్నీ తెలిసి మద్దతు ఇవ్వలేదు. అసలు వాటి పర్యవసానాల గురించి రద్దు చేసిన నరేంద్రమోడీి గానీ, ఆయనకు సలహా ఇచ్చిన అంతరంగికులు, చివరకు తానే సలహాయిచ్చానని చెప్పుకున్న , మోడీ కంటే మేథావి అని ఆయన చుట్టూవున్నవారు భావించేే చంద్రబాబు నాయుడు, అంతిమంగా అమలు జరిపిన రిజర్వుబ్యాంకు సైతం నిర్దిష్టంగా ఫలానా ప్రయోజనం లుగుతుంది అని చెప్పలేదని తెలుసుకోవటం అవసరం. ఈ జన్మలో కష్టాలు అనుభవించినా పరలోకంలో స్వర్గ సుఖాలు దక్కుతాయి అన్నట్లుగా తాత్కాలికంగా నష్టం జరిగినా భవిష్యత్‌లో మంచి జరుగుతుంది అని తప్ప అధికార పక్షం లేదా దానిని సమర్ధిస్తున్నవారు గానీ తాత్కాలిక నష్టాలు , శాశ్వత లాభాలు ఎలా వుంటాయో ఎవరైనా చెప్పారా ?

     చైతన్యం, మూఢత్వం, అసంతృప్తి, అభిమానం అనేక కారణాలతో తరతమ స్థాయిలలో వుండే మన దేశంలో గుడ్డిగా నమ్మినట్లే, గుడ్డిగా వ్యతిరేకించటం కూడా సాధారణ విషయమే. అందువలన జనం వ్యతిరేకతలు, సమర్ధనలను కాసేపు పక్కన పెడదాము. కాంగ్రెస్‌ నేతలు దేశాన్ని అన్ని రంగాలలో గాడి తప్పించారు, మేము వస్తే తిరిగి గాడిలో పెడతామనే కదా బిజెపి అండ్‌ కో పార్టీలు, వాటిని భుజాన వేసుకొని మోసిన పవన్‌ కల్యాణ్‌ వంటి పెద్దలు చెప్పింది. తాను పదవిని స్వీకరించగానే విదేశాలలో పోయిన పరువును తిరిగి రాబట్టానని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషం మరి దేశం సంగతేమిటి? ఆర్ధిక వ్యవస్ధ విషయమేమిటి?

     అన్ని విషయాలను ఒకేసారి చర్చించటం కుదరదు గనుక రూపాయి విలువ- పతనం, పటిష్టత పర్యవసానాల గురించి చూద్దాం. మన్మోహన్‌ సింగ్‌ గారి పాలనలో ఆయన వయస్సు పెరుగుతున్న మాదిరి రూపాయి విలువ పడిపోతున్నదని బిజెపి, నరేంద్రమోడీ విమర్శించారు. 2013లో మన్మోహన్‌ సింగ్‌ హయాం మొత్తం మీద గరిష్టంగా ఒక డాలరుకు 68.85 రూపాయల వరకు పడిపోయింది.

     2014 మే 25న నరేంద్రమోడీ పదవీ బాధ్యతలను స్వీకరించిన సమయానికి 58.58 గా వుంది. ఇది తమ మోడీ ఘనతే అని అభిమానులు చెప్పారు. రూపాయి విలువ పతనం, పెరుగుదల చరిత్రను చూస్తే https://knoema.com/infographics/rygejhb/rupee-devaluation-against-dollar-1947-till-date ప్రధానిగా జవహర్‌ లాల్‌ నెహ్రూ వున్న సమయంలో 1947 నుంచి 1950 మధ్య ఒక రూపాయి నుంచి రు.4.76కు పడిపోయింది. ఆ ఏడాది నుంచి నెహ్రూ మరణించిన తరువాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి పాలనలో 1965 వరకు స్ధిరంగా ఒక డాలరుకు రు.4.76 పైసలు వుంది. శాస్త్రి మరణించిన 1966లో రు.6.36కు పడిపోయింది. తరువాత ఇందిరా గాంధీ హయాంలో రు.6.36 నుంచి 1976లో రు.8.96కు పడిపోయి, ఆమె దిగిపోయే నాటికి రు.8.75కు పెరిగింది. జనతా పార్టీ నేత మొరార్జీ దేశాయ్‌ పాలనలో పెరుగుదల తప్ప పతనం లేదు, రు.8.75 నుంచి రు.8.14కు పెరిగి పెరిగింది.

    రెండవ సారి ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన సమయంలో రు.7.86గా వున్నది కాస్తా ఆమె మరణించే నాటికి రు.11.36కు పతనమైంది. తరువాత రాజీవ్‌ గాంధీ ఏలుబడిలో రు.16.23కు దిగజారింది.1989లో అధికారానికి వచ్చిన విపి సింగ్‌ హయాంలో రు.17.50కి, నూతన ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు గాంచిన పివి నరసింహారావు పాలనలో రు.22.74 నుంచి 35.43కు తగ్గింది. హెచ్‌డి దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ పాలనా కాలంలో రు.41.26కు చేరింది. తరువాత బిజెపి నేత ఎబి వాజ్‌పేయి పాలనలో రు.48.61కి పతనమై చివరికి రు.45.32కు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మోడీ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ గరిష్ట పతనాన్ని తాకి 2017 జనవరి ఆరున రు.67.96 గా ముగిసింది. పది సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌ కాలంలో నిఖర పతనం పదమూడు రూపాయలకు అటూ ఇటూగా అయితే రెండున్నర సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో పది రూపాయలకు అటూ ఇటూగా వుంది. మోడీని అభిమానించే వారు దీనిని విజయం అంటారా పతనంగాక మరేదైనా పేరు పెడతారా ?

    రూపాయి విలువ పతనమైతే సామాన్య జనానికి జరిగే నష్టం ఏమిటి? పోనీ నరేంద్రమోడీకి ఏదైనా లాభం వుంటుందా ? మోడీకి, మన్మోహన్‌ సింగ్‌కో మరొకరికో వ్యక్తిగత నష్టం గురించిన సమస్య కాదిది. మనిషికి బిపి పెరిగినా, తగ్గినా శరీరంలో ఎటువంటి ప్రమాదకర మార్పులు సంభిస్తాయో ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలు అలాంటి పర్యవసానాలకే దారితీస్తాయి. అంటే మొత్తం జనాన్ని ముఖ్యంగా సామాన్య జనాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయి. ఎలాగో చూద్దాం.

 

  మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము.పీపాకు వంద లీటర్ల పెట్రోలు అనుకుంటే లీటరు రు.63.14 పడుతుంది. డాలర్లలో లీటరుకు 1.07 , ఇప్పుడు అంటే 2016 డిసెంబరు 14-28 మధ్య ఒక పీపాను 53.05 డాలర్లకు , డాలరుకు రు.67.86 చొప్పున రు.3600కు కొనుగోలు చేశాము. అంటే లీటరుకు రు.36 పడుతుంది. డాలర్లలో ధర 0.53. నరేంద్రమోడీ సర్కార్‌ రూపాయి విలువ పతనాన్ని అరికట్టి స్ధిరంగా వుంచి వుంటే లీటరుకు రు.31.38కే వచ్చి వుండేది.అదే ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు పెరిగి వుంటే మరో పది రూపాయలు తగ్గి వుండేది. అన్నీ తానే అయి చూసుకుంటున్న నరేంద్రమోడీ రూపాయి పతనాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు. మరింతగా దిగజారనుందని ఆర్ధిక విశ్లేషకులు ఎందుకు అంచనా వేస్తున్నారు? అరికట్ట లేకపోగా తన హయాంలో పెట్రోలుపై పదకొండు రూపాయల పన్ను పెంచి అదనపు భారం ఎందుకు మోపి నట్లు ?

    రూపాయి విలువ పతనమైతే ఎక్కువ మందికి నష్టం జరిగితే, లాభపడే వారు కూడా వుంటారు. విదేశాలలో వుద్యోగాలు చేస్తూ మన దేశానికి డాలర్లు పంపే వారికి ఇక్కడ రూపాయలు అదనంగా వస్తాయి. మన వస్తువులను దిగుమతులు చేసుకొనే వారు తక్కువ డాలర్లు చెల్లించి లబ్దిపొందుతారు. మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు, ఎరువులు, ఔషధాలు, పురుగుమందులు, పప్పుధాన్యాలు, పామాయిల్‌ వంటి ఖాద్య తైలాలకు ఎక్కువ డాలర్లు చెల్లించాలి, పర్యవసానంగా ధరలు పెరుగుతాయి. అవి ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి. రూపాయి విలువ పతనం కారణంగానే ఇటీవలనే అనేక కంపెనీల కార్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే. విదేశాలలో విద్యనభ్యసించేవారిపై భారం పెరుగుతుంది. విదేశాల నుంచి డాలర్ల రూపంలో తీసుకొనే రుణాలకు చెల్లించాల్సిన మొత్తాలు పెరుగుతాయి. పెద్ద నోట్ల రద్దు వలన తాత్కాలికంగా ఇబ్బందులంటే ఆర్ధిక వ్యవస్ధ మందగించటమే, దాని వలన మూడు నుంచి ఐదులక్షల కోట్ల నల్లధనం వెలికి వచ్చి ఆ మేరకు ప్రభుత్వాదాయం పెరుగుతుందని వేసుకున్న అంచనాలన్నీ తారుమారయ్యాయని 40-50వేల కోట్లకు మించి రావని వార్తలు వస్తున్నాయి. ఏ రోజు లావాదేవీలను ఆరోజు సాయంత్రానికి బ్యాంకులు ఖరారు చేస్తాయి. అలాంటిది పెద్ద నోట్ల డిపాజిట్ల గడువు ముగిసి వారం రోజులు గడుస్తున్నా బ్యాంకులకు చేరిన సొమ్మెంతో ఇంకా లెక్కలు వేస్తున్నామని రిజర్వుబ్యాంకు చెప్పటం ఆశ్చర్యంగా వుంది. నోట్ల రద్దు వలన కలిగే లాభం సంగతేమోగాని రెండుశాతం జిడిపి అంటే రెండులక్షల కోట్ల రూపాయల నష్టం ఖాయంగా రానుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మసూద్‌ అజార్‌ను చైనా, దలైలామాను మనం ఎందుకు కాపాడుతున్నాం ?

01 Sunday Jan 2017

Posted by raomk in BJP, CHINA, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, USA

≈ Leave a comment

Tags

anti china, anti india, China, Dalai Lama, INDIA, masood azhar

Image result for masood azhar,  Dalai Lama

ఎం కోటేశ్వరరావు

    ఈ ప్రశ్న రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వుండాలని కోరుకొనే అనేక మందికి ఆవేదన కలిగిస్తోంది, అదే సమయంలో శత్రుపూరిత సంబంధాలుండాలని కోరుకొనే వారికి ఆనందం కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. అసలేం జరుగుతోంది ? ఐక్యరాజ్యసమితి పరిభాషలో సాంకేతిక అంశాలు ఎలా వున్నప్పటికీ ఆచరణలో మన దేశానికి వ్యతిరేకంగా వుగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్లుగా మన ప్రభుత్వం చెబుతున్న మౌలానా మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ వుగ్రవాదిగా పరిగణిస్తూ తీర్మానం చేయకుండా ఏప్రిల్‌, అక్టోబరులో భద్రతా మండలిలో తీర్మానం చేయకుండా అడ్డుకుంది. దాని అభ్యంతరాల గడువు డిసెంబరు 31తో ముగియనుంది. అయితే రెండు రోజుల ముందే చర్చకు వచ్చిన ఈ అంశాన్ని మరోసారి అడ్డుకొన్నది. దీంతో వుగ్రవాదం పట్ల చైనా ద్వంద్వ ప్రమాణాలను అసుసరిస్తోందని మన దేశం విమర్శించింది. సరిగ్గా ఈ సమయంలోనే అంటే బుధవారం నాడు కజకస్తాన్‌, మంగోలియా, మన దేశ (కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతాన్ని అనుకొని వుండే) -చైనా సరిహద్దులలో వున్న చైనా రాష్ట్రం గ్జిన్‌జియాంగ్‌లో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంపై వుగ్రవాదులు దాడి చేసి ఒక కార్యకర్త, భద్రతా సిబ్బంది ఒకరిని హత్య చేశారు. వెంటనే పోలీసులు దాడిలో పాల్గొన్నవారిలో ముగ్గురిని కాల్చివేశారు. అనేక సార్లు ఇస్లామిక్‌ తీవ్రవాదులు అక్కడ దాడులకు పాల్పడిన కారణంగా ఇప్పుడు కూడా వారే అయి వుండవచ్చని వార్తలలోని వ్యాఖ్యలను బట్టి అనుకోవాలి. ఆ వుగ్రవాదులను ఇరుగు పొరుగు దేశాల వారు పెంచి పోషించి రెచ్చగొడుతున్నందున దాడులు చేస్తున్నట్లు చైనా గతంలో విమర్శించింది. చైనా కూడా వుగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది కదా అలాంటపుడు మసూద్‌ అజార్‌పై చర్యను ఎందుకు అడ్డుకుంటున్నట్లు అన్న సందేహం కొంత మందికి కలుగటం సహజం.

    ఈ సమస్య గురించి గురించి ఏకపక్షంగా ఒక వాదననే సమర్ధిస్తూ చర్చించిన వారిని దేశ భక్తులుగానూ, భిన్న కోణాల గురించి వివరించే వారిని దేశ ద్రోహులు లేదా చైనా అనుకూలురుగానో చిత్రించే వాతావరణంలో వున్నాం. ప్రస్తుతం ముస్లిం పాకిస్థాన్‌, కమ్యూనిస్టు చైనాను వ్యతిరేకించటమే అసలు సిసలైన దేశ భక్తిగా కాషాయ సర్టిఫికెట్లు ఇస్తున్న రోజులివి. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పిన సిపిఎంను చైనా అనుకూల పార్టీగా చిత్రించిన వారిలో ఆర్‌ఎస్‌ఎస్‌, అది గతంలో తన రాజకీయ విభాగంగా నడిపిన జనసంఘం ముందు వరుసలో వున్నాయి. అప్పటికీ ఇప్పటికీ సిపిఎం తన వైఖరిని మార్చుకోలేదు. సరిహద్దు గురించి సంప్రదింపులు జరిపేందుకు అర్హత కేంద్రంలో అధికారంలో వున్నవారికి మాత్రమే వుంటుంది. సిపిఎంకు అటువంటి అవకాశం రాలేదు. అంతకు ముందు చైనాతో యుద్ధానికి అవసరమైతే తాము రంగంలోకి వస్తామంటూ వీధులలో ప్రదర్శనలు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు జనతా పార్టీ ముసుగులో ఒకసారి అధికారానికి వచ్చారు, రెండవ సారి బిజెపి పేరుతో, మూడవ సారి కూడా అదే పేరుతో అధికారానికి వచ్చి చేసిందేమిటయ్యా అంటే సామరస్య పూర్వరంగా చైనాతో చర్చలు జరపటమే కాదు, కమ్యూనిస్టుల కంటే ఎక్కువగా చైనా కమ్యూనిస్టుపార్టీతో అధికారిక సంబంధాలు పెట్టుకొని చైనా యాత్రలు చేసి వస్తున్నారు. అదనంగా వ్యాపారలావాదేవీలతో మునిగి తేలుతున్నారు. చైనాతో ఒకవైపు సంబంధాలు నెరుపుతూనే మరోవైపు చైనా వ్యతిరేక రాజకీయాలలో కూడా భాగస్వాములు అవుతున్న పెద్దలు దేశ భక్తులుగా చెలామణి అవుతున్నారా లేదా ? దీనికి నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, ఇతర బిజెపి మిత్రపక్ష నేతలెవరూ మినహాయింపు కాదు. అలాంటపుడు మసూద్‌ అజార్‌ను చైనా కాపాడటం కూడా అదే రాజకీయాలలో అంతర్బాగమే అని అభిప్రాయపడిన వారు చైనా అనుకూలురు, దేశద్రోహులు ఎలా అవుతారు ?

     అవన్నీ కాదు మన ప్రయోజనాలే ముఖ్యం, చైనా అయినా మరొక దేశమైనా మనకు అనుకూలంగా వున్నంత వరకు వుపయోగించుకోవాలి, లేనపుడు వ్యతిరేకించాలి అని అనుకోవటానికి ఎవరికైనా హక్కుంది తప్ప భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారి మీద రంగులు చల్లితే, బురద వేస్తే కుదరదు. దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ అనే అతి తెలివి అనాలి. కొంచెం కటువుగా వున్నప్పటికీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఇలాంటివి పని చెయ్యవు అని చెప్పక తప్పదు. ఇరుగు పొరుగుతో స్నేహం చేసేటపుడు రెండువైపులా స్నేహ ధర్మం పాటించాలి. ఈ పూర్వరంగంలో మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు కాపాడుతోందో వారి వైపు నుంచి కూడా చూడటం అవసరం.

Image result for masood azhar,  Dalai Lama

      మసూద్‌ అజార్‌, ఆ వరుసలో వున్న ఇంకా అనేక మంది టెర్రరిస్టులను అంతర్జాతీయంగా గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవాలనటం నిర్వివాదాంశం. ప్రపంచంలో అనేక దేశాలలో టెర్రరిస్టులు, తిరుగుబాటుదారులు, వేర్పాటు వాదులు ఎందరో వున్నారు. వారు మతాధికారులు, మరొకరు ఎవరైనా కావచ్చు, ఇతర దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. అలాంటి అభ్యంతరాలున్న జాబితాలు ప్రతి దేశంలోనూ వుంటాయి. మనకు చైనాకు మధ్య సరిహద్దు వివాదం వుంది. వాటిలో లడఖ్‌ ప్రాంతంలోని ఆక్సాయ్‌ చిన్‌, ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ వున్నాయి. బ్రిటీష్‌ పాలకులు మనకు తెచ్చిన అనేక సమస్యలలో ఇదొకటి. బ్రిటీష్‌ ఇండియా విదేశాంగ కార్యదర్శిగా పని చేసిన బ్రిటీష్‌ అధికారి హెన్రీ మెక్‌మోహన్‌ 1914లో గీసిన సరిహద్దు లైన్ల ఆధారంగా అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం-టిబెట్‌ ప్రభుత్వం మధ్య ఒక సరిహద్దు ఒప్పందం కుదిరింది. టిబెట్‌కు అలాంటి అధికారం లేదని వాదించిన చైనా ఆ హద్దును తాను గుర్తించటం లేదని అప్పుడే స్పష్టం చేసింది. అయితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారంలోకి వచ్చింది. కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా వుంచటానికి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు కుట్ర చేసినట్లే , సామ్రాజ్యవాదులు టిబెట్‌ను కూడా స్వతంత్ర రాజ్యంగా మార్చేందుకు కుట్ర పన్నారు. మిలిటరీ చర్య ద్వారా కాశ్మీర్‌ను మన దేశంలో అంతర్భాగంగా చేసినట్లే టిబెట్‌ను కూడా చైనా సైనిక చర్య ద్వారా టిబెట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ సమయానికి మనదిగా బ్రిటీష్‌ వారు మ్యాపులలో చూపిన ఆక్సాయ్‌ చిన్‌ చైనాలో, చైనాకు చెందినదిగా పేర్కొన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో వుంది. దాంతో ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అగత్యం కలిగింది. కాశ్మీర్‌ మన దేశ అంతర్బాగమని కమ్యూనిస్టు చైనా గుర్తించినట్లే, టిబెట్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని మన దేశం కూడా గుర్తించింది. అయితే చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, టిబెట్‌ ప్రత్యేక దేశంగా ప్రకటించిన మత పెద్ద దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటును సైతం అనుమతించింది. అయితే దౌత్యపరంగా వాటికి గుర్తింపు ఇవ్వలేదు తప్ప దలైలామా అండ్‌కో చేసే చైనా వ్యతిరేక కార్యక్రమాలు, కార్యకలాపాలన్నింటినీ మన ప్రభుత్వం అనుమతిస్తున్నది.దీనికి కాంగ్రెస్‌, జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి అనే తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు ఒకటిగానే వ్యవహరిస్తున్నాయి. ఒక వివాదాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నవారెవరైనా దానికి కొత్త పీఠ ముడులను వేయకుండా చూడాలి. కానీ పరిణామాలు అలా లేవు.

    ఒక శరణార్ధిగా దలైలామాను మన దేశంలో అనుమతించటం వేరు, ఒక తిరుగుబాటు ప్రవాస ప్రభుత్వ నేతగా కార్యకలాపాలను పదే పదే అనుమతించటాన్ని చైనా సహించదని తెలిసి కూడా అనుమతించటాన్ని ఏమనాలి? మన దేశానికి మసూద్‌ అజార్‌ ఎలాంటి ప్రమాదకర వ్యక్తో చైనాకు దలైలామా అంతకంటే ఎక్కువ ప్రమాదకర వ్యక్తి. 1959లో చైనా ప్రభుత్వంపై విఫల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అప్పటి నుంచి అనేక మంది టిబెట్‌ తిరుగుబాటుదార్లు వుగ్రవాదులుగా మారి అనేక దేశాలలో చైనా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కుట్రలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ చివరి వారంలో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాల పట్టణంలో తొలిసారిగా నాలుగు రోజుల పాటు చైనా వ్యతిరేక సంస్ధల అంతర్జాతీయ సమావేశాన్ని జరుపుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. దలైలామాకు ఎప్పటి నుంచో మన దేశం ఆశ్రయం కల్పించి మద్దతు ఇస్తున్నా బహిరంగంగా అమెరికా, ఇతర దేశాలలో ప్రభుత్వేతర సంస్ధల ముసుగులో పనిచేసే చైనా వ్యతిరేకుల సమావేశాన్ని అనుమతించిన ఘనత నరేంద్రమోడీకే దక్కింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతంగా చైనా అంటోంది. అక్కడి తవాంగ్‌ పట్టణం ఆరవ దలైలామా జన్మ స్ధలం. ఈ ఏడాది మార్చి నెలలో తవాంగ్‌ పర్యటన జరపాలని దలైలామా నిర్ణయించుకున్నారు. చైనాకు అభ్యంతరమని తెలిసి కూడా దేశంలో దలైలామా ఎక్కడికైనా స్వేచ్చగా వెళ్ల వచ్చని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించటం, గతేడాది అరుణాచల్‌ ప్రదేశ్‌లో అమెరికా రాయబారి పర్యటనను అనుమతించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? కాశ్మీర్‌ సమస్యలో మూడో దేశ జోక్యాన్ని మనం అనుమతిస్తామా ?

     దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి మన దేశానికి ఎలాంటి వివాదం, సంబంధం లేదు, మన నౌకలు వెళితే చైనా అడ్డుకున్న వుదంతాలు లేవు. ఆ ప్రాంతంలోని కొన్ని దీవులపై చైనా, జపాన్‌, వియత్నాం, మరికొన్ని దేశాలు వివాదపడుతున్నాయి. ఆ సమస్యను అవే పరిష్కరించుకోవాలి. ఆ ప్రాంతంలో అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం తమ నౌకలు స్వేచ్చగా తిరగటానికి వున్న హక్కును అమలు చేసుకొంటున్నామనే పేరుతో అమెరికా-జపాన్‌ కార్యాచరణ బృందం తమ యుద్ధ నౌకలతో ఆ ప్రాంతంలో 2016 మే-జూలై మధ్య రెండున్నర నెలలపాటు విన్యాసాలు నిర్వహించి చైనాతో కయ్యానికి కాలుదువ్వాయి. వాటితో కలసి జలకాలాడేందుకు మన నాలుగు నౌకలను మోడీ సర్కార్‌ పంపటం ఏమిటి ? అమెరికా, జపాన్‌లకు జూనియర్‌ భాగస్వామిగా మన దేశాన్ని మార్చినట్లా, వాటితో పాటు కలిసి చైనాపై బస్తీమే సవాల్‌ విసిరినట్లా ? జపాన్‌తో అమెరికాకు రక్షణ ఒప్పందం వుంది కనుక అమెరికన్లు ఆ ముసుగులో జోక్యం చేసుకుంటున్నారు. మనకు సంబంధం ఏమిటి ? ఎవరిని సంతోష పెట్టటానికి ఈ పని చేసినట్లు ? మసూద్‌ అజార్‌ విషయంలో చైనా అనుసరిస్తున్నదానికి దెబ్బకు దెబ్బ అని మన దేశంలోని చైనా వ్యతిరేకులు వాదించ వచ్చు. అటువంటి వారికి మసూద్‌తో సహా ఇతర వివాదాలపై చైనాను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది ? మనం చైనా వ్యతిరేకికి ఆశ్రయం ఇచ్చిన మాదిరి మన వ్యతిరేకి మసూద్‌ అజార్‌కు చైనా ఆశ్రయం కల్పించలేదు, అలాంటి వారితో మనకు వ్యతిరేకంగా తన గడ్డపై సభల నిర్వహణకు ఏర్పాటు చేయలేదు. మసూద్‌ అజార్‌ను వుగ్రవాదిగా తీర్మానించబోయే ముందు ఆ సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకుంటున్నారేమో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చైనా కోరింది తప్ప అతను తీవ్రవాది కాదని గానీ అవుననిగానీ చెప్పలేదు. అయితే ఆ వైఖరి ఆచరణలో తీర్మానానికి అడ్డుపడినట్లే అన్నది స్పష్టం. ఇటువంటి వైఖరులతో సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తున్నామని వుభయ దేశాలు చేసే ప్రకటనలకు అర్ధం వుండదు. ఎవరు ముందు తప్పు చేశారు, ఎవరు తరువాత చేశారు అనే వాద ప్రతివాదాలలోకి పోతే పరిష్కారం కుదరదు.

    గత పాతిక సంవత్సరాలలో ముఖ్యంగా గత పది సంవత్సరాలలో మన దేశాన్ని అమెరికాకు దగ్గరగా తీసుకుపోతున్న కొద్దీ ఆ మేరకు పాకిస్థాన్‌ చైనాకు దగ్గర అవుతోంది. గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య వున్న విబేధాలను మన పాలకవర్గం వుపయోగించుకొని లబ్ది పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా-అమెరికా మధ్య వున్న విబేధాలను వుపయోగించుకొని పాకిస్థాన్‌ అదేపని చేస్తోందన్నది స్పష్టం. ఒకవైపు పాకిస్థాన్‌ అమెరికన్లతో దగ్గర సంబంధాలను కొనసాగిస్తూనే చైనాతో రోజు రోజుకూ సంబంధాలను పెంచుకొంటోంది. మనకు చైనాతో వివాదాలు పెంచుకొని అమెరికాతో దగ్గర కావటం లాభమా, చైనాతో వివాదాలను తగ్గించుకొని లాభపడటం మంచిదా అని ఆలోచించుకోవాలి. మనకు, పాకిస్తాన్‌కు ఆయుధాలు విక్రయించి లబ్ది పొందుతున్న అమెరికా ఇప్పుడు చైనాతో మరోసారి మన వివాదాలు పెంచుకోవాలని కోరుకుంటోంది. మన దేశానికి వారి ఆయుధాలను మరింతగా విక్రయించాలంటే చైనాతో లడాయి పెరగాలి. అప్పుడే వారి ఆయుధ పరిశ్రమలు మూడు పూవులు ఆరు ఆయుధాలుగా వర్ధిల్లుతాయి. ఈ పరిణామాల పూర్వరంగాన్ని అర్ధం చేసుకుంటే చైనా తిరుగుబాటుదారుడు దలైలామాను మన దేశం ఎందుకు సమర్ధిస్తుందో, వుగ్రవాది మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు రక్షిస్తుందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కల్పిత వార్తల సంవత్సరంగా ముగిసిన 2016 !

31 Saturday Dec 2016

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

2016 year of fake news, fake news, fake news stories, Misinformer, whatsapp

సత్య

    నిజం నాలుగు వేసే లోగా అవాస్తవం అరవైై అంగల దూరం ప్రయాణిస్తున్న కాలమిది. ప్రపంచవ్యాపితంగా కల్పిత, నకిలీ వార్తలు ప్రచారం, వేగం రోజు రోజుకూ పుంజుకుంటోంది. అలాంటి వాటిని సృష్టించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు కూడా రంగంలోకి వస్తున్నాయన్నది నమ్మలేని నిజం. ఒక వస్తువు చివరి వినియోగదారుడికి చేరక ముందే దాని నకిలీ తిష్టవేస్తున్నట్లుగానే నిజమైన వార్తలతో పాటు కల్పిత వార్తలను కూడా అమ్మి సొమ్ము చేసుకోవటం వర్తమాన వ్యాపారాలలో ఒకటిగా మారింది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత లోక్‌సభ ఎన్నిలకు ముందు నుంచీ మన దేశంలో ఈ వ్యాపారం తామరతంపరగా పెరిగింది. ఒక సాంస్కృతిక సంస్ధ ముసుగులో పని చేస్తున్న వారు ఒక పెద్ద కల్పిత, నకిలీ, పుకార్ల కర్మాగారాన్నే పెట్టారు. దానికి అనుబంధంగా అనేక చిన్న ఫ్యాక్టరీలు నెలకొల్పారు. వందల మందిని నియమించి కోట్లాది రూపాయల వేతనాలతో నడుపుతున్నారు. తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలు, వాటి నేతలు, తమ పట్ల విమర్శనాత్మక వైఖరిని కలిగి వున్న జర్నలిస్టులు, మేథావులు, ఇతరులను అన్ని రకాలుగా తప్పుడు ప్రచారాలతో, ఇతర విధాలుగా దెబ్బతీయటం నిత్య కార్యక్రమం. వీటి బండారాన్ని జనం తెలుసుకొనే సమయానికి అవి చేయాల్సిన పని, ప్రయోజనం, హాని చేస్తాయి. ఒక వార్త నిజమా కాదా అని నిర్ధారణ చేసుకొనే అవకాశం, తీరిక అందరికీ వుండదనే బలహీనతను వాటి సృష్టి కర్తలు సొమ్ము చేసుకుంటున్నారు. తాము నమ్మిన వార్త అవాస్తవమని తెలుసుకున్నవారు నిజమైన వార్తలను కూడా ఒక పట్టాన నమ్మరు. ప్రతిదానినీ అనుమానిస్తూ వుంటారు. స్వార్ధశక్తులకు కావాల్సింది కూడా అదే. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, సారా, కులం, మతం, మీడియాలో డబ్బిచ్చి వార్తలు రాయించుకోవటం వంటి ప్రలోభాలతో పాటు కల్పిత వార్తలు కూడా ఒకటిగా చేరాయని 2016 మరింతగా నిరూపించింది. అందుకే ఒక సంస్థ ముగిసిన ఏటిని అబద్దాల సంవత్సరంగా ప్రకటించింది.

    ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ ప్రపంచంలో కల్పిత వార్తలకు మన దేశం ఒక ప్రధాన మార్కెట్‌గా మారుతోంది. దేశంలో 16కోట్ల వాట్సాప్‌లుంటే నెలకు వంద కోట్ల సార్లు వినియోగిస్తున్నారని అంచనా. ఫేస్‌ బుక్‌ ఖాతాలున్నవారు 15 కోట్లు, ట్విటర్‌లో 2.2కోట్ల మంది వున్నారని చెబుతున్నారు. వీటి ప్రభావం ఎంతగా వుందంటే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా వారు కూడా తామెక్కడ వెనుకబడిపోతామో అన్న భయంతో సోషల్‌ మీడియాలో ప్రచారంలో పెడుతున్న చెత్తను స్వీకరించి పాఠకులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామం. గతేడాది జనాన్ని బురిడీ కొట్టించిన అనేక వార్తలలో కొన్నింటిని చూద్దాం.

    ‘నరేంద్రమోడీని ప్రపంచ వుత్తమ ప్రధానిగా యునెస్కో ప్రకటించింది’ ఇదొక కల్పిత వార్త.జూన్‌ నెలలో వాట్సాప్‌ గ్రూపులలో ప్రారంభమై ఇతర సోషల్‌ మీడియాలో చెలరేగింది. ఐక్యరాజ్యసమితి గానీ, దాని ఆధ్వర్యంలో నడిచే యునెస్కో వంటి సంస్ధలుగా గానీ అలాంటి అవార్డులు ఇవ్వవు, అయినా సరే అది ఇంకా తిరుగుతూనే వుంది. అలాగే జనగణమనను కూడా వుత్తమ జాతీయ గీతంగా అదే సంస్ధ ప్రకటించిందన్న తప్పుడు వార్త గురించి కూడా తెలిసిందే. ఇది 2008 నుంచి తిరుగుతోంది. ఒకసారి అందుకున్నవారికి అనేక సార్లు వచ్చి వుంటుంది. పెద్ద నోట్ల రద్దుతో జనం పడుతున్న ఇబ్బందులకు తోడు రెండువేల రూపాయల నోటు వచ్చి చిల్లర సమస్యను జత చేసి మరింత చికాకు కల్పించటాన్ని అందరం చూశాము. సరిగ్గా ఈ సమయంలోనే మన రెండు వేల రూపాయల నోటు ప్రపంచంలో అత్యంత వుత్తమ కరెన్సీ అని యునెస్కో కితాబు ఇచ్చిందనే సమాచారం వాట్సాప్‌ జనాలను వూపేసింది. ఇప్పటికింకా మీకు రాకపోతే త్వరలో వస్తుంది. ఇలాంటి వాటిని నిజమని నమ్మి ఇతరులకు చేరవేసే మన వాట్సాప్‌ గ్రూపు వినియోగదారుల తెలివితక్కువ తనం గురించి బిబిసి ప్రపంచానికంతటికీ తెలియచేసింది.

   ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టను పెంచేందుకు రంగంలోకి దించిన మరొక వార్త రెండువేల రూపాయల నోటుకు జిపిఎస్‌ చిప్‌ అమర్చారన్నది. న్యూఢిల్లీలోని జెఎన్‌యు విద్యార్ధులు దేశ వ్యతిరేక, పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేశారంటూ సృష్టించిన కల్పిత వీడియోలను పదే పదే ప్రచారం చేసిన జీ న్యూస్‌లోని బిజెపి భక్తుడైన సీనియర్‌ ఎడిటర్‌ సుధీర్‌ చౌదరి రెండువేల నోటుకు జిపిఎస్‌ చిప్‌ అమర్చారనే తప్పుడు కధనాన్ని కూడా జీ న్యూస్‌లో ప్రసారం, ప్రచారం చేశాడు. ఆ నోటును వుపగ్రహాలు కనుగొంటాయని, 120మీటర్ల లోతున భూ గర్బంలో దాచినా సిగ్నల్స్‌ ద్వారా పట్టుకోవచ్చునని ఇదంతా నరేంద్రమోడీ ఘనత అనే అర్ధం వచ్చేట్లుగా కట్టుకధలు చెప్పాడు. దాంతో మిగతా ఛానల్స్‌ కూడా దానిని కాపీ చేశాయి, కొత్త అంశాలను కలిపి చెప్పాయి. 15 ప్రోటాన్స్‌, 17 న్యూట్రాన్స్‌ వున్న రేడియో యాక్టివ్‌ ఐసోటోప్‌లు కొత్త నోట్లలో వున్నాయని కూడా ప్రచారం చేశారు. నిజమే అని వాట్సాప్‌ వీరులు ఎలా వ్యాపింప చేసిందీ చూశాము. నరేంద్రమోడీ, బిజెపి భక్తులు దానిని పెద్ద ఎత్తున వ్యాపింప చేశారు. చివరికది అవాస్తవమని తేలింది. మోడీ సర్కార్‌ నుంచి ప్రశంసలు లేదా ప్రతిఫలం పొందేందుకు ఎఎన్‌ఐ వార్తా సంస్ధ కూడా కల్పిత వార్తలను తయారు చేసి దేశం మీదకు వదిలింది. తన వుద్యోగి ఒకడిని సామాన్యుడి మాదిరి ఒక టీస్టాల్లో నిలబెట్టి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు చెప్పించింది. సామాజిక మీడియాలో కొంత మంది అతనిని గుర్తు పట్టి బండారాన్ని బయటపెట్టటంతో ఆ వార్తా సంస్ధ పరువు మురికి గంగలో కలిసింది.

    వాట్సాప్‌లోని ఫొటోలను ఐస్‌ వుగ్రవాదులు దుర్వినియోగం చేసే అవకాశం వున్నందున వెంటనే వాటిని తొలగించాలంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌ పేరుతో ప్రచారం జరిగింది. ఒక 20-25 రోజుల పాటు ఫొటోలు పెట్ట వద్దని ఈ లోగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని వాట్సాప్‌ సిఇఓ చెప్పినట్లుగా దాని కొనసాగింపుగా మరో పుకారు షికారు చేసింది. పది రూపాయల నాణాన్ని రిజర్వు బ్యాంకు రద్దు చేసిందన్న ప్రచారం కూడా ఈ కాలంలోనే వాట్సాప్‌లో తిరిగింది. అనేక చోట్ల దుకాణదారులు వాటిని తీసుకొనేందుకు తిరస్కరించారు. నిరాకరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రిజర్వు బ్యాంకు ప్రకటించాల్సి వచ్చింది.

   తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత కుమార్తె అని, అమెరికాలో రహస్యంగా జీవిస్తోందంటూ ఒక ఫొటో వాట్సాప్‌, సోషల్‌ మీడియాలో తిరిగింది. అయితే అది అవాస్తవమని, ఆ యువతి ఆస్ట్రేలియాలో వుంటోందని, జయలలితకు సంబంధం లేదని తరువాత తేలింది. జయలలిత మరణించిన తరువాత దీనిని సృష్టించారు.

    మన దేశానికి దాదాపు ఎనిమిదివేల కిలోమీటర్ల సముద్రతీరం, పుష్కలంగా వుప్పు తయారీకి అవకాశం వున్నప్పటికీ దేశంలో వుప్పు కొరత ఏర్పడిందన్న వాట్సాప్‌ మెసేజ్‌ రాగానే నిజమనుకొని జనం ఎగబడి కిలో వుప్పును మూడు, నాలుగు వందల రూపాయల వరకు ధర చెల్లించి కొనుగోలు చేయటాన్ని చూశాము. కాన్పూరులో వుప్పుకోసం ఒక దుకాణాన్ని లూటీ చేసేందుకు ఎగబడిన జనాన్ని చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీలో ఒక మహిళ మరణించింది. తన నోట్ల రద్దు చర్యతో దెబ్బతిన్నవారే ఈ పుకార్లు పుట్టించారని నరేంద్రమోడీ ఆరోపించారు.

    ప్రధాని నరేంద్రమోడీకి మద్దతు తెలుపుతూ భారత ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఒక వటవృక్షంలా తయారై దేశాన్ని, జనాన్ని ఎదగనివ్వలేదంటూ మన దేశంలో బిబిసి విలేకరిగా పనిచేసిన మార్క్‌తులీ వ్యాఖ్యానించారంటూ ఒక నకిలీ వార్తను పుట్టించారు. తానలాంటి వ్యాఖ్య చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.

    అంతర్జాతీయ విషయాలకు వస్తే డిసెంబరు నెలలో వచ్చిన ఒక వార్త పాకిస్ధాన్‌ మంత్రి ఇజ్రాయెల్‌కు హెచ్చరిక చేయటానికి దారి తీసింది. ఏదో ఒక సాకుతో పాకిస్తాన్‌ గనుక సిరియాకు సైన్యాన్ని పంపితే తాము పాక్‌పై అణుదాడి చేయగలమని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి బెదిరించినట్లు ఒక వార్త వచ్చింది. అది ఎంత వరకు నిజమో తేల్చుకోకుండానే పాక్‌ మంత్రి ఆసిఫ్‌ ట్విటర్‌ ద్వారా ఒక ప్రకటన చేస్తూ తమ దేశం కూడా అణ్వస్త్ర దేశమే అని హెచ్చరిస్తూ వ్యాఖ్యానించారు. తరువాత ఇజ్రాయెల్‌ మంత్రి అలాంటి ప్రకటన చేయలేదని వెల్లడైంది. నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కల్పిత వార్తల తయారీ కేంద్రాలు, కార్మికులు ఓవర్‌టైమ్‌ పని చేశారంటే అతిశయోక్తి కాదు. అందుకే పొలైటీ ఫాక్ట్‌ అనే వెబ్‌సైట్‌ 2016ను అబద్దాల సంవత్సరంగా వర్ణించింది. కల్పిత వార్తలను తామరతంపరగా తయారు చేయటమే కాదు, వాటిని జనం నమ్మటం కూడా ఆందోళన కలిగించే అంశమే. అమెరికా ఎన్నికలకు మూడునెలల ముందు కాలంలో ఓ ఇరవై కల్పిత వార్తలు పెద్ద ఎత్తున ఆదరణ పొందాయి. వాటిపై వ్యాఖ్యలు, ఇష్టపడిన(లైక్‌), పంచుకున్న (షేర్‌) వారి సంఖ్య 8.71 మిలియన్లని తేలింది. ఇదే సమయంలో అమెరికాలోని అగ్రశ్రేణి పత్రికలుగా పరిగణనలో వున్న వాటిలో వచ్చిన 20 ముఖ్య వార్తలపై స్పందించిన వారు 7.36 మిలియన్ల మంది మాత్రమే వున్నారు. అంటే సామాజిక మాధ్యమాలలో కల్పిత వార్తలు ఎంతగా ప్రాచుర్యంలో వున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

     అమెరికా అధ్యక్షుడిగా పచ్చిమితవాది డోనాల్డ్‌ ట్రంప్‌ గెలవటంలో కల్పిత వార్తలు కూడా ముఖ్య పాత్ర వహించాయంటే అతిశయోక్తి కాదు. దీనిని గుర్తించే వచ్చే ఏడాది తమ దేశంలో జరగనున్న ఎన్నికలలో ఓటర్లు కల్పిత వార్తల బారిన పడకుండా చూసేందుకు కల్పిత వార్తల నుంచి రక్షణకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఈ కేంద్రం అలాంటి వార్తల గురించి ఓటర్లను విద్యావంతులను గావిస్తుందట. ముఖ్యంగా రష్యన్‌, టర్కిష్‌ భాష మాట్లాడే జర్మన్‌ పౌరులు ఈ కల్పిత వార్తల బారిన ఎక్కువగా పడే అవకాశం వుందని భావిస్తున్నారు. కల్పిత వార్తలుగా తేలిన వాటిని తమ వేదికలపై నుంచి తొలగించని సామాజిక మీడియా సంస్ధలకు జరిమానా విధించాలని జర్మన్‌ పార్లమెంట్‌ సభ్యులు ఇప్పటికే డిమాండ్‌ చేశారు. ఫ్రాన్స్‌లో కూడా వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో కల్పిత వార్తల ధాటి పెరగవచ్చని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి.

     మన దేశంతో సహా ప్రపంచంలో అనేక చోట్ల ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటానికి కల్పిత వార్తలను తయారు చేస్తున్నారు. వలస వచ్చిన శరణార్ధి బెర్లిన్‌ నగరంలో 13 సంవత్సరాల రష్యన్‌ జాతికి చెందిన ఒక బాలికను అపహరించి అత్యాచారం చేసినట్లు ఒక వార్త వచ్చింది. ఇంకేముంది రష్యాలోని ముస్లిం వ్యతిరేక మితవాద శక్తులు చెలరేగిపోయి అనేక చోట్ల ప్రదర్శనలు చేశారు. ఆ దెబ్బకు తట్టుకోలేని రష్యన్‌ ప్రభుత్వం ఈ వుదంతాన్ని మూసిపెట్టేందుకు జర్మన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించేవరకు వెళ్లింది.

    అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగరంలో కామెట్‌ పింగ్‌ పాంగ్‌ అనే ఒక పీజా దుకాణ సెల్లార్‌లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌ అనుచరులు బాలలతో ఒక వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఒక వార్తను వదిలారు. అది నిజమే అని నమ్మిన ఒక వ్యక్తి అక్కడి బాలలను రక్షించేందుకు వచ్చి పీజా కేంద్రంలో కాల్పులు జరిపాడు. అయితే ఎవరూ గాయపడలేదు. తీరా అక్కడ సెల్లార్‌ లేదు, వ్యభిచార కేంద్రం లేదని తెలుసుకొని పోలీసులకు లొంగి పోయాడు. హిల్లరీ క్లింటన్‌ ఐఎస్‌ తీవ్రవాదులకు నిధులు అందచేసినట్లు, డోనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్ధిత్వాన్ని పోప్‌ ఫ్రాన్సిస్‌ బలపరిచినట్లు , షరియా చట్టాన్ని ఫ్లోరిడా రాష్ట్రంలో అమలు జరపాలని డెమోక్రటిక్‌ పార్టీ కోరినట్లు కల్పిత వార్తలు వచ్చాయి. ఇవన్నీ రిపబ్లికన్‌ పార్టీ వారు డబ్బిచ్చి ప్రత్యర్ధిని దెబ్బతీసేందుకు చేసిన అవాంఛనీయ వ్యవహారాలని వేరే చెప్పనవసరం లేదు.

     కల్పిత వార్తల తయారీకి వాటితో లబ్ది పొందే వారి నుంచి డబ్బు తీసుకోవటంతో పాటు వాటిని చదివే, చూసే పాఠకులను ఆకర్షించేందుకు ఆ వార్తలలో పెట్టే ప్రకటనల ద్వారా కూడా తయారీదారులు, వాటిని జనానికి పంచే 180 కోట్ల వినియోగదారులున్న ఫేస్‌బుక్‌, తదితర వెబ్‌సైట్ల వారికి కాసుల వర్షం కురుస్తోంది.అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ శివార్లలో కల్పిత వార్తల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న జెస్టిన్‌ కోలెర్‌ తాను ఆన్‌లైన్‌ ప్రకటనల ద్వారా నెలకు పది నుంచి 30వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు అంగీకరించాడు. అమెరికా ఎన్నికలలో కల్పిత వార్తలతో డబ్బు సంపాదిస్తున్నవారిని గమనించిన తరువాత పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లలో ఒకటైన జార్జియాకు చెందిన ఒక కంప్యూటర్‌ విద్యార్ధి డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా కల్పిత వార్తలు తయారు చేస్తే బాగా గిట్టుబాటు అవుతోందని గ్రహించి ఆమేరకు అందుకు పూనుకోగా ఒక నెలలో తనకు గరిష్టంగా ఆరువేల డాలర్లు వచ్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికతో చెప్పాడు. కల్పిత వార్తల వేదికగా మారినట్లు తీవ్ర విమర్శలు రావటంతో గూగుల్‌, ఫేస్‌బుక్‌ యాజమాన్యం వాటి నివారణకు తాము కొన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.

     సాంప్రదాయక మీడియా, సామాజిక మీడియా తీరుతెన్నులను పరిశీలిస్తున్నవారు 2017లో కూడా ప్రజలపై కల్పిత వార్తల దాడి ఎక్కువగానే వుండవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో వాటి నిరోధం, జనానికి చైతన్యం కలిగించే చర్యలపై కూడా దృష్టి సారించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిర్లా, సహారా డైరీలు – జవాబు లేని ప్రశ్నలు !

24 Saturday Dec 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

birla sahara diaries, BJP, cbi, CORRUPTION, it, Modi

ఎం కోటేశ్వరరావు

    తన దగ్గరున్న సమాచారం గనుక బయట పెడితే ఏదో జరిగి పోతుందన్నట్లుగా రాహుల్‌ గాంధీ బిల్డప్‌ ఇవ్వటం, అది తుస్సుమనటం తెలిసిందే. చీకట్లను పారద్రోలుతూ వెలుగుతుందనుకున్న ఒక మతాబా, బాగా పేలుతుందనుకున్న దీపావళి బాంబు ఒక్కోసారి తుస్సుమనొచ్చు. అయితే అవి తుస్సుమన్నప్పటికీ వాటి అవశేషాలను తొలగించి వీధిని శుభ్రం చేయాల్సిన బాధ్యత గృహస్తు మీదో స్ధానిక సంస్ధల పారిశుధ్య సిబ్బందిమీదో వుంటుంది. ఇప్పుడు రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలు, ఆ మాటకు వస్తే అవి ఆయన కొత్తగా కనుగొన్నవీ కాదు, తాజాగా బయటపడినవీ కాదు, ఇప్పటికే ప్రముఖ లాయర్‌ ప్రశాంత భూషన్‌ కోర్టులో వేసిన కేసులోనివే. ఇక్కడ రెండు అంశాలున్నాయి.

    ఒకటి నరేంద్రమోడీని సమర్ధిస్తూ బిజెపి నేతలు అత్యంత బలహీనమైన వాదనలు చేశారు. రెండు ఆయన స్వయంగా రాహుల్‌ గాంధీని అపహాస్యం చేశారు. తమ నేత గంగ అంతటి స్వచ్చమైన ముత్యం అన్నది ఒకటి. గంగతో సహా ఏ నది అయినా పుట్టుక స్థానంలో ఎంతో స్వచ్చంగా వుంటుంది. తరువాతే కలుషితంగా మారుతోంది. హిమాలయాల నుంచి బయటపడిన తరువాత గంగ ఎంత కాలుష్యంగా మారిందో మోడీ సర్కార్‌ ప్రకటించిన గంగ శుద్ధి ప్రణాళిక తెలిసిందే.ఎవరైనా పుట్టినపుడు, బాల్యంలో ఎలాంటి మచ్చ లేకుండా వుంటారు. పెరిగేకొద్దీ కథ ప్రారంభం అవుతుంది.మోడీ అయినా అంతే. డైరీల నిగ్గు తేలే వరకు సహారా, బిర్లాల దగ్గర ముడుపులు తన స్వంతానికి తీసుకున్నారా పార్టీ కోసమా అన్నది వేరే విషయం.

    పారిశ్రామిక సంస్ధలు, వ్యక్తులు ఇచ్చే విరాళాలు లేదా ముడుపులు ఎక్కడా ఖాతాలలో పక్కాగా రసీదుల వివరాలతో సహా రాయరు. డైరీలలోనో మరొక చోటో పొట్టి లేదా నిక్‌నేమ్స్‌ పేరుతోనో నమోదు చేస్తారు. ఎందుకంటే ఆ పని చేసే వారు ఆ సొమ్ము స్వంతదారులకు జవాబుదారీగా ఏదో ఒక ఆధారాన్ని చూపాలి. నమ్మకస్తుల ద్వారానే అలాంటి పని చేయిస్తారు. వుదాహరణకు రెండు దశాబ్దాల క్రితం హవాలా కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. అది కూడా ఎస్‌కె జైన్‌ అనే హవాలా వ్యాపారి నమోదు చేసిన డైరీల ఆధారంగా అని ఇక్కడ గుర్తు చేయాలి. ఆ డైరీలలో వామపక్షాలు తప్ప కాంగ్రెస్‌,బజెపి, జనతాదళ్‌ తదితర 18 పార్టీల నేతల పేర్లు వున్నాయి. ఆ వివరాలు బయటకు రాగానే ఆ జాబితాలో ఒకరైన బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ తన లోక్‌సభ సభ్వత్యానికి రాజీనామా చేసి ఆ మచ్చ తొలిగిన తరువాత గానీ తిరిగి సభలోకి అడుగు పెట్టనని ప్రకటించి నాడు ప్రశంసలు పొందారు. దాంతో అనేక మంది కాంగ్రెస్‌, బిజెపి నేతలు కూడా పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా ఆ కేసులో తేలిందేమీ లేదు, నిర్దోషులుగా ప్రకటించారు.

   చిత్రం ఏమిటంటే అద్వానీ శిశ్యుషుడినని, ఆయన సభ్యుడిగా వున్న మార్గదర్శక మండలి సలహామేరకు పని చేస్తున్నానని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ రాజీనామా సంగతి తరువాత, ముందసలు ఆ డైరీల సంగతి నిగ్గుదేల్చమని దర్యాప్తు సంస్ధలను ఆదేశించటానికి కూడా ముందుకు రాలేదెందున్నది అసలు ప్రశ్న. హవాలా డైరీలలో, సహారా, బిర్లా డైరీలలో బిజెపితో పాటు కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలందరూ వున్నారు. అందుకే తేలు కుట్టిన దొంగ మాదిరి మోడీ సర్కార్‌ మౌనంగా వుండిపోయిందా ? సరే వెంకయ్య నాయుడు తన పాండిత్యాన్ని మొత్తాన్ని వుపయోగించి ఆ డైరీలు బయట పడింది కాంగ్రెస్‌ హయాంలో అప్పుడెందుకు వాటి గురించి చెప్పలేదని చెట్టుకింద లాయర్‌ మాదిరి ప్రశ్న వేశారు. ఆ డైరీలు 2013 అక్టోబరులో, 2014 నవంబరులో నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక సిబిఐ, ఆదాయపన్ను శాఖ దాడులలో బయట పడ్డాయి.తమకు దొరికిన వాటిపై ఏ చర్య తీసుకోవాలన్నది ఆ సంస్ధల విధి. తమకు దొరికిన వాటి గురించి ఎటూ తేల్చకుండా మీన మేషాలు లెక్కించటాన్ని చూసిన తరువాత కామన్‌ కాజ్‌ అనే ఒక స్వచ్చంద సంస్ద 2015లో సుప్రీం కోర్టుకు వెళ్లింది.అంటే సిబిఐ, ఆదాయపన్ను శాఖలపై తెరవెనుక నుంచి వత్తిడి వచ్చిందన్నది స్పష్టం. ‘అవినీతి వ్యతిరేక నరేంద్రమోడీ హయాం ‘ ఇలా జరగటం ఏమిటి ? గంగ మాదిరి కాలుష్యం సోకిందా ?

     ఈ డైరీలపై దాఖలైన కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల తర్కం అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. డైరీలలో పేర్లు వున్నంత మాత్రాన వాటిపై విచారించటం కుదరదని,ఇలాంటి వాటిపై దర్యాప్తులకు ఆదేశిస్తే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయంటూ ఎవరైనా ఒకరు ప్రధానికి ఇంత డబ్బు ముట్టచెప్పామని తమ డైరీలలో రాసుకున్నంత మాత్రాన ఎలా విచారణ జరపాలి అంటూ మరింత స్పష్టమైన సాక్ష్యాలతో రావాలని చెప్పి చింతకాయల రవి సినిమాలో ప్రతిదానికీ సర్టిఫికెట్‌ల ఫ్రూఫ్‌ కావాలనే పాత్రధారిని గుర్తుకు తెచ్చింది. భవిష్యత్‌లో అక్రమంగా నిధులు ఇచ్చేవారు, పుచ్చుకొనే వారు కేసులు, శిక్షల నుంచి తప్పించుకొనేందుకు అనుసరించాల్సిన సులువైన పద్దతిని చెప్పినట్లు , తప్పించుకొనేందుకు అవసరమైన తర్కాన్ని సిద్ధం చేసినట్లుగా వుంది. బిర్లా డైరీలను నమోదు చేసిన వారు తమకు హవాలా మార్గంలో నగదు వస్తుందని, దానిని తమ యజమానుల ఆదేశాల మేరకు రాజకీయ నేతలకు అంద చేస్తాని విచారణలో చెప్పారు. బిర్లా కంపెనీ చైర్మన్‌ సుబేందు అమితాబ్‌ కూడా విచారణలో గుజరాత్‌ సిఎంకు 25 కోట్లు అందచేసినట్లు అంగీకరించారు. అయితే గుజరాత్‌ సిఎం అంటే గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌ అని చెప్పారు. సి,ఎం అనే పదాలకు ఆ కంపెనీ పేరుకు పొంతన కుదరటం లేదు. దాని గురించి అడిగితే అదంతే అనటం తప్ప సరైన వివరణ ఇవ్వలేదు. పోనీ అక్రమ పద్దతుల్లో నగదు తీసుకున్న సదరు కంపెనీపై చట్టపరమైన చర్యలేమన్నా తీసుకున్నారా ? అదీ లేదు. దీని వాస్తవాలను తేల్చాల్సింది ఎవరు? అందుకే ఆ డైరీలపై దర్యాప్తు జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు న్యాయవాది ప్రశాంత భూషన్‌ చెబుతున్నారు. హవాలా కేసులో దొరికిన డైరీలలో పొట్టి పేర్లు మాత్రమే వున్నాయి. అయినప్పటికీ దర్యాప్తు జరపటానికి అవి చాలని అప్పుడు సుప్రీం కోర్టు చెప్పింది. ఇప్పుడు పేర్లు, డైరీలు మరింత స్పష్టంగా వున్నప్పటికీ మరింత స్పష్టమైన ఆధారాలు కావాలని అదే కోర్టు వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలపై రాజకీయంగా అపహాస్యం చేయవచ్చు, సామాజిక మీడియాలోని తన భక్తులు, సైన్యానికి వుత్సాహం తెప్పించవచ్చు. అంతటితో అది అయిపోదు, కోర్టు లేదా మోడీ సర్కార్‌ దీనిపై ఏదో ఒక వైఖరిని వెల్లడించకతప్పదు. ఆ డైరీల నిగ్గు తేల్చనంత వరకు మోడీవైపు వేలు చూపుతూనే వుంటారు .

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబును ఆవహించిన గురజాడ గిరీశం !

21 Wednesday Dec 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

chandrababu naidu, Demonetisation, demonetisation worries, gurajada girisam

ఎంకెఆర్‌

    డామిట్‌ కథ అడ్డం తిరిగింది. పెద్ద నోట్ల రద్దు గురించి చంద్రబాబు నాయుడు కొత్త పల్లవి అందుకున్నారు. ‘ఓపినీయన్స్‌ అప్పుడప్పుడూ చేంజ్‌ చేస్తుంటేనే కానీ పొలిటీషియన్‌ కానేరడు !'( అభిప్రాయాలను అప్పుడప్పుడూ మార్చుకుంటూ వుంటేనే కానీ రాజకీయవేత్త కానేరడు) గురజాడ అప్పారావు పంతులు గారు గిరీశం పాత్ర ద్వారా ఎంత చక్కగా చెప్పారు. 1862-1915 మధ్య కేవలం 53 సంవత్సరాలు మాత్రమే జీవించిన గురజాడ ఆ నాటి రాజకీయ నేతల తీరు తెన్నులను చూసే అలాంటి వ్యాఖ్య చేశారంటే నేడే గనుక ఆయన వుండి వుంటే బాబోయ్‌ ఇంకేమైనా వుందా !

    ‘ ఒక ప్రముఖ రచయిత రాసిన ప్రతిదానినీ మెచ్చుకోవాలని నమ్మే అలవాటు తెలివి తక్కువ వారికి వుంటుంది. నా వరకైతే నాకు సంతృప్తినిచ్చే దానినే నేను చదువుతాను మరియు నా అభిరుచులకు తగినదానినే అభిమానిస్తాను’ అన్నాడు ప్రముఖ ప్రెంచి రచయిత ఓల్టేర్‌. చంద్రబాబు, నరేంద్రమోడీ నోటి నుంచి ఏది వస్తే అదే ప్రామాణికం అని నమ్మేవారు ఈ మాటలు తమకు ఎంతవరకు సరిపోతాయో ఆలోచించుకోవటం మంచిది. పెద్ద నోట్ల రద్దు గురించి కేంద్రానికి సిఫార్సు చేసిందే తానే అంటూ కేంద్రానికి రాసిన లేఖ గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చి నరేంద్రమోడీ ప్రశంసలు అందుకొనేందుకు ప్రయత్నించటాన్ని లోకమంతా చూసింది. ఇప్పుడు ఆ నిర్ణయం తెచ్చిన సమస్యలు, పర్యవసానాలను చూసి పెద్ద నోట్ల రద్దు తాను కోరుకున్నది కాదని, తలెత్తిన సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలియటం లేదని రోజంతా ఆలోచించినా తట్టటం లేదని సెలవిచ్చారు. బ్రూటస్‌ నువ్వు కూడానా ! అని స్నేహితుడిగా వుండి వెన్నుపోటు పొడిచిన బ్రూటస్‌ గురించి రోమన్‌ చక్రవర్తి జూలియస్‌ సీజర్‌ వాపోయినట్లుగా బహుశా గత రాత్రి నరేంద్రమోడీ కూడా ఒంటరిగానో లేక అమిత్‌ షా, వెంకయ్య నాయుడి వంటి తన నీడలను పిలిపించుకొనే చంద్రబాబు నాయుడి గురించి అనుకొని వుండి వుండాలి.

    సరే చంద్రబాబు నాయుడంటే పోలవరం తాత్కాలిక డామ్‌ మట్టి తీయిస్తూ, కాంక్రీట్‌ పోయిస్తూ ఆ పనేమీ లేకపోతే నేను నిదురపోను మిమ్మల్ని నిదురపోనివ్వనంటూ అధికారులతో ఏదో ఒక ప్రయోజనం లేని దాని గురించి సమీక్షపేరుతో తీరిక లేకుండా వుండి వుంటారనుకుందాం. లక్షల రూపాయల ప్రజాధనం పందారం చేస్తూ ఆయన నియమించుకున్న సలహాదారులేం చేస్తున్నట్లు ? రాజు మెచ్చిందే రంభ అన్నట్లుగా చంద్రబాబు మనసెరిగి నోట్ల రద్దు అంతా సజావుగానే జరిగిపోతుందంటూ, వాస్తవ పరిస్థితిని వివరించకుండా తప్పుదారి పట్టించి వుంటారా ?

      ‘నోట్ల రద్దు చిన్న ప్రయోజనాల కంటే మోడీ వ్యూహం ఎంతో సాహసోపేతమైనది’ అనే శీర్షికతో ఆర్‌ జగన్నాధన్‌ అనే ఆయన భక్తుడు ఒకరు రాసిన వ్యాసంలోని అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. నోట్ల రద్దు వలన ఎంతో మేలు జరుగుతుంది, దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనం అని ఇప్పటికీ ఒకవైపు ప్రచారం సాగుతుంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఈ భక్తుడు రాసిన దానికి చిన్న ప్రయోజనాలని పేరు పెట్టటం అంటే ముందే చెప్పాం కదా అని ఎదురుదాడి చేసేందుకే. నోట్ల రద్దుతో జనం ఇబ్బందులపై మీడియా వార్తలతో ఇబ్బంది పడిన భక్తులు భజన బాణీ మార్చారు. మోడీ ఏదో పెద్ద పధకంతోనే ఈ పని చేశారంటూ కొత్త పాట అందుకున్నారు. ‘నోట్ల రద్దు వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో విజయం కోసం కాదు, అది జరిగితే అదొక ప్రయోజనకరమైన బోనస్‌ అవుతుంది. ఆయన రాజకీయ లక్ష్యాలు అసాధారణమైనవి. అధికారానికి వచ్చిన వెంటనే నల్లధనంపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.2015లో విదేశీ ఆస్థుల గురించి తొలి స్వచ్చంద వెల్లడి పధకాన్ని ప్రకటించారు.అరవై శాతం పన్ను విధించటంతో అది విఫలమైంది. దాని గురించి గుణపాఠం తీసుకొని ఆదాయ వెల్లడి పధకం (ఐడిఎస్‌) ప్రారంభించారు. సెప్టెంబరులో ముగిసిన దానిలో రు.67,382 కోట్ల మేరకు ప్రకటన చేయించగలిగారు. వాయిదాల పద్దతిలో దానిలో 45శాతం మేరకు వసూలు చేస్తారు.( హైదరాబాదులో ప్రకటించి చేతులెత్తేసిన పదివేల కోట్ల రూపాయల ఆస్థిపరుల వంటి వారు ఇంకా ఎందరున్నారో తెలియదు).తరువాత బినామీ లావాదేవీల నిషేధ సవరణ చట్టాన్ని నోట్ల రద్దుకు కొద్ది రోజుల ముందు నోటిఫై చేశారు. జనం తమ వద్ద వున్న సొమ్మును బ్యాంకులలో డిపాజిట్‌ చేయటాన్ని చూసి పన్నుల చట్టాన్ని సవరించింది. దాని ప్రకారం దాచుకున్న సొమ్మును వెల్లడిస్తే 50శాతం పన్ను వసూలు చేసి, 25శాతం మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా నాలుగు సంవత్సరాల తరువాత చెల్లించే విధంగా ఒక పధకాన్ని ప్రవేశపెట్టారు.అది కూడా పనిచేయకపోతే నగదును మరింత తక్కువ చేసేందుకు, మరింతగా డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధవైపు నడిపించేందుకు లక్ష్యాన్ని మార్చారు. పరిశుద్దులయ్యేందుకు ఇవన్నీ ప్రతి వారికి ఒకటికి రెండు అవకాశాలు ఇవ్వటం, అలా చేసే వారికి వేధింపులు లేకుండా చూడటం, ఎన్నో ప్రయోజనాలు లేకుండా బిజెపికి పునాది వంటి మద్దతుదారులైన వాణిజ్య, వృత్తిదారుల ఆగ్రహానికి గురిఅయ్యేందుకు కూడా సిద్ద పడి ఒక రాజకీయ నాయకుడు ఈ సాహసం చేయరు.’ ఇలా జనానికి ఆగ్రహం కలగకుండా మంచి రోజులు ముందున్నాయని నమ్మించేందుకు చేసిన ప్రయత్నమిది అని వేరే చెప్పనవసరం లేదు. చంద్రబాబు రాజకీయ నాయకుడు కనుక ఎటుబోయి ఎటు వస్తుందో అన్న ముందు జాగ్రత్తతో నోట్ల రద్దు తన సలహా వల్లనే జరిగిందని తొలి రోజుల్లో చెప్పుకున్నారు తప్ప తరువాత క్రమంగా అసంతృప్తిని వెల్లడించటం ప్రారంభించారు. తీరా ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. దీనిలో అయినా నిజాయితీ వుందా ? లేక ఆగ్రహిస్తున్న జనాన్ని దువ్వేందుకా ? కారణం ఏదైనా చంద్రబాబును గురజాడ గిరీశం ఆవహించినట్లు కనిపిస్తోంది. అందుకే ఒపీనియన్‌ను చేంజ్‌ చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్నికలలో రష్యన్ల జోక్యంపై అమెరికాలో మల్లగుల్లాలు !

20 Tuesday Dec 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

2016 US Elections, Democratic National Committee, Donald trump, RUSSIA, Russian Involvement in the US Election, US Election, Vladimir Putin, WikiLeaks

Image result for Russian Involvement in the US Election

ఎం కోటేశ్వరరావు

     నిరసన తెలిపితే లేని పోని దేశభక్తి లేదనే ముద్రవేయించుకోవటం ఎందుకని గానీ లేక నిజంగానే నల్లధనంపై నరేంద్రమోడీ జరుపుతున్న పోరులో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు లేక సైనికురాలుగా భావించటం వల్లగానీ దేశంలో బ్యాంకు ఖాతాలున్నవారందరూ వంతుల వారీగా బ్యాంకులు, ఎటిఎంల ముందు నిలబడేందుకు సర్దుబాటు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పోలవరం తాత్కాలిక డామ్‌ నిర్మాణాన్నే శాశ్వత డామ్‌ అన్నరీతిలో ఏ రోజు ఎంత మట్టి తీశారు, ఏ రోజు కాంక్రీట్‌ వేయాలో చెబుతూ పెద్ద మేస్త్రీ పని చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అర్జునుడికి చెట్టుమీది పిట్టతప్ప మరేమీ కనిపించనట్లుగా చంద్రశేఖరరావుకు కేంద్రంతో బంధుత్వం తప్ప మరేమీ కనిపించని కారణంగా మెలకువగా వున్నా మరో విధంగా వున్నా దాని గురించే మాట్లాడుతున్నారు. నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యల కారణంగా ఇప్పటికైతే పార్లమెంట్‌లో చర్చ తప్పించుకోగలిగాం తరువాతేమిటిరా భగవంతుడా అని లోలోపల ఆందోళన పడుతున్నా పైకి మాత్రం ప్రతిపక్షాలపై మరింతగా దాడి చేస్తూ జనాన్ని నమ్మించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎవరి పాత్రల్లో వారు అమోఘంగా లీనమయ్యారు. పై ముగ్గురు పాత్రధారులు అర్రులు చాచే అమెరికాలో ఏం జరుగుతోందో చూద్దాం.

    వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రెండు రోజుల క్రితం ఒక వార్తను ప్రచురిస్తూ దానిలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న డోనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఒక గ్రాఫిక్‌ బొమ్మను ప్రచురించింది. వారి మధ్య సంబంధాలు అలా వున్నాయని చెప్పేందుకు అలా చేశారని వేరే చెప్పనవసరం లేదు. గతకొద్ది రోజులుగా అమెరికన్లు తమ అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందా లేదా అని తెలియక కాళ్లు తొక్కుకుంటున్నారు. మనం రోజూ టీవీలలో చూసే హాలీవుడ్‌ సినిమాలలో అమెరికన్‌ సిఐఏ, ఎఫ్‌బిఐ ఏజంట్లు ఎంతో తెలివిగల వారిగా, మిగతా దేశాల వారంతా వారి ఎత్తులకు చిత్తయ్యే అమాయకుల మాదిరిగా కనిపిస్తూ మనకు వినోదం అందిస్తుంటారు. వారంతా ఇప్పుడు అవుననీ కాదని చెప్పలేకపోతున్నారు. రెండు రకాలుగానూ చెబుతున్నారు. ఇంతకూ విషయం ఏమిటంటే అమెరికా ఎన్నిలలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు స్వయంగా పుతిన్‌ పర్యవేక్షణలో రష్యన్లు జోక్యం చేసుకున్నారన్నది సమస్య. ట్రంప్‌ దానిని నమ్ముతున్నట్లే మాట్లాడుతున్నాడు. ఎక్కడ కావాలంటే అక్కడ అమెరికా జోక్యం చేసుకోగలదు తప్ప అమెరికాలో ఎవరూ వేలు పెట్టలేరు మనం అంత గొప్ప మేథావులం, దేనిలో అయినా అమెరికాయే నంబర్‌ ఒన్‌ అని ఇప్పటి వరకు అమెరికన్లలో వ్యాపింపచేసిన ఒక అభిప్రాయం.

   నువ్వు నీ భార్యను తిట్టటం, కొట్టటం మానుకున్నావా అని ఎవరినైనా ప్రశ్నించి సమాధానం చెప్పమని అడగండి, ఏ సమాధానం వస్తుందో చూడండి. అవును అంటే ఇప్పటి వరకు తిడుతూ, కొడుతున్నట్లు అంగీకరించినట్లు, లేదు అంటే ఇంకా కొనసాగిస్తున్నట్లు. అమెరికన్లు కూడా అదే స్థితిలో పడిపోయి అవును, కాదు అని చెప్పలేక జుట్టుపీక్కుంటున్నారు. ట్రంప్‌ అధ్యక్ష పదవి స్వీకరించిన తరువాత జనవరి 20 నుంచి ఈ సమస్య మరుగునపడి కొత్త అంశాలపై కేంద్రీకరిస్తారనుకోండి.

    సోషలిస్టు సోవియట్‌ను కూల్చివేయటంలో విభీషణుడి పాత్రధారిగా వున్న బోరిస్‌ ఎల్సిన్‌ను రష్యా అధ్యక్షుడిగా ఎన్నిక చేయించటంలో అమెరికన్ల పాత్ర, జోక్యం జగద్విదతం. అక్కడే కాదు, సోవియట్ల స్ధానంలో స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించిన ప్రతి రిపబ్లిక్‌లో తమకు అనుకూలమైన వారిని గద్దె నెక్కించేందుకు అమెరికా ప్రయత్నించిందన్నది కూడా బహిరంగ రహస్యమే. తమ దేశ అంతర్గత వ్యవహారాలలో రష్యా జోక్యం చేసుకుందని అంగీకరించటం అంటే తమ వైఫల్యాన్ని అంగీకరించటం, లేదంటే నిరూపించి జనాన్ని నమ్మించాల్సి వుంటుంది. అనేక కొత్త ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వుంటుంది. అందుకే రెండవది అంత తేలిక కాదు.

    ఈ ఏడాది జూన్‌లో వికీలీక్స్‌ స్ధాపకుడు జులియన్‌ అసాంజే డెమోక్రటిక్‌ నేషనల్‌ కమిటీకి చెందిన వేలాది ఇమెయిల్స్‌ను బహిర్గతం చేశాడు. అది రష్యన్ల జోక్యంతో జరిగిందని హిల్లరీ క్లింటన్‌ అవకాశాలను దెబ్బతీసేందుకు ఆ పని చేశారని డెమోక్రాట్లు ఆరోపించారు. ఇప్పటికీ వారు అదే చెబుతున్నారు. సెప్టెంబరు నెలలో చైనాలో కలిసినపుడు జరిగిందేదో జరిగింది ఇంతటితో ఆపండి లేకపోతే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కొంటారని పుతిన్‌ను ఒబామా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. మరుసటి నెలలో వైట్‌ హౌస్‌ అధికార ప్రతినిధి రష్యన్లపై ఇదే ఆరోపణ చేశాడు, రుజువులు చూపకపోయినా జరిగిందని తాము గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పాడు. అదే నెలలో పార్లమెంటరీ విదేశాంగ శాఖ కమిటీ ముందు మాట్లాడిన ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ ఇతర దేశాల ఎన్నికలలో జోక్యం చేసుకున్న చరిత్ర రష్యాకు వున్నదని చెప్పాడు.

    పుతిన్‌ స్వయంగా మెయిల్స్‌ బయట పెట్టేందుకు ఆదేశించినట్లు వచ్చిన వార్తలను డిసెంబరులో రష్యా ఖండించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా రష్యన్ల జోక్యం వార్తలను తోసిపుచ్చారు. ఎన్నికలలో హిల్లరీ ఓడిపోయిన ఫిర్యాదు చేస్తున్నారు తప్ప అధ్యక్ష భవనం ముందుగానే ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు. అందువలన బాధ్యతలు స్వీకరించిన తరువాత చర్యలు తీసుకుంటారో లేదో కూడా తెలియదు.

   ఇంతవరకు ఆరోపణలు, ప్రత్యారోపణలు, మీడియాలో విశ్లేషణలు తప్ప అధికారికంగా రష్యా గూఢచారులు, స్వయంగా పుతిన్‌ జోక్యం చేసుకున్నారనేందుకు ఒక్క ఆధారాన్ని కూడా అమెరికన్లు చూపలేదు. ఇమెయిల్స్‌ను అసలు వీకీలీక్స్‌ బయట పెట్టిందన్నది కూడా సందేహమే. రష్యన్‌ హాకర్‌ గుసిఫర్‌ 2 ఒక మెయిల్‌లో వేలాది మెయిల్స్‌, ఫైల్స్‌ను తాను వికీలీక్స్‌కు ఇచ్చినట్లు చెప్పాడు కనుక రష్యన్‌ సంబంధాన్ని వూహిస్తున్నారు. అయితే డెమోక్రాట్ల కార్యాలయంలో పనిచేసే 27 సంవత్సరాల సేథ్‌ రిచ్‌ అనే ప్రజావేగు వాటిని బయటకు పంపాడన్నది ఒక కథనం. అతన్ని జూలై 10న గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఎందుకు చంపారో తెలియదు. అయితే అతని హంతకుల జాడ చెప్పిన వారికి 20వేల డాలర్ల బహుమానం ఇస్తామని అసాంజే ప్రకటించటంతో ఆ వుదంతం మరో మలుపు తిరిగింది.రష్యన్లు తమకు సమాచారం అందచేశారన్న డెమోక్రాట్ల ఆరోపణలను తోసిపుచ్చాడు. తాను రష్యా ప్రమేయం వున్న ఎనిమిది లక్షల ఫైళ్లను బయట పెట్టానని కూడా అన్నాడు. వుజ్బెకిస్తాన్‌లో బ్రిటన్‌ రాయబారిగా పనిచేసిన మురే ఫైళ్లను లీక్‌ చేశారు తప్ప హాక్‌ చేయలేదని, ఆపని చేసిందెవరో కూడా నాకు తెలుసు, అతన్ని కలుసుకున్నాను, అతను రష్యన్‌ కాదు, అక్కడ పనిచేసే వ్యక్తే అన్నాడు.

    నిజంగా హాకింగ్‌ చేసి వుంటే అమెరికా నాసాకు దానిని కనుగొని వెల్లడించే సత్తా వుందని అయితే అది హాక్‌ కాదు, లీక్‌ అయినందున ఆ పని చేయలేదని అమెరికా గూఢచార నిపుణులు భావిస్తున్నారు. రష్యా ఎన్నికలలో అమెరికన్ల జోక్యం గురించి 1996లో టైమ్‌ పత్రిక తన కథనంలో ఎలా జోక్యం చేసుకుందీ వివరించింది. దానిని అమెరికన్లు తోసిపుచ్చలేదు. కమ్యూనిస్టు అభ్యర్ధి జుగనోవ్‌పై రెండవ సారి కూడా ఎల్సిన్‌ గెలవాలని తాను స్వయంగా కోరుకుంటున్నానని బిల్‌ క్లింటన్‌ చెప్పినట్లు ఆయన దగ్గర పనిచేసి డిక్‌ మోరిస్‌ చెప్పినట్లు టైమ్‌ పేర్కొన్నది. ఎన్నికల సమయంలో స్వయంగా ఎల్సిన్‌తో మాట్లాడిన క్లింటన్‌ ఏమేమి చేయాలో కూడా సూచించారని డిక్‌ చెప్పాడు. క్లింటన్‌ జోక్యాన్ని ఆనాడు పుతిన్‌ వ్యతిరేకించాడని అయితే ఇన్ని సంవత్సరాల తరువాత ప్రతీకారం తీర్చుకోవాల్సినంత అవసరం ఏముందని కొందరు సందేహం వెలిబుచ్చుతున్నారు.

   ప్రపంచ రాజకీయాలలో అమెరికన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఇటీవలి కాలంలో రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అనేక వుదంతాలలో కనిపిస్తోంది. ముఖ్యంగా సిరియా విషయంలో అది బహిరంగమే. అదే విధంగా బ్రిక్స్‌ పేరుతో ఒక కూటమి, చైనాతో ప్రత్యేక సంబంధాలను ఏర్పరుచుకోవటం వంటి అనేక విషయాలను చూసినపుడు రష్యన్లు అమెరికాకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అటువంటపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను గద్దె నెక్కించటం ద్వారా రష్యా పొందే ప్రయోజనం ఏముంటుంది? ఆలోచిస్తే మరింత గందరగోళంలో పడిపోవటమే. అయితే అమెరికన్లు దీనిని ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్న వస్తుంది. ఎలక్టరల్‌ కాలేజీ ఓట్ల విషయంలో ట్రంప్‌ విజయం సాధించాడు తప్ప జన ఓట్లు హిల్లరీ క్లింటన్‌కే ఎక్కువ వచ్చాయి. తమ క్యాంపును నిలుపుకొనేందుకు డెమోక్రాట్లు రష్యన్ల జోక్యం గురించి ఎక్కువగా ప్రచారం, చర్చ చేస్తున్నారనేందుకే ఎక్కువ అవకాశాలు వున్నాయన్నది ఒక అభిప్రాయం. ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ అమెరికన్లు సామ్రాజ్యవాదులు అయితే వారిని ఎదిరించి ప్రపంచ రాజకీయాలలో తమ ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు రష్యాలోని పెట్టుబడిదారులు. అందువలన ఎత్తుగడలలో భాగంగాని అమెరికా రాజకీయ వ్యవస్ధను గందరగోళంలో పడేయటానికి గానీ జోక్యం వంటి చర్యలకు పాల్పడలేదని కూడా చెప్పలేము. ఏదైనా కొంత కాలం తరువాతే వాస్తవాలు బయటికి వస్తాయి. అప్పటి వరకు పండిత చర్చకు పనికి వస్తాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అచ్చే దిన్‌ కాదు అంగిట్లో ముల్లు !

14 Wednesday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

achhe din, Demonetisation, Indian currency, Narendra Modi, Rupee

Image result for people have got quinsy,demonetisation

ఎం కోటేశ్వరరావు

    నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు చెప్పినట్లు అచ్చే దిన్‌ (మంచిరోజులు) ఎప్పుడు వస్తాయో తెలియటం లేదుగానీ పెద్ద నోట్ల రద్దుతో పరిస్థితి అంగిట్లో ముల్లులా తయారైంది. దాన్ని మింగలేము, ఒక పట్టాన బయటకు తీయలేము. సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటకు వచ్చాయట. (ఈ సామెత రంకు  చేసే ఆడ మగా ఇద్దరికీ వర్తిస్తుంది). విదేశాల్లో వున్న నల్లధనాన్ని బయటకు తెస్తే ప్రతి వారి బ్యాంకు ఖాతాలో తలా పదిహేను లక్షల రూపాయలు వేయవచ్చని నరేంద్రమోడీ ఎన్నికలలో వూరూ వాడా చెప్పారు. అది నల్లధనాన్ని తెచ్చి ఖాతాల్లో వేస్తామని చెప్పినట్లు కాదు, ప్రతిపక్షాలు, మీడియా దానిని నిజంగానే మోడీ చేసిన వాగ్దానంగా చిత్రించి తమ నేతను బదనాం చేస్తున్నాయని మోడీ భక్తులు లేదా అనుయాయులు చెబుతున్నారు. మోడీకి నీడగా భావించే బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా దాని గురించి అడిగితే అలాంటి వాగ్దానం చేసినట్లు గానీ చేయలేదని గానీ ఎటూ చెప్పకుండా అరే భాయ్‌ ఎన్నికలలో అనేకం చెబుతుంటాం ఇదీ వాటిలో ఒకటి అని చిరుగడ్డాన్ని సవరించుకుంటూ చెప్పారు.

Image result for venkaiah naidu,demonetisation

     ఇక అచ్చే దిన్‌కు సంబంధించి వాగ్దానం చేసిన మాట నిజమే గాని ఎన్ని రోజుల్లో అని చెప్పామా ? అంటూ ఎప్పుడో ఎదురుదాడికి దిగారు మన తెలుగువాడైన వెంకయ్య నాయుడు.http://indianexpress.com/article/india/india-others/venkaiah-naidu-defends-pm-narendra-modi-1-year-is-too-short-to-judge/ మోడీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న తరువాత ఒక సభలో మాట్లాడుతూ ఏడాది కాలంలో ఎవరైనా ఒక బిడ్డను కనవచ్చు, ఆ బిడ్డ పెరిగి పెరిగి పెద్దయి పరుగెత్తటానికి సమయం పడుతుందా లేదా ! అలాగే జనం ఓపిక పట్టాలి. కొత్త వస్తువులను సృష్టించటానికి నరేంద్రమోడీ ఏమీ ఇంద్రుడు కాదు’ అన్నారు. దీన్నే అచ్చ తెలుగులో గోడమీద అప్పు రేపు అని రాయటం అని చెప్పుకోవాలి. ఎప్పుడు వచ్చి చూసినా అదే దర్శనమిస్తుంది. వెంకయ్య నాయుడిగారి ప్రాస ప్రకారం సిద్దాంతం లేదా రాద్దాంతం ప్రకారం బిడ్డ పుట్టి పరుగెత్తగానే మంచి రోజులు రావు. పరిపూర్ణ వ్యక్తిగా ఇంకా ఇంకా చాలా చాలా జరిగినపుడే మంచి రోజులు వస్తాయి.

   అసలింతకీ అచ్చే దిన్‌ అనే నినాదం కూడా నరేంద్రమోడీ స్వంతం కాదట. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నుంచి అరువు తెచ్చుకున్నదని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.http://blogs.timesofindia.indiatimes.com/chakallas/truth-behind-narendra-modis-acche-din-slogan/ 2012 జనవరి ఎనిమిదిన జైపూర్‌లో జరిగిన ప్రవాస భారతీయుల సభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఏర్పడిన మాంద్య పరిస్థితుల నుంచి బయటపడి త్వరలో మంచి రోజులు వస్తాయంటూ ఆశాభావం వెలిబుచ్చారు. ఆ మరుసటి రోజు గుజరాత్‌ ముఖ్య మంత్రిగా నరేంద్రమోడీ మాట్లాడారు. అప్పటికే తన గుజరాత్‌ మోడల్‌ అభివృద్ది గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఆ సభలో వుక్కు దిగ్గజం ఎల్‌ఎన్‌ మిట్టల్‌ కూడా వున్నారు. నరేంద్రమోడీ తనదైన ప్రత్యేక శైలిలో వుపన్యాసం ప్రారంభిస్తూ మిట్టల్‌వైపు చూపుతూ ఇదిగో ఆయన లండన్‌లో తినే టొమాటాలు, బెండకాయలు కూడా గుజరాత్‌లో పండినవే అంటూ తన ఘనతతో ప్రారంభించారు. తరువాత నిన్న మన ప్రధాన మంత్రి మంచి రోజుల గురించి చెప్పారు. నేను కూడా చెబుతున్నాను త్వరలో ఆ మంచి రోజులు నిరుపమాన రీతిలో తీసుకొస్తాం’ అని చెప్పగానే సభలో మోడీ మోడీ అంటూ పెద్ద స్పందన వచ్చిందట. దాంతో ఇది బాగుందని ఆ నినాదాన్ని కొనసాగించారట. అయితే అది ఇప్పుడు అంగిట్లో ముల్లులా తయారైందని ఇటీవలనే గడ్కరీ చెప్పారట. అంటే దానిని అమలు జరపలేము, అలాగని ఆ వాగ్దానానికి దూరంగా పోలేక అటూ ఇటూగాని స్థితిలో వున్నట్లు అంగీకరించటమే. బహుశా అందుకేనేమో తాజాగా 50 రోజుల్లో మంచి రోజులు అంటూ పెద్ద నోట్ల రద్దు సందర్భంగా కొత్త నినాదమిచ్చారని కోవాలా ?

    దీన్నుంచి తప్పించుకోవటానికి షరతులు వర్తిస్తాయని కొన్ని స్కీములకు కంపెనీలు షరతు పెట్టినట్లుగానే ముందు కొన్ని రోజులు ఇబ్బందులు పడాలి, తరువాత అంతా మంచే అని చెప్పారు. అంటే యాభై రోజుల తరువాత వెంటనే మంచి రోజులు రానట్లే. డిసెంబరు 31 తరువాత ఎలాగూ నరేంద్రమోడీ తిరిగి మౌన ప్రతంలోకి లేదా ఏ విదేశాలకో వెళ్లిపోతారు కనుక ఆయన మాట్లాడరు. మనం తిరిగి వెంకయ్య సమాధానాలు వినటానికి సిద్ద పడాలి. ఎన్నో రోజులు లేవు గనుక ఏం చెబుతారో చూద్దాం !

Image result for people have got quinsy,demonetisation

     చలామణిలో వున్న కరెన్సీలో రద్దు చేసిన పెద్ద నోట్ల మొత్తం 14.44 లక్షల కోట్లని ప్రభుత్వమే ప్రకటించింది. ఇప్పుడు కొత్త 500, 2000 నోట్లతో పాటు మిగిలిన పాత కరెన్సీ కూడా ప్రచురించి పంపిణీ చేసింది కేవలం 4.61లక్షల కోట్ల రూపాయలకు మాత్రమే అని రిజర్వుబ్యాంకు స్వయంగా ప్రకటించింది. ఇప్పటికి బ్యాంకులకు చేరిన పాతనోట్ల మొత్తం విలువ 12.4 లక్షల కోట్లు ఆ తరువాత నాలుగు రోజులు గడిచాయి కనుక. మరో యాభైవేల కోట్లయినా డిపాజిట్‌ అయి వుంటాయని అంచనా. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది కనుక రద్దయిన 14.44 లక్షల కోట్లకు గాను కేవలం తొమ్మిది లక్షల కోట్లు అచ్చువేస్తే చాలని ప్రభుత్వం భావించినట్లు వార్తలు వచ్చాయి. వెయ్యి రూపాయల నోట్లు పూర్తిగా రద్దు చేస్తామని(ఇప్పటికి, పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి రేపేం ప్రకటిస్తారో తెలియదు ) చెప్పినందున వాట స్ధానంలో రెండు వేల నోట్లు ఎలాంటి చిల్లర సమస్యలను తెస్తున్నాయో గత కొద్ది రోజులుగా చూస్తున్నాము. అంటే అంతకంటే తక్కువ నోట్లు అచ్చువేయాలి. ఒక రెండువేల నోటుకు ఐదు వందలైతే నాలుగు, వంద అయితే 20,యాభై అయితే 40, ఇరవై అయితే వంద ఇలా తగ్గే కొద్దీ అచ్చేయాల్సిన నోట్ల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వానికి అదొక తలనొప్పి. చిల్లర కావాలన్నా జనం కమిషన్లు ఇచ్చుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు అవసరమైన నోట్ల ముద్రణ కూడా వచ్చే ఏడాడి ఏప్రిల్‌ నాటికి, అదే మొత్తం నోట్లు అచ్చేయాలంటే జూలై వరకు పడుతుందని చెబుతున్నారు.

    మన దౌర్భాగ్యం ఎలాంటి దంటే మనకు కావాల్సిన నోట్లను కూడా మనం స్వయంగా అచ్సేసుకొనే స్ధితిలో లేమట. 1997-98లో లక్ష కోట్ల రూపాయల విలువగల వివిధ కరెన్సీ నోట్లను మన రిజర్వుబ్యాంకు బ్రిటన్‌, అమెరికా, జర్మనీలలో ముద్రణ చేయించిందని పార్లమెంటరీ కమిటీ నివేదికలో తేలింది. తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటూ దూడగడ్డి కోసం అని చెప్పినట్లుగా ఎందుకీ పని చేశారంటే ఆ మూడు దేశాలు మనకు కావాల్సిన కరెన్సీని వేగంగా ముద్రించి ఇచ్చే సామర్ధ్యం కలిగి వున్నాయని అధికారులు చెప్పారట.http://timesofindia.indiatimes.com/India/House-panel-pulls-up-govt-for-outsourcing-printing-of-currency-notes/articleshow/5878095.cms ఇదంతా కాంగ్రెస్‌ హయాంలో జరిగింది. అవినీతి అక్రమాలకు, కుంభకోణాలకు ఆ పార్టీ పెట్టింది పేరు. చిత్రం ఏమిటంటే కాంగ్రెస్‌ హయాంలో బయటి దేశాలలో నోట్ల ముద్రణ లావాదేవీలలో పాలుపంచుకున్న రెండు కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు తేలటంతో భవిష్యత్‌లో వాటితా లావాదేవీలు జరపకూడదని మన ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని నరేంద్రమోడీ సర్కార్‌ ఎత్తివేయటమే విశేషం. ఎందుకు ఎత్తివేశారయ్యా అంటే అవి 150 సంవత్సరాల నుంచి నోట్లచ్చువేసే వ్యాపారంలో వున్నాయి. ఒక దేశ సమాచారాన్ని మరొక దేశానికి అవి చేరవేసి అవి వ్యాపారాన్ని పొగొట్టుకుంటాయా ? మా దర్యాప్తుల అలాంటిదేమీ లేదని తేలింది. అందుకే ఎత్తివేశామని అధికారులు చెప్పారట. ఇలా పొరుగుసేవల కాంట్రాక్టు కోసం సదరు కంపెనీ ముడుపులు కూడా చెల్లించిందని వార్తలు.http://greatgameindia.com/secret-world-indian-currency-printers-de-la-rue/ ఆ నిషేధం ఎత్తివేసిన తరువాత ఆ కంపెనీ షేర్ల ధరలు బాగా పెరిగాయట కూడా. ఇవన్నీ నరేంద్రమోడీ సర్కార్‌కు తెలియకుండా వుండవు. వీటిపై నిజా నిజాలను వెలికి తీసి జనానికి వెల్లడి చేయాలి. మనకు నోట్లు సరఫరా చేసే లేదా అచ్చువేసే కంపెనీలే పాకిస్థాన్‌కు కూడా చేస్తాయట. అంటే మన నోట్లనే కొన్నింటిని దానికి కూడా సరఫరా చేస్తే ? మనం కూడా అక్కడి నుంచే కొన్ని పాక్‌ నోట్లను తెచ్చుకోవాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • బ్రిక్, బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్.. అమెరికా ఆధిపత్యానికి ప్రతిఘటన!
  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బ్రిక్, బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్.. అమెరికా ఆధిపత్యానికి ప్రతిఘటన!
  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బ్రిక్, బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్.. అమెరికా ఆధిపత్యానికి ప్రతిఘటన!
  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d