• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Political Parties

జెఎన్‌యు మూత సలహా ఇతర ‘వర్సిటీలు, సంఘపరివార్‌కూ వర్తింప చేస్తారా ?

15 Wednesday Jan 2020

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ABVP, Closer of JNU, India R&D expenditure, JNU, JNU ROW, Patents, RSS

Image result for jnu,

ఎం కోటేశ్వరరావు
జెఎన్‌యు గురించి వివరాలు తెలుసుకుందాం. రఘునాథ రామారావు గారి ఆంగ్ల లేఖకు తెలుగు అనువాదం మరి కొంత నా సేకరణ. మదన్‌ గుప్త పేరుతో ఒక పోస్టు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. దీన్ని చదివి కొంత మంది దానిలోని అంశాలు నిజమే కదా అని నిజంగానే ఆందోళన పడుతున్నారు. కొందరు దీన్ని పూర్వపక్షం చేస్తూ వాస్తవాలు బయటపెడితే బాగుండు అనుకుంటున్నవారు కూడా లేకపోలేదు. ‘వాట్సాప్‌ యూనివర్సిటీ’ గురించి తెలిసిన వారికి కాషాయ తాలిబాన్లు విసిరిన మరొక బాణం ఇది అని ఇట్టే పసిగట్టగలరు. దీనిలో జెఎన్‌యు గురించి కొత్తగా తెలిపిందేమీ లేదు, చదివిన వారు తెలుసుకొనేదీ ఏమీ లేదు.
ముందుగా అడగాల్సింది అసలు ఆ రామారావు ఎవరు, ఆయనెందుకు ఆంగ్లంలో లేఖ రాశారు, ఆపెద్ద మనిషి కవిత్వానికి మదన్‌ గుప్త తనపైత్యాన్ని జోడించటమెందుకు ? ఈ పోస్టు ఎవరిపేరుతో అయితే ఉందో వారి విశ్వసనీయత, అసలు ఆ పేరుతో ఎవరైనా ఉన్నారో కల్పిత వ్యక్తులో తెలియదు. వారు పేర్కొన్న అంశాలకు ఆధారాలేమిటో అసలే తెలియదు కనుక దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జెఎన్‌యు మీద దాడిలో ఇదో కొత్త కోణం. దీపికా పదుకోన్‌ ఆ విశ ్వవిద్యాలయాన్ని సందర్శించి ముసుగు గూండాల దాడిలో గాయపడిన వారికి మద్దతు తెలిపిన అంశం గురించి ‘కంటి చూపుతో కాషాయ తాలిబాన్లపై విరుచుకుపడ్డ హీరో దీపిక ‘ అనే శీర్షికతో రాసిన నా విశ్లేషణపై కాషాయ మరుగుజ్జులు(ట్రోల్స్‌) ఎగిరెగిరి పడ్డారు. జెఎన్‌యు కమ్యూనిస్టుల కిస్‌ కల్చర్‌ (ముద్దుల సంస్కృతి) కేంద్రం అని నోరుపారవేసుకున్నారు. ఆ కేంద్రంలోనే బిజెపి నేతలు నిర్మలా సీతారామన్‌, మేనకా గాంధీ వంటి వారు విద్యాభ్యాసం చేశారు. వారెంత మందికి ముద్దులిచ్చారు, ఎంత మందినుంచి ముద్దులు తీసుకొని ఉంటారో చెప్పగలరా అన్న ప్రశ్నకు జవాబు లేదు. ఇప్పుడు ఎబివిపికి చెందిన ఆమ్మాయిలు, అబ్బాయిలు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. అలాంటి సంస్కృతి అక్కడ ఉందనుకుంటే దానిలో కొనసాగటం ఎందుకు, చదువు మానుకొని బయటకు రావచ్చు, వేద పాఠశాలలు, సంస్ధలలో చేరవచ్చు !
అందువలన ఎవరికిి తెలిసిన భాషలో చెబితేనే వారికి సులభంగా అర్ధం అవుతాయి. ఈ పోస్టుకూడా ఇంచు మించు అలాంటిదే కనుక కొన్ని అంశాలను చూద్దాం. మామిడి చెట్టు నాటితే మామిడి కాయలే కాస్తాయి, జాంకాయలు ఎందుకు కాయటం లేదనే కుతర్కం, బుర్రతక్కువ జనాలకు ఏం చెప్పాలి. జెఎన్‌యు సాంకేతిక విద్యా సంస్ధ కాదు. ప్రధానంగా సామాజికాంశాలతో పాటు సైన్సు కోర్సులు కూడా బోధించే సాధారణ విశ్వవిద్యాలయం. అక్కడ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. డాక్టరేట్స్‌ను ఇస్తున్నారు. ప్రత్యేకించి శాస్త్ర, సాంకేతిక అంశాల అధ్యయనం, పరిశోధనలకు ఐఐటిలు, ఇతర పరిశోధనా సంస్దలు ఉన్నాయి. సాధారణ విశ్వవిద్యాలయాలను, వీటినీ రెండింటినీ ఒకే గాటన కట్టటం వక్రీకరణ.
ఈ పోస్టులో లాభనష్టాల గురించి చర్చ చేశారు. విద్యా సంస్ధలు చేసేది వాణిజ్యం కాదు కనుక లాభనష్టాల ప్రమాణాలు వర్తింప చేయటం అనుచితం. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇదే మాదిరి బోధన, పరిశోధన అవకాశాలను కల్పిస్తున్నాయి. కనుక వాటితో పోల్చి చూపితే ఆ పోస్టుపెట్టిన వారి బండారం ఏమిటో తెలిసి ఉండేది. ఆ చిత్తశుద్ది పోస్టులో లేదు. దానిలో పేర్కొన్న కొన్ని అంశాలకు ఆధారాలేమిటో తెలియదు. జెఎన్‌యులో చదివిన వారు ఎందరు ఉపాధి పొందారో తెలియదు అన్నారు. ఆ పరిశోధకుడు, పరిశీలకుడు కలసి ఇతర విశ్వవిద్యాలయాల్లో చదివి పట్టాలు పొందిన వారు ఎందరు ఉపాధి పొందారో ఏమి చేస్తున్నారో లెక్కలు చెప్పగలరా ? లేదా నరేంద్రమోడీ గారు సెలవిచ్చినట్లు పకోడీ బండ్లు ఎందరు పెట్టారో తెలుపగలరా ?

Image result for jnu attack
చెడిపోయిన ప్రజాస్వామ్యానికి జెఎన్‌యు ఓ గొప్ప ఉదాహరణ అట. సరే అంగీకరిద్దాం, బాగున్న ప్రజాస్వామ్యానికి ఓ గొప్ప ఉదాహరణగా ఉన్న విశ్వవిద్యాలయం పేరేమిటో చెప్పి ఉంటే వివేక వంతులు పోల్చి చూసుకొనే వారు. ఇప్పటికైనా చెప్పండి, సవాలు కాదు సవినయంగా అడుగుతున్నాం. అక్కడి విద్యార్ధులకు ఖాళీ సమయం ఎక్కువ కాబట్టి కొత్త సమస్యలు సృష్టించటంపైన, మైండు కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి అడ్డమైన భావజాలంతో నింపేస్తారట, అన్నీ ఉచితంగా అందుతూ ఉంటే ముసలి వారైనా అక్కడే వారి జీవితాన్ని గడిపేస్తారుట. సాంఘిక సంస్కరణల ఊసులేదట, ఇలా సాగిన, రాసిన చెత్తకంతకూ సమాధానం చెప్పటం వాణిజ్య భాషలో దండగ, కనుక ఆపని చేయటం లేదు. ఇలాంటి పోస్టులు ఏ మాత్రం విమర్శనాత్మక వైఖరిలేని వారి బుర్రలను ఖరాబు చేస్తాయి. వాటి లక్ష్యమే అది. రెండు రెళ్లు నాలుగే ఎందుకు కావాలి, మూడు ఎందుకు కాకూడదు అని ఎవరైనా వాదించే వారిని సంతృప్తి పరచ చూడటం వృధా ప్రయాస. ఒక సినిమాలో నువ్వు ఎవరు అనే ప్రశ్నతో ఉన్న దృశ్యాలను వారికి చూపటం తప్ప మరొక మార్గం లేదు. దేశంలో పేటెంట్‌లు, పరిశోధనలు తక్కువగా ఉండటానికి కారణం జెఎన్‌యు అన్నట్లుగా చిత్రించిన పెద్దలు ఈ దేశంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు, వాటితో సమానమైన సంస్ధలు, ఎన్ని లక్షల మంది వాటిలో చదువుతూ, పరిశోధనలు చేస్తున్నారో తెలుసుకుంటే జెఎన్‌యులోని ఎనిమిదివేల సంఖ్య ఎంత తక్కువో తెలుస్తుంది. జెఎన్‌యును మూసివేయాలని వాదించేందుకు తెగ ఆయాసపడిపోవటం గాకుండా అసలు మొత్తంగా పరిశోధనలు, పేటెంట్ల నమోదులో దేశం ఎందుకు వెనుకబడి పోయిందో, దానికి పరిష్కారాలు ఏమిటో చెప్పి ఉంటే వారి శ్రమ ఫలించేది.

Image result for jnu attack
పరిశోధనలు, నవకల్పనలను ప్రోత్సహించే వాతావరణం, అందుకు అవసరమైన పెట్టుబడి వంటి అంశాలను మనం చూడాల్సి ఉంది. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఆరునెలల క్రితం చేసిన సిఫార్సులో దేశంలో పరిశోధన మరియు అభివృద్ది కార్యకలాపాలకు 2022నాటికి జిడిపిలో కనీసం రెండు శాతం ఖర్చు చేయాలని కోరింది. గత రెండు ద శాబ్దాలుగా చేస్తున్న ఖర్చు 0.6 నుంచి 0.7శాతం మధ్య ఉంది. అలాంటిది మరో రెండు సంవత్సరాల్లో రెండుశాతానికి పెరుగుతుందని ఆశించే పరిస్ధితి ప్రస్తుతం ఉందా.


ప్రపంచ నవకల్పన సూచికలో మన దేశ స్ధానం గురించి చెప్పుకోబోయే ముందు పరిశోధనకు వివిధ దేశాలు జిడిపిలో చేస్తున్న ఖర్చును చూస్తే ఇజ్రాయెల్‌ 4.3, దక్షిణ కొరియా 4.2, జపాన్‌ 3.2, అమెరికా 2.8, చైనా 2.1 శాతం ఖర్చు (2017) చేస్తున్నాయి. ఈ మధ్య మన కాషాయ పరివారం ప్రతిదానికి పాకిస్ధాన్‌తో పోల్చుకోవటాన్ని ఎక్కువ చేసింది. దాని ఖర్చు 0.5శాతంగా ఉంది కనుక, మన దేశాన్ని మోడీ సర్కార్‌ దాని కంటే కొన్ని మెట్లు ఎగువ నిలిపిందని గొప్పలు చెప్పుకోవచ్చు.
దేశంలో నేడున్న పరిస్ధితి ఏమిటి? ఆపరేషన్లకు ఎలాంటి విఘ్నం కలగ కూడదని వైద్యులు గణపతికి మొక్కుతారు. పోలేరమ్మలకు సద్ది నైవేద్యాలు పెడతారు. ప్రయోగం విజయవంతం కావాలని ఇస్త్రో శాస్త్రవేత్తలు వెంకటేశ్వరుడిని, సుళ్లూరు పేట గ్రామ దేవతలను వేడుకుంటారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పేవారు తామరతంపరగా పెరిగిపోతున్నారు. లక్షల సంవత్సరాల నాడే మన పూర్వీకులు ఎలాంటి ఇంధనం లేకుండా పలు ఖండాలకు ఎటు కావాలంటే అటు తిరిగే, ఎందరు ఎక్కినా మరొకరికి సీటు దొరిక విమానాలు నడిపారని, కృత్రిమ గర్భధారణ పద్దతుల్లో నూరుగురు కౌరవులను పుట్టించారని, ప్లాస్టిక్‌ సర్జరీ తెలిసిన కారణంగానే వినాయకుడికి ఏనుగు తలను అతికించారని, ఆవు మూత్రంలో బంగారం ఉందని, ఆవు పేడలో ఔషధ గుణాలున్నాయని, వాటి మీద పరిశోధనలు చేయండని చెప్పేందుకు ప్రధాని నుంచి కింది స్ధాయి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త వరకు పోటీ పడుతుండటాన్ని చూస్తున్నాము. మూఢనమ్మకాలతో రోజు ప్రారంభమై ముగుస్తున్న సమాజంలో , నరికిన వినాయకుడి తలనే తిరిగి అతికించకుండా ఏనుగు తలను ఎందుకు అతికించారు అనే ప్రశ్ననే అడగకుండా నీకు తెలియదులో నోరు మూసుకో చెప్పింది విను అని మొగ్గలోనే చిదిమేస్తున్నకుటుంబవాతావరణంలో, రాయి రప్పలు, చెట్లు పుట్టలకు మొక్కితే పోయేదేముందిలే అనే తరాలు పెరుగుతున్న తరుణంలో లక్షలు ఎలా సంపాదించాలి, అమెరికా,ఆస్ట్రేలియా ఎలా వెళ్లాలి అనే యావతప్ప శాస్త్ర, సాంకేతిక రంగాలు, పరిశోధనల పట్ల ఆసక్తి ఏమి ఉంటుంది, పరిశోధనల్లో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ ఉంటాయి, అయినా ముందుకు పోవాలంటే ఆసక్తి కలిగిన వారికి ఆర్ధిక భరోసా కలిగించకపోతే, సాధించిన విజయాలకు ప్రోత్సాహం లేకపోతే యువతరానికి ఆ రంగంలో కొనసాగాలనే ఆసక్తి ఎలా ఉంటుంది ?
నవకల్పనల విషయంలో మన దేశ స్ధానం ఎక్కడ అన్నది చూద్దాం. ఈ మధ్యకాలంలో మన ప్రధాని నరేంద్రమోడీ కొత్త విషయాలు చెబుతున్నారు. ఐదేండ్ల క్రితం అచ్చేదిన్‌, గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి అని ఊదరగొట్టారు. ఇప్పుడు వాటి ఊసే లేదు. అంటే వాటన్నింటినీ సాధించారని మనం అనుకోవాలి. రెండో సారి ఎన్నికైన తరువాత 70ఏండ్లలో సాధించలేని వాటిని అన్నింటినీ సాధించామని చెప్పుకుంటున్నారు.మారు మాట్లాడకుండా చెవుల్లో కమలం పువ్వులు పెట్టుకొని భజన చేయాలి. లేకపోతే దే శద్రోహులం అవుతాం, రాబోయే ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సిలలో మన పేర్లను పక్కన పెట్టి జాతీయతను నిరూపించుకొనే ఆధారాలు సమర్పించమంటారు.
2014లో ప్రపంచ నవకల్పనల సూచికలో 143 దేశాల జాబితాలో మన దేశం 33.7శాతం మార్కులతో 76వ స్ధానంలో ఉంది. మన ఒక పొరుగుదేశం మోడీ అండ్‌కో నిత్యం కలవరించే పాకిస్ధాన్‌ 24 మార్కులతో 134వ స్ధానంలో, చైనా 46.57 శాతం మార్కులతో 29వ స్ధానంలో ఉంది.( ఒకటవ స్ధానంలో ఉన్న స్విడ్జర్లాండ్‌కు వచ్చిన మార్కులు 64.78శాతం). ఐదేండ్ల తరువాత 129 దేశాలలో మోడీ పాలనలో మన మార్కులు 36.58శాతంతో 52 స్ధానాన్ని పొందాము. ఇదే సమయంలో పాకిస్ధాన్‌ 31.62 మార్కులతో 113 స్ధానాన్ని, చైనా 54.82 మార్కులతో 14వ స్ధానానికి చేరింది.ఒకటవ స్ధానంలో ఉన్న స్విడ్జర్లాండ్‌ మార్కులు 67.24. దీన్ని బట్టి ఎక్కడ ఎలాంటి ప్రోత్సాహం, పోటీ ఉందో ఎవరికి వారే అర్ధం చేసుకోవచ్చు. అన్ని విజయాలు సాధించిన నరేంద్రమోడీ ఈ విషయంలో ఎందుకు విఫలమయ్యారు ? చైనా ఐదేండ్లలో తన మార్కులను 8.25, పాకిస్ధాన్‌ 7.62 పెంచుకోగా మనం 2.88కి మాత్రమే ఎందుకు పరిమితం అయ్యాం ?
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే పరిశోధన, అభివృద్ధికి ఖర్చు చేయకుండా ముందుకు పోజాలదు. మన ప్రధాని దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా మార్చుతామని చెప్పటం తప్ప అందుకు అవసరమైన కనీస చర్యలు కూడా చేపట్టలేదు. కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు గుండ్రాయిలా తయారు కావాలంటే కుదురుతుందా? పరిశోధనా ఖర్చును ఎందుకు పెంచలేదో ఎవరైనా చెప్పగలరా ? గతేడాది అక్టోబరు ఆరవ తేదీన ఎకనమిక్స్‌ టైమ్స్‌లో జి సీతారామన్‌ రాసిన ఒక విశ్లేషణ వచ్చింది. దాని సారాంశం, వివరాలు ఇలా ఉన్నాయి. ” ప్రపంచ మేథోసంపత్తి సంస్ధ వివరాల మేరకు 2017లో కొన్ని దేశాలలో దాఖలైన పేటెంట్ల దరఖాస్తులు, మంజూరైన పేటెంట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం         దరఖాస్తులు         పేటెంట్ల మంజూరు
చైనా         13,81,594             4,20,144
అమెరికా      6.06,956              3,18,481
జపాన్‌         3,18,481              1,99,577
ఐరోపా         1,66,585              1.05,645
భారత్‌            46,582                12,387
ప్రతి పదిలక్షల మందికి జపాన్‌లో 2,053, అమెరికాలో 904, చైనాలో 899, జర్మనీలో 887 మంది పేటెంట్లకు దరఖాస్తు చేయగా మన దేశంలో కేవలం పదకొండు మంది మాత్రమే ఉన్నారు. పరిశోధకుల విషయానికి వస్తే యునెస్కో సమాచారం 2015 ప్రకారం ప్రతి పదిలక్షల మందికి గాను జపాన్‌లో 5,210, అమెరికాలో 4,313,ఐరోపాయూనియన్‌లో 3,749, చైనాలో 1,206 మంది ఉండగా మన దేశంలో 216 మాత్రమే ఉన్నారు.
దేశంలోని ఐఐటీల్లో 2018-19లో బొంబాయి ఐఐటి 98 పేటెంట్లకు దరఖాస్తు చేసింది. మిగతా అన్ని ఐఐటిలు దాఖలు చేసిన వాటిలో ఇవి ఆరోవంతు. ఇదే ఏడాది బొంబాయి ఐఐటి పరిశోధన ఖర్చు 335 కోట్ల రూపాయలు కాగా దానిలో 80శాతం ప్రభుత్వం నుంచి మిగిలిన మొత్తం ప్రయివేటు రంగం నుంచి వచ్చింది.”

Image result for who are advocating closure of jnu, will they extend rss and its affiliates too
అమెరికా, జపాన్‌, ఐరోపా యూనియన్‌ దేశాల్లో గణనీయ మొత్తాలను ప్రయివేటు కార్పొరేట్లు కూడా ఖర్చు చేస్తున్నాయి. మన దేశంలో పరిశోధనల ఖర్చు పేరుతో రాయితీలు పొందటం తప్ప వాస్తవ ఖర్చు పరిమితం. ఇక వేదాల్లో, సంస్కృత గ్రంధాల్లో అపార సాంకేతిక పరిజ్ఞానం ఉంది అని చెప్పేవారు వాటిని వెలికి తీసి పేటెంట్‌ దరఖాస్తులను ఎందుకు దాఖలు చేయలేదు ? ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నారు ? వారిని అడ్డుకున్నదెవరు ? చైనా, పాకిస్ధాన్ల గురించి సొల్లు కబుర్లతో కాషాయ దళాలు పోసుకోలు కబుర్లు చెప్పటాన్ని పక్కన పెట్టి వేద విజ్ఞానాన్ని ఎందుకు వెలికి తీయించలేకపోయారు? జెఎన్‌యు గురించి ప్రశ్నిస్తున్నవారు సంఘపరివార్‌ నడిపే సరస్వతి శిశుమందిర్‌లు, ఇతర విద్యా సంస్ధలలో శిక్షణ పొందిన వారిలో ఎందరు పేటెంట్‌లు పొందారో, పరిశోధనలు చేసి ఏమి సాధించారో చెబుతారా ?

Image result for who are advocating closure of jnu, will they extend rss and its affiliates too
విద్యా సంస్ధలలో లెక్చరర్లు, విద్యార్ధులతో కూడి దేశంలో అతి పెద్ద విద్యార్ధి సంఘం అని చెప్పుకొనే ఎబివిపి ఎప్పటి నుంచో దేశభక్తిని నూరిపోస్తున్నట్లు చెప్పుకుంటుంది. అలాంటి సంస్ధ తన సభ్యులతో ముసుగులు వేసి దాడులు చేయించటాలు, విద్యా సంస్ధల్లో గణేష్‌ పూజలు, తిరోగామి భావాలను ప్రోత్సహించటం వంటి వాటిని పక్కనపెట్టి పరిశోధనల వంటి అంశాలపై తన సభ్యులను పురికొల్పి ఉంటే ఈ పాటికి చైనాతో సహా ఎన్నడో ఇతర అన్ని దేశాలను అధిగమించే వారం కదా ? ఎన్నో పేటెంట్‌లు వచ్చి ఉండేవి కదా ? నరేంద్రమోడీ సర్కార్‌కు ఆర్ధికంగా ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు, ఐదు లక్షల కోట్ల డాలర్ల జిడిపి కల నెరవేరేది. పరిశోధనలు లేవు, పేటెంట్లను సాధించని కారణంగా జెఎన్‌యును మూసివేయాలని సలహా ఇస్తున్న పెద్దలు ఎబివిపికి లేదా దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌కు , ఇతర యూనివర్సిటీల గురించి ఏమి సలహా యిస్తారు ? విద్యా సంస్దలను, సంఘపరివార్‌ సంస్ధలను మూసుకొమ్మంటారా, లేకపోతే ఇప్పటి మాదిరే పైవిధంగా ముందుకు పొమ్మని ప్రోత్సహిస్తారా ? పనికి రానివి, ప్రయోజనం లేనివి ప్రభుత్వ సంస్దలైతేనేం, ప్రయివేటువైతేనేమి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒక భ్రమరావతి మూడు కానుందా-చంద్రబాబు చెప్పుల్లో జగన్‌ దూరుతున్నారా?

12 Sunday Jan 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Chandra Babu, CM YS Jagan

Image result for jagan three capitals

ఎం కోటేశ్వరరావు
తాను అనుకున్న పద్దతుల్లోనే రాజధాని రాజకీయాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు ఎదురైనా స్వయంగా కొత్త సమస్యలను సృష్టించుకుంటున్నారా, అవే చివరకు గుది బండలుగా మారతాయా? రాజకీయంగా పతనానికి నాంది పలుకుతాయా ? జగన్‌ తలకెత్తుకున్న మూడు రాజధానుల రాజకీయం నల్లేరు మీద నడకంత సులభంగా సాగుతుందా, అసలు అనుకున్న గమ్యస్ధానం చేరుతుందా ? గతంలో ఉత్తర ప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల అసెంబ్లీలు తమకు హైకోర్టు బెంచ్‌లు కావాలని చేసిన తీర్మానాలన్నీ ప్రస్తుతం చెత్తబుట్టలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఉన్న హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించటం, అమరావతి, విశాఖల్లో బెంచ్‌లు ఏర్పాటు చేయాలని జగన్‌ కోరగానే అమలు జరపటానికి సిద్దంగా ఉన్నదెవరు ? ఉత్తర ప్రదేశ్‌ 22 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రం తమ అవసరాలకు ఐదు హైకోర్టు బెంచ్‌లు కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి కంటే ప్రధాని నరేంద్రమోడీ దగ్గర జగన్‌కు పలుకుబడి ఎక్కువ ఉందా లేదా తన పలుకుబడి గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నారా ? నిజానికి అంత ఉంటే ఈ పాటికి రాష్ట్రానికి ప్రత్యేక హౌదాను ఎందుకు సాధించలేకపోయార? దాన్ని సాధించి ఉంటే కేంద్రం ఇచ్చే రాయితీలతో, పరి శమలకు ఇచ్చే మినహాయింపులతో రాష్ట్రంలోని పదమూడు జిల్లాలూ అభివృద్ది చెందుతాయి కదా ? జగన్‌ అజెండాను, రాజకీయాన్ని కేంద్రంలోని బిజెపి అనుమతిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీని, దాన్ని నమ్ముకున్న వారి పరిస్ధితి ఏమిటి? ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకొన్నట్లుగా జగన్‌ తీరు కనిపిస్తోంది. కులాల కళ్లద్దాలతో చూస్తే సదరు కులానికి ఉన్న బలమైన లాబీ కంటే కేంద్రంలో జగన్‌కు పలుకుబడి ఎక్కువా ? తీరా ఏదీ అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో దాన్నే ఒక అస్త్రంగా చేసుకొని ఎన్నికల బరిలో దిగుతారా ? అసలు అభివృద్ది అజెండాను పక్కన పెట్టి ఆ పేరుతో మూడు రాజధానుల రాజకీయ చదరంగాన్ని ప్రారంభించి తప్పుటడుగు వేశారా ? ఎవరు ఎవరిని కట్టడి చేస్తారు, ఎవరు ఎవరిని హతమారుస్తారు. ఇదే కదా చదరంగం !
రాజకీయాల్లో ముఖ్యంగా కక్షపూరితంగా వ్యవహరించే కుమ్ములాటల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ! జగన్‌మోహనరెడ్డి తానొక ముఖ్యమంత్రి అని భావిస్తున్నట్లు కనిపించటం లేదు. ఓదార్పు యాత్రల బ్రాండ్‌ అంబాసిడర్‌ లేదా ఓదార్పుకు మారు పేరుగా ఖ్యాతి పొందిన వ్యక్తికి ఆందోళన చెందుతున్న వారి భయాలను పోగొట్టాలనే బాధ్యత ఉందనే స్పృహ ఉన్నట్లు లేదు. గత ఐదు సంవత్సరాలలో ఏదో ఒక పేరుతో జనానికి దగ్గరైన వ్యక్తి అనుకున్న అధికారాన్ని సాధించగానే జనానికి దూరమై ప్రతిపక్ష నేతలు ఓదార్పు యాత్రలను ప్రారంభించేందుకు తొలి ఆరునెలల్లోనే నాంది పలికారా ?
ఓట్లు, సీట్లతో నిమిత్తం లేకుండా ప్రజాసమస్యల మీద గళమెత్తే వామపక్ష పార్టీలు పోలీసుల దెబ్బలు తింటూ, నిర్బంధాలను ఎదుర్కొంటూ నిరంతరం తమ కార్యక్రమాలను చేస్తాయన్నది తెలిసిందే. అలాగాక కేవలం అధికారం, దానితో రెండు చేతులా ఎలా సంపాదించుకోవాలా అని తప్ప మరొకటి పట్టని, రాజకీయంగా దెబ్బతిన్న తెలుగుదేశం,బిజెపి, జనసేన పార్టీలకు ముఖ్యమంత్రి రాజకీయ ఉపాధి కల్పిస్తున్నారు. అసమ్మతి తెలిపిన వారికి పోలీసు దెబ్బలను రుచి చూపుతున్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్నపుడు ఒక విధంగా లేనపుడు మరోతీరునా ప్రవర్తించే తీరు తెన్నులను తెలుగుదేశం నేత చంద్రబాబులో, కొంత మేరకు పవన్‌ కల్యాణ్‌లో జనం చూశారు. గతంలో జగన్‌ ప్రతిపక్ష రూపాన్ని జనం చూ శారు. ఇప్పుడు తన రెండో రూపాన్ని జనానికి స్వయంగా చూపుతున్నారు.

Image result for ap capital news
తాము కన్న కలలను కల్లలుగా చేస్తున్నారనే భావనతో రాజధాని ప్రాంత గ్రామాల జనం ప్రారంభించిన శాంతియుత ఆందోళనను పట్టించుకోకపోగా పోలీసులతో అణచివేయించటం ఆందోళనకరం, గర్హనీయం. గతంలో చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్నపుడు రాజధాని భూసేకరణ విధానాన్ని వ్యతిరేకించిన వామపక్షాలు, ఇతర పార్టీలు, వ్యక్తులు, సంస్ధల వారు తమ అభిప్రాయాలను జనానికి చెప్పేందుకు ఆ గ్రామాలకు వెళ్లినపుడు వారిని అక్కడి జనం పట్టించుకోలేదు, చెప్పేది వినిపించుకొనేందుకు సైతం సిద్దపడలేదు. కొన్ని చోట్ల మరింత రెచ్చిపోయి గ్రామాల వారు, వారికి మద్దతుగా అధికార పార్టీ పెద్దలు, పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించారో, అసలు గ్రామాల్లోకే రానివ్వని రోజులను చూశాము. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ కూడా పోలీసులతో అదే పని చేయిస్తున్నది. అప్పుడు పూలింగ్‌ పద్దతుల్లో నష్టపోతారు, పాలకపార్టీలు కల్పించే భ్రమలను నమ్మవద్దని చెప్పిన వారిని రైతులు పట్టించుకోలేదు, అధికారపార్టీ, ప్రభుత్వం వ్యతిరేకించింది. రాజధాని అంశాన్ని తిరగదోడిన జగన్‌ సర్కార్‌ ఇప్పుడు అదే చేస్తున్నది. భూములిచ్చిన రైతులకు న్యాయం కలిగించాలని కోరుతున్నవారిని అధికార పార్టీ వ్యతిరేకిస్తున్నది, ప్రభుత్వం అడ్డుకుంటున్నది, మహిళలు అనే విచక్షణ కూడా పాటించకుండా లాఠీలతో కొట్టిస్తున్నది, కేసులు బనాయిస్తున్నది. రైతులను నిస్సహాయులను చేసేందుకు ప్రయత్నిస్తున్నది.
రాజధానిని మార్చాలని అనుకుంటే దాన్ని సూటిగానే చెప్పవచ్చు. అది మంచిదా చెడ్డదా,ఏమి చేయాలో జనం నిర్ణయించుకుంటారు. ఒక పెద్ద మనిషి అమరావతిని ఎడారి అన్నారు, మరొకరు శ్మశానం అన్నారు. ఇలా నోరు పారవేసుకున్న వారు ఆ ఎడారి లేదా శ్మశానంలోనే రోజూ రాకపోకలు సాగిస్తున్నారు, పాలన చేస్తున్నారు. ఇక వైసిపి నామినేటెడ్‌ పదవులు పొందిన సినీనటుడు పృద్ధ్వి,కొందరు నేతల నోళ్లు ఏం మాట్లాడుతున్నాయో అదుపులేని స్ధితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్ధితిని కల్పించిన వారికి సహజంగానే భయం పట్టుకున్నట్లుంది. రాజధాని ప్రాంత గ్రామాల్లోని జనానికి బేడీలు వేసి ఇండ్లలో నిర్బంధించలేరు. అందువలన రోడ్లపై ప్రయాణించే ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకరు, ఇతర నోటితుత్తర నేతలకు ఏమి జరుగుతుందో తెలియదు. దాంతో పోలీసులు రాజధాని గ్రామాల్లోని రోడ్డు పక్క ఇండ్ల నుంచి రాళ్లు , ఇతర వస్తువులను విసిరినా తగలకుండా చూసేందుకు తెరలతో కాపలాలు కాస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో చిత్రాలతో సహా దర్శనమిచ్చాయి.(అవి ఇక్కడివా మరొక చోటివా అన్నది నిర్ధారించుకోవాలి) ఒక వేళ అవేగనుక నిజమైతే ఒక ప్రభుత్వానికి అంతకంటే అవమానకరం లేదు, లేదా పోలీసులే అలా చిత్రించి మంత్రులకు రక్షణ లేదు అని చెప్పటానికైనా కావచ్చు.
రాజధానికి భూములిచ్చిన రైతులను స్వార్ధపరులుగా వైసిపి నేతలు చిత్రిస్తున్నారు. అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతం కావాలన్న స్వార్ధ పరులు అంటున్నారు, మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా అని ఎదురుదాడి చేస్తున్నారు. వారందరూ భూస్వాములు, వారి పిల్లలందరూ విదేశాల్లో, లేదా దేశంలోని ఇతర పెద్ద పట్టణాల్లో ఉంటారు, వ్యవసాయం చేయరు, ఒకే కులానికి చెందిన వారంటూ ముద్రవేస్తున్నారు. రాయలసీమ వారందరూ రౌడీలు, ఫాక్షనిస్టులని కొందరు ఎలా నిందిస్తారో ఇది కూడా అలాంటిదే. రాజధానికి స్వచ్చందంగా లేదా బలవంతంగా, ప్రలోభాలకు గురి చేసిగానీ సేకరించిన భూమి 33వేల ఎకరాలు, యజమానులు 29వేల మంది. ఎక్కడైనా వూరికి ఐదు పది మంది చొప్పున ఐదు పది ఎకరాలు కోల్పోయిన వారు ఉంటే ఉండవచ్చుగానీ వారందరూ చిన్న, సన్నకారు రైతులు. ఎక్కడైనా పట్టణాలలో ఒకే కులానికి చెందిన లేదా మతాలకు చెందిన వారి అపార్ట్‌మెంట్లు ఉన్నాయోమో గానీ, ఒకే కులానికి చెందిన గ్రామాలు ఎక్కడా లేవు. కొన్ని చోట్ల కొన్ని కులాల వారు అత్యధికంగా వుంటే ఉండవచ్చు. రాజధాని ప్రాంతం ఉన్న తాటికొండ నియోజకవర్గం షెడ్యూలు కులాలవారికి రిజర్వు చేసినది. అంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే అక్కడ ఆ కులాలకు చెందిన వారు గణనీయంగా ఉన్నారనేది నిర్ధారణ. ఒక వేళ ఒకే కులం, ఒకే పార్టీకి చెందిన వారు 29 గ్రామాల్లో ఉంటే వారి ఓట్లన్నీ ఒకే పార్టీకి గుండుగుత్తగా పడి ఉంటే అక్కడ వైసిపి గెలిచే అవకాశాలే లేవు. భూములిచ్చిన వారిలో అన్ని పార్టీలకు చెందిన, కులాల వారు ఉన్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదనలో అమరావతికి భూములిచ్చిన వారి ఆందోళన ప్రత్యేకమైనది. ఇతర ప్రాంతాలలో ప్రాజెక్టులు లేదా పారిశ్రామిక ప్రాంతాలు లేదా ఇతర అవసరాలకు ప్రభుత్వాలు భూములు సేకరించి వారికి చట్టం ప్రకారం పరిహారం చెల్లించాయి. అది ఎక్కువా తక్కువా, సమంజసమా అంటే అవునని ఎవరూ చెప్పరు. వాస్తవ ధరకంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకే పరిహారం వుంటుంది. ఒకసారి సొమ్ము తీసుకున్న తరువాత భూములతో వారికి పని ఉండదు. అటు బొందితో స్వర్గానికి పోలేక ఇటు భూమి మీదకు తిరిగి రాలేక మధ్యలో విశ్వామిత్రుడు సృష్టించిన స్వర్గంలో తలకిందులుగా వేలాడిన త్రిశంకుడి మాదిరి అమరావతి ప్రాంత రైతుల పరిస్ధితి తయారైంది. దీనికి ఎవరిది బాధ్యత ?
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రియలెస్టేట్‌ ద్వారా డబ్బులు సంపాదించి రాజధానితో పాటు నవనగరాలను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు భ్రమరావతికి తెరలేపారు. ఆ మైకంలో పడిన రైతాంగం తమ భూములన్నింటినీ సమర్పించుకుంది. రియలెస్టేట్‌ ఎండమావులను చూసి వర్షించే మేఘాలని భ్రమపడింది. పది సంవత్సరాల పాటు వారిచ్చిన భూములకు కౌలు చెల్లిస్తామని, పద్దెనిమిది నెలల్లో భూముల్లో కొన్ని ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి ఇస్తామన్నది ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన. ఆ మేరకు కౌలు చెల్లిస్తున్నారు తప్ప ప్లాట్లను అభివృద్ధి చూసి ఇంకా పూర్తిగా అప్పగించలేదు. కొత్త ప్రభుత్వం ఆపని చేస్తుందని ఆ శలు పెట్టుకున్న రైతాంగం అసలుకే మోసం తలపెట్టిన సర్కార్‌ తీరును చూసి హతాశులయ్యారు. జగన్‌ అసెంబ్లీలో చెప్పినట్లుగా, కమిటీలు సూచించినట్లుగా, రాబోయే హైపవర్‌ కమిటీ సూచించబోయేవాటి ప్రకారం అమరావతిని ఏడాదికి పది లేదా పదిహేను రోజుల పాటు జరిపే అసెంబ్లీ సమావేశాలకు(నెల రోజుల పాటు జరిగే వేసవి లేదా బడ్జెట్‌ సమావేశాలను విశాఖలో జరపాలనే సిఫార్సును అమలు చేస్తే) పరిమితం చేసి సచివాలయం, హైకోర్టు ఇతర కార్యాలయాలను ఇక్కడి నుంచి తరలిస్తే జరిగేదేమిటి? గడువు ముగిసిన తరువాత కౌలు మొత్తాన్ని నిలిపివేస్తారు, కేటాయించిన ప్లాట్లకు డిమాండు పడిపోతే లేదా కొనుగోలు చేసే వారు లేకపోతే తమ పరిస్ధితి ఏమిటి అన్నది ఆ ప్రాంత రైతుల ఆవేదన.
అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేయాలంటూ ఒక్క ఆర్ధిక, సామాజికవేత్త కూడా లేకుండా పట్టణ ప్రణాళికల నిపుణులతో మాజీ అయ్యేయెస్‌ అధికారి జిఎన్‌రావు కన్వీనర్‌గా ఒక కమిటిీని వేశారు. అది తన నివేదికలో ఏమి సిఫార్సు చేస్తుందో తెలియక ముందే కడుపులో ఉన్నదానిని దాచుకోలేక గానీ లేదా సదరు నివేదికలో ఏమి రాయాలో చెప్పిన విషయం గుర్తుకు వచ్చిగానీ మూడు రాజధానులు, ఎక్కడ ఏమివస్తాయో కూడా సూచన ప్రాయంగా అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిన తరువాత కమిటీ ఏమి ఇవ్వనున్నదో ముందే తెలిసిపోయింది. రాజధానుల గురించి చెప్పిన ముఖ్యమంత్రి ఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టబోతున్నామో, దానికింద ఏమేమి చేయబోతున్నామో కూడా చెప్పి ఉంటే అదొక తీరు. కమిటీ సిఫార్సులు, వాటికి ఉన్న చట్టబద్దత లేక ఆచరణ సాధ్యమా అన్న అంశాలు ఒక ఎత్తు. ఆ కమిటీతో పాటు బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు సలహా అంటూ మరొకదాన్ని ముందుకు తెచ్చారు. లెక్కలేనంత మంది సలహాదారులు జగన్‌ చుట్టూ కొలువు తీరి ఉన్నారు. జనం సొమ్ము నుంచి ప్రతినెలా లక్షల రూపాయల ప్రతిఫలం, ఇతర సౌకర్యాలు పొందుతూ వారేమి సలహాలు ఇస్తున్నారో పాలకులేమి తీసుకుంటున్నారో మనకు తెలియదు. గతంలో చంద్రబాబు సలహాదారులు కూడా ఏమి చెప్పారో తెలియదు.(వారిచ్చిన సలహాలే తెలుగుదేశం పార్టీకి ఘోరపరాజయాన్ని చేకూర్చాయనే వారి అభిప్రాయాలను కాదనలేము. అదే బాటలో జగన్‌ సలహాదారులు కూడా ఉన్నారన్నది ఏడు నెలల పాలన చెబుతున్నది)
జిఎన్‌ రావు కమిటీ నివేదిక, బోస్టన్‌ సలహాలన్నింటినీ కలగలిపి సిఫార్సులు చేయాలంటూ పది మంది మంత్రులు, ఆరుగురు అధికారులతో ఉన్నతాధికార కమిటీ అంటూ మరొకటి వేశారు. వీరేమి చేయబోతున్నారనేందుకు బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. జిఎన్‌రావు రాష్ట్రాన్ని నాలుగు అభివృద్ధి మండలాలుగా చేయాలంటే, బోస్టన్‌ ఆరు అని చెప్పింది. పదహారు మంది కమిటీ రెండింటినీ కలిపి పది అని చెప్పవచ్చు లేదా పదిని రెండుగా చేసి ఐదు అనవచ్చు, ఇలాంటి కమిటీల నుంచి అంతిమంగా ముఖ్యమంత్రులు ఏది చెబితే అదే బయటకు వస్తుందన్నది గత అనుభవం. మీరేది చెబితే అదే కరెక్టు అనే మంత్రులు, అధికారులే తాజా కమిటీలో కూడా ఉన్నారు.
మూడు రాజధానుల గురించి వైసిపి నేతలు తాము తెలివిగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు. మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తే ఎందుకు వ్యతిరేకించాలి అని కొందరు, రాజ్యాంగంలో ఒక్క చోటే రాజధాని ఉండాలని ఉందా అని మరి కొందరు, మూడు చోట్ల అభివృద్ధి అవసరం లేదా అంటూ మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు పెట్టుకోవచ్చని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా అంటే సమాధానం లేదు. అభివృద్ది అవసరం లేదని ఎవరు అన్నారు, మూడు రాజధానులతో అభివృద్ది ఎలా చేస్తారో చెప్పమంటే కంటి చూపులే తప్ప నోటమాటలు లేవు, తరువాత వెల్లడిస్తామంటారు.
మూడు చోట్ల కాదు కొత్త రాజధాని ఎక్కడ అనే చర్చ సమయంలో ముప్ఫయి చోట్ల ఏర్పాటు చేయాలని ప్రతి పాదించి ఆమోదం పొందితే ఎవరికీ అభ్యంతరం లేదు.జగన్‌ మోహనరెడ్డి నాడు అసెంబ్లీలో భూ సేకరణ గురించి భిన్నాభి ప్రాయం వ్యక్తం చేయటం తప్ప అమరావతిని రాజధానిగా అంగీకరించారు. ముప్పయివేల ఎకరాలు కావాలన్నారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ రాజధానుల గురించిన ప్రస్తావన అప్పుడే కాదు, తరువాత గత ఐదు సంవత్సరాలలో ఎన్నడూ రాజధాని గురించి లేదా బహుళరాజధానుల గురించి చర్చ లేదు, కోరినవారూ లేరు. అధికారానికి వచ్చిన తరువాతే వైసిపి నాయకత్వంలో పునరాలోచన, కొత్త ఆలోచనలు పుట్టుకు వచ్చాయి. మూడు చోట్ల ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు, పదమూడు జిల్లాల్లో లేదా లోక్‌సభ నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన అంటున్నారు కనుక 25 చోట్ల కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ తేలాల్సింది ఎవడబ్బ సొమ్మని రామ చంద్రా అని భక్త రామదాసు అడిగినట్లుగా ఎవరి జేబుల్లో సొమ్ముతో అన్ని రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే అసలు సమస్య.
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత రాష్ట్రం. అది మూడు రాష్ట్రాల్లో నాలుగు ముక్కలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో యానామ్‌, తమిళనాడులో పుదుచ్చేరి, కరైకాల్‌, కేరళలో మాహే ప్రాంతాలు ఉన్నాయి. దానికి లేని రాజధాని సమస్య ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వస్తుంది. రాజధానులతోనే అభివృద్ది జరిగేట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రాజధాని ఢిల్లీ నుంచి ఒక ముక్కను ఏర్పాటు చేయాలని జగన్‌ సర్కార్‌ ఎందుకు కోరటం లేదు. దక్షిణాదిన సుప్రీం కోర్టు బెంచ్‌ పెట్టాలన్న డిమాండును వైసిపి ఎందుకు చేయటం లేదు ? ఆంధ్రుల హక్కుగా విశాఖ ఉక్కును సాధించుకున్న చరిత్ర తెలిసిందే. దాని వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తోంది. దానికి ముడిఇనుప గనులను కేటాయించాలన్న డిమాండ్‌ను కేంద్ర పట్టించుకోవటం లేదు. అది చేయకపోగా దాన్ని విదేశీ కంపెనీలకు ధారదత్తం చేసేందుకు పూనుకుంటే దాని గురించి మాట్లాడని జగన్‌ సర్కార్‌ విశాఖ అభివృద్ది గురించి కాకమ్మ కబుర్లు చెబుతోంది.
చంద్రబాబు నాయుడు అమరావతి గురించి అతిగా మాట్లాడి, ప్రచారం చేసి దాన్నొక రియలెస్టేట్‌ ప్రాజెక్టుగా మార్చేందుకు చూశారు. ఒక్క రైతాంగాన్నే కాదు, అనేక మందిలో భ్రమలు కల్పించి చేతులు కాల్చుకొనేట్లు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రచారాన్నే అస్త్రంగా చేసుకొని వైసిపి రాజధాని రాజకీయానికి తెరలేపింది. గందరగోళాన్ని సృష్టించింది. అక్కడే లక్ష కోట్లు తగలేస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధి సంగతేమిటని ప్రాంతీయ మనోభావాలను రెచ్చగొడుతోంది. ఎవరు కట్టమన్నారు, తాత్కాలిక ఏర్పాట్లలోనే పాలన సాగించవచ్చు, అసంపూర్ణంగా ఉన్నవాటిని పూర్తి చేసి మిగతా అవసరాలను తరువాత చూసుకోవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా పాలకులుగా కాంగ్రెస్‌ లేదా తెలుగుదేశం ఎవరున్నా ప్రజాకర్షక పధకాలతో జనాన్ని ఆవైపు మళ్లించాయి తప్ప అభివృద్ధి అజెండాను పక్కన పెట్టాయి. ప్రభుత్వాలు ప్రయివేటు వారికి వేల కోట్ల రూపాయలు లేదా వేల ఎకరాలను రాయితీలు, మరొక రూపంలో అప్పనంగా కట్టబెట్టటం తప్ప తాముగా పరిశ్రమలను నెలకొల్పాలనే విధానాల నుంచి వైదొలిగాయి.
వైసిపి నేతలు, వారికి మద్దతు ఇస్తున్న ఇతరులు పసలేని వాదనలను ముందుకు తెస్తున్నారు. హైదరాబాదులో అభివృద్ధి కేంద్రీకృతం అయిన అనుభవాన్ని తీసుకోనవసరం లేదా అని అమాయకత్వాన్ని నటిస్తున్నారు. వారే మరోవైపు హైదరాబాదు తరువాత కాస్త అభివృద్ది చెందిన విశాఖలో పెట్టాలని అంటారు. నూతన ఆర్ధిక విధానాలకు తెరలేపిన తరువాత హైదరాబాదులో గానీ మరొక రాష్ట్ర రాజధాని లేదా ఇతర పట్టణాలలో గానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు పెట్టలేదు. హైదరాబాదు, విశాఖ వంటి చోట్ల గతంలో ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాయి గనుకనే వాటితో పాటు వాటి అనుబంధ పరిశ్రమలు ప్రయివేటు రంగంలో అభివృద్ధి చెందాయి. అందువలన ఉపాధి అవకా శాలు, రియలెస్టేట్‌ పెరిగింది. ఇలాంటి నగరాలలో మూతపడిన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి, అవి పునరుద్దరణకు నోచుకోలేదు.
ఇక ప్రయివేటు పెట్టుబడుల విషయానికి వస్తే ప్రధాని, ముఖ్యమంత్రుల లావు, ఎత్తూ చూసి రావని తేలిపోయింది.గుజరాత్‌ మోడల్‌ అని, మేకిన్‌ ఇండియా పేరుతో హడావుడి చేసిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఆర్ధికాభివృద్ది ఎనిమిది నుంచి నాలుగున్నర లేదా ఐదు శాతానికి పడిపోయింది. కొందరు ఆర్ధికవేత్తల అంచనా ప్రకారం రెండున్నర శాతమే వాస్తవమైనది. ఆంధ్రప్రదే శ్‌లో చంద్రబాబు నాయుడు, కుమారుడు లోకేష్‌ కూడా పెద్ద హడావుడి చేసి పెట్టుబడుల గురించి లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు ఊదరగొట్టారు. ఆచరణలో అంతసీన్‌ లేదు కనుక ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు మూడు ప్రాంతాలలో రాజధానులతో అభివృద్ధి అంటున్నది వైసిపి నాయకత్వం.
జగన్‌ నాయకత్వంలోని వైసిపి వద్ద నవరత్నాలనే సంక్షేమ పధకాలలో జనానికి ఎంత అందచేస్తారనే నిర్దిష్టత తప్ప ఆర్ధిక వృద్ధికి అసలు ప్రతిపాదనలు లేదా అజెండాయే లేదు. వచ్చే రోజుల్లో నవరత్నాలకు ఎంత మేరకు కోతపెడతారనే ప్రశ్నలకు ఎలాగూ కొద్ది వారాల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. మూడు ప్రాంతాల్లో అభివృద్ది అంటే కొన్ని కార్యాలయాలను నెలకొల్పితే ఆక్కడ రియలేస్టేట్‌ ధరలు పెరగటం అనేనా లేక ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, ఇతర వ్యాపారాలను పెడతారా ? సందేహాలు తీర్చేవారు లేరు. విశాఖలో ప్రస్తుతం ఉన్న ప్రయివేటు రంగంలోని బడా పరిశ్రమలెన్ని,కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి నివాసం ఉన్నంత మాత్రాన ప్రయివేటు పెట్టుబడులు ఎలా వస్తాయి? జిఎన్‌రావు, బోస్టన్‌ కన్సల్టెన్సీ చెప్పిన ప్రాంతాల వారీ కమిషనరేట్స్‌తో అభివృద్ది జరగదని కర్ణాటక అనుభవం చెబుతోంది. నయా వుదారవాద విధానాల కాలంలో పెట్టుబడులు ఎక్కడ లాభసాటిగా, విస్తరణకు అవకా శాలుంటే అక్కడికే వెళతాయి తప్ప వెనుక బడిన ప్రాంతాలకు రాలేదన్నది కర్ణాకటలో తేలిపోయింది. అలాంటి లాభ అవకా శాలుంటే పెట్టుబడులు ఎవరూ ప్రయత్నించకుండానే వస్తాయి.

Image result for jagan three capitals
రాజకీయంగా చూస్తే కేంద్రంలో మోడీ సర్కార్‌ తెస్తున్న అన్ని ప్రతిపాదనలనూ బలపరచటంలో తెలుగుదేశం-వైసిపి రెండూ పోటీ పడుతున్నాయి. ఎక్కడ కడితేనేం మా దొడ్లో ఈనితే చాలు అన్నట్లుగా ఇతర పార్టీల నుంచి నేతలను బిజెపి ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది. అలాంటపుడు మూడు రాజధానులు, మూడు హైకోర్టులంటూ, రెండు చోట్ల అసెంబ్లీ సమావేశాలంటూ వైసిపి ముందుకు తెచ్చిన అజెండాను ఆమోదించి అమలు జరిపితే వస్తే గిస్తే ఆ ఖ్యాతి జగన్‌కు దక్కుతుంది తప్ప బిజెపికి వచ్చేది ఏముంటుంది. సాంకేతికంగా రాజధానిని మార్చకుండా కార్యనిర్వాహక రాజధాని అనో మరొక పేరో తగిలించి కొన్ని కార్యాలయాలను విశాఖకు తరలిస్తే, అసెంబ్లీ సమావేశాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. కానీ హైకోర్టును తరలించటం, మరో రెండు బెంచ్‌లు ఏర్పాటు చేయటం జరిగేనా ? అది చేయకుండా జగన్‌ విశాఖలో కాపురం పెట్టి నెగ్గుకు రాగలరా ? రాజధానిని మూడు చోట్ల పెట్టిన తరువాత రిజర్వుబ్యాంకు వంటివి లేదా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే సంస్ధలు ఎక్కడ పెట్టాలనే విషయంలో ప్రతిదానికీ పంచాయతీలు తలెత్తటం, ఆలస్యం కావటం లేదా వేరేచోట్లకు తరలి పోవటం అనివార్యం. కృష్ణా జలాల బోర్డును హైదరాబాదు నుంచి విజయవాడకు తరలింపు అంశాన్ని రాజధాని ఎక్కడో తేలిన తరువాతే నిర్ణయించాలని వాయిదా వేసిన విషయం తెలిసిందే.
హైదరాబాదులో ఐటిని తానే అభివృద్ది చేసినట్లు చంద్రబాబు స్వంత డబ్బా కొట్టుకుంటారు. ఐటి రాజధానిగా పరిగణించే బెంగళూరు, చెన్నరు, పూనా వంటివి చంద్రబాబు వంటి వారు లేకుండానే అభివృద్ధి చెందాయా లేదా ? చంద్రబాబు పాలన ముగిసిన తరువాత హైదరాబాదులో కంపెనీల విస్తరణ పెరిగింది తప్ప ఆయన లేరనే కారణంగా ఆగిపోలేదు కదా ? చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపి అక్కడి జనాన్ని హతాశులను చేశారు. రాజధాని ప్రాంతం పరిసరాల్లో ఒక్క సీటులో కూడా నెగ్గలేక ఎన్నికల్లో ఫలితాన్ని అనుభవించారు. ఇప్పుడు జగన్‌మోహనరెడ్డి ఆ అనుభవాన్ని విస్మరించి మూడు రాజధానులు-అభివృద్ధి పేరుతో రాజకీయానికి తెరలేపి మరో రెండు భ్రమరావతులకు తెరలేపారు.కాపురం చేసే కళ కాళ్ల గోళ్ల సమయంలోనే తెలుస్తందన్నది ఒక సామెత, ప్రస్తుతం జగన్‌మోహనరెడ్డి పాలన గురించి మద్దతుదారులతో సహా అనేక మందిలో అదే అనుమానం ప్రారంభమైంది. తెలుగుదేశం అనుభవం వచ్చే ఎన్నికల్లో వైసిపికి పునరావృతం అవుతుందా ? లేక అల్లావుద్దీన్‌ అద్బుతదీపాలతో జగన్‌ చరిత్రను తిరగరాస్తారా ? తానే సృష్టించిన గందరగోళాన్ని తానే ఏదో ఒక పేరుతో సరి చేసుకొని పాలన మీద దృష్టి కేంద్రీకరిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కంటి చూపుతో కాషాయ తాలిబాన్లపై విరుచుకుపడ్డ హీరో దీపిక !

10 Friday Jan 2020

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

ABVP, Aishe Ghosh, Deepika Padukone, JNU violence, JNUSU President, saffron taliban, sfi, sound of silence

Image result for deepika padukone ,jnuఎం కోటేశ్వరరావు
దేశంలో ఒక్కొక్క ఉదంతం జరిగిన ప్రతిసారీ తామే పక్షంలో ఉండాలో తేల్చుకోవాలంటూ జనాన్ని కాషాయ తాలిబాన్లు ముందుకు తోస్తున్నారు. కాంగ్రెస్‌ తన ఐదు దశాబ్దాల పాలనలో చేయలేని ఈ సమీకరణ క్రమాన్ని గత ఐదు సంవత్సరాలలో వీరు వేగంగా ముందుకు తెచ్చారు. ఆ గట్టునుండాలో ఈ గట్టునుండాలో తేల్చుకోవాల్సింది ఇంక జనమే. అలాంటి తాజా ఉదంతం జనవరి ఐదవ తేదీ రాత్రి మూడు గంటల పాటు ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ముసుగులు ధరించిన కొందరు యువతులతో సహా గూండాలు విద్యార్ధులు, ప్రొఫెసర్ల మీద జరిపిన దాడి.
ఒక సినిమాలో ప్రముఖ హీరో బాలకృష్ణ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న మాటలు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. సుప్రసిద్ధ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ ఇప్పుడు ఒక్క దేశంలోనే కాదు,సకల భాషల్లోనూ, ప్రపంచంలోనూ ఉన్న కాషాయ తాలిబాన్లు, వారి సమర్ధకులమీద ‘కంటి చూపు’తో విరుచుకుపడ్డారు. ఒక్కోసారి నిశ్శబ్దం కూడా భరించలేనిదిగా మారుతుంది. దీపికా పదుకోన్‌ చేసింది అదే. దాడికి గురైన వారిని మౌనంగా పరామర్శచేశారు తప్ప దాడి చేసిన వారి గురించి ఆ సమయంలో పల్లెత్తు మాట అనలేదు. అయినా సరే దాన్ని కూడా భరించలేని కాషాయ మూకలకు గంగవెర్రులెత్తి సామాజిక , సాంప్రదాయ మాధ్యమాల్లో ఆమెపై ధ్వజమెత్తుతున్నారు. ఆమె నిర్మించి, నటించిన ‘ఛపాక్‌’ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దేశద్రోహులకు, దేశాన్ని ముక్కలు ముక్కలు(తుకడే తుకడే) చేసే గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినట్లు చిత్రించి నోరు మూయించేందుకు చూస్తున్నారు.
బేటీ బచావో బేటీ పఢావో అని ప్రధాని నరేంద్రమోడీ నాలుగేండ్ల క్రితం పిలుపునిచ్చినపుడు ఎందరో మంచి పని చేశారని అనుకున్నారు. ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అని దాని అర్ధం. జామియా మిలియా విశ్వవిద్యాలయంలో పోలీసులే స్వయంగా అనుమతి లేకుండా దూరి ఆడమగ తేడా లేకుండా దాడులు చేశారు. ఆ తీరు మీద తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తన అనుమతి లేకుండా పోలీసులు ప్రవేశించి దాడులు చేశారని వైస్‌ ఛాన్సలర్‌ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో జెఎన్‌యు విశ్వవిద్యాలయంలో సరికొత్త దాడులకు తెరతీశారు. జామియా విద్యార్దులు సిఎఎ లేదా ఎన్‌ఆర్‌సి సమస్య మీద నిరసన తెలిపారు, అది వారి హక్కు, లేదా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు దేశద్రోహం కనుక పోలీసులు దాడి చేశారని కాసేపు అనుకుందాం. జెఎన్‌యులో అలాంటి ఆందోళన లేదే !
దాదాపు 50మంది ప్రొఫెసర్లు, 200 మంది విద్యార్దులు గత రెండు నెలలుగా చేస్తున్న ఫీజులు, ఇతర ఛార్జీల పెంపుదల ఆందోళన గురించి ఒక చోట చర్చించుకుంటుండగా వారి మీద, హాస్టల్‌ గదుల్లో వున్నవారి మీద జై శ్రీరామ్‌, తదితర నినాదాలతో మూడు గంటల పాటు కొందరు యువతులతో సహా 50 మందికిపైగా ముసుగులు ధరించిన గూండాలు ఎంపిక చేసుకున్న విద్యార్ధుల మీద హాస్టళ్లపైనా దాడులు చేశారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు వచ్చిన వైద్యులను అడ్డుకున్నారు. దాడి సమయంలో వీధి లైట్లను ఆర్పివేశారు. ఒక పధకం ప్రకారం జరిగిన ఈ దాడిలో 36 మంది గాయపడ్డారు. పోలీసులు, యూనివర్సిటీ అధికారులు, ఎబివిపితో కుమ్మక్కయి ముసుగులతో వచ్చిన గూండాలు చదువుకుంటున్న ఆడపిల్లల మీద ఎలా దాడులు చేశారో చూసిన దేశం నివ్వెరపోయింది. ఎటు తిరిగి ఎటు చూసినా వాటి వెనుక ఉన్నది నరేంద్రమోడీ అనుచర గళం, అధికార యంత్రాంగం కావటాన్ని ఆయన అభిమానులు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి బిజెపి అగ్రనేత మురళీ మనోహర్‌ జోషి కూడా విసి జగదీష్‌ కుమార్‌(తెలుగువాడే అని చెప్పుకొనేందుకు చాలా మంది సిగ్గుపడుతున్నారు) రాజీనామా చేయాలని చెప్పాల్సి వచ్చింది. దాడులకు గురయిన వారి గురించి అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఇతరుల గురించి ఎందుకు ప్రకటనలు చేయరంటూ ఆయన ఎదురుదాడులకు దిగారు. దుండగులు విశ్వవిద్యాలయాన్ని ఆక్రమించి దాడులు చేస్తుంటే అసలు విసి ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తూ రాజీనామా చేయాలని అందరూ డిమాండ్‌ చేస్తుంటే దాని గురించి మాట్లాడకుండా ఎదురుదాడులు, దాడులకు గురైన వారి మీదనే తప్పుడు కేసులు పెట్టించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయుధాలు ధరించి ముసుగులు వేసుకున్నవారిలో తమ వారున్నట్లు ఎబివిపి నేతలు అంగీకరించారు. వారి దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు జెఎన్‌యుకు రావటమే దీపికా పదుకోన్‌ చేసిన ‘ నేరం, ఘోరం ‘. నిందితులపై ఇంతవరకు చర్యలు లేవు.
ఈ తరహాదాడి మన దేశంలో ఇదే ప్రధమం. దాడులలో తీవ్రంగా గాయపడిన వారిని పరామర్శించేందుకు విశ్వవిద్యాలయానికి వచ్చిన దీపిక ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే తన సానుభూతి, మద్దతు ప్రకటించి వెళ్లారు. ఈ వార్త బయటకు రాగానే కాషాయ తాలిబాన్లు సామాజిక మాధ్యమంలో రెచ్చిపోయారు. ఆమె తాజా చిత్రం ‘ఛపాక్‌’ను బహిష్కరించాలని, దేశ ద్రోహులతో చేతులు కలిపారంటూ ఏకత, శీలము, సంస్కారం, సంస్కృతి, మహిళలకు ఇవ్వాల్సిన మర్యాదల గురించి నిత్యం ప్రవచనాలు చెప్పేవారు వాటన్నింటినీ తీసి గట్టున పెట్టి నోరు బట్టని విధంగా ఆమెపై దాడి ప్రారంభించారు. తమ అసహ్య రూపాన్ని మరోసారి స్వయంగా బహిర్గతపరచుకున్నారు.
ముంబైలో మరికొందరు బాలీవుడ్‌ నటీ నటులు దాడులను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌లు ఖండించారు. వారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయని పెద్దలు దాడికి గురైన వారిని పరామర్శించేందుకు వెళ్లిన బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ చర్యను తప్పు పడుతూ దేశద్రోహి అని నిందలు వేస్తున్నారు. ముసుగులు వేసుకున్న దుండగులు తాము లక్ష్యంగా చేసుకున్న చేసిన వారి మీద మాత్రమే దాడులు చేశారు. ముసుగుల్లేని బిజెపి నేతలు కూడా ఎంపిక చేసిన వారి మీద మాత్రమే విరుచుకుపడుతున్నారు. వారికీ వీరికీ ఒక్క ముసుగులు తప్ప తేడా ఏముంది?

Image result for deepika padukone ,jnu
జనవరి పదవ తేదీన విడుదల కానున్న తన చిత్ర ప్రచారం కోసం దీపిక ఈ ఉదంతాన్ని వినియోగించుకున్నారని నిందించిన వారు లేకపోలేదు. బహుశా వారికి ఎన్నికల కోసం ఉగ్రవాదుల దాడులను ఉపయోగించుకున్న రాజకీయ పార్టీలు గుర్తుకు వచ్చి ఉంటాయి. కొన్ని రాజకీయ పార్టీలు రంగంలో ఉన్నపుడు మాత్రమే ఉగ్రవాదదాడులు జరుగుతాయని నమ్మే వారి గురించి తెలిసిందే. కాషాయ తాలిబాన్ల దాడి తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు కొందరు కాషాయ జర్నలిస్టులు దీపిక చర్యను దాడులను సమర్ధించేవారితో పాటు దాడులకు గురైన వారు కూడా విమర్శించారని చిత్రించారు. ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండటాన్ని ఐషి ఘోష్‌ తప్పుపట్టినట్లుగా వ్యాఖ్యానించారు. పేరెన్నికగన్న బాలీవుడ్‌ బాద్‌షాలు కాషాయ తాలిబాన్ల నోటి దురుసుకు భయపడి అనేక అంశాల మీద నోరెత్తని స్ధితిని చూస్తున్నాము. బతికిన చేపలు ఏటికి ఎదురీదుతాయి, చచ్చిన చేపలు వాలునపడి కొట్టుకుపోతాయి. ఆమె చిత్ర ప్రచారం కోసమే అయితే ఇంకా అనేక మార్గాలున్నాయి. దీపిక మీద దాడులు జరగటం కొత్తేమీ కాదు. గతంలో పద్మావత్‌ సినిమా సందర్భంగా అటు బిజెపి ఇటు కాంగ్రెస్‌ వారు, సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని చూసే శక్తులన్నీ ఆమెమీద ఎలాంటి ప్రచారం చేసిందీ, భౌతికంగా దాడులు చేసేందుకు యత్నించిన తీరు చూశాము. బహుశా ఇది కూడా ఆమెను ప్రేరేపించి ఉంటుందని భావించవచ్చు. రెండు రోజుల తరువాత ఆజ్‌తక్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిన తన జెఎన్‌యు పర్యటన గురించి నోరు విప్పారు.
విద్యార్ధుల మీద హింస తనను బాధించిందని, పద్మావత్‌ సినిమా సందర్భంగా తాను ఇదే పరిస్ధితిని ఎదుర్కొన్నానని, ఇలాంటివి సర్వసాధారణంగా మారకూడదని తాను ఆశాభావంతో ఉన్నట్లు దీపిక చెప్పారు. ” నేను చెప్పదలచుకున్నది ఏమంటే రెండు సంవత్సరాల క్రితం పద్మావత్‌ విడుదల సందర్భంగా నేను ఇదే చెప్పాను. ఈ రోజు నేను చూస్తున్నది నాకు ఎంతో బాధ కలిగించింది. ఇది సర్వసాధారణ అంశంగా మారకూడదని నేను ఆశిస్తున్నాను. నాకు భయమూ విచారమూ కలిగింది. మన దేశపునాది ఇది కాదు. జరుగుతున్న వాటి పట్ల నాకు ఆగ్రహంగా ఉంది, అయితే ఎలాంటి చర్య తీసుకోకపోవటం అది మరింతదారుణం ‘ అన్నారు.

విద్యార్ధులను దీపిక పరామర్శించిన వార్త తెలియగానే బిజెపి నేత తేజీందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా ట్వీట్‌ చేస్తూ తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ మరియు అఫ్జల్‌ గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినందుకు దీపికా పదుకొనే చిత్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. అనురాగ్‌ కాశ్యప్‌, తాప్సీ, విశాల్‌ భరద్వాజ్‌, అలీ ఫజల్‌, రిచా చద్దా, అనుభవ్‌ సిన్హా, జోయా అక్తర్‌, దియా మీర్జా, సౌరవ్‌ శుక్లా, సుధీర్‌ మిశ్రా, రాహుల్‌ బోస్‌, స్వానంద కిర్కరే, షబనా ఆజ్మీ వంటి వారు దాడులను నిరసిస్తూ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Image result for deepika padukone ,jnu
పులి తన చారలను దాచుకొనేందుకు ఆవు మేకప్‌ వేసుకున్నంత మాత్రాన దాని స్వభావాన్ని దాచుకోగలుగుతుందా ? ఒక కేంద్ర మంత్రి జవదేవకర్‌ ఛపాక్‌ సినిమాను బహిష్కరించాలనటాన్ని తాను అంగీకరించనని చెబుతారు, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాత్రం దేశాన్ని విధ్వంసం చేసే వారితో దీపిక పదుకోన్‌ నిలిచిందని దాడి చేస్తారు. దేశంలో కాషాయ దళాలను అనుసరించే వారు, వారిని గుడ్డిగా నమ్మిన జనం చెవుల్లో పూలు పెట్టుకున్నారు తప్ప అందరూ పెట్టుకోలేదని మంత్రులకు అర్ధం కావటం లేదు. ఎవరైనా ఏదైనా వార్త చదివితే తాము ఎవరికి మద్దతు ఇచ్చేందుకు పోతున్నామో తెలుసుకోవాలని స్మృతి గారు సెలవిచ్చారు. మరి ఈ దాడిని ఖండించిన కేంద్ర మంత్రులకు సైతం ఇదే సూత్రం వర్తిస్తుందో లేదో ఆమె చెప్పాలి. వారిని కూడా దేశద్రోహులు అంటారా, ఒక వార్త వినగానే తాము ఎవరిని ఖండిస్తున్నామో తెలుసుకోవాలని వారికి చెబుతారా ? జెఎన్‌యులో ముసుగులు వేసుకొని గూండాయిజానికి పాల్పడింది ఎబివిపి వారే అని కొందరు, పోలీసులే ముసుగులతో దాడి చేశారని, బయటి వ్యక్తులను రప్పించి ముసుగులు తగిలించి ఎబివిపి వారు దగ్గరుండి కొట్టించారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముసుగుల్లో వచ్చి దాడి చేసింది తామే అని హిందూ రక్షక దళం పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఎటు తిప్పి ఎటు చూసినా కాషాయ తాలిబాన్లు, వారికి మద్దతుగా ఉన్న పోలీసులు ఈ దాడికి బాధ్యులు అన్నది స్పష్టం. ఈ దుండగాన్ని ఖండిస్తూ పారిశ్రామికవేత్తలు ఆనంద మహింద్రా, కిరణ్‌ షా మజుందార్‌, హర్షా మారివాలా కూడా ఖండించారు.

Image result for deepika padukone ,jnu
మన దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా అనేక మంది మేథావులు నిరసన తెలిపారు. ఈ రోజు జెఎన్‌యులోని విద్యార్ధులను, వారికి మద్దతు తెలిపిన వారినీ పాలకపార్టీ పెద్దలు దేశ ద్రోహులుగా చిత్రిస్తోంది. ఇదొక ప్రమాదకర పోకడ, భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం పాలకపార్టీకి భజన చేయకపోవటమే దేశద్రోహమా ? బ్రిటీష్‌ తెల్లజాతి పాలకులు కూడా అదే చేశారు. తమను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించారు. అలాంటి వారిని సాగనంపిన జాతి మనది. మరి ఈ కాషాయ నల్లజాతి పాలకులు బ్రిటీష్‌ వారి చెప్పుల్లో కాళ్లు దూర్చి అణచివేతకు పూనుకుంటే, తమతో ఏకీభవించని వారిని దేశద్రోహులుగా పరిగణిస్తే ఏమి చేయాలి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిఎఎ వివాదం : హద్దులు దాటిన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌

29 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

CAA, governor arif mohammad khan, Historian Irfan Habib, Indian constitution, Indian History Congress, Nathuram Godse

Image result for as a governor arif mohammad khan crossed his limits
ఎం కోటేశ్వరరావు
దేశంలో ఎవరు ‘అసహనంతో ప్రజాస్వామ్యవిరుద్దంగా ‘ ప్రవర్తిస్తున్నారో చూశారా అంటూ పొద్దున్నే ఒక పలకరింపు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో శనివారం నాడు (ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌) భారత చరిత్ర కారుల 80వ మహాసభను ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ చేసిన ప్రసంగం, దాని మీద వ్యక్తమైన నిరసన గురించి ఆ పరామర్శ. తర్కబద్దంగా సమాధానం చెబితే వినే ‘సహనం’ కనిపించకపోవటంతో మహాశయా మీరు చిన్నతనంలో చదువుకున్న కుక్క పని గాడిద చేస్తే….. కథను ఒక్కసారి చదువుకుంటే చాలు అని చెప్పి ముగించాల్సి వచ్చింది.
దేెశంలో గవర్నర్ల పాత్ర అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది, రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభాలు వచ్చినపుడు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే గుర్తుకు వస్తాయి. ఆ విషయంలో కాంగ్రెస్‌ ముందుంటే, దాన్ని అధిగమించేందుకు, కొత్త పుంతలు తొక్కేందుకు బిజెపి తహతహలాడుతోంది. మన రాజ్యాంగంలో గవర్నర్ల పాత్ర పరిమితం, వారు రాజకీయాలు చేయకూడదు, చేస్తున్నారు గనుక ఎవరైనా విమర్శిస్తే భరించాల్సిందే, గవర్నర్లంటే గౌరవం లేదా అంటే కుదరదు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర గవర్నర్‌ ప్రవర్తించిన తీరు తెన్నులను మరచి పోకముందే కేరళ గవర్నర్‌ తానూ తక్కువ తినలేదని, పదవి ఇచ్చిన వారి ఉప్పుతిన్నందున వారికి విధేయుడనై ఉన్నానని ప్రదర్శించుకొనేందుకు తాపత్రయ పడ్డారు అని చెప్పక తప్పదు.
గవర్నరు పదవిలో ఉన్న వారికి అధికారికంగా చట్ట సభల్లో ప్రభుత్వ అభిప్రాయాలు తప్ప వ్యక్తి గత అభిప్రాయాలు వ్యక్తం చేసే నిబంధనలు లేవు. బయట గవర్నర్లు గౌరవ అధ్యక్షులో మరొకటో అయిన సంస్దలు లేదా పర్యటనల్లో పరిమితమైన అంశాల మీద సందేశాలు, ప్రకటనలు చేయవచ్చు తప్ప. రాజకీయాల జోలికి పోకూడదు. అయితే చరిత్రకారుల మహాసభ లేదా మరొక సభ దేనినైనా ప్రారంభించాలని ఆహ్వానించినపుడు రావాలా లేదా అనేది గవర్నర్ల విచక్షణకు సంబంధించిన అంశం. అలా వచ్చినపుడు సాధారణంగా ముందుగా తయారు చేసుకున్న సంబంధిత అంశం మీదనే ప్రసంగిస్తారు. దానితో అందరూ ఏకీభవించాలని లేదు. కన్నూరులో జరిగింది అది కాదు. గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తాను తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్‌ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక పార్టీ నాయకత్వంలో నడిచే ప్రభుత్వం చేసిన నిర్ణయాలు, చట్టాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. వాటికి రాజకీయ పరమైన సమాధానం చెప్పాల్సింది మంత్రులు, పార్టీ నేతలు మాత్రమే. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న అధికారులు చట్టంలోని అంశాల మీద వివరణ ఇస్తారు తప్ప రాజకీయ పరమైన విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం లేదు. గవర్నర్లకూ లేదు.
తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని గవర్నర్‌ ఆరోపించారు. ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేయటాన్ని సహించలేకపోవటం అప్రజాస్వామికం అని కూడా వ్యాఖ్యానించారు. భౌతికంగా తనను నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ ప్రయత్నించారని కూడా ట్వీట్ల ద్వారా తీవ్ర ఆరోపణ చేశారు. అయితే ఆ ట్వీట్లలోనే గవర్నరే జరిగిందేమిటో వివరించాల్సి వచ్చింది.” భారత చరిత్రకారుల మహాసభ ప్రారంభం ఎలాంటి వివాదాలను రేకెత్తించలేదు.అయితే కన్నూరు విశ్వవిద్యాలయంలో జరిగిన 80వ చరిత్రకారుల మహాసభలో సిఎఎ మీద ఇర్ఫాన్‌ హబీబ్‌ కొన్ని అంశాలను లేవనెత్తారు. వీటి గురించి గవర్నర్‌ జవాబు చెబుతున్న సమయంలో గవర్నర్‌ను భౌతికంగా నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ తన స్ధానం నుంచి లేచారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ పేరు ఉటంకించటానికి గవర్నర్‌కు ఉన్న హక్కును ఆయన ప్రశ్నించారు, చప్పట్లు కొడుతూ ఆయన గాడ్సే పేరును ప్రస్తావించాలని అన్నారు. అవాంఛనీయ ప్రవర్తనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన గవర్నర్‌ ఎడిసి మరియు రక్షణ అధికారిని తోసివేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని ” గవర్నర్‌ ట్వీట్లలో పేర్కొన్నారు.
కన్నూరు సభలో గవర్నర్‌ కంటే ముందు మాట్లాడిన వక్తలు పౌరసత్వ సవరణ చట్టం, ఇతర అంశాలపై విమర్శలు చేశారు. రాజ్యాంగంలోనే కొన్ని అంశాలపై లోపాలు ఉన్నాయనే అభిప్రాయం వెలిబుచ్చటం తప్పు కాదు, రాజ్యాంగ ఉల్లంఘన అంతకంటే కాదు, దానికి ముప్పు తలపెట్టినట్లు కాదు. ఇప్పటికి 104 రాజ్యాంగ సవరణలు చేశారు, రాబోయే రోజుల్లో ఇంకా చేయవచ్చు. చట్ట సభల్లో దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను మరొక పది సంవత్సరాల పాటు పొడిగిస్తూ, ఆంగ్లో ఇండియన్‌ల నామినేటెట్‌ సీట్లను రద్దు చేస్తూ 104 సవరణలో తీర్మానించారు. ఎవరైనా వీటిని కూడా విమర్శించవచ్చు.అలాంటపుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించటాన్ని విమర్శించటం, రాజ్యాంగానికి వచ్చిన ముప్పుగా పరిగణించటం, దాన్ని కాపాడే బాధ్యతలో భాగంగా విమర్శలకు సమాధానం చెప్పబూనుకోవటమే అసలైన రాజ్యాంగ నిబంధనలకు విరుద్దం.
అదే వేదికపై ఉన్న సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు కెకె రాగేష్‌ గవర్నర్‌ కంటే ముందు మాట్లాడారు.” చరిత్రకారుల సభలో గవర్నర్‌ పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. ఆయన ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిలా మాట్లాడారు. ఎంపీ గారూ ఇది మీ కోసమే అంటూ నన్ను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేనుకూడా ఇతర పెద్దలతో పాటే వేదిక మీద ఉన్నాను. ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ మాటలను వక్రీకరించటానికి బదులు గాడ్సే చెప్పిందాన్ని ఉటంకించమని మాత్రమే కోరారు.” అని రాగేష్‌ చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. అంతే కాదు సభలో ఉన్న ఒక ప్రతినిధి జరిగిన సంఘటన గురించి ” గవర్నర్‌ మౌలానా అజాద్‌, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఎవరైనా ఆయనకు ఏమి చెబుతారు, వారిని వక్రీకరిస్తూ మాట్లాడినపుడు తరువాత గాడ్సేను కూడా ప్రస్తావించాలని చెప్పారు. ఇది చరిత్రకారుల మహాసభ, పౌరసత్వ సవరణ చట్టం మీద సెమినార్‌ కాదు.” అని పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఖాన్‌ చెత్త మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్‌, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్‌ అడ్డుకున్నారు అని అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ షిరీన్‌ మూస్వీ చెప్పారు.
గవర్నర్‌ ప్రసంగంశాలపై అనేక మంది ప్రతినిధులు, విద్యార్ధులు కూడా నిరసన తెలిపారు. వారిని ఉద్దేశించి ” మీకు నిరసన తెలిపే హక్కుంది, కానీ నన్ను నోరు మూయించలేరు. మీరు చర్చల ద్వారాన్ని మూయటం అంటే మీరు హింసా సంస్కృతిని ప్రోత్సహించటమే అని” వారితో గొంతు కలిపారు. నిరసనల మధ్య తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తాను ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగంతోనే వచ్చానని, అయితే తనకంటే ముందు మాట్లాడిన వక్తలు ఈ అంశాన్ని(సిఎఎ) ప్రస్తావించకుండా ఉంటే నేను మాట్లాడేవాడినే కాదు, మీరు ప్రస్తావించి రాజకీయ ప్రకటనలు చేశారు.రాజ్యాంగాన్ని సమర్ధించుతానని, రక్షించాలని నేను ప్రమాణం చేశాను. దానిలో భాగంగా నేను హబీబ్‌ లేవనెత్తిన అంశాలపై ప్రతిస్పందించాను. అయితే ఆయన నా ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు” అని గవర్నర్‌ ఆరోపించారు.
ఈ ఉదంతంపై ఇద్దరు జర్నలిస్టులు చేసిన ట్వీట్లను గమనించాల్సిన అవసరం ఉంది. బిజెపి ఎంపీ యజమానిగా ఉన్న రిపబ్లిక్‌ టీవీతో సహా అనేక సంస్ధలలో పని చేసిన జర్నలిస్టు ఆదిత్య రాజ్‌ కౌల్‌ చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.’ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కొంత మంది కుహనా ఉదారవాదులనబడే వారు ఇప్పుడు మాట్లాడే, భావప్రకటనా స్వేచ్చ హక్కులేదని అంటున్నారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ను ప్రస్తావిస్తూ సుప్రసిద్ద పండితుడైన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతున్న సమయంలో ఆయన్ను గేలిచేశారు” అని విమర్శించారు. దీనికి స్పందనగా ఎన్‌డిటీవీ జర్నలిస్టు గార్గి రావత్‌ ఒక ట్వీట్‌ చేస్తూ ” ఆశ్చర్యంగా ఉంది. గేలి చేయటాన్ని సమర్ధించటం లేదు. కానీ, అవకాశవాద మాజీ రాజకీయవేత్త అయిన గవర్నర్‌ అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను మీరు ఒక పండితుడు అంటున్నారు, సుప్రసిద్ధ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ను కుహనా ఉదారవాదిగా పిలుస్తున్నారు” అని చురక అంటించారు.


ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను అవకాశవాది అనటం సరికాదని, నిజంగా అవకాశవాది అయితే షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును తిరస్కరించే నిర్ణయం తీసుకున్న రాజీవ్‌ గాంధీని ఎందుకు వ్యతిరేకిస్తారు, మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేస్తారని కొందరు మీడియా విశ్లేషకులు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఇర్ఫాన్‌ హబీబ్‌ అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపణలు చేశారు. ఆయోధ్యలో ముస్లింలు రాజీపడేందుకు సిద్దపడినపుడు హబీబ్‌ ఇతరులు పడనీయలేదని ఆరోపించారు. అంతవరకు పరిమితం కాలేదు గార్గి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ముక్తార్‌ అబ్బాస్‌ అహమ్మద్‌ అన్సారీ మనవడిని వివాహం చేసుకుందని, ఆమె భర్త యూసుఫ్‌ అహమ్మద్‌ అన్సారీ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేశారని, ఆమె కాంగ్రెస్‌ అనుకూల జర్నలిస్టు అని అసందర్భ వ్యాఖ్యలు చేయటాన్ని బట్టి వారు కాషాయ దళసైనికులన్నది స్పష్టం.
ఇక ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ విషయానికి వస్తే షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్‌ గాంధీ చర్యను వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్‌ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్‌ కేరళ గవర్నర్‌గా నియమించింది. ఇన్ని పార్టీలు మారిన వ్యక్తిని అవకాశవాది అనాలో మరొక విధంగా పిలవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ-షా ద్వయ అవాస్తవాలు: ‘వివక్ష’ లేని సమాచారం ఇస్తున్న గూగులమ్మ !

25 Wednesday Dec 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Narendra modi on NRC, Narendra modi u turn on NRC, NRC controversy, NRIC

Image result for modi - shah duo sad
ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ ఈ దేశానికి దేవుడు ఇచ్చిన వరం అని మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక సందర్భంలో చెప్పారు. ఆ వరపుత్రుడు ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ఆత్మవంటి అమిత్‌ షా ద్వయం అబద్దాలు లేదా అవాస్తవాలు చెబుతున్నదా ? జాతీయ పౌర నమోదు(ఎన్‌ఆర్‌సి) గురించి ఇంతవరకు అసలు ఎలాంటి చర్చ జరపలేదని మోడీ మహాశయుడు రామ్‌లీలా(ఒకే మాట మీద నిలిచినట్లు చెప్పే రాముడి పేరుతో ఉంది) మైదానంలో ఒట్టేసి మరీ చెప్పారు. ముందుగా ఆశ్చర్యపోయింది, అవాక్కయింది బిజెపి నేతలు, అభిమానులు అంటే అతిశయోక్తి కాదు. ఏది నిజం, ఏది అవాస్తవం మోడీ మహాశయా అని బయటికి కాకున్నా లోలోపల జుట్టుపీక్కుంటున్నారు. రెండు రోజుల తరువాత నరేంద్రమోడీ ఏది చెబితే అదే కరెక్టు అసలు ఎన్‌ఆర్‌సిగురించి మేము చర్చించని మాట నిజమే అని మోడీగారి ఆత్మగా పరిగణించుతున్న కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా గారు ఒక వార్తా సంస్ధతో చెప్పారు. జాతీయ జన జాబితా, జాతీయ పౌరజాబితా తయారీకి సంబంధం లేదని కూడా అన్నారు.
ఏదో ఒకసారి చెబితే ఎవరికైనా ఇలాంటి సందేహం రావటంలో అర్ధం ఉంది గానీ మోడీ అవాస్తవాల గురించి చర్చ చేయటం ఒక సినిమాలో హీరో మాదిరి ‘చాల బాగోదు’. దేశ రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న వారిలో నేర చరితలు లేని, కోటీశ్వరులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు గాని వారెందరు అని బూతద్దం పెట్టి వెతకాల్సిన రోజులివి. అలాగే మోడీ లేదా బిజెపి నేతలు ఎన్ని నిజాలు చెప్పారనేందుకు అంజనం వేసి చూడాలి. లేదా ధర్మపీఠాలను ఎక్కించి నిజాలు పలికించాలి అంటే అన్ని దొరుకుతాయా, మేకిన్‌ ఇండియాలో కూడా తయారు చేయగలమా అన్నది సందేహమే. మోడీ ప్రకటన తరువాత ఎన్ని అబద్దాలు, ఎప్పుడు చెప్పారన్న వివరాలు తెలిపే పనిలో ఊపిరి సలపకుండా గూగులమ్మ తల్లి నిండా మునిగి ఉంది. ఊరట ఏమంటే ఆ మాత తనను కోరిన సమాచారం అందించేందుకు ” ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే” ”మతపరమైన మినహాయింపు” వంటి నిబంధనలు పెట్టలేదు.
మీకు తెలుసా, నాకైతే ఇప్పటి వరకు తెలియదు. మోడీ, షా ద్వయం అవాస్తవాల గురించి చెప్పవే తల్లీ అని అడిగితే ‘మోడీ లైస్‌.ఇన్‌’ పేరుతో ప్రత్యేకంగా వాటికే పరిమితమైన ప్రత్యేక వెబ్‌ సైట్‌ కూడా ఉంది నాయనా అని గూగులమ్మ ఒక దారి చూపింది. ప్రపంచంలో ఇతర నేతల మీద ఎక్కడైనా వెబ్‌ సైట్‌లు ఉన్నాయోమో నాకు తెలియదు, సమాచారం అందించిన వారికి కృతజ్ఞతలు చెబుతాను. యాభై అంగుళాల ఛాతీతో ధైర్యం ఉన్న మోడీ అభిమానులు కూడా దాన్ని చూసి వివరాలు తెలుసుకోవచ్చు. నిజాలు తెలుసుకొనేందుకు భయపడాల్సిన పనిలేదు !
అన్నం ఉడికిందో లేదో తెలుసుకొనేందుకు కుండలో ఉన్నమొత్తాన్ని చూడనవసరం లేదు ఒక మెతుకును పట్టుకుంటే చాలు. ప్రెషర్‌ కుకర్‌లలో వండే వారికి అలాంటి అవకాశం లేదు. తోటకూర నాడే అడ్డుకోవాల్సింది అన్నట్లుగా కాషాయ దళాలు చెప్పే అవాస్తవాలను ప్రారంభంలోనే నిలదీసి ఉంటే పరిస్ధితి వేరుగా ఉండేది. అయితే కాంగ్రెస్‌ నిర్వాకాల కారణంగా విసిగిపోయి బిజెపి ఏమి చెప్పినా సరైనదే అనే ఒక అభిప్రాయానికి చాలా మంది వచ్చారు. వెనుకబడిన సమాజం కనుక ఒకసారి ఒకరిని నమ్మిన తరువాత వారు తప్పులు చేసినా వెంటనే నిలదీయలేని బలహీనత మనలో ఉంది. దేవుడు నైవేద్యం తినడన్నది ఎంత వాస్తవమో, ఆ దేవుడి పేరుతో రాజకీయాలు చేసే కాషాయ పరివారం ఎన్నడూ నిజాలు చెప్పదన్నది పచ్చి నిజం. ఎన్‌ఆర్‌సి గురించి అసలు చర్చించనేలేదని నరేంద్రమోడీ, అమిత్‌ షా స్వయంగా చెప్పినప్పటికీ పూజారుల వంటి ఆనుచరులు ఎలాగూ నమ్మరు. కానీ అనేక మంది కళ్లుతెరిపించారు. స్ధలాభావం రీత్యా పరిమితంగా మోడీ గారి తాజా సుభాషితాల గురించి మాత్రమే చూద్దాం !
నిర్బంధ శిబిరాల గురించి అర్బన్స్‌ నక్సల్స్‌ మరియు కాంగ్రెస్‌ పుకార్లను వ్యాపింప చేస్తోందని ప్రధాని చెప్పారు.
అసలు నిర్భంధ శిబిరాల గురించి ప్రధాని ఎందుకు దాస్తున్నట్లు ? అవి అసోంలో కాంగ్రెస్‌ హయాంలోనే ప్రారంభమయ్యాయి. వాటిలో ప్రవేశానికి ముస్లింలు, ఇతర మతాల వారు అనే నిబంధనలు లేవు. అక్రమంగా వచ్చి అడ్డంగా దొరికి పోయిన వారందరినీ ముందు అక్కడ వేయాలన్నది వాటి లక్ష్యం. తన మంత్రులు పార్లమెంటులో ఏ సమాధానం, సమాచారం ఇస్తున్నారో తెలియని స్ధితిలో నరేంద్రమోడీ ఉన్నారా ? 2019 నవంబరు 22 నాటికి తమ రాష్ట్రంలోని ఆరు నిర్బంధ కేంద్రాలలో 988 మంది విదేశీయులున్నారని అసోం లోని బిజెపి రాష్ట్ర ప్రభుత్వం పంపిన సమాచారాన్ని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు. 2016 నుంచి 2019అక్టోబరు 13వరకు నిర్బంధితుల్లో 28 మంది శిబిరాల్లో లేదా ఆసుపత్రుల్లో మరణించారని కూడా వెల్లడించారు. అసోంలోని ఆరింటిలో ఒక శిబిరం ఏడు ఫుట్‌బాల్‌(కాలి బంతి) మైదానాలంత విస్తీర్ణంలో ఉందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్నది. అంతేనా అక్రమంగా వలస వచ్చేందుకు వీలున్న అన్ని జిల్లాలు, పట్టణ కేంద్రాలలో దేశమంతటా నిర్బంధశిబిరాలను ఎలా ఏర్పాటు చేయాలో సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒక నమూనాను కూడా పంపింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో రెండింటి నిర్మాణాలు పూర్తయ్యాయని, అసోంలో మరో పదింటిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అక్రమంగా వచ్చిన వారెవరినైనా నిర్బంధించాల్సిందే, అయితే శరణార్దులతో పాటు, అక్రమంగా వలస వచ్చిన వారిలో ముస్లిమేతర మతాలవారికి పౌరసత్వం ఇవ్వాలంటూ పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించటంతో ముస్లింలలో భయ సందేహాలు తలెత్తాయి. నిర్బంధ శిబిరాల్లో ముస్లింలను మాత్రమే పెడతారనేది ఒకటైతే, ఎన్‌ఆర్‌సిలో అక్రమంగా వచ్చారంటూ ముస్లింలను పెద్ద సంఖ్యలో విదేశీయులుగా తేల్చి నిర్బంధిస్తారనే అనుమానాలు తలెత్తాయి. బతుకుతెరువు కోసం స్వస్ధాలలను వదలి కొత్త ప్రాంతాలకు వెళ్లిన వారిని స్ధానికులని ఎవరు నిర్ధారిస్తారు, వారి దగ్గర ఆధారాలేముంటాయి అన్నది అసలు సమస్య. ఈ నేపధ్యంలో అసలు నిర్బంధ శిబిరాలే లేవంటూ మోడీ ప్రకటించటం మరిన్ని అనుమానాలకు తెరలేపింది.

Image result for modi - shah duo u turn on nrc
ఎన్‌ఆర్‌సి గురించి అనేక అవాస్తవాలను వ్యాపింప చేస్తున్నారు. మేము దాన్ని రూపొందించలేదు, పార్లమెంటు ముందుకు తేలేదు, అసలు ప్రకటించలేదు, ఎన్‌ఆర్‌సి పదం గురించి కూడా చర్చించలేదు అని నరేంద్రమోడీ అన్నారు.
2019 జూన్‌ 20న పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ చేసిన ప్రసంగంలో చొరబాటు సమస్యలు తలెత్తిన ప్రాంతాలలో ప్రాధాన్యతా క్రమంలో ఎన్‌ఆర్‌సిని అమలు చేయటం తన ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. రాష్రపతి ప్రసంగం అంటే ఏదో దారినపోయే దానయ్య మాట్లాడేది కాదు. తమ విధానాలు, ప్రాధాన్యతల గురించి ప్రభుత్వాలు తయారు ఇచ్చే అంశాలతోనే కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు తన ప్రభుత్వం అంటూ ప్రసంగిస్తారు, అదీ రాతపూర్వకంగా ఉన్నదాన్ని చదువుతారు. ఒక్క మాట కూడా స్వంతంగా మాట్లాడేందుకు వీల్లేదు. మంత్రివర్గంతో లేదా ప్రధాని కార్యాలయ ప్రమేయలేకుండానే రాష్ట్రపతి ప్రసంగం చేశారా ? ఆయన కూడా అర్బన్‌ నక్సల్‌ జాబితాలోకే వస్తారా ? రాష్ట్రపతి ప్రసంగం నాటికే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అసోంలో ఎన్‌ఆర్‌సి జాబితాను రూపొందించే ప్రక్రియ జరుగుతోంది.
ఎన్నికలకు ముందు ఏప్రిల్‌ నెలలో మాట్లాడుతూ ముందు పౌరసత్వ సవరణ బిల్లు తరువాత ఎన్‌ఆర్‌సి అని చెప్పిన అంశాలన్నీ మీడియాలో వచ్చాయి. ఏప్రిల్‌ 11న పశ్చిమబెంగాల్‌లోని రారుగంజ్‌లో మాట్లాడుతూ దేశమంతటా ఎన్‌ఆర్‌సిని అమలు జరుపుతామన్నారు. ఏప్రిల్‌ 23న బిజెపి యూట్యూబ్‌ ఛానల్‌లో పెట్టిన ఒక వీడియోలో తొలుత శరణార్దులకు పౌరసత్వం, తరువాత దేశవ్యాపితంగా ఎన్‌ఆర్‌సిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మే ఒకటవ తేదీన పశ్చిమ బెంగాల్లోని బంగావ్‌లో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సి తయారు చేసి చొరబాటుదార్లను దేశం నుంచి బయటకు పంపివేస్తామని చెప్పారు. నవంబరు 20వ తేదీన రాజ్యసభలో మాట్లాడుతూ దేశ వ్యాపితంగా ఎన్‌ఆర్‌సిని నిర్వహిస్తామని చెప్పారు. భాషా పరమైన సర్వే నిర్వహణకు రూపొందించిన వెబ్‌సైట్‌లో సైతం ఎన్‌ఆర్‌సికి ఏర్పాటు చేశారు. డిసెంబరు రెండున ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చక్రధర్‌ పూర్‌లో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సి అమలుకు 2024 చివరి గడువు అని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్ట బిల్లుపై చర్చ సందర్భంగా ఈ బిల్లుకు ఎన్‌ఆర్‌సికి సంబంధం లేదంటూ త్వరలో ఎన్‌ఆర్‌సిని కూడా తీసుకువస్తామని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా పార్లమెంటులోనే ప్రకటించారు. డిసెంబరు 17న ఇటి నౌ ఛానల్‌లో మాట్లాడుతూ సిఏఏ-ఎన్‌ఆర్‌సికి ఉన్న సంబంధం గురించి చెప్పారు. ఎన్‌ఆర్‌సి గురించి భయపడాల్సిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్నించారు. ఇన్ని చెప్పిన వారు, వాటి మీద మీడియాలో వచ్చిన వార్తలను ఒక్కదానిని కూడా ఖండించలేదు, ఇప్పుడు అబ్బే, అంతా ఉట్టిదే అని చెబుతుంటే నమ్మేదెలా !

Image result for modi - shah duo sad
అవాస్తవాలు ఒక అంశానికే పరిమితమా ? కానే కాదు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాం అన్నారు. నల్లధనాన్ని వెలికి తీస్తామన్నారు, అచ్చేదిన్‌ అన్నారు, గుజరాత్‌ తరహా అభివృద్ధి చేస్తాం చూడండన్నారు. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు వెంటనే రావు, కొంత కాలం ఆగాలి అన్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. జనం నిజమే అనుకున్నారు. సంవత్సరాలు గడిచాయి. దేశ అర్ధిక పరిస్ధితి గురించి ఐఎంఎఫ్‌ చెప్పిన అంచనాలను ఉటంకిస్తూ చూడండి మా పనితనాన్ని అంతర్జాతీయ సంస్ధ కూడా నిర్దారించింది అని చెప్పి ఊదరగొట్టారు. అదే సంస్ధ తాజాగా దేశ పరిస్ధితి మరింతగా దిగజారనుందని చెప్పింది. ఇప్పుడు దాని ప్రస్తావనే తీసుకురారు. మన సమాజం నోట్లో వేలు వేసుకొని గుడ్లప్పగించి చూస్తూ ఉంటే ఐఎంఎఫ్‌ వెనుక కూడా ప్రతిపక్షాల హస్తం ఉంది, అలా చెప్పిస్తున్నాయని, దాని అంకెలు కూడా తప్పులు తడకలని ఎదురుదాడి చేయగల ఘనులు. లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేరమే కదా, అలాగే అబద్దాలు చెప్పటం ఎంత మోసమో, నిజాలు చెప్పకపోవటం అంతకంటే పెద్ద మోసం కదూ ! నల్లధనాన్ని వెలికి తీసి ప్రతివారి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని చెప్పిన అంశం గురించి ఒకసారి అడిగితే షా గారు తన గడ్డాన్ని సవరించుకొని ఒక నవ్వు నవ్వుతూ జుమ్లా (ఏదో చెబుతుంటాం) అని సమాధానం చెప్పారు. కొద్ది రోజుల తరువాత ఎన్‌ఆర్‌సి గురించి ఆలోచించనే లేదని చెప్పింది కూడా జుమ్లా అంటే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ నియంత – ది న్యూయార్క్‌ర్‌ !

23 Monday Dec 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

CAA, India citizenship amendment act 2019, Narendra Modi an authoritarian, NRC

Image result for Narendra Modi authoritarian, protest keralaఎం కోటేశ్వరరావు
”భారత ఆర్ధిక సంస్కరణకు మంచి భవిష్యత్‌ నరేంద్రమోడీ అని నేను వాదించాను. ఇప్పుడు సంగతులు మారిపోయాయి.” అని చెప్పాడు ది టైమ్‌ జర్నలిస్టు ఇయాన్‌ బ్రెమర్‌. నరేంద్రమోడీ నియంతగా మారారు అని ది న్యూయార్క్‌ర్‌ అనే పత్రిక జర్నలిస్టు డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ వ్యాఖ్యానించారు.
”వివాదాస్పద పౌర సత్వ బిల్లును ఆమోదించటంతో భారత్‌ అంతటా నిరసనలు చెలరేగాయి. దేశ లౌకిక రాజ్యాంగానికి పెద్ద ఒక పెద్ద సవాలుగా భారత్‌ తన 20కోట్ల ముస్లిం మైనారిటీలలో కొందరిని సులభంగా జైల్లో పెట్టటానికి, బయటకు పంపివేయటానికి సులభతరం గావించేందుకు పూనుకుంది.” అని ఈనెల 20న అమెరికాలోని ప్రముఖ పత్రిక టైమ్‌ విదేశీ వ్యవహారాల సంపాదకుడైన ఇయాన్‌ బ్రెమర్‌ రాసిన విశ్లేషణ, దాని సారాంశంగా రాసిన వాక్యాలను పైన చూశాము. వెంటనే మన దేశంలోని కాషాయతాలిబాన్లు దీని వెనుక పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వామపక్షాలు, కాంగ్రెస్‌ అని వెంటనే వాట్సాప్‌ యూనివర్సిటీ, అసహ్యంగా కనిపించే ఫేస్‌బుక్‌ వంటి వాటిలో దాడులు మొదలు పెడతారని వేరే చెప్పనవసరం లేదు. వాటిని గుడ్డిగా నమ్మే జనానికి మనం చెప్పాల్సిందేమంటే మగాను భావులారా అరచేతిని చూసుకొనేందుకు అద్దం అవసరం లేదు.
”తన ప్రజాస్వామ్యానికి ఉన్న పరిమితులను పరీక్షించుకొనేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నండగా తన పరిమితులు ఏమిటో ప్రపంచానికి చూపేందుకు భారత్‌ తీరిక లేకుండా ఉంది. పొరపాటు చేయవద్దు. మానవతా పూర్వక దృక్కోణంలో చూస్తే ప్రత్యేకించి దేశంలో దాదాపుగా ఉన్న 20కోట్ల మంది ముస్లింలకు భారత్‌లో ఇప్పుడు జరుగుతున్నది విషాదం. అయితే ఇది పనిచేస్తున్న, సంఘటితమైన ప్రజాస్వామ్యానికి, తన 140 కోట్ల మంది పౌరులకు అవసరమైన సేవలు, అవకాశాలను కల్పించగల ఆధునిక మరియు సంక్లిష్ట ఆర్ధిక వ్యవస్ధ ఉన్న భారత భవిష్యత్‌కు సైతం విషాదమే.”
పైన పేర్కొన్న విధంగా తన విశ్లేషణను ప్రారంభించిన బ్రెమర్‌ గతలోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు మే ఒకటవ తేదీ టైమ్‌ సంచికలో తాను నరేంద్రమోడీ గురించి ప్రశంసా పూర్వకంగా రాసిన అంశాలను ఉటంకించారు. గత కొద్ది నెలలుగా(అంటే రెండవ సారి మోడీ అధికారానికి వచ్చిన తరువాత) మరమ్మతులు చేయటానికి వీలులేని విధంగా ఆ ప్రతిమ దెబ్బతిన్నది అని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల కారణంగా తమ పౌరులు భారత ప్రయాణాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. టైమ్‌ వంటి కార్పొరేట్‌ పత్రికలు ఇలా రాసిన తరువాత మన దేశంలో పెట్టుబడులు పెట్టేవారు వాటిని పట్టించుకోకుండా ఉంటారా, హెచ్చరికలుగా తీసుకోరా ? ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలకే పెట్టుబడిదారులు బారులు తీరతారు. బిజెపి మరియు నరేంద్రమోడీ మన దేశాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు, తాము చెప్పిన మంచి రోజులను తెచ్చేందుకు లేదా ఇంకా దిగజార్చేందుకు చూస్తున్నారో ఎవరికి వారు విశ్లేషించుకోవాలి.

Image result for Narendra Modi authoritarian
ఇయాన్‌ బ్రెయిన్‌ తన విశ్లేషణ ముగింపులో పేర్కొన్న అంశాలు ఇప్పటి వరకు బుర్రలకు పని పెట్టని వారికి ఎంతో ఉపయోగపడతాయి. వాటి సారాన్ని ఇలా చెప్పుకోవచ్చు.(అనుమానాలు ఉన్నవారు, ఆసక్తి కలిగిన వారికి వీలుగా లింక్‌ కూడా ఇస్తున్నాను)https://time.com/5753624/india-narendra-modi-nationalism/ ” భారత్‌ రాజకీయాల్లో స్ధిరపడిపోయిన వ్యక్తులతో విసిగిపోయిన కారణంగా అద్బుతమైన ప్రచారంతో 2014లో బిజెపి, నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. అధికారానికి వచ్చారు గనుక తన పెరుగుదలకు తోడ్పడిన హిందూ జాతీయ వాదం నుంచి పక్కకు తప్పుకొని పాలనా బాధ్యతలను స్వీకరిస్తారని కొంత మంది ఆశించారు. అయితే భారత ఆర్ధిక వ్యవస్ధ మందగించటం ప్రారంభమైన తరువాత 2019లో తన విజయం కోసం హిందూ జాతీయవాదం వైపు తిరిగారు. ఆర్ధిక అంశాలను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ విధానంలో జాతీయవాదం ప్రముఖపాత్రను తీసుకుంది. రాజ్యాంగబద్దంగా ఆదేశించిన లౌకిక ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా సవాలు చేయటం ప్రారంభించింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హౌదాను రద్దు చేసింది. ఒక ప్రజాస్వామిక వ్యవస్ధలో ఇంటర్నెట్‌ను సుదీర్ఘకాలం మూసివేసిన ప్రభుత్వంగా అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కింది. జాతీయ పౌరుల నమోదు(ఎన్‌ఆర్‌సి) అమలును ముందుకు తెచ్చింది. ఈ కారణంగా అసోంలో దాదాపు 20లక్షల మంది తమ పౌరసత్వాన్ని కోల్పోయారు. తాజా నమోదులో పౌరసత్వం కోల్పోయిన వారిలో పన్నెండు లక్షల మంది హిందువులే ఉన్నట్లు తేలింది. ఇది ముస్లింలు కాని ఇరుగుపొరుగు దేశాల నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పించాలనే చట్టాన్ని చేసేందుకు పురికొల్పింది. అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను వెనక్కు పంపాలని బిజెపి డిమాండ్‌ చేసింది, బంగ్లాదేశ్‌ వారిని వెనక్కు తీసుకొనేందుకు అంగీకరించే అవకాశం లేదు.” అని బ్రెమర్‌ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి ముందుకు తెచ్చిన అంశాల గురించి వామపక్షాలు ఎన్నో హెచ్చరికలు చేశాయి. ప్రస్తుతం బిజెపి పోకడలకు వ్యతిరేకంగా ఆందోళనలకు ముందుకు వచ్చిన వారితో సహా ఎక్కువ మంది వాటిని ఖాతరు చేయలేదు. ఎన్నికల ఫలితాలు రాకముందే అమెరికా టెలివిజన్‌ సిఎన్‌ఎన్‌ ప్రతినిధి గతంలో ఎన్నడూ లేని దానికంటే దేశాన్ని ఎన్నికలు మరింతగా విడదీశాయంటూ ఒక విశ్లేషణ రాశారు. బిజెపి, నరేంద్రమోడీ తీరుతెన్నులు, ప్రచార సరళిలో వచ్చిన మార్పును వర్ణిస్తూ 2014లో కొద్ది మందిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్న పరిమిత హిందూ జాతీయవాద శబ్దాలను ఇప్పుడు దేశమంతా వినిపించే లౌడ్‌ స్పీకర్లు అక్రమించాయని పేర్కొన్నారు( ఆంగ్లంలో- డాగ్‌ విజిల్‌ వస్‌ రిప్లేస్‌డ్‌ బై ఏ బుల్‌హారన్‌). ఎన్నికల ఫలితాల తరువాత నరేంద్రమోడీ విజయం భారతీయ ఆత్మకు చెడు అని లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఎవరి మీద అయినా మరులు గొన్నపుడు మనం మంచి చెడ్డలు, ఎలాంటి వారమో కూడా పట్టించుకోము. ఎవరి హెచ్చరికలను పట్టించుకోము.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అంతర్జాతీయ మీడియా ప్రముఖంగానే వార్తలుగా ఇస్తోంది. అవి పెడుతున్న శీర్షికలు వాటి అవగాహన, అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి. ” పెల్లుబుకుతున్న ఆగ్రహం, హిందూ రాజ్యంగా మారేందుకు భారత్‌ దగ్గర అవుతోందా ?” అని అమెరికా నుంచి వెలువడే న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ముస్లింలను మినహాయించటం ద్వారా మౌలికంగా వివక్షా పూరితమైనదని, దాన్ని సమీక్షించాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ చేసిన వ్యాఖ్యను ఉటంకించింది. దేని మీదా ఏకీభావానికి రాని ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించింది.
బ్రిటన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక మూడు వార్తలను ప్రచురించింది. వాటిలో ఒక దాని శీర్షిక ఇలా ఉంది.” భారత పౌరసత్వ చట్టం: తీవ్ర అణచివేత మోడీ వ్యతిరేకులను ఐక్యపరచవచ్చు” నిరసనల తీవ్రత గురించి వ్యాఖ్యానిస్తూ నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరు సంవత్సరాల తరువాత వెల్లడైన ముఖ్యమైన నిరసన అని పేర్కొన్నది.
నరేంద్రమోడీ చివరకు చాలా దూరం పోయారా అని న్యూయార్కర్‌ అనే పత్రిక విశ్లేషించింది.” ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ప్రదర్శనలు రాజకీయాల్లో ఇప్పుడో తరువాతో నియంతలు చాలా దూరం ప్రయాణిస్తారు అని ఎంతగానో నమ్మిన పురాతన సిద్దాంతాన్ని క్రమబద్దీకరించాయి. ఈ ఉదంతంలో నియంత నరేంద్రమోడీ, భారత ప్రధాని ” అని పేర్కొన్నది.డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ రాసిన విశ్లేషణలో ప్రధాని నాయకత్వం వహిస్తున్న హిందూ జాతీయవాద ప్రభుత్వం ఇరవై కోట్ల ముస్లింలను అంతర్గత శత్రువులుగా మలచింది అని వ్యాఖ్యానించారు.

Image result for Narendra Modi authoritarian
అంతర్జాతీయ మీడియాలో వెల్లడైన అభిప్రాయాలలో ఇవి కొన్ని మాత్రమే. భారత రాజకీయాలు ఏవైపు పయనిస్తున్నాయనే చర్చ మరోసారి ప్రపంచంలో ప్రారంభమైంది. మన దేశంలో సరేసరి. నరేంద్రమోడీ నియంతా, ఫాసిస్టా, మరొక ప్రమాదకారా ఏ తరగతికి చెందుతారు అన్న అంశంపై అనేక మందిలో ఏకీభావం ఉండకపోవచ్చు. మన విభేదాలను తరువాత చూద్దాం, ఈ అన్ని లక్షణాలు కలిగిన శక్తిని ముందు వ్యతిరేకిద్దాం అనే ఏకాభిప్రాయ క్రమం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఓట్ల రాజకీయంలో బిజెపి పోటీ పడి అది ముందుకు తెస్తున్న మతోన్మాదంతో రాజీపడుతున్న రాజకీయ పార్టీల పట్ల కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో హిందూ జాతీయవాదాన్ని ప్రత్యక్షంగా కాకపోయినా దానికి ప్రాతినిధ్యం వహించే నరేంద్రమోడీ సర్కార్‌ను బలపరిచేందుకు పోటీ పడుతున్న తెలుగుదేశం, వైసిపి వంటి పార్టీలు తమ వైఖరిని పునరాలోచించుకుంటాయా లేదా అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న. వాటి వెనుక ఉన్న మైనారిటీ తరగతుల వారు ఆలోచనలో పడుతున్నారు. ఒక మెజారిటీ మతోన్మాద శక్తిని ఎదుర్కొనేందుకు మరొక మైనారిటీ మతోన్మాదశక్తి వెనుక సమీకరణ కావటం, బలపరచటం కూడా ప్రమాదకరమే. అలాంటి మొగ్గునే మెజారిటీ మతశక్తులు కోరుకుంటున్నాయి. ఆ ఊబిలో ఎప్పుడు దిగుతారా అని చూస్తున్నాయి. ఎందుకంటే దాన్ని చూపి మెజారిటీ మద్దతును కూడగట్టుకోవటం సులభం కనుక ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్న మైనారిటీలు జాగ్రత్తగా ఉండటం కూడా అవసరమే. లౌకిక, వామపక్ష భావాలవైపు సమీకృతమై ఉమ్మడిగా లౌకిక రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకొనేందుకు పూనుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూడు రాజధానులతో అభివృద్ది-మూడు ఎండమావులు !

19 Thursday Dec 2019

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Amaravathi capital, ANDHRA PRADESH Capital Politics, Andhrapradesh new Capitol

Image result for three capitals

ఎం కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేండ్ల క్రితం ప్రారంభమైన రాజధాని రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. అది కూడా రాజధానికి-అభివృద్ధికి ముడి పెట్టటం, ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పక తప్పదు. తెలుగుదేశం గత ఐదేండ్ల పాలనలో భ్రమరావతిగా ఒక్క అమరావతినే చూపారు. ఇప్పుడు అభివృద్ది వికేంద్రీకరణ, అభివృద్ది పేరుతో మరో రెండు భ్రమరావతులను ప్రదర్శించేందుకు వైసిపి ఆరునెలల పాలన నాంది పలికిందా అన్న అనుమానాలు తలెత్తాయి. దీనిపై అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు గనుక దీని మంచి చెడ్డల పరిశీలన కూడా ఆ పరిమితుల్లోనే ఉంటుంది.
కన్యాశుల్కంలో తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అని అగ్నిహౌత్రావధానులు ఆంటాడు. డిసెంబరు17న అసెంబ్లీలో మాట్లాడుతూ మూడు రాజధానులు రావచ్చునేమో అన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రకటన ద్వారా తాంబూలాలతో నిమిత్తం లేకుండానే తన్నుకు చచ్చేందుకు తెరతీశారు. అప్పుడే నిర్ణయం జరిగిపోయినట్లుగా విశాఖ, కర్నూల్లో హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా తమను మోసం చేశారంటూ అమరావతిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంద్‌ చేశారు. అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు, విశాఖలో సచివాలయం అని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చెప్పేశారు.

Image result for three capitals
ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతో మరొకరో , మీడియా ఊహాగానాల్లోనో ఉన్నరాజధానిపోవచ్చు, కొత్త రాజధానులు రావచ్చేమో అంటే అదొక తీరు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అసెంబ్లీలో వచ్చు భాష మాట్లాడితే దాన్ని రాజకీయం తప్ప అని మరొకటి అనలేరు. రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేసేందుకు ఐదుగురు పట్టణ ప్రణాళికల నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పట్టణాల నిపుణులు రాష్ట్ర అభివృద్ధి, అమరావతి గురించి ఏమి చెబుతారో తెలియదు. వివిధ తరగతుల నుంచి అభిప్రాయలు సేకరించారు గనుక ఏదో ఒకటి చెబుతారనుకుందాం. కొద్ది రోజుల్లో అలాంటి నివేదిక ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. రాకముందే రాజధానులు మూడు వుండవచ్చు అని సిఎం చెప్పేశారంటే నివేదికలో అలాగే ఇమ్మని ముందుగానే ఉప్పందించారనే అనుకోవాలి. ఒక వేళ దానికి భిన్నంగా ఇస్తే ఏమిటి అన్నది ప్రశ్న !
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు పాలకులు తలచుకొంటే ఏదీ అసాధ్యం కాదు. కమిటీల నివేదికల సిఫార్సులకు, పాలకుల నిర్ణయాలకు సంబంధం లేదు. రాజధాని గురించి గతంలో శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం తన స్వంత నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చినట్లుగా వైసిపి ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. భిన్నంగా ఇస్తే చంద్రబాబు చెప్పుల్లో కాళ్లు పెట్టి వైఎస్‌ జగన్‌ స్వంత నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఎన్నో తర్జన భర్జనలు, తెరవెనుక మంత్రాంగాలు, లావాదేవీలు పూర్తయ్యాక అక్కడా, ఇక్కడా అని చెప్పిన పుకార్ల వ్యాప్తి, శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సుల తరువాత వాటికి భిన్నంగా రాజధాని నిర్మాణానికి చివరకు అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. దానికి ప్రతిపక్షంగా ఉన్న వైసిపి, దానికి నేతగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి కూడా అంగీకరించారు. అప్పుడు జగన్‌ ఆయన పరివారానికి ‘ ఇంగ్లీషు, తెలుగు ‘ భాష వచ్చు అయినా ఆ సమయంలో అధికార వికేంద్రీకరణ, భిన్న రాజధానుల గురించి మాట్లాడలేదు. ఎన్నికల ప్రణాళికలో అలాంటి ఊసు లేదు. అసెంబ్లీలో అంగీకరించినా జగన్‌ అధికారానికి వస్తే రాజధానిని మార్చివేస్తారని తెలుగుదేశం ప్రచారదాడి చేసింది. చంద్రబాబు రాజధానిలో స్దిరనివాసం ఏర్పరచుకోలేదు, మానేత తాడేపల్లిలో ఏకంగా ఇల్లుకట్టుకున్నారు, అలాంటి వ్యక్తి అమరావతి నుంచి రాజధానిని ఎలా మారుస్తారని వైసిపి నేతలు ఎదురుదాడి చేశారు. ఆయనే ఇప్పుడు అధికారపీఠమెక్కారు. చంద్రబాబు అధికారానికి వచ్చిన ఆరునెలల తరువాత రాజధాని మీద నిర్ణయం తీసుకుంటే, వైఎస్‌ జగన్‌ కూడా సరిగ్గా ఆరునెలల తరువాతే రాజధాని గురించి తన మన్‌కీ బాత్‌ వెల్లడించారు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా బిజెపి నేతల మాటలు ఉన్నాయి.

Image result for three capitals
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మరో నాలుగున్నర సంవత్సరాల తరువాత మరో పార్టీ, ముఖ్య మంత్రి అధికారానికి వస్తే మూడింటితో అభివృద్ధి ముడిపడలేదు, మూడును పదమూడు చేస్తా అంటే ? వంతుల వారీగా ప్రతి జిల్లాలోనూ రాజధానులను ఏర్పాటు చేయవచ్చు. వారికి పోయేదేముంది. వారు లేదా వారి అనుయాయులుగా ఉన్న వారి రియలెస్టేట్‌ ప్రయోజనాలు కదా ముఖ్యం. గుడ్డిగా సమర్ధించే మద్దతుదారులు ఎలాగూ ఉంటారు. గతంలో చంద్రబాబు వాషింగ్టన్‌, కౌలాలంపూర్‌, సింగపూర్‌ ఇలా ఏ నగరం పేరు చెప్పి అలాంటి నగరాల మాదిరి ప్రపంచ స్ధాయి రాజధానిని నిర్మిస్తామంటే తెలుగుదేశం మద్దతుదారులు, అభిమానులు బుర్రలను తీసి పక్కన పెట్టి తలలు ఊపారు. మూడు ప్రాంతాలలో రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని జగన్మోహన్‌ రెడ్డి చెబుతుంటే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తేడా రంగులు, అభిమానులు మారారంతే !
రాజధాని రాజకీయంలో చంద్రబాబు కొన్ని నగరాల పేర్లను ముందుకు తెస్తే జగన్మోహన్‌రెడ్డి రాజధాని రాజకీయానికి దక్షిణాఫ్రికా దేశాన్ని తెరమీదకు తెచ్చారు. సినిమా ఇంటర్వెల్‌ వరకే చెప్పి ముగింపు చెప్పకపోతే ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రికి దక్షిణాఫ్రికా కధను చెప్పిన వారు అదే పని చేశారు. జాత్యంహార వ్యవస్ధ చిహ్నాలుగా ఉన్న మూడు రాజధానులకు బదులు సరికొత్త రాజధాని నిర్మాణం జరపాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు చెప్పలేదు. వందిమాగధులు రాజుగారికి ఇష్టమైన అంశాలనే చెప్పేవారు. ఇప్పుడు వారి స్ధానాన్ని ప్రభుత్వ సలహాదారులు అక్రమించారు కనుక సగమే చెప్పి ఉండాలి.
దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులుంటే రెండు రాజధానులున్న దేశాల మరో డజను వరకు ఉన్నాయి. అసలు రాజధానికి ప్రత్యేకంగా ఒక నగరమంటూ లేకుండానే ఒక మున్సిపల్‌ జిల్లాలోని ఒక పట్టణంలో రాజధాని కలిగి ఉన్న హొండూరాస్‌ గురించి సలహాదారులకు తెలిసినా చెప్పి ఉండరు. రాజధాని-అభివృద్ధి గురించి చర్చించబోయే ముందు సిఎం ప్రకటనతో దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయని అనేక మందిలో ఉత్సుకత తలెత్తింది. కేప్‌టౌన్‌లో పార్లమెంట్‌, ప్రిటోరియాలో పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్ధ కేంద్రంగా బ్లోయెమ్‌ ఫోంటెన్‌ ఉంది.
నేడు దక్షిణాఫ్రికాగా పిలుస్తున్న ప్రాంతాన్ని 1657లో డచ్‌ ఈస్టిండియా కంపెనీ ఆక్రమించింది. తరువాత డచ్‌వారు ఆ ప్రాంతాన్ని 1806లో బ్రిటీష్‌ వారికి ధారాదత్తం చేశారు. డచ్‌ పాలనా కాలంలో డచ్‌ జాతీయుల ఆధిపత్యంలోని ఆరు ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇచ్చారు. వాటిని బోయర్‌ రిపబ్లిక్‌లని పిలిచారు. వాటిలో దక్షిణాఫ్రికా, ఆరెంజ్‌ ఫ్రీ స్టేట్‌ అనే రిపబ్లిక్‌లు పెద్దవి. బ్రిటీష్‌ వారు పెత్తనానికి వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలు లేదా యథాతధ స్ధితిని కొనసాగించటానికి భిన్నంగా బోయర్‌ రిపబ్లిక్‌ల మీద తమ ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రయత్నంలో బోయర్‌ రిపబ్లిక్‌లు ప్రతిఘటించాయి. వాటినే ఆంగ్లో-బోయర్‌ యుద్ధాలు అని పిలిచారు. చివరికి 1910లో బ్రిటీష్‌ వారు పాక్షిక స్వాతంత్య్రం, బ్రిటీష్‌ ప్రాంతాలు-బోయర్‌ రిపబ్లిక్‌లతో కూడిన ఒక యూనియన్‌ ఏర్పాటు చేశారు. అప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం వారికి చెందిన రెండు పెద్ద పాలిత ప్రాంతాల రాజధానులలో ,బ్రిటీష్‌ వారి రాజధానిలో ఒక్కొక్క చోట ఒక్కో విభాగాన్ని ఏర్పాటు చేయాలనే నిబంధన అమల్లో భాగంగా పైన చెప్పుకున్న మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చాయి.
1934లో పూర్తి స్వాతంత్య్రం వచ్చింది. డచ్‌, బ్రిటీష్‌ వారు ఎవరు అధికారంలో ఉన్నా వారు స్ధానిక ఆఫ్రికన్ల పట్ల జాత్యహంకారంతో వ్యవహరించారు. ఆ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరుతో చివరకు జైలు నుంచి నెల్సన్‌ మండేలా విడుదల, 1994 ఎన్నికల్లో ఎఎన్‌సి విజయంతో జాత్యహంకార పాలన ముగిసింది. ఆ వ్యవస్ధ చిహ్నాలుగా ఉన్న రాజధానుల స్ధానంలో ఒక చోట కొత్త రాజధాని నిర్మాణం జరపాలని అనేక మంది కోరారు. అయితే దాని కంటే ఇతర ప్రాధాన్యతలకు నిధులు అవసరమైనందున ఆప్రతిపాదనను పక్కన పెట్టి ఉన్న వ్యవస్ధలనే కొనసాగిస్తున్నారు.
ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా అనుభవం నుంచి ఏమి నేర్చుకోవాలి? మూడు చోట్ల ఉన్నవాటిని ఒక చోటకు చేర్చాలంటే వారికి నిధుల సమస్య ఎదురైంది. తాత్కాలికంగా అయినా వాయిదా వేసుకున్నారు. అప్పులు, ఆర్ధిక ఇబ్బందుల గురించి చెబుతున్న జగన్మోహన్‌ రెడ్డి ఉన్న ఒక రాజధానిని మూడుకు పెంచవచ్చని చెప్పటం గమనించాల్సిన అంశం. ప్రస్తుతం ఉన్న రాజధానిలో పాలన సాగించటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. తాత్కాలిక కట్టడాలుగా ఉన్నవాటినే ఉపయోగపడినంత కాలం శాశ్వతంగా మార్చినా పోయేదేమీ లేదు. ఇప్పటి వరకు సామాన్య జనానికి లేని ఇబ్బంది కొత్తగా వచ్చేదేమీ ఉండదు.
ఎన్ని రాజధానులు ఉండాలి అనేది దేశాలన్నింటా ఒకే విధంగా లేదు. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమస్టర్‌ డామ్‌. మరో పట్టణం హేగ్‌ వందల సంవత్సరాలుగా రాజధానిగా ఉంది. బొలీవియాలో లాపాజ్‌ మరియు సకురే పట్టణాలను రాజధానులుగా పరిగణించి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని శాఖలను పని చేయిస్తున్నారు. 19వ శతాబ్దంలో తలెత్తిన విబేధాల కారణాంగా ఇలా చేశారు.కోట్‌ డిలోవరీ అనే ఆఫ్రికన్‌ దేశం అధికారిక రాజధాని యెమౌసుకోరో, అయితే ప్రభుత్వం మాత్రం అబిడ్‌జాన్‌లో ఉంటుంది. అధికారికంగా రాజధాని కాదు. బెనిన్‌ అనే దేశ రాజధాని పోర్టో నోవా, కానీ పాలన మాత్రమ కోటోనౌ పట్టణం నుంచి జరుగుతుంది. చిలీ రాజధాని శాంటియాగో, కానీ 1990లో పార్లమెంట్‌ను వలపారిసోకు తరలించారు. పూర్వపు సోవియట్‌ రిప్లబిక్‌గా ఉండి ఇప్పుడు స్వతంత్ర దేశమైన జార్జియా రాజధాని తిబిలిసి, పార్లమెంట్‌ మాత్రం కుటారుసిలో ఉంది. హొండురాస్‌ అనే దేశానికి అసలు దేశ రాజధాని పట్టణం లేదు. సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ మున్సిపాలిటీ అనే పాలనా ప్రాంతంలో తెగుసియోగాల్పా అనే పట్టణం నుంచి పాలన సాగుతుంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌, అయితే 1999లో పుత్ర జయ అనే పట్టణానికి తరలించారు. మాంటెనీగ్రో అనే దేశ రాజధాని పోడ్‌గార్సియా. అయితే మాజీ రాజధాని అయిన సెటినిజేను గౌరవ రాజధానిగా పరిగణిస్తున్నారు. దక్షిణ కొరియాకు రెండు రాజధానులున్నాయి. సియోల్‌ పట్టణం రద్దీగా మారినందున 2012 నుంచి సిజోంగ్‌ పట్టణాన్ని పాలనా రాజధానిగా చేశారు. శ్రీలంక రాజధాని కొలంబో అయితే శివార్లలో జయవర్ధనే పుర కొటే అనే చోట రాజధాని నిర్మాణం చేశారు. స్వాజీలాండ్‌ అనే దేశంలో కార్యాలయాలు మబాబ్‌నేలో ఉంటే లొబాంబాలో పార్లమెంట్‌ ఉంది. టాంజానియా రాజధాని దారెస్‌ సలామ్‌, అయితే దేశంలో మధ్యలో ఉండే డోడోమాకు 1973లో రాజధానిని మార్చారు. పశ్చిమ సహారాలో అంతర్యుద్ధం జరుగుతున్నది. రెండు ప్రధాన పక్షాలు రెండు ప్రాంతాలను తమ రాజధానులుగా ప్రకటించకున్నాయి. మొరాకో తన రాజధాని లాయునే అంటే సహరావీ అరబ్‌ రిపబ్లిక్‌ టిఫారిటీని రాజధానిగా పరిగణిస్తుంది.
మన దేశంలో రద్దయిన కాశ్మీర్‌కు,మహారాష్ట్రకు రెండు రాజధానులు ఉన్నాయి. చలికాలంలో శ్రీనగర్‌లో మంచు కారణంగా జమ్మూలో రాజధాని పని చేస్తుంది. స్వాతంత్య్రానికి ముందు తరువాత సెంట్రల్‌ ప్రావిన్సుగా ఉన్న ప్రాంతానికి రాజధాని నాగపూర్‌. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన మహారాష్ట్రలో నాగపూర్‌ ఉన్న విదర్భ ప్రాంతాన్ని విలీనం చేశారు. రాజధాని ముంబైలో ఉంటే తమ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుందేమో అన్న భయం ఆప్రాంత జనంలో ఏర్పడటంతో నాగపూర్‌ను అనుబంధ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక అసెంబ్లీ సమావేశాన్ని అక్కడ జరుపుతారు.
మద్రాస్‌ ప్రావిన్సు నుంచి తెలుగు ప్రాంతాలను విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నపుడు రాయలసీమనేతలు లేవనెత్తిన సందేహాలను తీర్చేందుకు శ్రీబాగ్‌ ఒప్పందంలో భాగంగా కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేశారు. అందరికీ అందుబాటులో విజయవాడలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కూడా ఉంది. అయితే విజయవాడ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్నందున అక్కడ రాజధాని ఏర్పాటుకు కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు. అయితే ఆ ప్రాంతాన్ని సంతృప్తి పరచేందుకు గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు సమయంలో గుంటూరులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కోరటం తప్ప ఎలాంటి హామీలను కోరలేదు. ఆంధ్రప్రదేశ్‌ను విడదీసినపుడు, రాజధాని ఏర్పాటు సమయంలోనూ ఎలాంటి ప్రత్యేక డిమాండ్లు ముందుకు రాలేదు. అమరావతి నిర్ణయం సాఫీగానే జరిగింది.

Image result for three capitals
ప్రపంచంలో ప్రతి దేశానికి, మన దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధానులు ఉన్నాయి. అవేమీ జనాన్ని దారిద్య్రం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వెనుకబాటు తనం, నిరక్షరాస్యత, వ్యవసాయ సంక్షోభం, సంపదల కేంద్రీకరణ, ప్రాంతీయ అసమానతల వంటి వాటి నుంచి జనాన్ని బయటపడలేక పోయాయి. అయినా రాజధానితో అభివృద్ధి సాధిస్తామని చెబుతుంటే ఎంత మంది నమ్ముతున్నారో తెలియదు గానీ నమ్మే వారంతా గుడ్డిగా ఉన్నారని చెప్పకతప్పదు.పైన పేర్కొన్నట్లుగా దేశాల రాజధానుల, మన దేశంలో రెండు రాష్ట్రాల రా నిర్ణయంలో అనేక అంశాలు పని చేశాయి. అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు మూడు మూడూ చోట్ల ఉంటే అది ఆర్ధికంగా భారాన్ని మోపేదే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సచివాలయం, అసెంబ్లీ వేరు వేరు నగరాల్లో ఉంటే అధికారులు, సిబ్బంది పనికి అంతరాయంతో పాటు ఆర్ధికంగా అదనపు భారాన్ని మోపుతుంది. అనేక రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానికి దూరంగా ఉన్నాయి. కొన్ని చోట్ల హైకోర్టు బెంచ్‌లు ఉన్నాయి. అలాగే కొన్ని శాఖలకు ప్రాంతీయ డైరెక్టరేట్‌ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అందువలన అలాంటి వాటి గురించి ఆలోచించవచ్చు తప్ప మూడు వ్యవస్దల ప్రధాన కేంద్రాలను వేర్వేరు చోట్ల నుంచి పని చేయించటం సరైంది కాదు.
అనేక మంది అధికార వికేంద్రీకరణ అంటే పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయటం అనే అర్ధంలో మాట్లాడుతున్నారు. రాష్ట్ర కేంద్రంగా ఉన్న అధికారాలను వాటిని స్ధానిక సంస్ధలకు బదలాయించటం అనే విషయాన్ని మరచిపోతున్నారు. రెండవది ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది మరొక భ్రమ. గతంలో రాజధాని ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్ధాపించాయి. ఇప్పుడు వాటిని తెగనమ్మే కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నాయి. అందువలన ప్రభుత్వాల పెట్టుబడులు రావు. ప్రయివేటు పెట్టుబడులు రాజధానిగా ఉన్న నగర ప్రాతిపదికన రావు. వాటికి ఎక్కడ లాభసాటి అయితే అక్కడకు పోతాయి తప్ప మరొకటి కాదు. విశాఖలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రవెనుకబాటు తనమూ, కర్నూల్లో హైకోర్టు ఏర్పడితే రాయలసీమ వెనుకబాటు తనమూ, అమరావతిలో అసెంబ్లీ ఉంటే కోస్తా జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని ఎవరైనా వాదిస్తే వారికి వంద నమస్కారాలు పెట్టటంతప్ప తర్కంతో చర్చ జరిపితే వినే స్ధితిలో ఉండరు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ది జరుగుతుందని చెబుతున్న లేదా నిజంగా నమ్ముతుంటే బిజెపి నేతలు, ఇతరులు ఢిల్లీలో ఉన్న కేంద్ర రాజధానిని విభజించి ప్రతి రాష్ట్రంలోనూ అత్యంత వెనుకబడిన ప్రాంతంలో కేంద్ర రాజధానుల శాఖలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేయాలి. అప్పుడు దేశమంతా అభివృద్ధి చెందుతుంది.అంతకంటే కావాల్సింది ఏముంది. ప్రత్యేక హౌదా కావాలన్న డిమాండ్లు రావు, ఆ వాగ్దానంపై మడమ తిప్పను అని చెప్పుకొనే వారికి ఇబ్బంది ఉండదు ! సర్వేజనా సుఖినో భవంతు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

పౌరసత్వ సవరణ చట్టం-వాదనలు, వాస్తవాలు !

16 Monday Dec 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ 1 Comment

Tags

CAA, CAB, citizenship amendment act 2019 : some arguments and facts, India citizenship amendment act 2019

Image result for citizenship amendment act 2019పౌరసత్వ సవరణ చట్టం-వాదనలు, వాస్తవాలు !
ఎం కోటేశ్వరరావు
పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది.దీని చట్టబద్దతను సవాలు చేస్తూ అనేక మంది సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నారు. ఈ చట్టం గురించి అనేక మందిలో తలెత్తిన అనుమానాలు, కొన్ని వాదనలు, వాస్తవాలను చూద్దాం.
ఈ చట్టం ద్వారా ప్రస్తుతం దేశంలో ఉన్న ముస్లింలకు పోయేదేమీ లేదు, అయినా ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు, వారిని ఎవరో రెచ్చగొడుతున్నారు, విదేశీ ముస్లింలను ఆహ్వానించి పౌరసత్వం ఇవ్వాలని వారు కోరుతున్నారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు మాట్లాడే వారు ఈశాన్య రాష్ట్రాలలో నిరసనలు తెలుపుతున్నది ప్రధానంగా హిందువులే అన్న అంశాన్ని కావాలనే విస్మరిస్తున్నారు. అసోంలో ఇప్పటికే కొందరు బిజెపి నేతలు పదవులకు రాజీనామాలు చేశారు, బిజెపి మద్దతుదారైన ఏజిపి పునరాలోచనలో పడింది. మరి వీరిని ఎవరు ప్రేరేపిస్తున్నట్లు ?
1985లో కుదిరిన అస్సాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తరువాత దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారందరినీ మతంతో నిమిత్తం లేకుండా వెనక్కు పంపాల్సి ఉండగా విదేశీయులకు స్వాగతం పలికేందుకు ఎవరూ సిద్ధం కాదు, అలాంటి అవసరమూ లేదు. దేశంలోని ఏ ముస్లిమూ అలాంటి డిమాండ్‌ను ఎన్నడూ ముందుకు తేలేదు. గతంలో లేని మాదిరి శరణార్దులుగా వచ్చిన వారికి మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించిన వారు, రేపు అదే ప్రాతిపదికన ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు కూడా వెనుకాడరన్నదే ఇప్పుడు తలెత్తిన భయం. రాజ్యాంగాన్ని దెబ్బతీసే అనేక చర్యలను వేగంగా తీసుకుంటున్న పూర్వరంగంలో ఇతర మత రాజ్యాలలో మాదిరి తమ హక్కులను హరిస్తారా, రెండవ తరగతి పౌరులుగా మారుస్తారా అన్న ఆందోళనే మైనారిటీలను ఆందోళనకు గురి చేస్తోంది.
సవరించిన చట్టం ప్రకారం పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘ్‌నిస్తాన్‌లో ఉన్న హిందువులు ఎవరైనా మన దేశంలోని బంధువులు, కుటుంబాలతో కలసిపోయేందుకు అక్కడి నుంచి వలస వస్తే వారికి పౌరసత్వం ఇచ్చే వీలు కల్పిస్తుంది. ఇదే సూత్రం ముస్లింలకు వర్తించదు. హిందువుల మాదిరే ఈ దేశాల్లో ఉన్న ముస్లింలకు కూడా మన దేశంలో బంధుత్వాలు, కుటుంబాలు ఉన్నాయి. ఒక మతం వారికి ఒక సూత్రం, మరొక మతం వారికి మరొక సూత్రం మన రాజ్యాంగంలో లేదే !
ఈ మూడు దేశాల్లో ఉన్నది ఇస్లామిక్‌ ప్రభుత్వాలు. పాక్‌, ఆప్ఘనిస్తాన్‌ మాత్రమే ఇస్లామిక్‌ అని ప్రకటించుకున్నాయి.1972లో బంగ్లాదేశ్‌ లౌకిక రాజ్యంగా ఏర్పడింది. తరువాత దానిని 1980లో ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చారు.1972లో ఆమోదించిన లౌకిక సూత్రాలే చెల్లుబాటు అవుతాయని 2010లో అక్కడి సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయినప్పటికీ ఆచరణలో మత రాజ్యంగా ఉందనే కొందరు చెబుతారు.
ఈ మూడు దేశాల్లో అత్యధికులు ముస్లింలు, మిగిలిన వారందరూ మైనారిటీలు, వారి మీద దాడులు జరుగుతున్నాయి కనుక వారు మాత్రమే భారత్‌లో పౌరసత్వం పొందేందుకు అర్హులు అన్నది ఒక వాదన. ప్రపంచంలో మైనారిటీలు అన్నిదేశాలలో ఉన్నారు. పాకిస్ధాన్‌లో కంటే ఇండోనేషియాలో హిందువుల సంఖ్య. మన దేశంలో మైనారిటీల మీద దాడులు జరుగుతున్నట్లుగానే ప్రపంచంలో అనేక దేశాల్లో దాడులు జరుగుతున్నాయి. అలాంటి వారు మరొక దేశంలో ఆశ్రయం కోరితే వారికి మత ప్రాతిపదికన పౌరసత్వం మంజూరు చేసే పద్దతి ఏ దేశంలోనూ లేదు.
పాకిస్ధాన్‌లో మైనారిటీలు అంటే ఒక్క హిందువులే కాదు. హిందువులలో వివిధ తరగతులు ఉన్నట్లే ముస్లింలలో కూడా మెజారిటీ, మైనారిటీలు ఉన్నారు. అక్కడి షియాలు, అహమ్మదీయాలు, సూఫీలు మైనారిటీలే. హిందువులు ఇతర మైనారిటీల మీద దాడులు జరిగినట్లే వీరి మీద కూడా నిత్యం దాడులు జరుగుతున్నాయి.హిందువులకు ఉన్నట్లే వీరి పూర్వీకులు కూడా మన దేశంలో ఉన్నారు. అయినప్పటికీ ఈ మైనారిటీలు ఆశ్రయం కోరితే తాజాగా చేసిన సవరణ చట్టంలో అంగీకరించే అవకాశం లేదు. పాకిస్ధాన్‌లో లష్కరే జాంగ్వీ పేరుతో ఒక ఉగ్రవాద సంస్ధ ఉంది. దీని పని షియాల మీద దాడులు, వారిని చంపటమే. వారిని ముస్లిమేతరులుగా ప్రకటించాలని అది డిమాండ్‌ చేస్తోంది. 2003-16 మధ్య 2,558 మందిని హత్య చేయగా 4,518 మందిని గాయపరిచారు. జనాభాలో షియాలు 15నుంచి 20శాతం వరకు ఉన్నారు.
1974లో పాకిస్ధాన్‌ ఒక రాజ్యాంగ సవరణ చేసి అహమ్మదీలను ముస్లిమేతరులుగా ప్రకటించింది. తరువాత నియంత జియావుల్‌ హక్‌ అహమ్మదీయాలు తమను ముస్లింలుగా పిలుచుకోవటాన్ని నిషేధించాడు. తెహరిక్‌ ఇ తాలిబాన్‌ పాకిస్ధాన్‌ అనే సంస్ధ లాహౌర్‌ తదితర చోట్ల అహమ్మదీలు, వారి మసీదులపై దాడులు చేస్తున్నది. పోలీసులు కూడా అదే దుండగాలకు పాల్పడుతున్నారు. మన దేశంలో ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేష ప్రచారం చేస్తున్నట్లుగానే అహమ్మదీల మీద పత్రికల్లోనే అలాంటి ప్రచారానికి సంబంధించి 3,963 వార్తలు, 532 వ్యాసాలను ఉటంకిస్తూ బాధితులు ఒక నివేదికను విడుదల చేశారు. బంగ్లాదేశ్‌లో దేవుడు, దేవదూతలు, ప్రవక్తల పట్ల విశ్వాసం లేని వారు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వారందరూ ఆచరణలో ముస్లిం మైనారిటీలే, వారు గాక బీహారీ ముస్లింలు, అస్సామీ ముస్లింల పట్ల బంగ్లాదేశ్‌లో వివక్ష కొనసాగుతోంది, వారు దాడులకు గురవుతున్నారు, వారు శరణు కోరితే వైఖరి ఏమిటి ?

Image result for citizenship amendment act 2019
బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలోని సంస్క త విద్యా ధర్మ విజ్ఞాన కేంద్రంలో సంస్క తంలో ఉన్న హిందూ పురాణాలను జంధ్యం లేని, ఫిరోజ్‌ ఖాన్‌ అనే ఒక ముస్లిం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బోధించటాన్ని అంగీకరించేది లేదంటూ అక్కడి విద్యార్ధులు, కొందరు టీచర్లు కూడా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దాంతో ఫిరోజ్‌ఖాన్‌ రాజీనామా చేశారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పోయిన తన పరువును కాపాడుకొనేందుకు రాజీమార్గంగా ఫిరోజ్‌ఖాన్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని ఆర్ట్స్‌ విభాగంలో సంస్క త సాహిత్యం, భాషా విభాగంలో నియమించింది.
పాకిస్ధాన్‌లో కూడా మతఛాందస శక్తులు అతిఫ్‌ మియాన్‌ అనే అహమ్మదీ సామాజిక తరగతికి చెందిన ఆర్ధికవేత్తను ఆర్ధిక సలహా మండలిలో పని చేయటానికి అంగీకరించబోమని వత్తిడి చేయటంతో వారంలోపే నియామకాన్ని రద్దు చేశారు. మత అసహనం, వివక్షకు ఇది పక్కా నిదర్శనం. సూఫీ ముస్లింల మీద కూడా అక్కడ ఇలాంటి దాడులే జరుగుతున్నాయి. వారు కూడా పాక్‌లో హిందువుల మాదిరే మన పూర్వీకులే కదా ! శరణార్ధులంటే ఎవరైనా శరణార్ధులే, వారిని అనుమతించటమా లేదా అనే ఒక విధానం తీసుకోవటంలో తప్పు లేదు కానీ వారి పట్ల మత విబేధాన్ని పాటించటం అంటే ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటమే. ఇది మన భారతీయ సంప్రదాయం కానే కాదు. అఖండ్‌ భారత్‌ను పునరుద్దరించాలని చెప్పే వారు, ఈ సంకుచిత వైఖరిని అనుసరించటంలో హిందూ ఓటు బ్యాంకు రాజకీయం తప్ప, విశాల భావనకు చోటెక్కడ ? పౌరసత్వ చట్ట సవరణ ద్వారా అఖండ భారత్‌లో విభజనకు పూర్వం ఉన్న ముస్లింలకు చోటు లేదని తేల్చి చెప్పారు.
రాజ్యాంగ విరుద్దం అని ఎందుకు అంటున్నారు ?
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారు ముస్లిం అనుకూలురు, ఇతర దేశాల నుంచి ముస్లింలు వలస రావాలని కోరుతున్నారనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగ విరుద్దమైన చర్యను వ్యతిరేకించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ముస్లింలే వ్యతిరేకిస్తున్నారు అనేది తప్పుడు ప్రచారం, వక్రీకరణ. దేశ విభజన నేపధ్యంలో తలెత్తే పౌరసత్వ సమస్యలను పరిష్కరించేందుకు హింద్షూముస్లిం అనే వివక్ష లేకుండా రాజ్యాంగంలోని ఐదు నుంచి పదకొండు వరకు ఉన్న ఆర్టికల్స్‌ నిబంధనలు, విధి విధానాలను స్పష్టంగా పేర్కొన్నాయి. ఆర్టికల్‌ పదకొండు ప్రకారం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు, తిరస్కరించేందుకు పార్లమెంట్‌కు అధికారం ఇచ్చింది. ఇప్పుడు దాన్ని వినియోగించుకొని ఆ ఆర్టికల్‌ను సవరిస్తూ మత ప్రాతిపదికన ముస్లిం మినహా పైన పేర్కొన్న మూడు దేశాల నుంచి వచ్చిన హిందూ, బౌద్ద, జైన, సిక్కు, పార్సీ, క్రైస్తవులకు పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఎన్‌డిఏ సర్కార్‌ చట్టసవరణ చేసింది. గతంలో లేని మత వివక్షను చొప్పించింది, ఇది లౌకిక స్వభావం నుంచి మత రాజ్యంవైపు వేసే అడుగులో భాగం తప్ప మరొకటి కాదు. ఆర్టికల్‌ 14కు విరుద్ధం.
1955 చట్టం ప్రకారం అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే అవకాశం లేదు. సవరించిన చట్టంలో దీనికి మినహాయింపులు ఇచ్చారు. 2015లో పాస్‌పోర్టు, విదేశీయుల చట్టానికి సంబంధించి చేసిన సవరణల ప్రకారం ముస్లిమేతరులు తగిన పత్రాలు లేకుండా దేశంలో ప్రవేశించినప్పటికీ పౌరసత్వాన్ని పొందేందుకు అవసరమైన ఎత్తుగడ దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది చట్టసవరణకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దాంతో రాజ్యాంగ ఆరవ షెడ్యూలులో చేర్చిన గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ఒకసారి పౌరసత్వం ఇచ్చిన తరువాత ఈ ప్రాంతాలకు వలసలను ఎలా నిరోధిస్తారన్నది ఒక ప్రశ్న. తెలుగు రాష్ట్రాలలో ఒన్‌ ఆఫ్‌ 70 చట్టం ఉన్నప్పటికీ గిరిజనేతరులు గిరిజన ప్రాంతాలకు ఎలా చేరుతున్నదీ చూస్తున్నాము.ఈశాన్యరాష్ట్రాలలోని గిరిజనేతర ప్రాంతాలను ఇప్పటి వరకు శరణార్ధులుగా ఉన్న వారికి పౌరసత్వం ఇచ్చి నింపితే స్ధానికులు తాము మైనారిటీలుగా మారతామని, తమ భాష, భూమి, సంస్క తులకు ముప్పు వస్తుందనే భయంతో ఆ ప్రాంతాలన్నీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

Image result for citizenship amendment act 2019
శరణార్ధుల విషయంలో మత ప్రాతిపదికను ప్రవేశపెట్టిన కేంద్రం ఇంతటితో ఆగుతుందనే హామీ లేని కారణంగా మైనారిటీల్లో భయం ఏర్పడింది. ఈశాన్య ప్రాంతాలలో తమ అస్ధిత్వం, అవకాశాల గురించి హిందువులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వీధుల్లోకి వచ్చింది వారే. ఇదే సమయంలో దేశ వ్యాపితంగా ఎన్‌ఆర్‌సిని అమలు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. అసోం ఎన్‌ఆర్‌సి జాబితాలో అవకతవకలు, పేర్లను తొలగించే అధికారం అధికారులకు కట్టబెట్టం మైనారిటీల్లో ఇప్పటికే అనేక అనుమానాలు, ఆందోళనలను రేకెత్తించింది. శరణార్ధుల విషయంలో మతవివక్షను ప్రవేశపెట్టిన కేంద్రం ఎన్‌ఆర్‌సి పేరుతో దేశంలో ఉన్న లక్షల మంది ముస్లింల పౌరసత్వాలను రద్దు చేస్తారనే భయం అనేక చోట్ల వారిని ఆందోళనకు పురికొల్పింది.
ఆఫ్ఘనిస్తాన్‌కు మన దేశానికి ఇప్పుడు ఆచరణలో సరిహద్దులేదు. అయినప్పటికీ ఆ దేశాన్ని ఎందుకు చేర్చారో తెలియదు. మన పొరుగునే ఉన్న మయన్మార్‌లో మైనారిటీలుగా ఉన్న రోహింగ్యాలు, శ్రీలంకలో మైనారిటీలుగా హిందువులు, ముస్లింలు ఉన్నారు. నేపాల్‌, భూటాన్‌ ప్రాంతాల్లో మైనారిటీలు ఉన్నారు. వారందరినీ మినహాయించటానికి తగిన కారణాలను చెప్పలేదు. 1985లో కుదిరిన అస్సాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తరువాత అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారందరినీ మతంతో నిమిత్తం లేకుండా వెనక్కు పంపాల్సి ఉంది.
ఇతర దేశాల్లో ఉన్న హిందువులు, సిక్కులు అక్కడ పౌరులు కానట్లయితే, మన దేశం పౌరసత్వం కావాలనుకుంటే మంజూరు చేయాలన్న మత ప్రాతిపదిక ప్రతిపాదనను రాజ్యాంగ రచన సమయంలోనే కొందరు ముందుకు తెచ్చారు.1949 ఆగస్టు పన్నెండున ఆ ప్రతిపాదనపై రాజ్యాంగ పరిషత్‌లో ఓటింగ్‌ జరపగా తిరస్కరించారు. ఇప్పుడు హిందూత్వశక్తులు, వారిని సమర్ధించే వారు గతంలో తిరస్కరించిన ప్రాతిపదికనే ఇప్పుడు ముందుకు తెచ్చారు. పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్నందున 70సంవత్సరాల తరువాత మత ప్రాతిపదికను అమల్లోకి తెస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందనే హామీ లేదు. ఆర్టికల్‌ పదకొండు ప్రకారం పౌరసత్వాన్ని మంజూరు చేసే రద్దు చేసే హక్కు పార్లమెంట్‌కు ఉంది. ఇప్పుడు మతాల ఆధారంగా మంజూరుకు చట్టాన్ని సవరించిన వారు, రేపు అదే ప్రాతికన మైనారిటీల పౌరసత్వాన్ని రద్దు చేస్తే, ఆంక్షలు విధిస్తే పరిస్ధితి ఏమిటి ? ఇప్పటికి లేదు కదా రాబోయే రోజుల్లో ఏదో చేస్తారని ఎందుకు అనుమానించాలి అని కొందరు అతితెలివిగా ప్రశ్నిస్తున్నారు. ఈ దే శాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని నిరంతరం ప్రచారం చేస్తున్నవారిని సమర్ధిస్దున్న వారే కేంద్రంలో పాలకులుగా ఉండగా వారికి మద్దతు ఇచ్చేందుకు తెలుగుదే శం, వైసిపి వంటి పార్టీలు పోటీపడుతున్నాయి. ఎవరైనా జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తారని, మొత్తం రాష్ట్రాన్ని అప్రకటిత కర్ఫ్యూ ప్రాంతంగా మార్చివేస్తారని, అభ్యంతర తెలిపిన పార్టీల నేతలను జైలు పాలు చేస్తారని ఊహించారా ? బాబరీ మసీదును కూల్చివేస్తామని సంఘపరివార్‌ ఎన్నడూ చెప్పలేదు, అయినా ఉత్తర ప్రదే శ్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాన్ని కూల్చివేస్తుంటే ఎవరేమి చేయగలిగారు? ఒకసారి మతరాజ్యంగా మారిన తరువాత హిందూ మతానికి ప్రాతిపదిక మనుధర్మం కనుక ఇస్లామిక్‌ దేశాల్లో షరియత్‌ను అమలు చేసినట్లుగా మనుధర్మాన్ని జనం మీద రుద్దరనే హామీ ఉందా ? సామాజిక వివక్ష నివారణలో భాగంగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేదా చర్చ జరగాలనే పేరుతో వాటి రద్దు డిమాండ్‌ను ముందుకు తెస్తున్నది సంఘపరివార్‌, అందువలన ఒక విషయంలో ఒక సామాజిక తరగతి మౌనం వహిస్తే మరొక విషయంలో వారికే ముప్పు తెస్తే దిక్కేమిటి ? ఈ సందర్భంగా హిట్లర్‌ దాష్టీకానికి గురైన జర్మన్‌ మతాధికారి మార్టిన్‌ నైమిలర్‌ జైలులో పశ్చాత్తాపం లేదా కుట్రను గ్రహించి నాజీల తీరుతెన్నుల గురించి రాసిన కవితను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు !
నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు.
తరువాత వారు సోషలిస్టుల కోసం వచ్చారు !
నేను సోషలిస్టును కాదు గనుక నోరు విప్పలేదు.
తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు !
నేను కార్మికుడిని కాదు కనుక పెదవి విప్పలేదు.
తరువాత వారు యూదుల కోసం వచ్చారు !
నేను యూదును కాదు గనుక మౌనంగా ఉన్నాను.
తరువాత వారు నాకోసం వచ్చారు !
మాట్లాడేందుకు అక్కడ ఎవరూ మిగల్లేదు .

సవరణ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ అనేక మంది సుప్రీం కోర్టులో సవాలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్దంగా ఉన్న ఆర్టికల్‌ 370 రద్దు అంశం ఉన్నత న్యాయ స్ధానం ముందు ఉంది. ఇటీవలి కొన్ని తీర్పుల తీరు తెన్నులు చూసిన తరువాత అనేక మందిలో తలెత్తిన సందేహాలు, అనుమానాలకు సుప్రీం కోర్టు తెరదించుతుందా ? మన రాజ్యాంగం మనుగడలో ఉంటుందా ? మత రాజ్యాంగంగా మారనుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సావర్కర్‌పై రాహుల్‌ వ్యాఖ్యతో బిజెపి రుసరుస !

15 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Not Rahul Savarkar, Rahul Jinnah, vd savarkar

Image result for rahul gandhi ramlila maidan

ఎం కోటేశ్వరరావు
మరోసారి కాషాయ పరివారం హిందుత్వ ప్రతీక విడి సావర్కర్‌ను దేశ భక్తుడిగా దేశం ముందుకు తెచ్చింది. నరేంద్రమోడీ పాలన దేశాన్ని మేకిన్‌ ఇండియాగా మార్చటానికి బదులు రేప్‌ ఇన్‌ ఇండియా(అత్యాచారాల భారత్‌)గా మార్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్య దీనికి మూలం. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బిజెపి పార్లమెంట్‌లోపలా బయటా డిమాండ్‌ చేసింది. ఈ అంశంపై వివాదం చెలరేగటంతో పార్లమెంట్‌ పలుసార్లు వాయిదా పడింది. రాహుల్‌ వ్యాఖ్య దేశాన్ని, మహిళలను అవమానించటమే అని, అత్యాచారాలు చేయాల్సిందిగా ఆహ్వానం పలకటం వంటిదే అని బిజెపి ఎంపీలు ఆరోపించారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలో దేశద్రోహంతో సమానమని అందుకు రాహుల్‌ను జైల్లో పెట్టాలని సంఘపరివార్‌కు చెందిన వారు డిమాండ్‌ చేశారు. రాహుల్‌ ఇటలీకి పోవాలన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్‌ ధాకరే బహిరంగంగా రాహుల్‌ గాంధీని కొట్టాలని సావర్కర్‌ మనవడు కోరారు.
‘నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా గురించి మాట్లాడతారు, అయితే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అది అత్యాచారాల భారత్‌గా కనిపిస్తోంది’ అన్నది రాహుల్‌ గాంధీ వ్యాఖ్య. క్షమాపణ చెప్పాలని బిజెపి చేసిన డిమాండును న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారత్‌ను రక్షించండి అనే నినాదంతో కాంగ్రెస్‌ నిర్వహించిన సభలో రాహుల్‌ గాంధీ తిప్పి కొట్టారు. పదే పదే క్షమాపణలు చెప్పటానికి నేనేమీ రాహుల్‌ సావర్కర్‌ను కాదు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనకు క్షమాభిక్ష పెడితే బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటానని అండమాన్‌ జైలు నుంచి విడి సావర్కర్‌ పదే పదే లేఖలు రాసి వేడుకున్న అంశాన్ని రాహుల్‌ గాంధీ తన వ్యాఖ్యద్వారా ప్రస్తావించారు. దీనిపై చెలరేగిన వివాదం కారణంగా సావర్కర్‌ దే శభక్తుడని నమ్ముతున్నవారికి సావర్కర్‌ అసలు రూపం ఏమిటో చూసేందుకు ఆసక్తి రేకెత్తించినందుకు బిజెపికి ‘అభినందనలు’ చెప్పాల్సిందే.
తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదంటూ రాహుల్‌ గాంధీ విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీని అత్యాచారాల రాజధాని అని ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సార్లు బిజెపి పేర్కొన్నదని, సాక్షాత్తూ నరేంద్రమోడీ 2014 ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారు. గుక్కతిప్పుకోలేని బిజెపి నేతలు రాహుల్‌ గాంధీకి తగిన పేరు రాహుల్‌ జిన్నా అని వ్యాఖ్యానించారు. సిపాయి తిరుగుబాటుగా బ్రిటీష్‌ చరిత్రకారులు వర్ణించిన 1857 పరిణామాలను ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని ముందుగా వర్ణించిన సావర్కర్‌ గొప్ప దేశభక్తుడని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా గతంలో చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘాటించారు.
1857 మే పదవ తేదీన బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా మీరట్‌లో ప్రారంభమైన మిలిటరీ తీరుగుబాటు తరువాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది.1858 జూన్‌ 20న గ్వాలియర్‌లో తిరుగుబాటుదార్లను అణచివేయటంతో వెనుకపట్టు పట్టింది. అయితే సిపాయిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే తమ పాలన అంతానికి నాంది అవుతుందని భయపడిన బ్రిటీష్‌ పాలకులు హత్యకేసులతో సంబంధం ఉన్నవారికి మినహా మిగిలిన తిరుగుబాటుదారులందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించారు.1859 జూలై ఎనిమిది తిరుగుబాటు లాంఛనంగా ముగిసింది.
ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి నాటి పాలకుల కనుసన్నలలో నడిచే బ్రిటన్‌ పత్రికలు, అధికారిక ప్రకటనలు తప్ప ప్రపంచానికి ప్రత్యామ్నాయ వాస్తవ సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ తిరుగుబాటు ప్రారంభమైన 50 రోజుల్లోనే కారల్‌ మార్క్స్‌- ఫెడరిక్‌ ఎంగెల్స్‌ దాని స్వభావాన్ని పసిగట్టారు. తరువాత మరొక నెల రోజులకే భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు అని 1857 జూలై 28, 31 తేదీలలోనే కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. 1857 జూన్‌ 30న భారత్‌లోని పరిణామాలను మార్క్స్‌ ఇలా వర్ణించారు. ‘ ముస్లింలు, హిందువుల తమ ఉమ్మడి యజమానులకు వ్యతిరేకంగా ఐక్యమయ్యారు. తిరుగుబాటు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఆసియా దేశాలలో తలెత్తిన సాధారణ అసంతృప్తి కాలంలోనే ఇది జరిగింది.’ అని రాశారు.ఆ తిరుగుబాటును అణచివేయటంలో నాటి సంస్ధానాధీశులలో ఒకరైన సింధియా, ఇతర ప్యూడల్‌ శక్తుల పాత్ర గురించి కూడా మార్క్స్‌-ఎంగెల్స్‌ అనుమానించారు.
సిపాయిల తిరుగుబాటులో ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామ లక్షణాల గురించి మార్క్స్‌-ఎంగెల్స్‌ వ్యాఖ్యానించే నాటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. ఐదు ద శాబ్దాల తరువాత లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో వారి రచనలు చదివి సావర్కర్‌ ఆ అభిప్రాయానికి వచ్చి వుండవచ్చు, వారి అవగాహన, అభిప్రాయాన్ని అంగీకరించారంటే అర్ధం చేసుకోవచ్చు గానీ అసలు ముందుగా వ్యాఖ్యా నించింది సావర్కరే అంటే చరిత్రను వక్రీకరించటమే. సావర్కర్‌ లండన్‌లో ఉన్న సమయంలో 1909లో మరాఠీలో సిపాయి తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామంగా వర్ణిస్తూ పుస్తకాన్ని రాశారు. దానికి మూలం లండన్‌లో విద్యార్ధి విప్లవకారులకు కేంద్రంగా ఉన్న ఇండియా హౌస్‌లో ఏర్పడిన పరిచయాలు, అధ్యయనమే అన్నది వేరే చెప్పనవసరం లేదు.
అభినవ్‌ భారత్‌ లేదా ఇండియా హౌస్‌లో సావర్కర్‌ పని చేసిన కాలంలో ఆయన పాత్ర గురించి ఎవరికీ పేచీ లేదు. బ్రిటీష్‌ వారి అరెస్టు నుంచి తప్పించుకొని ఫ్రెంచి వారికి చిక్కారు. వారు సావర్కర్‌ను బ్రిటీష్‌ వారికి అప్పగించారు.1910లో అరెస్టయిన కేసులో మరుసటి ఏడాది అండమాన్‌ జైలుకు తరలించిన తరువాత సావర్కర్‌ లొంగుబాటు అధ్యాయం ప్రారంభమైంది. 1911,13,17,20 సంవత్సరాలలో లేఖల మీద లేఖలు రాసి క్షమాభిక్ష కోసం ప్రాకులాడిన విషయం దాస్తే దాగదు. ఎలా కావాలంటే అలా బ్రిటీష్‌ వారికి అనుకూలంగా పని చేస్తానని రాశారు. 1923లో జైలు నుంచి విడుదల అయిన తరువాత ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా స్వాతంత్య్ర పోరాటానికి దూరమయ్యారు. అంతవరకైతే అదొక దారి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటీష్‌ వారికి తన విధేయతను చాటుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు మిలిటరీలో చేరి బ్రిటీష్‌ వారికి తోడ్పడాలని ప్రచారం చేశారు. అదే ఏడాది హిందూ మహాసభ నాయకత్వాన్ని స్వీకరించి తొలిసారిగా హిందుత్వను ప్రతిపాదించి ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. ముస్లిం ద్వేషిగా మారి చివరకు మహాత్మా గాంధీ హత్య కుట్రకేసులో ముద్దాయిగా మారిన విషయం తెలిసిందే. సాక్ష్యాలను సరిగా ప్రవేశ పెట్టని కారణంగా ఆ కేసునుంచి బయటపడ్డారు.
సావర్కర్‌తో పాటు అనేక మంది దే శభక్తులు అండమాన్‌ జైలు పాలయ్యారు. వారెవరూ బ్రిటీష్‌ వారి దయాదాక్షిణ్యాల కోసం పాకులాడలేదు. అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లేఖలు రాసిన విషయం చాలా కాలం వరకు బయటకు రాలేదు. ఆయన 1966లో మరణించారు. 1975లో నాటి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్‌ జైలుకు వెళ్లినవారి గురించి ఒక పుస్తకం ప్రచురించాలని నిర్ణయించింది. దాన్ని ఆర్‌సి మజుందార్‌ అనే చరిత్రకారుడు రాశారు. ఆయన 1857 తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తి. సావర్కర్‌ అభిమానిగా ఆయన గొప్పతనాన్ని చిత్రించేందుకు ఎంతగా ప్రయత్నించినా బ్రిటీష్‌ వారికి రాసిన లొంగుబాటు లేఖలను దాచిపెట్టలేకపోయారు. అలాంటి సావర్కర్‌కు భారత రత్న బిరుదు ఇవ్వాలని కాషాయ దళాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. మోడీ సర్కార్‌ అందుకు ఇప్పటి వరకు ‘ఆ సాహసానికి ‘పూనుకొనేందుకు జంకింది. అక్టోబరు నెలలో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో తాము అధికారానికి వస్తే సావర్కర్‌కు భారత రత్న కోసం కృషి చేస్తామని బిజెపి-శివసేన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాయి.

Image result for rahul gandhi ramlila maidan
రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంలో శివసేన నేతలు సావర్కర్‌ దే శభక్తుడనే తమ పాత వైఖరిని పునరుద్ఘాటించారు. నాటకీయ పరిణామాల మధ్య శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్‌ భాగస్వాములుగా ఉన్నాయి. తాము గాంధీ, నెహ్రూలను గౌరవిస్తామని అలాగే కాంగ్రెస్‌ కూడా సావర్కర్‌ను గౌరవించాలని శివసేన నేత సంజయరౌత్‌ వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ ప్రతిదానినీ అంగీకరించలేరని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను కూడా అలాగే చూడాలంటూ ఎన్‌సిపి నేత ఛాగన్‌ భుజబల్‌ రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. ఆవు మన మాతృమూర్తి కాదని సావర్కర్‌ అన్నారు, బిజెపి దానితో విబేధిస్తోంది, అదే మాదిరి పెద్ద వారి గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పారు. దేశంలో ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఈ కారణంగా మహారాష్ట్ర సంకీర్ణ కూటమికి వచ్చే ముప్పు ఉండదని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేవుని స్తుతి – సైతాను దూషణ = జగన్‌ సైన్యం

15 Sunday Dec 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, chandrababu naidu, tdp, Ycp, YS jagan, ys jagan vs chandrababu naidu

Image result for ys jagan vs chandrababu naidu

ఎం కోటేశ్వరరావు
అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకును చూస్తే చాలు అన్నది గత సామెత. ఇప్పుడు ప్రెషర్‌కుకర్లలో వండుతున్నందున వెలువడే మోతలు లేదా ఈలలను బట్టి ఉడికిందో లేదో చెప్పేయవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలలో చోటు చేసుకుంటున్న వాక్‌ ధ్వనులు, మోతలను బట్టి రాబోయే రోజుల్లో ఏమి జరగనుందో, ప్రజాప్రతినిధులు ఎలా ఉండబోతున్నారో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఆరు నెలలు గడిస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారంటారు. అరునెలలకు ముందు అసెంబ్లీలో తెలుగుదేశం ఎలా వ్యవహరించిందో, ఆరునెలల తరువాత వైసిపి అదే విధంగా వ్యవహరించనున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చింది.
మేము పరిశుద్ధ రాజకీయాలు చేస్తాము, కొత్త వరవడికి శ్రీకారం చుడతాము, మాటతప్పము మడమ తిప్పము అని చెప్పుకొనేందుకు వైసిపి నాయకత్వానికి నైతికంగా ఇంకే మాత్రం అవకాశం లేదు.తెలుగుదేశం పార్టీ సభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. అసెంబ్లీలో తనకు ప్రత్యేక స్ధానం కేటాయించమని అడగటం, స్పీకర్‌ తమ్మినేని సీతారాం సదరు సభ్యుడిని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించటం వెంటనే జరిగిపోయింది. ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను పట్టించుకోకుండా స్పీకర్‌ విచక్షణ అధికారాల మేరకు ఇది జరిగింది. వంశీమోహన్‌ వైసిపికి దగ్గర అయ్యారు, అసెంబ్లీ సభ్యత్వానికీ ఢోకా లేదు. అసెంబ్లీలో చంద్రబాబు మీద ధ్వజమెత్తటానికి ఒక సభ్యుడు తోడయ్యారు. కావాల్సిన కార్యాన్ని స్పీకర్‌ తీర్చారు
తెలుగుదేశం నుంచి ఎవరైనా ఎంఎల్‌ఏలు బయటకు వచ్చి సభ్యత్వాలను కోల్పోకుండా మరొక పార్టీలో చేరాలంటే ఒక కొత్త దారిని కనుగొన్నారు. దీనికి వైసిపి దారి లేదా జగన్‌ బాట అని పేర పెట్టవచ్చు. ఎవరైనా పార్టీ మారదలచుకుంటే నాయకత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి సస్పెన్షన్‌కు గురి కావటం, తరువాత తమకు ప్రత్యేక స్ధానం కేటాయించాలని స్పీకర్‌ను కోరవచ్చు, నచ్చిన పార్టీతో కలసి ఊరేగవచ్చు అని తేలిపోయింది.అయితే వంశీ ఉదంతం తరువాత ఇతర ఎంఎల్‌ఏలు ఎవరైనా తమ నాయకత్వాన్ని ఎంతగా తూలనాడినా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వారిని సస్పెండ్‌ చేయకపోవచ్చు. అయితే అది ఎంతకాలం అన్నది ప్రశ్న. పార్టీ మారాలనుకున్న సభ్యులు సస్పెండ్‌ అయ్యే వరకు విమర్శలు, తిట్లదండకాన్ని కొనసాగిస్తే మీడియా, జనానికి ఉచిత వినోదాన్ని పంచినట్లు అవుతుంది. సస్పెండ్‌ చేస్తే ప్రత్యేక స్ధానాల సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ సౌకర్యం ఎంఎల్‌సీలకు తాత్కాలికంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం శాసన మండలిలో తెలుగుదేశం పెద్ద పార్టీగా ఉంది, ఆ పార్టీకి చెందిన షరీఫ్‌ మహమ్మద్‌ మండలి చైర్మన్‌గా ఉన్నందున ప్రత్యేక స్ధానాలు కేటాయించే అవకాశం ఉండదు. అధికారపక్షం మెజారిటీ సాధించి మండలి చైర్మన్‌ను మార్చేవరకు లేదా షరీఫ్‌ మారు మనసు పుచ్చుకుంటే తప్ప అదే పరిస్ధితి కొనసాగుతుంది. అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఎందరు మిగులుతారన్నది ప్రశ్న.

Image result for ys jagan vs chandrababu naidu
ఇక అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులను చూస్తే వైసిపి సభ్యులు దేవుని స్తుతి, సైతాను నింద కొనసాగించేందుకు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌లో పంటలు మార్కెట్‌కు రావటం ఇప్పుడే ప్రారంభమైంది. వాటిని అమ్ముకోవటం,గిట్టుబాటు ధరల సంగతి దేవుడెరుగు కనీసం మద్దతు ధరలు అయినా వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఎన్నికల సమయంలో వైసిపి అభ్యర్ధులతో పాటు మద్దతుదారులు పెట్టిన పెట్టుబడులకు ఏదో ఒక రూపంలో లాభాలు వచ్చే విధంగా పాలకులు చూడగలరు గానీ, రైతాంగానికి ధరలు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే అవకాశాలు ఉండవు. ప్రభుత్వ విధానాల వలన తమకు నష్టం వస్తున్నట్లు గ్రహించిన తరువాత వైసిపి అభిమానం ఆవిరిగావటానికి ఎక్కువ సమయం పట్టదు. అసెంబ్లీ సమావేశాల్లో వాగ్వివాదాల హౌరులో వీటి గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. తెలుగుదేశం నేతలపై ధ్వజం, గతపాలన తీరుతెన్నులను విమర్శిస్తూ వైసిపి ఎంతకాలం కాలం కాలక్షేపం చేయగలదు ?
దేన్నయినా మూసిపెడితే పాచిపోతుంది. ఇసుక విషయంలో ప్రభుత్వం అదే చేసింది. తీరా అది వివాదాస్పదం అయిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఇసుక వారోత్సవాలను ప్రకటించాల్సి వచ్చింది. రాజధాని అమరావతి గురించి చంద్రబాబు నాయుడి పర్యటన తరువాత సిఆర్‌డిఏ పరిధిలో నిర్మాణాలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. రాజధానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మారుస్తామని మేమెక్కడ చెప్పామంటారు? రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేయాల్సిందిగా ఒక కమిటీని వేశామని, దాని సిఫార్సులు వచ్చిన తరువాత స్పష్టత వస్తుందని మరోవైపు చెబుతారు. రాష్ట్ర ప్రభుత్వం అంతిమంగా నిర్ణయాలు తీసుకొనే హక్కు, అవకాశం ఉన్నప్పటికీ ప్రధాన అంశాల మీద ప్రతిపక్షాలు, సామాజిక సంస్ధలు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనే ప్రజాస్వామిక ప్రక్రియ పట్ల జగన్మోహనరెడ్డి సర్కార్‌కు విశ్వాసం, వైఖరి లేదనేది స్పష్టమైంది. నెలల తరబడి జాప్యం చేసి ప్రకటించిన ఇసుక విధానం, వివాదాస్పద ఆంగ్లమాధ్యమం అమలు- తెలుగు మాధ్యమ విద్యాబోధన ఎత్తివేత నిర్ణయాలు స్పష్టం చేశాయి.
వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తానొక ముఖ్యమంత్రి అని మరచిపోయినట్లున్నారు. దిశపై అత్యాచారం, హత్యకేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఎన్‌కౌంటర్‌పేరుతో పోలీసులు హత్యచేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆచర్యను సమర్ధించటం, తెలంగాణా ప్రభుత్వం, పోలీసులకు అభినందనలు చెప్పటం, ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై విచారణకు రాజ్యాంగబద్ద సంస్ధ జాతీయ మానవహక్కుల సంఘం విచారణకు రావటాన్ని తప్పు పట్టటం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారు చేయాల్సింది కాదు. ఏ ముఖ్య మంత్రీ గర్హనీయమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు
కేంద్రంతో ప్రతి విషయం మీద ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అడుగులకు మడుగలొత్తటం, మోసేందుకు పోటీపడటం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన పార్టీల వైఖరిగా ఉంది. వివాదాస్పద అంశాలైన ఆర్టికల్‌ 370, కాశ్మీరు రాష్ట్ర రద్దు, పౌరసత్వ సవరణ బిల్లువంటి మీద కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు తెలుగుదేశం, వైసిపి పోటీ పడ్డాయి. కనీసం తటస్ధంగా కూడా లేవు. ‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేంద్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం. ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు, మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో… ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించిందో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకుంది, రాజకీయాలు ఇలా ఉంటాయంటూ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇంత చక్కటి తెలుగులో చెప్పిన తరువాత దానికి టీకా తాత్పర్యాలు అవసరం లేదు. పవన్‌ కల్యాణ్‌ బాట చే గువేరాతో ప్రారంభమై అమిత్‌ షా వైపు పయనిస్తున్నదని మరొకరు చెప్పనవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలపడాలంటే దానికి రాష్ట్రంలో అధికారం కూడా ముఖ్యం. పార్లమెంట్‌ సభ్యులు ఏ పార్టీలో ఉన్నా వారిని ఆకర్షించటం దానికి పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వారిలో చాలా మంది ఆర్ధిక లావాదేవీలు ఎక్కువ భాగం రాష్ట్రం వెలుపలే ఉంటాయి లేదా వారి లాబీ కంపెనీలు ఎక్కడైనా ఉండవచ్చు గనుక కేంద్రంతోనే ఎక్కువ అవసరాలుంటాయి. దీనికి వైసిపి ఎంపీలు అతీతులు కాదు గనుక కొత్తగా ఎంపీలైనవారు, పారిశ్రామిక, వాణిజ్యాలను ఇంకా ప్రారంభించని వారు మినహా మిగిలిన వారు జగన్‌తో కంటే నరేంద్రమోడీ, అమిత్‌ షాలకే గ్గరగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం.
రాష్ట్రంలో స్ధానిక నేతలు బిజెపిలోకి రావాలంటే వారికి రాష్ట్రంలో అధికారం ముఖ్యం. అది ఉంటేనే వారికి లాభం. తెలుగుదేశం పార్టీతో ఆ పార్టీ అధికారాన్ని పంచుకున్నపుడు ఇదే రుజువైంది. అందుకే పవన్‌ కల్యాణ్‌ను ఒకవైపు రంగంలోకి దించి మరోవైపున వైసిపిని దారికి తెచ్చుకొనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నవారు కూడా లేకపోలేదు. తమ ప్రయోజనం నెరవేర్చుకొనేందుకు ఎన్ని పార్టీలు, ఎన్నికశక్తులనైనా తన మందలో చేర్చుకోగల శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ఉంటుంది. వైఎస్‌ జగన్‌ మీద ఇప్పటికే కావలసినన్ని కేసులు ఉన్నందున బిజెపి పని సులువు అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఆ వత్తిడిని తట్టుకొని వైసిపి ఎంతకాలం నిలుస్తుందో చెప్పలేము.
రక్తం రుచి మరిగిన పులిని బోనులో బంధిస్తే దాన్నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే వైసిపిలో అధికార రుచిమరగిన నేతలకు కొదవలేదు. అవినీతికి దూరంగా ఉండాలని వైసిపి నాయకత్వం ఎంతగా చెబితే అంతగా వారిలో అసహనం పెరుగుతుంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఎవరిని కదిలించినా ఇట్టే తెలిసిపోతుంది. ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్‌ నేత నెల్లూరు జిల్లాలో పరిస్ధితి గురించి బహిరంగంగానే బయటపడ్డారు. అలాంటి వారిని తాత్కాలికంగా నోరు మూయించగలరు తప్ప ఎక్కువ కాలం కట్టడి చేయగలరా ? ప్రభుత్వ వైఫల్యాలు పెరుగుతున్న కొద్దీ, పార్టీలో, ప్రభుత్వంలో అధికార కేంద్రాలు కుదురుకున్నతరువాత వాటిలో చోటు దక్కని వారిని అదుపు చేయటం అంత తేలిక కాదు.

Image result for ys jagan vs chandrababu naidu
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి బడ్జెట్‌లో చూపిన మేరకు వచ్చే అవకాశ ం లేదని ఇప్పటికే తేలిపోయింది. అందువలన ప్రకటించిన లేదా అమలు జరుపుతున్న పధకాలకు కోత పెట్టటం అనివార్యం. అదే జరిగితే జనంలో అసంతృప్తి ప్రారంభం అవుతుంది. పార్టీ క్యాడర్‌లో, జనంలో అలాంటి పరిస్ధితి ఏర్పడితే ఇంక చెప్పాల్సిందేముంటుంది ? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గతంలో తెలుగుదేశం-చంద్రబాబు నాయకత్వ వైఖరి, తీరు తెన్నులను విమర్శించిన వారు, ఇప్పుడు వైసిపి-జగన్‌ నాయకత్వ తీరు తెన్నులను హర్షిస్తారనుకుంటే భ్రమలో ఉన్నట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d