• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

లక్షాధికారి అక్కలంటూ మునగ చెట్టెక్కించిన నరేంద్రమోడీ !

02 Friday Feb 2024

Posted by raomk in AP, BJP, CHINA, Current Affairs, Economics, employees, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Women, Women

≈ Leave a comment

Tags

BJP, lakhpati Didi, Narendra Modi Failures, Nari Shakti, Nirmala Sitharaman, women labour force


ఎం కోటేశ్వరరావు


ఏదీ ఊరికే రాదు అన్న ఒక ఆభరణాల వాణిజ్య ప్రకటన గురించి అందరికీ తెలిసిందే. అటువంటపుడు ప్రధాని నరేంద్రమోడీ మహిళల గురించి ఊరికే మాట్లాడతారా ? సమస్యేలేదు. అందునా ఎన్నికలు, ఓట్ల కోసం మహిళలను ఎందుకు వదలిపెడతారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మీడియాను ఉద్దేశించి(పత్రికా గోష్టి కాదు) మాట్లాడుతూ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ బ్రహ్మాండమైన నారీశక్తి (మహిళా సాధికారత) అవుతుందని చెప్పారు. ఆమె ప్రవేశపెట్టింది ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ తప్ప దాన్ని బడ్జెట్‌గా పరిగణించరు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం, నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ” మహిళా సాధికారత పండగ ” అని కూడా వర్ణించారు.నూతన పార్లమెంటు భవనంలో జరిగిన తొలి సమావేశంలో నారీశక్తి అభియాన్‌కు ఆమోదాన్ని చూశారని, జనవరి 26న కర్తవ్యపథ్‌లో మహిళాశక్తిని చూశారని అన్నారు. రామ్‌ రామ్‌ అంటూ మీడియాతో మాటలు ప్రారంభించిన ప్రధాని అలవాటుగా అల్లరి చేసే, ప్రజాస్వామిక విలువలను నిలువునా కాలరాసే ప్రతిపక్షాలు ఆత్మశోధన చేసుకోవాలని కూడా సలహా ఇచ్చారు. చివరిలో కూడా రామ్‌ రామ్‌ అంటూ ముగించారు. ఎనభై మూడు లక్షల స్వయం సహాయక బృందాలలో తొమ్మిది కోట్ల మంది ఉన్నారని, వారిలో కోటి మంది ఎంతో మందికి స్పూర్తినిస్తూ చిన్న చిన్న వ్యాపారాలతో లక్షాధికారి అక్కలు(లక్‌పతి దీదీ)గా మారినట్లు మూడు కోట్ల మందిని లక్‌పతి దీదీలుగా మార్చనున్నట్లు తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీనికి పండగ చేసుకోవాలని ప్రధాని మోడీ గారు ముక్తాయింపు ఇస్తున్నారు.


గతంలో బేటీ బచావో, బేటీ పఢావో అని పిలుపు ఇచ్చారు.ఇప్పుడు మరో కొత్త నినాదంతో ఆకర్షించేందుకు పూనుకున్నారు. దేశంలో మహిళల సంఖ్య ఎక్కువ అన్నది తెలిసిందే. ఏ దేశంలోనైనా ఎందరు మహిళలు శ్రామికశక్తిలో ఉన్నారన్నది ఒక గీటురాయిగా చూస్తారు. ప్రతిదాన్నీ డబ్బుతో, లాభ నష్టాలతో కొలుస్తున్నారు గనుక శ్రామిక శక్తిలో మహిళలు ఎందరు అంటే లెక్కలతో ఆడుకుంటున్నారు. ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పన ఎంతవరకు వచ్చిందని గతంలో ప్రధాని నరేంద్రమోడీని అడిగితే పకోడీ బండివారికి కూడా ఉపాధి కల్పించినట్లే లెక్కవేసుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే. అఫ్‌కోర్సు పకోడీ బండి వేసుకోవటమేమీ తప్పు కాదు. అసలు పకోడీలు కొని తినే శక్తి ఎంత మందికి ఉందన్నది ప్రశ్న. ఏ దేశమైనా సేవారంగంలో కాకుండా ఉత్పాదక రంగంలో ఎంత మందికి ఉపాధి కల్పించారు, ఎంత ఉత్పత్తి చేస్తున్నారన్నదే ప్రధాన అంశంగా చూస్తారు. దేశంలో 2022-23లో నియమిత కాల కార్మిక శక్తి సర్వే ప్రకారం మహిళలు అంతకు ముందుతో పోలిస్తే 4.2శాతం పెరిగి యూజువల్‌ స్టేటస్‌ లెక్కింపు అవగాహన ప్రకారం 37శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు తొమ్మిదిన ప్రకటించింది. ఈ పదానికి అర్ధం ఏమిటి ? ఉదాహరణకు సర్వే చేసినపుడు ఒక వ్యక్తి అతడు లేదా ఆమె సదరు ఏడాదిలో తాను ఏడు నెలల పాటు పని చేసినట్లు లేదా పనికోసం అందుబాటులో ఉన్నట్లు గానీ, పని కావాలని కోరినట్లయితే శ్రామికశక్తిలో ఉన్నట్లు లెక్కవేస్తారు. అందుకే ఇది అంకెల గారడీ అని చెప్పాల్సి వస్తోంది. ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎలా సాధ్యమైంది అంటే నరేంద్రమోడీ అమలు జరుపుతున్న నైపుణ్యవృద్ధి, మహిళా అనుకూల విధానాలు, మహిళల నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి ఫలితం అని ఠకీమని చెబుతారు. ఒక పదార్ధాన్ని కొలవగలం గానీ గాలిని పట్టుకోలేం, చూడలేం !


ప్రభుత్వం ప్రకటించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్న అంకెలకు వీటికి పొంతన కుదరటం లేదు. అందుకే అమిత్‌ షా మాటల్లో ప్రభుత్వ ప్రకటనలను జుమ్లా (అవసరానికి ఏదో చెబుతుంటాం) అనాల్సి వస్తోంది. ఇండియా టుడే వెబ్‌సైట్‌ 2023 జూన్‌ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక లింగ అసమానతల నివేదిక 2022 ప్రకారం 146 దేశాల జాబితాలో 135వ స్థానంలో భారత్‌ ఉంది.ప్రపంచ శ్రామిక శక్తిలో లింగ సమానత్వం రావాలంటే 132 సంవత్సరాలు పడుతుందని ఆ నివేదిక పేర్కొన్నది. అట్టడుగున్న ఉన్న మన దేశానికి ఇంకా ఎక్కువ వ్యవధి పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. మహిళల భాగస్వామ్యం పెరిగితే 2025 నాటికి జిడిపిలో 70వేల కోట్ల డాలర్లు పెరుగుతుందన్నది ఒక అంచనా. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం భారత్‌లో 52శాతం మంది మహిళలు వేతన ఉపాధి లేదా లేదా కుటుంబ సంరక్షణలో రెండింటిలో ఉంటామని చెప్పారు. కానీ 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది.


అరబ్బు, ఇస్లామిక్‌ దేశాల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్‌ జజీరా. అది 2023 ఏప్రిల్‌ పదిన ఒక విశ్లేషణ ప్రచురించింది.” జనాభాలో భారత్‌ దూసుకుపోతున్నా శ్రామిక శక్తిలో తగ్గుతున్న మహిళలు ” అని పేరు పెట్టింది.ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న భారత్‌ మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని అతితక్కువ 20దేశాల్లో ఒకటిగా ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నట్లు పేర్కొన్నది. పెరుగుతున్న జనాభాకు ప్రత్యేకించి మహిళలకు ఉపాధిని చూపటంలో విఫలమైతే భారత్‌కు అది గుదిబండగా మారుతుంది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి అది 25శాతానికి తగ్గినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పిన అంశాన్ని అల్‌ జజీరా ఉటంకించింది. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మహిళలు మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, మహిళలు తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇంటి దగ్గర ఉండి ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నాయని సిఎంఐఇ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ చెప్పిన మాటలను ఉటంకించింది.శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. క్వాల్‌ట్రిక్స్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2022లో ప్రపంచంలోని 180దేశాలలో శ్రామిక శక్తిలో 52.7శాతం మహిళలతో ఆర్మేనియా మొదటి స్థానంలో ఉంది.ప్రపంచ సగటు 39.49శాతం.మన దేశం 23.54శాతంతో 166వ స్థానంలో ఉంది.మనకంటే ఎగువన 147లో నేపాల్‌, 153, 156 స్థానాలలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, దిగువున 168వ స్థానంలో పాకిస్తాన్‌ ఉంది. మనతో జనాభాలో పోటీ పడుతున్న చైనా 45.17శాతంతో 89వ దేశంగా ఉంది.


ఇక లక్షాధికారి అక్క (లక్‌పతి దీదీ ) పధకం గురించి చూద్దాం. రెండు కోట్ల మంది లక్షాధికారులైనట్లు నిర్మలమ్మ చెప్పారు. ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి రెండవ తేదీన ఉన్న సమాచారం ప్రకారం స్వయం సహాయక బృందాలలో ఉన్న మహిళలు 9 కోట్ల 17లక్షల రెండువేల 245 మంది.వీరిలో ఏడాదికి పాతికవేల కంటే తక్కువ ఆదాయం వచ్చిన వారు 44,72,431(ఐదుశాతం) మంది, ఇరవై అయిదు నుంచి 60వేలకు వరకు వచ్చిన వారు 3,99,16,213(48శాతం) మంది, అరవై ఒకటి నుంచి లక్ష వరకు రాబడి వచ్చిన వారు 2,43,09,855(29శాతం) మంది, లక్షకు పైగా వచ్చిన లక్షాధికారి అక్కల సంఖ్య 1,42,53,969(17శాతం)గా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లో ఉన్నాయని చెబుతున్న కనీసవేతనాల ప్రకారం నైపుణ్యం లేని వారికి నెలకు రు.12,344, నైపుణ్యం కలిగిన వారికి రు.13,844, అధిక నైపుణ్యం కలిగిన వారికి రు.14,844 కంటే తక్కువ చెల్లించటానికి లేదు. వీరిలో స్వయం సహాయక బృందాల మహిళలను ఏ తరగతిలో చేరిస్తే ఆ మేరకు ఏడాదికి వారికి రావాల్సిన కనీసవేతనాల రాబడి వరుసగా రు.1,48,128, రు.1,66,128, రు.1,78,128గా ఉంటుంది. ఇక బంగారు తెలంగాణా గురించి చెప్పుకుంటే రాష్ట్ర విభజనకు ముందు ఉన్న వేతనాలు తప్ప ఇంతవరకు సవరించలేదు గనుక చెప్పుకోకపోవటమే మంచిది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షాధికారి అక్కల పరిస్థితి చూస్తే 89,56,262 మందిలో ఏడాదికి రు. పాతికవేల కంటే తక్కువ వచ్చే వారు ఎనిమిది శాతం, పాతిక నుంచి అరవైవేల మధ్య వారు 39, అరవై నుంచి లక్ష వచ్చే వారు 37, అంతకు మించి వస్తున్నట్లు చెబుతున్నవారు 17శాతం(దేశ సగటుతో సమానం) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌ వాడీలను జగన్‌ సర్కార్‌ అధిక నైపుణ్యం కలిగిన వారిగా పరిగణించి, తాము ప్రకటించిన కనీసవేతనాలు అమలు జరిపి ఉంటే నలభై రోజులకు పైగా వారు సమ్మె చేసి ఉండే వారు కాదు, లక్షలాది మంది పిల్లలు, పోషకాహారం అందాల్సిన మహిళలను ఇబ్బంది పెట్టి ఉండేవారు కాదు. అంగన్‌వాడీలకు నైపుణ్యం లేకపోతే ఆ బాధ్యతల్లో నియమించరు.

ఆంధ్రప్రదేశ్‌లో సర్వేచేసిన యాంకర్‌ పరిశోధన సంస్థ 2022 డిసెంబరులో నివేదించిన ప్రకారం ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలలో గౌరవ ప్రదమైన జీవనంలో ఒక భోజనానికి అయ్యే ఖర్చును రు.81.89గా లెక్కించింది. కుటుంబంలో నలుగురు ఉంటే స్కూల్లో ఉన్న పిల్లలకు ఉచిత భోజనం ఉన్నందున ఆ మేరకు తగ్గిస్తే రు.79.16కు తగ్గుతుంది.ఈ లెక్కన ఒక మనిషికి నెలకు రు.2,408, కుటుంబానికి రు.9,632 అవుతుంది. ఇవిగాక బట్టలు, ఇతర అవసరాలను లెక్కిస్తే అవి అదనం. ఆ సంస్థ వేసిన అంచనా ప్రకారం ప్రకాశం జిల్లాలో ఒక కుటుంబానికి గౌరవ ప్రదమైన జీవన రాబడి నెలకు రు.25,269 ఉండాలని, జీవన వేతనం రు.16,077 ఉండాలని పేర్కొన్నది. పైన పేర్కొన్న వివరాల ప్రకారం లక్షాధికారి అక్కతో పాటు కుటుంబంలో మరొక సంపాదన వ్యక్తి ఉన్నప్పటికీ వచ్చే రాబడి సరిపోతుందా ? గౌరవ ప్రదమైన జీవనానికి అవసరమైన రాబడి లేదు గనుకనే పోషకాహార లోపంతో పిల్లలు, మహిళలు ఉన్నారు.దానికి పక్కా నిదర్శనం రక్తహీనత ముక్త భారత్‌గా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇవ్వటమే. జాతీయ ఆరోగ్య సర్వే 2019-21లో సేకరించిన సమాచారంతో అంతకు ముందు సర్వే వివరాలతో పోలిస్తే దేశంలో ఆరేండ్లలోపు పిల్లలు, 15-49 సంవత్సరాల మధ్య ఉన్న గర్భిణులు, మొత్తం మహిళల్లో రక్తహీనత పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌ పిల్లల్లో 58.6 నుంచి 63.2 శాతానికి పెరగ్గా మహిళల్లో స్వల్పంగా మాత్రమే తగ్గింది. తెలంగాణాలో పెరిగింది. రెండు రాష్ట్రాలు సంక్షేమ పధకాలను అమలు జరుపుతున్నప్పటికీ మిగతావాటితో పోల్చినపుడు పరిస్థితి పెద్దగా తేడాలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా మాదిరి సంక్షేమ పధకాలు లేని కేరళలో రక్తహీనత సమస్య ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఓట్ల కోసం మహిళలను మునగ చెట్టు ఎక్కించటానికి చూస్తారు. స్వయం సహాయక బృందాల ద్వారా లక్షాధికారి అక్కలు తయారైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఏలుబడిలోనే మొత్తం పరిస్థితి మారిపోయి ఉండేది. అందువలన తుపాకి రాముడి మాటలను నమ్మితే మరోసారి మోసపోవటమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పోరుబాటలో ఐరోపా రైతాంగం, బుధవారం నాడు అనేక దేశాల్లో రోడ్ల దిగ్బంధనం !

31 Wednesday Jan 2024

Posted by raomk in Current Affairs, Economics, Environment, Europe, Farmers, Germany, History, International, INTERNATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

#Farmers Protest, Agri subsidies, Agriculture, Europe Farmers Protests, European Commission, farm crisis, Ukraine crisis


ఎం కోటేశ్వరరావు


బ్రసెల్స్‌లో జరుగుతున్న ఐరోపా యూనియన్‌ సమావేశాల సందర్భంగా తమ నిరసన వెల్లడిస్తూ బెల్జియం, ఫ్రాన్స్‌, ఇటలీ తదితర దేశాల్లో రైతులు (జనవరి 31) బుధవారం నాడు ఆందోళనకు దిగారు. నౌకాశ్రయాలు,ఇతర ఆర్థిక కేంద్రాలలో లావాదేవీలను జరగకుండా చేశారు. అనేక చోట్ల ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలతో రోడ్లను దిగ్బంధనం చేశారు.బ్రసెల్స్‌ నగరంలో ప్రవేశించేందుకు పెద్ద ఎత్తున నలుమూలల నుంచీ తరలి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గురువారం నాడు నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. అనేక చోట్ల పౌరజీవనానికి కూడా ఆటంకం కలిగింది. రైతుల సమస్యలను వినాల్సి ఉందని బెల్జియం ప్రధాని అలెగ్జాండర్‌ డెకరో అన్నాడు. వాతావరణ మార్పుల నుంచి పర్యావరణ కాలుష్యం వరకు అనేక పెద్ద సమస్యలను వారు ఎదుర్కొంటున్నారని చెప్పాడు. తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న కారణంగా దక్షిణ అమెరికా దేశాలతో స్వేచ్చావాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించాడు. ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. పార్టీలన్నీ సిద్దం అవుతుండగా వివిధ దేశాల్లో రైతులు పోరుబాట పడుతున్నారు.నిన్న జర్మనీ, రుమేనియాలో, నేడు ఫ్రాన్సు, ఇతర దేశాల్లో రైతులు రోడ్డెక్కారు. అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ రైతులు మన మాదిరిగా జెండాలు పట్టుకొని ప్రదర్శనలు చేయటానికి బదులు ట్రాక్టర్లు, ట్రక్కుల వంటి వాటితో వచ్చి ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు.అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. టిక్‌టాక్‌ వంటి వాటిలో నిరసన వీడియోలు నింపుతూ ప్రచారంలో పెడుతున్నారు. ఐరోపా సామాజిక మాధ్యమాల్లో ఆకర్షిస్తున్న పదాల జాబితాలో ” రైతులు ” కూడా చేరిందంటే సమస్యల తీవ్రతకు అద్దం పడుతున్నది.


ఐరోపా యూనియన్‌ దేశాల్లో రుమేనియాలో అత్యధికంగా 35లక్షల మంది రైతులు ఉన్నారు. జనవరి పది నుంచి వీరితో పాటు రవాణారంగ కార్మికులు అనేక సందర్భాలలో కలిసే ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి సమర్పించిన 47 డిమాండ్ల జాబితాలో డీజిల్‌ పన్ను తగ్గింపు, మోటారు వాహనాలపై పౌర సంబంధ బీమా ప్రీమియం తగ్గింపు వంటి అంశాలతో పాటు ఉక్రెయిన్‌ సంక్షోభం ముందుకు తెచ్చిన ప్రధాన అంశాలు ఉన్నాయి.ఐరోపా దేశాల్లో రవాణాకు పర్మిట్లు అవసరం, ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత వాటిని ఎత్తివేశారు. దాంతో రవాణా ఖర్చులు తక్కువగా ఉండే ఉక్రెయిన్‌ వాహనాల నుంచి వచ్చిన పోటీని రుమేనియా, ఇతర దేశాల ట్రక్కుల యజమానులు తట్టుకోలేకపోతున్నారు. అంతేకాదు, అక్కడి నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్న ధాన్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల కారణంగా మిగతా దేశాల్లో ధరలు పడిపోయి రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదు. రుమేనియా రాజధాని బుఖారెస్ట్‌లో నిరసన తెలిపేందుకు వచ్చిన వారిని జనవరి పదిన అడ్డుకున్నారు. దాంతో ఇరవై కిలోమీటర్ల పొడవున రైతులు భైఠాయించారు. పది రోజుల తరువాత 21వ తేదీన అనుమతి ఇచ్చారు. అంతకు ముందు ఉక్రెయిన్‌తో రెండు చోట్ల సరిహద్దులను రైతులు దిగ్బంధించారు. మన దేశంలో నిరసన తెలిపిన వారిని రైతులు కాదని ఎలా నిందించారో రుమేనియాలో కూడా అదే జరిగింది. సాధారణ రైతులతో పాటు వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్న చిన్న, మధ్య తరగతి వ్యాపారులు కూడా బాసటగా నిలిచారు.
నాలుగుశాతం భూమిని సాగు చేయకుండా వదలి వేయాలని, పంటల మార్పిడి పద్దతిని విధిగా పాటించాలని, రసాయన ఎరువుల వాడకాన్ని ఇరవై శాతం తగ్గించాలనే నిబంధనలను ఐరోపా యూనియన్‌ అమలు చేయనుంది. దీని వలన ప్రపంచంలో ఇతర రైతులతో చౌకగా వచ్చే దిగుమతులతో తాము పోటీపడలేమని స్థానిక రైతులు చెబుతున్నారు.దీనికి తోడు ద్రవ్యోల్బణం కారణంగా తమకు నేరుగా ఇచ్చే నగదు విలువకూడా తగ్గుతున్నదని ఆందోళన వెల్లడిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం ఐరోపా అంతటా రైతాంగాన్ని ప్రభావితం చేయటంతో వారు వీధుల్లోకి వస్తున్నారు. ఉక్రెయిన్లో సగటు కమత విస్తీర్ణం వెయ్యి హెక్టార్లు కాగా, ఐరోపా ఇతర దేశాల సగటు కేవలం 41హెక్టార్లు మాత్రమే. అందువలన గిట్టుబాటులో కూడా తేడా ఉంటున్నది.ఉక్రెయిన్‌ దిగుమతులను నిరసిస్తూ పోలాండ్‌ రైతులు జనవరి 24న దేశవ్యాపితంగా ఆందోళన చేశారు.ఉక్రెయిన్‌ ధాన్యాన్ని ఆఫ్రికా, ఆసియా మార్కెట్లకు పంపాలి తప్ప ఐరోపా దేశాలకు కాదని పోలాండ్‌ రైతు సంఘ ప్రతినిధి చెప్పాడు.

ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు స్పెయిన్‌, ఇటలీ,పోర్చుగీసు రైతులు ప్రభావితం కాలేదని, అయితే పర్యావరణ రక్షణ చర్యలు వారిని కూడా వీధుల్లోకి తీసుకురానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.స్పెయిన్‌, పోర్చుగీసులో కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి కారణంగా వ్యవసాయానికి వాడే నీటిపరిమాణం మీద ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. జరిగిన నష్టాలకు తమకు పరిహారం ఇవ్వటం లేదని రైతులు విమర్శించారు. ఒక్కోచోట ఒక్కో సమస్య ముందుకు వస్తుండటంతో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ఐరోపా దేశాల్లో రైతులు రోడ్లెక్కటం ప్రారంభించారు.పర్యావరణ పరిరక్షణలో భాగమంటూ నత్రజని వాయువు విడుదలను పరిమితం చేసేందుకు పూనుకోవటంతో 2019లో నెదర్లాండ్‌ అంతటా రైతులు రోడ్లను దిగ్బంధించారు. గతేడాది డిసెంబరులో కూడా నిరసన తెలిపారు. ఉక్రెయిన్‌ డ్రైవర్లకు పర్మిట్‌ పద్దతి అమలు జరపాలని కోరుతూ పోలాండ్‌ ట్రక్కరు సరిహద్దులను మూసివేసి అడ్డుకున్నారు. ఉక్రెయిన్‌ నుంచి వస్తున్న చౌక దిగుమతులను అడ్డుకోవాలని రైతులు జనవరి ప్రారంభంలో వీధుల్లో ప్రదర్శనలు చేశారు. వ్యవసాయ సబ్సిడీల కోత ప్రతిపాదనలకు నిరసనగా జర్మన్‌ రైతులు వేలాది మంది బెర్లిన్ను దిగ్బంధం చేశారు. తాజాగా ఫ్రాన్సులో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు, కొన్ని చోట్ల హింసారూపం తీసుకుంది.


వివిధ దేశాల నుంచి చౌకగా దిగుమతులు చేసుకుంటూ తమ పొట్టగొడుతున్నారని ఆగ్రహించిన ఫ్రెంచి రైతులు తమ దేశం గుండా స్పెయిన్‌ నుంచి మొరాకో వెళుతున్న వైన్‌, కూరగాయల రవాణా ట్రక్కులను అడ్డుకొని ధ్వంసం చేశారు. తమను ఫణంగా పెట్టి మక్రాన్‌ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు పూనుకుందని, ఫలితంగా ఆహార ఉత్పత్తిదారులు ధరలను తగ్గించాల్సి వచ్చిందని, హరిత విధానాల పేరుతో తీసుకుంటున్న చర్యలు కూడా తమను దెబ్బతీస్తున్నాయని రైతులు నిరసన తెలుపుతున్నారు.జీవ వైవిధ్యం పేరుతో ఐరోపా యూనియన్‌ నుంచి సహాయం పొందాలంటే నాలుగుశాతం భూమిని ఖాళీగా ఉంచాలని, రసాయన పురుగుమందులను వాడకాన్ని తగ్గించాలనే షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు. ఇటలీ నుంచి వస్తున్న కమలాలు కిలో 6.3 డాలర్లకు లభిస్తుండగా పురుగుమందులు తక్కువ వాడుతున్న కారణంగా ఉత్పత్తి ఖర్చులు పెరిగిన తమ సరకు 8.57 డాలర్లకు విక్రయించాల్సి వస్తున్నందున పోటీ ఎక్కువగా ఉందని రైతులు వాపోతున్నారు. అటు వినియోగదారులు, ఇటు రైతులూ ఇద్దరూ నష్టపోతున్నారు. ఇటీవల జరిగిన ఒక సర్వేలో 82శాతం మంది పౌరులు రైతాంగానికి మద్దతు తెలిపారు. ఫ్రాన్సులో మూడో వంతు మంది రైతులు దారిద్య్రరేఖకు దిగువున ఉండగా సగటున రోజుకు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పర్యావరణవేత్త యానిక్‌ జడోట్‌ చెప్పాడు. మట్టిపిసుక్కొనే వారని మన దేశంలో చిన్న చూపు చూస్తున్నట్లే ఫ్రాన్స్‌లో కూడా రైతులంటే చిన్న చూపు ఉంది. రైతుల ఆందోళన కారణంగా వ్యవసాయ ఇంథనంపై పన్నులు పెంచాలనే ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటున్నట్లు ఫ్రెంచి నూతన ప్రధాని గాబ్రియెల్‌ అటాల్‌ జనవరి 26న ప్రకటించినప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.


ఉక్రెయిన్‌ నుంచి చౌకధరలకు వస్తున్న ధాన్యం, పంచదార, కోడి మాంసం, గుడ్లు కారణంగా తమ దేశాల్లో సమస్యలు తలెత్తిన కారణంగా వాటి మీద ఆంక్షలు విధిస్తామని తూర్పు ఐరోపా దేశాలను గతంలో ఫ్రాన్సు తప్పుపట్టింది. ఇప్పుడు అదే పాలకులు రైతుల ఆందోళన కారణంగా తమ వైఖరిని మార్చుకొని దిగుమతులను అడ్డుకోవాలని చెబుతున్నారు.బెల్జియంలో కూడా రైతులు నిరసన తెలిపారు. రాజధాని బ్రసెల్స్‌లో స్పెయిన్‌ నుంచి వస్తున్న ఐదు లారీల కూరగాయలను ధ్వంసం చేశారు. పారిస్‌కు దారితీసే రోడ్లను దిగ్బంధం చేయటం అంటే గీత దాటటమేనని, గ్రామీణ జీవనాన్ని నాశనం చేస్తున్నారని ప్రభుత్వం జనవరి 29న హెచ్చరించింది.రైతులు రాజధానిని దిగ్బంధం చేయనున్నారనే వార్తలతో అధ్యక్షుడు మక్రాన్‌ పారిస్‌ ముట్టడి అనే అంశం గురించి మంత్రులతో అత్యవసర సమావేశం జరిపాడు.పరిస్థితిని ఎదుర్కొనేందుకు మొత్తం ప్రభుత్వం, అధ్యక్షుడు కూడా సిద్దపడినట్లు ప్రభుత్వ ప్రతినిధి స్పష్టం చేశారు. నగరంలోకి ట్రాక్టర్లను అడ్డుకొనేందుకు పదిహేను వేల మంది పోలీసు, ఇతర సిబ్బందిని సిద్దం చేశారు. విమానాశ్రయాలు, ప్రధాన ఆహార మార్కెట్లకు ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. రైతుల దిగ్బంధన ఆందోళన కారణంగా తాము దక్షిణ ఫ్రాన్సులో ప్రవేశించలేకపోతున్నామని బ్రిటన్‌ పౌరులు కొందరు చెప్పారు. తమ ఆందోళన పౌరులకు ఇబ్బంది కలిగించటం కాదని, సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియచేయటమే అని రైతులు చెప్పారు.


అనేక దేశాల్లో ప్రభుత్వాలు విఫలమైన కారణంగా మితవాద శక్తులు పేట్రేగిపోతున్నాయి. జూన్‌లో జరగనున్న ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తాచాటాలని చూస్తున్నాయి.ఐరోపా యూనియన్‌ కారణంగానే అన్ని తరగతుల వారూ సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇటీవలి ఒక సర్వే ప్రకారం ఆస్ట్రియా, బెల్జియం, చెక్‌, ఫ్రాన్స్‌, హంగరీ, ఇటలీ, నెదర్లాండ్స్‌, పోలాండ్‌, స్లోవేకియాలలో మితవాద శక్తులది పైచేయి కావచ్చని, మరో తొమ్మిది దేశాలలో రెండవ, మూడవ స్థానాలలో ఉండవచ్చునని తేలింది.ఈ శక్తులు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రవేశించాయి. రుమేనియాలో 2019లో కేవలం 1.75వేలుగా ఉన్న టిక్‌టాక్‌ వినియోగదారులు 2023నాటికి 78.5లక్షలకు పెరిగారు. ఫ్రాన్సులో 2.14 కోట్లు, జర్మనీలో 2.09కోట్లు, ఇటలీలో 1.97 కోట్ల మంది టిక్‌టాక్‌ వినియోగదారులు ఉన్నారు. రుమేనియాలో చౌక థరలకు లభిస్తున్న ఇంటర్నెట్‌ కారణంగా రైతుల ఉద్యమానికి ఎంతో ప్రచారం లభించిందని, మితవాద శక్తులు ప్రభుత్వాల పట్ల వ్యతిరేకతను పెంచుతున్నాయని కొంత మంది ఆరోపించారు. అసలు సమస్యలు తలెత్తకుండా ఎవరెన్ని ప్రచారాలు చేసినా జనం స్పందించరన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చావు బతుకుల మధ్య ప్రపంచీకరణ – దవోస్‌ ప్రపంచ వేదిక చెబుతున్నది ఇదేనా !

31 Wednesday Jan 2024

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti globalization movement, Davos Message, Donald trump, globalization, Revanth Reddy, WEF


ఎం కోటేశ్వరరావు


వాణిజ్య, రాజకీయ, మేథావులు, సమాజంలోని ఇతర నేతల ప్రమేయంతో ప్రపంచ పరిస్థితిని మెరుగుపరిచేందుకు, ప్రపంచ, ప్రాంతీయ, పరిశ్రమల అజెండాలకు ఒక రూపమిచ్చేందుకు ప్రపంచ ఆర్థిక వేదికను ఏర్పాటు చేసినట్లు ఐదు దశాబ్దాల క్రితం స్థాపకులు పేర్కొన్నారు. తొలుత ఐరోపా యాజమాన్య వేదికగా 1971లో ప్రారంభమైన ఈ స్వచ్చంద సంస్థ తరువాత 1987లో ప్రపంచ ఆర్ధిక వేదికగా పేరు మార్చుకుంది. ఈ ఏడాది జనవరి 15 నుంచి 19వరకు జరిగిన 54వ వార్షిక సమావేశాలలో పాల్గొన్నవారి వివరాలు చూస్తే అది ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుందో అర్దం చేసుకోవటం కష్టమేమీ కాదు.ప్రపంచంలోని వివిధ రంగాలలో వెయ్యి బడాకంపెనీల ప్రతినిధులు ఈ సంస్థ సభ్యులు. హాజరైన వారిలో 925 మంది కంపెనీల సిఇఓలు కాగా వారిలో 254 మంది ఒక్క అమెరికా నుంచే వచ్చారు.వీరుగాక వాణిజ్య సంస్థల ప్రతినిధులుగా మరో 799 మంది, 225 మంది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, 60 మంది వివిధ దేశాల నేతలు, మరో 851 మంది ఇతరులు వెళ్లారు. గతంలో చంద్రబాబు నాయుడు, కెటిఆర్‌, తాజాగా ఎనుముల రేవంత రెడ్డి వెళ్లి వచ్చిన తరువాత పెట్టుబడుల మీద ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. అంటే అది వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధుల క్లబ్‌, దాని సమావేశాలు జరిగే స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌ ఒక విహార కేంద్రం.ఈ క్లబ్‌లో వ్యక్తులుగా సభ్యులుగా చేరాలంటే ఏడాదికి 52వేల డాలర్లు(మన కరెన్సీలో 43లక్షలు), పరిశ్రమల భాగస్వామిగా 2.63లక్షలు(రు.2.18 కోట్లు), వ్యూహాత్మక భాగస్వామిగా 6.20లక్షల(రు.5.21కోట్లు) డాలర్ల వంతున చెల్లించాలి.


ఐదు దశాబ్దాల తరువాత జరిగిన సమావేశ తీరుతెన్నులు, స్పందనలను చూస్తే వేదిక స్థాపక లక్ష్యం నెరవేరిందా అంటే అవునని చెప్పటం కష్టం. అంతర్జాతీయ అస్థిరతకు దోహదం చేసే తీవ్రమైన వాతావరణంలో దవోస్‌ వార్షిక సమావేశాలు జరుగుతున్నట్లు పోప్‌ ఫ్రాన్సిస్‌ తన సందేశంలో పేర్కొనటం గమనించాల్సిన అంశం.మరింత నైతిక పరమైన ప్రపంచీకరణ కోసం పని చేయాలని అది తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ఏడాది భౌగోళిక రాజకీయాలు అస్థిరంగా ఉండటమే కాదు, దాదాపు 50దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ సందర్భంగా తప్పుడు సమాచార ముప్పు ఉందని, వాటిలో మనదేశం తొలి స్థానంలో ఉన్నట్లు సమావేశాల సందర్భంగా విడుదల చేసిన సర్వే హెచ్చరించింది. మరోవైపు అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి గద్దెనెక్కనున్నారని అనేక మంది భావిస్తున్నప్పటికీ అమెరికా నుంచి కూడా ఉత్సాహంగా ప్రతినిధులు రాలేదు. అమెరికా, ఇతర ధనిక దేశాల విధానాలు ఎలా ఉంటాయో తెలియని స్థితిలో చైనా, భారత్‌ వంటి దేశాల నేతలు కూడా హాజరుకాలేదు. ఈ ఏడాది జరిగిన సమావేశాల తీరుతెన్నుల గురించి మాట్లాడుతూ ” సమస్యలను గుర్తించటానికి దవోస్‌ ఒక మంచి ప్రదేశం తప్ప వాటిని పరిష్కరించటానికి అంత మంచిది కాదు ” అని మార్క్‌ మలోచ్‌ బ్రౌన్‌ అనే బ్రిటీష్‌ ప్రముఖుడు చేసిన వ్యాఖ్య వర్తమాన ప్రపంచ కార్పొరేట్‌ రంగం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికి, ప్రారంభ లక్ష్యాలకు అసలు ఈ సంస్థ ఎంత దూరంగా ఉందో అద్దం పడుతున్నది. ఇంకా అనేక మంది భిన్నమైన అభిప్రాయాలను, అంచనాలను కూడా వెల్లడించారు.గడచిన మూడున్నర దశాబ్దాలలో ప్రతి దేశం లేదా కొన్ని దేశాల కూటములు రక్షణాత్మక చర్యలకు ఎక్కువగా పూనుకుంటున్నాయి తప్ప ప్రపంచీకరణ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయటం లేదు. ఈ కారణంగా దానికి భిన్నమైన పరిణామాలు జరగటం ఆందోళన కలిగిస్తోందని గతేడాది ప్రపంచబ్యాంకు చెప్పింది.ఐరోపాలో అభివృద్ధి గిడసబారింది, దిగుమతి చేసుకొనేదేశాల్లో పరిస్థితులు బాగోలేవు గనుక చైనా వస్తువులు ఎగుమతి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో అగ్రదేశాలకు సవాలు విసురుతున్నది. రష్యా నుంచి వచ్చే చౌక గ్యాస్‌ మీద ఆధారపడి నిర్మితమైన జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నది. రక్షణాత్మక చర్యలు, ప్రతిచర్యల్లో భాగంగా సరఫరా గొలుసులు ఏమౌతాయో తెలియదు.రక్షణాత్మక చర్యల్లో భాగం పెంచిన వడ్డీ రేట్లు అంతే వేగంగా తగ్గుతాయని ఎవరూ భావించటం లేదు.


అమెరికాాచైనాల మధ్య 2018 నుంచి వాణిజ్యపోరు కొనసాగుతున్నప్పటికీ అనేక మంది భావించినట్లు అది తీవ్రం కాలేదు గాని స్థిరపడిందని చెప్పవచ్చు. ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉండటమే కారణం. తాము సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి పశ్చిమ దేశాలు ఎలా బయటపడాలో అర్ద్ధంకాని స్థితిలో ఉన్నాయి. ఇదే సమయంలో మధ్య ప్రాచ్యంలో పెట్టిన పితలాటకంతో తలెత్తిన సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో, ఏమలుపులు తిరుగుతుందో తెలియటం లేదు. దాని ప్రభావం ప్రపంచం మీద పడే సూచనలు కనిపిస్తున్నాయి. పాలస్తీనా రాజ్య ఏర్పాటు అనే అంతిమ పరిష్కారం కుదరాలని అరబ్బుదేశాలు కోరుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను నిలిపివేసేంతవరకు ఎర్ర సముద్రంలో హౌతీలు నౌకలపై దాడులను కొనసాగిస్తూనే ఉంటారని దవోస్‌ సమావేశాల్లో ఇరాన్‌, ఎమెన్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావటంతో చమురు, గ్యాస్‌ రవాణాకు టాంకర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని సౌదీ అరామకో కంపెనీ సిఇవో చెప్పాడు. చమురు ధరలు పెరుగుతాయనే హెచ్చరికలు సరేసరి.ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ధనికదేశాల ఇబ్బందులను మరింత పెంచేవిగా ఉన్నాయి. ఎర్ర సముద్రం బదులు ఆసియా నుంచి ఐరోపాకు సరకులు ఎగుమతి కావాలంటే ఆఫ్రికా ఒక చివరి అంచు గుడ్‌హౌప్‌ ఆగ్రం నుంచి చుట్టి రావాలంటే ఒక ఓడకు కనీస ఏడు రోజులు అదనంగా పట్టటంతో పాటు అదనంగా మిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుంది. ఇప్పటికే అది కనిపిస్తోంది. ఈ పూర్వరంగంలో జరిగిన దవోస్‌ సమావేశాలు ఏ ఒక్క సమస్యకూ పరిష్కారాన్ని సూచించలేకపోయాయి. ప్రపంచమంతటా ఇప్పుడు కృత్రిమ మేథ గురించి చర్చ జరుగుతున్నది.దీన్లో మంచి చెడూ రెండూ ఉన్నాయి. దాన్ని జనం కోసం ఉపయోగిస్తే మంచి జరుగుతుంది, కార్పొరేట్ల లాభాల కోసం అమలు జరిపితే ఉద్యోగులకు జరిగే మంచేమిటో తెలియదు గానీ నలభై శాతం వరకు ఉద్యోగాలు పోతాయని ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు హెచ్చరించాయి. పర్యావరణాన్ని కాపాడే హరిత ఇథనం, కృత్రిమ మేధకు ఐదు సంవత్సరాల క్రితం ఐదు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే గతేడాది 1.8లక్షల కోట్లకు పెరిగింది, ఈ దశాబ్ది చివరికి నాలుగు లక్షల కోట్ల డాలర్లు అవసరం కావచ్చని అంచనా.
వలసవాదం రూపం, పేరు మార్చుకుంది. దేశాలను స్వాధీనం ఆక్రమించుకోవటం కుదురదు గనుక రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను ఆక్రమించుకొనేందుకు పూనుకున్నారు.అర్జెంటీనాలో ఇటీవలే అధికారానికి వచ్చిన జేవియర్‌ మిలై అనే పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి దవోస్‌ ప్రధాన వేదిక మీద దహనకాండకు దివిటీలు పట్టుకు వచ్చిన దుండగుడి మాదిరి ప్రవర్తించినట్లు వార్తలు వచ్చాయి.రాజ్య జోక్యం చేసుకోవాలని ప్రతిపాదించే వారిమీద విరుచుకుపడ్డాడు. స్వేచ్చా వాణిజ్య పెట్టుబడిదారీ విధానమే ఆకలి,దారిద్య్రాలను అంతం చేస్తుందని చెప్పాడు.ఏడు దశాబ్దాల తరువాత ” ప్రపంచీకరణ అంతరించిందా అన్నది దవోస్‌లో పెద్ద వెతుకులాట ” అన్న శీర్షికతో అల్‌ జజీరా మీడియా ఒక విశ్లేషణ ప్రచురించింది. గతంలో పెట్టుబడి నిర్ణయాల మీద వాణిజ్య ఖర్చు అనే అంశం ప్రధానంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు భౌగోళిక రాజనీతి, జాతీయ భద్రత, ప్రభుత్వాల విధాన నిర్ణయాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. టింగ్‌లాంగ్‌ డెరు అనే ప్రపంచీకరణ నిపుణుడు మాట్లాడుతూ ప్రపంచీకరణ ఇంకా చావలేదు గానీ బతికేందుకు పోరాడుతోంది అన్నాడు.వస్తు, సేవల స్వేచ్చా వాణిజ్యం తీవ్రమైన పరిమితులకు లోనౌతుంది. పశ్చిమ దేశాలలో స్వేచ్చ పెరగవచ్చుగానీ చైనా, రష్యా, వంటి దేశాలతో పెట్టుబడులు, ఎగుమతి దిగుమతులు పరీక్షలకు గురౌతాయి అన్నాడు.


ప్రపంచీకరణ అంతం గురించి మిశ్రమ అభిప్రాయాలు వెల్లడవుతున్నప్పటికీ దానికి వ్యతిరేకమైన, నిరాశాజనక అభిప్రాయాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రపంచీకరణను ముందుకు తీసుకుపోవాలని, ప్రపంచ వాణిజ్య నిబంధనలను పాటించాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నది ప్రస్తుతం ఒక్క చైనా మాత్రమే. ధనిక దేశాలు తమ కోసం ఆ విధానాన్ని ముందుకు తెచ్చినప్పటికీ గరిష్టంగా లబ్దిపొందింది చైనా మాత్రమే. మిగిలిన దేశాలన్నీ రక్షణ పేరుతో అడ్డుగోడలు కడితే అది చైనాకూ నష్టమే గనుక ఎలాంటి ఆటంకాలు లేని ప్రపంచీకరణ కావాలని చైనా కోరుతోంది. అది తనకు నష్టదాయకం అని భావించినపుడు వ్యతిరేకిస్తుందన్నది వేరే చెప్పనవసరం లేదు. ఈ ఏడాది దవోస్‌ సమావేశాల పట్ల పెద్దగా ఆసక్తి కనపరచలేదు. జి7 ధనిక దేశాల కూటమిలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ ఒక్కడే హాజరయ్యాడు.మిగిలిన వారంతా ముఖం చాటేయటానికి కారణం అక్కడ తేలేదేమీ ఉండదని స్పష్టంగావటమే. మొత్తం మీద చూస్తే అమెరికా ప్రతినిధులే ఎక్కువగా ఉన్నప్పటికీ గతంతో పోల్చితే చాలా తక్కువ మంది వచ్చారు.చైనాలో వేతనాలు, ఇతర ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నందున యాపిల్‌ వంటి కంపెనీలు కొంత మేరకు తమ ఉత్పత్తి కేంద్రాలను వియత్నాం, భారత్‌లకు తరలిస్తున్నాయి( ఇది ప్రపంచీకరణ ఇంకా కొనసాగటానికి నిదర్శనం అని చెప్పేవారు ఉన్నారు) తప్ప అమెరికా లేదా ఐరోపా దేశాలకు కాదు.అక్కడ చౌకధరలకు ఉత్పత్తి చేయలేవన్నది స్పష్టం. చైనాతో పోల్చితే వేతనాలు తక్కువగా ఉండటం, స్థిరమైన విధానాలను అమలు జరిపే కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్న కారణంగా విదేశీ పెట్టుబడులు భారీఎత్తున వియత్నాం చేరుతున్నాయి. తమ దేశాన్ని 2050నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆ దేశ నేతలు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి శరణార్దుల హైకమిషన్‌ రాయబారి ఎమి మహమ్మద్‌ మాట్లాడుతూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అసలైన ప్రశ్న ప్రపంచాన్ని మార్చటం అన్న సమస్య కాదు, ప్రతి రోజూ మనం ప్రపంచాన్ని మారుస్తూనే ఉన్నాం, ఆ మార్పు మంచికి దోహదం చేస్తున్నదా అన్నదే ప్రశ్న అన్నాడు. గత ఏడాది సమావేశాల్లో జీవన వ్యయ సంక్షోభం, ప్రకృతిపరమైన ముప్పు, భౌగోళిక ఆర్థిక వైరుధ్యాల వంటి అంశాలు ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటే ఈ ఏడాది ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పుల్లో తప్పుడు సమాచార వ్యాప్తి అని పదిహేను వందల మంది వివిధ రంగాల ప్రముఖులతో జరిపిన సర్వే ఒక ముఖ్యాంశం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆక్స్‌ఫామ్‌ 2024 నివేదిక : కనీవినీ ఎరుగని అసమానతల ప్రపంచం !

25 Thursday Jan 2024

Posted by raomk in Africa, Current Affairs, Economics, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Berni sanders, billionaires, Davos, inequality, Jeff Bezos, Oxfam 2024, wealth inequality, WEF


ఎం కోటేశ్వరరావు


”ఇక్కడ తిరుగులేని ఆర్థిక వాస్తవం ఉంది. దాన్ని మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే. ఇంత ఆదాయ, సంపద అసమానతను, సంపదల కేంద్రీకణను చరిత్ర చూడలేదు ” అమెరికా డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ ఆక్స్‌ఫామ్‌ 2024 అసమానతల నివేదికకు రాసిన ముందు మాటలో చెప్పిన మాటలివి. దవోస్‌ ప్రపంచ ఆర్థికవేదిక 54వ వార్షిక సమావేశాల సందర్భంగా దీన్ని విడుదల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాలు కొందరికి నమ్మశక్యం కానంతగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా సమాజంలో దిగువన ఉన్న సగం మంది కంటే ముగ్గురు ఎక్కువ సంపదలను కలిగి ఉన్నారు. అరవైశాతం మంది కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కార్మికుల ఉత్పాదకత భారీ ఎత్తున పెరిగినప్పటికీ యాభై సంవత్సరాల నాటి కంటే అమెరికా కార్మికుల సగటు వేతనాలు నేడు తక్కువగా ఉన్నాయని శాండర్స్‌ పేర్కొన్నాడు. ఆక్స్‌ఫామ్‌ చెప్పినట్లు ఇది ఒక్క అమెరికా సమస్య మాత్రమే కాదు అన్నాడు.2020 తరువాత ఐదు వందల కోట్ల మంది జనం పేదలుగా మారితే ఐదుగురు కుబేరుల సంపద రెండు రెట్లు పెరిగింది. ఇది ప్రపంచానికి చెడువార్త అన్నాడు. రాబడి, సంపదల అసమానతల తీవ్రతకు ఒక మచ్చుతునక అమెజాన్‌ సంస్థ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఉదంతం. అతగాడు ప్రపంచ కుబేరుల్లో ఒకడు. సంపద విలువ 167.4 బిలియన్‌ డాలర్లు.దీనిలో 2020 తరువాత పెరిగిన మొత్తమే 32.7బి.డాలర్లు ఉంది.అందుకే దాన్ని ఏం చేయాలో తోచక 550 కోట్ల డాలర్లు ఖర్చుచేసి తన కంపెనీ తయారు చేసిన రాకెట్లో ఆకాశపు అంచులదాకా వెళ్లి వచ్చాడు. ఆహా ఎంత అదృష్టం అనుకున్నాం తప్ప ఆ సొమ్ముతో ఎంతో మంది పేదలకు విద్య, వైద్య సౌకర్యాలు కల్పించవచ్చని ఆలోచించలేకపోయాం. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వీలు కల్పిస్తున్న ప్రభుత్వాలను విమర్శించే వారు అమెజాన్‌ అధిపతి పది నిమిషాల పది సెకండ్ల పాటు అంతరిక్షంలో విహరించటానికి అతగాడు చేసిన నలభై అయిదు వేల కోట్ల రూపాయలతో ఒక ఏడాది పాటు దేశమంతటా మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పించవచ్చు. తన కంపెనీలో యూనియన్‌ ఏర్పాటు చేసుకోవటాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్న ఆ ధనమదాంధుడిని ఎప్పుడైనా నిరసించారా ? తమ కంపెనీ హౌల్‌ ఫుడ్స్‌ ద్వారా విక్రయించే రొయ్యలను శుద్ది చేసే అతగాడి ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలను విశ్రాంతికి, చివరికి పానీయం కూడా తాగేందుకు సమయం ఇవ్వని పెద్దమనిషని ఎంతమందికి తెలుసు ?


ఈ ప్రపంచం కొద్ది మందికి భూతల స్వర్గం అయితే అత్యధికులకు భూతాల నిలయం.2020 నాటికి ఉన్న సంపదతో పోలిస్తే బిలియనీర్లు మూడు సంవత్సరాల్లో 34శాతం లేదా 3.3లక్షల కోట్ల డాలర్ల మేర పెంచుకున్నారు. ద్రవ్యోల్బణం వీరికి మూడు రెట్ల సంపదను పెంచింది.దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఆ మేరకు సామాన్యుల జేబుల నుంచి మాయమైంది. సంపద అంతా జనాభాలో కేవలం 21శాతం మంది ఉండే ధనికదేశాల్లోనే కేంద్రీకృతమైంది.ప్రయివేటు సంపదల్లో 69శాతం, ప్రపంచ బిలియనీర్లలో 74శాతం మంది ఇక్కడే ఉన్నారు. ద్రవ్య సంబంధ ఆస్తులలో ప్రపంచంలోని ఒకశాతం మంది వద్ద 43శాతం, ఐరోపాలో 47, ఆసియాలో 50శాతం ఉన్నాయి. 1995-2015 మధ్య కాలంలో 60 ఫార్మాకంపెనీలు పదిగా మారాయి. కేవలం రెండు అంతర్జాతీయ కంపెనీలు ప్రపంచ విత్తన మార్కెట్‌లో 40శాతం వాటా కలిగి ఉన్నాయి.నాలుగు కంపెనీలు ప్రపంచ పురుగుమందుల మార్కెట్‌లో 62శాతం వాటా కలిగి ఉన్నాయి. ఆన్‌లైన్‌ ప్రకటనల్లో మూడువంతుల ఖర్చు ఫేస్‌బుక్‌, ఆల్ఫాబెట్‌, అమెజాన్‌ కంపెనీలకే పోతోంది.వెతుకులాటలో 90శాతం గూగుల్‌ ద్వారానే జరుగుతోంది. ఎకౌంటింగ్‌ మార్కెట్‌లో 74శాతం నాలుగు కంపెనీలదే. గుత్తాధిపత్యం పెరుగుతున్నదని, అది అసమానతలకు దారి తీస్తున్నదని ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు అంగీకరించినా నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు.ప్రపంచంలో నిజవేతనాలు తగ్గుతున్నట్లు, దీంతో అసమానతలు పెరుగుతున్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) పేర్కొన్నది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెరగని కారణంగా గడచిన రెండు సంవత్సరాల్లో 79.1 కోట్ల మంది కార్మికులు 1.5లక్షల కోట్ల డాలర్లు నష్టపోయినట్లు పేర్కొన్నది. ఉమ్మడి రాష్ట్రంలో సవరించటం తప్ప తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడివడిన పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనీసవేతనాలను సవరించకపోవటం లేదా ముసాయిదా పేరుతో అడ్డుకోవటం తెలిసిందే.ప్రపంచమంతటా ఇదే వైఖరి.


విద్య, వైద్యం వంటి సేవలను వస్తువులుగా మార్చి వాటిని ప్రభుత్వం రంగం నుంచి తప్పించి ప్రయివేటు కార్పొరేట్‌లు స్వంతం చేసుకొని లాభాలు దండుకోవటం కూడా అసమానతలకు దారితీస్తున్నది. కాలుష్యాల నిరోధ చర్యలు తీసుకోకుండా గతంలో లబ్ది పొందిన కార్పొరేట్లే ఇప్పుడు వాటి నివారణ పేరుతో ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు పొందుతున్నాయి.పేద, మధ్య తరగతి దేశాలు రుణభారంతో సతమతం కావటంతో పాటు తీవ్ర అసమానతలు పెరుగుతున్నాయి. ప్రపంచ మొత్తం పేదల్లో 57శాతం(240 కోట్ల) మంది పేద దేశాల్లో ఉన్నారు. జీవన పరిస్థితి దిగజారటంతో ప్రపంచమంతటా సమ్మెలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెజాన్‌ కంపెనీలో పని చేస్తున్నవారు 30దేశాల్లో 2022లో ఆందోళనలు చేశారు.జీవన వ్యయాల పెరుగుదలకు నిరసనగా 2023లో 122 దేశాల్లో ఆందోళనలు జరిగాయి. కరోనా తరువాత కోట్లాది మంది పౌరుల పరిస్థితి పూర్వపు స్థితికి చేరుకోలేదు. 2017-2020తో పోలిస్తే ప్రపంచ అతి పెద్ద కార్పొరేట్‌ సంస్థలు 2021,2022లో 89శాతం లాభాలను పెంచుకున్నాయి. 2023తొలి ఆరునెలల వివరాలను పరిశీలిస్తే గత రికార్డు లాభాల చరిత్రను బద్దలుకొడుతున్నట్లు కనిపిస్తున్నది. చమురు, విలాసవస్తువులు, విత్త సంబంధ కంపెనీలకు లాభాలు విపరీతంగా పెరిగాయి. ప్రపంచంలోని 0.001శాతం కార్పొరేట్లు అన్ని కార్పొరేట్ల లాభాల్లో మూడోవంతు పొందాయంటే సంపదల కేంద్రీకరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా కంపెనీల్లో 89శాతం వాటాలు తెల్లవారి చేతుల్లో ఉండగా ఆఫ్రికన్లకు 1.1,హిస్పానిక్‌లకు 0.5శాతం ఉన్నాయి. పదకొండుశాతం మంది ప్రపంచ బిలియనీర్లు అధికారంలో లేదా రాజకీయ నేతలుగా ఉన్నారు.గడచిన నాలుగు దశాబ్దాలకాలంలో 30 ఐరోపా దేశాలలో మూడు వేల విధానపరమైన ప్రతిపాదనలను పరిశీలించగా ధనికులు మద్దతు ఇచ్చిన వాటినే అమలు జరిపారు తప్ప పేదల వాటిని పట్టించుకోలేదు.


అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) జరిపిన పరిశోధనలో కార్పొరేట్‌ శక్తుల గుత్తాధిపత్యం పెరగటం వలన అమెరికాలోని వస్తు ఉత్పాదక రంగంలో 76శాతం మంది కార్మికుల ఆదాయాలు తగ్గాయని తేలింది. ఈ సంస్థలు, కార్మికుల వేతనాలనే కాదు మార్కెట్లను అదుపు చేస్తాయి. అవసరమైన వస్తువులు, సేవలను అందుబాటులో లేకుండా చేస్తాయి. నవకల్పనలు, కొత్త సంస్థలను ఎదగనివ్వకుండా చూస్తాయి. తమ లాభాల కోసం ప్రభుత్వ సేవలను ప్రైవేటీకరించేట్లు చూస్తాయి. తమ లాభాలకు ముప్పురాకుండా ధరలను కూడా పెంచుతాయి. వీటికి ప్రభుత్వాలు ఎల్లవేళలా మద్దతు ఇస్తాయి. అందుకే కొన్ని కార్పొరేట్లు దేశాల జిడిపి కంటే ఎక్కువ సంపదలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు యాపిల్‌ కంపెనీ విలువ మూడు లక్షల కోట్ల డాలర్లనుకుంటే 2023లో మన దేశ జిడిపి 3.7లక్షల కోట్లని అంచనా. ప్రపంచంలోని ఇలాంటి ఐదు పెద్ద కంపెనీల సంపదలు మొత్తం ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల మొత్తం జిడిపి కంటే ఎక్కువ. మొత్తం బహుళజాతి కంపెనీల లాభాల్లో 1975లో పెద్ద కంపెనీల వాటా నాలుగుశాతం కాగా 2019నాటికి పద్దెనిమిది శాతానికి పెరిగింది.


ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది ద్రవ్య పెట్టుబడి అన్న సంగతి తెలిసిందే.2009 నుంచి ఈ రంగంలో ఉన్న కొన్ని కంపెనీలు ప్రస్తుతం 5.8లక్షల కోట్ల డాలర్ల ప్రైవేటు పెట్టుబడిదారుల ఆస్తులను నిర్వహిస్తున్నాయి. ఇవిగాక బ్లాక్‌ రాక్‌, స్టేట్‌స్ట్రీట్‌, వాన్‌గార్డ్‌ అనే ఫండ్స్‌ సంస్థలు 20లక్షల కోట్ల డాలర్ల మేర ద్రవ్య ఆస్తులను నిర్వహిస్తున్నాయి. ఇంత పెద్ద సంస్థలు ప్రభుత్వ విధానాలను, దేశాధినేతలను శాసించటంలో ఆశ్చర్యం ఏముంది. గుత్త సంస్థలు ప్రపంచానికి కొత్త కాదు. ఇంగ్లీష్‌ ఈస్టిండియా కంపెనీ ప్రారంభమైన 1,600 సంవత్సరం నుంచి ఎన్నిదేశాలను ఆక్రమించుకొని దోచుకున్నదీ ఎరిగిందే.వర్తమానంలో రాక్‌ఫెల్లర్‌ కంపెనీ ప్రపంచ చమురు సామ్రాజ్యం, సిసిల్‌ రోడెస్‌ ప్రపంచ వజ్రాల మార్కెట్‌ను శాసిస్తున్న సంగతీ తెలిసిందే. ఒక దశను దాటిన తరువాత ప్రజాస్వామిక రాజ్యం కంటే ప్రైవేట్‌ అధికారం పెరిగితే స్వేచ్చకు హామీ ఉండదని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ చెప్పాడు. గుత్త సంస్థలను అడ్డుకున్నందుకే అవి కుట్రచేసి మిలిటరీ తిరుగుబాటుద్వారా చిలీ కమ్యూనిస్టు నేత సాల్వెడార్‌ అలెండీని అధికారం నుంచి కూల్చివేసిన సంగతి తెలిసిందే. పదహారు వందల బడాకంపెనీల మీద ఒక సర్వే నిర్వహించగా కేవలం 0.4శాతం మాత్రమే కార్మికులకు జీవన వ్యయ వేతనం ఇస్తున్నట్లు అంగీకరించాయి.కార్మిక సంఘాలను ఏర్పాటు కానివ్వకుండా అడ్డుకోవటం, అణచివేతల కారణంగా యూనియన్లలో చేరుతున్నవారి సంఖ్య తగ్గుతోంది.ఓయిసిడి దేశాలలో 1985లో 30శాతం మంది చేరగా 2017నాటికి 17శాతానికి పడిపోయింది.


మహిళలకు జరుగుతున్న అన్యాయం, వేతనాల చెల్లింపు కూడా దారుణంగా ఉంది. మధ్య ప్రాచ్యం,ఉత్తర ఆఫ్రికాలో ఒక పురుషుడు ఎలాంటి చెల్లింపులు లేని సంరక్షణ పనిలో వారానికి ఒకటి నుంచి ఐదు గంటల వరకు ఉంటుండగా అదే మహిళలు 17 నుంచి 34గంటలు పని చేస్తున్నారు. ప్రపంచమంతటా వీరి పని విలువను నగదు రూపంలో లెక్కిస్తే ఏటా 10.8లక్షల కోట్ల డాలర్లుగా తేలింది. అధికవేతనాలు ఉన్నాయని అనుకుంటున్న ప్రపంచ టెక్నాలజీ కంపెనీల్లో చెల్లిస్తున్నదాని కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.ఐరోపా సూపర్‌ మార్కెట్లకు సరఫరా చేసే పండ్లు, ద్రాక్ష క్షేత్రాల్లో పని చేసే కోస్టారికా, దక్షిణాఫ్రికా మహిళలకు ఒక సీసా వైన్‌ విక్రయించే ధరలో కేవలం 1.2శాతమే వేతనాల రూపంలో లభిస్తుండగా సూపర్‌ మార్కెట్లకు 50శాతం పైగా దక్కుతున్నది. సంపదలు కార్పొరేట్ల వద్ద పేరుకు పోవటానికి, అసమానతలు పెరగటానికి పన్నుల తగ్గింపు కూడా ఒక ప్రధాన కారణం.ఓయిసిడి దేశాలలో 1980లో కార్పొరేట్‌ ఆదాయపన్ను 48శాతం ఉండగా 2022నాటికి 23.1శాతానికి తగ్గింది. ప్రపంచవ్యాపితంగా ఇదే ధోరణి.నూటనలభై ఒక్క దేశాలలో 111 చోట్ల 2020-2023 కాలంలో తగ్గాయి. ప్రపంచమంతటినీ చూస్తే 23 నుంచి 17శాతానికి పడిపోయాయి. విదేశాల్లో పొందిన లాభాల్లో 35శాతం ఎలాంటి పన్నులు లేని ప్రాంతాలకు చేరాయి. పన్ను విధానాలపై కార్పొరేట్ల ప్రభావానికి ఇది నిదర్శనం. ఈ మేరకు ప్రభుత్వాలకు రాబడి తగ్గటంతో సంక్షేమ కార్యక్రమాలకు కోత విధిస్తున్న కారణంగా ప్రపంచమంతటా అశాంతి పెరుగుతున్నది..

Share this:

  • Tweet
  • More
Like Loading...

సబ్సిడీల ఎత్తివేతపై జర్మన్‌ రైతుల నిరసన, రౌడీ ఆందోళన అన్న మీడియా !

21 Sunday Jan 2024

Posted by raomk in COUNTRIES, Current Affairs, Economics, Europe, Farmers, Germany, History, INTERNATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Agri subsidies, EU farmer protests, German Farmers' Association, German farmers’ protests


ఎం కోటేశ్వరరావు


” ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మరింత సాయం వస్తుందని నేను చెప్పలేను, మీకు మరింత స్వేచ్చ, మీ పనికి మర్యాద కోసం కావాలంటే నేను కూడా మీతో కలసి ఆందోళన చేస్తా , నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాడినే ” జనవరి ప్రారంభం నుంచి ఆందోళన చేస్తున్న రైతులతో జర్మనీ ఆర్థిక మంత్రి క్రిస్టియన్‌ లిండ్‌నర్‌ అన్న మాటలి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బెర్లిన్‌తో సహా అనేక పట్టణాల్లో రోడ్ల మీద ట్రాక్టర్లను నిలిపి ఆందోళన చేస్తున్న అన్నదాతలను రౌడీ రైతులుగా చిత్రించి మీడియా వార్తలకు శీర్షికలిచ్చింది.2024 బడ్జెట్‌తో ప్రారంభించి వ్యవసాయ యంత్రాలు, డీజిల్‌కు ఇస్తున్న సబ్సిడీలను దశలవారీ ఎత్తివేస్తామని జర్మన్‌ ప్రభుత్వం డిసెంబరులో ప్రకటించింది. సబ్సిడీలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిందంటూ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో రైతాంగంలో ఆగ్రహం పెల్లుబుకింది. దీంతో ఒకడుగు వెనక్కు వేసి కొత్త వ్యవసాయ యంత్రాలకు పన్ను రాయితీలు ఇస్తాం తప్ప డీజిల్‌ సబ్సిడీలు ఎత్తివేస్తామని చెప్పింది. శాంతించని రైతులు జనవరి మొదటి వారం నుంచి వివిధ రూపాలలో ఆందోళనలు చేస్తున్నారు.పదిహేనవ తేదీన బెర్లిన్‌లో దేశమంతటి నుంచి వచ్చిన 30వేల మంది రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో సహా తరలి వచ్చి ప్రదర్శన చేశారు. దాంతో నగరంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బస్‌లు, ట్రామ్‌లు నడిచే మార్గాలను మూసివేయాల్సి వచ్చింది. ఆ సందర్భంగా రైతుల నుద్దేశించి మాట్లాడేందుకు మంత్రి ప్రయత్నించగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనకు ప్రతిపక్ష మితవాద పార్టీలు మద్దతు ప్రకటించటంతో ఇంకేముంది ఆందోళన వెనుక మితవాదులు చేరారు అంటూ మీడియాలో పక్కదారి పట్టించే వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.(మన దేశంలో రైతులు ఢిల్లీ శివార్లలో తిష్టవేసి ఏడాది పాటు చేసిన ఆందోళనను బిజెపి ప్రభుత్వం కూడా ఇలాగే ఉగ్రవాదులతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే). జర్మన్‌ రైతులు తమ నిరసన వ్యక్తం చేసేందుకు గ్రామ ప్రవేశ ద్వారాల వద్ద విడిచిన బూట్లు,పక్కనే వెలుగుతున్న కొవ్వొత్తులున్న డబ్బాలను ప్రదర్శిస్తున్నారు.రైతుల నిరసనలతో కాస్తవెనక్కు తగ్గిన సర్కార్‌ వ్యవసాయ వాహనాల పన్నులను తగ్గించేది లేదని, డీజిల్‌పై పన్నులను దశలవారీ ఎత్తివేస్తామని చెప్పింది. దీన్ని రైతులు అంగీకరించటం లేదు. సోమవారం (జనవరి 22న) ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, తమకు అంగీకారం కానట్లయితే మరోసారి ఆందోళనకు దిగుతామని జర్మనీ రైతు సంఘం ప్రకటించింది.


రైతులకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించేందుకు ప్రభుత్వం ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని సాకుగా చూపింది. బెర్లిన్‌లో నిరసన తెలిపిన రైతులతో మంత్రి లిండ్‌నర్‌ మాట్లాడుతూ స్కూళ్లు, రోడ్లు, పారిశ్రామిక ఇంథన సబ్సిడీలకు నిధులు అవసరమని చెప్పటంతో రైతులు మరింత ఆగ్రహించారు. దాంతో స్వరం పెంచిన మంత్రి ఐరోపాలో స్వేచ్చకు మరోసారి ముప్పు వచ్చినందున భద్రత నిమిత్తం ఉక్రెయిన్‌ యుద్ధం కోసం నిధులు కావాలని అన్నాడు. ఉక్రెయిన్‌కు నిధులు ఇస్తే ఇచ్చుకోండిగానీ దానికి తమను ఎందుకు బలిపెట్టాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. జర్మనీతో సహా అనేక దేశాల్లో రైతుల ఆందోళనకు ఉక్రెయిన్‌ సంక్షోభం ఒక తక్షణ కారణమైంది. ఉక్రెయిన్‌ నుంచి వస్తున్న ధాన్యంతో పోటీ పెరిగిందని, తమకు గిట్టుబాటు కావటం లేదని ఉక్రెయిన్‌ సరిహద్దులో రుమేనియా రైతులు ఆందోళన చేశారు.


అనేక పారిశ్రామిక దేశాల్లో మాదిరి జర్మనీలో రైతుల ఆత్మహత్యల రేటు ఎక్కువ.మన దేశంలో మాదిరి వ్యవసాయం గిట్టుబాటుగాక అప్పులపాలై పురుగుమందులు తాగి ప్రాణాలు తీసుకుంటున్నవారు అక్కడ కూడా ఉన్నారు. అనేక మంది సాగుభూములను వదలి వేశారు.వ్యవసాయం చేసే వారికి జీవిత భాగస్వాములు దొరకటం కూడా సమస్యే. సబ్సిడీ చెల్లించే నిబంధనలను ఎప్పటికప్పుడు మారుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కొదవలేదు. వారి నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే సూపర్‌మార్కెట్లు కూడా ప్రపంచ ధరల తీరు పేరుతో ఎప్పటి కప్పుడు మార్చివేస్తుండటంతో రైతులకు ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది.ఐరోపా యూనియన్‌ దేశాలలో సాగు గిట్టుబాటుగాక ప్రతి రోజూ వెయ్యి మంది రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిన్న రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పెద్ద్ద కమతాలైతేనే సాగు గిట్టుబాటు అవుతుందనే సూత్రీకరణలు పశ్చిమదేశాల ఆర్థికవేత్తలు చేస్తున్నారు. అది వాస్తవం కాదని అనేక దేశాల్లో జరుగుతున్న ఆందోళనలు స్పష్టం చేస్తున్నాయి. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా మన దేశంలో కూడా కార్పొరేట్ల లాబీయిస్టులు కొందరు అదే పాట పాడుతున్నారు. పారిశ్రామిక-వర్ధమాన దేశాలలో వ్యవసాయ సంక్షోభ తీరుతెన్నులు భిన్నంగా ఉండవచ్చు గానీ సంక్షోభం మాత్రం వాస్తవం.పూర్తిగా మార్కెట్‌ శక్తులకు వదలి వేస్తే మెరుగైన ధరలు వచ్చి రైతులు లబ్ది పొందుతారని కొందరు చేస్తున్న వాదనలు వట్టి బూటకమని జర్మనీ రైతుల ఆందోళన వెల్లడిస్తున్నది. వారి ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర వస్తే యంత్రాలు, డీజిలుపై సబ్సిడీ చెల్లించాలని రోడ్డెక్కాల్సిన అవసరం ఉండేది కాదు. డీజిల్‌ సబ్సిడీలను ఎత్తివేస్తే ఏటా జర్మన్‌ రైతులు ఐదు నుంచి పదివేల యూరోలు( మన కరెన్సీలో ఒక యూరో విలువ 91 రూపాయల వరకు ఉంది) నష్టపోతారని అంచనా.


కార్పొరేట్‌ సాగు మాత్రమే గిట్టుబాటు అవుతుంది అని చెబుతున్నవారు అది అమలు జరుగుతున్న, భారీ కమతాలున్న ధనిక దేశాల్లో ఎందుకు రైతులు ఆందోళనలు చేస్తున్నారో, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎందుకు సబ్సిడీలు ఇస్తున్నాయో చెప్పాలి. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కుదరకపోవటానికి ధనిక దేశాలు ఇస్తున్న వ్యవసాయ సబ్సిడీలపై తలెత్తిన వివాదమే ప్రధాన ఆటంకంగా ఉన్న సంగతి తెలిసిందే. జర్మనీ పార్లమెంటుకు సమర్పించిన ఒక నివేదికలో 2010-20 దశాబ్ద కాలంలో 36వేల వ్యవసాయ క్షేత్రాలు మూతపడ్డాయి. పక్కనే ఉన్న ఫ్రాన్స్‌లో 2021డిసెంబరులో విడుదల చేసిన వివరాల ప్రకారం పదేండ్లలో లక్ష మూతపడ్డాయి. ఐరోపా మొత్తంగా 2005 నుంచి 2020 వరకు మొత్తం 53లక్షల వ్యవసాయ క్షేత్రాలు అదృశ్యమయ్యాయి. అంటే కుటుంబ సాగు బడాకంపెనీల చేతుల్లోకి భూమి పోతున్నది. కమతాల్లో భూమి ఎంత ఎక్కువగా ఉంటే సాగు ఖర్చు అంత తక్కువ అని ఒకవైపు చెబుతారు. అమెరికా, ఐరోపాల్లో హెక్టార్ల వంతున సబ్సిడీ చెల్లిస్తున్నారు తప్ప వేరు కాదు.అందుకే చిన్న రైతులకు గిట్టుబాటు కావటం లేదు. అమెరికాలో ప్రత్యక్ష, పరోక్ష సాగు సబ్సిడీలకు గాను 130 పధకాలున్నాయి. ఏడాదికి 30బిలియన్‌ డాలర్ల సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ధనిక దేశాల్లో కార్పొరేట్‌ సాగు కూడా సబ్సిడీలు లేకుండా నడవదా లేక ప్రభుత్వాలు వాటికి అప్పనంగా దోచిపెడుతున్నట్లా ? అమెరికాలో గడచిన నాలుగు దశాబ్దాలలో 33 సంవత్సరాలు ఉత్పత్తి ఖర్చు గిట్టుబాటు కాలేదని తేలింది. అందుకే అక్కడ భారీగా సబ్సిడీలు ఇస్తున్నారు. కార్పొరేట్‌ సాగే అలా ఉంటే కుటుంబ సాగు పరిస్థితి చెప్పనవసరం లేదు. మన దేశంలో కూడా ఒక్క పంజాబ్‌లో తప్ప దేశమంతటా ధాన్య రైతులుఉ నష్టపోవటం లేదా ఖర్చులు రావటమే అన్నట్లుగా పరిస్థితి ఉంది.


ఐరోపా దేశాల్లో పర్యావరణ పరిరక్షణ అంటూ కాలుష్యాన్ని తగ్గించే పేరుతో డీజిల్‌, పురుగుమందులు, ఎరువుల మీద సబ్సిడీల తగ్గింపుకు తీసుకుంటున్న చర్యలు సాగు రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. 2050 నాటికి పర్యావరణానికి హాని కలిగించే వాయువుల విడుదల నిలిపివేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. దానిలో భాగంగా 2030 నాటికి రసాయన పురుగు మందుల వాడకాన్ని 50శాతానికి తగ్గించాలనే నిబంధనలు విధించారు. రైతులను నిరుత్సాహపరిచేందుకు వీటికి ఇస్తున్న సబ్సిడీలను రద్దు చేస్తున్నారు. వీటితో పాటు ఉక్రెయిన్‌ నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్న ధాన్యం అనేక దేశాల్లో రైతులను రోడ్ల బాట పట్టిస్తున్నది. నీటి పొదుపు చర్యల పేరుతో బోరు బావుల తవ్వకాన్ని నిషేధించటంతో స్పెయిన్‌ రైతులు అక్రమంగా తవ్వుతున్నారు. బావుల నిబంధనలకు వ్యతిరేకంగా స్పెయిన్‌ రైతులు, నీటి తీరువా ,డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా ఫ్రెంచి రైతులు ఇటీవల కాలంలో ఆందోళన చేశారు. వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరిగిన విధంగా ఉత్పత్తులకు పెరగటం లేదు. బీమా ప్రీమియం పెంపు, సబ్సిడీల నిలిపివేతకు నిరసనగా రుమేనియా రైతులు, ట్రక్కు డ్రైవర్లు దేశమంతటా ట్రాక్టర్లు, ట్రక్కులతో రోడ్ల మీద నిరసనలు తెలిపారు.డీజిల్‌పై పన్నులు తగ్గించాలని, రుణాల వసూలు వాయిదా వేయాలని, సబ్సిడీలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేశారు. మొక్కజన్నలపై సబ్సిడీ ఇవ్వాలని, పన్నులు పెంచరాదని పోలాండ్‌ రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం అంగీకరించటంతో ఆందోళన విరమించారు.


జర్మనీలో ఆందోళన చేస్తున్న రైతులకు అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మితవాద ఎఎఫ్‌డి పార్టీ మద్దతు ఇస్తున్నది. దాన్ని చూపి నయా నాజీలు, మితవాదులు రైతులను రెచ్చగొడుతున్నారని, ఆందోళన వారి చేతుల్లోకి పోతోందని జర్మన్‌ పాలక కూటమి ఆరోపించింది. తమ డిమాండ్లకు ఎవరు మద్దతు ఇచ్చినా స్వీకరిస్తామని రైతులు చెబుతున్నారు. అనేక దేశాల్లో ఎన్నికలు జరగనుండటంతో మితవాద శక్తులు మౌనంగా ఉండవు. అధికారపక్షాల మీద వ్యతిరేకతను సహజంగానే రెచ్చగొడతాయి. పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకుంటే వాటికి అలాంటి అవకాశం రాదు. ఉదారవాద పాలకపార్టీల వైఫల్యం అనేక దేశాల్లో మితవాద పార్టీలు అధికారానికి రావటం లేదా సవాలు చేసే స్థితికి ఎదిగాయి. వాటిని ఎదుర్కోవాలనటంలో ఎలాంటి పేచీ లేదు గానీ ఆ బూచిని చూపి న్యాయమైన డిమాండ్లను తిరస్కరిస్తే జనాన్ని ఆ శిబిరంలోకి నెట్టినట్లే. తాము అధికారానికి వస్తే సాగు సబ్సిడీలను తగ్గిస్తామని పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నది. అయితే ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహంతో కొందరు రైతులు ఆ పార్టీవైపు కూడా మొగ్గుచూపవచ్చని విశ్లేషకులు చెబుతున్న మాటలకు అర్ధం ఇదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తిరిగి చైనా పెట్టుబడులు : తొలి సంకేతాలు పంపిన భారత్‌ !

19 Friday Jan 2024

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, China, Chinese army, chinese investments, Indian army, Ladakh border clash, Narendra Modi Failures, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్‌-చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్‌ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి) కేంద్రశాఖ కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ చెప్పినట్లు, నాలుగేండ్లనాటి అంక్షల ఎత్తివేతకు ఇది సూచిక అని జనవరి పద్దెనిమిదవ తేదీన రాయిటర్స్‌ ఇచ్చిన వార్తకు అంతర్జాతీయ, జాతీయ మీడియా ఎంతో ప్రాధాన్యతనిచ్చింది.దవోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేదిక 54వ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాజేష్‌ కుమార్‌ సింగ్‌ వెళ్లారు. అక్కడ రాయిటర్స్‌ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ వార్త చైనాతో సత్సంబంధాలు కోరుకొనే పౌరులు, లబ్దిపొందాలని చూస్తున్న పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఆశలు రేకెత్తించేదైతే , కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకులకు మింగుడుపడనిదే. అయితే వెంటనే ఏదో అయిపోతుందని అనుకోనవసరం లేదు గానీ నరేంద్రమోడీ సర్కార్‌ మీద దేశీయ కార్పొరేట్‌ శక్తుల నుంచి వస్తున్న వత్తిడికి కూడా ఇది సూచికే. దిగుమతులను అనుమతించుతున్నట్లుగానే పెట్టుబడులను కూడా అంగీకరించకతప్పనట్లు కనిపిస్తోంది.


2020లో జరిగిన గాల్వన్‌లోయ వివాదాల తరువాత మన సరిహద్దులలో ఉన్న దేశాల పెట్టుబడులను తనిఖీ చేయకుండా అనుమతించరాదంటూ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవి పరోక్షంగా చైనా పెట్టుబడులను అడ్డుకొనేందుకే అన్నది స్పష్టం.ఎందుకంటే మన నుంచి తీసుకొనేవే తప్ప మరొక సరిహద్దు దేశమేదీ మనకు పెట్టుబడులు పెట్టే స్థితిలో లేదు. అనేక మంది నోటితుత్తర జనాలు చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపులు ఇచ్చినప్పటికీ మన దిగుమతిదారులు వాటిని ఖాతరు చేయకుండా రికార్డులను బద్దలు కొట్టి మరీ దిగుమతులు చేసుకున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. సరిహద్దు ఉదంతాల తరువాత రెండు దేశాల వాణిజ్యం 32శాతం పెరిగింది. నాలుగేండ్లుగా చైనా పెట్టుబడులు, అంతకు ముందు ప్రతిపాదనలు ఏ మాత్రం ముందుకు సాగలేదు.” ఒకసారి మా సంబంధాలు, సరిహద్దు సమస్యలు స్థిరపడితే మార్పు రావచ్చు. పరిణామాలు సక్రమంగా ముందుకు పోతే పెట్టుబడుల అంశంలో కూడా సాధారణ లావాదేవీలను పునరుద్దరించవచ్చని నేను చెప్పగలను. సరిహద్దులను ఎవరైనా కొద్ది కొద్దిగా అక్రమించుకుంటూ ఉంటే మనమేమీ చేయలేం, అటువైపు నుంచి పెట్టుబడులకు ఎర్రతివాచీ మర్యాదలు జరపలేము ” అని రాజేష్‌ కుమార్‌ చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో విదేశీ పెట్టుబడుల విషయంలో ఒక అడుగు వెనక్కు వేసి ఆటంకాలను తగ్గించినట్లు చెప్పారు. ” గతేడాది కాలంగా ఎలాంటి ఉదంతాలు లేవు గనుక సాధారణ ఆశ కనిపిస్తోంది, పరిణామాలు స్థిరపడతాయి, మెరుగుపడతాయి అనుకుంటున్నాను. అమెరికా, ఆస్ట్రేలియాల్లో మాదిరి అన్ని దేశాలకు సంబంధించిన విదేశీ పెట్టుబడుల సమీక్షకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం, పెట్టుబడులకు స్వాగతం పలకాలనే పరిస్థితిని కొనసాగించాలని భారత్‌ కోరుకుంటున్నదని రాజేష్‌ కుమార్‌ చెప్పారు.


2020లో గాల్వన్‌ లోయలో జరిగిన పరిణామాల తరువాత చర్చల మీద చర్చలు కొనసాగుతున్నాయి. 2022లో రెండు సార్లు స్వల్ప ఘర్షణలు తప్ప ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగలేదు.చర్చలతో ఒక అవగాహనా కుదరలేదు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నారు. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. మనవైపున 50వేల మంది సైనికులు మోహరించి ఉన్నారు. వాస్తవాధీన రేఖ ఉల్లంఘనల గురించి పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు. రెండువైపులా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం, అభివృద్దీ జరుగుతున్నది. గాల్వన్‌ ఉదంతాలకు ముందు కూడా వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో చైనా సైనికులు మన వైపు చొచ్చుకు రావటం, మనవారు అటువైపు వెళ్లటం జరిగినప్పటికీ చేతులతో నెట్టుకోవటం తప్ప ఆయుధాలను ఉపయోగించలేదు. సగటున ఏడాదికి ఐదు వందల సార్లు చైనీయులు అతిక్రమిస్తున్నట్లు మన అధికారులు గతంలో వెల్లడించారు. ప్రతి ఉదంతమూ మీడియాలో రాదు. 2015లో చైనా వైపు నుంచి 428సార్లు అతిక్రమణలు జరగ్గా అవి 2019నాటికి 663కు పెరిగాయి. మనవైపు నుంచి జరిగేవి చైనా వారు చెబుతారు తప్పమనం చెప్పుకోం.


నరేంద్రమోడీ తొలిసారి ప్రధానిగా పదవి చేపట్టిన తరువాత, షీ జింపింగ్‌ మన దేశాన్ని తొలిసారి సందర్శించనున్న తరుణంలో 2014లో సెప్టెంబరు 16న లడఖ్‌ తూర్పు ప్రాంతంలోని చుమార్‌ గ్రామ సమీపంలో చైనా ఒక రోడ్డు నిర్మిస్తుండగా అది తమ ప్రాంతమంటూ మన సైనికులు అడ్డుకొన్నారు. ప్రతిగా దానికి సమీపంలోని డెమ్‌చోక్‌ వద్ద నిర్మిస్తున్న కాలువ పనులను చైనా మిలిటరీ అడ్డుకుంది. ఇలా రెండు దేశాల దళాలు 16 రోజుల పాటు మోహరించి తిష్టవేశాయి. చివరికి ఉన్నత స్థాయి చర్చల తరువాత ఉభయపక్షాలూ వెనక్కు తగ్గాయి. రోడ్డు నిర్మాణాన్ని చైనా విరమించుకుంటే దానికి ప్రతిగా మనదేశం పరిశీలక కేంద్రాన్ని కూల్చివేసేందుకు, బంకర్ల నిర్మాణాన్ని నిలిపివేసేందుకు అంగీకరించింది. తరువాత 2015లో లడఖ్‌ ఉత్తర ప్రాంతంలోని బర్టసే అనే గ్రామం వద్ద చైనా మిలిటరీ నిర్మించిన ఒక పరిశీలన కేంద్రాన్ని ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసులు కూల్చివేశారు. దాంతో చైనా మిలిటరీ రాగా పోటీగా మన సైనికులు కూడా వెళ్లటంతో వారం రోజుల వివాదం తరువాత ఇరుదేశాల స్థానిక మిలిటరీ అధికారులు సర్దుబాటు చేశారు.తరువాత రెండు దేశాల మిలిటరీల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు పన్నెండు రోజుల పాటు సంయుక్త మిలిటరీ విన్యాసాలు జరిపారు. చైనా-భూటాన్‌ మధ్య సరిహద్దు సమస్యలున్నాయి. వాటిలో డోక్లాం ఒకటి. ఆ ప్రాంతం మన దేశంలోని సిలిగురి కారిడార్‌కు దగ్గరగా ఉంటుంది. డోక్లాంలో చైనా మిలిటరీ రోడ్లు, తదితర నిర్మాణాలను చేపట్టడంతో అంతకు ముందు భూటాన్‌ చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా మన దేశం జోక్యం చేసుకొని చైనాను నిలువరించింది.2017లో 73 రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. తరువాత సద్దుమణిగింది. ఇలాంటివి జరుగుతున్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా మన ప్రధాని నరేంద్రమోడీ ఊహాన్‌ నగరానికి వెళ్లినట్లే చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మహాబలిపురం వచ్చారు. రెండు దేశాల మధ్య ఎగుమతి దిగుమతులు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి.


1962లో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పటికీ తరువాత కాలంలో సంబంధాలను మెరుగుపరుచుకొనేందుకు సరిహద్దు వివాదం, చిన్న చిన్న ఘర్షణలు అడ్డం రాలేదు. కొంతకాలం ఎడముఖం పెడముఖంగా ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలు ఏర్పడ్డాయి.గాల్వన్‌ ఉదంతం నిస్సందేహంగా మరోసారి సంబంధాలను దెబ్బతీసింది. తరువాత పెద్ద ఉదంతాలేమీ జరగలేదు గనుక సీనియర్‌ అధికారి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యల వెనుక ప్రభుత్వ ఆలోచనాధోరణి కనిపిస్తున్నది. చైనా తన వస్తువులను తక్కువ ధరలకు మనదేశంతో సహా ప్రపంచంలో కుమ్మరిస్తున్నదని కొంత మంది నిరంతరం ఆరోపిస్తుంటారు. అలాంటి వివాదాలను, సమస్యలను పరిష్కరించటానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది.చైనా మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని అనేక దేశాలు అనుకుంటున్నట్లుగానే మనదేశంలో కూడా కొందరు సూచిస్తున్నారు. తప్పేమీ లేదు. చైనా బదులు ప్రపంచం మన మీదే ఆధారపడే విధంగా చేస్తానని ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర పిలుపులు ఇచ్చారు. మంచిదే, ఎవరూ కాదనటం లేదు.కానీ కొంత కాలానికి మనదేశం మీద ఆధారపడకూడదని ఇతర దేశాలు అనుకోవన్న గ్యారంటీ ఏమిటి? అసలు సమస్య అది కాదు. ఏ దేశానికి ఆదేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్దమయ్యే పరిస్థితి వచ్చేంత వరకు పరస్పరం ఆధారపడక తప్పదన్నది వాస్తవం.


అనుభవమైతే గానీ తత్వం తలకెక్కదంటారు పెద్దలు. గాల్వన్‌ ఉదంతం తరువాత దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక ప్రచారం, వస్తు బహిష్కరణ పిలుపుల సంగతి, చైనాతో విడగొట్టుకోవాలన్న స్థానిక, అంతర్జాతీయ పెద్దల సలహాలు ఎరిగినవే. అయినప్పటికీ చైనా నుంచి దిగుమతులలో ఏడాదికేడాది స్వల్పతేడాలుండవచ్చుగానీ పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. చైనాకు మన ఎగుమతులు పెరగటం లేదు.చైనా కంటే ముందు గతంలో జపాన్‌, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌,మోటారు వాహనాలు, సెల్‌ఫోన్లు మన మార్కెట్‌ను ముంచెత్తాయి.ఇప్పటికీ గణనీయంగానే ఉన్నాయి. అవి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి ఎగుమతులు చేశాయన్నది తెలిసిందే. మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు వాటిని ఇక్కడే తయారు చేస్తే అనే ఆలోచన రాలేదనుకుంటే పొరపాటు. అందుకు అనువైన పరిస్థితి మనదేశంలో అప్పుడూ ఇప్పుడూ లేదు. గతంలో ఉన్న కాంగ్రెస్‌ పాలకులకూ, ఇప్పుడున్న నరేంద్రమోడీకి అది పట్టలేదు.చౌకగా వస్తూత్పత్తికి అవసరమైన పరిశోధన-అభివృద్ధికి భారీ మొత్తంలో ప్రభుత్వాలు ఖర్చు చేయకుండా వీలుకాదు. అందుకే ఉత్పత్తి కంటే దిగుమతి చేసుకుంటే వచ్చే లాభాలే ఎక్కువని అప్పుడూ ఇప్పుడూ మన కార్పొరేట్‌ శక్తులు భావిస్తున్నాయి. జపాన్‌ కంపెనీలు తమ మార్కెట్‌కోసం మన దేశంలోని స్థానిక కార్పొరేట్లతో సంయుక్త భాగస్వామ్య కంపెనీలను ఏర్పాటు చేశాయి గనుకనే మారుతీ సుజుకీ, హీరో హౌండా,స్వరాజ్‌ మజడా, వంటి కంపెనీలు రంగంలోకి వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ మోటారు వాహన రంగంలో చైనా ముందుంది.దానితో సంయుక్త భాగస్వామ్యానికి మన పాలకులు అంగీకరిస్తే జపాన్‌ మారుతీ కార్ల మాదిరి చైనా ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇతర ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి.ఇప్పటికిప్పుడు ఆ రంగంలో మనం పోటీపడలేం గనుక ఆ లాభాల కోసం మన కార్పొరేట్లు చైనా పెట్టుబడులను అనుమతించాలని వత్తిడి చేస్తున్నాయా ? ప్రభుత్వం అంగీకరిస్తుందా? దానికి సూచికగానే మన ఉన్నత అధికారి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ దవోస్‌లో మాట్లాడారా ? చూద్దాం ఏం జరుగుతుందో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో ఏం జరుగుతోంది ? ఆర్థిక రంగం పతన దశలో ఉందా !

06 Saturday Jan 2024

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#Anti China, China, China economy, China exports, India PMI, Narendra Modi Failures, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


చైనాలో ఏం జరుగుతోంది ? చాలా మందికి అర్థంగాని, గందరగోళ పరిచే ప్రశ్న. అక్కడి వ్యవస్థ, ఆర్థికరంగం గురించి గతంలో చెప్పిన, వర్తమానంలో చెబుతున్న జోశ్యాల సంగతేమిటి ? భారత ఉత్పాదక రంగ పిఎంఐ (పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) 2023 డిసెంబరుల్లో పద్దెనిమిది నెలల కనిష్టానికి నవంబరులో ఉన్న 56 నుంచి 54.9కి తగ్గిందన్నది వార్త. ఎందుకటా కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి బలహీనంగా పెరగటం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ సూచిక 50 అంతకు మించి ఉంటే ఉత్పాదకరంగం విస్తరిస్తున్నట్లు, తగ్గితే దిగజారుతున్నట్లు లెక్క. గడచిన 30నెలలుగా 50కిపైగా నమోదు అవుతోంది. చైనాలో నవంబరులో ఉన్న 50.7పిఎంఐ డిసెంబరులో 50.8కి పెరిగిందని కాయిక్సిన్‌ సర్వే వెల్లడించింది.చిత్రం ఏమిటంటే చైనా ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం గడచిన ఆరునెలల్లో డిసెంబరులో ఫ్యాక్టరీ ఉత్పాదకత తగ్గింది. ప్రభుత్వం సర్వేకు ఎంచుకున్న బడా కంపెనీలకు, కాయిక్సిన్‌ ఎంచుకున్న చిన్న, మధ్య తరహా సంస్థలు కాస్త బాగా పని చేస్తున్నట్లు కొందరు అదీ ఇదీ రెండు సరైనవే అని చెప్పారు. చైనాలో జరుగుతున్న ఆర్థిక మార్పులు కొన్ని సమస్యలను ముందుకు తెచ్చిన మాట వాస్తవం. గతంలో శ్రామికశక్తి ఎక్కువగా ఉన్న పరిశ్రమలు, వ్యాపారాల స్థానంలో ఆధునిక ఉత్పాదక, సాంకేతిక మార్పులు ప్రవేశించాయి. ఈ కారణంగా ఉపాధి రంగం మీద కొన్ని ప్రతికూల ప్రభావాలు పడి సర్దుబాటు సమస్య తలెత్తింది. ఇది ప్రతిదేశంలోనూ జరిగిందే, జరుగుతున్నదే. ఒకనాడు మన దేశంలో సాధారణ డిగ్రీ చదువుకుంటే మెరుగైన ఉపాధి లభించేది, ఇప్పుడు అది కొరగానిదిగా మారింది.దాన్ని చేతపట్టుకొని ఉపాధి పొందలేకపోతున్నారు. అందుకే మన కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాల అభివృద్ధి(స్కిల్‌ డెవలప్‌మెంట్‌) పధకాలను అమలు జరుపుతున్నది. అది ఎంతమేరకు పనికి వచ్చేది, దానిలో శిక్షణ లేకుండా సర్టిఫికెట్లు ఇస్తూ ఎంత అవినీతి జరిగేదీ, నైపుణ్యపాలు ఎంత అన్నది వేరే సంగతి. చైనాలో పరిశ్రమల్లో వస్తున్న మార్పులు శిక్షణ సమస్యలనే ముందుకు తెస్తున్నాయి. వాటిని పరిష్కరించేదిశగా ప్రభుత్వం ఉంది అంటే కొందరికి నమ్మకం కలగటం లేదు.చైనా ఏం చెప్పినా, ఏం చేసినా నమ్మనివారు ఎప్పుడూ ఉంటారు.


మార్కెట్లో అనిశ్చితి కారణంగా జపాన్‌లో కూడా ఫ్యాక్టరీ కార్యకలాపాలు తగ్గాయి. పిఎంఐ అంతకు ముందు నెలలో ఉన్న 48.3 నుంచి డిసెంబరులో 47.9కి తగ్గింది. యాభైకంటే తక్కువగా ఉన్నప్పటికీ జపాన్‌ మాంద్యంలో ఉందని చెప్పరుగానీ అంతకంటే ఎక్కువ ఉన్న చైనాలో మాంద్యం ఉందని చిత్రిస్తారు. గ్లోబల్‌ ఎకానమీ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఉత్పత్తి, సేవారంగాల సంయుక్త పిఎంఐ వివిధ దేశాల పరిస్థితి దిగువ విధంగా ఉంది.(న అంటే నవంబరు, డి అంటే డిసెంబరు 2023గా గమనించాలి)
దేశం ×××× తాజాపిఎంఐ×× మూడునెలలక్రితం×× ఏడాది క్రితం
భారత్‌ ××× 57.40న ××× 60.90 ××××××× 56.70
చైనా ××× 51.60న ××× 51.70 ××××××× 47.00
జపాన్‌ ××× 50.40డి ××× 52.10 ××××××× 49.70
అమెరికా×× 51.00డి ××× 50.20 ××××××× 45.00
యూరో××× 47.00డి ××× 47.20 ××××××× 49.30
ఎగువ వివరాలను చూసినపుడు ఏడాది క్రితం పరిస్థితి పోల్చుకుంటే ఎక్కడ ఎలాంటి సమస్య ఉందో ఎవరికి వారు నిర్ధారణకు రావచ్చు.పిఎంఐలను బట్టే మాంద్యాల్లోకి పోయినట్లు లేదా బయటపడినట్లు పూర్తిగా చెప్పలేము. అది ఒక సూచిక మాత్రమే. చైనా, ఇతర దేశాల కంటే మనదేశ సంయుక్త పిఎంఐ ఎక్కువగా కనిపిస్తోంది. అదే వాస్తవమైతే వస్తు, సేవల ఎగుమతుల్లో అది ప్రతిబింబించాలి.2023 గణాంకాలు ఇంకా ఖరారు కానందున 2022ను ప్రామాణికంగా తీసుకుంటే ప్రపంచంలో తొలి పది వస్తు ఎగుమతి దేశాల జాబితాలో మనకు చోటు లేదు.పోనీ అంతర్గత డిమాండ్‌ పెరిగితే డిసెంబరు నెలలో వస్తూత్పత్తి పిఎంఐ పద్దెనిమిది నెలల కనిష్టానికి ఎందుకు తగ్గినట్లు ? విజువల్‌ కాపిటలిస్ట్‌ డాట్‌కామ్‌ సేకరించిన సమాచారం ప్రకారం 2022లో వివిధ దేశాల వస్తు ఎగుమతులు ఇలా ఉన్నాయి.1.చైనా 3.6లక్షల కోట్ల డాలర్లు,2.అమెరికా 2.1ల.కో.డా, 3.జర్మనీ 1.7లకోడా,4.నెదర్లాండ్స్‌ 965.5బిలియన్‌ డాలర్లు, 5.జపాన్‌ 746.9 బి.డా,6. దక్షిణ కొరియా 683.6బి.డా,7.ఇటలీ 656.9 బి.డా, 8. బెల్జియం 632.9 బి.డా, 9.ఫ్రాన్స్‌ 617.8 బి.డా,10.హాంకాంగ్‌ 609.9బి.డా, 11.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 598.5బి.డాలర్లుగా ఉన్నాయి.మన ఎగుమతులు 453.58బి.డాలర్లు.


ముందే చెప్పుకున్నట్లు పిఎంఐ ఒక దేశ ఆర్థికరంగ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదు. అది ఇతర దేశాల పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది.ఉదాహరణకు 2015 డిసెంబరు రెండున మింట్‌ పత్రిక విశ్లేషణలో వివిధ దేశాల పిఎంఐల వివరాలను ఇచ్చింది. దాని ప్రకారం జపాన్‌ 52.6తో అగ్రస్థానంలో ఉండగా భారత్‌ 50.3, తైవాన్‌ 49.5, వియత్నాం 49.4, దక్షిణ కొరియా 49.1,చైనా 48.6, మలేషియా 47, ఇండోనేషియా 46.6గా ఉంది. అంటే మనదేశం అప్పుడే చైనా కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్లే. అలాంటిది ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఎగుమతుల్లో ఎందుకు ఎదుగుదల లేదు.మేకిన్‌, మేడిన్‌ ఇండియాల జాడ ఎక్కడ ? పిఐబి 2022 జూలై 29న విడుదల చేసిన సమాచారం ప్రకారం 2017-18లో జిడిపిలో వస్తు ఎగుమతుల శాతం 11.4కాగా 2021-22లో 13.3శాతంగా పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల సగటు 11.78శాతం ఉంది. వస్తు, సేవల ఎగుమతులు ఈ కాలంలోనే 18.8 శాతం నుంచి 21.4శాతం మధ్య ఉన్నాయి. సగటు 19.5శాతమే ఉంది. అందువలన వాటిలో కూడా పెద్దగా పెరుగుదల లేదు.మాక్రోట్రెండ్స్‌ అనే పోర్టల్‌ నిర్వహిస్తున్న సమాచారం ప్రకారం 2004 నుంచి 2013వరకు ఏటా సగటున మన దేశ జిడిపిలో 22.1శాతం ఎగుమతులు జరిగాయి. ఈలెక్కన మోడీ ఏలుబడిలో దిగుమతులు పడిపోయినట్లా పెరిగినట్లా ?


చైనాలో మాంద్యం… ఒప్పుకొన్న జింపింగ్‌ అనే శీర్షికలతో పాటు అనేక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.ఆర్థికంగా చైనా ఎంతో ఇబ్బందుల్లో ఉందని వాణిజ్యాలు గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నాయని, జనాలు ఉపాధి పొందలేకపోతున్నారని, కొంత మందికి రోజువారీ అవసరాలు తీరటం లేదని వర్తమాన స్థితి గురించి దేశాధినేత షీ జింపింగ్‌ నూతన సంవత్సర సందేశంలో చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అసలు చైనా నేత ఏం చెప్పారు ? షీ జింపింగ్‌ చైనా భాషలో ఇచ్చిన సందేశాన్ని విదేశీ మంత్రిత్వశాఖ ఆంగ్లంలో అనువదించి విడుదల చేసింది. దానిలో అనేక ఆకాంక్షలను వెలిబుచ్చారు. వాటితో పాటు దిగువ మాటలను చెప్పారు.” ప్రయాణంలో మనం కొన్ని ఎదురుగాలులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొన్ని సంస్థలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నాయి.కొంత మంది పౌరులు ఉపాధిని వెతుక్కోవటంలో, మౌలిక అవసరాలను తీర్చుకోవటంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాలు వరదలు, తుపాన్లు, భూ కంపాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నాయి. ఇవన్నీ నా మదిలో అగ్రభాగాన ఉన్నాయి.”. ఈ మాటలను పట్టుకొని చైనా ఆర్థిక స్థితి గురించి చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు చేశారు. జింపింగ్‌ గడచిన సంవత్సరంలో చైనా ఎదుర్కొన్న అంశాలను ప్రస్తావించారు. సాధించిన విజయాలను కూడా పేర్కొన్నారు.వాటిని విస్మరించి ఇబ్బందుల్లో ఉందన్న ప్రచారం చేస్తున్నారు. దాని వలన కొంత మంది తప్పుదారి పట్టటం తప్ప చైనాకు వచ్చే నష్టమేమీ లేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే చైనా జింపింగ్‌ దాచేందుకు ప్రయత్నించలేదు.


ఇంతకీ అసలు మాంద్యం అంటే ఏమిటి ? చైనాలో ఆ పరిస్థితి ఉందా ? మందగమనం అంటే మాంద్యమని అర్ధమా ? న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో 1974లో రాసిన ఒక విశ్లేషణలో అమెరికా కార్మిక గణాంకాల కమిషనర్‌ జూలియస్‌ షిష్కిన్‌ ఒక భాష్యం చెప్పారు. వరుసగా రెండు త్రైమాసిక (ఆరునెలలు) కాలాల్లో వాస్తవ జిఎన్‌పి(జాతీయ మొత్తం ఉత్పత్తి) తగ్గినా, ఆరునెలల్లో పారిశ్రామిక ఉత్పత్తి పతనమైనా దాన్ని మాంద్యం అంటారు. దీని తీవ్రత నిజ జిఎన్‌పి 1.5శాతం తగ్గినపుడు, వ్యవసాయేతర ఉపాధి 15శాతం పతనమైనపుడు, నిరుద్యోగం రెండు శాతం పెరిగి ఆరుశాతం స్థాయికి చేరినపుడు, ఇక వ్యాప్తి గురించి చెప్పాల్సి వస్తే వ్యవసాయేతర రంగంలో 75శాతం పైగా పరిశ్రమల్లో ఆరునెలలు, అంతకు మించి ఉపాధి తగ్గినపుడు మాంద్యంలో ఉన్నట్లు పరిగణించాలని షిష్కిన్‌ చెప్పాడు. ఇలాంటి పరిస్థితి చైనాలో ఉందా ? జింపింగ్‌ నోట మాంద్యం అనే మాట వచ్చిందా ? కరోనా తరువాత చైనా ఆర్థికరంగం మందగమనంలో ఉంది తప్ప మాంద్యంలో కాదు.చైనాలో గడచిన నాలుగున్నర దశాబ్దాల పారిశ్రామిక విధానం వేరు, ఇప్పుడు అనుసరిస్తున్నది వేరు. తన ఉత్పత్తిని పెంచుకొనేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగమతి చేసుకున్న చైనా ఇప్పుడు స్వంతంగా రూపొందించుకున్నదానితో ఆ రంగంలో ముందున్న దేశాలతో పోటీపడేందుకు చూస్తోంది. సాంప్రదాయ పరిశ్రమల స్థానంలో ఆధునికమైనవి వస్తున్నాయి. వాటికి అవసరమైన పరిశోధన-అభివృద్ధి ఖర్చులో మన వంటి దేశాలతో పోలిస్తే ఎంతో ముందున్నా ధనికదేశాలతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉంది. దాన్ని అధిగమించే క్రమంలో ఉంది.అడ్డుకొనేందుకు పశ్చిమ దేశాలు చూస్తున్నాయి.దానిలో భాగమే చిప్‌ వార్‌. కృత్రిమ మేథ(ఏఐ)లో పశ్చిమ దేశాలకు సవాలు విసురుతోంది. చైనా అంటే ఇష్టంలేని మీడియా సంస్థలు అక్కడ జరుగుతున్నదాని గురించి జనాలను తప్పుదారి పట్టిస్తున్నాయి. వైఫల్యాలను వారేమీ దాచటం లేదు. చైనా గురించి గతంలో చెప్పినవన్నీ అర్ధసత్యాలుగానూ అవాస్తవాలుగా తేలాయి. కూలిపోతుంది, విఫలమౌతుందని చెప్పిన జోశ్యాలన్నీ తప్పాయి. గతంలో మాదిరి రెండంకెల పెరుగుదల లేదు గానీ ధనిక దేశాల కంటే వృద్ధి రేటు అధికంగా ఉంది. అవి పతనం కానపుడు చైనాకే ఆ దుర్గతి ఎలా పడుతుంది ? ఇంత చిన్న తర్కాన్ని అర్ధం చేసుకోలేని స్థితిలో ఉన్నామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యాపై పనిచేయని పశ్చిమ దేశాల ఆంక్షలు ?

27 Wednesday Dec 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

China, Joe Biden, Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelensky


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య మంగళవారం 671వ రోజులో ప్రవేశించింది. పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.మేనెలలో బఖ్‌మట్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత మారింకా అనే మరో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా సోమవారం నాడు ప్రకటించింది. అబ్బే అలాంటిదేమీ లేదు, తమ సైనికులు ఇంకా అక్కడే ఉన్నారని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారి చెప్పాడు. తమ మీదకు వచ్చే క్షిపణులు, యుద్ధ విమానాలను కూల్చివేస్తున్నామని, విజయానికి చేరువలో ఉన్నామని జెలెనెస్కీ ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ తమ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప అడుగు ముందుకు పడటం లేదు. పశ్చిమదేశాల కారణంగా సంక్షోభం మూడవ సంవత్సరంలో కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ పోరులో ప్రత్యక్షంగా నిమగమైన రష్యా-ఉక్రెయిన్లే కాదు ప్రపంచ దేశాలన్నీ అనేక విధాలుగా గుణపాఠాలు తీసుకుంటున్నాయి. ఇక ఆయుధ వ్యాపారులు, ఉత్పత్తిదారుల సంగతి చెప్పనవసరం లేదు. వాటిని ఎంత ఎక్కువగా ఆమ్ముకోవాలి, మరింతగా మారణకాండను సృష్టించేవిగా వాటిని ఎలా సానబట్టాలా అని చూస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దాడిలో పట్టుకున్న లేదా ధ్వంసం చేసిన రష్యన్‌ టాంకులు, ఆయుధశకలాలను సేకరించి ఉత్పత్తిదారులకు అందచేసి పోటీగా రూపొందించే వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలో పరిశీలించండని కోరుతున్నట్లు బ్రిటీష్‌ మిలిటరీ అధికారి వెల్లడించారు.దొరికిన ప్రత్యర్ధుల ఆయుధాలు, వాహనాలను విశ్లేషించటం ప్రతిపోరులోనూ జరుగుతున్నదే. ఈ పోరులో డ్రోన్లతో దాడులు ఎలా చేయవచ్చో ప్రపంచం నేర్చుకుంటున్నది. ఉక్రెయిన్‌ సరిహద్దులకు ఆవల రష్యా తన వ్యూహాత్మక అంశాలను మరోసారి విశ్లేషించుకొనే విధంగా నాటో కూటమి దేశాల విస్తరణ పురికొల్పుతున్నది. కొత్త ఎత్తుగడలకు పుతిన్‌ తెరతీస్తాడు. అది ఒక్క రష్యాకే కాదు, ఐరోపా రక్షణ అంశాలను కూడా సమీక్షించాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది. కానీ అసలైన సమస్య ఎంతకాలం ఉక్రెయిన్‌ తట్టుకొని నిలబడుతుందనే ఆందోళన పశ్చిమ దేశాల్లో రోజురోజుకూ పెరుగుతోంది. రాజీకి సిద్దమేగానీ రష్యా చేతిలోకి వెళ్లిన తమ ప్రాంతాల సంగతేమిటని జెలెనెస్కీ అడుగుతున్నాడు. ఒకటి కావాలంటే మరొకదాన్ని వదులుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా అమెరికా సూచిస్తున్నట్లు వార్తలు. ఆ ప్రాంతాల గురించి మరిచిపోండి, పశ్చిమ దేశాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఇంతకంటే జరిగే నష్టం మాకు ఉండడు, కావాలంటే రాజీ చర్చలకు నేను సిద్దమే అని పుతిన్‌ చెబుతున్నాడు. ఇటు ఉక్రెయిన్‌ ఓడిపోయి, రష్యా మీద ఆంక్షలను ఎత్తివేసే పరిస్థితి వస్తే తమ పరువేంగాను అని నాటో కూటమి దేశాలు అనుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. మరోవైపు పాలస్తీనా ప్రాంతమైన గాజాలో పరువు దక్కించుకొని బయటపడటం ఎలా అన్న సమస్య పశ్చిమదేశాలకు తలెత్తింది.మధ్య ప్రాచ్యపరిస్థితిని చూస్తే ఎప్పుడేమౌతుందో తెలియటం లేదు.


వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఫిన్లండ్‌, తరువాత స్వీడెన్‌ నాటోలో ప్రవేశించనున్నాయి. అంటే మరోవైపు నుంచి రష్యా సరిహద్దులకు నాటో మిలిటరీ, ఆయుధాలు చేరనున్నాయి. ఫిన్లండ్‌-రష్యా మధ్య 1,300 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. 2026 నాటికి ఎఫ్‌-35 ఐదవతరం యుద్ధ విమానాలను అది సమకూర్చుకోనుంది. అమెరికాలో ఎన్నికల కారణంగా అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు వచ్చే సాయానికి అంతరాయం కలిగితే ఆ ఖర్చును తట్టుకొనేదెలా అని ఐరోపా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. వలసలను అనుమతించరాదంటూ మితవాద శక్తులు ప్రతి దేశంలోనూ జనాన్ని రెచ్చగొడుతున్నాయి, ఎన్నికల్లో వాటికి మద్దతు పెరుగుతోంది.తాము మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు స్లోవేకియా ప్రకటించింది. అది చిన్నదేశమే అయినప్పటికీ దాని ప్రభావం పెద్ద దేశాలు, జనం మీద పడుతుంది.అమెరికా, ఐరోపా ధనికదేశాలు కోరుకున్న విధంగా రష్యా మీద విధించిన ఆంక్షలు ఫలితాలనివ్వటం లేదు.పోరు ఆగేట్లు లేదు, మడిగట్టుకొని ఎంతకాలం కూర్చుంటాం రష్యాతో వాణిజ్యం చేస్తామని చెబుతున్నాయి. రష్యాను ఒంటరి చేయటంలో పశ్చిమ దేశాలు ఇంకా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి గానీ ఫలించటం లేదు. నల్లసముద్రం, బాల్టిక్‌ సముద్రం, ఆర్కిటిక్‌ సముద్రాల మీద పట్టు నిలుపుకోవాలన్నది రష్యా లక్ష్యం, దెబ్బతీయాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకోసం ఐరోపాలోని నాటో కూటమి దేశాల మీద ఆధారపడింది. ఫిన్లండ్‌, స్వీడన్‌లను నాటోలో చేర్చుకోవటం ద్వారా ఆపని చేయాలని చూస్తున్నది. తాము తలచుకుంటే రష్యా సెంట్‌పీటర్స్‌బర్గ్‌కు చేరే, తిరిగి వచ్చే మార్గాలను మూసివేయగలమని నాటో ప్రధాన కార్యదర్శి జనరల్‌ ఆండ్రెస్‌ ఫాగ్‌ రాస్‌ముసెన్‌ అన్నాడు. నార్వే గడ్డమీద నాలుగు మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసి పట్టుసాధించేందుకు అమెరికా పూనుకుంది.


ఆంక్షలు విధించిన తరువాత 2023లో రష్యా రేవుల ద్వారా సరకు రవాణా 7.8శాతం పెరిగినట్లు సమాచారం తెలుపుతున్నది. బాల్టిక్‌ సముద్రాన్ని నాటో సరస్సుగా పశ్చిమ దేశాలు ప్రకటించినా ఆ ప్రాంత రేవుల ద్వారా కూడా రెండున్నరశాతం సరకు రవాణా పెరిగింది. వీటిలో చైనాకు చమురు కీలక పాత్ర పోషించింది.2019లో తొలి వాణిజ్య రవాణాలో 22లక్షల పీపాల చమురు ఎగుమతి జరగ్గా, 2023లో 104లక్షలకు పెరిగింది. పశ్చిమదేశాల వ్యూహాలను, రష్యాపై విధించిన ఆంక్షలను చూసిన తరువాత సూయజ్‌ కాలువ ద్వారా జరుగుతున్న రవాణాను మరో మార్గానికి మళ్లిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చైనా భావిస్తోంది. రష్యా కూడా ప్రత్యామ్నాయాల గురించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నది. ఉత్తర ధృవ కేంద్రం ఉన్న ఆర్కిటిక్‌ సముద్ర ప్రాంతరేవుల ద్వారా రవాణాలో మూడో వంతుదూరం, సమయం, ఖర్చు కూడా కలసి వస్తుంది. సూయజ్‌ కాలువ మాదిరి దాటేందుకు సుంకం చెల్లించాల్సిన అవసరంగానీ, వేచి ఉండాల్సిన పరిస్థితిగానీ, సముద్రపు దొంగల బెడదా ఉండదు. అయితే ఊహించని వాతావరణ, మంచు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.పశ్చిమ దేశాలతో తలెత్తే వైరుధ్యాలను గమనంలో ఉంచుకొని రష్యా కూడా వాటిని అధిగమించే చర్యలకు పూనుకుంది.ఆర్కిటిక్‌ సముద్ర మార్గంలో మంచును బద్దలు చేసి ముందుకు పోయే నౌకలను సిద్దం చేస్తున్నది. రానున్న పదమూడు సంవత్సరాల్లో 22 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 50 (ఐస్‌ బ్రేకర్స్‌ )మంచులో నడిచే నౌకలను నిర్మిస్తున్నది.ఇలాంటి వాటిని అమెరికా, చైనా కూడా నిర్మిస్తున్నది. అవసరమైన ఏర్పాట్లు జరిగితే రష్యాలోని సైబీరియా, అలాస్కా మీదుగా ఉత్తర చైనాకు సరకురవాణా జరపవచ్చు.ఆ మార్గంలో ఏ దేశాలూ లేవు.ఇరవై నాలుగు వేల ఆర్కిటిక్‌ సముద్ర తీరం ఉన్న రష్యా ఆ ప్రాంతం నుంచి వెలికి తీస్తున్న చమురు, గాస్‌ను ఐరోపాకు ప్రధానంగా ఎగుమతి చేసేది, ఇప్పుడు ఇతర ప్రాంతాలకు పంపుతున్నది. ఈ ప్రాంత వనరులను రష్యా ఎంతగా వెలికితీస్తే అంతగా ప్రపంచంలో దాని ఆర్థిక పలుకుబడి పెరుగుతుంది.బహుశా దీన్ని ఊహించే అమెరికా కూడా అలాస్కా, గ్రీన్‌లాండ్‌ ప్రాంతంలో ఇప్పుడున్న మిలిటరీ కేంద్రాలను మరింతగా పటిష్టపరుస్తున్నది, నార్వేలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. రష్యాను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా ఫిన్లండ్‌, నార్వేలతో మిలిటరీ సహకారాన్ని పెంచుకుంటున్నది.ఆర్కిటిక్‌ ప్రాంతంలో తన సరిహద్దుల నుంచి రెండువందల నాటికల్‌ మైళ్లకు (370 కిలోమీటర్లు) ఆవల కూడా తమకు హక్కు ఉందని అమెరికా కొత్తగా వివాదాస్పద ప్రకటనగావించింది. సముద్ర చట్టాల ఐరాస ఒప్పందంలో ఇంతవరకు అది భాగస్వామి కాదు. ఆ ప్రాంతంలో ఉన్న విలువైన ఖనిజాలు ఉండటమే దీనికి కారణం.


పశ్చిమ దేశాల అండచూసుకొని ఉక్రెయిన్‌ ఎన్నిబెదిరింపులకు పాల్పడినప్పటికీ ఇటీవలి కాలంలో నల్లసముద్రం, అజోవ్‌ సముద్రాలలో రష్యా ఓడల రవాణా 17.2శాతం పెరిగింది. నాటో రష్యా మీద విధించిన ఆంక్షలను సభ్యదేశమైనప్పటికీ టర్కీ పాలకులు అమలు చేయటం లేదు, అంతేకాదు ఏజియన్‌ సముద్రం నుంచి నల్లసముద్రంలోకి దారి తీసే రెండు జలసంధులలోకి నాటో యుద్ధ నౌకలను అనుమతించటం లేదు.వాటికి రెండువైపులా టర్కీ ఉంది. నాటో తన బలగాలను విస్తరించుకొనేందుకు నల్లసముద్రంలో అమర్చిన మందుపాతరలను వెలికి తీసే పేరుతో రుమేనియా రూపంలో ముందుకు వస్తున్నదని చెబుతున్నారు. నాటోతో నిమిత్తం లేకుండా రుమేనియాతో పాటు టర్కీ, బల్గేరియా ఒక ఒప్పందం చేసుకొని మందుపాతరలను తొలగించేందుకు పూనుకున్నాయి.అమెరికా, ఐరోపా దేశాల ఎత్తుగడలను పసిగట్టిన వ్లదిమిర్‌ పుతిన్‌ నల్లసముద్ర తటస్థ జలాల మీద కాపలా కాసేందుకు హైపర్‌సోనిక్‌ క్షిపణులతో కూడిన జట్‌ విమానాలను మోహరించాలని అక్టోబరు నెలలో ఆదేశించాడు. సూయజ్‌ కాలువ ద్వారా కంటే తక్కువ దూరం ఉండే జలమార్గం కాస్పియన్‌ సముద్రం నుంచి ఉంది.దాన్ని పూర్తిగా వినియోగించుకొనేందుకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇరాన్‌, పర్షియన్‌ గల్ఫ్‌,మధ్య ఆసియా దేశాలు, పాకిస్థాన్‌, భారత్‌కు ఈ మార్గం నుంచి చేరటం దగ్గర అవుతుంది. ఈ సముద్ర తీరంలో ఉన్న తన నౌకాశ్రయాల నుంచి రవాణాను పెంచేందుకు రష్యా పూనుకుంది. ఇటీవల చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరాన్‌లో 162కిలోమీటర్ల రైలు మార్గాన్ని రష్యా నిర్మిస్తుంది.పసిఫిక్‌ ప్రాంత దేశాలతో రష్యా సరకు రవాణా 5.7శాతం పెరిగింది.రష్యా దూరప్రాచ్య రేవుల నుంచి ఇది జరిగింది. గతేడాది సెప్టెంబరులో చైనాలోని క్వాంగ్‌ఝౌ నుంచి రష్యా వ్లాడీవోస్టాక్‌ వరకు ఒక నౌకా మార్గాన్ని ప్రారంభించాయి. దీన్ని ఐస్‌ సిల్క్‌ రోడ్‌ అని పిలుస్తున్నారు. యూరేసియా ప్రాంతంతో మరింత సన్నిహితం కావటానికి ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు.వ్లాడీవోస్టాక్‌ నుంచి ఆర్కిటిక్‌ ప్రాంతంలోని వివిధ రేవులకు ఈ మార్గాన్ని చైనా పొడిగించవచ్చని వార్తలు.


ఉక్రెయిన్‌ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో అంతకాలం రష్యా మీద ఆంక్షలు కొనసాగుతాయి. వాటిని తప్పించుకొని గ్రీస్‌ ఓడలు ఇరాన్‌, రష్యా చమురు రవాణా చేయటాన్ని గ్రహించిన అమెరికా యజమానులను బెదిరించింది. దాంతో ఆ తలనొప్పి ఎందుకు అంటూ ఓడలు, టాంకర్లను అమ్ముకొని లాభాలు పొందుతున్నట్లు తేలింది.టాంకర్లకు డిమాండ్‌ పెరిగింది. గడచిన పన్నెండు నెలల్లో నాలుగు వందల కోట్ల డాలర్ల విలువగల 125 చమురు టాంకర్లు, నౌకలను విక్రయించారు. అయితే వాటిని కొన్నవారి పేర్లు వెల్లడికాకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎక్కువ భాగం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన వారు కొనుగోలు చేసినట్లు తేలింది. తరువాత చైనా, టర్కీ, భారత్‌ ఉన్నాయి. తమ మనుగడకే ముప్పు తెచ్చిన నాటో కూటమిని ఎదుర్కొనేందుకు రష్యా కూడా దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాలను రూపొందించుకోవటం అనివార్యం.మిలిటరీ రీత్యా ఆయుధనవీకరణ ఒకటైతే ఐరోపాతో దెబ్బతిన్న వాణిజ్యం, ఎగుమతులకు ప్రత్యామ్నాయ ప్రాంతాలను చూసుకోవటం తప్పనిసరి.ఆర్థికంగా చైనా పెద్ద మద్దతుదారుగా ఉంది. మనదేశం దీర్ఘకాలంగా రష్యాతో ఉన్న మిలిటరీ, ఆర్థిక సంబంధాలను కొనసాగించక తప్పని స్థితి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అడ్దా మీది కూలీ మాదిరి రాష్ట్ర ఆర్థిక స్థితి: భారాలు మోపితే జనానికి ఆగ్రహం ! రేవంత రెడ్డి కత్తిమీద సాము !!

23 Saturday Dec 2023

Posted by raomk in BRS, Congress, Current Affairs, Economics, NATIONAL NEWS, Politics, Telangana

≈ Leave a comment

Tags

A Revanth Reddy, Telangana CM, Telangana CM Revanth Reddy, Telangana White Papers


ఎం కోటేశ్వరరావు


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత రెడ్డి ఎన్నికలకు ముందు, ఫలితాల తరువాత ప్రకటించిన మేరకు వివిధ అంశాల మీద శ్వేత పత్రాలను ప్రకటిస్తూ జనాలకు వాస్తవాలను వెల్లడించే ఒక మంచి పని చేస్తున్నారు. మిగిలిన వాటి మీద కూడా వెంటనే ప్రకటిస్తారని ఆశిద్దాం. వీటికి పోటీగా స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని బిఆర్‌ఎస్‌ ప్రకటించింది. మథనం జరగటం మంచిదే. దేన్నయినా మూసిపెడితే పాచిపోతుందన్నది ఒక సామెత. అధికారానికి వచ్చిన కొత్తలో గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలు శ్వేత పత్రాను విడుదల చేశాయి. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ రోజుల్లో సోషల్‌ మీడియాలో వస్తున్న సమాచారం గందరగోళాన్ని సృష్టిస్తున్నది.పైకి ఎన్ని సుభాషితాలను వల్లించినా మీడియా రాజకీయ శిబిరాల వారీ చీలి నాణానికి ఒకవైపు మాత్రమే చూపుతూ తాను మద్దతు ఇచ్చే పక్ష ప్రతికూల సమాచారాన్ని తొక్కిపెడుతున్నది. చాకుతో కూరగాయలతో పాటు మెడను కూడా కోయవచ్చు. శ్వేతపత్రాలు కూడా అలాంటివే. జనానికి వాస్తవాలు చెప్పే మంచితో పాటు ఆ సమాచారాన్ని చూపే పాలకులు వాగ్దాన భంగాలకూ పాల్పడవచ్చు. గత అనుభవాన్ని బట్టి దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు. ఎవరి మీదా భ్రమలు పెట్టుకోనవసరం లేదు.


తెలంగాణా ఆర్థిక స్థితి గురించి వెల్లడించిన పత్రంలోని వివరాలు, రాష్ట్ర సర్కారుకు ఎదురయ్యే సవాళ్ల గురించి చూద్దాం. గత పాలకులు చెప్పినదానికి భిన్నంగా ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో అప్పులు చేసింది..2014లో రాష్ట్ర విభజన సమయంలో ఉన్న అప్పు రు.72,658 కోట్లు. 2023 డిసెంబరు నాటికి అది రు.6,12,343 కోట్లకు పెరిగింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న (ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి లోబడి) రుణం రు.3,89,673 కోట్లు.పదిహేడు నిర్దిష్ట అవసరాల కోసం( స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌) తీసుకున్న అప్పు రు.1,27,208 కోట్లు, ప్రభుత్వ హామీతో 14 సంస్థలు తీసుకున్న మొత్తం రు.95,462 కోట్లు ఉన్నాయి. ఇవిగాక జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి వంటి వివిధ సంస్థలు స్వంతంగా తీసుకున్న రుణాల బకాయిలు రు.59,414 కోట్లు కూడా కలుపు కుంటే మొత్తం బకాయిలు రు.6,71,757 కోట్లని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా లోకానికి చూపించిన కాళేశ్వరం పధకానికి రుణ మంజూరు రు.97,449 కోట్లు కాగా విడుదల చేసింది రు.79,287 కోట్లు, దీని అప్పు ఇంకా రు.74,590 కోట్లు ఉంది. ఈ రుణాలకు గాను చెల్లిస్తున్న అసలు, వడ్డీలు 2015లో మొత్తం రు.7,255 కోట్లు(బడ్జెట్‌ రాబడిలో 14శాతం) ఉంటే 2023లో రు.53,978 కోట్ల(బడ్జెట్‌లో 34శాతం)కు చేరాయి. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర జిఎస్‌డిపిలో 25శాతం వరకు అప్పులు తీసుకోవచ్చు. ప్రస్తుతం 27.8శాతంగా ఉన్నాయి. ఇవిగాక ఇతరంగా తీసుకున్న అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే 36.9శాతానికి చేరాయి. దీంతో రాష్ట్ర రుణ అర్హత పరిమితి తగ్గింది.


బడ్జెట్‌ కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయటం లేదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో తేడా ఎక్కువగా ఉందని శ్వేత పత్రం పేర్కొన్నది.2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపుల్లో మొత్తంగా 87శాతం ఖర్చు చేశారు. తెలంగాణా ఏర్పడిన తరువాత అది 82.3శాతానికి దిగజారింది. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం 2021-22లో పద్దెనిమిది సాధారణ రాష్ట్రాలలో రాజస్థాన్‌ 116.4శాతంతో ప్రధమ స్థానంలో ఉండగా పదిహేడవదిగా ఉన్న తెలంగాణాలో 79.3శాతమే ఖర్చు చేశారు. చివరిదిగా 74.7శాతంతో పంజాబ్‌ ఉంది. కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, కార్మికులు, ఇతరులకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తం రు.40,155 కోట్లు ఉంది. నిధులు లేనపుడు వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓవర్‌ డ్రాప్టుల రూపంలో ఆర్‌బిఐ నుంచి రుణాలు తీసుకొనే సౌకర్యం ఉంది. అడ్డామీద కూలీకి ఏరోజు పని దొరికితేనే ఆ పూట భుక్తి. రాష్ట్ర స్థితి కూడా అలాంటిదే. ఈ కారణంగానే ప్రతి నెలా ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటవ తేదీనే చెల్లించలేని స్థితి. పిఆర్‌సి, కరువు భత్యం వాయిదాల పద్దతిలో చెల్లిస్తుండగా, సకాలంలో మంజూరు చేయకుండా సంవత్సరాల తరబడి నిలిపివేస్తున్నారు.(ప్రస్తుతం రేవంత రెడ్డి రైతు బంధును కూడా దశలవారీ విడుదల చేస్తున్న కారణం అదే.) .2015-16లో కేవలం రెండు సార్లు మాత్రమే మాత్రమే వేస్‌ అండ్‌ మీన్స్‌ సౌకర్యాన్ని వినియోగించుకోగా తరువాత సంవత్సరాల్లో క్రమంగా పెరిగింది. 2022-23లో ఏడాదిలో 328 రోజులు తీసుకున్నారు. వర్తమాన సంవత్సరంలో నవంబరు 23 నాటికి 214 రోజులు తీసుకున్నారు. రేవంత రెడ్డి సర్కార్‌కు సైతం మరో మార్గం లేదు.2014-15లో గరిష్టంగా 303 రోజులు నగదు నిల్వలు ఉండగా ప్రస్తుతం అవి 30 రోజులకు పడిపోయాయి.


నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నందున ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన జరిగింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడదీసి తెలంగాణాను ఏర్పాటు చేసినపుడు ఆస్తులు-అప్పుల విభజన 58-42 దాషామాతో జరిగింది. దీనికి జనాభా ప్రాతిపదిక. ఉమ్మడి రాష్ట్రంలో 1956-57లో వాస్తవ వ్యయం రు.79 కోట్లు కాగా తెలంగాణా వాటా రు.33 కోట్లు. రాష్ట్రం విడిపోయే నాటికి మొత్తం వ్యయం రు.11,94,945 కోట్లు కాగా తెలంగాణాలో ఖర్చు రు.4,98,053 కోట్లు అంటే 41.68శాతం ఉంది.( రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు వాటిలో పెట్టుబడులను కూడా కలుపు కుంటే తెలంగాణాలో అంతకంటే ఎక్కువ మొత్తమే ఖర్చు జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధంగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో వచ్చిన ప్రైవేటు పరిశ్రమల పెట్టుబడులు వీటిలో లేవు. వీటి గురించి శ్వేత పత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదు)


ఇక విద్యుత్‌ రంగ పరిస్థితి మీద విడుదల చేసిన పత్రంలో ఉన్న వివరాల ప్రకారం పది సంవత్సరాల నాడు పంపిణీ కంపెనీలు(డిస్కామ్స్‌) రు.12,186 కోట్ల నష్టాలతో ఉండగా ప్రస్తుతం రు.62,461 కోట్లకు చేరాయి. ప్రభుత్వ బకాయిలే రు.43,770 కోట్లు ఉన్నాయి.విద్యుత్‌ క్రమబద్దీకరణ కమిషన్‌ ముందు ప్రతిపాదించి ఆమోదం పొందిన దానికన్నా వాస్తవిక వ్యయం పెరిగితే దాన్ని ట్రూ అప్‌ ఛార్జీలు అంటారు.తాత్కాలిక అవసరాల కోసం కొనుగోలు చేసిన విద్యుత్‌ యూనిట్‌ ధర రు.5.86 నుంచి గరిష్టంగా రు.20వరకు ఉంది.ఒక్క 2022-23లోనే ట్రూఅప్‌ ఛార్జీల మొత్తం రు.12,550 కోట్లు. ఇవిగాక క్రమబద్దీకరణ కమిషన్‌ ఆమోదం పొందిన సమయంలో విద్యుత్‌ తయారీకి వినియోగించే బొగ్గు, గ్యాస్‌ వంటి ఇంథన ధరల్లో పెరుగుదల ఎంత ఉంటే అంత సర్దుబాటు చార్జీల పేరుతో అదనంగా వసూలు చేయవచ్చు.ఇవి, ట్రూఅప్‌ ఛార్జీలను సబ్సిడీగా ప్రభుత్వం భరించాలి లేదా వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. ఇంత భారం జనాల నుంచి వసూలు చేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఎన్నికలను గమనంలో ఉంచుకొని వాటిని తామే చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది తప్ప ఇంతవరకు చెల్లించలేదు. ఇవన్నీ భారాల రూపంలో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ మెడకు చుట్టుకున్నాయి.


బడ్జెట్‌ పత్రాల్లో ఈ వివరాలన్నీ పొందుపరుస్తున్నప్పటికీ వివిధ ఖాతాల్లో చూపుతారు. వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చటం సామాన్యులకు సాధ్యం కాదు గనుక వాటి జోలికి పోరు. అధికార యంత్రాంగం గారడీ చేస్తుంది. శ్వేత పత్రంలో వాటి సారాన్ని ఒక దగ్గరకు చేర్చుతారు గనుక సూటిగా అర్ధం అవుతాయి. ఈ పత్రాలపై చర్చ సందర్భంగా అసెంబ్లిలో, వెలుపలా అధికార పార్టీకి చెందిన వారు ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారిందని తమకు ముందు తెలియలేదని, అధికారికంగా సమీక్షల్లో చూసిన తరువాతనే తీవ్రత అర్ధమైందని మాట్లాడుతున్నారు. వీటిని చూస్తే గతం గుర్తుకు వస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి నేత వై.ఎస్‌ .జగన్మోహనరెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు జరుపుతామని వాగ్దానం చేసి ఓట్లు వేయించుకున్నారు. తరువాత అడ్డం తిరిగి దాని గురించి తెలియక మేము వాగ్దానం చేశాము, దాని బదులు కొత్త పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు, పార్టీ నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించి మడమ తిప్పారు.ఐదు సంవత్సరాల్లో మద్యనిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి దాని గురించి ఇప్పుడు అసలు మాట్లాడటమే మానుకున్నారు. ఎందుకంటే దాని మీద వచ్చే రాబడిని వదులుకోవటానికి ప్రభుత్వం సిద్దంగా లేదు. ఆర్థికంగా పరిస్థితి దిగజారి నవరత్నాలకు కోతపెట్టాల్సి వస్తుందన్నదే దీని వెనుక ఉన్న అసలు కారణం. తెలంగాణా రాష్ట్ర సమితి తాము అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పింది. తీరా అడ్డం తిరిగి కొనటానికి భూమి లేదని తప్పించుకున్నది.ఇలా ఎన్ని ఉదాహరణలనైనా చెప్పుకోవచ్చు.


రేవంత రెడ్డి సర్కార్‌ ముందు తీవ్ర సవాళ్లు ఉన్నాయి. గత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధులుకేటాయించి విద్యుత్‌ సంస్థలు, ఇతరులకు పెద్ద ఎత్తున బకాయి పెట్టింది. అప్పులు తెచ్చుకొనే అవకాశాలన్నింటినీ వాడుకొని కొత్తగా పుట్టకుండా చేసింది. వడ్డీ, అసలు వాయిదాలకే పరిమితంగా తీసుకొనే అప్పు సరిపోదు. రైతు బంధు పధకంలో పెద్ద రైతులకు మినహాయిస్తామని చెప్పినందున దాని వలన పెద్దగా మిగిలేదేమీ ఉండదు. ఎందుకంటే అర్హులకు గతం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పటంతో పాటు కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలకు నగదు అందిస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది.లబ్దిదారుల గుర్తింపు విధి విధానాలను ఇంకా ప్రకటించలేదు.లోక్‌సభ ఎన్నికలలోపు వాటిని విడుదల చేస్తే దాని ప్రభావం ఎన్నికల మీద పడుతుంది. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్‌ వస్తుందని చెబుతున్నారు గనుక అప్పటి వరకు శ్వేత పత్రాలు, వాటి మీద చర్చ, తక్షణమే నగదుతో పనిలేని పధకాలను ప్రారంభించవచ్చు. విద్యుత్‌ సంస్థలకు బకాయిలు పెట్టినందుకు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ అంత పెద్ద మొత్తాలను వెంటనే ఎలా తీరుస్తుందన్నది ప్రశ్న. ఉద్యోగులు వేతనాలు, పెన్షన్లు పెరిగేవే తప్ప తగ్గవు.వడ్డీల చెల్లింపు తప్పదు.ఈ కారణంగా ప్రకటించిన హామీలను తక్షణమే అమలు కాకుండా సాగదీసే అవకాశం ఉంది. తక్షణమే వాగ్దానాలను అమలు చేస్తామని చెప్పినందున సహజంగానే జనం కూడా అలాగే ఎదురు చూస్తారు.ఫిబ్రవరి లేదా మార్చినెలలో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ అనుమతి తప్ప పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశం లేదు గనుక ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో వెంటనే జనానికి తెలిసే అవకాశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై నిరంతర వక్రీకరణలతో కొందరికి అదో ” తుత్తి ” !

21 Thursday Dec 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

#Anti China, #media lies on China, anti china, China economy, China exports, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


సంస్కరణల బాట పట్టిన 1978 నుంచీ చైనాలో జరుగుతున్న పరిణామాల గురించి ప్రతికూలంగా స్పందించకపోతే ప్రపంచ మీడియాకు రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. రాసేవారి బుర్ర ఎంతో పదునుగా ఉంటోంది గనుకనే పదే పదే కొత్త కొత్త ”కత”లతో జనం ముందుకు వస్తున్నారు.యుద్ధాలలో అమాయకులు బలౌతున్నట్లే వర్తమాన ప్రచార దాడులలో అనేక మంది మెదళ్లకు గాయాలై సరిగా పనిచేయటం లేదు. ఆ ప్రచారం వారికి ఒక సినిమాలో చెప్పినట్లు అదో తుత్తి (తృప్తి) నిస్తోంది. కరోనా నిరోధానికి విపరీత కట్టుబాట్లతో చైనా కుప్పకూలిపోయిందని చెప్పి కొందరు సంతోషించారు. నమ్మినవారిని వెర్రి వెంగళప్పలను చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నమోదు చేసిన సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రపంచ వస్తువుల ఎగుమతుల విలువ 2022లో 25లక్షల కోట్ల డాలర్లు. దానిలో కేవలం పదకొండు పెద్ద ఎగుమతి దేశాల వాటా 12.8లక్షల కోట్లు. మిగతా దేశాలన్నింటిదీ 12.1లక్షల కోట్లే. కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డామని, దేశాన్ని తిరిగి అభివృద్ది పట్టాల మీద ఎక్కించామని మన కేంద్ర ప్రభుత్వం, బిజెపి ఎంతగా చెప్పుకున్నా తొలి పదకొండు దేశాల జాబితాలో లేదు.చివరికి పదో స్థానంలో ఉన్న హాంకాంగ్‌(చైనా) ప్రాంత ఎగుమతులు 609.9 బి.డాలర్లు కాగా మనవి 453.5 బి.డాలర్లు మాత్రమే. ప్రధమ స్థానంలో ఉన్న చైనా 3.6లక్షల కోట్ల డాలర్ల మేర ఎగుమతి చేసింది. అంటే 14.4 శాతం వాటా కలిగి ఉంది. తరువాత ఉన్న అమెరికా 8.4శాతం కలిగి ఉంది.2009 నుంచి చైనా తన ప్రధమ స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. దాన్ని అధిగమించి తెల్లవారేసరికి మన దేశాన్ని ముందుకు తీసుకుపోతామని నరేంద్రమోడీ అండ్‌కో చెబుతుంటే జనం నిజమే అని నమ్ముతున్నారు.


ఇటీవలి కాలంలో తమ విదేశీ వాణిజ్యం తిరిగి పట్టాలకు ఎక్కటం ప్రారంభమైందని చైనా ప్రకటించింది.ఆగస్టు నుంచి తిరోగమనంలో ఉన్నది గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ ఏడాది 1.2శాతం పెరిగిందని అధికారులు ప్రకటించారు. అమెరికాకు గత పద్నాలుగు నెలలుగా తగ్గుముఖం పట్టిన ఎగుమతులు కూడా 9.6శాతం అధికంగా ఉన్నాయి. చైనా చెప్పిన అంకెలను ఎప్పుడూ నమ్మని నిత్యశంకితులు, తమకు అనుకూలం అనుకున్నవాటిని మాత్రమే చెప్పేవారు ఉంటారన్నది తెలిసిందే. ఎవరు నమ్మినా నమ్మకున్నా చైనాకు పోయేదీ, ఇతర దేశాలకు వచ్చేదేమీ లేదు.డిసెంబరు పద్నాలుగవ తేదీన ఎకానమిస్ట్‌ పత్రిక ” తన ఎగుమతి విజయాన్ని చైనా తక్కువ చేసి చూపుతోందా ” అంటూ ఒక విశ్లేషణను ప్రచురించింది. గడచిన రెండు దశాబ్దాలలో తన వాణిజ్య మిగులును సబ్సిడీలుగా ఇచ్చి ఎగుమతులతో ఇతర దేశాల్లో ఉపాధిని హరించిందని, ఇప్పుడు విద్యుత్‌ కార్లను వేగంగా ఉత్పత్తి చేసిన తన వాణిజ్య భాగస్వాములను ఆందోళనకు గురి చేస్తోందని కూడా దానిలో పేర్కొన్నారు. చైనా వాణిజ్య మిగులు ఇప్పుడు 312బిలియన్‌ డాలర్లుగా ఉందని చైనా విదేశీ మారక ద్రవ్య యంత్రాంగం(సేఫ్‌) పేర్కొన్న అంకెలు నిజమేనా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. అమెరికా విదేశీ సంబంధాల మండలికి చెందిన బ్రాడ్‌ సెట్సర్‌, ఆర్థిక వ్యవహారాల వ్యాఖ్యాత మాథ్యూ కెలిన్‌ అభిప్రాయాలను దానిలో ఉటంకించారు. ప్రస్తుతం ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చూసినపుడు చైనా మిగులు ఎక్కువగా ఉన్నప్పటికీ నాటకీయంగా తక్కువ చేసి చూపుతున్నారని, విదేశీ ఆస్తుల నుంచి వచ్చిన రాబడి, ఎగుమతులను తక్కువగా చూపుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రకటించిన మిగులు కంటే రెండువందల బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ఉంటాయని సెట్సర్‌ చెప్పాడు.చైనా నుంచి లెక్కల్లో చూపకుండా విదేశాలకు తరలుతున్న పెట్టుబడులను దాచి పెట్టేందుకు చూస్తున్న కారణంగానే తక్కువ చేసి చూపుతున్నారని వారు ఆరోపించారు. తక్కువ-ఎక్కువ ఏది చెప్పినా ఇతరులకు నష్టం ఏమిటి ? గడచిన ఆరు నెలల్లో తొలిసారిగా చైనా ఎగుమతులు పెరిగినందున అక్కడి ఫ్యాక్టరీలకు ఎంతో ఉపశమనం కలిగించిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. ధరలు తగ్గించిన కారణంగా ఎగుమతులు పెరిగాయని, ఇలా ఎంతకాలం కొనసాగిస్తారని కొందరు అనుమానాలు వెల్లడించారు. ఎక్కువగా ఎగుమతులు ఎలక్ట్రానిక్‌ యంత్రాలు, కార్లు ఉన్నాయని, ఐరోపా, రష్యాలో ఉన్న గిరాకీ కారణంగా ఎగుమతులు ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు. విదేశీ వాణిజ్యలోటు ఉన్న మన దేశమే ఎగుమతి ప్రోత్సాహకాల పేరుతో ఎగుమతిదార్లకు రెండు లక్షల కోట్లు పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఆ వచ్చే రాయితీల మేరకు మన దేశంలోని వారు కూడా వస్తువుల ధరలను తగ్గించి దిగుమతిదార్లను ఆకర్షిస్తారు. వ్రతం చెడ్డా మనకు ఫలం దక్కటం లేదు.


చైనా జిడిపి వృద్ధి రేటు 2024లో 4.8 నుంచి 4.4శాతానికి తగ్గుతుందని ప్రపంచబ్యాంకు తాజాగా పేర్కొన్నది. అక్కడి ఆర్థిక వ్యవస్థ బాగు చేయలేనంత దుస్థితిలో లేదని అమెరికాలోని నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ నాన్సీ క్వియాన్‌ చెప్పారు.ఓయిసిడి దేశాలైన స్వీడెన్‌, స్పెయిన్‌, ఇటలీ వంటి వాటితో పోలిస్తే యువతీ యువకుల్లో నిరుద్యోగం పెరుగుదల చైనాలో తక్కువ అని ఆమె అన్నారు. ఇటీవలి దశాబ్దాలలో సాధించిన ప్రగతితో పోల్చిచూస్తే తాజాగా చిన్నపోయినట్లు కనిపించవచ్చు తప్ప మరింకేమీ కాదని చెప్పారు.చైనా వాణిజ్య మిగులు పెరిగితే విదేశాల్లో ప్రతిగా రక్షణాత్మక చర్యలు పెరిగే అవకాశం ఉందని బాకోని విశ్వవిద్యాలయానికి చెందిన డేనియల్‌ గ్రోస్‌ చెప్పాడు. చైనా అనుసరిస్తున్న విధానాల కారణంగానే అక్కడ రియలెస్టేట్‌ బుడగ ఎప్పటి నుంచో తయారవుతున్నదని ఇప్పుడు పేలిందని కొందరు చెబుతున్నారు. దానిలో భాగంగానే ఎవర్‌గ్రాండే కంపెనీ చెల్లింపుల సంక్షోభంతో అమెరికాలో దివాలా రక్షణ కోరింది. దీన్ని చూసి ఇంకే ముంది చైనా మొత్తం దివాలా తీయనుందని ఊదరగొట్టారు. ఒక నిర్మాణ కంపెనీ చేతులెత్తేస్తే దానిలో లాభాల కోసం పెట్టుబడులు పెట్టిన వారు దెబ్బతింటారు. దాని దగ్గర ఉన్న భూములు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు ఎక్కడకూ పోవు. ప్రభుత్వం లేదా మరొక సంస్థ వాటిని పూర్తి చేస్తుంది. చైనా సంస్కరణల్లో భాగంగా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించారు..అక్రమాలకు పాల్పడితే బాధ్యులైన వారు కటకటాలపాలు కావాల్సిందే.దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు చైనా నిపుణులు అనేక ప్రయోగాలు చేశారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న పూర్వరంగంలో నిర్మాణ రంగంలో భారీ పెట్టుబడులను చైనా ప్రోత్సహించింది. ఇప్పుడు తలెత్తిన సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నది. 2010లో అక్కడ ఇళ్లు కొనే వయస్సులో ఉన్న జనాభా 20 కోట్ల మంది ఉంటే అది 2020నాటికి 22 కోట్లకు చేరి అప్పటి నుంచి తగ్గుతున్నది. ఎవర్‌ గ్రాండే సమస్యలు కూడా ప్రారంభం అప్పుడే.2030 నాటికి పదిహేను కోట్లకు తగ్గి తరువాత 2040 నాటికి 16 కోట్లకు పెరుగుతుందన్నది ఒక అంచనా కాగా 12 కోట్లకు తగ్గవచ్చన్నది మరొక అభిప్రాయం. ఒక కుటుంబంలో ఇల్లు కొంటే అది తరువాత తరాలకూ ఉంటుంది, అందువలన గిరాకీ ఎప్పుడూ ఒకేమాదిరి ఉండదు.


అలాగే ఒక బిడ్డ విధానం. అది ప్రతికూల సమస్యలను ముందుకు తెచ్చినట్లు గ్రహించగానే దాన్ని ఎత్తివేశారు. సంస్కరణల ప్రారంభంలో జనాభా ఎక్కువగా ఉండటం, వారికి అవసరమైన ఆహారధాన్యాలు పండించేందుకు సాగు భూమి తక్కువగా ఉండటంతో కుటుంబనియంత్రణకు పూనుకున్నారు. మనదేశంతో పోలిస్తే 1980లో తలసరి సాగు భూమి అక్కడ 40శాతమే. అది వాస్తవం కాదని, అంతకంటే ఎక్కువగా ఉందని తరువాత సర్వేల్లో తేలింది. 2022లో మనదేశ సాగుభూమిలో 77శాతమే చైనాలో ఉంది.కానీ అక్కడి ధాన్య ఉత్పత్తి మనకంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంది.చైనాలో భూమిని ”ము ” ప్రమాణంలో కొలుస్తారు(ఒక ము మన పదహారు సెంట్లకు సమానం).ఒక ము విస్తీర్ణంలో 1980లో 196కిలోల తృణధాన్యాలు పండితే 2021నాటికి 421 కిలోలకు పెరిగింది. అందువలన సాగు భూమిని బట్టి జనాభా ఉండాలన్న అవగాహన తప్పని తేలింది. అయినప్పటికీ చైనా ఇప్పటికీ తన ఉత్పత్తిలో ఐదో వంతుకు సమంగా దిగుమతులు చేసుకుంటున్నది. ప్రస్తుతం ఉన్న 195 కోట్ల ” ము ”లకు తోడు మరో 85 కోట్ల ము లను సాగులోకి తేవచ్చని చైనా సైన్సు అకాడమీ అధ్యయనంలో తేలింది. దీనికి తోడు రెండువందల కోట్ల ము ల ఎడారిలో కూడా సాగు చేసేందుకు ఉన్న అవకాశాలను ఇప్పటికే పరీక్షిస్తున్నారు. ఆరువందల కోట్ల ము ల గడ్డి భూములలో మాంసం, పాల ఉత్పత్తి పెంచేందుకు చూస్తున్నారు.


చైనా ఆర్థిక వృద్ధి గురించి ప్రపంచ బాంకు ప్రధాన ఆర్థికవేత్తగా పని చేసిన డేవిడ్‌ దావోకుయి లీ, చైనా ఆర్థికవేత్త జస్టిన్‌ ఇఫు లిన్‌ వంటి వారు చెప్పిన అంచనాలు తప్పాయి. వారు చెప్పిందేమిటి ? 2025వరకు ఎనిమిది, అప్పటి నుంచి 2050వరకు ఆరుశాతం చొప్పున ఆర్థిక వృద్ధి ఉంటుందని, అమెరికాకు మూడు రెట్లు అవుతుందన్నారు. కానీ జరిగిందేమిటి ? 2011లో 9.6శాతంగా ఉన్న వృద్ధి రేటు 2019నాటికి ఆరుకు, తరువాత 4.5శాతానికి తగ్గింది. యువ నిరుద్యోగుల పెరుగుదల గురించి వార్తలు రావటంతో ఇంకే ముంది చైనా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతున్నదంటూ వాటికి ప్రతికూల భాష్యాలు వెలువడటంతో ప్రభుత్వం నెలవారీ సమాచార విడుదల నిలిపివేసింది. నిజానికి కూలిపోవాల్సి వస్తే ఐఎంఎఫ్‌ చెప్పినట్లుగా 2024లో అమెరికాలో ఈ ఏడాది 1.6, వచ్చే ఏడాది 1.1, అలాగే బ్రిటన్‌లో మైనస్‌ 0.3 – 1, జర్మనీలో మైనస్‌ 0.1 -1.1 శాతాలుగా ఉంటాయని చెప్పగా చైనాలో అవి 5.2-4.5శాతాలుగా ఉన్నాయి. అందువలన ఓయిసిడి దేశాలలో ఏండ్ల తరబడి 20శాతంగా ఉన్న యువ నిరుద్యోగంతో పోలిస్తే చైనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అన్ని దేశాల్లో పరిస్థితులు మారుతున్నాయి. మన దేశంలో ఒకనాడు బిఏ, బికాం, బిఎస్‌సి వంటి డిగ్రీలకు ఎంతో విలువ, తరువాత ఇంజనీరింగ్‌, ఇప్పుడు అదే ఇంజనీర్ల పరిస్థితి ఏమిటో, ఉపాధి దొరికిన వారికి ఇస్తున్న వేతనాలెంతో చూస్తున్నాము. నిరుద్యోగ సమస్యను పాలకుల దృష్టికి తెచ్చేందుకే తాము లోక్‌సభలో పొగబాంబులు వేసినట్లు దాడికి పాల్పడిన యువకులు చెప్పినట్లు వార్తలు. అదే నిజమైతే మనదేశంలో పరిస్థితి గురించి ఆలోచించాలి. ఐదు సంవత్సరాల నాటి కంటే నేడు యువ నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ అన్నది వాస్తవం, సరైన లెక్కలు లేవు, ఉన్నవాటిని ప్రకటించకుండా మూసిపెడుతున్నారు గనుక వాస్తవాలు తెలియటం లేదు. ప్రస్తుతం చైనా ఉపాధి ఎక్కువగా ఉండే పరిశ్రమల నుంచి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం ఉండే సంస్థలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సర్దుబాటుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం చైనా మీద అనేక దేశాలు వాణిజ్య యుద్ధం ప్రకటించి అమలు జరుపుతున్నాయి. అలాంటి పరిస్థితి మనకు గానీ, అమెరికా, ఐరోపా దేశాలకు లేదు.చైనా ఎదుర్కొంటున్న సవాళ్లు లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d