• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా : అనుకున్నదొకటీ అయ్యింది ఒకటీ, బోల్తా కొట్టిందిలే అమెరికా రాబందు !

12 Wednesday Jan 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

China 20 years at WTO, India Reforms, US miscalculation, US-CHINA TRADE WAR


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా సభ్యత్వం పొంది(2001) రెండు దశాబ్దాలు గడిచింది. ఈ కాలంలో జరిగిన పరిణామాలు, పర్యవసానాలేమిటి అనే సింహావలోకనం జరుగుతోంది. చైనా సంస్కరణలకు నాలుగుదశాబ్దాలు దాటాయి. సోషలిస్టు బాటను వదలి ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్నదని చెప్పేవారు కొందరు మనకు తారసపడతారు. తమవైన లక్షణాలు కలిగిన సోషలిస్టు సమాజ నిర్మాణం అని చైనా చెబుతోంది. నిజంగా పెట్టుబడిదారీబాటనే పడితే మిగతాదేశాలు ఎదుర్కొన్న స్వభావసిద్ద సంక్షోభాలకు దూరంగా ఎలా ఉండగలిగింది ? అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు అందరూ ఒక్కటై ఎందుకు కత్తులు దూస్తున్నారు ? ఏ మార్కెట్లను పంచుకొనేదగ్గర విబేధాలు తలెత్తినట్లు ? ఇవన్నీ ఆలోచించాల్సిన, తర్కించాల్సిన అంశాలు.చైనా మిగతా దేశాలు ప్రత్యేకించి అమెరికాతో ముడిపడిన కొన్ని అంశాలను చూద్దాం.


ఇతర దేశాల ఉత్పత్తులను కాపీ కొట్టి స్వల్ప మార్పులను చేసి స్వంత నవకల్పనలుగా చెప్పుకొంటోంది అన్నది చైనాపై ఒక ప్రధాన ఆరోపణ.పదిహేను లక్షల సంవత్సరాల క్రితం నుంచి కొనదేలిన రాతి ముక్కలను గొడ్డళ్లుగా వినియోగించటం ప్రారంభించగా, పిడితో ఉన్న గొడ్డలి క్రీస్తుపూర్వం ఆరువేల సంవత్సరాల నుంచి ఉనికిలోకి వచ్చింది. ఇప్పుడు ఎన్నిరకాల గొడ్డళ్లు, పిడులు ఉన్నాయో తెలిసిందే. ఎవరిని ఎవరు కాపీ కొట్టినట్లు ? కార్ల సంగతీ అంతే కదా !1879 కారుకు తొలి పేటెంట్‌ పొందిన జర్మన్‌ కార్ల్‌ బెంజ్‌ అంతకు ముందు జరిగిన రూపకల్పనలను పరిగణనలోకి తీసుకోకుండానే కొత్తగా కనిపెట్టాడా ? కాపీరైట్‌ చట్టాలు లేక ముందు నవీకరణలు లేవా ? వాటిని చూసి మరింత మెరుగైన వాటిని కనుగొనలేదా ?ఎవరైనా, ఏ దేశమైనా చేసేది, చేస్తున్నది అదే. మరి చైనాలో కొత్తగా కనుగొన్నవేమీ లేవా ? చైనీయులు కాపీ గొట్టటం తప్ప మరేమీ చేయటం లేదని అమెరికా అధికారులు, కొందరు మేథావులు చెబుతుండగానే వారి ఊహకు అందని రీతిలో చైనా, ఇతర దేశాల్లో నవకల్పనలు జరుగుతున్నాయి. తన అవసరాలకు అనుగుణంగా చైనా వాటిని మార్చుకుంటోంది.చైనాతో పోల్చితే మన దేశంలో ఆంగ్లం తెలిసినవారు, నిపుణులు ఎక్కువ మందే ఉన్నారు. కాపీ కొట్టవద్దని, లేదా వాటిని చూసి మన అవసరాలకు తగినట్లు కొత్త రూపకల్పనలు చేయవద్దని ఎవరూ చెప్పలేదు కదా ! మరెందుకు జరగలేదు ?


షీ జింపింగ్‌ అధికారానికి వచ్చిన తొలి రోజుల్లోనే చైనా లక్షణాలతో కూడిన స్వతంత్ర నవకల్పనలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. దానికి అనుగుణంగానే పెద్ద మొత్తాలలో పరిశోధన-అభివృద్ధికి నిధులు కేటాయించారు, 2030వరకు ఒక కార్యాచరణను కూడా రూపొందించారు. పది సంవత్సరాల క్రితం ప్రపంచ నవకల్పన సూచికలో 43వదిగా ఉన్న చైనా 2020లో 14వ స్ధానంలో ఉంది.షీ అధికారానికి రాక ముందు కూడా శాస్త్ర, సాంకేతిక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉయి చాట్‌ పేరుతో ఉన్న ఆప్‌ నేడు చైనా జనజీవితాలతో విడదీయరానిదిగా ఉంది. ఆహార ఆర్డర్ల మొదలు బిల్లుల చెల్లింపు, చివరికి విడాకులు, వీసా దరఖాస్తులను కూడా దాని ద్వారా పంపవచ్చంటే పట్టణ-గ్రామీణ తేడాల్లేకుండా అందరికీ అందుబాటులోకి వచ్చిన ఆప్‌ మరొకటి ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదు.2019లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మూడు నెలల కాలంలో 95శాతం మంది ఒకసారైనా ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసినట్లు తేలింది. సగటున ఒక వినియోగదారుడు రోజుకు నాలుగు లావాదేవీలు జరిపారు. అమెరికాలో 2018నాటి వివరాల మేరకు ఐదోవంతు మంది అమెరికన్లు ఒక్కసారి కూడా మొబైల్‌ చెల్లింపులు చేయలేదు.


పెట్టుబడిదారీ విధాన సమర్దకులు చెప్పే అంశాలలో ప్రభుత్వరంగం నవకల్పనలకు అనువైనది కాదు, ప్రయివేటువారే చేయగలరు అన్నది ఒకటి. బహుళపార్టీల ప్రజాస్వామిక వ్యవస్ధలున్న దేశాల్లోనే విశ్వవిద్యాలయాలు నవకల్పనల కేంద్రాలుగా ఉంటాయి అన్న భావనలను చైనా వమ్ము చేసింది. స్మార్ట్‌ సిటీ పేటెంట్లకు సంబంధించి కూడా చైనా ఎంతో ప్రగతి సాధించింది.అక్కడి మార్కెట్‌ విలువ లక్ష కోట్ల డాలర్లని అంచనా.ప్రపంచంలోని స్మార్ట్‌సిటీ పేటెంట్లు ఎక్కువగా ఉన్న పది అగ్రశ్రేణి కంపెనీలలో చైనా ప్రభుత్వ రంగ సంస్ధ స్టేట్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ప్రధమ స్ధానంలో ఉంది.2020 నవంబరు నాటికి ఉన్న సమాచారం ప్రకారం దీనికి 7,156 పేటెంట్లు ఉండగా రెండవ స్ధానంలో ఉన్న దక్షిణ కొరియా ప్రైవేటు కంపెనీ శాంసంగ్‌కు 3,148 ఉన్నాయి. చైనా తరహా స్మార్ట్‌ సిటీ కాంట్రాక్టులను పలు దేశాల్లో చైనా కంపెనీలు దక్కించుకున్నాయి.దీని అర్ధం శాస్త్ర, సాంకేతిక రంగాలలో అమెరికా, ఇతర ఐరోపా దేశాలను చైనా అధిగమించిందని కాదు. కొన్ని రంగాలలో అది వెనుకబడే ఉంది.2018లో విద్యామంత్రిత్వశాఖ 35కీలకమైన టెక్నాలజీలను స్ద్ధానికంగా తగినంత నాణ్యత లేదా తగు మొత్తంలో ఉత్పత్తి చేయలేకపోతున్నట్లు ఒక సమాచారంలో పేర్కొన్నది. వాటిలో హెవీడ్యూటీ గాస్‌ టర్బైన్లు, హై ప్రెషర్‌ పిస్టన్‌ పంప్స్‌, కొన్ని బేరింగ్స్‌కు అవసరమైన ఉక్కు, ఫొటోలిథోగ్రఫీ మెషిన్లు, కీలక పరిశ్రమల సాఫ్ట్‌వేర్ల వంటివి వాటిలో ఉన్నాయి.


డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్యయుద్దానికి ముందు నుంచే అమెరికా సాంకేతిక దాడి మొదలెట్టింది. దానిలో భాగంగా 2016 తరువాత రెండు దేశాల సాంకేతిక రంగ పెట్టుబడులు 96శాతం తగ్గాయి. అప్పటి నుంచి ఇతర వనరుల నుంచి వాటిని సేకరించేందుకు, స్వంతంగా అభివృద్ధి చేసుకొనేందుకు చైనా పూనుకుంది.కేవలం తమను కాపీ చేస్తోందని అమెరికా, తదితర దేశాలు అనుకుంటూ కూర్చుంటే వారు బావిలో కప్పల మాదిరి ఉన్నట్లే. టెలికాం రంగంలో 5జి, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి కొన్ని రంగాలలో చైనా ముందున్నది. మరి దాన్ని ఎక్కడి నుంచి కాపీ చేసిందని చెబుతారు.


చైనా, భారత్‌ రెండూ సంస్కరణలల్లో భాగంగా విదేశీ పెట్టుబడులు, కంపెనీలను ఆహ్వానించాయి. కానీ ఇవి రెండూ చైనావైపే మొగ్గుచూపాయి. కరోనా కారణంగా సరఫరా వ్యవస్దలు దెబ్బతినటం, అమెరికాలో పెరుగుతున్న అసంతృప్తి నేపధ్యంలో ఇటీవల చైనా నుంచి కంపెనీలు తరలిపోతున్నాయని ప్రచారం చేశారు.కొన్ని అమెరికన్‌ కంపెనీలు చైనా నుంచి తరలిపోవాలనే ఆలోచనలు చేసినప్పటికీ అవి స్వదేశానికి లేదా సరిహద్దులో ఉన్న మెక్సికో గురించి పరిశీలిస్తున్నాయి తప్ప మనలను అసలు పరిగణనలోకి తీసుకోవటం లేదు. విదేశాల నుంచి అమెరికా తిరిగి వచ్చిన కంపెనీలు, ఎఫ్‌డిఐ కారణంగా 2020లో కొత్తగా ఉత్పాదక రంగంలో 1,60, 649 మందికి ఉపాధి వచ్చినట్లు ఒక పరిశీలన వెల్లడించింది.2022లో రెండు లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా. గతంలో కోల్పోయిన ఉపాధితో పోల్చితే ఇది నామమాత్రం. అలా వచ్చిన కంపెనీల్లో 60శాతం విదేశాల్లో వేతనాలను, వస్తువులను తమ దేశానికి తరలించాలంటే అయ్యే రవాణా ఖర్చులను ప్రధానంగా పోల్చుకున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్ధితుల కారణంగా రవాణా ఓడల లభ్యత కూడా అనిశ్చితిలో పడుతుందని కూడా అంచనా వేస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో ఆసియా నుంచి అమెరికాలోని పశ్చిమ తీరానికి ఒక 40 అడుగుల కంటెయినరులో సరకు రవాణాకు ఇరవైవేల డాలర్లు గరిష్టంగా పలికింది, ఈ ఏడాది జనవరి తొలివారంలో స్పాట్‌ రేటులో 14,487 డాలర్లుగా ఉంది. అవే వస్తువులను పక్కనే ఉన్న మెక్సికోలో తయారు చేస్తే సరకును బట్టి 1,600 నుంచి 1,800 డాలర్లకు ఒక ట్రక్కు వస్తుంది.పరిశ్రమలు తిరిగి వస్తే దేశ ఆర్ధికరంగంలోకి రానున్న కొద్ది సంవత్సరాల్లో 443 బిలియన్‌ డాలర్లు వస్తాయని కూడా ఆర్ధికవేత్తలు అంచనా వేస్తున్నారు.


తిరిగి రాదలుచుకున్న కంపెనీలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న సమస్యను కూడా ఎదుర్కొంటున్నాయి.కంపెనీలు వచ్చినా ఎందరికి ఉపాధి కల్పిస్తాయి అన్న ప్రశ్నకూడా ఎదురవుతోంది.ఆధునిక యంత్రాలు, రోబోలు,కంప్యూటర్లతో నడిచే ఫ్యాక్టరీలో కార్మికులు పరిమితంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న గోడవున్లు, భవనాలను అమెజాన్‌ వంటి కంపెనీలు ప్రధాన పట్టణాలన్నింటా ఇప్పటికే తీసుకున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే వాటికి నిర్మాణ ఖర్చు, స్ధలాల లభ్యత అంశాలు ముందుకు వస్తున్నాయి. అమెరికాకు పునరాగమన చర్చ ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు పొలోమంటూ తిరిగి వచ్చే అవకాశాలు పరిమితమే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.


చైనాలో చౌకగా దొరికే శ్రమశక్తి, మార్కెట్‌ను ఆక్రమించుకొనే లక్ష్యంతోనే ఐరాస, ప్రపంచ వాణిజ్య సంస్ధలో సభ్యత్వం ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది తప్ప మరొక మహత్తర లక్ష్యం లేదు. అనుకున్నదొకటీ, అయింది ఒకటీ అన్నట్లుగా ఇప్పుడు అమెరికన్లు గుండెలు బాదుకుంటున్నారు. చైనాను దారికి తెచ్చేందుకు వేసిన ఎత్తులూ, జిత్తులు, బెదిరింపులు, బుజ్జగింపులు ఏవీ మొత్తం మీద పని చేయటం లేదు. ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా ఉంది.కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా దెబ్బకు దెబ్బతీస్తున్నప్పటికీ చైనా నుంచి అమెరికా దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. కారణం చైనా మీద ప్రేమ దోమా కాదు. ఇప్పటికీ ముందే చెప్పుకున్న రవాణా ఖర్చు ఉన్నప్పటికీ అక్కడి నుంచి సరకులను దిగుమతి చేసుకుంటే అమెరికన్లకు 30-35శాతం ఉత్పత్తి ఖర్చు కలసి వస్తోంది. గతంతో పోలిస్తే అమెరికా నుంచి వస్తున్న వస్తువులపై ఆంక్షలేమీ పెట్టకపోయినా, స్వంతంగా రూపొందించుకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా నానాటికీ స్వయం సమృద్దం అవుతున్న కారణంగా హైటెక్‌ ఉత్పత్తుల దిగుమతులు తగ్గి అమెరికా వాణజ్యలోటు పెరుగుతూనే ఉంది.


ఇప్పటికిప్పుడు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులలో నాలుగోవంతు నిలిపివేస్తే అమెరికాకు ప్రారంభంలో 35శాతం ఖర్చు పెరుగుతుందని అంచనా. విధిస్తున్న షరతులకు బదులు స్ధానిక కొనుగోళ్లను ప్రోత్సహించాలని స్ధానిక కంపెనీలు కోరుతున్నాయి. కొందరైతే చైనా కంపెనీలనే తమ గడ్డమీదకు ఆహ్వానిస్తే సరఫరా సమస్యలు తలెత్తవని చెబుతున్నారు. ఆ మేరకు ఫుయావో గ్లాస్‌ అనే చైనా కంపెనీ అమెరికాలో ఉత్పత్తి చేస్తోంది. అదే విధంగా ఎక్సకవేటర్‌ కంపెనీ కూడా పని చేస్తోంది.ఇది కొత్త పరిణామం. ఇతర దేశాలతో అమెరికా చేసే వాణిజ్యం వలన దానికి జిడిపి విలువలో రెండు నుంచి ఎనిమిదిశాతం వరకు లబ్దికలుగుతున్నది. అది అప్పనంగా వచ్చినట్లే కదా అని చూసుకున్నారు తప్ప దాని వలన తమ జనాలు కోల్పోయే ఉపాధిని అక్కడి పెట్టుబడిదారీ విధానం పట్టించుకోలేదు.


ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా చేరినప్పటి నుంచి ఇరవై సంవత్సరాల్లో వాణిజ్యలోటుతో పాటు 37 నుంచి 65లక్షల ఉద్యోగాలు అమెరికాలో గల్లంతైనట్లు అంచనా. మన దేశంలో సంస్కరణల పేరుతో విదేశాలకు మార్కెట్‌ తెరిచిన తరువాత వారి షరతులను మన మీద రుద్దారు. వాటికి అనుగుణంగా మన ప్రభుత్వ రంగ సంస్ధలను పధకం ప్రకారం నీరుగార్చారు, ఇప్పుడు తెగనమ్మేందుకు పూనుకున్నారు.చైనాలో కూడా అదే చేయ వచ్చని తప్పుడు అంచనా వేశారు.కానీ జరిగింది అది కాదు. అమెరికా, ఇతర దేశాలు తమ వస్తువులు, సంస్ధలకు ఎంత మేరకు ప్రవేశం కల్పిస్తాయో ఆ మేరకే తానూ అనుమతించింది. తమ దగ్గరకు రావాలని కోరుకున్న కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని తమతో పంచుకోవాలన్న షరతు విధించింది. విదేశీ కంపెనీల నుంచి ప్రభుత్వ కొనుగోళ్లకు అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వ రంగ సంస్ధలకు సబ్సిడీలను కొనసాగించింది. తమ దగ్గర నుంచి కొనుగోలు చేసిన విలువగల సరకులను దిగుమతి చేసుకున్న దేశాల నుంచి కొనాల్సిన అగత్యం తమకు లేదని స్పష్టం చేసింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆయుధాలతోనే కాదు వడ్డీ రేట్లతో కూడా అమెరికా చంపేయ గలదు !

08 Saturday Jan 2022

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

Indian rupee’s loss of value, Narendra Modi Failures, Rupee devaluation, US Fed Rate


ఎం కోటేశ్వరరావు


” భారత్‌కు రూపాయి విలువ పతనం పెద్ద తలనొప్పిగా మారింది ” అన్నది తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. దానిలోని అంశాలతో ఏకీభవించటమా లేదా అన్నది వేరే అంశం.దేశానికిఅంటే జనానికి తలనొప్పిగా మారింది మన కరెన్సీ పతనమా ? అది జరుగుతుంటే గుడ్లప్పగించి చూస్తున్న లేదా కావాలని వదలి వేసిన పాలకులా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన అంశం. మన్మోహన్‌ సింగ్‌ గారు ఏలుబడిలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అన్నది వదిలేద్దాం. ఆరోజులు గతించాయి. తనకు ఎలాంటి హానీమూన్‌(కుదురుకొనేందుకు అవసరమైన వ్యవధి) అవసరం లేదు అనిచెప్పిన నరేంద్రమోడీ మూడున్నర సంవత్సరాల ఏలుబడి తరువాత 2018 జనవరి ఒకటిన ఒక డాలరుకు రు.63.85గా ఉన్నది 2022 డిసెంబరు 31న రు.74.50కి దిగజారింది, 16.68శాతం పతనమైంది.2011 నుంచి చూస్తే రు.45.40 నుంచి 64శాతం దిగజారింది. తాము అధికారానికి వస్తే ఆ స్ధాయిలో నిలబెడతామని అచ్చే దిన్‌ ఆశల్లో భాగంగా మోడీ చెప్పారు.ఇన్నేండ్ల తరువాత ఎక్కడకు తీసుకుపోతారో తెలియని స్ధితిలో ఉన్నారు.


కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు రూపాయి విలువ పడిపోవటానికి ప్రధాన కారణాల్లో చమురు ఒకటి. ఏటేటా చమురు వినియోగం పెరుగుతున్నందున దిగుమతులు కూడా పెరుగుతున్నాయి. అందుకు డాలర్లు అవసరం కనుక మన కరెన్సీ విలువ పడిపోతున్నది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి రాకముందు కేంద్ర చమురుశాఖ మంత్రిగా ఉన్న మణిశంకర అయ్యర్‌ చెప్పినదాని ప్రకారం దేశంలో 225బిలియన్‌ పీపాల చమురు నిల్వలున్నాయి. దాన్ని వెలికితీస్తే మన దిగుమతుల బిల్లు గణనీయంగా తగ్గుతుంది. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అంటారు కదా ! మోడీ సర్కార్‌ అధికారానికి వచ్చినపుడు 2013-14లో 37,788వేల మెట్రిక్‌ టన్నులు(టిఎంటి) ఉత్పత్తి జరిగితే క్రమంగా తగ్గుతూ 2019-20నాటికి పద్దెనిమిది సంవత్సరాల కనిష్టానికి 32,173 టిఎంటికి, మరుసటి ఏడాది 30,500కు పడిపోయింది. ఈ వైఫల్యానికి కూడా నెహ్రూ కారణమని చెబుతారా ? ఏమో వినే జనాలుంటే ఏమైనా వినిపించగల చతురులు కదా ! దేశీయ ఉత్పత్తి ఎందుకు తగ్గిపోతోందో మన్‌కీ బాత్‌లో ఐనా చెప్పగలరా ?


ఆర్ధికవేత్తలు చెబుతున్న మరొక కారణం, దేశంలో వడ్డీ రేట్లు తక్కువగా కారణంగా విదేశీమదుపుదార్లకు ఆకర్షణీయంగా లేకపోవటమట. అంటే మన కరెన్సీ గిరాకీ తగ్గితే పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు తగ్గుతాయి. రిజర్వుబాంకు ద్రవ్యవిధానం మీద కేంద్రీకరిస్తే జనాల చేతుల్లోకి నగదు వస్తుందని, దాని బదులు ద్రవ్యపరమైన ఉద్దీపనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కొందరు విమర్శిస్తున్నారు. ఒమైక్రాన్‌ విస్తరిస్తున్న కారణంగా ప్రపంచంలో మరోమారు డాలరుకు ప్రాధాన్యత ఏర్పడుతున్నదని, దీంతో రూపాయి డిమాండ్‌ ఇంకా తగ్గుతుందన్నది తర్కం. గత ఎనిమిది సంవత్సరాల తీరు తెన్నులను చూసినపుడు దిగుమతులు పెరగటం తప్ప ఎగుమతులు పరిమితంగానే ఉన్నందున రెండు పర్యవసానాలు కలుగుతున్నాయి. ఒకటి మన విదేశీమారక ద్రవ్యనిల్వలపై నిరంతర వత్తిడి, మన సంపద లాభాల రూపంలో విదేశాలకు తరలుతున్నది. రూపాయి విలువ పడిపోతున్నందున మన వినియోగదారులమీద భారం పెరుగుతున్నది.అది జీవన ప్రమాణాలు, జీవన నాణ్యతను దెబ్బతీస్తున్నది.మన వాణిజ్యలోటు ఏడాది క్రితంతో పోల్చితే రెట్టింపైంది.చమురుపై పన్నుల భారం పెంపుదల, ఆహార వస్తువుల ధరల పెరుగుదల, వీటి వలన అదుపులేని ద్రవ్యోల్బణం తలెత్తుతుంది.


2021ఏప్రిల్‌లో రికార్డు స్ధాయిలో రూపాయి విలువ రు.76.91కి దిగజారింది. రిజర్వుబాంకు తీసుకున్న చర్యలతో ప్రస్తుతం రు.74-75 మధ్య కదలాడుతున్నది.2022లో అమెరికా, ఇతర దేశాల కరెన్సీ విధానాలతో రూపాయి ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది. ఈ ఏడాది అమెరికాలో మూడు సార్లు వడ్డీ రేటు పెంచవచ్చన్న వార్తలు వచ్చాయి. ఇది మన వంటి దేశాలకు చెడువార్త. మన దేశ ద్రవ్యమార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారంతా వెనక్కు తీసుకొని అమెరికాకు తరలిస్తారు. బాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వడ్డీ రేటు పెంచటంతో ఎఫ్‌పిఐలు డిసెంబరులో రు.17,147 కోట్లు స్టాక్‌మార్కెట్ల నుంచి, రు.12,280 కోట్లు బాండ్ల నుంచి వెనక్కు తీసుకున్నాయి. గతేడాది చివరి మూడు నెలల్లో స్టాక్‌ మార్కెట్‌ నుంచి రు.36,642 కోట్లు వెనక్కు పోయాయి.2021 సెప్టెంబరు-డిసెంబరు మాసాల్లో మన కరెన్సీ 2.2శాతం పతనం కావటంతో స్టాక్‌మార్కెట్‌ నుంచి నాలుగు బిలియన్‌ డాలర్లను విదేశీ నిధి సంస్ధలు వెనక్కు తీసుకున్నాయి. 2019 తరువాత అధికంగా వాణిజ్యలోటు ఈ ఏడాది(2022 మార్చి నాటికి) 200 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని అంచనా. ఇది గతేడాదితో పోలిస్తే రెట్టింపు. ఇప్పుడున్న తీరు ప్రకారం మన దిగుమతులు, ఎగుమతులు కొనసాగితే మన దగ్గర ఉన్న విదేశీమారక ద్రవ్యనిల్వలు 15.8 నెలలకు సరిపోతాయి. వాటిలో ఏమాత్రం తేడాలు వచ్చినా అంటే ఎగుమతులు తగ్గినా, దిగుమతులు పెరిగినా ఇబ్బందే.


ధనికదేశాల్లో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మన జనానికి, ఆర్ధిక రంగానికి కరోనా సోకినా స్టాక్‌ మార్కెట్‌కు అంటలేదు. మరింతగా పెరిగింది. ఆత్మనిర్భరత, పన్నుల తగ్గింపు, ఇతర ప్రభుత్వ(ప్రజల)రాయితీల కారణంగా ఈ కాలంలో సెన్సెక్స్‌ పెరిగిందే తప్ప తగ్గలేదు. అందుకే విదేశాల నుంచి మదుపుదార్లు పెద్ద మొత్తంలో కంపెనీల వాటాలను కొనుగోలు చేసి లాభాల రూపంలో తరలించుకుపోతున్నారు. మనకు వచ్చే విదేశీ మారక ద్రవ్యం మన ఎగుమతులు, ప్రవాసులు పంపిన మొత్తాలు, విదేశీ రుణాలు, స్టాక్‌మార్కెట్లో పెట్టుబడుల ద్వారా సమకూరుతోంది. అనేక కంపెనీలు విదేశాల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలు తీసుకున్నాయి.మన విదేశీ రుణభారంలో 37.4శాతం ఇవే. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే ఈ రుణాలు తీసుకున్నవారు వెంటనే చెల్లింపులకు పూనుకుంటే మన దగ్గర డాలర్లకు డిమాండ్‌ పెరుగుతుంది.


2021లో 2.5శాతం దిగజారిన రూపాయి అదే తీరులో కొనసాగి 2022లో సగటున రు.76వద్ద, 2023లో 78 వద్ద ఉంటుందని ఫిచ్‌ రేటింగ్‌ సంస్ధ జోశ్యం చెప్పింది.వాలెట్‌ ఇన్వెస్టర్‌ అనే సంస్ధ అంచనా ప్రకారం 2022 డిసెంబరు నాటికి మన రూపాయి మారకం రేటు రు.77.7207 నుంచి 77.539 గరిష్ట, కనిష్ట ధరగా ఉంటుందని అంచనా వేసింది. పతనం కొనసాగితే ఎగమతులు పెరుగుతాయని ఆర్ధికవేత్తలు చెబుతారు. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందనట్లుగా కరెన్సీపతనం జన జీవితాలను అతలాకుతలం చేస్తుంది.ఇప్పుడు ఒక డాలరును కొనుక్కోవాలంటే రు.75 చెల్లించాలి అనుకుంటే, అదే 2023నాటికి రు.78 సమర్పించుకోవాలి. అదే అచ్చేదిన్‌ ప్రచారంలో నరేంద్రమోడీ గారు వాగ్దానం చేసినట్లు రూపాయి విలువను తాను అధికారంలోకి వచ్చినప్పటికీ స్ధాయి రు.58కైనా పెంచితే మనం జేబుల నుంచి కొల్లగొడుతున్న పెట్రోలు, డీజిలు బిల్లు గణనీయంగా తగ్గుతుంది.


2020 డిసెంబరు 11 నాటికి విదేశీమారక ద్రవ్యం 578.57బి.డాలర్లు ఉంది, అది 2021డిసెంబరు 10 నాటికి 635.83బి.డాలర్లకు పెరిగింది. ఇది 2020 మార్చి నుంచి 2021నవంబరు వరకు 72-75 మధ్యరూపాయి విలువ ఉండేందుకు తోడ్పడింది. అమెరికా, ఇతర ధనిక దేశాల నుంచి మన దేశానికి డాలర్లు,పౌండ్లు, ఎందుకు వస్తున్నట్లు ? 2020 మార్చి 15న అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వు(మన రిజర్వుబాంకు వంటిది) వడ్డీ రేటు 0 నుంచి 0.25శాతం ఉంటుందని పేర్కొన్నది. మన దేశంలో అంతకంటే ఎక్కువే ఉన్నందున మన కరెన్సీ విలువ తగ్గినా మదుపుదార్లకు లాభమే కనుక స్టాక్‌మార్కెట్లో, ఇతరంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఏడాది ఈ వడ్డీ పెరుగుతుందనే సంకేతాలు వెలువడినందున అలా పెట్టుబడులు పెట్టిన వారు కొందరు వెనక్కు తీసుకుంటున్నారు.
2022లో మూడు సార్లు వడ్డీ రేటు పెంచితే ప్రస్తుతం ఉన్న 0.1 నుంచి 0.6 నుంచి 0.9శాతం వరకు అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయని అంచనా, అదే జరిగితే మన మార్కెట్‌ నుంచి మరిన్ని డాలర్లు తరలిపోతాయి. అందుకే మనల్ని అమెరికా ఆయుధాలతో దెబ్బతీయనవసరం లేదు వడ్డీ రేట్లతోనే ఆ పని చేయగలదు అని చెప్పాల్సి వస్తోంది.’ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది ‘ అన్నవి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గారి నోటి నుంచి వెలువడిన సుభాషితాలు. భటిండా విమానాశ్రయానికి ప్రాణాలతో తిరిగి వచ్చాను, అందుకు గాను మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియ చేయండి అని తాజాగా ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్‌ అధికారులతో అన్న అంశం, దాని గురించి రాష్ట్రపతికి వివరించిన అంశం తెలిసిందే.దేశాన్ని రక్షించే చేతులని చెబుతున్న ప్రధాని మోడీ అమెరికా వడ్డీ రేటు దాడి నుంచి యావత్‌ దేశాన్ని రక్షించగలరా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాలో కార్మిక సమ్మెల తరంగం వస్తోందా ?

05 Wednesday Jan 2022

Posted by raomk in Current Affairs, Economics, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, longest healthcare strike, Strike Wave in USA, U.S. labor movement


ఎం కోటేశ్వరరావు


కార్మికులకు మెరుగైన వేతనాలివ్వండి :బెర్నీ శాండర్స్‌, ఆ పని నాది కాదు :వారెన్‌ బఫెట్‌. మొదటి వ్యక్తి అమెరికాలో డెమోక్రటిక్‌ సోషలిస్టుగా ప్రకటించుకున్న కార్మిక పక్షపాతి అని వేరే చెప్పనవసరం లేదు. రెండవ పెద్దమనిషి ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో తొమ్మిదవ స్ధానంలో ఉన్న కార్పొరేట్‌ అమెరికన్‌. అమెరికాలో కార్మిక సమ్మెల తరంగం వస్తోందని పరిశీలకులు చెబుతున్న తరుణంలో ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక అది.పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలోని హంటింగ్‌టన్‌లోని వారెన్‌ బఫెట్‌ స్టీలు కంపెనీలో జరుగుతున్న సమ్మెను పరిష్కరించాలని శాండర్స్‌ ఒక లేఖలో కోరారు.కాస్టింగ్‌ పరికరాలను తయారు చేసే ఈ కర్మాగారంలో 450 మంది సిబ్బంది మూడునెలలుగా సమ్మె చేస్తున్నారు.మీ కంపెనీలో పని చేస్తున్న కార్మికులు తమ పిల్లల కడుపు నింపగలమా లేదా ఆరోగ్య సంరక్షణ చూడగలమా లేదా అని ఎందుకు ఆందోళన చెందాలంటూ శాండర్స్‌ ప్రశ్నించారు. ఐదు సంవత్సరాలలో మొదటి ఏడాది ఎలాంటి వేతన పెంపుదల లేకుండా, రెండవ ఏడాది ఒక శాతం, తరువాత మూడు సంవత్సరాలు రెండుశాతం చొప్పున వేతన పెరుగుదల ఉంటుందని, కేవలం రెండువేల డాలర్లు మాత్రమే బోనస్‌ ఇస్తామని, ఆరోగ్యబీమాకు నెలకు ఇప్పుడున్న 275 డాలర్ల నుంచి 1000డాలర్లకు కార్మికుల వాటా పెరగాలని, ఇప్పుడున్న సెలవుల సంఖ్యను తగ్గించుకోవాలని యాజమాన్యం షరతులు విధించింది.


శాండర్స్‌ లేఖపై స్పందించిన బఫెట్‌ తాను సిఇఓగా ఉన్న సంస్ధకు అనేక అనుబంధ కంపెనీలు ఉన్నాయని, ఏ కంపెనీకి అకంపెనీ అక్కడి సమస్యల సంగతి చూసుకోవాలి తప్ప సిఇఓగా ఉన్నంత మాత్రాన తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.మీరు పంపిన లేఖను సదరు స్పెషల్‌ మెటల్స్‌ ప్రిసిషన్‌ కాస్ట్‌పార్ట్స్‌ కంపెనీ సిఇవోకు పంపుతానని, ఎలాంటి సిఫార్సులు, చర్యలను తాను సూచించటం లేదని, వ్యాపారానికి అతనే బాధ్యుడని శాండర్స్‌కు జవాబిచ్చాడు.2016లో ఈ కంపెనీని బఫెట్‌ సిఇఓగా ఉన్న బెర్క్‌షైర్‌ కంపెనీ కొనుగోలు చేసింది. ఇక్కడ అంతరిక్ష నౌకలకు, విమానాలకు అవసరమైన నికెల్‌ అలాయి విడిభాగాలను తయారు చేస్తుంది. సిబ్బంది సమ్మెలో ఉన్నప్పటికీ కంపెనీ పని చేస్తూనే ఉందని, తాత్కాలిక సిబ్బందిని నియమించినట్లుగానీ, లేదా కార్మికులను పూర్తిగా తొలగించినట్లుగానీ ప్రకటించలేదని యునైటెడ్‌ స్టీల్‌ వర్కర్స్‌ యునియన్‌ వెబ్‌సైట్‌ పేర్కొన్నది. కార్మికులు కోరుతున్నదేమిటి ? సిబ్బంది సమ్మెలో ఉన్నా ఫ్యాక్టరీ ఎలా నడుస్తోందన్న ప్రశ్నలకు కంపెనీ సమాధానం ఇవ్వటం లేదు.


ఇటీవలి కాలంలో అమెరికాలో కార్మిక సమ్మెలు పెరుగుతున్నాయి. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో కార్మికులకు వ్యతిరేకమైన అంశాలున్నాయి. కార్మికనేతల లొంగుబాటు, ఉపాధి లేమి వంటి కారణాలతో యజమానులు రుద్దిన ఒప్పందాలను అంగీకరించారు. గత కొద్ది నెలలుగా నిపుణులైన కార్మికులకు డిమాండ్‌ పెరగటంతో కోట్లాది మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మెరుగైన వేతనాలతో కొత్త కొలువుల్లో కుదురుతున్నారు. కొన్ని కంపెనీల్లో ఒప్పంద గడువులు ముగిసిన తరువాత మెరుగైన నూతన ఒప్పందాల కోసం సమ్మెలకు దిగుతున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం చూపినప్పటికీ కార్పొరేట్ల లాభాలకు ఎలాంటి ఢోకాలేకపోవటాన్ని కార్మికులు గమనించారు, తామెందుకు నష్టపోవాలని వారు భావిస్తున్నారు.2020లో మొత్తం 3.63 కోట్ల మంది రాజీనామాలు చేసి మెరుగైన ఉపాధిని వెతుక్కోగా 2021లో అక్టోబరు నాటికే 3.86 కోట్ల మంది రాజీనామాలు చేశారని అంచనా. సమ్మె చేస్తున్న కంపెనీలలో యజమానులు గతంలో మాదిరి తమ షరతులను రుద్దేందుకు చూస్తుండగా కార్మికులు అంగీకరించటం లేదు, దాంతో నెలల తరబడి సమ్మెలు కొనసాగుతున్నాయి. కడుపు నిండిన యజమానులు కడుపు మండుతున్న కార్మికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.


అమెరికా చరిత్రలో గత 15 సంవత్సరాల్లో సుదీర్ఘ సమ్మెగా మసాచుసెట్స్‌లోని సెయింట్‌ విన్సెంట్‌ ఆసుపత్రిలోని 700 మంది నర్సుల ఆందోళన నమోదైంది. రోగులకు తగిన సంఖ్యకు తగ్గట్లుగా సిబ్బంది లేకపోగా కరోనా సమయంలో, అంతకు ముందూ తగ్గించారు. సమ్మెకు దిగిన వారందరినీ పూర్తిగా తొలగిస్తామని బెదిరించినా 301రోజుల పాటు సమ్మె జరిగింది. జనవరి మూడున ఒప్పందం కుదిరింది. నర్సులందరినీ తిరిగి తీసుకొనేందుకు, వేతన పెంపుదల, వైద్య బీమా మొత్తాల పెంపుదలకు అంగీకరించారు. డిసెంబరు పదవ తేదీ నాటికి దేశంలో 346 సమ్మెలు జరుగుతున్నట్లు కార్నెల్‌ విశ్వవిద్యాలయ కేంద్రం నమోదు చేసింది. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో కార్మిక సంఘాలలో చేరుతున్న వారి సంఖ్య తగ్గుతోంది.ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న వారిలో 34.8శాతం మంది సభ్యులుగా ఉంటే ప్రయివేటు రంగంలో కేవలం 6.3శాతం మందే ఉన్నారు. 2019తో పోలిస్తే 2020లో స్వల్పంగా పెరిగారు. అమెజాన్‌, గూగుల్‌ వంటి కంపెనీలు కార్మిక సంఘాలను లేకుండా చేసేందుకు అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయి. కొత్తగా సంఘం పెట్టుకోవటమే గగనంగా మారుతోంది. స్టార్‌బక్స్‌ కార్పొరేట్‌ స్టోర్‌లో తొలిసారిగా సంఘాన్ని ఏర్పాటు చేస్తే గుర్తించాల్సి వచ్చింది.


కారన్‌ఫ్లేక్‌ వంటి తృణధాన్య ఉత్పత్తుల సంస్ధ కెలోగ్‌ కార్మికులు కూడా నెలల తరబడి సమ్మె చేశారు. అక్టోబరు ఐదు నుంచి డిసెంబరు 21వరకు సమ్మె చేశారు. ఐదు సంవత్సరాలు అమల్లో ఉండే ఒప్పందం చేసుకున్నారు.నాలుగు చోట్ల ఉన్న ఫ్యాక్టరీల్లోని 1,400 మంది కార్మికులు ఆందోళన చేశారు. ఒకే పని చేసే కార్మికులకు రెండు రకాల వేతనాలు ఇవ్వటాన్ని వారు నిరసించారు. పది సంవత్సరాలు, అంతకు మించి పని చేస్తున్నవారిని విశ్వాసపాత్రులైన కార్మికులనే పేరుతో వారికి గంటకు 35డాలర్లు, మెరుగైన బీమా, పెన్షన్‌ ఇస్తూ మిగిలిన వారిని తాత్కాలికం అనే పేరుతో ఒకే పని చేస్తున్న వారికి తక్కువ వేతనాలు ఇవ్వటాన్ని వ్యతిరేకించారు. కొత్త ఒప్పందం ప్రకారం అందరికీ వేతనాలు పెరుగుతాయి, ప్రతి ఏడాది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచుతారు. తాత్కాలిక కార్మికులకు కనీస వేతనం 24.11 డాలర్లు ఉంటుంది.అందరికీ ఒకే విధమైన ఆరోగ్యబీమా ఉంటుంది.రానున్న ఐదు సంవత్సరాల్లో ఏ ఫ్యాక్టరీని మూసివేయ కూడదు. రెండు రకాల కార్మికుల విభజన ఉన్నప్పటికీ నాలుగు సంవత్సరాలకు మించి పని చేసిన వారిని విశ్వాసపాత్రులుగా పరిగణించేందుకు అంగీకరించారు.పర్మనెంటు కార్మికుల సంఖ్య మీద పరిమితి విధించాలని అంతకు ముందు కంపెనీ వత్తిడి తెచ్చింది.


కోట్లాది మంది కార్మికులు ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి కొత్త ఉపాధి చూసుకున్న తరువాత అనేక కంపెనీలో సిబ్బంది సమ్మెకు దిగటం లేదా సమ్మె నిర్ణయాలు తీసుకొని సంప్రదింపులు జరుపుతున్నారు.దీనికి కారణాలను విశ్లేషిస్తే కార్మికుల్లో తలెత్తిన అసంతృప్తి కనిపిస్తోందని చెప్పవచ్చు. కరోనాకు ముందున్న స్ధితిలో 80శాతమే ఉపాధి పునరుద్దరణ జరిగింది. అయినా కార్మికులు రాజీనామా చేసి వేతనాలను మెరుగుపరుచుకోవాలని చూడటం ఒక ప్రత్యేక పరిస్ధితిగా కనిపిస్తోంది. కరోనా తీవ్రత సడలిన తరువాత ఆర్ధిక లావాదేవీలు ప్రారంభం కావటంతో సహజంగానే కార్మికులు తమ పని పరిస్ధితుల మెరుగుదలకు పూనుకుంటారు.అదే జరుగుతోందిప్పుడు. రికార్డు స్ధాయిలో ఉద్యోగాలకు రాజీనామాలు చేయటాన్ని చూసిన తరువాత యజమానులతో మన మెందుకు గట్టిగా బేరమాడకూడదనే ఆలోచనలు కార్మికుల్లో సహజంగానే తలెత్తాయని చెప్పవచ్చు. గత నాలుగు సంవత్సరాల్లో రిపబ్లికన్లు అధికారంలో ఉన్నారు. డెమోక్రాట్లలో కూడా కార్పొరేట్లకు వంతపాడేవారున్నప్పటికీ కార్మికులకు అనుకూలంగా ఉండేశక్తులు ఉండటం కూడా పోరాటాలకు ఊతమిస్తోందని చెప్పవచ్చు. మంత్రులుగా ఉన్నవారు కూడా సమ్మె కేంద్రాలను సందర్శించటం ఒక అసాధారణ పరిణామం. అసమానతలు విపరీతంగా పెరగటం సహజంగానే అసంతృప్తి, ఆందోళనలకు పురికొల్పుతుంది. సమ్మెలు విజయాలు సాధిస్తే మరిన్ని జరుగుతాయి. సమ్మె ఆయుధం మరింత పదునెక్కుతుంది. సంక్షోభాలు తలెత్తినపుడు,యుద్ధాలు ముగిసిన తరువాత కార్మికోద్యమాలు తలెత్తినట్లు గత చరిత్ర చెబుతోంది. ఆ సమయాలలో కార్మికులు త్యాగాలు చేస్తారు.కరోనా కూడా పెద్ద సంక్షోభమే. దానిలో తమ కష్టానికి,త్యాగాలకు దక్కిన ఫలితం ఏమిటని సహజంగానే ఆలోచిస్తారు. ప్రస్తుతం అమెరికాలో పెట్టుబడిదారీ విధానం విఫలమైనట్లు భావిస్తున్నవారు నానాటికీ పెరుగుతున్నారు. అది కూడా కార్మికశక్తి సంఘటితం కావటానికి, పోరాట రూపాలకు మళ్లటానికి దోహదం జరుగుతోందా అన్నది చూడాల్సి ఉంది.


గతంలో అనేక కంపెనీలు కార్మికులను బెదరించాయంటే అతిశయోక్తి కాదు. తాము ఇచ్చిన మేరకు వేతనాలు తీసుకొని చెప్పిన మేరకు పని చేయకపోతే ఫ్యాక్టరీలను మెక్సికో లేదా మరో దేశానికో తరలిస్తామని బెదరించేవారు.ఇప్పుడు అమెరికాలో వస్తు వినియోగానికి జనం(కార్మికులు) కావాలి, అందువలన కార్పొరేట్లు కొంత మేరకు దిగిరాకతప్పటం లేదని చెబుతున్నారు. కరోనాలో కెలోగ్‌ కంపెనీ కార్మికులు ఇబ్బంది పడినా కంపెనీకి రికార్డు స్ధాయిలో 120 కోట్ల డాలర్ల మేర లాభాలు వచ్చాయి. జనం ఇళ్ల వద్దే ఉండటం, లాక్‌డౌన్‌ కారణంగా డిమాండ్‌ పెరిగి దుకాణాల్లో సరకులన్నీ ఖాళీ అయ్యాయి. దీంతో కెలోగ్‌ కార్మికులు తమ వారాంతాలను వదులుకొని, పన్నెండు గంటల చొప్పున పని చేసి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేశారు. కంపెనీ వాటా ధర బాగా పెరిగింది, వాటాదార్లకు బోనస్‌లు, అధికార్లకు పెద్ద మొత్తాలు ఇచ్చారు. కానీ గత ఒప్పంద గడువు ముగిసిన తరువాత యాజమాన్యం కార్మికులను రాయితీలు కోరింది. ఇప్పుడున్న కార్మికులు తమ పెన్షన్లకు చెల్లింపు మొత్తాలను పెంచాలని, సెలవులకు ఇచ్చే మొత్తాల కోతకు అంగీకరించాలని, కొత్తగా పనిలోకి తీసుకొనే వారికి వేతనాల తగ్గింపునకు అంగీకరించాలని వత్తిడి చేసింది. విధి లేక కార్మికులు సమ్మెకు దిగారు. నెలలో మూడు రోజుల పాటు యంత్రాలను శుద్ది చేస్తారు, కార్మికులను కనీసం యంత్రాల మాదిరిగా కూడా చూడకుండా వరుసగా వంద నుంచి 130 రోజుల వరకు పనిచేయించిన ఉదంతాలున్నట్లు కార్మికులు వాపోయారు.
అనేక రంగాల కార్మికులు పోరుబాటలో ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా హాలీవుడ్‌లో పని చేస్తున్న 60వేల మంది కార్మికులు ఆందోళన హెచ్చరిక చేశారు. పని గంటలు పెరిగినందున ఎక్కువ వేతనాలు చెల్లించాలన్నది వారి ప్రధాన డిమాండు. అనేక రంగాల్లోని కార్మికులు ఇదే బాటలో ఉన్నారు. ఒక చోట సమ్మెలు మొదలైతే దాని ప్రభావం ప్రపంచమంతా ఉండటం గతంలో చూశాము. అదే పునరావృతం కానుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పశ్చిమ దేశాలకు దిగులు పుట్టిస్తున్న చైనా టెక్నాలజీ ప్రగతి !

01 Saturday Jan 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

Another Cold war, China Technological Self-Reliance, Intel apologize, Made in China 2025, Technology Superpower


ఎం కోటేశ్వరరావు


మాతో మరో ప్రచ్చన్న యుద్దానికి తలపడితే తాట తీస్తాం అని అమెరికా పాలకులను చైనా హెచ్చరించింది. డిసెంబరు చివరివారంలో వాషింగ్టన్‌ నగరంలో అమెరికా మీడియా సంపాదకులు, సీనియర్‌ జర్నలిస్టులతో చైనా రాయబారి క్విన్‌ గాంగ్‌ మాట్లాడారు.” మూడు దశాబ్దాల నాడు అమెరికా ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. చైనా మాజీ సోవియట్‌ రిపబ్లిక్‌ కాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా నాటి సోవియట్‌ పార్టీ వంటిది కాదు. ఎవరైనా నిజంగా ప్రచ్చన్న యుద్ధం ప్రారంభించాలనుకుంటే చైనా ఓడిపోదని నేను చెప్పగలను. అమెరికాకు చైనా ఎంత అవసరమో చైనాకూ అమెరికా అంతే అవసరం ఉంది.” అని క్విన్‌ గాంగ్‌ చెప్పారు. ఎటువైపు నుంచి ప్రచ్చన్న యుద్దం వస్తుంది ? అసలు వస్తుందని కొందరు జనాలు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే అమెరికాలో కొందరు అలాంటి మన:ప్రవృత్తితో ఉన్నారు, సోవియట్‌ మాదిరి చైనా మీదకు పోవాలనుకుంటున్నారని విమర్శించారు.


ఈ దశాబ్ది చివరికి ఆర్ధిక అగ్రరాజ్యంగా అవతరించనున్న చైనా సాంకేతిక రంగంలో కూడా అదే స్ధాయికి చేరుకొనేందుకు అడుగులు వేస్తోంది. ప్రపంచంలో ఇ కామర్స్‌లో పెద్ద సంస్ధగా ఉన్న అలీబాబా గ్రూపు కంపెనీలను అణచివేస్తున్నదంటూ గగ్గోలు పెట్టిన వారు సాంకేతిక రంగంలో ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ తయారీకి అదే కంపెనీని ప్రోత్సహిస్తున్నదనే అంశాన్ని కావాలనే విస్మరిస్తున్నారు. ఇటియాన్‌ 710 పేరుతో తన మూడవ ప్రోసెసర్‌ను అక్టోబరు నెలలో విడుదల చేసింది. మూడు సంవత్సరాల్లోనే ఈ పని చేసింది. దానిని ఇతర దేశాలకు అమ్మేది లేదని చెప్పింది. చిప్‌ రూపొందించినా తయారీ సమస్య ఉంది. ఇతర చైనా కంపెనీలు టెన్‌సెంట్‌, షియామీ అదే పోటీలో ఉన్నాయి. ప్రోసెసర్‌ చిప్‌లు ఫోన్లు, కార్లు, వైద్య, గృహ పరికరాల్లో ఎంతో ప్రాధాన్యవహిస్తున్నాయి. కరోనా కారణంగా సరఫరాలు దెబ్బతింటే, చైనాను ఆర్ధికంగా నష్టపరిచేందుకు కొన్ని కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించాయి.


సెమీకండక్టర్లు లేదా చిప్స్‌ కోసం ప్రస్తుతం అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, తన తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌పై చైనా ఎక్కువగా ఆధారపడుతోంది.ఈ రంగంలో చిప్స్‌ చైనా తనకు తానే సమకూర్చుకోగలిగితే అది మిగతా దేశాల్లో నవకల్పనలను, ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుందని కొందరు వాపోతున్నారు.జాతీయ ఆర్ధిక భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానంలో ఇతరుల మీద ఆధారపడకూడదని, సాంకేతిక అగ్రరాజ్యంగా మారాలని 2021 మార్చినెలలో చైనా నేత షీ జింపింగ్‌ పిలుపునిచ్చారు. తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తస్కరిస్తున్నదనే తప్పుడు ప్రచారాన్ని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చైనా తన చిప్స్‌ను తానే ప్రత్యేకంగా రూపొందించుకుంటే, తాము రూపొందించినవి చైనా కార్లు, సెల్‌ఫోన్లకు పనికి రాకపోతే, మిగతా దేశాలు కూడా అదే బాట పడితే తాము ప్రతి దేశానికి విడివిడి ప్రమాణాలతో ఎలా తయారు చేయగలం, అందుకు అవసరమైన పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని, అభివృద్ధి మందగిస్తుందని అమెరికా, ఐరోపా బడా సంస్ధలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచం విడిపోకుండా చూడాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అమెరికా-చైనాలను కోరారు. ఒకచేత్తో చప్పట్లు కష్టం కదా !


ప్రస్తుతం చైనాలో తయారవుతున్న సెల్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల వంటి వాటికి ఏటా 300 బి. డాలర్ల మేర చిప్స్‌ చైనా ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోంది, చమురు తరువాత స్ధానం వీటిదే. 2016లో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్యయుద్దంలో భాగంగా చైనాలోని హువెయి టెక్నాలజీస్‌ సంస్ధకు అవసరమైన చిప్స్‌, ఇతర సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అమెరికా అడ్డుకుంది. ఆ కంపెనీ పరికరాలతో ఇతర దేశాల భద్రతకు ముప్పు అనే ప్రచారాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేసి, చిప్స్‌ రూపకల్పనకు పూనుకుంది. దీంతో దిగ్గజాలైన క్వాలకమ్‌(అమెరికా) శాంసంగ్‌(దక్షిణ కొరియా, ఆర్మ్‌(బ్రిటన్‌) కంపెనీలకు సవాలు ఎదురైంది. సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన పరికరాలు, వస్తువులు, ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానంలో చైనా వెనుకబడి ఉంది. దాన్ని అలుసుగా తీసుకొని ఆ రంగంలో ముందున్న దేశాలు బెదిరిస్తున్నాయి. తన సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే ఫౌండరీల్లో చైనా హువెయి కంపెనీ చిప్స్‌ తయారు చేయరాదని, ఒకవేళ చేసినా ఐదవ తరం ఫోన్లకు అసలు చేయకూడదని అమెరికా ఆంక్షలు విధించింది. ఐరోపా యూనియన్‌ కూడా తక్కువేమీ తినలేదు. జర్మనీలో రోబోలను తయారు చేసే కుకా కంపెనీని చైనా కొనుగోలు చేస్తే తమ పెట్టుడుల గురించి సమీక్షించాల్సి వస్తుందని బెదిరించింది.చిప్స్‌ తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఎటూ తేల్చకుండా ఉంది.


్ట మానవహక్కులు, టిబెట్‌, తైవాన్‌, హాంకాంగ్‌ అంశాలను ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తూ రాజకీయ దాడులు, మిలిటరీ కవ్వింపులకు పశ్చిమ దేశాలు పూనుకున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా సెమికండక్టర్లను తయారు చేస్తున్న దిగ్గజ కంపెనీ ఇంటెల్‌ తాజాగా చైనాకు క్షమాపణ చెప్పింది.చైనాలో ముస్లింలు అధికంగా ఉండే షిజాంగ్‌ రాష్ట్రంలో వారిని అణచివేస్తున్నారను తప్పుడు ప్రచారం సాగించటమే కాదు, ఆంక్షలను కూడా అమెరికా, ఇతర దేశాలు అమలు చేస్తున్నాయి. తైవాన్ను ప్రత్యేకదేశంగా పిలిచినందుకు హాలీవుడ్‌ నటుడు, అమెరికా రెజ్లర్‌ జాన్‌ సెనా చైనాకు క్షమాపణలు చెప్పారు.తన సినిమాలకు చైనాలో టిక్కెట్లు అమ్ముకోవటానికి తప్ప వేరే కారణం లేదు. జెపి మోర్గాన్‌ బాంకు సిఇఓ జామీ డైమన్‌ చైనా కమ్యూనిస్టు పార్టీ మీద జోక్‌ వేసి తరువాత రెండుసార్లు క్షమాపణలు చెప్పాడు.జర్నలిజం నైతికవిలువలు, మానవత్వం గురించి చైనాకు వ్యతిరేకంగా నోరుపారవేసుకొన్న సిఎన్‌ఎన్‌ తరువాత క్షమాపణలు చెప్పింది. షిజాంగ్‌ రాష్ట్రంలో తయారయ్యే నూలును తాము వినియోగించబోమని ప్రకటించిన నైక్‌ కంపెనీ తరువాత చెంపలు వేసుకుంది.ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవన్నీ చైనా మార్కెట్‌, లాభాల కోసం వేసే నక్కజిత్లులు తప్ప వేరు కాదు.వాణిజ్య సంస్ధలు రాజకీయాల్లో వేలు పెడితే పర్యవసానాలకూ సిద్దపడాలి. లేకుంటే పరువు పోగొట్టుకోవాలి.


తమ సరఫరాదారులు చైనా షిజాంగ్‌ రాష్ట్రం నుంచి ఉత్పత్తయ్యేవస్తువులు లేకుండా చూడాలని ఇంటెల్‌ కోరింది. ఆ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలను అణచివేస్తున్నారని, బలవంతంగా పని చేయిస్తున్నారంటూ ఆ వస్తువులను కొనుగోలు చేయకూడదంటూ అమెరికా ఆంక్షలు విధించింది. దానికి అనుగుణంగానే తాము అలాంటి లేఖ రాసినట్లు ఇంటెల్‌ తెలిపింది. ఇది తమ దేశాన్ని అవమానించటమే అంటూ ఇంటెల్‌ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ చైనా సామాజిక మాధ్యమంలో నెటిజన్లు స్పందించటం, ఇంటెల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తప్పుకుంటున్నట్లు చైనా పాప్‌ గాయకుడు వాంగ్‌ జుంకాయి ప్రకటించటం వంటి చర్యలతో కంపెనీ దిగివచ్చింది. షిజాంగ్‌ రాష్ట్రంలో దొరికే సిలికాను చిప్స్‌ తయారీకి వినియోగిస్తారు. ఆసియాలో ఉన్న ఏకైక ఇంటెల్‌ ఫ్యాక్టరీ చైనాలోని దలియాన్‌లో, బీజింగ్‌లో పరిశోధనా కేంద్రం ఉంది. ఇతర కంపెనీల చిప్స్‌ అందుబాటులో ఉండటంతో ఇంటెల్‌ దిగివచ్చింది. 2020లో ఆ కంపెనీ ఆదాయంలో నాలుగో వంతు చైనా నుంచే ఉంది. వేరే మార్కెట్‌ను వెతుక్కోవటం చాలా కష్టం, ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావటం, వీటికి తోడు స్వంతంగా చిప్స్‌ తయారీకి పూనుకోవటం కూడా ఇంటెల్‌ను ప్రభావితం చేసింది. మానవహక్కుల కోసం నిలబడే అమెరికన్‌ కంపెనీలు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్‌ మీడియా అధికారి జెన్‌ సాకీ అన్నారు.


రెండవ ప్రపంచయుద్దానికి ముందు తమతో పోటీ పడుతున్న జపాన్‌ సామ్రాజ్యవాదాన్ని అడ్డుకొనే క్రమంలో పశ్చిమ దేశాలు జపాన్‌కు అవసరమైన సహజవనరులు, ముడి సరకులను అందకుండా చూశాయి. ఇప్పుడు చైనా ఆర్ధికంగా పోటీపడుతున్న నేపధ్యంలో అడ్డుకొనేందుకు చిప్స్‌, సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసేందుకు పశ్చిమ దేశాలు పూనుకోవటం గత పరిణామాలను గుర్తుకు తెస్తున్నాయి. రెండవ ప్రపంచయుద్దంలో ఓడిపోయిన జపాన్‌కు మిలిటరీని లేకుండా ఆంక్షలు విధించారు. మిలిటరీ ఖర్చును జపాన్‌ తన పరిశ్రమలకు అవసరమైన పరిశోధన-అభివృద్ధి, సబ్సిడీలకు మళ్లించి పశ్చిమ దేశాలకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌, ఆటోమొబైల్‌ రంగంలో సవాలు విసిరి వాటికి మారుపేరుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనాను కూడా జపాన్‌తో సహా పశ్చిమ దేశాలన్నీ అదే దిశగా ఒకవైపుకు నెడుతున్నాయి. చైనా దీన్ని ముందుగానే అంచనావేసి వాటి మీద ఆధారపడకుండా ఉండేందుకు తగిన కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు పోతున్నది. అమెరికా 2016లో వాణిజ్య యుద్దం ప్రారంభించినప్పటికీ అది ఆచరణలో సాంకేతిక యుద్దంగా పరిణమించిందని చెప్పవచ్చు. మేడిన్‌ చైనా 2025 కార్యక్రమంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి.


చైనాను దెబ్బతీయాలని చూస్తున్న వారికి జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటం లేదు, అంతేకాదు బెంగపట్టుకుందని చెప్పవచ్చు.” ప్రపంచ అశాంతికి దోహదం చేస్తున్న చైనా సాంకేతిక స్వీయ ఆధార బాట ” అనే శీర్షికతో తాజాగా ఏపి వార్తా సంస్ధ ఒక కధనాన్ని వెలువరించింది. ఒక వైపు మార్కెట్లను మరింతగా తెరిచి తమ వస్తువులను కొనుగోలు చేయాలని అమెరికా నాలుడేండ్లుగా ప్రత్యక్షంగా సాగిస్తున్న వాణిజ్యయుద్దం, చైనాకు వ్యతిరేకంగా చేస్తున్న సమీకరణలు, విధిస్తున్న ఆంక్షల నేపధ్యంలో ఎవరి మీదా ఆధారపడకుండా సాంకేతిక రంగంలో స్వీయ ఆధార దిశగా చైనా అనేక చర్యలు తీసుకుంది. అది సాధిస్తున్న పురోగతిని దిగ్జజదేశాలు ఊహించలేదు. తమ కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తామనట్లుగా ఉన్నాయి. ఇప్పుడు మొదటికే మోసం వస్తుందనే బెంగ పట్టుకుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పని కోసం యువత రద్దీ – ఉపాధి రహిత దేశ వృద్ధి !

29 Wednesday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, employees, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

#India jobless growth, #India unemployment, BJP, India economy, India employment, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఉదరపోషణార్ధం బహుకృత వేషం అన్నట్లుగా ఉత్తర ప్రదేశ్‌ విధాన సభ ఎన్నికల్లో గెలుపుకోసం బిజెపి నేతలు చేయని శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు, చెప్పని మాటలు లేవు. పగలంతా భారీ సంఖ్యలో జనాన్ని సమీకరిస్తున్న సభల్లో మాట్లాడుతూ సాయంత్రానికి కరోనా నిరోధ చర్యల గురించి బోధలు చేస్తున్నారనే విమర్శను ప్రధాని నరేంద్రమోడీ మూటగట్టుకున్నారు.ప్రయాగ సభలో మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో యోగి సర్కార్‌ సాధించిన విజయాల్లో మహిళా సాధికారత ఒకటని చెప్పారు. జర్మన్‌ నాజీ మంత్రిగా పని చేసిన గోబెల్స్‌ స్వర్గంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో తెలియదు గానీ ఈ వార్తను చూసి ఎలా స్పందించి ఉంటాడో తెలియదు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే అదే నిజం అవుతుందన్న తన సిద్దాంతాన్ని ముందుకు తీసుకపోతున్నవారు తామర తంపరగా పెరుగుతున్నందుకు కచ్చితంగా సంతోష పడి ఉంటాడు. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 2005లో మన దేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం 26శాతంగా ఉందని,2019నాటికి అది 20.3శాతంగా ఉంది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో 30.5, శ్రీలంకలో 33.7శాతం మంది ఉన్నారు. కరోనా కారణంగా మన దేశంలో 2020 ఏప్రిల్‌-జూన్‌లో 15.5శాతానికి తగ్గింది. ఇక యోగి ఆదిత్యనాధ్‌ ఏలుబడిలో తొమ్మిదిశాతం, బీహార్‌లో ఐదుశాతం మాత్రమే అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.


దేశం సంపద్వంతం కావటానికి ఇప్పుడు అమలు చేస్తున్న సంస్కరణలు ఏమాత్రం చాలవని కార్పొరేట్‌ శక్తులు వత్తిడి చేస్తున్నాయి. దానికి అనుగుణంగానే రద్దు చేసిన సాగు చట్టాలను తిరిగి పునరుద్దరిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇటీవలనే చెప్పారు. దేశమంతటి నుంచి నిరసన తలెత్తటంతో అబ్బేఅలాంటిదేమీ లేదంటూ ప్రకటించిన అంశం తెలిసిందే.ఏటా రెండు కోట్ల మంది యువతీ,యువకులు మాకు పని కావాలంటూ రోడ్లమీదకు వస్తున్నారు.వారికి పని దొరకటం లేదు. కేంద్రంలో మెజారిటీ రాష్ట్రాల్లో ఏలుబడిలో ఉన్నది బిజెపి, అచ్చేదిన్‌ అని చెప్పినప్పటికీ పరిస్ధితులు రోజురోజుకూ దిగజారుగుతున్నాయి.అచ్చేదిన్‌ పేరుతో నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చినపుడు ఎనిమిది శాతంపైగా వృద్ధి రేటు ఉంది.కరోనాకు ముందు నాలుగుశాతానికి పడిపోయింది. వృద్ధి రేటు ఎంత ఉన్నప్పటికీ అది ఉపాధిరహితంగా ఉండటమే అసలు సమస్య. కార్పొరేట్ల లాభదాహం నానాటికీ పెరుగుతోంది.కరోనాలో జనాల పరిస్ధితి దిగజారితే వారి లాభాలు ఏమాత్రం తగ్గలేదు.అయినా అసంతృప్తి.


కెనడాలోని ఫ్రాసర్‌ సంస్ధ విడుదల చేసిన ప్రపంచ ఆర్ధిక స్వేచ్చ సూచికలో 165దేశాలకు గాను మనదేశం ఇంతకు ముందున్న 103వ స్ధానం నుంచి 2021లో 108వ స్ధానానికి దిగజారింది.దీనికిగాను పరిగణనలోకి తీసుకొనే అంశాలన్నింటా పరిస్ధితి అధ్వాన్నంగా ఉన్నందున ప్రయివేటు రంగం వృద్ది చెందటం లేదట.సంస్కరణల గురించి కబుర్లు చెబుతున్నా పరిస్ధితి ఇలా ఉంది. కీలకమైన సేవా రంగాలను సరళతరం చేయటాన్ని నిలిపివేసినట్లు నివేదిక అసంతృప్తి వ్యక్తం చేసింది.తక్కువ ధరలకు సరకులను అందచేసేందుకు బహుళజాతి రిటైల్‌ కంపెనీలను అనుమతించటం లేదన్నది ఒకటి. సోషలిస్టు విధానాలను అనుసరిస్తున్నందున మరింతగా పరిస్ధితి దిగజారుతుందని కెనడా సంస్ద చెప్పిందంటే ఇప్పుడున్న వాటి నుంచి కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గి మొత్తంగా కార్పొరేట్లకు అప్పగించాలని కోరుతున్నారు.


తాజాగా కేంద్ర ప్రభుత్వం అక్వీస్‌(ఆలిండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బేస్డ్‌ ఎంప్లాయిమెంట్‌ సర్వే) తొలి నివేదిక ప్రకారం 2021 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉపాధి తొమ్మిది రంగాలలో 3.08 కోట్లకు పెరిగినట్లు పార్లమెంటుకు తెలిపారు.2013-14లో 2.37 కోట్లతో పోల్చుకుంటే వృద్ది రేటు 29శాతం అని చెప్పారు.వాస్తవం ఏమిటి ? 2021 అక్టోబరులో కార్మికశక్తి భాగస్వామ్య రేటు 40.41(ఎల్‌పిఆర్‌) శాతం ఉండగా నవంబరు నాటికి 40.15కు పడిపోయింది. కరోనాకు ముందు 43శాతం ఉంది, రెండు సంవత్సరాలు రెండు తరంగాల కారణంగా కనిష్టంగా 36శాతానికి పడిపోయి తిరిగి కోలుకున్నప్పటికీ కరోనా ముందు స్ధితికి చేరుకోలేదు. ప్రపంచబాంకు, ఐఎల్‌ఓ గణాంకపద్దతి ప్రకారం 2020లో ప్రపంచ సగటు ఎల్‌పిఆర్‌ 58.6 కాగా మనది 46శాతం మాత్రమే. మనకంటే అధ్వాన్నంగా ఉన్న దేశాలు మరొక 17 మాత్రమే అని ఐఎల్‌ఓ చెప్పింది. చిత్రం ఏమిటంటే వాటిలో చమురు సంపదలున్న ఇరాన్‌, ఇరాక్‌ వంటి దేశాలతో పాటు అంతర్యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న సిరియా, లెెబనాన్‌, ఎమెన్‌ వంటివి ఉన్నాయి. అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొంటున్న మనం ఈ రెండు తరగతులకూ చెందం అన్నది స్పష్టం. సిఎంఐఇ అంచనాల ప్రకారం 40శాతానికి అటూ ఇటూ అంటే ఐఎల్‌ఓ కాస్త ఉదారంగా లెక్కించింది తప్ప పరిస్ధితి దారుణంగా ఉందన్నది స్పష్టం.


కరోనాకు ముందు దేశం మొత్తం మీద ఉపాధిలో పట్టణ వాటా 32శాతం కాగా 2021అక్టోబరులో 31.5శాతం ఉండగా నవంబరులో 31.2శాతానికి తగ్గింది. గ్రామాలతో పోల్చుకుంటే పట్టణాలలో సంఘటిత రంగం ఉంటుంది కనుక కాస్త మెరుగైన వేతనాలుంటాయి. అవే తగ్గాయంటే దాని ప్రభావం మొత్తం మీద ఉంటుంది. మొత్తంగా నవంబరు నెలలో అదనంగా వచ్చిన ఉపాధి 14లక్షలు, పట్టణాల్లో 9లక్షలు తగ్గినా గ్రామాల్లో 23లక్షలు పెరిగినందున ఈ పెరుగుదల ఉంది. నెలవారీ వేతనాలు పొందే వారి సంఖ్య తగ్గుతుండటం ఆందోళనకరం.2019 నవంబరులో నెలవారీ వేతన జీవుల సంఖ్యతో పోలిస్తే 2021లో 9.7శాతం తగ్గారు.ప్రస్తుతం ఒమైక్రాన్‌ కరోనా వైరస్‌ తరంగం ప్రపంచాన్ని, మన దేశాన్ని కూడా భయపెడుతున్నది. ఆర్ధికంగా కోలుకోవటం కష్టమనే అంచనాలు వెలువడతున్నాయి.


గత మూడు దశాబ్దాల సంస్కరణల ఫలితాలు, పర్యవసానాలను చూస్తే జిడిపి వృద్ది కనిపిస్తుంది, జనాభావృద్ధి రేటు తగ్గుతోంది. కానీ ఉపాధి వృద్ధి రేటు జనాభాకు అనుగుణంగా లేదు. ముఖ్యంగా గత దశాబ్దికాలంలో ఉపాధి రహిత వృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయం గిట్టుబాటు కాని స్ధితిలో ఆ రంగంలో యంత్రాల వాడకం గణనీయంగా పెరిగి ఉపాధి తగ్గింది. ఆ మేరకు పట్టణాలలో పెరగలేదు. పెరిగింది కూడా అసంఘటిత రంగంలో ఉంది.ప్రపంచీకరణ కారణంగా ఐటి, అనుబంధ రంగాలలో కొత్త ఉపాధి అవకాశాలు వచ్చిన్పటికీ అవి నైపుణ్యం ఉన్నవారికే పరిమితం అన్నది తెలిసిందే.2005-10 మధ్య సంఘటిత రంగంలో నిఖరంగా పెరిగిన ఉద్యోగాలు పదిలక్షల మాత్రమే కాగా 60లక్షల మంది ఉద్యోగార్ధులు మార్కెట్లో చేరారు. తామర తంపరగా వెలసిన ప్రయివేటు విద్యా సంస్ధల నుంచి ఇంజనీర్లు, ఎంబిఏ,ఎంఎ పట్టాల వారు లక్షల సంఖ్యలో తయారయ్యారు. మన అవసరాలకు మించి వారిని ఉత్పత్తి చేస్తున్నాము. వారిలో కొందరి నైపుణ్యం ప్రశ్నార్ధకం, అంతకంటే తక్కువ విద్య,నైపుణ్యం ఉన్నవారికి తగిన ఉపాధి అవకాశాలు పెరగలేదు.


ఇతర అనేక దేశాలతో పోల్చితే మన దేశంలో యువజనం ఎక్కువగా ఉన్నమాట నిజం. వీరికి కావాల్సింది ఉపాధి తప్ప మాటలు కాదు. సమగ్రమైన సమాచారం అందుబాటులో లేదు. వివిధ సంస్ధల అంచనాల ప్రకారం 2004-12 సంవత్సరాలలో ఏటా 25లక్షల ఉద్యోగ అవకాశాలు పెరిగితే 2012-16 మధ్య 15లక్షలకు తగ్గాయి. ఏదో ఒక సామాజిక భద్రత ఉన్న రెగ్యులర్‌ కార్మికులు 2011-16 కాలంలో 45 నుంచి 38శాతానికి తగ్గారు. సంస్కరణల కాలంలో మనకు వచ్చిన విదేశీ పెట్టుబడులు ఎక్కువ భాగం సేవా రంగానికే వచ్చాయి. మిగిలినవి కార్మికులు తక్కువగా ఉండే పరిశ్రమలకు వెళ్లాయి. జిడిపిలో సేవారంగం వాటా గణనీయంగా పెరిగింది కానీ ఆ మేరకు ఉపాధి పెరగలేదు. విధానపరమైన లోపాలు, మన పరిస్ధితులకు అనుగుణంగా పధకాలను రూపొందించలేదనే లోపాన్ని అంగీకరించేందుకు ఎవరూ సిద్దం కావటం లేదు. అధికారంలో ఎవరున్నా బడా పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు జరిపారు. ఎంత ఎక్కువ పెట్టుబడులు పెడితే అంత ఎక్కువ రాయితీలు, సదుపాయాలు కల్పించారు తప్ప ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనే వైపు దృష్టి పెట్టలేదు. అందుకు అవకాశం ఉన్న చిన్న, సన్నకారు పరిశ్రమలను ఉపేక్షించారు. చివరకు వారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన వస్తువులకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు.

సంఘటిత వస్తూత్పత్తి రంగంలో 25శాతం ఉపాధి తగ్గటానికి పారిశ్రామిక వివాదాల చట్టమే కారణమని ప్రపంచబాంకు మేథావులు సూత్రీకరించారు. కార్మికుల ఉపాధి రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్న కారణంగా యజమానులు కార్మికుల ఖర్చు తగ్గించుకొనేందుకు ఎక్కువ పెట్టుబడి అవసరమైన పద్దతులను ఎంచుకున్నారట.పోనీ అలా ఖర్చు తగ్గించుకొని ఎగుమతులు చేశారా అంటే అదీ లేదు కదా ! ఈ పేరుతో కార్మిక చట్టాలకే ఎసరు పెట్టి బానిసలుగా మార్చేందుకు పూనుకున్నారు.
2017-18లో నాలుగున్నర దశాబ్దాల రికార్డు స్ధాయికి 6.1శాతం నిరుద్యోగం పెరిగిందన్న ప్రభుత్వ సర్వే వివరాన్ని 2019 ఎన్నికల ముందు తొక్కిపెట్టారు, అది తప్పుల తడక, ఉపాధి గురించి లెక్కలు సరిగా వేయలేదన్నారు. ఎన్నికలు ముగిశాక గుట్టుచప్పుడు కాకుండా అదే నివేదికను ఆమోదించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ నిరుద్యోగం ఉంది.2019-20లో 8.6 కోట్ల మంది నెలసరి వేతన జీవులుండగా 2021 ఆగస్టు నాటికి 6.5కోట్లకు తగ్గారు. వీరికి అదనంగా నిరుద్యోగులు తోడవుతారు.

మనకున్న యువశ్రమశక్తితో ప్రపంచాన్నే మన చెప్పుచేతల్లోకి తెచ్చుకోగలమని చెప్పేవారున్నారు. అది ఒక కోణంలో చూస్తే నిజమే. చైనా అలాంటి ఫలితాన్ని సాధించింది. మంచి ఉద్దేశ్యాలే కాదు, అందుకు తగిన విధానాలు కూడా ఉండాలి. లేనట్లయితే అదే అవకాశం ప్రతికూలంగా కూడా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జనాభాలో 54శాతం మంది పాతికేండ్ల లోపువారే, మరోవిధంగా చూస్తే 62శాతం మంది 15-59 ఏండ్ల మధ్య ఉంటారు. వీరికి తగిన నైపుణ్యాలను సమకూర్చి ఉపాధి చూపకపోతే పక్కదారులు పట్టే అవకాశం ఉంది.సిఎంఐసి సమాచారం ప్రకారం 2016లో ఉపాధిలో ఉన్నవారి సంఖ్య 40.73 కోట్ల మంది, 2018 -19నాటికి 40.09 కోట్ల మందికి తగ్గారు. ఆర్ధికవ్యవస్ధ పెరిగితే ఐదులక్షల కోట్ల డాలర్ల స్ధాయికి జిడిపిని తీసుకుపోతామని చెప్పినా, నిజంగా తీసుకుపోయినా యువతీ, యువకులకు ఒరిగేదేమిటి ? 2030నాటికి వ్యవసాయ రంగంలో ఉపాధి 44 నుంచి 30శాతానికి తగ్గుతుందని అంచనా, ప్రస్తుత అంచనా ప్రకారం 2030నాటికి 14.5 కోట్ల మందికి వ్యవసాయేతర రంగాల్లో పని కల్పించాల్సి ఉంటుంది.వారందరికీ ఉపాధి కల్పించే విధానాలను అవలంభించకపోతే తలెత్తే పర్యవసానాలకు బాధ్యులెవరు ? అందుకు గాను ఏటా 8-9శాతం చొప్పున వృద్ధి రేటు ఉండాలి. అదీ ఉపాధి సహితమైనది, అది జరగాలంటే విధానాలను అందుకనుగుణంగా మార్చాలి, అదే ఎలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ ఇండియా : 2014 నుంచి రోజుకు 200 స్వదేశీ, ఒక విదేశీ కంపెనీ మూత !

17 Friday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

‘Make In India’progamme, BJP, Make In India, Modi 7 years rule, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు
మేకిన్‌ ఇండియా పధకాన్ని ప్రకటించి ఏడు సంవత్సరాలు గడచింది. ఈ కాలంలో అంటే 2014 సెప్టెంబరు 25 నుంచి 2021 డిసెంబరు ఒకటవ తేదీ వరకు 8,42,710 కొత్త కంపెనీలు నమోదైనట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ ఇటీవల రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో చెప్పారు. పెట్టుబడులు, తయారీ, రూపకల్పన, నవకల్పన వంటి వాటికి నిలయంగా, ప్రపంచ ఎగుమతి ఎగుమతి కేంద్రంగా మారి చైనాను పక్కకు నెట్టాలన్నది ప్రకటిత లక్ష్యం. పోటీ పడాల్సిందే, ఉపాధి కల్పించాల్సిందే, అంతకంటే కావాల్సింది ఏముంది.పైన పేర్కొన్న కంపెనీలలో పని చేస్తున్నవి 7,82,026 అని కూడా మంత్రి వెల్లడించారు. సులభతర వాణిజ్యానికి అనువైనదిగా గుర్తించటమే అత్యంత ప్రధాన కారణం అని కూడా చెప్పారు.


చిత్రం ఏమిటంటే బిజెపి లేదా నరేంద్రమోడీ విజయ గాధల్లో ఈ కార్యక్రమం లేదా చొరవ లేదు. కొండంత రాగంతో ప్రారంభించి కీచుగొంతుతో ముగిస్తున్నారు. గుజరాత్‌ ఆదర్శ నమూనాను దేశమంతటా అమలు జరుపుతానన్నది నరేంద్రమోడీ 2014 ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. తరువాత మోడీ నోట ఆ మాటను ఎవరైనా విన్నారా ? ప్రపంచమంతటికీ నేను ఒక వినతి చేయదలచాను. రండి భారత్‌లో తయారు చేయండి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా అమ్ముకోండి గానీ తయారీ మాత్రం మాదగ్గరే జరగాలి అని నరేంద్రమోడీ చెప్పారు. తరువాత జరిగిందేమిటో చూశాము. ఇంతచేసినా 2019లో దేశ జిడిపిలో వస్తుతయారీ రంగ వాటా 20 ఏండ్ల నాటికంటే తక్కువగా నమోదైంది.తరువాత స్వయం సమృద్ధి గురించి చెప్పటం ప్రారంభించారు, కరోనా వచ్చిన తరువాత ఆత్మనిర్భరత గానాలాపాన తెలిసిందే. సంస్కరణల పేరుతో మూడు దశాబ్దాల క్రితం తీసుకున్న చర్యల్లో భాగంగా లైసన్సులు ఎత్తివేశారు,కార్పొరేట్‌ పన్ను భారీగా తగ్గించారు. అనేక దిగుమతి పన్నులు తగ్గించారు. కార్పొరేట్లకు అనేక సబ్సిడీలు, రాయితీలు ఇచ్చారు. ప్రణాళికా సంఘం అవసరం లేదంటూ దాన్ని ఎత్తివేశారు. ఉత్పత్తి, ఎగుమతులకు లంకెపెట్టి మరికొన్ని సబ్సిడీలను ప్రకటించారు. వాటికీ సడలింపులు ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఎవరూ వ్యతిరేకించలేదు. కనుకనే వేగంగా అమలు జరిపేందుకు పూనుకున్నారు. సంస్కరణల పేరుతో మొదటికే మోసం తెస్తున్నారని జనానికి మూడు దశాబ్దాల తరువాత అర్ధం కావటం ప్రారంభమైంది. కరోనా కాలంలో జనానికి ఖర్చు పెట్టేందుకు చేతులు రాలేదుగానీ కార్పొరేట్లకు దాదాపు రెండు లక్షల కోట్ల మేరకు కట్టపెట్టారు. మేడిన్‌ ఇండియాలు కార్యక్రమం జయప్రదం కావాలంటే సులభతర వాణిజ్య సూచికను మెరుగుపరిచేందుకు కేంద్రీకరించారు. ఐదు సంవత్సరాల్లో 79 పాయింట్లను మెరుగుపడినట్లు ప్రకటించారు.వీటితో ప్రపంచబాంకును సంతృప్తి పరచారు తప్ప పెట్టుబడిపెట్టేవారికి విశ్వాసం కల్పించలేకపోయారు.


మరోవైపు జరిగిందేమిటి ? 2021 మార్చి 31 నాటికి దేశంలో నమోదైన కంపెనీలు 21,51,349, వీటికి గాను మూతపడినవి 7,58,350, ఇవిగాక నిద్రావస్ధలో 2,266, రద్దు ప్రక్రియలో 6,893, దానికి ముందు దశలో 38,983 ఉన్నాయి. సాంకేతికంగా ఏ పేరు పెట్టినా ఇవన్నీ మూతపడేవే గనుక మొత్తంగా లెక్కిస్తే 8,06,809 ఉంటాయి. పార్లమెంటులో ప్రకటించిన మేరకు ఏడున్నర సంవత్సరాల్లో కొత్తగా వచ్చినవి 8,42,710, ఏతావాతా వచ్చినవాటికి సమానంగా మూతపడినవీ ఉన్నాయి. ఇవన్నీ మోడీ ఏలుబడిలోనే మూతపడలేదు, సంస్కరణల మాదిరే మూతల వేగం పెరిగింది.


తొలిసారి గద్దె నెక్కినపుడు దేశం కంటే విదేశాల్లోనే ఎక్కువ కాలం గడిపారు నరేంద్రమోడీ. ఎందుకంటే విదేశీ పెట్టుబడుల సాధన, పోయిన ప్రతిష్టను పునరుద్దరించేందుకు అని చెప్పారు. నిజమే కామోసు అనుకున్నారు జనం. ఆ ఊసుల మేరకు విదేశీ కంపెనీలేమైనా ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయా ? ప్రస్తుతం నమోదైనవి 4,979 వాటిలో పని చేస్తున్నవి 3,334. సులభతర వాణిజ్య సూచికలు మెరుగుపడిన తరువాత 2018 -2021 మధ్య దేశంలో కొత్తగా నమోదైన విదేశీ కంపెనీలు 320 అని 2021జూలైలో కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ పార్లమెంటులో చెప్పారు. 2014 నుంచి 2021నవంబరు వరకు 2,783 విదేశీ కంపెనీలు మన దేశం నుంచి వెళ్లిపోయినట్లు వాణిజ, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ పార్లమెంటులో చెప్పారు. మన దేశంలో పర్యవేక్షక లేదా బ్రాంచిఆఫీసులు లేదా ప్రాజెక్టు ఆఫీసులు కలిగిన విదేశీ కంపెనీల సంఖ్య 10,756. కొన్ని కంపెనీల ప్రాజక్టులు ముగిసిన తరువాత వెళ్లినవి, కొన్ని విలీనాలతో మూతపడినవి రకరకాల కారణాలు వెళ్లిపోయిన వాటి వెనుక ఉన్నాయి. ఆఫీసులు కలిగిన కంపెనీలన్నీ ఉత్పాదక లేక సేవలు అందిస్తున్నవి కాదు.


2013 డిసెంబరు 31నాటికి దేశంలో నమోదైన 13,69,362 కంపెనీల్లో 19శాతం 2,67,639 మూతపడినట్లు నాటి కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి సచిన్‌ పైలట్‌ లోక్‌సభలో చెప్పారు. పైన పేర్కొన్న వివరాల ప్రకారం 2021మార్చి 31 నాటికి అది 37.6శాతానికి పెరిగాయి. కొన్ని కంపెనీలు ప్రభుత్వం వద్ద నమోదైనప్పటికీ పన్నుల ఎగవేత, లాభాల తరలింపు వంటి అక్రమాలకు మాత్రమే పరిమితమైనవి ఉన్న అంశం అందరికీ తెలిసిందే. వాటిని షెల్‌ లేదా సూట్‌కేస్‌ కంపెనీలని పిలుస్తున్నాము. నిజానికి చట్టంలో కంపెనీ అంటే కంపెనీ తప్ప సూట్‌కేస్‌ అని ఉండదు. పాలకులు తమ హయాంలో సాధించిన గొప్పల గురించి చెప్పుకోవాల్సి వచ్చినపుడు వీటిని కూడా కలుపుకొనే చెబుతారు. అనేక అక్రమాలు బయట పడిన తరువాత అలాంటి వాటిని గుర్తించి కంపెనీల జాబితా నుంచి తొలగిస్తామని మోడీ సర్కార్‌ హడావుడి చేసింది. ఆ మేరకు 2018-21కాలంలో 2,38,223 సంస్ధలను గుర్తించినట్లు పార్లమెంటుకు తెలిపారు. వాటన్నింటినీ రద్దు చేశారా లేదా అన్నది స్పష్టత లేదు. ఇంకా అనేక కంపెనీలు ఉన్నాయి.యునిటెక్‌ గ్రూపు కంపెనీ 52 సూట్‌కేస్‌ కంపెనీలను సృష్టించినట్లు తాజాగా ఇడి వెల్లడించింది. వాటిలో డైరెక్టర్లుగా ఉన్న వారికి నెలకు పది, ఇరవై వేలు చెల్లిస్తూ అవసరమైనపుడు సంతకాల కోసమే పిలిపిస్తుంటారని కూడా తెలిపింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 తరువాత ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి వందల కోట్ల నిధులను సూట్‌కేసు కంపెనీల పేరుతో దారి మళ్లించి దుర్వినియోగం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. హైదరాబాదు కేంద్రంగా పని చేస్తున్న కార్వి కంపెనీ సూట్‌కేస్‌ కంపెనీలను ఏర్పాటు చేసి పాల్పడిన అక్రమాలపై విచారణ, అరెస్టుల గురించి తెలిసినదే. ఇంకా ఇలాంటివి ఎన్నోఉన్నాయి. తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. బాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి తీసుకున్న రుణాలను ఎగవేసేందుకు వాటిని దారి మళ్లించి, విదేశాలకు తరలించి కంపెనీలను దివాలా తీయించి మూతవేసేవి కూడా ఉన్నాయి. పాతవాటిని మూసివేసి కొత్త పరిశ్రమల పేరుతో రాయితీలు పొందేందుకు కొత్త కంపెనీల సృష్టి, ఒకేచోట జరిపే ఉత్పత్తిని వేర్వేరు కంపెనీల పేరుతో లెక్కలు చూపే సంగతి తెలిసిందే. తప్పుడు మార్గాల్లో విదేశాలకు నిధులు తరలించి మారిషస్‌ మరొక దేశం పేరుతో తిరిగి వాటినే పెట్టుబడులుగా పెడుతూ లబ్దిపొందేవారు కూడా ఉన్నారు.


ఏడున్నర సంవత్సరాల పాలనలో ఎగుమతులేమన్నా పెరిగాయా ? ప్రపంచబాంకు సమాచారం మేరకు 2013లో గరిష్టంగా మన జిడిపిలో వస్తు, సేవల ఎగుమతులు 25.43శాతం ఉండగా 2020నాటికి 18.07శాతానికి తగ్గాయి. 2013-14 కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం మన జిడిపిలో వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల వాటా వర్తమాన ధరల్లో 18.2 -24.77-57.03 శాతాల చొప్పున ఉంది. అదే కరోనాకు ముందు 2019-20లో 20.19-25.92-53.89శాతాల చొప్పున ఉంది. ఈ అంకెలు వెల్లడిస్తున్నదేమిటి ? విదేశీ పెట్టుబడులు, మేకిన్‌, మేడిన్‌ ఇండియా పేరుతో ఆర్భాటం తప్ప పెను మార్పులేదన్నది స్పష్టం. ఎగుమతి రంగంలో చూస్తే 2014లో 468-2018లో 538, 2020లో 474 బిలియన్‌ డాలర్ల మధ్య ఉన్నాయి.ఈ ఏడాది 400 బి.డాలర్లు అంటున్నారు.నరేంద్రమోడీ గారు చెప్పిన అచ్చేదిన్‌ కనుచూపుమేరలో కనిపించటం లేదు. అభివృద్ధి రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి దిగజారిన తరువాత కరోనా వచ్చింది. తిరిగి ఎంత మేరకు వృద్ధి ఉంటుందో చెప్పలేము. ఏడేండ్లలో జరిగిందేమిటి ?


2013 డిసెంబరు 31నాటికి దేశంలో మూతపడిన కంపెనీలు 2,67,639 కాగా 2021 మార్చి 31నాటికి మూతపడినవి 7,81,987. అంటే ఏడు సంవత్సరాల మూడునెలల్లో కొత్తగా మూతపడినవి 5,14,348. సులభంగా అర్ధం కావాలంటే రోజుకు రెండువందల కంపెనీలు మూతపడ్డాయి. మేక్‌ ఇండియా ప్రకటన తేదీ నుంచి 2021డిసెంబరు ఒకటి వరకు అంటే ఏడు సంవత్సరాల రెండు నెలల ఆరు రోజుల్లో నమోదైన కొత్త కంపెనీలు 8,42,710. అంటే రోజుకు 321 కొత్త కంపెనీలు నమోదు, మూతపడిన వాటిని తీసుకుంటే నిఖరంగా పెరిగినవి రోజుకు 121. మూతపడుతున్నవాటి కంటే కొత్త కంపెనీలే ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పవచ్చు. ప్రపంచంలో దేశంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. చైనా వంటి వర్ధమాన దేశాల్లో వస్తూత్పత్తి రంగం ప్రధాన ఉపాధి కల్పన వనరుగా ఉంది. అందుకే మన పాలకులు చైనా స్ధానాన్ని ఆక్రమించి వస్తూత్పత్తి చేస్తామని చెప్పారు. ఆశయం మంచిదేగానీ ఆచరణేలేదు. సేవారంగం మీద ఆధారపడ్డారు. వస్తూత్పత్తి రంగంలో ఆటోమేషన్‌, రోబోలు ఎలా వచ్చాయో, సేవారంగాన్ని కూడా ఆటోమేషన్‌ ఆవరిస్తున్నది. బాంకులకు వెళ్లి డబ్బు తీసుకోనవసరం లేకుండా ఎటిఎం మెషీన్లే మనకు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్‌, కంప్యూటర్ల ద్వారా నిధుల బదిలీ, ఇతర లావాదేవీలు జరుపుకోవచ్చు, సేవలకు చెల్లింపులు జరపవచ్చు. ఇవన్నీ ఉపాధిని హరించేవే. అందువలన మన అవసరాలకు అనుగుణంగా వృద్ధి లేదు. జనానికి ఆదాయం లేనపుడు వస్తు, సేవల వినియోగం తగ్గుతుంది. పంటలకు తగిన గిట్టుబాటు ధరలను సమకూర్చలేని పాలకులు నాటు, కోత, ఇతర యంత్రాలను ప్రోత్సహిస్తున్నారు, ఫలితంగా గ్రామాల్లో ఉపాధి తగ్గుతోంది. చేతి వృత్తుల్లో కూడా యాంత్రీకరణ పెరిగిపోతోంది. అసలు మొత్తంగానే వృద్ది రేటు తగ్గింది. ఉన్నమేరకు చూసినా అది ఉపాధి రహిత వృద్ధి. మోడీ సర్కార్‌ డిజిటైజేషన్‌ గురించి తాజాగా కబుర్లు చెబుతోంది. అది పెరిగే కొద్దీ ఉపాధి అవకాశాలు తరుగుతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మద్దతు ధర చట్టబద్దతకు మోడీ మొరాయింపు వెనుక అసలు కథేంటి !

11 Saturday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Agricultural Produces, Farmers Delhi agitation, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, WTO-Agriculture, WTO-India


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నిబంధనలు, అవగాహన మేరకు మన దేశంలో 23 పంటలకు అమలు చేస్తున్న కనీస మద్దతు ధరలు ఆహార భద్రతా చర్యల్లో భాగం. దానిలో భాగమే సేకరణ, పంపిణీ నిర్వహణ. ఈ విధానం మేరకు వర్దమాన దేశాలకు అనుమతించిన పరిమితులకంటే ఎక్కువగా మన దేశం సబ్సిడీ ఇస్తున్నదని డబ్ల్యుటిఓలో మన మిత్ర, సహజ భాగస్వామి అని చంకలు కొట్టుకుంటున్న అమెరికా, కెనడా కేసు దాఖలు చేశాయి. మన మీద ఐక్యంగా దాడి చేస్తున్న ధనిక దేశాలు తమలో తాము కుమ్ములాడుకోవటమే కాదు, కేసులు కూడా దాఖలు చేస్తున్నాయి. మన మీదే కాదు చైనా మీద కూడా అమెరికా అలాంటి కేసునే దాఖలు చేసింది. పరిమితికి మించి చైనా రైతులకు సబ్సిడీలు ఇస్తున్నదని డబ్ల్యుటిఓ 2019 మార్చినెలలో తీర్పు చెప్పింది. దాని మీద చైనా వినతి మేరకు ప్రస్తుతం సమీక్ష జరుపుతున్నారు. దానిలో తృతీయ పక్షంగా మన దేశం మరికొన్ని దేశాలు చేరాయి. అది ఎప్పటికి పూర్తవుతుందో, ఎలా పరిష్కారం అవుతుందో చెప్పలేము.ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) ఇది ప్రపంచ వ్యవసాయదారుల సంస్ధ కాదు. పారిశ్రామిక, సేవ, వ్యవసాయ రంగాలన్నిటినీ వాణిజ్యంగా పరిగణించి ఆ దృక్పధంతోనే వాటి విధిని నిర్ణయిస్తోంది. అందువలన దానికి యజమానులు తప్ప ఆ రంగాల్లో పనిచేసే వారి గురించి పెద్దగా పట్టదని వేరే చెప్పనవసరం లేదు.


అమెరికా లేవనెత్తిన అంశాలు మనకూ ఆసక్తి-ఆందోళన కలిగించేవే. బరాక్‌ ఒబామా హయాంలో ఈ కేసు దాఖలైంది. చైనా ఇస్తున్న సబ్సిడీల కారణంగా తమ మొక్కజొన్న, గోధుమ, వరి రైతులు నష్టపోతున్నారని, ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేరిన సమయంలో అంగీకరించిన మొత్తాలకంటే ఎక్కువ మొత్తాలు ఇస్తున్నట్లు ఆరోపణ. ఈ కారణంగా చైనాలో అధికంగా ఉత్పత్తి చేస్తున్నారని, ఫలితంగా ప్రపంచ స్ధాయి నాణ్యత కలిగిన ఉత్పత్తులను తమ రైతులు చైనాకు ఎగుమతి చేయలేకపోతున్నారని, ఇది వాణిజ్య నిబంధనలకు విరుద్దమని ఫిర్యాదు చేసింది. ఒక బుషెల్‌ (25.4కిలోలు) గోధుమలకు మద్దతు ధరగా పది డాలర్లను(మన కరెన్సీలో రు.750,మన ప్రభుత్వం 2021-22కు ప్రకటించింది క్వింటాలుకు రు.2015) చైనా మద్దతు ఇస్తోందని, ఇది ప్రపంచ ధరల కంటే చాలా ఎక్కువన్నది అమెరికా ఆరోపణ. మన దేశంలో వరి, గోధుమలకు గరిష్టపరిమితిగా ఉన్న పదిశాతానికి మించి 60,70శాతం వరకు మద్దతు ధరల రూపంలో సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా చిత్రిస్తున్నది.


ఆయా దేశాలకు ఇచ్చిన సబ్సిడీలను పరిమిత వ్యవధిలోపల ఎత్తివేయకపోతే కేసులో గెలిచిన దేశాలు ప్రతికూల పన్నులు విధించవచ్చునని డబ్ల్యుటిఓ నిబంధనలు చెబుతున్నాయి. పంటల విలువలో 8.5శాతానికి మించకుండానే తమ సబ్సిడీలు ఉంటాయని అంగీకరించిన చైనా అంతకు మించి అదనంగా వంద బిలియన్‌ డాలర్లు ఇచ్చిందన్నదే వివాదం. నిబంధనల మేరకు వర్ధమాన దేశాలు పదిశాతం వరకు సబ్సిడీలు ఇవ్వవచ్చు. చైనా అధిక ఉత్పత్తి మరియు రక్షణ చర్యలు దీర్ఘకాలం కొనసాగుతున్న కారణంగా అమెరికా రైతులు దెబ్బతింటున్నారు. చైనా సబ్సిడీల కారణంగా ఏడాదికి 70కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నారని అమెరికా గోధుమ ఎగుమతిదారు విన్స్‌ పీటర్సన్‌ ఆరోపించాడు. గోధుమలు, వరికి కనీస మద్దతు ధర ఉన్నకారణంగానే రైతులు వాటివైపు మొగ్గుచూపుతున్నారని వాదించేవారి గురించి తెలిసిందే. ఆ మద్దతు ధర గురించి అదే అమెరికా మన మీద కూడా దాడి చేస్తోంది.
అమెరికా, ఇతర ధనిక దేశాల దాడులు, వత్తిడి నుంచి తప్పుకొనేందుకు రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎగుమతి చేసుకోవచ్చు అంటూ కొత్త పల్లవి అందుకొని మోడీ సర్కార్‌ హడావుడిగా మూడు సాగు చట్టాలను తెచ్చిన అంశం తెలిసిందే. చైనా ఇస్తున్న మద్దతు ధర చెల్లదని ప్రపంచ వాణిజ్య సంస్ధ ఇచ్చిన తీర్పు తమకు మంచి అవకాశమని అమెరికా రైస్‌ అనే వ్యాపార సంస్ధ చైర్మన్‌ చార్లీ మాథ్యూస్‌ చెప్పాడు. ఏ ఏడాదైనా తమ పంటలో సగాన్ని ఎగుమతి చేస్తామని ఇతర దేశాలు కూడా అదనంగా ఇస్తున్న మద్దతు ధరను తగ్గిస్తే అంతర్జాతీయంగా మంచి అవకాశాలు వస్తాయని అన్నాడు. దీని అర్ధం ఏమిటి ? భారత్‌, చైనా వంటి దేశాల రైతులకు ధర గిట్టుబాటుగాక సాగుమానేస్తే తమ పంటలను మనవంటి దేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.


అమెరికా, కెనడా మన మీద ప్రధానంగా పప్పుధాన్యాలకు మద్దతు ఇవ్వటాన్ని సవాలు చేశాయి.2018-19 సంవత్సరానికి ప్రకటించిన మద్దతు ధరలు అనుమతించినదానికంటే 26రెట్లు అదనంగా ఇచ్చినట్లు ఫిర్యాదు చేశాయి. పప్పుధాన్యాల విలువను మన దేశం రు.2,677 కోట్లుగా లెక్కిస్తే అమెరికా, కెనడా దాన్ని రు.69,923 కోట్లుగా చూపాయి. ఎందుకీ తేడా వచ్చింది ? మద్దతు ధర పధకం కింద కేంద్రం లేదా రాష్ట్రాలు సేకరిస్తున్న పరిమాణానికే మనం విలువ కడుతుండగా, అమెరికా, కెనడాలు మొత్తం ఉత్పత్తిని తీసుకొని దాని మీద చూపుతున్నాయి. మరొకటేమంటే మన దేశం విలువను డాలర్లలో లెక్కిస్తుండగా మన మీద ఫిర్యాదు చేసిన దేశాలు రూపాయల్లో లెక్కించాయి. అమెరికన్లు చైనా మీద మొక్కజొన్న, గోధుమ, వరి మీద ఫిర్యాదు చేయగా మన మీద పప్పుధాన్యాల మీద వేయటానికి కారణం వాటిని ప్రత్యేకించి బఠానీలను మనకు ఎగుమతి చేయాలని చూస్తున్నాయి. తరువాత మిగతావాటి మీదా వేస్తాయి. చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఈ రోజు మనల్ని కౌగిలించుకుంటున్న దేశాలన్నీ ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా మన మీద ఫిర్యాదు చేసినవే. చెరకు రైతులకు రాష్ట్రాలు ప్రకటించే సూచిక ధరలను రైతులకు ఇస్తున్న సబ్సిడీలుగా చూపుతూ ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. సౌరపలకలు, గోధుమలు, వరి, పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా, ఉక్కు ఉత్పత్తులపై జపాన్‌ అదేపని చేశాయి.


ఇతర దేశాల మీద విరుచుకుపడుతున్న అమెరికా తాను చేస్తున్నదేమిటి ? డబ్ల్యుటిఓలో వ్యవసాయంపై కుదిరిన ఒప్పందం మేరకు ధనిక దేశాలు తమ సబ్సిడీలను ఐదుశాతానికి, మిగతాదేశాలు పదిశాతానికి పరిమితం చేయాలి. అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది. ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచే నిబంధనలను ఉల్లంఘించే మార్గాలను వెతికారు. సబ్సిడీల్లో మూడు రకాలు. ఒకటి గ్రీన్‌ బాక్స్‌, రెండు అంబర్‌బాక్స్‌, మూడవది బ్లూబాక్స్‌. గ్రీన్‌ బాక్సు తరగతి సబ్సిడీలు వ్యాపారాన్ని వికృతీకరించకూడదు, లేదా పరిమితంగా ఉండాలి. అవి ప్రభుత్వం ఇచ్చేవిగా, మద్దతు ధర ప్రమేయం లేనివిగా ఉండాలి.పర్యావరణాన్ని, ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఉంటే వాటికి ఎలాంటి పరిమితులు లేవు. గ్రీన్‌, బ్లూబాక్స్‌ సబ్సిడీలు కానివన్నీ అంబర్‌బాక్సు తరగతిలోకి వస్తాయి. ఉత్పత్తి పరిమాణంతో నేరుగా సంబంధం ఉండే సబ్సిడీలు లేదా మద్దతు ధరల వంటివి దీనిలో ఉన్నాయి. బ్లూబాక్స్‌ అంటే షరతులతో కూడిన అంబర్‌ బాక్సు సబ్సిడీలు, వికృతీకరణను తగ్గించేవిగా ఉండాలి. అంటే రైతులు ఉత్పత్తిని పరిమితం చేసేవిగా ఉండాలి.ప్రస్తుతం ఈ సబ్సిడీలకు కూడా ఎలాంటి పరిమితులు లేవు.


మన మద్దతు ధరలపై వేసిన కేసు విచారణ, తీర్పు వచ్చే వరకు వ్యవధి పట్టవచ్చు. చైనా మాదిరి మనకూ వ్యతిరేకంగా తీర్పు రావచ్చు. ఈ లోగా కేసు వేసిన దేశాలతో మనదేశం సంప్రదింపుల ప్రక్రియ ఉంటుంది. ఈలోగా మన దేశం కూడా కొన్ని మార్పులు చేయవచ్చు. చైనా వివాదం రెండున్నర సంవత్సరాలు పట్టింది. మరికొన్ని దేశాలు కూడా మన మీద కేసులో చేరవచ్చు. మన దేశం ఇస్తున్న మద్దతు ధరలను ఆహార భద్రతా చర్యల్లో భాగంగా చూపుతున్నాము గనుక అవి గ్రీన్‌ బాక్సు తరగతిలోకి వస్తాయని మన నిపుణులు భావిస్తున్నారు. గోధుమల మద్దతు ధరల వివాదంలో చైనాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తరువాత 2019లో నరేంద్రమోడీ రెండవ సారి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. బహుశా ఈ తీర్పు నేపధ్యంలో మద్దతు ధరలకు మంగళం పాడే ఉద్దేశ్యంతో లేదా మార్పులు చేశామని చూపేందుకు, సబ్సిడీ మొత్తాలకు కోత పెట్టేందుకు నేరుగా నగదు అందచేసే పేరిట ఏటా ఆరువేల రూపాయల సాగు లేదా ఆదాయ మద్దతు పేరుతో కిసాన్‌ సమ్మాన్‌ పధకాన్ని ప్రకటించారనుకోవాలి. ఇది ప్రపంచ బాంకు ఆదేశాల్లో భాగమే. తెలంగాణాలో, దేశంలో ధాన్య ఉత్పత్తి పెరిగిందనే వాదనలు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలనే పల్లవి, పాట అందుకున్నారు.ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం అంటే కొనాలని మేము అడగం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవటం, వరి సాగు వద్దని, ఇతర పంటలు వేసుకోవాలని చెప్పటాన్ని చూస్తుంటే వీటన్నింటికీ సంబంధం లేదని ఎవరైనా చెప్పగలరా ? చైనా సర్కార్‌ ఇస్తున్న మద్దతు ధరల కారణంగానే అక్కడ ఉత్పత్తి పెరిగిందని, అది తమ ఎగుమతులను దెబ్బతీసిందని అమెరికా చేసిన వాదన మనకూ, మనలాంటి ఇతర దేశాలకూ వర్తించదా ?


విడదీసి పాలించాలనే బ్రిటీష్‌ వారి ఎత్తుగడను అమెరికా అమలు చేస్తోంది. దానిలో భాగంగానే మనకూ-చైనాకు మరోసారి తగదా పెట్టటంలో జయప్రదమైంది. రైతులకు మద్దతు ఇచ్చే అంశంలో మనమూ-చైనా కూడా ప్రపంచవాణిజ్య సంస్ధలో ఒకే వాదనను ఐక్యంగా ముందుకు తెస్తున్నాము. సవాలు చేసేందుకు వీలు లేని గ్రీను బాక్సు సబ్సిడీల పేరుతో అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు అమలు చేస్తున్న అంబర్‌ బాక్సు సబ్సిడీల సంగతేమిటని నిలదీస్తున్నాయి. అవి మన దేశంలో అమలు చేస్తున్న మద్దతు ధరలతో పోలిస్తే చాలా ఎక్కువ. గోధుమ రైతులకు చైనా ఇస్తున్న మద్దతు ధరలతో అంతర్జాతీయంగా ధరలు తగ్గి తమకు నష్టం వస్తోందని వాదించిన అమెరికా చేసిందేమిటి ? అమెరికా సర్కార్‌ పత్తి రైతులకు ఇస్తున్న మద్దతు ప్రపంచ మార్కెట్‌ను వక్రీకరిస్తోందంటూ 2002లో బ్రెజిల్‌ సవాలు చేసింది.1995-2002 మధ్య పత్తి ధరలు గణనీయంగా పడిపోవటానికి, అదే కాలంలో అమెరికా పత్తి ఎగుమతులు రెట్టింపు కావటానికి సబ్సిడీలే కారణమని ప్రపంచ వాణిజ్య సంస్ధ విచారణలో నిర్ధారణైంది. పశ్చిమ ఆఫ్రికాలోని పేద దేశాల పత్తి రైతులు నష్టపోయినట్లు కూడా తెలిపింది. మార్కెట్‌ సహాయ రుణాలు, మార్కెట్‌ నష్టాన్ని పూడ్చే పేరుతో అమెరికా రాయితీలు ఇచ్చింది.


ఈ తీర్పు తరువాత అమెరికా రాజీకి వచ్చి బ్రెజిల్‌ పత్తి రంగ సామర్ధ్యం పెరుగుదలకు తన ఖర్చుతో శిక్షణ ఇస్తామని ప్రకటించింది. దీనికి తోడు 2014 అమెరికా వ్యవసాయ బిల్లులో కొన్ని మార్పులు చేయటంతో బ్రెజిల్‌ మౌనం దాల్చింది. అయితే అమెరికా ఆ బిల్లును 2019లో సవరించి పది సంవత్సరాలలో వివిధ రూపాలలో 867బిలియన్‌ డాలర్ల మేరకు రైతుల పేరుతో రాయితీలు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో ఉన్న అనూహ్య అంశం ఏమిటో తెలుసా ! పొలంలో పని చేయకపోయినా రైతు మేనళ్లు, మేన కోడళ్లు,ఇతర బంధువులు కూడా రైతుల పేరుతో సబ్సిడీలను పొందవచ్చు. ధనిక దేశాల ఉత్పత్తులకు మనమూ, చైనా వంటి దేశాలు మార్కెట్లను తెరిచి దిగుమతులు చేసుకుంటే ఎలాంటి కేసులూ ఉండవు. మనం దిగుమతులకు అనుమతిస్తే పారిశ్రామిక రంగం విదేశీ సరకులతో కుదేలైనట్లే వ్యవసాయం కూడా మరింత సంక్షోభానికి లోనవుతుంది.


ప్రపంచ వాణిజ్య సంస్ధలో తొలిసారిగా బాలీ సంధికాల నిబంధనను గతేడాది, ఈ ఏడాది ఉపయోగించుకున్న దేశం మనదే. వరికి ఇస్తున్న రాయితీ పదిశాతం దాటటమే దీనికి కారణం.2019-20లో బియ్యం ఉత్పత్తి విలువ 46.07బిలియన్‌ డాలర్లు కాగా ఇచ్చిన రాయితీ 6.31బి.డాలర్లని ఇది 13.7శాతానికి సమానమని మన దేశం డబ్ల్యుటిఓకు తెలిపింది. అయినప్పటికీ ఇది సమర్దనీయమే అంటూ సంధికాల నిబంధనను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఎఫ్‌సిఐ ద్వారా సేకరణను కొనసాగించవచ్చు. రాయితీలు తమ అంతర్గత ఆహార భద్రత కోసం ఇచ్చినవి గనుక వాణిజ్య వికృతీకరణ జరగలేదు. ప్రభుత్వం సేకరించిన నిల్వల నుంచి విదేశాలకు వాణిజ్యపరమైన ఎగుమతులు జరపలేదు. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం విక్రయిస్తున్న వాటిని కొనుగోలు చేసిన వారు ఇతర దేశాలకు వాటిని ఎగుమతి చేయకూడదనే షరతు ఉన్నందున ఎవరికీ నష్టం జరగలేదు, అందువలన భారత్‌పై చర్యలు తీసుకోకూడదన్నది మన వాదన. దీన్ని సమర్ధించుకొనేందుకే కరోనా కాలంలో ఇచ్చిన ఉచిత బియ్యాన్ని ఆహార భద్రత పధకం కింద చూపారు. వాటి సరఫరాను విరమించినట్లు ప్రకటించిన కేంద్రం తిరిగి కొంత కాలం కొనసాగించనున్నట్లు ప్రకటించిన అంశం తెలిసిందే. ఈ కారణాలను ఎవరూ సవాలు చేసేందుకు వీలులేదు. ఈ నిబంధన ఒక్క బియ్యానికే కాదు, ఇతర పంటలకూ వర్తిస్తుంది.


మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే సంభవించే పర్యవ సానాల గురించి ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం తలచుకుంటే దాన్ని సాధించటం అసాధ్యం కాదు. ఇప్పటికే చెరకు పంటకు ఒక చట్టబద్దత ఉంది. ప్రభుత్వం సూచించిన ధరకంటే తక్కువకు కొనుగోలు చేసేందుకు మిల్లులకు అవకాశం లేదు. ఆ ధర ఎక్కువా తక్కువా, రికవరి లెక్కల్లో మోసాలు వేరే అంశం. పేరుకు ఇరవై మూడు పంటలైనా ఆచరణలో అన్నింటినీ ప్రభుత్వం సేకరించే అవసరం రావటం లేదు, నిర్ణీత ధరలకంటే ఎక్కువ లేదా వాటికి దరిదాపుల్లో ఉన్నందున రైతులు ప్రభుత్వం మీద ఆధారపడటం లేదు. గతేడాది బియ్యం ఉత్పత్తిలో 49శాతం, గోధుమలను 40శాతమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉత్పత్తి పెరిగితే ఇంకాస్త పెరుగుతుంది తప్ప అసాధారణంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో పత్తి సేకరణ అవసరమే ఉండటం లేదు. మద్దతు ధరలు ప్రకటిస్తున్న 23 పంటల మొత్తం విలువ పన్నెండులక్షల కోట్ల రూపాయలని (2020-21) అంచనా. కుటుంబ అవసరాలకు, పశుదాణాకు పోను మార్కెట్‌కు వస్తున్నదానిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదాని విలువ రు.నాలుగులక్షల కోట్లు. మరొక ఐదులక్షల కోట్ల మేరకు బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. కోట్లాది మంది రైతులు, కూలీలతో, ఇతరంగా ఆధారపడే వారికి సంబంధించిన దీనికి హామీ ఇవ్వటానికి ప్రభుత్వానికి సత్తా, అవకాశాలు లేవా ?


ఒక అంచనా ప్రకారం మన దేశంలో ఏటా ప్రతి రైతుకూ సగటున 260డాలర్ల మేర సబ్సిడీలు ఇస్తున్నారు. అదే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో 100రెట్లు ఎక్కువ. మరొక అంచనా ప్రకారం భారత్‌లో 200 డాలర్లు ఇస్తుంటే అమెరికాలో 50వేల డాలర్లు ఇస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం చట్టవిరుద్దం. మన కార్పొరేట్‌ మేథావులు ఈ వాదనను భుజానవేసుకొని దాన్నే వల్లిస్తున్నారు.నిజానికి మనకు ఆ హక్కు నిబంధనలకు లోబడే ఉంటుందన్నది మరొక అభిప్రాయం. మరి నరేంద్రమోడీ సర్కార్‌ ఏదో ఒక వాదనను తన వైఖరిగా తీసుకుంటే అదొక తీరు. రైతు ఉద్యమం సాగిన ఏడాది కాలంలో చెప్పిందేమిటి ? గతంలో చట్టబద్దత లేదు కదా, కొనసాగిస్తామని రాతపూర్వకంగా ఇస్తామంటున్నాం కదా, ఏటా ధరలను సవరిస్తూనే ఉన్నాం అని అటూ ఇటూ తిప్పటం తప్ప చట్టబద్దత కుదురుతుందో లేదో కుదరకపోతే కారణాలేమిటో చెప్పకుండా నాటకం ఎందుకు ఆడినట్లు , ఇప్పుడు ఒక కమిటీ వేస్తామని ఎందుకు చెప్పినట్లు ? అసలు సంగతేమంటే అన్ని రంగాలనుంచి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొంటున్న మాదిరే వ్యవసాయాన్ని కూడా ప్రయివేటు రంగానికి అప్పగించాలనే తాపత్రయమే. అందుకే రైతు ఉద్యమంలో ఐక్యత కీలకమైన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కారణంగా మోడీ సర్కార్‌ క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తగ్గింది తప్ప మారుమనసు కలిగి కాదన్నది స్పష్టం. అందుకే కనీస మద్దతు ధరల చట్టబద్దతపై కమిటీ వేసినా దానికి అంగీకరిస్తారా అన్నది అనుమానమే. అందుకే రైతుల ఆందోళన అంతం కాదు, మరో ఆరంభానికి విరామమే అని చెప్పాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత వ్యవసాయ రంగం – నరేంద్రమోడీ : ఇంతకాలం రైతు ఉద్యమం – ఇక కార్పొరేట్ల వత్తిడి ప్రారంభం !

09 Thursday Dec 2021

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

agriculture in india, Farmers agitations, Minimum Support Prices, MSP, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఏడాదికి పైగా సాగిన మహత్తర రైతు ఉద్యమం మూడు సాగు చట్టాల రద్దుతో ఘన విజయం సాధించింది. సింహం లాంటి నరేంద్రమోడీ ఎత్తుగడగా ఒక అడుగు వెనక్కు తగ్గారు తప్ప తగు సమయంలో తిరిగి అదే అజండాతో ముందుకు వస్తారని మోడీ అభిమానులు వెంటనే స్పందించటాన్ని చూశాము. వారికి రైతు ఉద్యమం మీద ఉన్న అవగాహన కంటే నరేంద్రమోడీ మీద పెంచుకున్న విశ్వాసం బలంగా ఉందన్నది స్పష్టం. రైతుల పోరాటం ముందుకు తెచ్చిన ఇతర ప్రధాన అంశాలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. కొన్నింటిపై ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీల మేరకు ఉద్యమ విరమణ ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి చర్చ, అవసరమైతే తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు జనవరి 15న సమావేశం జరపనున్నట్లుసంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతలు ప్రకటించారు. సమస్యల తీవ్రత, సంక్లిష్టత, అనుమానాల దృష్ట్యా 378 రోజుల పోరులో ఒక విరామంగానే దీన్ని చెప్పవచ్చు.


కనీస మద్దతు ధరల చట్టం గురించి ఒక కమిటీని వేస్తామని, దానిలో రైతు సంఘాల ప్రతినిధులు ఉంటారని కూడా చెప్పారు. ఆ కమిటీని వేస్తారు, వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోపు దాని నివేదిక వచ్చే అవకాశాలు లేవు. ఎన్నికల పబ్బం గడచిన తరువాత ఏం జరుగుతుందో చెప్పలేము.ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. కొన్ని అంశాలను చూద్దాం. కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి టి.నందకుమార్‌ డిసెంబరు 8వ తేదీన రాసిన విశ్లేషణాభిప్రాయంలో వెంటనే ఎంఎస్‌పి డిమాండ్‌ను భరించగలిగే స్ధితి దేశానికి లేదని, అరాజకత్వం, దీర్ఘకాలిక నష్టం జరుగుతుందంటూ గుండెలు బాదుకున్నారు. ఇదేమీ అనూహ్యమైంది కాదు, ఇలాంటి వారు సాగు చట్టాలకు ముందు-తరువాత చర్చలో – రద్దు తరువాత కూడా ఇదే వైఖరిని వెల్లడించారు. వీరంతా స్వదేశీ-విదేశీ కార్పొరేట్‌ లాబీకి చెందిన పెద్దమనుషులు. రైతులను విభజించే వాదనలను కూడా నందకుమార్‌ ముందుకు తెచ్చారు. మిగులు పంటను అమ్ముకొనే తరగతి రైతులు ఎవరు ? ఏ ప్రాంతాల్లో సేకరణకు అవసరమైన సదుపాయాలున్నాయి ? వర్షాధారిత రైతులకు పెట్టుబడి సబ్సిడీలు అందకపోతే, సేకరణ వ్యవస్తలు అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుంది ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే ఆ మేరకు జరుగుతోందా లేదా అని ప్రతిలావాదేవీని తనిఖీ సిబ్బంది చూడాల్సి ఉంటుంది. ఉల్లంఘించిన వారిని శిక్షించాలి.అప్పుడు వ్యాపారులెవరూ మార్కెట్లో ఉండరు, ప్రభుత్వ విక్రయాల కోసం ఎదురు చూస్తారు. అప్పుడు ప్రభుత్వం ఏకైక వ్యాపారి అవుతుంది.అది విపత్తుకు దారి తీస్తుంది. ప్రస్తుత డిమాండ్‌ను చూస్తే విశ్వాస ప్రాతిపదిక వ్యవస్ధ బదులు హక్కుల వ్యవస్ధను కోరుతున్నారు. అదే జరిగితే పంజాబ్‌ మరికొన్ని రాష్ట్రాలకు పరిమితమైన దానిని దేశమంతటా విస్తరించాల్సి ఉంటుంది. ఆహారభద్రత హక్కు మాదిరి రైతులకు సేకరణ హక్కు లభిస్తుంది. అదే జరిగితే అదొక సేకరణ పధకం లేదా మద్దతు ధరకంటే తక్కువకు అమ్ముకుంటే ఆ తేడాను చెల్లించేది లేదా రెండూ అమలు జరపాల్సి రావచ్చు. అప్పుడేం జరుగుతుంది అని నందకుమార్‌ ప్రశ్నించారు.


మిగులు పంటను అమ్ముకొనే వారా లేకా స్వంత అవసరాల కోసం పండించుకొనే వారా అన్నది అసంబద్ద వాదన. అసలు ఎవరికీ సాగు గిట్టుబాటు కావటం లేదన్నది అసలు సమస్య. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా 116 దేశాల్లో ఆకలిలో 101వ స్ధానంలో ఉన్నామనే అంశం ఇలాంటి వాదనలు చేసే వారికి తెలుసా ? ఎవరి అవసరాలకు సరిపడా వారు పండించుకుంటే మిగులు లేకుండా ఆకలిని తీర్చేదెవరు ? అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాలని-అక్కడి కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలని చెబుతున్నారా ? వర్షాధారిత ప్రాంతాల రైతులను ఆదుకొనేందుకు అవసరమైన పధకాలను అమలు జరిపితే సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు మరొకరెవరైనా అడ్డుకున్నారా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు ధరలను నిర్ణయించే అవకాశం, హక్కు పారిశ్రామిక, వాణిజ్యసంస్ధలకు ఉన్నపుడు రైతులకు అలాంటి అలాంటి హక్కు ఎందుకు కలిగించకూడదు ? ప్రతి రైతుకు అలాంటి అవకాశం లేదు కనుక వారి తరఫున ఆ పని ప్రభుత్వమే చేయాలి. ఇన్నేండ్లుగా విశ్వాసాన్ని వమ్ము చేశారు కనుకనే రైతులు హక్కుల విధానాన్ని కోరుతున్నారు. పెట్టుబడులు రావాలంటే పారిశ్రామిక, వాణిజ్య సంస్దలకు కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయి, ఇష్టం వచ్చినపుడు కార్మికులను నియమించుకొనే, తీసివేసే స్వేచ్చ ఇవ్వాలన్న వత్తిడికి లొంగి ఆ చట్టాలకు ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పంటల మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే వ్యాపారులు మార్కెట్‌ నుంచి తప్పుకుంటారని చెప్పటం బెదిరింపు తప్ప మరొకటి కాదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధరలకంటే తక్కువ వెలకు వినియోగదారులకు అమ్మాలనే నిబంధనలేమీ లేనపుడు వారికి వచ్చే నష్టం ఏమిటి ?


నందకుమార్‌ ముందుకు తెచ్చిన మరికొన్ని వాదనలేమిటి ? ఇరవై మూడు పంటలకు ఇప్పటికే ఉన్న ఎంఎస్‌పికి చట్టబద్దమైన హామీ కల్పించాలని అడుగుతున్నారు. ఇతర రైతుల గురించి ఎలాంటి నిర్దిష్టత లేదు. అందువలన వారు కూడా ఎంఎస్‌పిని అడగరని ఏముంది ? (నిర్ధిష్టత లేకపోతే ప్రభుత్వం ఆ పని చేస్తే వద్దన్నదెవరు ? ఇతర పంటలకూ ఎంఎస్‌పి అడిగితే ఇవ్వాలి. సాగు చేయాలా వద్దా ? ఇతర పంటలు అవసరం లేదా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు అలాంటి పరిమితులేమీ లేవుగా !) ప్రస్తుతం ఎంఎస్‌పి పరిధిలో ఉన్న 23 పంటల విలువ ఏడులక్షల కోట్ల రూపాయలు.చట్టబద్దత కల్పిస్తే అదనపు ఖర్చు రు.47,764(2017-18 సమాచారం) అవుతుందని కిరన్‌ విస్సా, యోగేంద్ర యాదవ్‌ చెప్పారు. వీరు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు.వాటిలో ఆహార సబ్సిడీ రు.2,40,000 కోట్లున్నాయి.(ఇంత సబ్సిడీ ఇచ్చిన తరువాత కూడా దేశం ఆకలి సూచికలో 116 దేశాల్లో 101వదిగా దిగజారిన స్ధితిలో ఉంది, ఈ సబ్సిడిని తగ్గిస్తే మరింతగా అన్నార్తులు పెరగరా ?) అందులో ఎక్కువ భాగం వినియోగదారులకే చెందుతోంది. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సేకరణ విధానాన్ని, ఆహార సబ్సిడీ కొనసాగించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఎంఎస్‌పి పెరిగినపుడు సబ్సిడీ కూడా పెరుగుతుంది, జారీ ధరలు స్ధిరంగా ఉంటాయి.దీనికి ప్రతి ఏటా 50వేల కోట్లను జత చేస్తే మూడులక్షల కోట్లవుతాయి. గోధుమ, బియ్యం కాకుండా చిరు,పప్పు ధాన్యాలు, ఖాద్యతైలాలను కూడా సేకరించి బహిరంగ మార్కెట్‌ వేదికలద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తారు.కనీస మద్దతు ధరలలో 40-45శాతం మేరకు నష్టం రావచ్చు.కనుక ఏ సేకరణ చేపట్టినా విలువలో సబ్సిడీ భారం 30శాతానికి తగ్గదు.

ఎంఎస్‌పికి హామీ ఇస్తే పరిమితంగా కొనుగోలు చేయాలి.పౌరపంపిణీ వ్యవస్ధతో సేకరణకు ఉన్న లంకె, వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మితే కష్టం, ఎంతో ఖర్చవుతుంది కనుక వాటి లంకెను విడగొట్టాల్సిన తరుణం వచ్చింది.కనీస మద్దతు ధరలేని పంటలను సాగు చేసేందుకు రైతులను ఒప్పించాలి, లేకపోతే వారు ఇతరులు కూడా ఎంఎస్‌పి పంటలను సాగు చేస్తారు. కొత్త సమస్యలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు పిఎం కిసాన్‌, ఎరువులు, ఇతర సబ్సిడీలతో పాటు ఆహార సబ్సిడీని రు.2,40,000 కోట్ల నుంచి మూడు లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచగలదా ?(వీటిని నష్టాలుగా పరిగణించి గుండెలుబాదుకుంటున్నవారు, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఇస్తున్న ఇతర అనేక రాయితీల గురించి ఏమి చెబుతారు ? వారి సంపదలను పెంచితే జనానికి వచ్చేదేమిటి ? తిండి కలిగితే కండకలదోయి-కండకలవాడేను మనిషోయి అన్న గురజాడను మరిస్తే ఎలా ? కార్మికులు ఆరోగ్యంగా ఉంటే అది వారికే కాదు దేశానికీ లాభమే.) తాజా దారిద్య్రసమాచారం ప్రకారం ఆహార భద్రత వర్తింపును నలభైశాతానికి కుదించటం, చౌకదుకాణాల ద్వారా విక్రయించే వాటి ధరలను పెంచగలదా ? రైతుల ఆదాయాన్ని పెంచే ప్రాధమిక బాధ్యను తీసుకొనే విధంగా రాష్ట్రాలకు ప్రమేయం కల్పించాల్సిన అవసరం లేదా ?( రాష్ట్రాలను సంప్రదించుకుండా సాగు చట్టాలను మార్చినపుడు నందకుమార్‌ లాంటి వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆ చర్చను ఎందుకు ముందుకు తెస్తున్నారు? )


నందకుమార్‌ లేదా జయప్రకాష్‌ నారాయణ లాంటి వారు చేస్తున్న వాదనలు ప్రపంచ వాణిజ్య సంస్ధకు అనుగుణ్యంగా ఉండటం ఆశ్చర్యం కలిగించదు. కనీస మద్దతు ధరలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా తదితర దేశాలు వేసిన కేసులు, వాదనల తీరు తెన్నుల గురించి మరో విశ్లేషణలో చూద్దాం. వాటికి అనుగుణ్యంగానే అమెరికా, ఐరోపా ధనిక దేశాలను సంతుష్టీకరించేందుకు, వాటి కార్పొరేట్లకు ద్వారాలు తెరిచేందుకు సంస్కరణలు-రైతుల పేరుతో హడావుడిగా నరేంద్రమోడీ సాగు చట్టాలను తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు కనీస మద్దతు ధరల మీద కమిటీ వేయగానే ఏదో జరిగిపోతుందనే భ్రమలకు లోను కానవసరం లేదు. ఆందోళనకు నాయకత్వం వహించిన ఎస్‌కెఎం ప్రతిపాదించిన వారిని మాత్రమే రైతు ప్రతినిధులుగా పరిగణించాలన్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించలేదు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు సంఘం, ప్రభుత్వ కనుసన్నలలో నడిచేవారిని రైతుల పేరుతో నియమించనున్నారన్నది స్పష్టం.అలాంటి వారితో కూడిన సుప్రీం కోర్టు కమిటీ రూపొందించిన నివేదికను నెలలు గడిచినా బహిర్గతం చేయలేదు, ఏముందో తెలియదు. బహుశా అది రైతులకు అనుకూలంగా లేనందున జనానికి అందుబాటులోకి రాకపోవచ్చు. ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉంది. ఎస్‌కెఎంతో వాగ్దాన-ఒప్పంద భగ్నానికి పాల్పడితే మరింత తీవ్ర రూపంలో ఉద్యమం తిరిగి ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు తమకు వ్యతిరేకమైన చర్యల మీద రైతాంగం ఉద్యమించింది. అందినట్లే అంది చేజారిన వ్యవసాయ మార్కెట్‌ను తిరిగి చేజిక్కించుకొనేందుకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్‌ శక్తులు కేంద్ర ప్రభుత్వం మీద రైతులకంటే తీవ్రంగా వత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. నరేంద్రమోడీ తమకు ఉపయోగపడే అవకాశాలు లేవనుకుంటే ఆ స్ధానంలో మరొకరిని రంగంలోకి తెచ్చినా లేదా తమ హిందూత్వ అజెండాకే ప్రమాదం ముంచుకువచ్చిందని సంఘపరివార్‌ భావించినా దాన్ని అమలు జరపగల సమర్ధుడిగా భావిస్తున్న నరేంద్రమోడీ మరో రూపాన్ని ప్రదర్శించినా ఆశ్చర్యం లేదు.


రైతులు డిమాండ్‌ చేస్తున్న అంశాలలో కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్నది ఒకటి. అదేమీ వారు కొత్తగా కోరిన గొంతెమ్మ కోరిక కాదు. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అంశాలలో ఒకటే. నెలవులు మారిన తరువాత పాతవాటిని మరచిపోయినట్లు నటించటం కొందరిలో చూస్తాము. కానీ మోడీ గారి విషయంలో అలా అనుకోలేము. అసలు కథవేరే ఉంది. అది బయటకు చెప్పలేరు-రైతులను మెప్పించలేరు, అందుకే అనేక మంది పాలకుల మాదిరే బలవంతంగా రుద్దేందుకు పూనుకొని మూడు సాగు చట్టాలను తెచ్చారు. అనుకున్నది ఒకటి-అయింది ఒకటి. చివరకు క్షమాపణలు చెప్పి మరీ వాటిని వెనక్కు తీసుకున్నారు. నిజానికి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించేందుకు కాబినెట్‌లో చర్చించి ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదం పొందటం క్షణంలో పని. జమ్ము- కాశ్మీరు రాష్ట్రం, ఆర్టికల్‌ 370ని ఒక్క రోజులో వేగంగా రద్దు చేయటంలో చూపిన సామర్ధ్యం జగమెరిగిందే. అలాంటిది కనీస మద్దతు ధరల చట్టం తేలేరా ?

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగాళాదుంప విత్తన హక్కు కేసులో పెప్సీకి ఎదురుదెబ్బ !

05 Sunday Dec 2021

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Farmers, patent for a potato, PepsiCo, potato


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


పెప్సీకంపెనీ ” లేస్‌ ” బంగాళాదుంప ”చిప్స్‌” రకంపై హక్కులను కోల్పోయింది. ప్లాంట్‌ వెరైటీస్‌ ప్రొటెక్షన్‌ అధారిటీ పెప్సీ రిజిస్ట్రేషన్‌ను డిసెంబర్‌ 3న రద్దుచేసింది. ఇది విత్తనంపై హక్కును నిలుపుకోవటంలో భారత రైతులు సాధించిన ఘనవిజయం. బంగాళాదుంప పంటలో ఉపయోగించే ఈ వంగడాలను 2009 లో భారత్‌ లోకి తీసుకువచ్చారు. రైతులకు అందించి బంగాళదుంపలను కొనేలా పెప్సీకో ఒప్పందాలు కుదుర్చుకున్నది, 2016 సం.ఫిబ్రవరి 2 న ఈ రకపు వంగడం పిపిఇవిఆర్‌-2001 చట్టం 64,65 సెక్షన్ల క్రింద అధికారికంగా పెప్సీ కంపెనీ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నది.” చిప్స్‌” కోసం ఉపయోగించే ప్రత్యేకమైన బంగాళాదుంప పై పూర్తి హక్కులు తమవేనని పెప్సీ కంపెనీ విర్రవీగుతున్నది. ”పెప్సీకో ఇండియా హౌల్డింగ్‌ యఫ్‌. యల్‌.2027 ” అని పిలవబడే బంగాళాదుంప రకాలను పేటెంట్‌ చట్టం క్రింద నమోదు చేసుకున్నాం కాబట్టి ఈ వంగడం పై పూర్తి హక్కులు తమ స్వంతం అని పెప్సీకో దబాయిస్తున్నది. తమ అనుమతి లేకుండా ఎవరూ ఆ రకాన్ని పండించటానికి వీలు లేదని పెప్సీ కంపెనీ అంటున్నది. ఈ ప్రత్యేక రకమైన బంగాళాదుంపలను ఉపయోగించి ” లేస్‌ ” అనే బ్రాండ్‌ పేరుతో ”చిప్స్‌” తయారుచేసి అమ్ముకుంటున్నది. . చిరుతిళ్ళు, కూల్‌ డ్రింకులు తయారుచేసే పెప్సీకో ఒక పెద్ద మల్టీనేషనల్‌ ఫుడ్‌ కంపెనీ, 200 దేశాలలోవ్యాపారాన్ని చేస్తున్నది. గతసంవత్సరం అమ్మి మన దేశాన్నుండి 4.52 లక్షల కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. దేశంలో 12 రాష్ట్రాలలో 24 వేల మంది రైతులకి బంగాళాదుంప విత్తనాలను ఇచ్చి తిరిగి బంగాళాదుంపలు కొనేటట్లుగా కాంట్రాక్ట్‌ వ్యవసాయం చేస్తున్నది. చట్టాల పేరున సాంప్రదాయక రైతు విత్తన హక్కు పై దాడి చేస్తున్నది. రైతు తన విత్తనాన్ని తనే తయారుచేసుకుని వాడుకోకుండా అడ్డుకుంటున్నది.

ఒక్కొక్క రైతు నుండి ఒక కోటి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారాన్నిడిమాండ్‌ చేసిన పెప్సీ

రెండు సంవత్సరాల క్రితం గుజరాత్‌ లో నలుగురు రైతులపై 4.2 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టారు. 2018 ఏప్రియల్‌ 8 న అహ్మదాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు రైతులను విచారించకుండానే, వారి లాయర్‌ లేకుండానే కంపెనీకి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులనిచ్చింది. అయితే రైతులు, ప్రజాస్వామిక వాదులు రైతు విత్తన హక్కు కోసం నిలబడ్డారు. కోర్టు కేసులు రద్దు చేయాలని దేశ వ్యాపిత ఆందోళనలు చేశారు. గుంటూరు దగ్గర తుమ్మలపాలెంలోకూడా పెప్సీ కంపెనీ వద్ద రైతు సంఘాలన్నీ ఆందోళన చేశాయి. పెప్సీకంపెనీ చిరుతిళ్ళను, కూల్‌ డ్రింకులను బహిస్కరించాలని పిలుపునిచ్చారు. ఆనాడు ఎన్నికల ముందు దేశ వ్యాపిత ఆందోళనల ఫలితంగా కంపెనీ కేసులన్నీ వెనక్కి తీసుకున్నది.

పెప్సీ కంపెనీకి విత్తనం పై హక్కు

కానీ విత్తనం పై హక్కు నాదే అని పెప్సీ ఇప్పుడు కూడా అంటున్నది. తాత్కాలికంగా వెనక్కితగ్గానంటున్నది. చట్టం ప్రకారం రైతులకు విత్తనం తయారుచేసుకునే హక్కులేదని కంపెనీ వాదిస్తూనే వుంది. ఇందుకు ప్రతిగా కవిత కురుగంటి రైతుల విత్తన హక్కుకోసం పిటీషన్‌ వేశారు. రైతుల విత్తన హక్కు ను పెప్సీ కంపెనీ ఉల్లంఘిస్తున్నదని ,పిపిఇవిఆర్‌-2001 చట్టం ప్రకారం వారికిచ్చిన రిజిస్ట్రేషన్‌ చెల్లదని పిటీషన్‌ దాఖలుచేశారు. చట్టంలోని సెక్షన్‌ 64 ను పెప్సీ ఉపయోగించుకున్నది. రైతులు అదేచట్టం లోని సెక్షన్‌ 39(1) ను ఉదహరించారు. ఈ సెక్షన్‌ ప్రకారం వ్యవసాయానికి విత్తనాలను నాటటం, తిరిగి నాటటం, విత్తనాలను మార్చుకోవటం, పంచుకోవటం లేదా విక్రయించటానికి రైతులకు అవకాశంవున్నది. ఈ చట్టం అమలులోకి రాకముందులాగానే రైతులకు హక్కులన్నీ వుంటాయని కూడా సెక్షన్‌ 39 చెప్తున్నది. కాకపోతే రైతులు బ్రాండులతో విత్తనాలను అమ్మకూడదు. ఈ రక్షణ నిబంధనలు విత్తన రకాలపై పేటెంట్‌ ను అనుమతించటంలేదని , పెప్సీ యొక్క యఫ్‌ సీ 5 బంగాళదుంప రకానికి మంజూరు చేసిన మేధోరక్షణను రద్దు చేయాలని చేసిన వాదనను పిపిఇవి అధారిటీ అంగీకరించింది. రైతులకు విత్తనాలను తయారు చేసుకునే హక్కు ఉన్నదన్నారు. బ్రాండు లేని విత్తనాలను అమ్మకునే హక్కుకూడా రైతుకు వుందన్నారు.

పెప్సీ కంపెనీ దబాయింపులకు కోర్టు అడ్డుకొట్టింది. ఆ బంగాళాదుంప వంగడం పై హక్కులు పూర్తిగా పెప్సీకో కంపెనీవి కావని కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు పెప్సీకో పేరిట ఉన్న రిజిస్ట్రేషన్‌ హక్కులను రద్దుచేస్తూ మొక్కల రకాల పరిరక్షణ, రైతు హక్కుల పరిరక్షణ అధారిటీ , శుక్రవారం తీర్పుఇచ్చి సందిగ్దాన్ని తొలగించింది. రైతులను నిలవరించటం కుదరదన్నారు. గతంలో కంపెనీకి ఇచ్చిన పేటెంట్‌ హక్కుల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తమ పేరిట ఉన్నందున పూర్తి హక్కులు తమవేనని, ఇతర రైతులు ఎవరూ పండించటానికి వీలులేదని పెప్సీకంపెనీ వాదిస్తూవుంది

ఈ తీర్పువలన మన రైతులకు చారిత్రక విజయం లభించింది. ఏ కోర్పోరేట్‌ కంపెనీ ఐనా విత్తనం పై సంపూర్ణ హక్కును పొందే అవకాశం లేకుండా స్పష్టమైన తీర్పును, పీపీవీ యఫ్‌ఆర్‌ఏ ఛైర్‌ పర్సన్‌ శ్రీ కే వీ ప్రభు గారు ఇచ్చారు. రైతులోకం స్వాగతించవలసిన తీర్పును సాధించిన కవితా కురుగంటి అభినందనీయులు.
డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం, గుంటూరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముడి చమురు 15 డాలర్లు తగ్గింది – పైసా కూడా తగ్గని పెట్రోలు, చమురు ధర !

04 Saturday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures, sharp fall in global oil rates


ఎం కోటేశ్వరరావు


2021నవంబరు నాలుగవ తేదీ నుంచి డిసెంబరు నాలుగవ తేదీన ఇది రాస్తున్న సమయం వరకు దేశంలో ప్రభుత్వం (చమురు సంస్ధలు) పెట్రోలు,డీజిలు ధరలను పెంచలేదు. నెల రోజులైనా జేబులు కొల్లగొట్టనందుకు నరేంద్రమోడీ సర్కార్‌ను మెచ్చుకోవాలనే వారితో కాసేపు ఏకీభవిద్దాం. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ ముగిసేవరకు ఇదే స్ధితిని కొనసాగించినా ఆశ్చర్యం లేదు. ఆవిధంగా ముందుకు పోయి జనం మీద ప్రేమను పొంగి పొర్లించి మురికి గంగను చేర్చి ప్రక్షాళన జరిపించినా ముక్కు మీద వేలేసుకోవద్దు. ఇది తెరముందు మనకు కనిపిస్తున్నదృశ్యం. తెరవెనుక ఏం జరుగుతోందో ముందు చూద్దాం. ఇలా చెబుతున్నామంటే జోశ్యం కాదు. పాలకుల ఆచరణ ప్రాతిపదిక ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు రు.91.17, మరుసటి రోజు రు.90.99, 25 నుంచి 29వరకు పెట్రోలు రేటు రు.90.78, మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14వరకు రు.90.56, ఆ మరుసటి రోజు నుంచి మే మూడవ తేదీ వరకు రు.90.40. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదిన్‌లో జరిగింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి?


ఫిబ్రవరినెల 28 రోజుల్లో చమురు ధరలను 17 సార్లు సవరించారు. ఆ నెలలో ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్న రకం పీపా ధర నెల సగటు 61.22 డాలర్లుంది. మార్చి నెలలో 64.73 డాలర్లకు పెరిగింది. ఐనా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23వరకు ఒకే ధర రు.91.17, ఆ తరువాత ఇంకా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడిచమురు సగటు ధర 63.40 డాలర్లు. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో తగ్గిన మొత్తం 1.33 డాలర్లు, దాన్ని వినియోగదారులకు బదలాయించారు గనుక లీటరుకు 38 పైసలు తగ్గించారనుకుందాం ? మరి ఫిబ్రవరి-మార్చినెలల మధ్య పీపా ధరలో 3.51 డాలర్ల పెరుగుదల ఉంటే ధరలను స్ధిరంగా ఉంచటం ఎలా సాధ్యమైనట్లు ? ఇవి ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదినాలు కదా ! మోడీ మాయాజాలం అన్నది అంగీకరించాల్సిందే. బవిరి గడ్డాలను చూసి నీతి నిజాయితీలు ఉంటాయని నమ్మే రోజులు కావివి !


ఇక వచ్చే ఏడాది జరగనున్న మరో ఐదు రాష్ట్రాల అచ్చేదిన్‌ సంగతి చూద్దాం. ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది చొప్పున పన్నులు తగ్గించినట్లు ప్రకటించింది. సంతోషం. చాలా రాష్ట్రాలు నరేంద్రమోడీగారిని ఆదర్శంగా తీసుకొని గతంలో ఆ పెద్దమనిషి మాదిరి పన్నులు పెంచకపోయినా వాట్‌ను తగ్గించాయి. ఇంకా సంతోషం. ఆ తరువాత జరుగుతున్నదేమిటి ? అదే జనాలు తెలుసుకోవలసింది. అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 3వరకు 34రోజుల్లో చమురు ధరలను 28 సార్లు సవరించారు. ఆ నెలలో ముడిచమురు సగటు ధర 82.11 డాలర్లు, నవంబరు నెలలో అది 80.64డాలర్లకు తగ్గింది.దీపావళి ధమాకా పేరుతో కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన పన్నుల మేరకు తప్ప చమురు కంపెనీలు నెల రోజులుగా తమ ధరలను ఒక్క పైసా కూడా ఎందుకు తగ్గించలేదు ? వాటికి పన్నులతో సంబంధం లేదు కదా ? ముడిచమురు ధరలు పెరిగితే పెంచుతాం తగ్గితే దించుతాం అని చెప్పిన విధానం అక్టోబరులో పక్కాగా అమలు చేశారు, నవంబరులో ఏమైంది ? విశ్వగురువు నరేంద్రమోడీని అడిగేందుకు విలేకర్లకు అవకాశం ఇవ్వరు, ఆ పెద్దమనిషి నోరు విప్పరు ? అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది.


అక్టోబరు 25న గరిష్టంగా మన కొనుగోలు ధర పీపా 84.77 డాలర్లను తాకింది.నవంబరు 10న 84.07 డాలర్ల తరువాత క్రమంగా పడిపోతూ డిసెంబరు నాలుగున 69.52 డాలర్లకు తగ్గింది.మొత్తం మీద పదిహేను డాలర్లు తగ్గినా చమురు ధరలు పైసా తగ్గించలేదు. చంబల్‌ బందిపోట్లు ఆప్రాంత ధనికులను మాత్రమే దోచుకొనే వారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోలు కొనే సర్‌ గోచిపాత రాయుడి మొదలు అత్యంత పేదలైన అంబానీ, అదానీల వరకు అందరినీ సమంగా చూస్తోంది. చంబల్‌ దోపిడీ పెద్దదా ఇది పెద్దదా ? ప్రకటిత ధరల విధానం ఏమైంది ? ప్రభుత్వరంగ సంస్థలదే మార్కెట్‌లో ప్రధాన వాటా అయినా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత రిలయన్స్‌ బంకులు తిరిగి తెరుచుకున్నాయి.ప్రభుత్వ ధరలనే అవీ వసూలు చేస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గిన మేరకు అదేమీ తగ్గించలేదు. ప్రభుత్వ విధానం దానికి లాభాల పంట పండిస్తున్నపుడు వాటిలో కొంత మొత్తాన్ని ఎన్నికల బాండ్లు, ఇతర రూపాల్లో బిజెపికి అప్పగిస్తుంది గానీ జనాలకు ఎందుకు తగ్గిస్తుంది. ఓకే, రిలయన్స్‌ ప్రైవేటు కంపెనీ కనుక అలా చేస్తోంది అనుకుందాం, మరి ప్రభుత్వ కంపెనీలు ? మరో విధంగా, అదే ఓట్ల రూపంలో బిజెపికి లబ్ది కలిగించేందుకు చూస్తున్నాయి. ఎన్నికల తరుణంలో నెలల తరబడి ధరలను సవరించకుండా పాలక పార్టీకి సానుకూలతను సృష్టించేందుకు తమ వంతు చేస్తున్నాయి.


తమ పాలిత రాష్ట్రాల మాదిరి ఇతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాల్సిందే అని బిజెపి డిమాండ్‌ చేస్తోంది.రాష్ట్రాలను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ కారణంగా ఇప్పటికే రాష్ట్రాలు ఎక్సయిజు పన్ను వాటాను గణనీయంగా కోల్పోయాయి, వాటిలో మెజారిటీ బిజెపి పాలనలో ఉన్నవే. కేంద్రంలో అధికారం ఉంది కనుక ఆ మేరకు అవి వేరే రూపంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అలాంటి అవకాశం లేదు.2017లో పెట్రోలు మీద ఎక్సయిజు పన్ను లీటరుకు రు.9.48, డీజిలు మీద రు.11.33 ఉండగా 2021 ఫిబ్రవరిలో ఆ మొత్తాలను కేంద్రం రు.1.40-1.80కి తగ్గించింది. ఆ మేరకు, తరువాత అదనంగా సెస్‌లను విధించింది. వినియోగదారులకు ఎలాంటి మార్పు లేనందున వారికి ఈ మతలబు అర్దం కాలేదు. దీపావళి పేరుతో తగ్గించిన మేరకు రాష్ట్రాలకు వాట్‌ శాతం తగ్గి రాబడి తగ్గింది. అసలు భారీ మొత్తాల్లో సెస్‌లు పెంచిన కేంద్రాన్ని వదలి బిజెపి రాష్ట్రాల్లో రాజకీయం చేస్తోంది.


ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం పెట్రోలుపై వాట్‌ను 30నుంచి 19.4శాతానికి తగ్గించటంతో డిసెంబరు ఒకటిన రు.104.01గా ఉన్న రేటు నాలుగవ తేదీన రు.95.41కి తగ్గింది. డీజిలు మీద అంతకు ముందే వాట్‌ 16.75శాతం ఉన్నందున డీజిలు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఇప్పుడు డీజిలుపై కేంద్ర పన్నులు, సెస్‌ల మొత్తం రు.21.80కాగా రాష్ట్ర పన్ను రు.12.69 మాత్రమే. పెట్రోలు మీద కేంద్ర పన్ను రు.27.90 కాగా ఢిల్లీ రాష్ట్రపన్ను రు.15.60 మాత్రమే. కేంద్ర పన్నులు అన్ని చోట్లా ఒకే విధంగా ఉంటాయి. రాష్ట్రాలలో వాట్‌ రేట్లు భిన్నంగా ఉన్నందున వాటికి అనుగుణంగా మొత్తాలు మారతాయి.


బిజెపి నేతలు, వారికి వంతపాడే నోళ్లు అమ్ముకొనే వారు చేసే వాదనల గురించి తెలిసిందే. కేంద్రం విధించే పన్నుల్లో 41శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. కేంద్రం చేసే ఖర్చు కూడా రాష్ట్రాలలోనే కనుక రాష్ట్రాలకే ఎక్కువ దక్కుతోందని, అందువలన రాష్ట్రాలే పన్ను తగ్గించాలనే కుతర్కాన్ని ముందుకు తెస్తారు. ఇది జనాలను మోసం చేసే ప్రక్రియ. పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసర్చ్‌ సంస్ద వెల్లడించిన వివరాల మేరకు 2017 ఏప్రిల్‌లో పెట్రోలు మీద కేంద్రం విధించిన ఎక్సయిజు పన్ను (రాష్ట్రాలకు వాటా ఇచ్చేది) రు.9.48, సెస్‌,సర్‌ఛార్జీలు రు.12. కేంద్ర పన్నుల్లో వీటి శాతాలు 44-56, కాగా 2021ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.40 – 31.50గా ఉన్నాయి, శాతాలు 4-96 మారాయి. ఇదే డీజిలు సంగతి చూస్తే ఎక్సయిజు – సెస్‌,సర్‌ఛార్జీలు 2017 ఏప్రిల్‌లో రు.11.33- రు.6 శాతాల వారీ 65-35గా ఉన్నాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.80- రు.30 కాగా శాతాలు 6-94కు మారాయి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన వాటాకు మోడీ సర్కార్‌ ఎలా కోత పెట్టిందో స్పష్టం. కేంద్రం పన్నుల పేరుతో వసూలు చేసిన మొత్తాలు 2014 తరువాత గణనీయంగా పెరిగాయి.2019-20లో ఆ మొత్తాలు రు.2.38లక్షల కోట్లుండగా 2020-21కి అవి 3.84లక్షల కోట్లకు పెరిగాయి.2020 మేనెలలో పెట్రోలు మీద పది, డీజిలు మీద రు. 13 చొప్పున భారం మోపటమే దీనికి కారణం. ఇదే కాలంలో రాష్ట్రాలకు వచ్చే వాటా మొత్తం తగ్గింది.


వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఐదు, పది రూపాయల మేరకు భారం తగ్గించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గాయి. ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో తీసుకుంటున్నట్లుగా ముడి చమురు ధరలు తగ్గిన మేరకు జనాలకు తగ్గించకుండా కేంద్రం ధరల రూపంలో దండుకుంటోంది. వచ్చే రోజుల్లో రెండు మూడు పరిణామాలు జరగవచ్చు. ఒకటి ముడి చమురు ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి. ఇంకా తగ్గినా గత నెల రోజుల మాదిరి ధరలను తగ్గించకపోవచ్చు.పెరిగితే ఇప్పుడు వచ్చిన లాభాలు కంపెనీల వద్ద ఉంటాయి గనుక ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు ఇదే ధరలను కొనసాగించవచ్చు. మొత్తంగా నవంబరు-ఏప్రిల్‌ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఎక్కువ ఉందనుకోండి, ఎన్నికలు ముగిసిన తరువాత ఆమేరకు అసలు ఫాయిదాలను వడ్డీతో సహా వసూలు చేసినట్లు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. మొత్తం మీద రాజకీయ-వాణిజ్య లాభనష్టాలను చూసుకుంటే ధరలను అదుపులో ఉంచితే కొందరినైనా మోసపుచ్చితే పాలకపార్టీకి ఎంతో కొంత రాజకీయ లబ్ది కలుగుతుంది. కంపెనీలకు వచ్చే ఆర్ధిక నష్టం ఏమీ ఉండదు. జనాల జేబు గుల్ల మామూలుగానే ఉంటుంది. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల ఒక కారణం మాత్రమే. అది ఒక్క చమురు ధరల మీదనే ఆధారపడి ఉండదు. అందువలన వాటిని నియంత్రించి జనాలను మాయ చేయ చూసినా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు ఇతర కారణాలతో బిజెపికి ఎదురు దెబ్బలు తగలవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d