• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

బ్రిటన్‌పై ఐరోపా ధనిక దేశాల ఆగ్రహం

26 Sunday Jun 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

brexit, EU, European Union, Europeans angry

ఎం కోటేశ్వరరావు

    కొన్ని గంటల్లోనే ఎంత తేడా !’విడాకులివ్వాలని నిర్ణయించుకున్న తరువాత రోషం, పౌరుషం వున్నవాళ్లెవరైనా వెంటనే ఇల్లు వదలి వెళ్లి పోవాలి.ఇక్కడే వుండి మరో నాలుగు నెలల తరువాత నోటీసు పంపుతాను అనటం ఏమిటి? మనం ఏమైనా పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకుంటున్నామా లేక మన మధ్య సన్నిహితమైన ప్రేమ ఏడిచింది గనుకనా ? వెంటనే పరిష్కారం చేసుకోవాలి. ‘ ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని బ్రిటన్‌ నిర్ణయించుకున్నట్లు ఓటింగ్‌ వివరాలు ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే యూనియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు పెరీ మాస్కోవిసీ అన్న మాటల సారాంశమిది. విడిపోవాలనుకున్న తరువాత కొత్త పితలాటకాలు పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వెళ్లి పోతే మంచిది అని ఫ్రెంచ్‌ విదేశాంగ మంత్రి జీన్‌ మార్క్‌ రాల్ట్‌ తో సహా అనేక మంది ఐరోపాయూనియన్‌ విదేశాంగ మంత్రులు బ్రిటన్‌కు సూచించారు. రాజీనామా ప్రకటించిన ప్రధాని కామెరాన్‌ వెంటనే వైదొలిగితే మంచిది, వైదొలగే ప్రక్రియను సాగదీయ కుండా నిబంధనావళిలోని ఆర్టికల్‌ 50 అమలును వెంటనే కోరాలని, మిగిలిన వారు పీఠముడి పడిన పరిస్థితిలో వుండకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి బ్రిటన్‌కు సలహా ఇచ్చారు. వెళ్లిపోతామని ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఎక్కువ కాలం కొనసాగటం బ్రిటన్‌కు మర్యాద కాదు అని కూడా ఫ్రెంచి మంత్రి వ్యాఖ్యానించాడు. అక్టోబరులో తన వారసుడు వచ్చే వరకు వెళ్లి పోయే చర్చలను ప్రారంభించే అవకాశం లేదని కామెరాన్‌ ప్రకటించిన నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. నాలుగు నెలల పాటు ఎలుకా-పిల్లి మాదిరి వ్యవహరించటం మంచిది కాదని లక్సెంబర్గ్‌ మంత్రి, మేం తరువాత పేజీ తిప్పి ముందుకు పోవాలని నెదర్లాండ్స్‌ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రారంభం నుంచి ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ ధోరణి వేరుగానే వుంది. పీడా విరగడైంది, ఒక తలనొప్పి పోయిందనే భావం మంత్రుల వ్యాఖ్యలలో వెల్లడైంది.

    అయితే తిరిగి ఓటింగ్‌ జరిపి మరోసారి అభిప్రాయం తీసుకోవాలంటూ బ్రిటన్‌లో లక్షల మంది పార్లమెంట్‌కు వినతి పత్రంపై సంతకాలు చేశారు. ఐరోపా యూనియన్‌ విదేశాంగ మంత్రులు కుర్రకారు మాదిరి బ్రిటన్‌లేని ఐరోపా యూనియన్‌ గురించి చర్చించాలంటూ విరుచుకుపడితే పెద్దమనిషి మాదిరి జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కుర్రాళ్లూ తొందర పాటు వద్దంటూ బ్రిటన్‌తో సంబంధాలు తెగకుండా దౌత్యానికి తెరతీశారు. విడిపోయిన తరువాత కూడా బ్రిటన్‌ను సహ సభ్యురాలిగా పరిగణించాలనే ప్రతిపాదన జర్మనీ నుంచి వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. ఫ్రెంచి నేతలు బ్రిటన్‌పై కాలుదువ్వుతున్న నేపధ్యంలో తాము బ్రిటన్‌కు వ్యతిరేకం కాదన్న సందేశం ఈ రూపంలో జర్మనీ పంపిందా అంటే కాదని చెప్పలేము. మొత్తానికి ఐరోపా యూనియన్‌లోని సభ్య దేశాల మధ్య విబేధాల వెల్లడికి, బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల జనం అసంతృప్తికి ఈ పరిణామాలు అద్దం పట్టాయి. బ్రిటన్‌లో అధికార, ప్రతిపక్షాలు రెండింటిలో ఈ పరిణామం ప్రకంపనలు సృష్టిస్తే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఒక్కసారిగా వులిక్కిపడింది. మరో తీవ్ర సంక్షోభానికి ఈ పరిణామం నాంది పలికిందా అని భయపడుతున్నది. ఓటింగ్‌ ఫలితాలు వెల్లడి అయిన తరువాత బ్రిటన్‌ సాధారణ ప్రజానీకానికి అంతకు ముందు మాదిరే మరో రోజు గడిచిందన్న వార్తలు వచ్చాయి.

   రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికార వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు అగ్రదేశంగా వున్న బ్రిటన్‌ తన వలసలను, మార్కెట్లను, పూర్వ ప్రాభవాన్ని కోల్పోయింది.మాజీ రాజు,జమిందారుల మాదిరి పూర్వీకులు సమకూర్చిన అడ్డగోలు సంపాదన మిగిలింది కనుక బెట్టు చేసే మాదిరి దాని పరిస్థితి. రెండు ప్రపంచ యుద్ధాలలో ఏ మాత్రం దెబ్బతినపోగా అటూ ఇటూ ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకున్న అమెరికా పెట్టుబడిదారీ దేశాలలో అగ్రగామిగా ముందుకు వచ్చి ద్విముఖ వ్యూహం అనుసరించింది. సోవియట్‌ నాయకత్వంలో ముందుకు వచ్చిన సోషలిస్టు కూటమి దేశాలను దెబ్బకొట్టటం, పెట్టుబడిదారీ కూటమిలోని ఐరోపాలోని సామ్రాజ్యవాద దేశాలు తిరిగి తనకు పోటీగా తయారు కాకుండా చూసుకొనేందుకు నాటో సైనిక కూటమిని రుద్ది వాటి జుట్టుపట్టుకు కూర్చోవటం. ఐరోపా పునరుద్దరణ పేరుతో మార్కెట్లను తనఅదుపులోకి తెచ్చుకోవటం, ఆసియాలో మరో సామ్రాజ్యవాద దేశమైన జపాన్‌ను తన రక్షణ ఒప్పందంతో కట్టిపడవేయటం వంటి ఎత్తుగడలకు తెరతీసింది. గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుసు అన్నట్లుగా అమెరికా దురాలోచన పసిగట్టిన ఐరోపా దేశాలు యుద్ధం ముగిసిన వెంటనే తమలో తాము సహకరించుకొనేందుకు గల అవకాశాలను వెతకటం ప్రారంభించాయి. యుద్ధంలో ఓడిపోయిన కారణంగా మిలిటరీలు రద్దయిన జర్మనీ, జపాన్‌ మిలిటరీకి ఖర్చు లేదు కనుక ఆ సొమ్మును పరిశోధన, అభివృద్ధికి కేటాయించి అచిర కాలంలోనే తిరిగి పట్టాలెక్కాయి. మార్కెట్లు, వలసలను కోల్పోయిన ఐరోపా దేశాలు దెబ్బలు తగిలిన వారందరూ ఒక చోట చేరి ఒకరి గాయానికి మరొకరు మందు రాసినట్లుగా తమలో తాము సహకరించుకొనే ప్రక్రియ 1948లోనే ప్రారంభమైంది. ఆక్రమంలో అంటీ ముట్టనట్లుగా వుండి పాతిక సంవత్సరాల తరువాత 1973లో బ్రిటన్‌ ఐరోపా ఆర్ధిక యూనియన్‌లో చేరింది.

    1948లో హేగ్‌లో జరిగిన ఐరోపా సదస్సుకు ఆ ఖండం నుంచి ప్రతినిధులతో పాటు అమెరికా, కెనడాల నుంచి పరిశీలకులు హాజరయ్యారు. ఐరోపాలో రాజకీయ, ఆర్ధిక సహకారానికి ల అవకాశాలను పరిశీలించేందుకు ఆ సదస్సు తీర్మానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిన, గెలిచిన దేశాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్న పూర్వరంగంలో ఈ ఆలోచన వచ్చింది. 1952లో ఐరోపా బొగ్గు, వుక్కు సమాజం ఏర్పాటుతో ప్రారంభమై నేటి ఐరోపా ఆర్ధిక యూనియన్‌గా పెరిగి పెద్దదై 1992లో మాస్ట్రిచ్‌ ఒప్పందంతో నేటి ఐరోపా యూనియన్‌ ప్రారంభమైంది.అది ఏర్పడిన మరో పాతిక సంవత్సరాలకు బ్రిటన్‌ దాని నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ప్రస్తుత యూనియన్‌కు జర్మనీ ఇంజను వంటిదైతే మిగతా సభ్యదేశాలు మోటారు వాహనంలోని ఇతర భాగాల వంటివి.తన పెత్తనం లేని యూనియన్‌లో బ్రిటన్‌ ప్రారంభం నుంచి ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగానే వ్యవహరించింది. బహుశా ఈ కారణంగానే ఫ్రెంచి మంత్రి అలాంటి వ్యాఖ్య చేసి వుండవచ్చు. జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్‌, ఇటలీ, లక్బెంబర్గ్‌ దేశాల మంత్రులతో సమావేశమైన తరువాత ద్రవ్య, రాజకీయ పరమైన పర్యవసానాలు సంభవించే అవకాశం వున్నందున సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోయే ప్రక్రియను ప్రారంభించాల్సి వుందన్నారు.

     వివాహం అంటే అనుకున్నతరువాత ఆగలేని వారు చివరికి ఆంజనేయ స్వామి గుడిలో అయినా 24 గంటల లోపే చేసుకోవచ్చు. కానీ విడాకులు అలా కాదు. చట్ట ప్రకారమే కనీస వ్యవధి, పెద్ద తతంగం వుంటుంది. అలాగే ఐరోపా యూనియన్‌ నుంచి ఏ సభ్య దేశమైనా విడిపోవాలన్నా అన్నీ సక్రమంగా జరిగితే అనే షరతుకు లోబడి లావాదేవీల పరిష్కారానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. అవసరమనుకుంటే ఆ వ్యవధిని ఇంకా పొడిగించుకోవచ్చు. లేదూ ఏదో తొందర పడి విడిపోవాలనుకున్నాం, ఇంకా నోటీసు ఇవ్వలేదు కనుక కొనసాగే అవకాశం ఇవ్వాలని అని బ్రిటన్‌ కోరుతుందా ? ఇంతవరకు ఏ దేశమూ అలా అడిగిన దాఖలా లేదు కనుక అటువంటి పరిస్థితే వస్తే ఏం చేస్తారో చూడాల్సి వుంది. విడిపోవాలి, కలసి వుండాలి అని ఓటు చేసిన వారి మధ్య తేడా కొన్ని లక్షలు మాత్రమే.ఫలితాలు వెల్లడైన తరువాత అనేక మంది తాము ఆలోచించకుండానే ఓట్లు వేశామని గగ్గోలు పెడుతున్నారు. ఐదు ప్రాంతాలలో ఇంగ్లండ్‌, వేల్స్‌లో మెజారిటీ విడిపోవటానికి ఓటు వేయగా లండన్‌, స్కాట్లండ్‌, వుత్తర ఐర్లండ్‌ ప్రాంతాల వారు అత్యధికులు కలసి వుండటానికి మొగ్గు చూపారు.అయితే మొత్తం జనాభాలో ఇంగ్లండ్‌లోనే 53శాతం వున్నందున అక్కడి వారు స్వల్ప మెజారిటీతో విడిపోవటానికి మొగ్గు చూపినా మొత్తం ఫలితాన్ని వారే నిర్ణయించారు. విడిపోవాలనే నిర్ణయ పర్యవసానాల గురించి గగ్గోలు పెడుతున్న జనం తిరిగి ఓటింగ్‌ జరపాలని ప్రభుత్వానికి విన్న వించుకున్నారు. రాజ్యాంగం ప్రకారం లక్ష మంది ఏదైన ఒక పిటీషన్‌పై సంతకం చేస్తే దానిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి. అలాంటిది పిటీషన్‌పై సంతకాలు ప్రారంభమైన కొన్ని గంటలలోనే పన్నెండు లక్షల మంది సంతకాలు చేయటానికి ఒకేసారి పూనుకోవటంతో అధికారిక వెబ్‌సైట్‌ కుప్పకూలింది.

   బ్రిటన్‌ సామాన్య జనం ఎటువైపు మొగ్గారు ?ప్రాధమిక విశ్లేషణలను బట్టి అక్కడి వెనుక బడిన ప్రాంతాల జనం ఎక్కువ మంది విడిపోవటానికి ఓటు వేశారు. పరిశ్రమలు మూతపడటం తప్ప తెరవని, కొత్త పెట్టుబడులను నోచుకోని ప్రాంతాలు, ఐరోపా యూనియన్‌ నిబంధనల పేరుతో అమలు జరుపుతున్న పొదుపు చర్యలకు ఎక్కువగా ప్రభావితులైన వారు, ఇక్కడ వున్నవారే దారిద్రరేఖకు దిగువకు దిగిపోతుంటే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చేవారిని అనుమతిస్తారా అంటూ అసంతృప్తికి గురైన వారు ఇలా ఏదో ఒక కారణంతో ప్రతికూల పర్యవసానాలకు ప్రభావితులైన వారందరూ విడిపోవటానికే మొగ్గు చూపారు. దీని పర్యవసానాల గురించి అనేక వ్యాఖ్యానాలు పరస్పర విరుద్దంగా వెలువడుతున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం మాదిరి అనిపించినప్పటికీ సంక్షిప్తంగా ఎలా వున్నాయో చూద్దాం.

   విడిపోయేందుకు మొగ్గు చూపారనగానే ప్రపంచ వ్యాపితంగా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. తరువాత స్వల్పంగా కోలుకున్నప్పటికీ వెంటనే అనిశ్చితి తొలగలేదు. తక్షణమే అతిగా స్పందించినట్లు కొందరు భావించారు. ఐరోపా చీకట్లోకి పోనుంది, ఐరోపా నాయకులు అసలు సమస్యలపై దృష్టి సారించకపోతే 1933 నాటి ఆర్ధిక సంక్షోభానికి దారి తీయవచ్చు. ఐరోపా తిరిగి అభివృద్ధి బాట పడుతుంది. ఐదు సంవత్సరాలలో బ్రిటన్‌ సమాఖ్యగా వుండజాలదు. స్కాట్లండ్‌ స్వతంత్ర దేశంగా మారి ఐరోపా యూనియన్‌లో చేరుతుంది. ఐర్లండ్‌లో వుత్తర ఐర్లండ్‌ విలీనం అవుతుంది. బ్రిటన్‌ తిరిగి పూర్వ వైభవం పొందుతుంది. అనేక దేశాలు ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోతాయి. అమెరికా-బ్రిటన్‌ మధ్య ప్రత్యేక అనుబంధం మరింత గట్టి పడవచ్చు, అమెరికా సాయంతో తన పలుకుబడి పెంచుకొనేందుకు బ్రిటన్‌ ప్రయత్నిస్తుంది. నాటోను సాధనంగా చేసుకుంటుంది. అమెరికా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకుంటుంది. బ్రిటన్‌ రానున్న ఐదు నెలల కాలంలో మాంద్యంలోకి జారిపోతుంది. అనేక దేశాలను అది ప్రభావితం చేస్తుంది. ఐరోపా అంతటా ప్రజాకర్షక నినాదాల పార్టీలకు ఆదరణ పెరుగుతుంది. జర్మనీ మరింత పలుకుబడి కలిగిన దేశంగా మారుతుంది. మిగతా దేశాలు కూడా పలుకుబడి పెంచుకొనేందుకు ప్రయత్నిస్తాయి.ఐరోపా యూనియన్‌ పెత్తనాన్ని తగ్గించేందుకు పూనుకుంటాయి. ఐదు సంవత్సరాలలో ఐరోపా ప్రపంచ శక్తి స్ధానాన్ని కోల్పోతుంది. ఐరోపా ఐక్యత దెబ్బతిని రష్యా పలుకుబడి పెరగవచ్చు. పుతిన్‌ మరింత బలపడతారు .ఈ పరిణామం అమెరికా నాయకత్వంలోని నాటోను మరింత పటిష్ట పరచవచ్చు. ఐరోపా యూనియన్‌ మరిన్ని రక్షణ చర్యలను తీసుకోవచ్చు. జనం పొదుపు చర్యలను తగ్గించమని డిమాండ్‌ చేస్తారు. స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీ వామపక్షం వైపు వెళ్ల వచ్చు. డాలరు బలపడి, వాణిజ్యలోటు, జాతీయ వాదాలు పెరగవచ్చు.

    బ్రిటన్‌ నిర్ణయ ప్రభావం భారత్‌పై ఎలా పడుతుందనేది కూడా మిశ్రమ స్పందనగా వుంది. దీని గురించి రానున్న రోజుల్లో మరింత స్పష్టత రావచ్చు. సోమవారం నాడు జరిగే ఐరోపా యూనియన్‌ సమావేశం తరువాత అనేక అంశాలపై మరింత వివరణ, విశ్లేషణలు వెలువడతాయి. ఇప్పుడు చేసే వన్నీ కూడా అయితే గియితే అన్న అంచనాలపైనే వుంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా-భారత్‌ సంస్కరణలకు తేడా ఏమిటి ?

25 Saturday Jun 2016

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

China, economic reforms, FDI, INDIA, subsidies

ఎం కోటేశ్వరరావు

      ఎదుటి వారి ప్రతికూలతలను తమ అనుకూలతలుగా మార్చుకోవటం లాభార్జనా పరుల నిరంతర ప్రయత్నం. జౌళి రంగంలో అటువంటి అవకాశాలనే తమ లాభాలకు వినియోగించుకోవాలని స్వదేశీ, విదేశీ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు తహతహలాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న లేదా ప్రచారం చేస్తున్నదాని ప్రకారం రానున్న మూడు సంవత్సరాలలో జౌళి రంగంలో 11 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే ఆ రంగంలో మన ఎగుమతులు 30 బిలియన్‌ డాలర్లు పెరుగుతాయి. కోటి మందికి ప్రత్యక్ష, పరోక్ష వుపాధి లభిస్తుంది. దీని కోసం ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవ్వటానికి, ఇంకా కొన్నివేల కోట్ల పన్ను, ఇతర పరోక్ష రాయితీలు ఇవ్వటానికి కొత్త ప్రోత్సాహక పధకాన్ని ప్రకటించింది. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఇంత తక్కువ ఖర్చుతో అంత పెద్ద మొత్తం ప్రయోజనం కలుగుతుందంటే ఎవరు కాదంటారు? ఈ రంగంలో ఇప్పటికే మన కంటే ఎంతో ముందున్న బంగ్లాదేశ్‌ వంటి దేశాలు ఎంత పేదవైనా వాటి మార్కెట్‌ను నిలబెట్టుకోవటానికి ఇంతకంటే ఎక్కువ రాయితీలు ఇవ్వలేవా అన్నది అర్ధంగాని ప్రశ్న.

      మన ఆత్రాన్ని సొమ్ము చేసుకొనేందుకు, వూరించి ముందుకు దూకించేవారు ఎప్పుడూ వుంటారు. మన కేంద్ర ప్రభుత్వం రానున్ను మూడు సంవత్సరాలలో 17 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను 40 దాటిస్తామని చెబుతుంటే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా మూడేండ్లలో 40 ఏమిటి పది సంవత్సరాలలో 150 బిలియన్‌ డాలర్ల సత్తా మీకు వుందని మన సిఐఐ(కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) నియమించిన అమెరికా సంస్ధ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బిసిజి) ఒక నివేదిక ఇచ్చింది.దాని ప్రకారం 2025 నాటికి భారత జౌళిరంగం 300 బిలియన్‌ డాలర్ల విలువకు చేరుతుందని, 150 బిలియన్‌ డాలర్ల విదేశీమారక ద్రవ్య ఆర్జనతో పాటు ఐదు కోట్ల మందికి అదనంగా వుపాధి కల్పించవచ్చని, వారిలో మూడున్నర నుంచి నాలుగు కోట్ల మంది మహిళలు వుంటారని లెక్కలు చెప్పింది. దీనికి గాను అది చెప్పిన ఆధారాలు ఏమిటంటే చైనా యువాను విలువతో పాటు అక్కడ వేతనాలు పెరుగుతున్నాయి కనుక పరిశ్రమలు అక్కడి నుంచి తరలి పోతున్నాయి, అందువలన చైనాతో పాటు అలాంటి ఇతర దేశాల వాటిని భారత్‌ ఆకర్షిస్తే 280 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతుల మార్కెట్‌ను పట్టుకోవచ్చని ఆ నివేదిక మన ముందు ఒక రంగుల కలను సాక్షాత్కరింప చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌, వియత్నాం దేశాలు ముందు పీఠీన వున్నప్పటికీ, ఆఫ్రికాలో ఇథియోపియా వంటి కొత్త కేంద్రాలు వునికిలోకి వస్తున్నప్పటికీ,అమెరికాలో తిరిగి పెద్ద ఎత్తున వుత్పత్తి జరిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ భారత్‌కు ఈ అవకాశాలు వుంటాయని బిసిజి నమ్మబలికింది.

   మన జనానికి వుపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందే. అందుకు తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ ప్రజల, దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి చేయాలా అన్నదే సమస్య.స్వాతంత్య్రానికి ముందు బ్రిటన్‌ తన గ్లాస్గో (పాత తరం వారికి గ్లాస్గో పంచెలు ఇప్పటికీ గుర్తు వుంటాయి) తదితర నగరాలలో వున్న వస్త్ర కర్మాగారాల కోసం మన దేశాన్ని పత్తి సరఫరా చేసే దేశంగానూ, అక్కడ తయారైన వుత్పత్తులను విక్రయించే మార్కెట్‌గానూ మార్చిందన్నది తెలిసిందే. అప్పుడు దాని వుత్పత్తులకు ప్రపంచంలోని వలస దేశాలన్నింటినీ మార్కెట్‌లుగా మార్చి తన పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చింది. ఇప్పుడు కూడా బ్రిటన్‌ తన కర్మాగారాలకు అవసరమైన పత్తిని ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు. కానీ ఆ పని చేయదు. ఎందుకంటే అలా దిగుమతి చేసుకొని తన కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇచ్చి వుత్పత్తి చేయిస్తే అక్కడి కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు ఎలా వుంటాయి. అందువలన ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చౌకగా శ్రమశక్తి దొరుకుతుందో అక్కడే తనకు కావాల్సిన దుస్తులను తయారు చేయించుకుంటే అదే లాభసాటిగా వుంటోంది కనుక ఏకంగా తన ఫ్యాక్టరీలను ఆయా దేశాలకు తరలించటం లేదా కొత్త ఫ్యాక్టరీలను పెట్టి తయారు చేయిస్తున్నది.ఇదేదో బ్రిటన్‌ ఒక్కటే చేస్తున్నది కాదు, అన్ని ధనిక దేశాలదీ ఇదే బాట. నీరు పల్లంవైపు, పెట్టుబడిదారుడు లాభాలవైపు పయనిస్తాడు. గతంలో దేశాలను అక్రమించుకుంటే లాభాలు, ఇప్పుడు శ్రమశక్తితో తమకు కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకుంటే, ఇతర దేశాల దగ్గర లేని ఆధునిక పరిజ్ఞానంతో తన దగ్గర తయారయ్యే వస్తువులకు మార్కెట్లను పట్టుకుంటే సిరులు, అందుకే పద్దతులను మార్చారు.

    అమెరికా వాణిజ్యవేత్తలు, బంగ్లాదేశ్‌, వియత్నాం, చైనాల నుంచి దుస్తులు, బొమ్మలు, ఇతర సామగ్రిని దిగుమతి చేసుకొని, తమ వద్ద పాతబడిపోయిన అణు కర్మాగారాలు, మిలిటరీ ఆయుధాలను మన వంటి దేశాలకు అంట గట్టి లాభాలు పొందుతున్నారు. ఇవేవీ లేకపోతే పెట్టుబడి పెట్టనవసరం లేదు, ఫ్యాక్టరీ కట్టనవసరం లేదు, వ్యాపార దుకాణాలూ తెరవనవసరం లేదు. లాభాల బాటలో వున్న మన వంటి దేశాల కంపెనీల వాటాలను వుదయం కొనుగోలు చేసి సాయంత్రానికి వాటి విలువ పెరిగితే అమ్ముకొనీ లబ్ది పొందుతున్నారు. ఈ పని చేయటానికి సూట్‌ కేసులతో మన ముంబయ్‌ రానవసరం లేదు, సినిమాలలో చూపినట్లు ఏ విలాస కేంద్రంలోనో మందు, మగువలతో కూర్చొని ఇంటర్నెట్‌తో మీటలు నొక్కితే చాలు.

    భారత్‌ను చైనాతో పోల్చితే కొంత మందికి తేళ్లూ జెర్రులు పాకినట్లుంటాయి. అది నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం దానికీ దీనికీ పోలికా అని రంకెలు వేస్తారు. చైనా మాదిరి సంస్కరణలను మన దేశంలో సంస్కరణలు అమలు జరిపితే వ్యతిరేకిస్తారు అని కమ్యూనిస్టుల మీద నిందలు వేసేటపుడు మాత్రం వారికి అప్పుడు చైనా కావాలి. కానీ వారే మరో సందర్భంలో త్వరలో మన దేశం చైనాను అధిగమించబోతోందని లొట్టలు వేసుకుంటూ చెబుతూ తమ జబ్బలను తామే చరుచుకొని శభాష్‌ అని చెప్పుకుంటారు.అంతెందుకు కమ్యూనిస్టులను వ్యతిరేకించే మన వ్యాపారులు గత కొద్ది సంవత్సరాలుగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతోనే వ్యాపారాలు చేసి లాభాలు పోగు చేసుకోవటం లేదా? వారికి అక్కడి కమ్యూనిజం అడ్డం రావటం లేదేం? ఇది అన్యాయం కదా !

    ‘ఆసియా బ్రీఫింగ్‌’ అనే ఒక పత్రిక వుంది. అదేమీ కమ్యూనిస్టు, వామపక్ష పత్రిక కాదు. పెట్టుబడిదారుల సేవలో వుంటుంది. మూడు సంవత్సరాల క్రితం ఒక విశ్లేషణలో రెండు దేశాలలో వున్న కనీస వేతనాల గురించి ఒక పోలికను ఇచ్చింది.http://www.asiabriefing.com/news/2013/07/comparison-minimum-wages-in-china-and-india/ దానిలో రెండు దేశాలలోని కొన్ని ప్రధాన నగరాలలో కనీస వేతనాలు ఎలా వున్నాయో తెలిపింది. వాటిని దిగువ చూడవచ్చు.2013 జూలై 18న ప్రచురించిన ఆ వ్యాసంలో నాడు డాలరు విలువ రు.59.42గానూ, యువాన్లు 6.14గానూ వున్నాయి.

పట్టణం              నెలవేతనం స్ధానిక కరెన్సీ          అమెరికా డాలర్లలో

ఢిల్లీ                        6,448                                110

హైదరాబాదు              4,940                                  83

ముంబై                    4,940                                  83

జైపూర్‌                     4,030                                 68

అహమ్మదాబాదు         3,900                                 65

చెన్నయ్‌                  3,041                                51

షాంఘై                    1,620                                264

గ్వాంగ్‌జు                  1,550                                253

హాంగ్‌జౌ                   1,470                                240

టియాన్‌జిన్‌               1,500                                245

బీజింగ్‌                     1,400                                228

దలియన్‌                   1,300                               212

     కనీస వేతనాలపై కార్మికుల సంక్షేమ చర్యలకు గాను యజమానులు అదనంగా సగటున 30 నుంచి 50శాతం వరకు చెల్లించాలని, అదే భారత్‌లో గరిష్టంగా పదిశాతానికి మించి లేదని కూడా ఆ పత్రిక విశ్లేషణ పేర్కొన్నది. చైనాలో కనీస వేతనాలు, సంక్షేమ చర్యలకు యాజమాన్యాలు చెల్లించాల్సిన మొత్తాలు ఏటికేడు పెరుగుతున్నాయి తప్ప ఏదో ఒకసాకుతో కోత పెట్టటం లేదు. అందుకనే విదేశీ ప్రయివేటు యజమానులు చైనాలో తమకు గిట్టుబాటు కావటం లేదని సణగటం మొదలు పెట్టటమే కాదు, ఎక్కువ లాభాలు వచ్చే ప్రాంతాలకు వలసపోవటం ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ ఆదేశాలను అమలు జరపకపోయినా లేక కోత పెట్టినా అక్కడ కార్మికులు ప్రతిఘటించటమే కాదు, అవసరమైతే సమ్మెలకు కూడా దిగుతున్నారు. కనీస వేతనాల పోలిక చేసిన ఆసియా బ్రీఫింగ్‌ పత్రిక కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే పరిశ్రమల కార్యకలాపాల ప్రారంభానికి భారత్‌ కీలకం అని మూడు సంవత్సరాల నాడే తన వ్యాఖ్యలో పేర్కొన్నది. అంటే ఘనత వహించిన నరేంద్రమోడీ అధికారానికి రాక ముందే అని వేరే చెప్పనవసరం లేదు.ఎఫ్‌డిఐలు ఎక్కడ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయో ప్రపంచ పెట్టుబడిదారులకు సలహాలు ఇచ్చేందుకు 1992లో ఏర్పాటయిన డిజాన్‌ షిరా అండ్‌ అసోసియేట్స్‌ స్థాపకుడు క్రిస్‌ డేవన్‌ షైర్‌ విల్స్‌ రాసిన వ్యాసంలో పై వివరాలు పేర్కొన్నారు.

    కార్మికులకే కాదు, రైతాంగానికి మద్దతు ధరలు ఇవ్వటంలోనూ, సగటు దిగుబడులను పెంచే వంగడాలు, ఇతర పెట్టుబడులను సమకూర్చటంలోనూ అక్కడి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటున్నది. పత్తికి ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని ధరలను ఇవ్వటమే కాదు, వుత్పత్తి కేంద్రాలనుంచి కొనుగోలు కేంద్రాలకు చేర్చే రవాణా ఖర్చులను కూడా భరిస్తున్నది. ఇదంతా రెండు దేశాలలో సంస్కరణలు అమలు జరిగిన తరువాత తలెత్తిన పరిస్థితి. అందువలన ఏ సంస్కరణలను వ్యతిరేకించాలి? వేటిని సమర్ధించాలి ? కావాలంటే జనానికి మేలు చేసే సంస్కరణలకు ముందు తగిలిస్తున్నట్లు ప్రధాని పేరు తగిలించి అమలు జరపండి ఇబ్బంది లేదు. అవేమీ లేకుండా కార్మికులు కడుపుకట్టుకొని పెట్టుబడిదారులు,వ్యాపారులకు లాభాలు చేకూర్చాలని చూస్తే జనమే కాదు, దేశం కూడా నష్టపోతుంది.

   విచక్షణా రహితంగా విదేశీ కంపెనీలను, దిగుమతులను అనుమతిస్తే దేశీయ పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతింటాయి.అందుకే ఇక్కడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రక్షణ చర్యలు కోరుతున్నారు. ఇదే సమయంలో ఇతర దేశాలలో ఎక్కడ లాభసాటిగా అక్కడకు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. జపాన్‌ తన సామాన్యుల కారు మారుతీ తయారీని భారత్‌లో ప్రారంభిస్తే విలాసవంతమైన జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ కార్ల ఫ్యాక్టరీని మన టాటా మోటార్స్‌ చైనాలోని చాంగుషులో ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పేరుతో ఇక్కడ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోమని చెబుతున్నారు.చైనా కూడా అదే పని చేసింది. అదే సమయంలో తన అంతర్గత వినియోగాన్ని కూడా పెంచే క్రమంలో తన పౌరుల ఆదాయాలను గణనీయంగా పెంచింది. అందుకే ప్రపంచ ధనిక దేశాలలో తీవ్ర మాంద్యంతో ఎగుమతులు దెబ్బతిన్నప్పటికీ దాని ఆర్ధిక వ్యవస్ధపై పెద్ద ప్రభావం పడలేదు. అటువంటి పరిస్థితి మన దేశంలో వుందా ? విధానాలు అందుకు అనుగుణంగా వున్నాయా ? గౌరవంగా బతికేందుకు అవసరమైన వేతనాలు పొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గటం, స్వల్పవేతన వుద్యోగులు, కార్మికుల సంఖ్య పెరగటం దేనికి సూచిక ?

     సులభంగా వ్యాపారం చేసేందుకు అవకాశాల పేరుతో ప్రతి ఏడాదీ ప్రపంచబ్యాంకు ఒక సూచికను తయారు చేస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన సమయంలో ప్రపంచంలోని 189 దేశాలలో భారత్‌ 134వ స్థానంలో వుంది, దానిని 50లోపుకు చేరుస్తానని ప్రపంచ పెట్టుబడిదారులకు మోడీ హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాల తరువాత అది 130 స్థానంలో వుంది. ఆ యావలో మోడీ కార్మికులకు, సామాన్య జనానికి, దేశం మొత్తానికి హాని కలిగించే విధంగా మన ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా బార్లా తెరిచేందుకు పూనుకున్నారు. బ్రిటీష్‌ వ్యాపారులు స్ధానిక రాజులు, రంగప్పలను లోబరుచుకొని మొత్తం దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు స్వతంత్ర పాలనలో ఏకంగా ప్రభుత్వమే జనం పేరుతో అన్ని దేశాల వారికి దేశాన్ని అప్పగించేందుకు పూనుకుంది. ఏడుపదుల స్వాతంత్య్రం వెనక్కు పోతోందా? ముందుకు పోతోందా ? ఏది దేశ భక్తి? ఏది దేశద్రోహం, ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Telangana should intensify ‘ease of doing business’ to attract investors in large nos.: ASSOCHAM  

24 Friday Jun 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Telangana

≈ Leave a comment

Tags

ASSOCHAM, investment, investors, Telangana

 

Investment projects attracted by state in transport services sector facing time & cost overruns

The state of Telangana needs to intensify focus on ease of doing business thereby adhering to the principle of ‘minimum government, maximum governance,’ to become top investment hub thereby promoting more efficient and effective business practices across the state, apex industry body ASSOCHAM said today.

“Telangana should make efforts to ease the process of doing business for all categories of industries with special focus on small and medium enterprises that hold potential to create more employment,” said Mr D.S. Rawat, secretary general of The Associated Chambers of Commerce and Industry of India (ASSOCHAM) while releasing a study titled ‘Analysis of infrastructure investment in India,’ along with chamber’s Telangana Development Council chairman, Mr Srikanth Badiga at a press conference held in Hyderabad.

States across India had attracted total investments worth over Rs 53 lakh crore in different categories of infrastructure sector – transport services (71 per cent share), miscellaneous services like storage & distribution, health, education, recreational services and others (13 per cent), communication services (5 per cent), wholesale and retail trading (5 per cent), information technology (4 per cent), hotels and tourism (2 per cent).

Public sector accounted for highest share of 59 per cent in the total investments attracted by infrastructure sector, this is worrisome as India needs to look for more private sector participation in perking up infrastructure across the country, but it is seen that over the years reliance on public sources have increased.

“So far public investments have been the dominant form of infrastructure financing in India, but this is expected to change as large deficits and other commitments together with social obligations will constrain government’s financial flexibility, thus there will be a greater need to mobilise private sector capital that can be invested into infrastructure,” noted the study.

At the state level, public sector investment shows that in 2015 public sources had highest share of over 95 per cent in investments attracted by Chhattisgarh followed by Bihar (92 per cent), Uttarakhand (87 per cent), Himachal Pradesh (80 per cent) and Madhya Pradesh (77 per cent) amid top five states in terms of public investments.

While on an average, public sector sources accounted for over 59 per cent share in terms of investments attracted by infrastructure sector across India. Though in West Bengal (59 per cent), Tamil Nadu (58 per cent), Odisha (50 per cent), Uttar Pradesh (47 per cent), Gujarat (27 per cent) and Haryana (10 per cent) public investments’ share was below that of the country’s average share thereby implying that these six states would be leading in terms of private sector’s contribution to infrastructure sector.

While the total investments attracted by infrastructure sector across India have increased at a compounded annual growth rate (CAGR) of over 10 per cent between 2010-2015 thereby increasing from over Rs 32 lakh crore to over Rs 53 lakh crore.

Investments attracted by transport services sector have increased at maximum growth of over 13 per cent followed  by miscellaneous services (6.5 per cent), communication (5 per cent), wholesale and retail (two per cent), hotels and tourism (two per cent) and IT (one per cent).

Infrastructure investment attracted by transport services sector:

“Transport services have garnered highest share of over 71 per cent in terms of investments worth over Rs 53 lakh crore attracted by infrastructure sector across the country as of 2015 followed by miscellaneous services (13 per cent), communication (five per cent), wholesale and retail trading (five per cent), information technology (four per cent) and hotels & tourism (two per cent),” highlighted the study.

However, investments attracted by the transport services sector have registered steep cost escalation of 47 per cent thereby exceeding the actual cost of projects by a whopping Rs five lakh crore, besides these projects are also facing an average delay of over 44 months.

Investment projects attracted by Telangana in transport services sector have registered highest cost escalation rate of about 89 per cent and are facing delay of over 51 months as of 2015, noted the study prepared by The ASSOCHAM Economic Research Bureau (AERB).

“It is highly imperative for the government of Telangana to perk up transportation, communication, water and energy networks across the state to promote accessibility, quality of infrastructure and attract domestic firms and global investors,” said Mr Rawat.

Punjab (65 per cent), Jharkhand (59 per cent), West Bengal (58 per cent) and Gujarat (56 per cent) are other among top five states to have recorded high cost escalation rate in delayed transport services investment projects.

Infrastructure investments’ scenario in Telangana:

Telangana has recorded a meagre two per cent share in investments attracted by infrastructure sector from both public and private sources across India as of 2015 and there has been literally no change in its share in 2010.

It also registered 10.2 per cent CAGR in investments attracted by infrastructure sector during the course of past five years which is similar to the national average growth rate in this regard.

Telangana recorded third highest growth rate of over 36 per cent after Chhattisgarh (44 per cent) and Himachal Pradesh (38 per cent) in investments made by the public sources in infrastructure sector across India.

“While in terms of investments made by the private sector in infrastructure sector in India, Telangana had seen a negative growth of about five per cent, as such the state needs to mobilise private sector capital that can be invested into infrastructure,” suggested the ASSOCHAM study.

Besides, the state recorded under implementation rate of about 83 per cent which is way ahead than national under implementation rate of 58 per cent, this implies that most of the infrastructure projects in Telangana and across India are still in the process and are yet to be completed.

“This does not augur well for both the state and the country as actual benefits of an investment are only derived upon completion,” the study asserted.

Suggestions:

In its study, ASSOCHAM has suggested various measures like reducing delay in creating businesses, obtaining approvals, enforcing contracts; providing sufficient legal protection for investors; ensuring more transparent and predictable government decision making thereby minimising political and regulatory risks.

Co-ordination between government agencies together with a single window clearance system should be implemented with specific guidelines for time bound approvals. Besides, land acquisition and environment clearances continue to remain critical concerns for infrastructure developers as such these issues should be addressed proactively to balance the interests of all stakeholders.

There is also an urgent need to fill-up the skills related gap in handling infrastructure projects and the government should create a skill ecosystem in partnership with private players with a view to formalise professional training for project managers, suggested ASSOCHAM.

It also added that there is a need to improve depth and liquidity of corporate bond market to provide additional source of funding for infrastructure companies.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జౌళి పరిశ్రమల ప్రోత్సాహకాల మాటున కార్మిక వ్యతిరేక చర్యలు

24 Friday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Anti labour measures, Employee Provident Fund Scheme Reforms, NDA, PMRPY, textile package

ఎం కోటేశ్వరరావు

    ఎదుటి వారు తొడ కోసుకున్నారని మనం మెడ కోసుకుంటామా ? బుద్ధిలేని తనం అంటారు పెద్దలు ! కొన్ని దేశాలు పెట్టుబడిదారీ విధానం, కొన్ని దేశాలు సోషలిస్టు విధానాన్ని ఎంచుకుంటే మనం మిశ్రమ ఆర్ధిక విధానం ఎంచుకున్నాం. మధ్యేమార్గం అన్నారు ఎందరో ! ప్రపంచ దేశాలన్నీ మనలను చూసి నేర్చుకుంటున్నాయని, మనకు విదేశీ సిద్ధాంతాలు వద్దు, విధానాలు వద్దు అని కొందరు చెబుతున్నారే, వారే వాటికి తూనా బొడ్డు చెప్పి (స్వస్థి) అనుకరిస్తే భారతీయత మట్టి కరిచిపోదా ? సంస్కరణలు అమలు జరిపినంత మాత్రాన చైనా సోషలిస్టు విధానాన్ని వదలి వేసిందా ? అమెరికా, జపాన్‌ వంటి పెట్టుబడిదారీ దేశాలలో సైతం కొన్ని మార్పులు తప్ప వారు నమ్మిన పెట్టుబడిదారీ విధానాన్ని వదులుకోలేదే ? మరి మనం ఎందుకు మన మిశ్రమ ఆర్ధిక విధానం నుంచి దారి తప్పుతున్నాం ?( దానిని కూడా విమర్శించే వారు వున్నారు) ఇక మన దేశ ప్రత్యేకత ఏముంది? ఇది భారతీయతా ? జనానికి మేలు చేయని సంస్కరణలు ఎవరికోసం ? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశం.

    వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి వుపాధి కల్పిస్తున్న జౌళి రంగంలో మరిన్ని సంస్కరణలకు తెరతీసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.దేన్నయినా మూసిపెడితే పాచిపోతుందని తెలిసిందే. అలాగే ఎప్పటి కప్పుడు సంస్కరించుకోకపోతే ఏదీ పనికిరాదు. కానీ ఎలా సంస్కరించుకోవాలనేదే సమస్య? దీని గురించి పెద్దగా ఎక్కడా చర్చలు జరపలేదు, పర్యటనకు వచ్చిన ప్రతిసారీ పత్రికా గోష్టి జరిపి గలగలా మాట్లాడేవెంకయ్య నాయుడి వంటి వారు కూడా కనీసం ఆఫ్‌ ది రికార్డుగా కూడా వుప్పందించలేదే ? శత సహస్ర లేఖా రచయిత అవార్డుకు ఏకైక అర్హుడైన బండారు దత్తాత్రేయ కనీసం కార్మికులకు దీని గురించి ఒక్క లేఖయినా రాసినట్లు వినలేదు. మేము భారత మితవాదులం అని సగర్వంగా చెప్పుకొనే స్వరాజ్య పత్రికలో బ్రిజ్‌ మోహనలాల్‌ ముంజాల్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధి శ్రేయాస్‌ భరద్వాజ ఒక వ్యాఖ్యానం రాశాడు. అతను యువ మితవాది అని, తోటి విద్యార్ధులలో మితవాద భావాలను వ్యాపింపచేస్తున్నాడని ఆ పత్రిక అతని గురించి సగర్వంగా పరిచయం చేసింది. కేంద్ర ప్రభుత్వం జూన్‌ 22న ఒక జౌళి పాకేజిని ఆమోదించిందని, దానిలో సబ్సిడీల భాగం అంత ముఖ్యమైనదేమీ కాదు గాని దానిలో కార్మిక సంస్కరణల గురించి ఒక్క ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ తప్ప మీడియా వాటిని పట్టించుకోలేదు అని అతను వ్యాఖ్యానించాడు.

   అదేమీ నరేంద్రమోడీ విజయగాధ కాదు కనుక, ఆ వార్తను ప్రముఖంగా ప్రచురిస్తే తమ యజమానులు, వారికి ప్రకటనల ద్వారా అండదండలిచ్చే కార్పొరేట్‌ సంస్ధల యజమానులు, మాకు లేని పోని తలనొప్పి తెచ్చారు అని విమర్శించే పాలకపార్టీ నేతలతో తలనొప్పి ఎందుకు ? రాయకపోతే ఎవరు అడగొచ్చారు అని మీడియా కావాలనే వదలివేసిందని వేరే చెప్పనవసరం లేదు. ఇంతకూ ఏమిటా సంస్కరణలు. మేకను బలి ఇవ్వబోయే ముందు దానికి తిన్నంత తిండి పెడతారు, కడుగుతారు, అలంకరిస్తారని తెలిసిందే. అది మేక కనుక అమాయకంగా తింటుంది. కానీ కార్మికులు అలా కాదు కదా అందుకని వారి నోరు మూయించాలంటే వారిని ఆకర్షించాలి. అందుకుగాను కొన్ని ప్రతిపాదనలు చేశారు. అవేమంటే,

     నెలకు పదిహేను వేల రూపాయల కంటే తక్కువ వేతనం పొందుతున్న దుస్తుల పరిశ్రమల కొత్త కార్మికులకు మొదటి మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వమే ప్రావిడెంట్‌ ఫండ్‌ పధకం కింద యజమానుల తరఫున 12శాతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందట. ప్రధాన మంత్రి రోజ్‌గార్‌ ప్రస్థాన్‌ యోజన(పిఎంఆర్‌పివై) పధకం నుంచి ఇప్పటికే చెల్లిస్తున్న 8.33 శాతానికి అదనంగా 3.67శాతాన్ని జౌళి మంత్రిత్వశాఖ ఖాతా నుంచి చెల్లిస్తారట. ఎంత వుదారత్వం ! ఈ మొత్తం రానున్న మూడు సంవత్సరాలలో రు.1170 కోట్లు వుంటుందని అంచనా. పదిహేను వేల రూపాయల కంటే తక్కువ వేతనం పొందుతున్న కార్మికులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ పధకంలో చేరాలా లేదా అనే ‘స్వేచ్ఛ’ ఇస్తారట. దీని వలన కార్మికుల చేతిలో మరింత డబ్బు వుండటంతో పాటు సంఘటిత రంగంలో వుపాధిని పెంచటానికి తోడ్పడుతుందట. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) విధానం ప్రకారం వారానికి ఎనిమిది గంటలకు మించి ఓవర్‌టైమ్‌ దాట కూడదు, కొత్త విధానం వలన ఆ గంటలు బాగా పెరుగుతాయి.ఈ పరిశ్రమ స్వభావాన్ని బట్టి దుస్తుల తయారీ రంగంలో నిర్ణీత వ్యవధి వుపాధి విధానాన్ని ప్రవేశపెడతారు, ఆ కార్మికులను ఇతర పర్మనెంటు కార్మికులతో సమంగా చూస్తారు, అంటే పని గంటలు, వేతనాలు, అలవెన్సులు, ఇతర చట్టబద్దంగా వర్తించేవన్నీ వారికి వర్తింప చేస్తారట. సంవత్సరానికి ఆరువేల కోట్ల రూపాయల చొప్పున కేంద్రం కేటాయించే ఈ రాయితీల వలన ప్రస్తుతం 17బిలియన్‌ డాలర్లుగా వున్న మన వస్త్ర ఎగుమతులు మూడు సంవత్సరాలు తిరిగే సరికి 43 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయనీ, ప్రత్యక్ష, పరోక్ష వుపాధితో కోటి మంది లబ్ది పొందుతారని కేంద్ర ప్రభుత్వం ఒక రంగుల కలను మన ముందుంచింది.

   మన ఎగుమతులన్నీ వరుసగా గత ఏడాదిన్నర కాలంగా పడిపోయినట్లు ఒకవైపు అధికారికంగా చెబుతున్నారు. అయినా ఇంత ధైర్యంగా కేంద్రం చెబుతున్నదంటే నరేంద్రమోడీకి ఏ విదేశీ పర్యటనలోనో మన దేశం నుంచి ఎప్పుడో తరలి పోయిన గొప్ప మంత్రదండం లేదా మన పురాణాల్లోని అక్షయపాత్రలు దొరకటమో, ఇతర అద్బుతశక్తులు అయినా ఆవహించి వుండాలి లేదా మన సంస్కృత పండితులు వేదాలు, పురాణాల్లో నిక్షిప్తంగా వున్న వాటిని ఎట్టకేలకు వెలికి తీసి వుండాలి. ఏదో జరగక పోతే ఇలా చెబుతారా ?కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కార్మిక సంస్కరణలంటూ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలను వూరిస్తున్నది.

    శ్రేయాస్‌ భరద్వాజ తన వ్యాఖ్యానంలో ఒక విషయం చెప్పాడు. యజమానుల చిత్తం వచ్చినట్లు కార్మికులను తొలగించటానికి, పెట్టుకోవటానికి అవకాశం ఇచ్చే, రాత్రి పూట కూడా మహిళలను పనిచేయటానికి అనుమతించటం, 24 గంటలూ దుకాణాలు తెరిచి వుంచటం వంటి సంస్కరణలను పార్లమెంట్‌లో ప్రతిపాదించాలని కేంద్రానికి వుత్సాహం వున్నప్పటికీ ‘ వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలు, రాజ్యసభలో తగిన మెజారిటీ లేకపోవటం వలన సంస్కరణలకు బ్రేక్‌ వేయాలని మంత్రుల బృందానికి నాయకత్వం వహిస్తున్న అరుణ్‌ జెట్లీ కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కోరారని, అయితే పరోక్ష మార్గంలో లక్షిత రంగాలలో సబ్సిడీ పాకేజీలతో కలిపి ప్రవేశ పెడుతున్నారని ‘ యువ మితవాద భరద్వాజ వ్యాఖ్యానించాడు. నరేంద్రమోడీ సర్కార్‌ ఎత్తుగడను చక్కగా ప్రతిబింబించాడు.

   భారత మాతాకీ జై మార్కు దేశ భక్తులు, ఇతరులూ తరచూ లేవనెత్తే ప్రశ్నల గురించి కూడా చెప్పుకోవాలి. గత ఏడు దశాబ్దాల విధానాలు మన దేశాన్ని ముందుకు తీసుకుపోనపుడు మనం సంస్కరణలు అమలు జరపనవసరం లేదా ? కమ్యూనిస్టు చైనాలో సంస్కరణలను సమర్ధిస్తారు, అదే భారత్‌లో వ్యతిరేకిస్తారెందుకు మోడీపై గుడ్డి వ్యతిరేకత కాదా ? ఇంకా అటూ ఇటూ తిప్పి ఇంకా ఇలాంటివే అనేక మంది లేవనెత్తుతున్నారు.ప్రారంభంలోనే కొన్ని అంశాలను ప్రస్తావించాను.

     సంస్కరణలు అంటే ఏమిటి ? పదునైన కత్తితో మగవారు గడ్డం గీసుకోవచ్చు, స్త్రీ,పురుషులు కూరగాయలు తరగవచ్చు, మామిడి కాయలు కోసుకోవచ్చు, గూండాలు ప్రాణాలు తీయవచ్చు, అసహాయులు ఆత్మరక్షణకు వుపయోగించుకోవచ్చు. సంస్కరణలు కూడా అలాంటివే. ఎవరు అమలు చేస్తున్నారనేదానిని బట్టి వాటి ప్రయోజనం, ఫలాలు, పర్యవసానాలు వుంటాయి. అణు పరిజ్ఞానాన్ని బాంబుల తయారీకి వినియోగించి వాటిని జపాన్‌పై ప్రయోగించి అమెరికా ప్రపంచాన్ని భయపెట్టింది. అణుబాంబులను మరోసారి ప్రయోగించం అని చెప్పటానికి అమెరికా ఇప్పటికీ నిరాకరిస్తోంది. అదే అణుశక్తిని ప్రాన్స్‌ వంటి దేశాలు బాంబుల తయారీతో పాటు విద్యుత్‌ తయారీకి కూడా వినియోగిస్తున్నాయి. అణు సంస్కరణలలో భాగంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (ఎన్‌పిటి) కొన్ని దేశాలు ప్రతిపాదించాయి. అనేక దేశాలు సంతకాలు చేశాయి, భారత్‌ తిరస్కరించింది. ఈ సంస్కరణ లేదా ఒప్పందం తనకు నష్టదాయకం కనుకనే భారత్‌ తిరస్కరించింది. అణురంగంలో ఎంతో ముందున్న దేశాలు ఇతర దేశాలు ఆ పరిజ్ఞానాన్ని సముపార్జించకుండా చేసేందుకే ఎన్‌పిటి అస్త్రాన్ని వాడుతున్నాయి. సంస్కరణలు కూడా ఇలాంటివే. వాటి వలన లబ్ది పొందే శక్తులు అమలు జరపాలని కోరతాయి, నష్టపోయే శక్తులు వ్యతిరేకిస్తాయి. దుస్తుల తయారీ కంపెనీల వారు కారు చౌకగా తయారు చేసి విదేశాలకు చౌకగా ఎగుమతి చేసి లాభాలు పోగు చేసుకోవాలని చూస్తారు. అమెరికా, ఐరోపా దేశాల వారు దారిద్య్రం తాండవించే బంగ్లాదేశ్‌లో తమ ఫ్యాక్టరీలను పెట్టి చౌకగా దుస్తులు తయారు చేయించి వారే దిగుమతి చేసుకుంటున్నారు. అందుకే వాటిపై పన్నులు మినహాయింపు ఇచ్చారు. తాజాగా వస్తున్న వార్తలను బట్టి చైనాలో వేతనాలు పెరుగుతున్నందున విదేశీ కంపెనీలు ఇతర దేశాలకు తమ కార్యకలాపాలను తరలిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకోవాలని భారత పెట్టుబడిదారులు ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోంది.అందుకే నరేంద్రమోడీ సర్కార్‌ రాయితీల ప్రకటనతో పాటు కార్మిక సంస్కరణలనూ జమిలిగా అమలు జరిపేందుకు నిర్ణయించింది.

      పిల్లి నల్లదయినా ఎలుకలను పడితే ఎవరికీ ఇబ్బంది లేదు. అమలులో వున్న కార్మిక చట్టాలనే యాజమాన్యాలు పట్టించుకోవటం లేదు, అమలు జరిపే యంత్రాంగమే లేదు. ఈ స్ధితిలో వున్నవాటిని ఇంకా నీరుగారిస్తే చీకటి రోజుల్లోకి కార్మికులు నెట్టబడతారు. అందుకే ఇక్కడ కార్మికులు సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు.అది కాంగ్రెస్‌ పార్టీ అయినా బిజెపి అయినా తెలుగు దేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె, అన్నా డిఎంకె ఏదైనా కావచ్చు. ఎవరు అధికారంలో వుంటే వారిని వ్యతిరేకిస్తారు. అందువలన నరేంద్రమోడీ కనుక వ్యతిరేకిస్తున్నారు అనేది తప్పుడు ప్రచారం, ఎదురుదాడి మాత్రమే. కార్మికులు లేదా వారికి మద్దతు ఇస్తున్న వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర శక్తులు సంస్కరణలను వ్యతిరేకించటం లేదు. ప్రజా వ్యతిరేక అంశాలనే ప్రతిఘటిస్తున్నాయి. అది తగినంత లేని కారణంగా ఫలితాలు కనిపించటం లేదు, పాలకులు మరిన్ని దారుణమైన చట్టాలను రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ వుపసంహరణ, వడ్డీ రేటు విషయంలో వామపక్షాలు, కార్మిక సంఘాలతో నిమిత్తం లేకుండానే ఎక్కడిక్కడ కార్మికుల్లో తలెత్తిన నిరసనకు భయపడే ఎన్‌డిఏ సర్కార్‌ వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. అంతెందుకు రాజకీయంగా బిజెపిని సమర్ధించే ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘమైన బిఎంఎస్‌ కార్మిక సంస్కరణలను, అనేక ప్రభుత్వ నిర్ణయాలను మాట మాత్రంగా అయినా వ్యతిరేకించకపోతే మనుగడ సాగించలేని స్ధితికి నెట్టబడిందా లేదా ? అంటే వ్యతిరేకించే వారిది గుడ్డి వ్యతిరేకత కాదన్నది స్పష్టం. అది గోబెల్స్‌ ప్రచారమే. కమ్యూనిస్టు చైనాలో సంస్కరణలను ఆమోదించి, ఇక్కడ వ్యతిరేకిస్తారెందుకు ? దీనికి సమాధానం పెద్ద కష్టమేమీ కాదు. మరొక వ్యాసంలో దాని గురించి చర్చిద్దాం. ఇక్కడ ఒక ప్రశ్న. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగమైన బిజెపి ప్రతిపాదిస్తున్న లేదా అమలు జరుపుతున్న సంస్కరణలను ఇతర విభాగాలైన బిఎంఎస్‌,స్వదేశీ జాగరణ మంచ్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. ఒక కుటుంబంలోని కొంత మంది సభ్యులే వ్యతిరేకిస్తున్నపుడు బయటివారి వ్యతిరేకత గురించి వేలెత్తి చూపే హక్కు వుందా ? చైనాలో సంస్కరణల గురించి చెప్పేవారు వాటితో పాటు అక్కడ కార్మికులకు ఇచ్చిన హక్కులు, ఇతర సౌకర్యాల గురించి మాట్లాడరేమి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన పత్తి విధానాన్ని సొమ్ము చేసుకుంటున్న విదేశీ సంస్థలు

21 Tuesday Jun 2016

Posted by raomk in AP, AP NEWS, CHINA, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Telangana

≈ Leave a comment

Tags

china cotton policy, cotton policy, INDIA COTTON, MNCs

ఎం కోటేశ్వరరావు

    ధరలు పతనమయ్యాయని రైతులు పత్తిని అమ్ముకోకుండా నిలుపుకోగలరా ? రైతు పత్తిని అమ్మలేదు కనుక తమకు ఇవ్వాల్సిన వేతనాలు వాయిదా వేసినా ఫరవాలేదని వ్యవసాయ కార్మికులు తాపీగా వుండగలరా ? కానీ పత్తి ధరలు పెరిగాయి కనుక వారానికి రెండు రోజులు మిల్లులు మూసివేయాలని తెలంగాణా నూలు, వస్త్ర మిల్లుల యజమానులు నిర్ణయించారు. బహుళజాతి గుత్త సంస్థలు అక్రమంగా పత్తి నిల్వలు పెట్టి ధరలు పెంచారని వాపోయారే తప్ప అక్రమ నిల్వలలను వెలికి తీయాలని ప్రభుత్వాన్ని కోరలేదు. దానికి బదులు తమకు వుదారంగా రుణాలు ఇవ్వాలని, వడ్డీ తగ్గించాలని, రుణ వ్యవధిని మూడు నుంచి తొమ్మిది నెలలకు పెంచాలని, ఎగుమతులు చేసిన వారికి మూడుగా వున్న ఎగుమతుల ప్రోత్సాహకాన్ని ఏడున్నరశాతానికి పెంచటం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు ధరలను అదుపు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కూడా వారు సూచించారు. రెండు రోజులు మూత పెట్టినందువలన మిల్లు యంత్రాలు తుప్పుపట్టిపోవు, కార్మికులకు వేతనాలు మాత్రం వుండవు. చేసిన పనికే తగిన వేతనాలు ఇవ్వని వారు అసలు చేయని పనికి ఇస్తారా ?

   ఈ పరిస్థితికి వారు చెబుతున్న కారణాలు ఏమిటి ? బహుళజాతి గుత్త సంస్థలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసి అక్రమ నిల్వలు పెట్టటం. ఆ కంపెనీలకు కారుచౌక వడ్డీకి రుణాలు దొరుకుతుండగా తమకు 14శాతం వరకు పడటం. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులకు ఐరోపా, అమెరికా వంటి చోట్ల పన్నులు తక్కువ లేదా అసలే లేకపోవటం వంటి కారణాలతో తాము నష్టపోతున్నామని యజమానులు చెబుతున్నారు.

   పత్తి గిట్టుబాటు కావటం లేదు కనుక దాని బదులు మరొక పంటలు వేయాలని తెలంగాణా ప్రభుత్వం రైతాంగానికి సలహా ఇచ్చినప్పటికీ రైతులు ఈ ఏడాది కూడా పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నట్లు విత్తనాల కొనుగోలు తీరుతెన్నులు వెల్లడిస్తున్నాయి. రెండవది వాణిజ్య పంటలు రైతాంగానికి జూదంగా మారిపోయిన తరువాత ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు రు.5,800 వరకు వుండటం కూడా వారిని ఆకర్షిస్తుంది. తీరా పసిపిల్లల మాదిరి పంటను సాకి పత్తిని తీసుకొని మార్కెట్లోకి వెళితే 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేసేందుకు కంకణం కట్టుకున్నామని చెప్పిన కేంద్రం విదిల్చిన ముష్టి రు.60లతో కలుపుకొని క్వింటాలు రు.4,160కి లోపుగా తప్ప సిసిఐతో సహా ఏ ఒక్క వ్యాపారీ కొనుగోలు చేయడు. మార్కెట్‌ సీజన్‌లో ధరలను అదుపు చేయటానికి సిసిఐ తన వంతు ‘కృషి ‘చేస్తోంది. మోడీ సర్కార్‌ కృషి కల్యాణ్‌ పేరుతో వసూలు చేస్తున్న అరశాతం సేవాపన్ను రైతులు కూడా చెల్లిస్తారు. కనీసం వారు చెల్లించిన మొత్తమైనా ఏదో ఒక రూపంలో వారి కల్యాణానికి అందుతుందా? అన్నట్లు మరిచాను కెసిఆర్‌ ప్రభుత్వ కల్యాణ లక్ష్మి పధకం వుంది కదా కనీసం దానినైనా రైతాంగ బిడ్డలకు వర్తింప చేస్తారా ?

     ఇటు తెలంగాణా అటు ఆంధ్రప్రదేశ్‌ మొత్తం భారత రైతాంగాన్ని, అటు మిల్లు యజమానులను, వాటిలో పని చేసే కార్మికులను అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్న వుమ్మడి కారణం ఏమిటి ? రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తాను రెండవసారి పదవి కొనసాగింపు కోరుకోవటం లేదు అని ప్రకటించిన 48 గంటలలోనే కేంద్ర ప్రభుత్వ విదేశీ పెట్టుబడులకు భారత గడీ తలుపులను మరింతగా తెరిచింది. ఇంతకాలం ఈ పనిచేయకపోవటానికి ఆయనే కారణం అని చెప్పకనే చెప్పినట్లు అవటంతో పాటు రాజన్‌ ప్రకటన ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా మారిన చర్చను పక్కదారి పట్టించే ఎత్తుగడ కూడా కనిపిస్తోంది. పత్తి వ్యాపారంలో బహుళజాతి గుత్త సంస్థలను, విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు మిల్లు యజమానులే చెప్పారు. విదేశీ పెట్టుబడులు వస్తే మన రైతాంగానికి, వినియోగదారులు, అన్ని వర్గాల వారికి స్వర్ణయుగం వస్తుందన్నట్లుగా గతంలో మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు. ఇప్పుడు అంతకంటే మరింత గట్టిగా నరేంద్ర మోడీ, చంద్రబాబు, కెసిఆర్‌ వంటి వారంతా చెబుతున్నారు కదా ? మరి పత్తి విషయంలో జరిగిందేమిటి ?

     పత్తి విత్తనాలు మొత్తం మోన్‌శాంటో వంటి బహుళజాతి గుత్త సంస్థల చేతుల్లోకి పోయాయి. పత్తి వేసిన తరువాత వచ్చే కలుపు తీయాలన్నా, క్రిమికీటకాలను చంపాలన్నా మోన్‌శాంటో లేకుండా గడవదు. ఒక్క యూరియా తప్ప మిగతా అన్ని రకాల ఎరువుల ధరలపై కేంద్రం కంట్రోలు ఎత్తివేసింది. వాటిని దిగుమతి చేసుకోవాలన్నా, దేశీయంగా ప్రయివేటురంగంలో తయారు చేయాలన్నా మోన్‌శాంటో లేదా దాని వంటి ఇతర కంపెనీల అనుబంధ సంస్ధలు, భాగస్వాములు తప్ప మరొకరు లేరు. మరి విదేశీ పెట్టుబడులు, కంపెనీలు మనకు వుపయోగపడిందెక్కడ ? గతంలో బ్రిటీష్‌ పాలనలో మన దేశం మగ్గిన సమయంలో మన దేశాన్ని ముడిసరకులు ఎగుమతి చేసే దేశంగా, పారిశ్రామిక సరకుల కొనుగోలు దేశంగా మార్చి మన సంపదలను కొల్లగొడుతున్నారనేగా మన గాంధీ తాత వంటి వారి నాయకత్వాన పోరాడి వారిని తరిమివేసింది. మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి ? మోడీ అంకుల్‌ అంతకంటే ఎక్కువగా మన జీవితాల్లోకి విదేశీ పెట్టుబడులు, కంపెనీలను తీసుకువస్తా అంటూ ఎక్కువ సమయం విదేశాల్లోనే గడుపుతున్నారు కదా ? అవే కంపెనీలు మరింతగా మన దగ్గర నుంచి సంపదను తరలిస్తున్నాయా లేదా ? మన రూపాయి విలువను తగ్గించి మన ప్రభుత్వాలు మన సరకులను విదేశాలకు చౌకగా విక్రయిస్తున్నాయా లేదా ? ఎగుమతులకు ప్రోత్సాహం ఇస్తున్నాయా లేదా ? ఇంకా ఎక్కువ కావాలనే కదా మన తెలంగాణా మిల్లు యజమానులు కోరుతున్నది. ఇక్కడ ఎందరో స్త్రీ,పురుషులు ఏకవస్త్రాలతో కాలం గడుపుతున్న చేదు నిజం, సిగ్గుపడాల్సిన విషయం అందరికీ తెలుసు. విదేశాల వారికి ఇచ్చే రాయితీని మనవారికి ఎందుకు ఇవ్వరు ? గతంలో తెల్లవారు ప్రపంచంలో ఎక్కడ వ్యవసాయం చేస్తే అక్కడికి మన దేశం నుంచి ఆ పొలాల్లో పనిచేసేందుకు రైతులు, వ్యవసాయ కూలీలను తీసుకుపోయారని చరిత్రలో చదువుకున్నాం. అక్కడ పనిచేసే వారు లేకనా ? కానే కాదు, ఇక్కడ దరిద్రం తాండవిస్తోంది, చౌకగా పని చేయటానికి సిద్ధ పడ్డారు కనుక. ఇప్పుడు వ్యవసాయ కూలీల బదులు ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు అలాంటి చౌక కూలీలుగా ధనిక దేశాలకు వెళుతున్నారా లేదా ?

     సంస్కరణల పేరుతో మనం అనుసరిస్తున్న విధానాలు అంతిమంగా ఏ ఫలితాలు ఇస్తాయన్నది గీటు రాయిగా వుండాలి. చైనా కూడా సంస్కరణలు అమలు జరుపుతున్నది.మనకంటే వెనుకగా స్వాతంత్య్రం పొందింది. మన పెద్దలు కొందరు చెప్పినట్లు వారు నల్లమందు భాయిలుగా వున్నపుడు మనం ఎంతో తెలివితేటలతో వున్నాం. ఇప్పుటి పరిస్ధితి ఏమిటి? జపాన్‌ను పక్కకు తోసి అమెరికాతో ఒకటవ నంబర్‌ స్థానానికి నువ్వా నేనా అని పోటీ బడుతున్నారు వారు. మన వారు నల్ల మందులేకుండానే మత్తులో జోగుతున్నారా ? పత్తి విషయాన్నే తీసుకుందాం. చైనా విధానం ప్రకారం దేశీయంగా పండిన పత్తితో పాటు దిగుమతులను కూడా ప్రభుత్వ సంస్ధలే చేపడతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వున్న ధరల కంటే ఎక్కువే అక్కడి రైతులకు చెల్లిస్తున్నారన్నది చైనా అంటే ఇష్టం లేనివారు కూడా అంగీకరిస్తున్న సత్యం. అదే ప్రభుత్వం పత్తిని సేకరించి మిల్లులకు కూడా విక్రయిస్తున్నది. దానితో వస్త్రాలు,దుస్తులు తయారు చేసిన కంపెనీలు ఇతర దేశాలకంటే చౌకగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు విక్రయిస్తున్నాయని మన వారే గగ్గోలు పెడుతున్నారు కదా ? మన కంటే రైతులకు రెట్టింపు మద్దతు ధర ఇచ్చి మిల్లులకు సరసమైన ధరలకు పత్తిని విక్రయించటం అక్కడ ఎలా సాధ్యమైంది? ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు.

     గతేడాది నుంచి చైనా ప్రభుత్వం పత్తి దిగుమతులను నిలిపివేసింది, తన వద్ద వున్న నిల్వలలో కొంత భాగాన్ని వేలం పద్దతిలో ప్రతినెలా విక్రయిస్తోంది. దాంతో ప్రపంచ వ్యాపితంగా పత్తి ధరలు పడిపోయాయి.అయినా రైతాంగానికి ఎలాంటి నష్టమూ రాలేదు. నాలుగు సంవత్సరాల క్రితం పత్తి ధరలు ప్రపంచ మార్కెట్లో పౌను ధర 140-150 సెంట్ల వరకు పలికింది. గతేడాది న్యూయార్క్‌ మార్కెట్‌లో ధరు 66-70 సెంట్ల మధ్యనే కదలాడింది. అయినప్పటికీ చైనా రైతులు అంతకు మించి 85 సెంట్లకు పైగా పొందారు. ఏ ఒక్క పత్తి రైతూ నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నవార్తలు మనం వినలేదు. పత్తి ధరలు ప్రపంచ మార్కెట్‌ కంటే ఎక్కువగా వుండి మిల్లులు మూసి వేసిన యజమానులూ లేరు ? అందరికీ ప్రయోజనం కలిగించే విధానాన్ని, సంస్కరణలను మన ప్రభుత్వాలు ఎందుకు అనుసరించవు ? వాటికి ఎవరు అడ్డం పడ్డారు, మనది ప్రజాస్వామ్యం కదా హాని కలిగించే విధానాల గురించి ఎందుకు మనం చర్చ జరపటం లేదు?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పప్పుల కోసం నరేంద్రమోడీ విదేశీ యాత్రలా ?

20 Monday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Availability of Pulses, Modi, pulse prices, Pulses

పప్పులో నీళ్లు కలిపి తినమంటున్న రామ్‌దేవ్‌

ఎం కోటేశ్వరరావు

     ఈ శీర్షికను చూసి ప్రధాని నరేంద్రమోడీ వీర భక్తులు, కాషాయ దేశభక్తులు కోపం తెచ్చుకోవద్దని మనవి.అంధుల రాజ్యంలో ఒంటి కన్నువాడు మహారాజు అని రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఏ చిత్తంతో అన్నారో గానీ మోడీగారి పాలన రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. సలహాలు ఇచ్చేవారు కూడా అపూర్వ మేథాసంపన్నులుగా వున్నట్లున్నారు. పప్పుల ధరలు చుక్కలు చూపిస్తున్న ఈ రోజుల్లో మా కాలంలోనే పప్పులతో ముఖం కడుక్కొని పప్పులతో స్నానం చేసి పప్పులలోనే నిద్రపోయే వారం అని పిల్లలకు రాత్రి పూట పిట్ట కధలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందా ? ఏమో ! ‘పప్పుల ధరల అదుపుకు మోడీ ఆఫ్రికా దేశాల పర్యటన’ ఇది ఒక ఆంగ్ల వార్త శీర్షిక.http://indiatoday.intoday.in/story/modi-to-visit-african-countries-to-check-racing-pulse-prices/1/695912.html

       మేకిండియా పిలుపును అమలు చేసేందుకే మా ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం విదేశీ పర్యటనలు చేస్తున్నారని భజన బృందం చెబుతుంటే కామోసనుకున్నాం. ఇప్పుడు పెట్టుబడుల కోసమే కాదు, పప్పుల కోసం వెళుతున్నారని మనం చెవులప్పగించి వినాలి కాబోలు.కోరి తలమీద పెట్టుకున్నాం కనుక తప్పదేమో మరి ! పట్టణాలలో కొన్ని పప్పుల ధరలు గరిష్టంగా 180 నుంచి 200 రూపాయల వరకు వున్నాయి.గ్రామాలలో అందునా మారు మూల గ్రామాలలో ఇంకా ఎక్కువ వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. మంచి రోజులు రానున్నాయని చెప్పటానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు తప్ప పప్పులుడికేందుకు చర్యలు లేవు. ప్రధాని నరేంద్రమోడీ జూలై తొలి వారంలో ఆఫ్రికా దేశాల పర్యటన జరుపుతున్నారు.ఆయనతో పాటు సీనియర్‌ అధికారుల బృందం వెళ్లి ఆఫ్రికా ఖండ దేశాలలో ప్రయివేటు వారితో కాంట్రాక్టు సాగు పద్దతిలో పప్పులు పండించేందుకు, పప్పులను దిగుమతి చేసుకొనేందుకు గల అవకాశాలను పరిశీలించి వస్తారని అధికారులే చెప్పినట్లు వార్తలు. పెట్టుబడుల కోసం మోడీయే విదేశాలు తిరిగి, పప్పుల కోసమూ ఆయనే వెళ్లాల్సి రావటం అంటే అధికారులు మోడీ మెప్పు పొందేందుకు, ఆయనను మెప్పించేందుకు ఇలా చేస్తున్నారా లేక సంబంధిత మంత్రులు వుత్సవిగ్రహాలా ?

   విజయమాల్య వంటి రుణ ఎగవేతదారులు తామరతంపరగా పుట్టుకు వస్తున్నారు, వారిపై నిఘావేయటానికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి), ఐబి, రెవెన్యూ ఇంటెలిజన్సు విభాగాలకు సిబ్బంది చాలని పరిస్థితులో పప్పులపై ఒక కన్నేసి వుంచమని కూడా ప్రభుత్వం చెప్పిందట. మన దేశంలో ఏటా పదిలక్షల టన్నుల పప్పుల వినియోగం పెరుగుతున్నదని అంచనా, ప్రస్తుతం ఏటా 24మిలియన్‌ టన్నులు అవసరం కాగా నాలుగు లక్షల టన్నుల వరకు దిగుమతులు చేసుకుంటున్నాం.

   ప్రపంచ పప్పుల సంవత్సరంగా 2016ను ప్రకటించారు. మన వినియోగదారులకు పప్పుల షాక్‌ కూడా ఈ సంవత్సరమే తగలటం విశేషం. పప్పుల వినియోగం, కొరత గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నా ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఏం చేసిందన్నది ఒక ప్రశ్న. (వుత్పత్తి, దిగుమతి మిలియన్‌ టన్నులలో, ఖర్చు కోట్ల రూపాయలలో, వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ఆధారంగా )

సంవత్సరం    వుత్పత్తి       దిగుమతి       దిగుమతి ఖర్చు

2012-13       18.34          4.02             13,357

2013-14        19.27         3.18             11,038

2014-15        17.15         4.00             14,396

2015-16        17.33         5.50             24,198

     పై అంకెలను చూసినపుడు ఏటేటా పెరుగుతున్న వినియోగం, తగ్గుతున్న వుత్పత్తికి అనుగుణంగా దిగుమతులు లేవన్నది స్పష్టం. 2015-16 సంవత్సరానికి సంబంధించి వుత్పత్తి అంకెలు అంచనా మాత్రమే. దేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాభావం, కరవు కారణంగా వుత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని మనకు కనిపిస్తున్నా ప్రభుత్వం గొప్పకోసం వుత్పత్తి పెరుగుదల అంచనా చూపింది. రెండవది 2012-13 సంవత్సరాలలో టన్ను రు 33వేల చొప్పున దిగుమతి చేసుకుంటే గతేడాది 43వేలకు పెరిగింది. మన పప్పుల వుత్పత్తి తగ్గిపోయిన విషయం గమనంలో వున్న కేంద్రం లేదా రాష్ట్రాలు గానీ అవసరమైన దిగుమతులను చేసుకోని కారణంగానే, అనేక చోట్ల నిల్వలన్నీ అయిపోవటాన్ని అవకాశం తీసుకున్న వాణిజ్యశక్తులు ధరలను అనూహ్యంగా పెంచివేశాయి. వారిని అదుపు చేసేందుకు, దొంగ నిల్వలను పట్టుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ కనపడదు.

    ఆఫ్రికా ఖండంలో పప్పులను పండించి దిగుమతి చేసుకొని ధరలను తగ్గిస్తామని కేంద్రం చెబుతుంటే దానికి గట్టి మద్దతుదారుగా స్వయం ప్రకటిత బాబా రామదేవ్‌ ఏ చిట్కా చెప్పారో తెలుసా. న్యూఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాదులో యోగా శిక్షణలో పాల్గొన్న సందర్బంగా మాట్లాడుతూ పప్పుల ధరల పెరుగులకు నరేంద్రమోడీని విమర్శించకూడదని సెలవిచ్చారు. పోనీ అంతటితో ఆగితే ఫరవాలేదు, ఈ సమస్యను అధిగమించటానికి పప్పులో నీళ్లెక్కువ పోసుకొని తింటే పొదుపు చేసి ఖర్చుకు ఖర్చు, పెంచుకున్న ఒళ్లు తగ్గి ఆరోగ్యానికి ఆరోగ్యమూ అని కూడా వుద్భోదించారు. అంటే కోడిగుడ్డంత బంగారం లేనివారెవరూ ఈదేశంలో లేరన్నట్లుగా పప్పులు ఎక్కువగా తిని జనమంతా వూబకాయాలను పెంచుకున్నారని గౌరవనీయులైన రామదేవ్‌ బాబా అనుకుంటున్నారా ? ప్రపంచ ఆరోగ్య సంస్ధ సిఫార్సు ప్రకారం మన దేశంలో ప్రతి ఒక్కరూ రోజుకు సగటున 80గ్రాముల పప్పులు తినాల్సి వుంది. మనదేశంలో సగటు లభ్యతే 40 గ్రాముల లోపు వుంది. అసలు పప్పుల ముఖం చూడనివారు కూడా వున్నారంటే ఆశ్చర్యం లేదు.

     రామ్‌దేవ్‌ ఇలా సెలవిస్తే మన కేంద్ర ఆహార మంత్రి మాననీయ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ గారు ధరల పెరుగుదల గురించి ఆశ్చర్యపోతున్నారట. పప్పులను పండించేందుకు లేదా దీర్ఘకాలిక దిగుమతులు చేసుకొనేందుకు గాను మయన్మార్‌,మొజాంబిక్‌ దేశాలకు ప్రతినిధులను పంపుతున్నామని చెప్పారు.ఇదెలా వుందంటే దాహంతో చస్తున్నామయ్యా అంటే దేశంలో అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఇంటికీ మంచినీటి నల్లా ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నాం అని చెప్పినట్లు వుంది.పరిస్థితి ఇంత తీవ్రంగా మారుతున్నపుడు పర్యవేక్షణ చేసే యంత్రాంగం, వారిని నడిపించాల్సిన మంత్రులు ఇంతకాలంగా ఏ గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? దేశంలో టమోటాలు, బంగాళాదుంపలు, వుల్లిపాయల వుత్పత్తి గణనీయంగా పెరిగింది, వినియోగంలో మార్పు లేదు అయినా ధరలు పెరిగాయంటే దీనికి పుకార్లే కారణం అని కూడా పాశ్వాన్‌ సెలవిచ్చారు. పుకార్లను తొలగించటానికి ప్రభుత్వ యంత్రాంగం నమో భజనలో వందోవంతైనా ప్రచారంలో స్ధానంలో కల్పించలేదేం?

     మన పొరుగు దేశం పాకిస్థాన్‌ మంత్రి మరొక మహత్తర సలహా ఇచ్చారు. పప్పుల కంటే కోడి మాంసం ధర తక్కువగా వుంది కనుక దాన్ని తినండన్నారు. అక్కడ కిలో పప్పులు రు.260 వుంటే కోడి మాంసం రు.200లకే దొరుకుతోందట. ఇవేమి ధరలయ్యా బాబూ అని అక్కడి ప్రతిపక్షాల వారు అడిగితే ఈ సలహా ఇచ్చారు.

     మన దేశంలో ఎకరానికి 750కిలోల పప్పుల దిగుబడి వుంటే అభివృద్ధి చెందిన దేశాలలో 1200 నుంచి 1800 కిలోల వరకు వుంది. దీనికి తోడు గత రెండు సంవత్సరాలలో రూపాయి విలువను దిగజార్చిన ప్రభుత్వ విధానాల కారణంగా దిగుమతి చేసుకొనే పప్పుల ధరలు కూడా పెరుగుతున్నాయి. కేంద్రమంత్రులతో కుమ్మక్కయిన వ్యాపారుల సిండికేట్లు ఆఫ్రికా నుంచి కిలో 55 రూపాయలకు పప్పులను దిగుమతి చేసుకొని మన దేశంలో 175 రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకొన్నట్లు, దానిలో మోడీకి ఎల్లవేళలా అండదండలుగా వుండే అదానీ వంటి వారు వున్నట్లు వచ్చిన వార్తలను ఇంతవరకు ప్రభుత్వం ఖంచించినట్లు మనకు తెలియదు.పప్పుల దిగుమతికి అదానీ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది.http://www.indiasamvad.co.in/investigation/inside-story-how-rs-55-per-kilo-african-dal-was-sold-in-india-for-rs-175-7853 అదానీ రేవులలో దిగుమతి చేసుకున్న పప్పులను నిలవ చేసి దాచివేశారని కూడా ఆరోపణలు వున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుబ్రమణ్యస్వామి పర్యవేక్షణలో ఆర్ బి ఐ గవర్నర్‌గా బిజెపి కార్యకర్త ?

19 Sunday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP activist, mody, Raghu ram rajan, RBI, RBI governor, Subramanya swamy

ఎం కోటేశ్వరరావు

     జపాన్‌-ఇండియా, అక్కడ ధరలను ఎలా పెంచాలా అని తలబద్దలు కొట్టుకుంటుంటే, ఇక్కడ ఎలా తగ్గించాలా అని చూస్తున్నారు. ఇక్కడ వడ్డీరేటు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్కడ బ్యాంకులో ఎవరైనా డబ్బు దాచుకుంటే వారే 0.10 శాతం ఎదురు చెల్లించాలి. వడ్డీ రేటు ఎక్కువ వుంటే ఆర్ధికాభివృద్ధి వుండదా ? ప్రపంచంలో అత్యధిక వడ్డీ రేటు లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనాలో 34.45 శాతం (మే 2016) వుంది. అక్కడ వృద్ధి రేటు గతేడాది 2.1శాతం. పక్కనే వున్న అమెరికాలో వడ్డీ రేటు 0.50 శాతమే అక్కడా వృద్ధి రేటు రెండు శాతం వరకు వుంది. స్వీడన్‌, డెన్మార్క్‌, స్విడ్జర్లాండ్‌లలో ఎవరైనా బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే వారే 0.5,0.65,0.75శాతం చొప్పున బ్యాంకులకు ఎదురు వడ్డీ చెల్లించాలి. మరి అక్కడ అభివృద్ధి లేదా ? అంతెందుకు పక్కనే వున్న పాకిస్థాన్‌లో వడ్డీ రేటు 5.5శాతం కాగా వృద్ధి రేటు 4.8శాతం వుంది. ఇంకా ఇలాంటి వివరాలను పేర్కొంటే బుర్ర బద్దలు అవుతుంది. ఈ దేశాలన్నీ పెట్టుదారీ విధానాన్ని అనుసరిస్తున్నవే. మరి ఈ వడ్డీ రేట్లేమిటి ? కొన్ని దేశాలలో బ్యాంకులకు ఎదురు వడ్డీ ఇచ్చి జనం డబ్బు ఎందుకు దాచుకుంటున్నారు? వారికి పెట్టుబడి అవకాశాలు లేవా ? అభివృద్ధి రేటులో ఇంత వ్యత్యాసం ఏమిటి ? ఎందుకీ ప్రయాస అంటారా ?

     వడ్డీ రేటు తగ్గింపు, తదితర విధానాలపై విబేధాలు, ఆరోపణలు, అవమానాల కారణంగానే రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అసాధారణరీతిలో తాను పొడిగింపును కోరుకోవటం లేదని, తనపని తాను చూసుకుంటానని బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది.చరిత్రలో అనేక మంది గవర్నర్లు వచ్చారు, పోయారు. బహుశా ఇలాంటి పరిస్ధితి ఎవరి విషయంలోనూ తలెత్తి వుండదు. కొద్ది వారాల ముందు రాజన్‌ ఈ ప్రకటన చేసి వుంటే నరేంద్రమోడీ సర్కార్‌ తన విజయాల జాబితాలో దీనిని కూడా చేర్చి వుండేది లేదా సుబ్రమణ్యస్వామి వంటివారి చేత ప్రకటనలు చేయించి వుండేదేమో ? వడ్డీ రేటుకు, అభివృద్ధి రేటుకూ సంబంధం లేదని చెప్పేందుకే పైన అన్ని వివరాలను పేర్కొని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. నరేంద్రమోడీ చెప్పినట్లుగా గుజరాత్‌ మోడల్‌ లేదూ, అభివృద్దీ లేదు దాన్ని అంగీకరించటానికి పాలక కూటమికి ధైర్యమూ లేదు, ఈ రోజు కాకున్నా రేపయినా జనం అడుగుతారు. ఇదిగో రఘురామ్‌ రాజన్‌ కారణంగానే ఇదంతా జరిగింది, దాన్ని సరిదిద్దటానికి మూడు సంవత్సరాలు పట్టింది, మరోసారి మాకు అవకాశం ఇస్తే మాజిక్‌ చూపిస్తాం అని 2019ఎన్నికలలో సాకు చెప్పేందుకే ఇంతా చేశారా ? ఏమో గత 24 సంవత్సరాలలో ప్రతి గవర్నర్‌కూ రెండవ సారి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం రాజన్‌ పట్లనే ఇలా ఎందుకు వ్యవహరించింది? దీని వలన ప్రభుత్వానికి అదనంగా వచ్చే ప్రయోజనం ఏమిటి? సమాధానం లేకపోగా మంచిది కొత్త గవర్నర్‌ను చూస్తాం అని ఆర్ధిక మంత్రి జైట్లీ తాపీగా చెప్పారు.

    ఒకటి మాత్రం స్పష్టం. వచ్చే రిజర్వుబ్యాంకు గవర్నర్‌ తమకు తాన తందానా పలకాలన్న సందేశాన్ని మోడీ సర్కార్‌ స్పష్టంగా పలికింది. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలన్నింటినీ తన పార్టీ కార్యకర్తలతో నింపుతోంది. టీవీ సీరియల్స్‌లో గుడ్డి పాత్రల వంటి చిన్నా చితకా అనుభవ తప్ప పెద్ద అనుభవం లేని గజేంద్ర చౌహాన్‌ను ప్రతిష్టాత్మక పూనా ఫిల్మ్‌ఇనిస్టిట్యూట్‌కు అధిపతిగా చేసిన విషయం తెలిసిందే. అదే బాటలో మరో చౌహాన్‌ రంగం మీదకు వచ్చారు. ఈయనకు ఆ పరిమిత అనుభం కూడా లేదు. తాజాగా జాతీయ ఫ్యాషన్‌ టెక్నాలజీ సంస్ధ అధిపతిగా 68 సంవత్సరాల మాజీ క్రికెటర్‌ చేతన చౌహాన్‌ను నియమించింది. ఈ సంస్థ అధిపతులుగా సుప్రసిద్ద విద్యావేత్త, శాస్త్రవేత్త, సాంకేతికవేత్త, ప్రొఫెషనల్‌ను నియమించాలని చట్టంలో స్పష్టంగా వుంది.దాన్ని పక్కన పెట్టి పార్టీ కార్యకర్తను అందలమెక్కించారు.దీనిపై సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ చర్యను పరిహసిస్తూ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో అధిపతిగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను వేస్తారేమో అన్నది వాటిలో ఒకటి. ఇవన్నీ చూస్తే రేపు ఏ బిజెపి కార్యకర్తనో రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా నియమించినా చేసేదేమీ లేదు. ఎందుకంటే ఆర్ధికవేత్త సుబ్రమణ్య స్వామి ఎలాగూ మార్గదర్శనం చేసేందుకు వున్నారు కదా !

    ప్రతి దేశ రిజర్వు బ్యాంకు నెలా లేదా రెండు నెలలు, లేదో ఒక నిర్ణీత వ్యవధిలో తన విధాన సమీక్ష చేసుకొని వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. పెట్టుబడిదారీ ఆర్ధిక సూత్రాల ప్రకారం ద్రవ్యోల్బణ రేటు వస్తువులు, సేవల ధరల పెరుగుదల తీరుతెన్నులను ప్రతిబింబిస్తుంది. సాధారణ సూత్రం ప్రకారం వడ్డీరేటు తక్కువ వుంటే ఎక్కువ మంది అప్పుచేస్తారు, ఆ సొమ్ముతో వస్తువులను కొంటారు, అది ఆర్ధికవ్యవస్ధ పురోగతికి దారితీస్తుంది.ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మనదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం వరకు వాయిదాల మీద ఎలక్ట్రానిక్‌ వస్తువులు కొనే వారికి వడ్దీ రాయితీ గురించి వల విసిరే వారు. ఇప్పుడు ఎలాంటి వడ్డీ లేకుండా వస్తువుల కొనుగోలుకు అప్పులిస్తున్నారు. అంటే కంపెనీలే వస్తువు ధరలో వడ్డీని కూడా కలుపుతాయి అది వేరే విషయం. వడ్డీ రేట్లు పెరిగితే జనం తమ సొమ్మును పొదుపు చేసుకోవటం ఎక్కువ చేసి వస్తు కొనుగోలు తగ్గిస్తారు.అది ఆర్ధిక వ్యవస్ధ మందగించటమే కాదు, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అందువలన వడ్డీరేటు తగ్గింపు, పెంపుదల అనేది ఆర్ధిక వ్యవస్థను సమతూకంలో వుంచే సాము గరిడీ వంటిది.

    టీవీ సీరియల్స్‌లో బ్రేక్‌ మాదిరి ఇక్కడొక చిన్న పిట్ట కధ చెప్పాలి. ఒక పెద్దమనిషి కారణాలేమైనా ఇద్దరిని వివాహం చేసుకున్నాడట. పెద్ద భార్య జుట్టు నెరిసింది, భర్త జుట్టులో నలుపు తెలుపూ రెండూ వున్నాయి. అందుకని ఆమె నల్ల వెంట్రుకలను పీకివేసేదట. చిన్న భార్య తన జుట్టు నలుపు కనుక తన భర్త జుట్టులో వున్న తెల్ల వెంట్రుకలను నిర్ధాక్షిణ్యంగా తీసివేసేదట. చివరికి ఏమైందో చెప్పక్కర లేదు. ఆర్ధిక వ్యవస్థలో కూడా విరుద్ధ శక్తులు విధానాన్ని తమవైపు వుండేట్లు చూసుకుంటాయి. కరెన్సీ విలువనే చూడండి. విలువ ఎక్కువగా వుంటే దిగుమతి చేసుకొనే వస్తువులు చౌకగా వస్తాయి.తక్కువగా వుంటే మన వస్తువుల ధరలు అంతర్జాతీయ విపణితో తక్కువగా వుండి ఎగుమతులు పెరుగుతాయి. అందువలన ఒకరు మన రూపాయి విలువ తగ్గించాలని కోరితే, మరొకరు పెంచాలని కోరతారు. వడ్డీ రేటు కూడా ఇంతే.

   ఇక రఘురామ రాజన్‌ విషయానికి వస్తే ఆయన పెట్టుబడిదారీ విధాన సమర్ధకుడు తప్ప వ్యతిరేకించే ఆర్ధికవేత్త కాదు. అందువలన ఆయన కొనసాగితే సామాన్య జనానికి ఏదో మేలు జరుగుతుందని ఎవరూ భావించనవసరం లేదు, జరగాల్సిన కీడు ఇప్పటికే జరిగింది కనుక జనానికి పెద్దగా నొప్పి కూడా వుండదు. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం తమ ప్రభుత్వం పాలన ముగిసిన తరువాత ఎన్నికలలో దేశం వెలిగిపోతోంది అని ప్రచారం చేసుకుంది. నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ ప్రధాని కనుక పాలన చేపట్టిన మరుసటి రోజు నుంచే వెలిగి పోతోందని ప్రచారం ప్రారంభించారు. మన రిజర్వుబ్యాంకు గవర్నర్లలో రాజన్‌ పిన్న వయస్కుడు. నిర్మొహమాటంగా మాట్లాడే స్వభావం వుందని చెబుతారు. అమెరికాలో వుండి వచ్చారు కనుక అక్కడి మాదిరి ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చు అనుకున్నారేమో. నరేంద్రమోడీ సర్కార్‌ అతిశయోక్తులను భరించలేక అంధుల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అని పరోక్షంగా చురక అంటించారని అంటున్నారు.దాని మీద ఎవరు ఎలా విరుచుకుపడిందీ దేశం చూసింది. అప్పుడే రాజన్‌కు మరొక అవకాశం రాదని చాలా మంది అనుకున్నారు. ఆ తరువాతే శిఖండి మాదిరి నోటి తుత్తర సుబ్రమణ్య స్వామిని రంగంలోకి దించారు. ఇదంతా పొమ్మనకుండా పొగబెట్టటం అని తెలియనంత అమాయకంగా రాజన్‌ లేరు కనుక ఆయన కూడా అసాధారణ రీతిలో పదవీ విరమణకు 80 రోజుల ముందుగానే ఒక బహిరంగ లేఖ రాసి తానేమిటో ప్రదర్శించుకున్నారు. ఇదంతా లేకుండా ఎలాంటి వివాదాలు లేకుండా రాజన్‌ తప్పుకునే అవకాశాన్ని మోడీ సర్కార్‌ సృష్టించి వుంటే పరిస్థితి వేరుగా వుండేది. అలా జరిగితే సలహాదారులకు పనేముంటుంది?

    ఇప్పుడు ప్రభుత్వ పరిస్ధితి ఒకరకంగా ఇరకాటంలో పడింది.ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలో ప్రారంభమైన ఇప్పడప్పుడే పరిష్కారమయ్యే సూచనలు కనిపించటం లేదు. ఈ స్ధితిలో మోడీ జనంలో ఎన్నో ఆశలు కల్పించారు. దేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ రోజులు గడిపి తానేదో అద్బుతదీపాన్ని తెస్తున్నట్లు హడావుడి చేశారు. రాబోయే రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్‌ ప్రతి చర్యను రాజన్‌ హయాంతో పోల్చుతారు. రాజన్‌ అయినా మరొకరైనా మన జీవనాడులను చేజిక్కించుకున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ గీచిన పరిధులలో మాత్రమే పనిచేయాల్సి వుంటుంది. దానికి భిన్నంగా వెళ్లే అవకాశం లేదు.

     ప్రపంచీకరణలో భాగంగా మన ఆర్థిక వ్యవస్థను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులకు తెరిచారు. ఫోర్టుపోలియో పెట్టుబడులు అంటే వడ్డీ వ్యాపారుల వంటి వారు. మన ప్రభుత్వం తీసుకొనే రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా వుంటే మన రుణపత్రాలు(బాండ్లు) కొంటారు. లేకపోతే ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడకు వెళ్లిపోతారు. మనకు ఆ రూపంలో విదేశీ మారక ద్రవ్యం రాకపోతే మన విదేశీ చెల్లింపులు ప్రమాదంలో పడతాయి, బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన రోజులు వస్తాయి. అందువలన రిజర్వు బ్యాంకు గవర్నరు లేదా వడ్డీ రేటు విధానం గురించి మోడీ సర్కార్‌ ఎంతగా వివాదం లేదా ప్రచారం చేస్తే అంతగా జనం దృష్టి వాటిమీద పడుతుంది. పర్యవసానాలపై స్పందన కూడా ఎక్కువగానే వుంటుంది.

   విజయమాల్య వంటి రుణ ఎగవేతదారులు గత రెండు సంవత్సరాల కాలంలో పెరిగారు, అలాంటివారిపై చర్యలకు వాణిజ్యబ్యాంకులను రాజన్‌ కదిలించారని కొందరు చెబుతున్నారు. అదే నిజమైతే కావూరి సాంబశివరావు వంటి ఎందరో బిజెపిలో చేరిన రుణ ఎగవేతదారుల వత్తిడి కూడా నరేంద్రమోడీ మీద వుందా ? రాబోయే రోజుల్లో ఇలాంటి అంశాలన్నీ అజెండాలోకి వస్తాయి. పశ్చిమ దేశాల పరిణామాలను చూస్తే ఆర్ధిక సంక్షోభ భారాలను సామాన్య జనం మీద నెట్టటం కనిపిస్తోంది. దానికి అయా దేశాలలో వున్న రిజర్వుబ్యాంకులు సాధనాలుగా పనిచేస్తున్నాయి. అందువలన మోడీ సర్కార్‌ కార్పొరేట్‌ సంస్థలకు మరింతగా కట్టబెట్టాలన్నా, జనంపై భారాలు మోపాలన్నా రిజర్వుబ్యాంకు విధానాలు ముఖ్యం. అందువలన కొత్త గవర్నర్‌గా ఎవరిని తెస్తారు ? ఇప్పటి కంటే మౌలిక మార్పులు ఏం చేస్తారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కనీస మద్దతు ధరలు-నరేంద్రమోడీ వాగ్దానం-వాస్తవం !

10 Friday Jun 2016

Posted by raomk in AP NEWS, CHINA, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

cotton, cotton subsidies, minimum support price, MSP, narendra modi promises, narendra modi promises and facts, Paddy

ఎంకెఆర్‌

   నయా వుదారవాదం పౌరుల స్ధానంలో వినియోగదారులను, సమాజాలకు బదులు షాపింగ్‌ మాల్స్‌ను తయారు చేస్తుందని ప్రఖ్యాత సామాజికవేత్త నోమ్‌ చోమ్‌స్కీ చెప్పారు. అంతిమ ఫలితం ఏమంటే నైతికంగా దెబ్బతిని,సామాజికంగా శక్తి కోల్పోయిన పనిలేని వ్యక్తులతో కూడిన సమాజంగా మార్చివేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నయా వుదారవాదం ప్రపంచవ్యాపితంగా నిజమైన ప్రజాస్వామ్యానికి తక్షణ శత్రువు అని కూడా చోమ్‌స్కీ చెప్పారు.

     కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 2016-17 సంవత్సర ఖరీఫ్‌ పంటల మద్దతు ధరలపై ఇప్పటికీ నూటికి 70శాతం వరకు వ్యవసాయంపై ఆధారపడుతున్న, గిట్టుబాటు కాని రైతాంగం నుంచి ఎలాంటి స్పందన వెల్లడి కాకపోవటాన్ని బట్టి మన సమాజాన్ని కూడా నయా వుదారవాద భ్రమలు పట్టి పీడిస్తున్నాయా ? నరేంద్రమోడీ, అనుంగు అనుచరులలో ఒకరైన చంద్రబాబు, అవకాశం దొరక్క దూరంగా వున్న కెసిఆర్‌ వంటి వారిమీద కూడా వున్న భ్రమలతో రైతాంగం కనీస మద్దతు ధరలు ఒక లెక్కా అని లేదా గతంలో ప్రకటించిన ధరలతో ఒరిగిన ప్రయోజనం ఏముందనే నిరాశా నిసృహలతో మనం చేయగలిగిందేమీ లేదన్న నిర్వేదంతో గానీ పెద్దగా స్పందించటం లేదా ? వ్యవసాయం గిట్టుబాటు గాని రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతుండటాన్ని బట్టి ప్రభుత్వాలపై వారిలో విశ్వాసం కలగలేదన్నది మాత్రం స్పష్టం.

     2022వ సంవత్సరానికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామని, వుత్పత్తి ఖర్చుపై 50శాతం ప్రతిఫలం చెల్లిస్తామని నరేంద్రమోడీ అండ్‌కో వాగ్దానం చేసిన విషయాన్ని మోడీ ప్రభుత్వ విజయగానాలతో మునిగి తేలుతున్న వారికి ఇష్టం లేకపోయినా ప్రస్తావించక తప్పదు. యుపిఏ ప్రభుత్వం రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత ఏ గ్రేడ్‌ ధాన్యం కనీస మద్దతు ధర 2009-10 సంవత్సరానికి క్వింటాలు ధర రు.1035లు నిర్ణయించింది, ఆ మొత్తాన్ని 2013-14కు 1345కు పెంచింది. అంటే ఐదు సంవత్సరాలలో 310రూపాయలు లేదా 30శాతం పెంచింది. గత మూడు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ ఆ మొత్తాన్ని 1345 నుంచి1510కి అంటే 165 దీన్ని శాతంలో చెప్పాల్సి వస్తే 12.26 వుంది. కాంగ్రెస్‌ హయాంలో సగటున ఏటా ఆరుశాతం పెంచితే బిజెపి నాలుగు శాతానికి పరిమితం చేసింది. కాంగ్రెస్‌ స్ధాయికి చేరాలంటేనే రాబోయే రెండు సంవత్సరాలలో 18 శాతం పెంచాలి. మరి తాను చెప్పిన 50శాతం పెంపుదల ఎన్నటికి నెరవేరేను ? ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకోవటమేనా ? ఇక్కడ కాంగ్రెస్‌ పేరును ప్రస్తావించటం అదేదో రైతాంగానికి ఒరగబెట్టిందనే ప్రశంశ కాదు. పోలికకు ఏదో ఒక గీటురాయి వుండాలి, లేదా చేసిన వాగ్దానాన్ని ఆచరణతో అయినా పోల్చాలి. మోడీ సర్కార్‌ తన విజయాలను గత కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్వాకాలతోనే పోల్చుకుంటున్నదనే పచ్చినిజం తెలిసిందే.

    రెండు తెలుగు రాష్ట్రాలలో వరి తరువాత వాణిజ్య పంటలలో ప్రధానమైన పత్తి విషయానికి వస్తే పొడవు పింజ రకాల మద్దతు ధర పైన పేర్కొన్న కాంగ్రెస్‌ కాలంలో మూడు నుంచి నాలుగు వేలకు అంటే 33శాతం పెంచగా మోడీ మూడు సంవత్సరాలలో నాలుగువేల నుంచి 4160కి అంటే నాలుగు శాతం మాత్రమే పెంచారు.అయినా సరే చంద్రబాబు నాయుడికి నవనిర్మాణదీక్ష, మహాసంకల్పం పేరుతో జగన్‌ పారాయణం, కెసిఆర్‌ సైన్యానికి కొత్తగా కోడండరాంపై విమర్శలు తప్ప మరేమీ పట్టటం లేదు. పోనీ ప్రతిపక్షాల సంగతి చూస్తే వాటికీ కనీస మద్దతు ధరలు ఒక అంశంగా కనిపించినట్లు లేదు.

   వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రధానమైనవి. ప్రపంచీకరణ పుణ్యమా అని అవన్నీ బహుళజాతి గుత్త సంస్ధల వ్యాపార సరకులుగా మారిపోయి డాలర్ల ప్రాతిపదికన రేట్లు వసూలు చేస్తున్నారు. అందువలన కొద్దిపాటి తేడాలు తప్ప ప్రపంచంలో ఎక్కడైనా రైతాంగానికి వాటి ధరలు దాదాపు ఒకే విధంగా వుంటాయి. పెట్రోలు, డీజిల్‌ వంటి వాటిని దిగుమతి చేసుకున్న ధర కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలో పన్నులు ఎక్కువ విధించిన కారణంగా రైతాంగానికి పెట్టుబడి ఖర్చులు ఇంకా ఎక్కువ వుంటాయి. వస్తువులను యంత్రాలతో తయారు చేసుకోవచ్చు తప్ప ఆహార ధాన్యాలను పండించటం ద్వారా తప్ప యంత్రాల నుంచి తయారు చేసుకొనే పద్దతి ఇంకా రాలేదు. అందువలన ప్రతి ప్రభుత్వం రైతాంగానికి ఏదో ఒక రూపంలో రక్షణ కల్పించటం అనివార్యం. కానీ మన దేశంలో వున్న రక్షణలను తొలగిస్తున్నారు, వ్య వసాయరంగంపై ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించివేస్తున్నారు. అనేక దేశాలలో వుత్పాదకతను పెంచటం ద్వారా ఆయా ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవటంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరలకు ఆహార ధాన్యాలను అందిస్తున్నాయి. మన దేశంలో పరిస్ధితి అందుకు భిన్నంగా వుంది. కనీస మద్దతు ధరల పెంపు వాస్తవానికి అనుగుణంగా లేదని అంగీకరిస్తూనే అంతకంటే ఎక్కువగా వున్న వినియోగదారుల ప్రయోజనాలను గమనంలో వుంచుకోవాలనే వాదన ముందుకు తెస్తూ రైతాంగాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వానికి వినియోగదారుల బాధ్యత కూడా వున్న మాట నిజమే. వుత్పాదకతను పెంచేందుకు అవసరమైన చర్యలు, పెట్టుబడులకు వినియోగదారులు ఏనాడైనా అభ్యంతరం చెప్పారా, వుత్పాదకత పెరిగితే తమకు ఇంకా తక్కువ ధరలకే ఆహార ధాన్యాలకు దొరికితే వారు సంతోషించరా ?

   అమెరికా వ్యవసాయ శాఖ రూపొందించిన నివేదిక ప్రకారం 2015లో వివిధ దేశాలలో వున్నధాన్య దిగుబడులు హెక్టారు(రెండున్నర ఎకరాలు)కు ఇలా వున్నాయి. పత్తి వివరాలు ఇండెక్స్‌ మండీ నుంచి తీసుకున్నవి. పత్తి దిగుబడులలో ఆస్త్రేలియా 1833,ఇజ్రాయెల్‌ 1633, మెక్సికో 1591, టర్కీ 1559 కిలోలతో తొలి నాలుగు స్ధానాలలో వున్నాయి.

దేశం       ధాన్యం టన్నులు     పత్తి కిలోలు

ఈజిప్టు         8.92                 740

అమెరికా       8.37                 862

చైనా           6.89                1524

బ్రెజిల్‌         5.52                1530

బంగ్లాదేశ్‌      4.40                605

శ్రీలంక        3.96                 218

పాకిస్తాన్‌      3.67                 560

భారత్‌         3.61                517

    మన దేశ రైతాంగం ఇంత తక్కువ దిగుబడులు, పెరుగుతున్న ఖర్చులతో ఎలా తట్టుకోగలదు ? అందువలన విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు ఎన్నో రాయితీలు ఇస్తూ ఎర్రతివాచీ పరుస్తున్న ప్రభుత్వాలు మన వ్యవసాయం స్వయం సమృద్ధం కావాలన్నా, ఎగుమతులు చేసి విదేశీ మారక ద్రవ్యం సంపాదించాలన్నా వ్యవసాయానికి మద్దతు,పెట్టుబడులు మినహా మరో మార్గం లేదు.

    2012,13 సంవత్సరాలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ధాన్యం క్వింటాలు రు. 1900పైగా పలికిన సమయంలో మన ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రు.1080 మాత్రమే. ఎగుడుదు దిగుడులు వున్నప్పటికీ అంతర్జాతీయ ధరలు మన కనీస మద్దతు ధరల కంటే ఎప్పుడూ ఎక్కువే వుంటున్నాయి. ఎగుమతులు చేయాలంటే మనతో పోటీ పడే వారికంటే తక్కువ ధరకు అమ్మాలి కను మద్దతు ధరలను తక్కువగా వుంచుతున్నారు. అందుకోసం మన రైతాంగాన్ని బలిపెట్టాల్సిన అవసరం ఏముంది?

     ఈ ముఖ్యమైన సమస్యను పరిష్కరించకుండా మన వ్యవసాయ ఖర్చుల, ధరల కమిషన్‌ కొన్ని చిట్కాలను రైతుల ముందుంచుతున్నది. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మరింత యాంత్రీకరణ చేయమని చెబుతున్నది. మన దేశంలో ఏటేటా యంత్రాల వినియోగం పెరుగుతూనే వుంది. అదే సమయంలో ప్రతి ఏటా మద్దతు ధరలు, మార్కెట్‌ ధరలు రైతాంగానికి న్యాయం చేయటం లేదన్న సంగతి తెలిసిందే. అనేక అభివృద్ధి చెందిన దేశాలలో మన కంటే ఎంతో ఎక్కువగా యంత్రాలను ప్రవేశపెట్టినా రైతాంగానికి గిట్టుబాటు గాక అనేక రాయితీలు కల్పిస్తున్న విషయాన్ని గమనించాలి. రెండవది సామాజిక కోణం వైపు నుంచి చూసినపుడు వ్యవసాయంలో యంత్రాలు ప్రవేశ పెట్టటం అంటే వ్యవసాయ కార్మికులకు దొరుకుతున్న పని రోజుల సంఖ్య తగ్గిపోవటమే. అందుకే గ్రామీణ ప్రాంతాలలో వుపాధి హామీ పనులకు డిమాండ్‌ పెరిగింది. ఈ పధకం వచ్చినప్పటి నుంచి తమకు చౌక ధరలకు దొరికే కూలీలు కరువుయ్యారని భూస్వాములు, ధనిక రైతులు దానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న విషయం తెలిసిందే. వారి వత్తిడి మేరకు అనేక చోట్ల ఆ పధకంలో ఇప్పుడు యంత్రాలను అనుమతిస్తూ గ్రామీణ ప్రాంతాలలో యంత్రాల యజమానుల లాభాల, ఆదాయ హామీ పధకంగా మార్చివేశారు.

     పత్తి రైతులు మన దేశంలో ఎంత దుస్థితిలో వున్నారో తెలిసిందే. చైనా ఎలా ఆదుకుంటున్నదో చూద్దాం. అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ(ఐసిఎసి) 2015 డిసెంబరులో ప్రకటించిన నివేదిక ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. దిగుమతి మొత్తాలు, విలువలను అదుపు చేయటం ద్వారా చైనా పత్తి వుత్పత్తిదారులకు మద్దతు ఇస్తున్నది. దిగుమతి కోటా పరిధిలోని పత్తి దిగుమతులపై 40శాతం పన్నులు విధిస్తున్నది.దీనికి తోడు పెద్ద ఎత్తున నిల్వలను నిర్వహిస్తున్నది. 2011-14 సంవత్సరాలలో చైనా అనుసరించిన పత్తి విధానం ప్రకారం కనీస మద్దతు ధరలను చెల్లించి పత్తి కొనుగోలు చేసింది.2013-14లో మద్దతు సేకరణ సగటున టన్ను 20,400 యువాన్లు లేదా పౌను అరకిలో దూది ధర 151 సెంట్ల చొప్పున 63లక్షల టన్నులు కొనుగోలు చేసింది. తరువాత విధానాన్ని మార్చింది. 2014-15లో టన్ను ధర లక్ష్యంగా 19,800 యువాన్లు లేదా పౌను 146 సెంట్లుగా నిర్ణయించింది. రైతులు ఇంతకంటే తక్కువకు అమ్ముకున్నట్లయితే ప్రభుత్వం ఆ తేడా మొత్తాన్ని రైతులకు నేరుగా చెల్లించే ఏర్పాటు చేసింది. పిల్లి నల్లదా తెల్లదా అని గాక అది ఎలుకను పడుతుందా లేదా అని చూడాలన్న సామెత మాదిరి పద్దతులు ఎన్ని మార్చినా అవి రైతాంగానికి ఏమేరకు వుపయోగపడ్డాయన్నది ముఖ్యం. ఆ విధంగా చూసినపుడు 2014-15లో గరిష్టంగా 8.2 బిలియన్‌ డాలర్ల మేరకు రైతులకు పలు రూపాలలో సబ్సిడీ అందించింది. అంతకు ముందు సంవత్సరం కంటే రెండు బిలియన్‌ డాలర్లు ఎక్కువ. మరి మన దేశంలో ఏం జరుగుతోంది. ఏదో ఒక పేరుతో ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుంటోంది. సబ్సిడీలను ఎత్తివేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో వాగ్దానం చేసి వచ్చింది. రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామంటే నమ్మేదెలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ నల్ల ధన వెలికితీత ఓ ప్రహసనం

07 Tuesday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, Black Economy in India, black money unearth, Narendra Modi

సత్య

     తాను అధికారంలోకి వస్తే విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వంద రోజుల్లో బయటకు తెచ్చి ప్రతి ఒక్కరికి 15లక్షల వంతున బ్యాంకుల్లో వేస్తానని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి, దాని మిత్రపక్షాల నేతలు గత లోక్‌ సభ ఎన్నికలలో చేసిన వాగ్దానాలలో ఒకటి. దానికి అనుగుణంగానే డిపాజిట్లు లేకుండానే ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా పేరుతో కేంద్ర ప్రభుత్వం చేసిన హడావుడీ ఇంతా అంతా కాదు. తమ వాటా పదిహేనులక్షలు వేసేందుకే మోడీ తమ చేత ఖాతాలు తెరిపించారని అనేక మంది భ్రమ పడ్డారు, రెండు సంవత్సరాల తరువాత కూడా ఇంకా అనేక మంది అలాంటి వారు వున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలపుడు ఏదో మాట వరసకు ఎన్నో అంటాం మేడంటే మేడా కాదు, ఇల్లంటే ఇల్లూ కాదు, తలా పదిహేను లక్షలు వేస్తామంటే వేస్తామని కాదు అని తరువాత ఒక సందర్భంగా బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా అబ్బే వుట్టిదే అని తేల్చిపారేశారు. అయినా నల్లధనం గురించి పెద్ద డ్రామా నడుస్తూనే వుంది.

     అంబిట్‌ కాపిటల్‌ రీసర్చ్‌ అనే సంస్ధ తాజాగా భారత్‌లో 30లక్షల కోట్ల రూపాయల మేర నల్లధనం వున్నదని పేర్కొన్నది. ఇది నిజానికి పెద్ద వార్త కాదు, దీనిలో కొత్త విషయూ లేదు. కాకపోతే ప్రధాని నరేంద్రమోడీ నల్లధన ప్రపంచ రాజధానిగా పరిగణించబడే స్విడ్జర్లాండ్‌, ఇతర దేశాల పర్యటన సందర్భంగా దీనిని వదలటం, మీడియా ప్రముఖంగా ప్రచురించటంతో మరోసారి జనాన్ని ఆకర్షించింది. స్విడ్జర్లాండ్‌ వెళ్లిన తరువాత ప్రధాని నల్లధనంతో పాటు మా సినిమా పరిశ్రమ మీ దేశంలోనే షూటింగ్‌లు కూడా జరిపి అందాలను బందీ చేస్తోంది అని ఆదేశ అధ్యక్షుడు జాన్‌ షిండర్‌ అమన్‌తో కలిసి చెప్పారు. నల్లధనం గురించి మాట్లాడేందుకు ఒక అధికారిని భారత్‌కు పంపుతామని వారు హామీ ఇచ్చారు. తరువాత జరిగేదేమిటో మనం పెద్దగా వూహించుకోనవసరం లేదు.

    నల్లధనం విషయానికి వస్తే 1970 దశకంలో కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న సమయంలో పన్నుల రేట్లు బాగా పెంచింది. దాంతో బ్లాక్‌ మనీ సమస్య కూడా అప్పటి నుంచే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయింది. తరువాత కాలంలో పన్ను రేటు గణనీయంగా తగ్గించినా, అనుసరించిన నూతన ఆర్ధిక విధానాలు కోటీశ్వరులను శత కోటీశ్వరులుగా మార్చటం, కొంత మంది చేతిలో నడమంత్రపు సిరి చేరటంతో దేశ, విదేశాలలో నల్లధనం దాచుకోవటం, సమాంతర ఆర్ధిక వ్యవస్ధ నడపటం గురించి చెప్పనవసరం లేదు.నల్లధనం అంటే ఏమిటి అంటే నిర్ధిష్ట నిర్వచనం లేదు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేయటం, వుత్పత్తిని, అమ్మకాలను తక్కువ చూపటం వంటి కార్యకలాపాల ద్వారా సమకూరే లెక్కలు లేని ఆదాయాన్ని నల్లధనం అంటున్నారు. ఇది ఇంకా దొంగరవాణా తదితర అనేక మార్గాలలో కూడా సమకూరుతుంది. ఇది ఎంత అంటే రెండు రెళ్లు నాలుగు అన్నట్లు ఎవరూ చెప్పలేరు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని అంచనా అంకెలను మాత్రమే చెబుతారు. ఈ విధంగా చూసినపుడు 1970-71లో జిడిపిలో 4.8 నుంచి 22.3 శాతం వరకు వున్నట్లు వివిధ అంచనాలు తెలిపాయి. పది సంవత్సరాల తరువాత 13.5 నుంచి 48శాతం వరకు పెరిగాయి. ప్రపంచబ్యాంకు పరిశోధనా బృందం 1999-2007 మధ్య 162 దేశాలలో పోటీ ఆర్ధిక వ్యవస్థల గురించి చేసిన పరిశోధనలో అధికారికంగా ప్రకటించే జిడిపిలో ప్రపంచ సగటు 31 నుంచి 34శాతం నల్లధనం వున్నట్లు పేర్కొనగా భారత్‌ అది 20.7 నుంచి 23.2 శాతం వరకు నల్లధనం వున్నట్లు తెలిపింది. అంబిట్‌ కాపిటల్‌ రీసర్చ్‌లో పేర్కొన్న అంకెలు దీనికి అనుగుణంగానే వున్నాయి. 2016లో మన జిడిపి రెండులక్షల 30వేల కోట్ల డాలర్లు అని అంచనా వేస్తే దానిలో 20శాతం 46వేల కోట్ల డాలర్లు, అది 30లక్షల కోట్ల రూపాయలకు సమానం. ఇదీ అంబిట్‌ లెక్క. దీనికంటే ఎంతో ముందే మన దేశ నల్ల ధనం విలువ 35లక్షల కోట్లని అంచనా వేసిన విషయాన్ని మరిచిపోరాదు. మరొక పద్దతి ప్రకారం ఒక దేశానికి ఎంత విదేశీ అప్పు వుంటే దానిలో 20శాతానికి సరిపడా ఆదేశ పెద్ద మనుషులు విదేశాల్లో నల్లధనాన్ని దాచుకుంటారట.మన దేశ నల్లధనం విషయానికి వస్తే అడ్డదారుల్లో దేశం నుంచి దాటించి తిరిగి దానినే పెట్టుబడులో మరో రూపంలోనో మన దేశానికి తరలించి రాయితీలు పొందుతున్నారన్నది బహిరంగ రహస్యం. ఒక డాలరు పెట్టుబడి పెడితే దానికి వివిధ రూపాలలో ఇస్తున్న రాయితీలు అంటే చౌకధరలకు భూమి, విద్యుత్‌, నీరు వంటి మౌలిక సదుపాయాలు, సంవత్సరాల తరబడి పన్ను రాయితీలను కలుపు కుంటే రెండున్నర డాలర్ల లాభాన్ని పెట్టుబడిదారులు పొందుతున్నారు. ఎవరైనా దీనిని ప్రశ్నిస్తే మన దేశంలో వాణిజ్యవేత్తల మనోభావాలు దెబ్బతింటాయి, అభివృద్ధి నిరోధకులు అని ముద్రవేసి దాడిచేస్తున్నారు.

   అంబిట్‌ కాపిటల్‌ రిసర్చ్‌ కధ విషయానికి వస్తే దీనిలో అనేక ఆసక్తికర అంశాలు వున్నాయి.ఈ నల్లధనాన్ని ఎక్కువ భాగం రియలెస్టేట్‌, బంగారం కొనుగోళ్ల రూపంలో దాచుకుంటున్నారని అంబిట్‌ తెలిపింది. నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకున్న వివిధ చర్యల కారణంగా బంగారం, ఆభరణాల రూపంలో నల్లధనం దాచుకోవటం కష్టంగా మారిందని, వాటి కొనుగోలు తగ్గిపోయిందని, భూమి, భవనాల ధరలు కూడా పడిపోయాయని పేర్కొన్నది. నల్లధనంపై గతేడాది కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనుకోని పర్యవసానాలకు దారితీసి పెట్టుబడి వ్యయం 24నుంచి 34శాతానికి పెరిగిందట. దాడుల కారణంగా జనం బ్యాంకుల ద్వారా కాకుండా నేరుగా డబ్బుతో లావాదేవీలు చేస్తున్నారట.బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోయాయట, వీటన్నింటి ఫలితంగా జిడిపి వృద్ధి రేటులో ఎలాంటి పెరుగుదల వుండదట. పెట్టుబడి ఖర్చు పెరిగినా తీసుకొని జనం లావాదేవీలు నిర్వహిస్తున్నపుడు జిడిపి వృద్ధి రేటులో పెరుగుల ఎందుకు ఆగిపోతుందో తెలియదు. మోడీ ప్రతిష్ట పెంచేందుకు సామాజిక మీడియాలో ఒక పోస్టు తిరుగుతోంది. దానిలో ఏం వుందంటే మోడీ ప్రభుత్వం 50వేల కోట్ల రూపాయల మేరకు పన్ను ఎగవేతలను వసూలు చేసిందట,మరో 21వేల కోట్ల రూపాయల లెక్కల్లో చూపని సంపదను కనుగొన్నదట.నాలుగువేల కోట్ల రూపాయల విలువగల నకిలీ వస్తువులను కనుగొన్నదట. వీటిలో వాస్తవ మెంతో తెలియదు. పోనీ నిజంగా పూర్తిగా వాస్తవమే అనుకున్నా దీన్నొక విజయంగా చెప్పుకోవటమే ఆశ్చర్యం. ఈ నేరాలకు పాల్పడిన వారిని ఎంత మందిని జైళ్లకు పంపిందో ఈ సర్కార్‌ వెల్లడించి వుంటే దానికి విలువ వుండేది.ఇన్నేసివ వేల కోట్ల రూపాయలను కనుగొన్ని మరో 36వేల కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తాన్ని పొదుపు చేయటం తమ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలని చెప్పుకున్న ప్రభుత్వం జిజియా పన్నుల మాదిరి వీధుల శుభ్రానికి జనం మీద పన్నేసిన మోడీ సర్కార్‌ తాజాగా కృషి కల్యాణ్‌ పేరుతో జనం మీద మరో అరశాతం పన్ను వడ్డించటాన్ని ఏమనుకోవాలి. వెలికితీస్తున్న డబ్బంతా ఏమౌతున్నట్లు ?

   గతంలో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ పదవీ కాలం చివరిలో భారత్‌ వెలిగిపోతోందంటూ ప్రచారం చేసి ఎన్నికలలో ఆరిపోయింది. తెలివి తేటలు ఎక్కువ వున్న మోడీ సర్కార్‌ ఎత్తుగడ మార్చి కొత్త అంకెల సీరీస్‌ను ప్రారంభించి పాలన ప్రారంభం నుంచే దేశం వెలిగిపోతోందని విజయగానాలు చేస్తోంది.కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి చేశామని చెబుతున్నారు.కానీ ఆచరణలో ఆ కాంగ్రెస్‌ బూట్లలో కాళ్లు దూర్చారు. పెట్రోలు,డీజిల్‌పై పన్ను భారం, సేవా పన్ను పెంపు మచ్చుకు ఇవిచాలు. వంటగ్యాస్‌ సబ్సిడీ అనర్హులకు పోతోందంటూ కోత పెట్టారు. సంతోషం, కానీ ఏనుగులు దూరే కంతలను వదలి దోమలపై కేంద్రీకరించారని తెలుసుకోవాలి.

     వేళ్ల మీద లెక్కించదగిన ధనికులకు ఏటా ఆరులక్షల కోట్ల రూపాయలను వివిధ రూపాలలో సబ్సిడీలుగా ఇస్తోంది.ఇది గతంలో జరిగిందీ,ఇప్పుడు ఇంకా పెరిగింది. కోల్పోయిన ఆదాయం పేరుతో ఎంత మొత్తం రాయితీలు ఇచ్చిందీ ప్రతి ఏటా ప్రభుత్వం బడ్జెట్‌ పత్రాలలో సగర్వంగా ప్రకటించుకుంటోంది. నిత్యావసరాలలో ఒకటైన బంగారం మీద విధిస్తున్న పన్ను 1.6 శాతం కాగా, విలాస వస్తువులలో ఒకటైన పాల మీద మాత్రం 15-20 మధ్య వసూలు చేస్తున్నారు. జిడిపిలో బ్లాక్‌ మనీ 20శాతం అన్నట్లుగా బాంకులు విజయమాల్య వంటి నిరుపేదలకు ఇచ్చిన తొమ్మిదివేల కోట్ల రూపాయల వంటి రాని రుణాల మొత్తం కూడా మొత్తం బ్యాంకుల అప్పులలో 20శాతం వరకు అంటే 4.4లక్షల కోట్ల వరకు వున్నాయట.మోడీ అధికారానికి వచ్చిన తరువాత పన్ను ఎగవేతదారులు, లెక్కల్లో చూపని ఆదాయం వున్నవారిపై దాడులు ఎక్కువ చేసిన మాటలో ఎంత వాస్తవం వుందో గాని రెండు సంవత్సరాల క్రితంతో పోల్చితే నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చి బ్యాంకులను దగా చేసిన వుదంతాలు మాత్రం రెట్టింపై బ్యాంకులు కోల్పోయిన సొమ్ము 2015-16లో 13వేల కోట్ల రూపాయలకు చేరింది.

    సామాన్య వుద్యోగుల వద్ద గోళ్లూడగొట్టి వేతనాల్లోనే పూర్తి పన్ను మినహాయించుకుంటారు. కార్పొరేట్‌ కంపెనీలు చెల్లించాల్సిన పన్ను 30శాతం అని కాగితాల్లో మాత్రమే వుంటోంది, ఆచరణలో 23శాతానికి మించటం లేదు. ఈ మాత్రం కూడా చెల్లించకుండా నల్లధనంగా మార్చుతున్నారు. మెగా సిటీల నుంచి చిన్న పట్టణాల వరకు విస్తరిస్తున్న కార్పొరేట్‌ ఆసుపత్రులు జనాన్ని ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో ఒకసారి వాటిలో వైద్యం కోసం వెళ్లిన వారికి చెప్పనవసరం లేదు, వైద్యఖర్చులను తిరిగి పొందే సౌకర్యం వున్న వారికి తప్ప సామాన్యులను రోగాలు కూడా అప్పుల వూబిలో ముంచుతున్నాయి. కానీ వాటినే అభివృద్ధిగా చూపుతున్నారు. అమెరికా, ఐరోపా వంటి ధనిక దేశాలలో బ్యాంకులలో సొమ్ము దాచుకుంటే ఒకటి, రెండు శాతం మాత్రమే వడ్డీ లభిస్తోంది. అందువలన అక్కడి ధనికులు మన వంటి కార్పొరేట్‌ ఆసుపత్రులలో పెట్టుబడులు పెట్టి దానికి పది రెట్లు లాభాలు పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు.

   కేంద్ర ప్రభుత్వం గతేడాది కోల్పోయిన 6.11లక్షల కోట్ల ఆదాయంలో లక్షా 16వేల కోట్ల రూపాయలు కేవలం బంగారం, ఆభరణాలపై ఇచ్చిన పన్ను రాయితీలే అన్నది నమ్మలేని నిజం.ఇవన్నీ పేదల అభ్యున్నతి కోసమే అంటూ దోచిపెడుతున్న సొమ్ము అంటే అతిశయోక్తి కాదేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

Panama Papers source breaks silence, denies being a spy – Sueddeutsche Zeitung

07 Saturday May 2016

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

Mossack Fonseca, panama, panama papers, whistleblowers

A company list showing the Mossack Fonseca law firm is pictured on a sign at the Arango Orillac Building in Panama City in this April 3, 2016 file photo. REUTERS/Carlos Jasso/Files
A company list showing the Mossack Fonseca law firm is pictured on a sign at the Arango Orillac Building in Panama City in this April 3, 2016 file photo.
REUTERS/CARLOS JASSO/FILES

Sueddeutsche Zeitung said on Friday that the source of millions of documents leaked to the German newspaper from Panamanian law firm Mossack Fonseca had sent them a manifesto, saying his motivation was the “scale of injustices” the papers revealed.

The source had never before publicly stated why he leaked the documents, now known as the Panama Papers, said Sueddeutsche Zeitung (SZ), one of Germany’s most reputable newspapers.

In an 1,800 word manifesto published on the SZ website on Friday, the source, calling himself “John Doe”, praised others who have leaked secret and sensitive documents, such as Edward Snowden, who revealed details of the U.S. government’s mass surveillance programme.

“For his revelations about the National Security Agency (NSA), he deserves a hero’s welcome and a substantial prize, not banishment,” the source wrote.

He also said he would be willing to co-operate with law enforcement agencies.

He called on the European Commission, Britain, the United States and other nations to take steps to protect people who reveal private information about such sensitive issues rather than punishing them.

“Legitimate whistleblowers who expose unquestionable wrongdoing, whether insiders or outsiders, deserve immunity from government retribution, full stop,” he said.

The source, who contacted the paper a year ago with an offer of encrypted internal documents from Mossack Fonseca, denied being a spy but said he had recognised the “scale of injustices” described in their contents.

The documents cover a period over almost 40 years, from 1977 until last December, and purport to show that some companies domiciled in tax havens were being used for suspected money laundering, arms and drug deals and tax evasion.

Reuters could not independently verify whether the source was the same person who leaked the original documents. The source’s identity and gender is not known.

Sueddeutsche Zeitung spent more than a year, along with other media outlets and the International Consortium of Investigative Journalists, analysing the huge cache of documents.

On Friday, Sueddeutsche Zeitung introduced the manifesto by saying: “Now ‘John Doe’, the anonymous source, has sent the SZ a manifesto, which can be read as an explanation of his actions – and as a call to action.”

The source welcomed the fact that the leak had triggered a debate on “wrongdoing by the elite” but said not enough action had been taken.

“For the record, I do not work for any government or intelligence agency, directly or as a contractor, and I never have,” he said.

The source was critical of banks, financial regulators, tax authorities, the courts, and the legal profession, as well as the media, saying he had offered the documents to several major media outlets that had chosen not to cover them.

“The collective impact of these failures has been a complete erosion of ethical standards, ultimately leading to a novel system we still call Capitalism, but which is tantamount to economic slavery.”

The source ended the manifesto by saying “inexpensive, limitless digital storage and fast internet connections” should help digitise the revolution against income inequality.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d