• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

ధర్మం కంటే కాలుష్య అధర్మం నుంచి గేట్స్‌కు లాభాలు ఎక్కువ

07 Monday Dec 2015

Posted by raomk in Current Affairs, Economics, Environment, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

BILL GATES, billionaires, philanthropy-facts

ధర్మకర్తృత్వం-దాతల బండారం-5

ఎం కోటేశ్వరరావు

బలి ఇస్తే లంకెబిందెలు దొరుకుతాయని మోసగాళ్లు చెప్పిన మాట విని జంతువులనే కాదు ఏకంగా పిల్లలనే బలి ఇచ్చేవారిని చూస్తున్నాము. దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందని నమ్మేవారు ఆ మార్గంలో పుణ్యం పొందాలంటే ఏం చేయాలి పర్మనెంటుగా తమ ముందు చేయిచాచే వారిని తయారు చేసుకుంటూ వుండాలి. మెక్సికోకు చెందిన కార్లోస్‌ సిమ్‌ ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ధనవంతుడు. అమెరికన్‌ బిల్‌గేట్స్‌ను మించిపోయాడు. అతగాడు దాతృత్వాన్ని ఒక పండ్ల చెట్లతో పోల్చాడు. మీరు పండ్ల చెట్లను దగ్గర వుంచుకొని పండ్లు మాత్రమే దానం చేయాలి తప్ప చెట్లను కాదు అన్నాడు. ఇతనితో సహా ధనవంతులు మరింత ధనవంతులు కావటాన్ని పేదలు మరింత పేదలుగా సంపదల పంపిణీలో అసమానతలను చూపే ప్రస్తుత వ్యవస్ధ తప్ప మరొకటి కాదు. అందుకే థామస్‌ పికెట్టి అనే ఫ్రెంచి ఆర్ధిక వేత్త ప్రపంచ ధనికులను హెచ్చరించాడు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక అసమానతలు పెరిగాయి, ఇది సామాజిక అశాంతికి దారితీస్తుందని ముందస్తు హెచ్చరిక చేశాడు. అసమానతలు పెరిగాయని అంగీకరిస్తే దానికి కారణాలేమిటో చెప్పమని జనం నిలదీస్తారు. అప్పుడు విధానాల గురించి, పెట్టుబడిదారీ విధానమా, కమ్యూనిజమా ఏది కారణం అన్న చర్చ వస్తుంది. నూటికి 99 వేళ్లు పెట్టుబడిదారీ విధానంవైపే చూపుతాయి. అందువలన అనేక మంది పెట్టుబడిదారులు పికెట్టి మరీ ఎక్కువ చెప్పాడని తప్పించుకుంటున్నారు తప్ప చర్చలోకి దిగటం లేదు. లేదు అంటే వర్తమాన ఆర్ధిక సంక్షోభాలు ఏమిటి? దానికి కారణాలు ఏమిటని నిలదీస్తారు.అప్పుడూ అదే చర్చ జరపాలి. అందువలన ఈ త్రైమాసికం చూడూ ఈ త్రైమాసికం చూడు నీకు అభివృద్ది కనిపిస్తుంది అని గత ఏడు సంవత్సరాలుగా చెబుతూనే వున్నారు. బ్రిటీష్‌ విక్టోరియా రాణి కాలం 1837-1901 మధ్య కాలానికి నేటికి ఆదాయ అసమానతలు ఎలా వున్నాయో కొందరు చెబుతున్నారు. ఆ కాలంలో కేవలం 46 సంవత్సరాలు మాత్రమే బతికి ప్రఖ్యాత రచయిత ఆస్కార్‌ వైల్డ్‌ తన కాలంలోని దాతృత్వ తీరుతెన్నులను వర్ణించాడు.నాటి ధనవంతులు కూడా సమాజంలో ఇంత దారిద్య్రం వుందా, పేదలకు ఇన్ని కష్టాలు వున్నాయా అని మన బిల్‌గేట్స్‌, వారెన్‌బఫెట్‌, మార్క్‌ జుకెర్‌ బర్గ్‌ మాదిరిగానే పీపాల కొద్దీ కన్నీళ్లు కార్చారు. వైల్డ్‌ ఏమన్నారంటే నాటి ధనవంతులు సూచించిన పరిష్కార మార్గాలు సమాజంలోని జబ్బును నయం చేయలేదు, మరికొంత కాలం పొడిగించాయి. తగిన లక్ష్యం లేకపోతే దారిద్య్రాన్ని నిర్మూలించటం అసాధ్యం అన్నాడు.

సైన్స్‌ ఇన్‌ సొసైటీ సంస్ధ డైరెక్టర్‌ , జెనిటిస్ట్‌, బయోఫిజిస్ట్‌ అయిన డాక్టర్‌ మాయే వాన్‌ హో ఏ చెప్పారంటే ఏ సమస్యలనైతే తాను పరిష్కరిస్తానని బయలు దేరిందో ఆ పెద్ద ధార్మిక సంస్ధ వాటికి కారణమైన కంపెనీలలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదిస్తోందని అన్నారు. ఆ సంస్ధ మంజూరు చేసే గ్రాంట్ల వలన ప్రపంచ ఆరోగ్యం, వ్యవసాయ వ్యవస్ధకు హానితప్ప మేలు జరగటం లేదు, జాతీయ, ప్రపంచ ప్రాధాన్యతలను వక్రీకరిస్తున్నది. గేట్స్‌ ఫౌండేషన్‌ 2000 సంవత్సరంలో 2006లో రెట్టింపైంది. వారెన్‌బఫెట్‌ చేరిక దీనికి కారణం. మంచి పనులకు వీరు భారీ మొత్తంలో నిధులు ఇవ్వటంలో పేరు పొందారు. అయితే అదే సందర్భంలో మంచి పనుల కంటే దాని పెట్టుబడులపై భారీ మొత్తాలలో లాభాలు సంపాదిస్తున్నదని 2007 అమెరికాకు చెందిన లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఇచ్చిన గ్రాంట్లకంటే చమురు కంపెనీలలో దాని పెట్టుబడులు ఎక్కువ. నైజీరియాలోని పిల్లలు టీకాలతో లబ్దపొందినప్పటికీ గేట్స్‌ ఫౌండేషన్‌, ఇతర ధార్మిక సంస్ధలు పెట్టుబడులు పెట్టిన చమురు బావుల నుంచి వెలువడే వాయువుల కారణంగా తీవ్రమైన శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడ్డారు. నైగర్‌ డెల్టాలో చమురు బావుల నుంచి వెలువడిన మంటల కారణంగా పెద్ద వారిలో బ్రాంకోటైస్‌ పిల్లలలో ఆస్త్మా, కంటి చూపు సరిగా కనిపించకపోవటం వంటి సమస్యలు తలెత్తాయని ఎనోచా ప్రాంతంలోని ఒక వైద్యుడు చెప్పారు. అంతేకాదు ఈ ప్రాంతంలోని గ్యాస్‌ బావుల నుంచి రోజూ దాదాపు వంద కోట్ల ఘనపుటడుగుల గ్యాస్‌ను మండిస్తారు. దాని అమ్మకంద్వారా కలిగే ప్రయోజనం ఎంతో తెలియదు గానీ ప్రపంచ వాతావరణం వేడెక్కటానికి ఇవి దోహదం చేస్తున్నాయి. గేట్స్‌ ఫౌండేషన్‌ పోలియో, ఇతర టీకాలకు, పరిశోధనలకు ప్రపంచవ్యాపితంగా 218 మిలియన్‌ డాలర్లు దానం చేస్తే నైజీరియాలోని ఎని, రాయల్‌ డచ్‌, షెల్‌, ఎక్సాస్‌ మోబిల్‌ కార్పొరేషన్‌ , చెవరాన్‌, టోటల్‌ వంటివాటిలో 423 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులుగా పెట్టిందని లాస్‌ఏంజల్స్‌ టైమ్స్‌ తెలిపింది. అమెరికా, ఐరోపాలలో అనుమతించిన దానికంటే ఎక్కువగా కాలుష్యం వెదజల్లేందుకు ఈ కంపెనీలకు అక్కడ అనుమతి ఇచ్చారు.

గేట్స్‌ ఫౌండేషన్‌ తాను ఎయిడ్స్‌ సమస్యపై పోరాడుతున్నానని చెప్పుకుంటోందో అది పెట్టుబడి పెట్టిన నైజీరియాలోని ఆయిల్‌ కంపెనీల కార్యకలాపాల కారణంగా తమ ప్రాంతంలో వ్యభిచారం తీవ్రంగా పెరిగిందని, దాని కారణంగా ఎయిడ్స్‌, తరుణవయస్సు యువతులు గర్భందాల్చటం వంటి సమస్యలు పెరిగాయని స్ధానికులు పేర్కొన్నారు. దారిద్య్రం, వ్యాధుల నిర్మూలన గురించి గేట్స్‌ ఫౌండేషన్‌ చెబుతుంటుంది. అది పెట్టుబడులు పెట్టిన చమురు కంపెనీలు తవ్విన చమురు బోర్ల గుంతలలో నిల్వవుండే నీరు నింపుతారు. దాంతో దోమలు తామరతంపరగా వృద్ధి చెంది మలేరియా పెరిగిపోతోంది. రివర్స్‌ స్టేట్‌లోని ఆరోగ్య కమిషనర్‌ దర్యాప్తు చేయించగా నదులలో చమురు తెట్టుల కారణంగా కలరా వస్తున్నట్లు తేలింది. విషపదార్ధాల నుంచి వెలువడే బెంజైన్‌, మెర్క్యురీ, క్రోమియం వంటివి పిల్లలలో వ్యాధినిరోధక శక్తిని తగ్గించి మరింతగా పోలియో, మీజిల్స్‌ వంటివి సోకటానికి దోహదం చేస్తున్నాయి.

గేట్స్‌ ఫౌండేషన్‌ పెట్టుబడులు పెట్టిన బిపి షేర్లు 83, రాయల్‌డచ్‌ 77, ఆంగ్లో-అమెరికన్‌ కంపెనీల వాటాల ధరలు 255 శాతం పెరిగాయి.మసాచుచెట్స్‌ విశ్వవిద్యాలయం రూపొందించిన జాబితా ప్రకారం అమెరికాలోని అత్యంత కాలుష్యకారక పరిశ్రమలు వంద, కెనడాలోని 50లో 330 కోట్ల డాలర్ల మేరకు గేట్స్‌ పెట్టుబడులు వున్నాయి. అంటే కాలుష్యం నుంచి కూడా ధర్మాత్ముడు గేట్స్‌ లాభాలు పిండుకుంటున్నాడన్నమాట.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యాపారులు ఎక్కువగా దాన ధర్మాలు చేయాలా ? దాన ధర్మాల పేరుతో ఎక్కువ వ్యాపారం చేయాలా ?

05 Saturday Dec 2015

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

billionaires, education, Face book, philanthropy-facts

ధర్మకర్తృత్వం-దాతల బండారం-3

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. ఇప్పటి వరకు ప్రపంచ మంతా బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ ధర్మాల గురించి పాత రోజుల్లో పల్లె టూళ్లలో గుంపులుగా కూడి సినిమా కధలు చెప్పుకున్నట్లుగా చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారి గురించి ఇక చెప్పనవసరం లేదనుకోండి. ఫేస్‌బుక్‌ సిఇఓ మార్క్‌ జుకెర్‌బర్గ్‌ దాతృత్వం గురించి గొప్పగా పొగిడారు( మరి ఆయనకు తాతగా ప్రమోషన్‌ వచ్చిన సందర్బంగా హెరిటేజ్‌ ఇతర కంపెనీల్లో వున్న వాటాలను కూడా అలాగే ధర్మం చేయవచ్చు కదా అని ఎవరూ అడగకండి). మనకున్న జబ్బు అని అనకూడదు గానీ ఏ అంశమైనా కొనసాగింపు,పర్యవసానాలు ఏమిటి అని చూడటం తక్కువగా వుంది.మూసి పెట్టటం తప్ప మీడియా దాని గురించి అసలు పట్టించుకోదు.ఒక అవినీతి గురించి సంచలన వార్త ప్రసారం లేదా ప్రచారం, ప్రచురణ తరువాత చివరకు ఏమైంది? కాకపోతే ఎందుకు కాలేదు అన్న సమాచారం వుండదు. కలికాలం కాకపోతే ధనవంతులకు ఆకస్మికంగా ధర్మాలు చెయ్యాలన్న బుద్ది పుట్టటమేమిటి? ఈ విషయం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారో లేదో నేను వినలేదు) నిజంగా వారు తమ సంపదలను ఇచ్చారా? ఇస్తే ఏం జరిగింది అన్నది తెలుసుకోకపోవాలన్న ఆసక్తి జనానికి వుండకూడదనే ధనికులు కోరుకుంటారు.ఒక్క ఇచ్చినపుడు ప్రచారం తప్ప.

బిల్‌గేట్స్‌ తన సంపదలను దానం చేశాడు, ఓకే, దాని వలన లాభపడింది ఎందరు? అసలు సమాజంలో ఒకరు ఇచ్చేవారు, ఒకరు పుచ్చుకొనే నిస్సహాయత ఎందుకు వుండాలి. పుచ్చుకొనేవారి కష్టానికి తగిన ప్రతిఫలం లేదా గౌరవ ప్రదమైన శ్రమకు తగ్గ విలువను చెల్లిస్తే వేరొకరి ముందు చేయి చాచాల్సిన అగత్యం ఎందుకు అని ఆలోచించనవసరం లేదా ? అంటే పెట్టుబడిదారులు తమది ఎల్లపడు పైచేయిగా వుండే పరిస్ధితులు శాశ్వతం కావాలని కోరుకుంటున్నారా ?

బిల్‌ గేట్స్‌ దాన ధర్మాల గురించి ఆండ్రూ బౌమన్‌ అనే పరిశోధకుడు కొన్ని మింగలేని విషయాలను వెల్లడించారు. హఫింగ్టన్‌ పోస్ట్‌ అనే పత్రికకు కొద్ది సంవత్సరాల క్రితం అసలు తానెందుకు సంపదను దానం చేయాలనుకున్నదీ గేట్స్‌ వివరించాడు. 1993లో గేట్స్‌ ఆఫ్రికా వెళ్లినపుడు అక్కడి పరిస్ధితులను చూసి చలించిపోయాడన్నది సారాంశం. అమెరికాలో ఎవరైనా తమ సంపదలో ఏడాదికి ఐదు శాతం దాన ధర్మాలకు అందచేస్తే వారికి పన్ను రాయితీలు దక్కుతాయి. గేట్స్‌ ఆఫ్రికాను చూసి చలించి పోయిన తరువాత ఆయన మిత్రుడు వారెన్‌ బఫెట్‌లో కూడా చలనం వచ్చింది. గేట్స్‌తో కలసి తన కుటుంబం 30 బిలియన్‌ డాలర్లను దాన ధర్మాలకు ఇస్తామని ప్రకటించారు. 2010నాటికి వారు 26 బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ప్రపంచ ఆరోగ్య అవసరాలకు ఇచ్చారు. అమెరికాలో అంతకు ముందు ధనికుడిగా వున్న రాకఫెల్లర్‌ కుటుంబం 1914నుంచి ఇచ్చిన మొత్తం 14 బిలియన్‌ డాలర్లు మాత్రమే. గేట్స్‌ ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ టీకాల ద్వారా అరవైలక్షల మంది పిల్లలను బతికించినట్లు చెప్పుకున్నారు. ఎయిడ్స్‌, టీబీల నుంచి ఏడాదికి లక్షమందిని రక్షించటం లక్ష్యంగా గేట్స్‌ ప్రకటించారు. గేట్స్‌ చొరవ అనేక మంది ధనికులను ప్రపంచ ఆరోగ్యంవైపు దృష్టి సారింప చేయించిందని అనేక మంది పొగిడారు.

అయితే ఈ ఫౌండేషన్‌ పెట్టే ఖర్చు, దానిప్రభావం ఎంత , అసలది ఎవరికి జవాబుదారీ అన్న సమస్యలు ముందుకు వచ్చాయి. దాన ధర్మాలకు ఇచ్చిన సొమ్ములో ఏటా ఐదు శాతం మొత్తం తమ వైపు తిప్పుకొనేందుకు యత్నించే(లాబీయింగ్‌) వ్యవహారాలకు, సలహాలకు ఖర్చు చేస్తామని ఫౌండేషన్‌ చెప్పుకుంటుంది. వాటిలో అమెరికా విశ్వవిద్యాలయాల మొదలు ఎన్‌జీవోల వరకు అనేక సంస్ధలున్నాయి. ముందే చెప్పుకున్నట్లు ఫౌండేషన్‌ చేసే ఖర్చులో సింహభాగం ప్రపంచ ఆరోగ్య భాగస్వామ్యం కోసమే కేటాయించారు.అంటే ఆరోగ్య విధానాల రూపకల్పనలో తమ ముద్ర , ప్రాధాన్యతలు వుండే విధంగా లాబీయింగ్‌ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ఇతర ఏజన్సీలు వున్నప్పటికీ గేట్స్‌ ఫౌండేషన్‌ ఆరోగ్య సంరక్షణ వ్యూహాలపై సమీక్షా సమయాలలో గేట్స్‌ కంపెనీ సిఇఓ కుర్చీవేసుకు కూర్చుంటాడు. వూరికే కూర్చోవటానికి వారేమన్నా పనిలేని వారా ? దానాలలో కూడా లాభాలు ఎలా పిండుకోవచ్చో కనిపెట్టిన వారు వూరికే వుండరు కదా ! విధానాలపై ప్రభావం చూపేందుకు జోక్యం చేసుకుంటారు. మందులు మా బావమరిది షాపులోనే కొనాలనే షరతులు విధించకుండానే కొనిపించే డాక్టర్ల మాదిరి చేయాల్సింది చేసుకుంటారు.డాక్టర్‌ డేవిడ్‌ మెకాయ్‌ అనే ప్రజారోగ్య వైద్యుడు లండన్‌ విశ్వవిద్యాలయ కళాశాలలో పరిశోధకుడు, ్క ప్రజారోగ్య వుద్యమానికి ఒక సలహాదారు. ఆయనేమన్నారంటే ‘ఫౌండేషన్‌ అంటే నిధుల వసూలు , పధకాల అమలుకు మించి దాని లక్ష్యాలు వుంటాయి అన్నారు. అకడమీషియన్లుగా వుండే వ్యక్తులు, ప్రభుత్వేతర సంస్ధలు, వాణిజ్య రంగాలతో అంతర్గత సంబంధాలు కలిగి వుంటాయి. అంతర్జాతీయ ఆరోగ్య సమస్యపై ఒక బృంద ఆలోచనగా ప్రభావం చూపుతాయి.శాస్త్రీయ అభిప్రాయాలలోని భిన్నత్వాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌ అణచివేస్తున్నదని, అది తనకు తాను తప్ప ఇతరులెవరికీ జవాబుదారీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్ధలోని మలేరియా విభాగ పరిశోధన అధిపతి ఆరాటా కోచి 2008లో విమర్శించారు.

గేట్స్‌ వంటి ఫౌండేషన్లు ప్రపంచ ఆరోగ్య విధానాన్ని ఏవైపుకు నెడుతున్నాయి ?

తాను పెట్టుబడులు పెట్టటానికి ఒకేసారి ఏడడుగులు ఎగిరేందుకు ప్రయత్నించటం గాక ఒక అడుగుతో దాటిపోయేయి ఏవి వుంటాయా అని పరికించిచూస్తాను అని వారెన్‌బఫెట్‌ అన్నాడు.అయితే బిల్‌గేట్స్‌ దీనికి విరుద్ధంగా కుండలో కూడు కుండలోనే వుండాలి పిల్లాడు మాత్రం తెల్లవారేసరికి దుడ్డులా తయారు కావాలి అన్నట్లు తాను ఇచ్చే దాన సొమ్ముతో ఒకేసారి ఏడడుగులు గెంతాలి అన్నాడు. పసితనంలో రెండుమూడు డోసులు వేసే టీకాలతో జీవితకాలంపాటు రాని వ్యాధుల మాదిరి ఎయిడ్స్‌, టీబీ వంటి వ్యాధులను ఒక్క మాత్ర లేదా టీకాతో నయం చేసే అద్భుతాలు జరగకపోతే ఆధునిక పరిజ్ఞానం ఎందుకన్నట్లు మాట్లాడటమే కాదు తన దానపు సొమ్ములో1998-2007 మధ్య 36.5శాతం ప్రభుత్వ-ప్రయివేటురంగ భాగస్వామ్యంతో నడిచే ‘గావి అలయన్స్‌’ పరిశోధనలకే కేటాయించాడు. అది హెపటైటిస్‌ బి, హెచ్‌ఐబి బాక్టీరియా నిర్మూలనకు వాక్సిన్‌ల తయారీకీ పనిచేసింది. ప్రస్తుతం న్యూమోనియో, డయేరియా వంటి వ్యాధుల కారక బాక్టీరియాను నిర్మూలించే వ్యాక్సిన్ల పరిశోధనలో నిమగ్నమై వుంది. మరి ఈ వాక్సిన్లు మానవాళికి వుపయోగమా కాదా అంటే వుపయోగమే.

సమస్య ఎక్కడ వుందంటే ఇప్పటి వరకు సాగించిన శాస్త్ర పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు అన్నీ సమాజానికి చెందినవే తప్ప వ్యక్తులకు చెందినవి కాదు. ఒక శాస్త్రవేత్త ఒక ఔషధాన్ని కనిపెట్టాడు, లేదా ఒక ప్రమాదకర బాక్టీరియాను జాడ పట్టాడు అంటే దాని వెనుక అతని ప్రతిభ లేదని కాదు. పరిశోధన రిలే పరుగు పందెం వంటిది అనుకుంటే విజయసూచికగా రిబ్బన్ను తాకేది చివరి రన్నర్‌ కావచ్చుగాని అంతకు ముందు వారు లేకుండా, వారు సరిగా పరుగుతీయకుండా చివరి వ్యక్తికి విజయం సాధ్యం కాదు. అలాగే తన ముందు తరాల వారు వాటిపై సాగించిన అధ్యయనాల కొనసాగింపుగా ఎవరైనా నూతన అంశాన్ని కనుగొన్నారు, వున్నవాటిని మెరుగుపరిచారు తప్ప స్వంతంగా తామే కనుగొనలేదు.ఎవరైనా అలా చెప్పుకుంటే అది వారి సంస్కారానికి సంబంధించిన అంశం. రైట్‌ బ్రదర్స్‌కు ముందు విమానాలపై జరిగిన పరిశోధనలు, వైఫల్యాల నుంచి వారు తీసుకున్న గుణపాఠంతో విమానం ఎగరటంపై పైలట్స్‌కు ఎలా అదుపు వుండాలో కనుగొన్నారు. అది ఒక విప్లవాన్ని తెచ్చింది.వారి పరిశోధన బృందంలో సైకిల్‌ షాపు మెకానిక్‌ చార్లీ టేలర్‌ కూడా ఒక ముఖ్యుడన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ప్రింటింగ్‌ ప్రెస్‌లు,మోటార్లు, సైకిల్‌షాపులు అన్నింటిని ఆ బృందం పరిశీలించి, వాటిలో పనిచేసి విమానం ఎగిరే యంత్రాన్ని కనిపెట్టారు. కానీ పేటెంట్‌ మాత్రం రైట్‌ బ్రదర్స్‌ పొందారు.నిజానికి ఆది సమష్టి కృషి.దానిని సమాజానికి వుపయోగించినపుడు ఫలాలు అందరూ అనుభవిస్తారు, వ్యక్తులు లేదా కొన్ని కంపెనీలకు పరిమితం చేసినపుడు వారు మాత్రమే లబ్దిపొందుతారు. ఈ దిశగా ఆధునిక పెట్టుబడిదారులు తమ లాభాలను కాపాడుకొనేందుకు, పెంచుకొనేందుకు నూతన పద్దతులను, ఆర్ధిక వుత్పత్తులను కనిపెడుతున్నారు.

వుదాహరణకు కామెర్ల రోగానికి మందులను ఇంతకు ముందే కనిపెట్టకపోలేదు. అయితే వాటికి నిర్ణయించిన ధరలలో వుపయోగించాలంటే సామాన్యుల వల్లకాదు. పెద్ద మొత్తంలో తయారు చేస్తే ఖర్చులు తగ్గుతాయి. అందుకు పద్దతులు కనుగొనాలి, దాన్ని మార్కెటింగ్‌ చేయాలి. అప్పుడే అందరికీ అందుబాటులోకి వస్తుంది. ‘గావీ’ సంస్ధద్వారా బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ ఆపని చేసింది. హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ ధరను 68శాతం మేరకు తాము తగ్గించగలిగామని గావి చెప్పింది. దీని తరువాత న్యూమోనియా టీకాల పరిశోధనకు 150 కోట్ల డాలర్ల ధర్మ నిధిని కేటాయించారు. కామెర్ల వ్యాధి అందరికీ వస్తుందా, దాని నివారణకు వ్యాక్సిన్‌ ముందే తీసుకోవటం అవసరమా? కంపెనీలు తయారు చేశాయి,అవి అమ్ముడు పోవాలి, లేదా యంత్రాలు ఖాళీగా వుండకుండా ఏదో ఒకటి తయారు చేయాలి, నుక వాటికోసం టీకాలు తీసుకోవాలా అన్నది మరొక చర్చ. ముందస్తు నివారణ కోసం అవసరం వున్నా లేకపోయినా మందుల కంపెనీలు తమ వుత్పత్తులను అంటగడుతున్నాయన్న చర్చ జరుగుతోందా లేదా ? వ్యాక్సిన్లపై అమెరికాలో పెద్ద ఎత్తున వ్యతిరేకం వ్యక్తం అవుతోందా లేదా ?చౌకగా వ్యాక్సిన్లు అందుబాటులోకి తేవటం మంచిదే కదా, దాని వలన ఏదైనా ఒక కంపెనీ లాభం పొందితే ఏమిటట, ఏడుపు తప్ప అనేవారు లేకపోలేదు.

పెట్టుబడిదారుల పత్రిక ఫైనాన్సియల్‌ టైమ్స్‌ దీని గురించి రాస్తూ చౌక ధరలతో, వేగంగా అటు పేదలకు ఔషధాలు దొరకటం, ఇటు వుత్పత్తుల మార్కెటింగ్‌ జరిగి కంపెనీలకు సమాన ప్రయోజనం కలిగిందని పేర్కొన్నది. సరిహద్దులకు అతీతంగా ఔషధాలు దొరకాలనే ప్రచారం చేస్తున్న సంస్ధ డైరెక్టర్‌ టిడోవాన్‌ సచోయన్‌ అంగ్‌రెర్‌ ఏమంటారంటే ప్రపంచ ఆరోగ్యరంగంలో ప్రయివేటు రంగ పాత్ర ఎక్కువగా వుండాలని గేట్స్‌ ఫౌండేషన్‌ కోరుతున్నది, ప్రభుత్వంతో ప్రయివేటు రంగ భాగస్వామ్యం కోరుతున్నది, దాన్నొక విధానంగా రూపాందింపచేసేందుకు ఈ సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి.దీని వెనుక వాటికి భారీ ప్రయోజనాలు దాగున్నాయి. ఒక ఆట నిబంధనలను రూపొందించే పాత్రలో కంపెనీలు వుండకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధకు భారీ మొత్తంలో నిధులు ఇస్తున్న గేట్స్‌ ఫౌండేషన్‌ ఆ సంస్ధ విధాన నిర్ణయాల రూపకల్పనలో ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నది.అది బడా ఫార్మా కంపెనీల మాజీ వుద్యోగులను పెద్ద ఎత్తున తన సిబ్బందిగా తీసుకోవటంతో కంపెనీలకు అనుగుణ్యంగా నిర్ణయాలు జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి.

మన కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యవుద్యమ కార్యకర్తల వత్తిడికి తలొగ్గి లేదా మన ఫార్మా పరిశ్రమ అభివృద్దికి లేదా తన బడ్జెట్‌ ఖర్చు తగ్గించుకొనేందుకు గానీ జీవనధార (జనరిక్‌)ఔషధాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. పేటెంట్‌ హక్కులున్న ఔషధాలు ఎంతో ఖరీదైనవి. వాటికి అడ్డదారులు కనుగొనటంలో మనదేశం, చైనా ఫార్మాకంపెనీలు ఆరితేరాయి. జీవన ధార ఔషధాల తయారీ వలన వాటిని రూపొందించిన కంపెనీలకు ఎలాంటి ఆర్ధిక ప్రయోజనం కలగదు. అందువలన అవి పేటెంట్‌ హక్కులను మరింత కఠినతరం చేసేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తున్నాయి.ఈ మందులను తయారు చేసే కంపెనీలకు ఏదో ఒక సాకుతో ఆటంకాలు కలిగిస్తున్నాయి. మన దే శంలోని అనేక జనరిక్‌ మందుల తయారీ కంపెనీలకు ఏ రోజున, ఎటువైపు సుంచి ఏం ముప్పు ముంచుకువస్తుందో తెలియదు.ఈ మందుల తయారీ పోటీ లేనట్లయితే ఎందరో రోగులు మందులు కొనుగోలు చేయలేక మరణించి వుండేవారు. పేదలకు వుపయోగపడని ఆధునిక పరిజ్ఞానం ఒక పరిజ్ఞానమా అని కబుర్లు చెప్పే బిల్‌గేట్స్‌ మరోవైపున కష్టపడి పేటెంట్‌ పొందిన కంపెనీల మేధోపరమైన హక్కులకు గట్టి రక్షణ లేకపోతే ఎలా అని ‘ట్రిప్స్‌’ ఒప్పంద చర్చ సందర్భంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో, జి 8 దేశాల బృందంలో మైక్రోసాప్ట్‌ కంపెనీ ద్వారా వత్తిడి చేయించాడు.ఈ వైఖరి అభివృద్ధి చెందుతున్నదేశాలలో ఆరోగ్య సంక్షోభాన్ని మరింత పెంచుతుందని ఆక్స్‌పామ్‌ సంస్ధ పేర్కొన్నది. వాణిజ్య, పారిశ్రామికవేత్తలు మరిన్ని దాన ధర్మాలు చేయాలా ? లేక దాన ధర్మాల పేరుతో మరింత వ్యాపారం చేయాలా అన్నది ఇక్కడ సమస్య?

Share this:

  • Tweet
  • More
Like Loading...

గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం

04 Friday Dec 2015

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

billionaires, Face book, philanthropy

ధర్మకర్తృత్వం-దాతల బండారం-2

ఎం కోటేశ్వరరావు

మార్క్‌ జుకెర్‌బర్గ్‌, వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌ వంటి వారు చేస్తున్న దాన ధర్మాలు ఎవరికీ వుపయోగపడవా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిస్సందేహంగా కొందరికి వుపయోగపడతాయి. ఫలానావారి తాతగారి ముత్తాత జ్ఞాపకార్ధం ఫలానా వారి కుమారుడు, వారి మనవడు అయిన ఫలానా వారు చేసిన ధర్మం అన్న అక్షరాలతో నిండి వుండే చొక్కాలు వేసుకొని సంచార ప్రచార వాహనాల మాదిరి తిరిగేవారు మనకు తరచూ కనిపిస్తుంటారు. దానిలో దానం కంటే ప్రచారమే ఎక్కువగా కనిపిస్తుంది. గోచీ కూడా లేని వారికి అది ఇవ్వటమే పెద్ద లోకోపకారం కదా !.ఇక్కడ సమస్య దానం అంటే ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో పుచ్చుకోవటమా ?

ప్రపంచంలో అమెరికాయే ధనిక దేశం, దానిలో వారెన్‌బఫెట్‌, బిల్‌గేట్స్‌ పెద్ద ధనికులు. వారు 2010లో తాము ఎంత దానం చేస్తున్నదీ ప్రకటిస్తూ ప్రతి ధనికుడూ తమ సంపదలో సగం దాన ధర్మాలకు వినియోగించాలని పిలుపునిచ్చారు.తమ వంటి బిలియనీర్లు 187 మందితో ఇప్పటివరకు ఎంతో కొంత దానం చేయిస్తామని వాగ్దానం చేయించారు. రెండో కంటికి తెలియకుండా దానం చేసిన వారు గొప్పవారని ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం. ఎవరెంతదానం చేస్తున్నారో లోకానికి తెలిస్తే మిగతావారు కూడా వుత్సాహపడి తాము కూడా ముందుకు వస్తారు కనుక దాన ధర్మాలకు ప్రచారం కావాలని కొత్త సూత్రీకరణ చేశారు.అందుకే కాబోలు చేసిన దానం కన్నా దాని ప్రచారానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు చాలా మంది. అంతేకాదు ఎంత డబ్బు దానం కింద వచ్చిందో తెలిస్తే అది ఎక్కడకు వెళుతుందో, అందరూ ఒకదానికే కాకుండా దేనికి ఎంత ఖర్చుచేయాలో కూడా తెలుసుకోవచ్చని కూడా చెబుతున్నారు. దాతృత్వ నిపుణులు( ఫిలాంత్రపీ ఎక్స్‌పర్ట్‌ ) అనే సంస్ద సిఇవో మెలైనీ వులే కార్పొరేట్‌ దానాల గురించి చెబుతూ వ్యక్తిగతమైన ప్రయోజనమో లేక వారి వారసుల జేబులు నింపటమో గాక మొత్తం మానవాళి ఆరోగ్యం, జీవనానికి ఇలాంటి దానాలను ఖర్చు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటారు. దేన్నీ కాదనలేం మరి.

అమెరికాలో 501(సి)(3) అనే ఒక చట్ట సెక్షన్‌ ప్రకారం ఎవరైనా దానం చేసిన వాటి మీద వారికి ఎలాంటి హక్కు వుండదు. దానం చేసిన వారి పాత్ర అంతటితో ముగుస్తుంది.వాటిని స్వీకరించిన సంస్ధకు దానిపై సర్వహక్కులు వుంటాయి. కానీ జుకెర్‌బర్గ్‌ వంటి బిలియనీర్లు చేసే దానాలు అలాంటివి కావు. వాటికి బదులుగా పరిమిత జవాబుదారీ కంపెనీ(లిమిటెడ్‌ లయబులిటీ కంపెనీ(ఎల్‌ఎల్‌సి)ని ఏర్పాటు చేసి దానికి బదలాయిస్తారు. ప్రయివేటు ట్రస్టులంటే బాగా అర్ధం అవుతుంది.జుకర్‌ బెర్గ్‌కు ముందు దానాలు చేసినవారందరూ ఇలాంటి దారులే ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను కట్టకుండా బహిరంగంగా తమ ఆస్తులను వీటిలో దాచుకుంటారు. పబ్లిక్‌ ట్రస్టులంటే నియంత్రణలు ఎక్కువ వుంటాయి. ఈ ఎల్‌ఎల్‌సీలకు అలాంటి బాదర బందీ వుండదు. లాభాలు వస్తాయనుకుంటే వేటిలో అయినా ఈ ట్రస్టులలోని సొమ్మును ఎప్పుడు కావాలంటే అక్కడ పెట్టుబడులుగా పెట్టవచ్చు, రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇవ్వవచ్చు. దీని గురించి న్యూయార్క్‌ నగరంలోని న్యూ స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎరికి కోల్‌ ఎరియన్స్‌ ఏమంటారంటే ‘ మరో మాటలో చెప్పాలంటే దాతృత్వ పెట్టుబడులను సొమ్ము చేసుకోవలనుకోటంలో వారెంతో(జుకర్‌బెర్గ్‌ వంటివారు) పారదర్శకంగా వున్నారు, వారిలో ఎక్కువ మంది ఇలా చేస్తూనే మరోవైపున వారు ఎవరికైతే సేవ చేయాలనుకుంటున్నారో వారికి మరిన్ని సమస్యలు తెచ్చే వర్తమాన పెట్టుబడిదారీ వ్యవస్ధను కూడా ముందుకు తీసుకుపోతున్నారు. ఇది, ఎల్లవేళలా దాతృత్వ విరుద్ధ స్వభావం ఇలానే వుంటుంది. ఒకవైపు అసమానతలను సృష్టించే విధానాలను కొనసాగిస్తూనే మరోవైపు ఎవరైనా దారిద్య్రం, అ సమానత, పర్యావరణ, కార్మిక హక్కులను దుర్వినియోగాన్ని అరిక్టగలరా ? ఈ సమస్యలను పరిష్కరించటానికి సామాజిక దృక్పధంతో వుంటేవాటికి ట్రస్టులు నిధులు సమకూర్చవచ్చు, కార్మికవర్గం నిర్వహించే వాటికి పెట్టుబడి మిగులును సాయంగా అందించగలరా అన్న ప్రశ్న తలెత్తున్నది’ అని ఆమె అన్నారు.

ఈ వారంలో నే ఇలాంటివారందరినీ ఒక దగ్గరకు చేర్చుతున్న బిల్‌గేట్స్‌ తదితరులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరు ఇంధన విజయ కూటమి (బ్రేక్‌త్రూ ఎనర్జీ కోయలిషన్‌). అంటే నాణ్యమైన లేదా క్లీన్‌ ఎనర్జీపై పరిశోధన చేసేందుకు వారు ‘దాన ధర్మాలు’ చేస్తారు. ఇదొక కొత్త తరం ధార్మికత, వీరొక ప్రత్యేక ధార్మికులు. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అంటే ఇదే. ఖర్చేమీ వుండదు, పుణ్యానికి పుణ్యం. నాణ్యమైన ఇంధనంతో పర్యావరణాన్ని కాపాడేందుకు తామీ ధర్మం చేస్తున్నామని చెప్పు కోవచ్చు. పనిలో పనిగా అందుకు ఇచ్చే సొమ్ముపై పన్ను రాయితీలు, ధర్మపరులుగా మరికొన్ని రాయితీలు పొందవచ్చు. ఒక్కొక్క రంగంలో ఎవరికి వారు ప్రత్యేకంగా పరిశోధన జరిపితే ఖర్చు తడిచి మోపెడంత అవుతుంది. అలాగాక ‘సహకార కూటమి పద్దతి’లో చేస్తే తలా కాస్త, అది కూడా పన్నురాయితీలతో తమకు ఎలాంటి భారం పడకుండా తమకు అవసరమైన పరిశోధన చేయించుకుంటారు. దాని వలన వచ్చిన ఫలితాలను పొందేది ఎవరంటే తిరిగి ఈ కార్పొరేట్లే. పగలంతా సంపాదించిన దానిని ముఠాకార్మికులు రాత్రికి కలసి పంచుకున్నట్లుగా ప్రాజెక్టులలో భాగస్వామ్యం ద్వారా పరిశోధన ఫలాలను అందరూ కలసి పంచుకుంటారు. పేరుకు పేరు సొమ్ముకు సొమ్ము. వీరు చేసే దానాలను స్వీకరించేందుకు వీరందరూ కలసి తమ చెప్పుచేతల్లో వుండే ట్రస్టులను ఏర్పాటు చేస్తారు. అందులో తమ వారినే వుద్యోగులుగా నియమిస్తారు. వారికి జీతాలను ఆ ట్రస్టుల నుంచే ఇస్తారు. కన్సల్టెంట్స్‌గా కూడా తమవారినే పెట్టుకుంటారు. క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు రూపకల్పన చేయిస్తారు. మన వంటి పేద దేశాలు వాటిని కావాలని వెళితే మనకు ఆ పధకాలు ఇవ్వటే కాదు, అందుకు అవసరమైన అప్పులను కూడా వేరే ఏజన్సీ ద్వారా ఇప్పిస్తారు. అప్పు డబ్బు రూపంలో ఇస్తే దారి మధ్యలో ఎవరైనా కొట్టివేయకుండా మాకు తెలిసిన కంపెనీలలో వున్న యంత్రాలను కొనుగోలు చేయండి, వాటిని బిగించాలన్నా, సరిగా పనిచేయాలన్నా వాటి ఇంజనీర్లు మాత్రమే వుండాలి, ఇలా షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా సవాలక్ష నక్షత్రాలను వుంచి మనకు ఇస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు, పరీక్షా కేంద్రాలు, మందులు, మెడికల్‌ షాపులు, రోగులు అన్నమాట. అవసరమా లేదా అని ప్రశ్నించకుండా వైద్యులు రాసిన పరీక్షలన్నీ చేయించుకోవాలి, అదీ వారు పేర్కొన్న పరీక్షా కేంద్రాలలోనే మిగతా చోట్లకు వెళితే రిపోర్టులు సరిగా రావంటారు. వారు రాసిన మందులే కొనాలి. మిగతా మందులు సరిగా పనిచేయవు మీ ఇష్టం అంటారు. వారు చెప్పిన షాపులోనే కొనాలి, అవి అక్కడ తప్ప మరొక చోట దొరకవంటారు. కౌపీన సంరక్షణార్ధం చివరకు ఒక సన్యాసి సంసార జంఝాటంలో చిక్కుకున్నట్లుగా దాతృత్వం గురించి చెబుతానంటూ ఈ విషయాలన్నీ ఏమిటి అనుకుంటున్నారా ? కార్పొరేట్‌ దానాలకు అదే కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు వున్న సంబంధాన్ని ఈ లావాదేవీలలో మనం చూడటం కష్టం, ఎలాగంటే ఎక్కడో స్విచ్‌ వేస్తే మరెక్కడో లైటు వెలుగుతుంది. ఇది చదివిన తరువాత కూడా సంబంధం లేని విషయాలుగా మీకు అనిపిస్తే చెప్పటంలో లోపం నాదే. మన దేశాన్ని బ్రిటీష్‌వారు దోచుకుంటున్నారు, వారిని తరిమివేస్తే తప్ప మనకు మంచి జరగదు అని మన జనాన్ని ఒప్పించటానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది, ఎన్ని విధాలుగా చెప్పాల్సి వచ్చిందో తెలుసు కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ధర్మకర్తృత్వం-దాతల బండారం-1

03 Thursday Dec 2015

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

billionaires, philanthropy, Zuckerberg

ఎం కోటేశ్వరరావు

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, కుందేటి కొమ్ము సాధించవచ్చు గాని మూర్ఖుని మనస్సును రంజింప చేయలేమన్న పెద్దల అనుభవసారాన్ని ఇంతకాలం పాఠాలలో చదువుకున్నాం. దీనికి తోడుగా వుదారులైన మంచి భూస్వాములు, దొరలు, కార్మికుల శ్రమశక్తిని జలగల్లా పీల్చని అతి మంచి పెట్టుబడుదారులను కనలేమని కూడా చెప్పుకోవచ్చేమో ?

ఈ మాట చదవగానే డిసెంబరు రెండవ తేదీ పత్రికలు చూసిన వారంతా నా మీద ఇంతెత్తున మండి పడతారు. వూరంతటిది ఒకదారి ఇలాంటి వులిపికట్టెలది ఒకదారి, వీరు జన్మలో మారరు, ఇతరుల మంచిని, దయా గుణాన్ని చూడరు అంటూ ఫేస్‌బుక్‌ సిఇఓ మార్క్‌ జుకెర్‌బెర్గ్‌ దంపతులు తమకు కుమార్తె పుట్టిన సంతోషంలో మూడు లక్షల కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన వార్తలను చూపించిన టీవీలను కదలించరు గానీ ప్రచురించిన పత్రికలను నా ముఖాన కొడతారని తెలుసు. జుకెర్‌బర్గ్‌ ఎవరనుకుంటున్నారు. మన యజమాని, మనం అంటే ఫేస్‌బుక్‌లో ఖాతాలున్నవారందరం. జీతాలు అడగకుండా స్వచ్ఛందంగా పనిచేస్తున్న కార్మికులం.మనం రోజూ లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసే ప్రతిదీ, ఫేస్‌బుక్‌లో మనం వుత్పత్తి చేసేవన్నీ మనకు తెలియకుండానే జుకెర్‌బెర్గ్‌ ఆస్తిగా మారిపోతాయి. వాటిని మార్కెటింగ్‌ చేసుకొని విపరీత లాభాలు సంపాదిస్తున్నాడు. ఇలాంటి కార్మికులు,దోపిడీ గురించి మార్క్స్‌-ఎంగెల్స్‌లు ఊహించి వుండరు. ఫ్యాక్టరీ లేదు, మౌలిక వసతులైన కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు అవినడిచేందుకు అవసరమైన ,బ్యాటరీలు, విద్యుత్‌ అన్నీ మనం స్వంతంగా డబ్బు పెట్టి మరీ సమకూర్చుకుంటున్నాం, పెట్టుబడులు పెడుతున్నాం, జీతాలు తీసుకోకుండా రోజుకు 50 కోట్ల మందిమి పనిచేస్తున్నాము. మన కేవలం వీడియోలు చూస్తే చాలు,పోస్టింగులు పెడితే చాలు, లైకులు,షేర్లు కొడితే చాలు డబ్బే డబ్బు. ఎనిమిది బిలియన్ల వీడియోలు చూస్తున్నాం, ఇది పని కాదేటి? దీనికి శ్రమపడనవసరం లేదా? దీని ద్వారా వచ్చే జబ్బులు, దురలవాట్లు , అవలక్షణాలు తప్ప మనకు లాభాల్లో వాటా లేదే !త్వరలో మన సంఖ్య 153 కోట్లకు చేరుతుందని, వీరిలో 136 కోట్ల మందిమి సెల్‌ఫోన్ల మీద పనచేసే వారం తయారవుతామట. మూడవ త్రైమాసిక ఆదాయం 480 కోట్ల డాలర్లని తాజా సమాచారం. ఖర్చు మూడు వందల కోట్ల డాలర్లట. రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుందని ఇంత ఖర్చయినా ఫరవాలేదని మదుపుదార్లు ధీమాగా వున్నారు.

నిజమే ఏ మాటకామాటే చెప్పుకోవాలి కదా ! అయినా ఎందుకో నా హార్ట్‌వేర్‌లో అది సూట్‌కావటం లేదు. నా చిన్న తనంలో మా పక్కింటి వారు ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ వుండేవారు. ఒకరి పొలం గట్టును మరొకరు కొద్ది కొద్దిగా ఎవరూ లేనపుడు నరికి తమ పొలంలో కలుపుకుంటున్నారన్నది తగాదాకు హేతువు. ఎంతవరకు పోయిందంటే కర్రల నుంచి గొడ్డళ్ల వరకు. ఇపుడు రిలయన్స్‌ కంపెనీ తనకిచ్చిన బావుల పక్కనే వున్న కృష్ణా-గోదావరి బేసిన్‌లోని ప్రభుత్వరంగ ఓఎన్‌జిసి బావుల నుంచి లోలోపలే తొమ్మిది వందల కోట్ల ఘనపు మీటర్ల సహజవాయువును కరిమింగిన వెలగపండులా లాగించేయటం నిజమేనని, దాని విలువ పదకొండువేల కోట్ల రూపాయలని తెలిసినపుడు మా పక్కింటి రైతులు కొద్ది గజాల గట్టుకోసం గొడ్డళ్ల వరకు పోవటం నిజంగా నవ్వు తెప్పిస్తోంది. రిలయన్స్‌ వంటి మహానుభావులైన కంపెనీలు ఇలాంటి సొమ్ముతో ఎన్ని విరాళాలైనా ఇస్తాయి, మన వంటి రాష్ట్రాలలోని పత్రికలు, టీవీ ఛానల్స్‌లో పెట్టుబడులుగా పెట్టి అలాంటి వార్తలు, విశ్లేషణలను తొక్కిపెడతాయంటే ఆ కంపెనీ భక్తులు నా వంటి వారి మీద గొడ్డళ్లు ఎత్తకపోతేనే ఆశ్చర్యం. కంపెనీలన్న తరువాత అక్రమాలకు పాల్పడకుండా వుంటాయా, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వకుండా వుంటాయా, కేసులను మాఫీ చేయించుకోకుండా వుంటాయా అంటే భగవంతుడా వీరికి ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లోడ్‌ చేశావేమయ్యా అని అనుకోవటం తప్ప చేసేదేముంది.

నిద్రపోయే ముందు ఎంత మంది అద్దాలలో తమ ముఖం చూసుకుంటారో లేదో తెలియదు గానీ ంప్యూటర్లలో ముఖపుస్తకం చూసి మాత్రమే నిద్రపోతారని, పొద్దున్నేలేచి అద్దంలో ముఖం సంగతేమోగాని ముఖపుస్తకం చూస్తారని తెలుసు. అలాంటి వరాన్ని మనకు ప్రసాదించిన దేవుడు మార్క్‌ జుకెరబర్గ్‌ .తమ జీవిత కాలంలో ఫేస్‌బుక్‌ కంపెనీలో తమకు వున్న వాటాలలో 99శాతం విరాళంగా ఇచ్చి చిన్నారుల సంక్షేమానికి ఖర్చు చేస్తానని ప్రకటించి కోట్లాది మంది నీరాజనాలు అందుకుంటున్నాడు.మన దేశానికి అందునా అతగాడిని నమ్మే మతంలో కూడా విశ్వాసం వున్న వారికి మాత్రమే పేటెంట్‌ హక్కువున్న కలియుగ దేవుడి కంటే ఎలాంటి హద్దులు, సరిహద్దులు, ఆంక్షలు లేని దేవతలుగా జుకర్‌బెర్గ్‌ దంపతులని చెపితే మా మనోభావాలు దెబ్బతీశారని ఎవరైనా దాడి చేసి చంపేస్తారేమో ?

హైస్కూలు పుస్తకాలలో ధర్మకర్తృత్వ సిద్దాంతం కూడా ఒకటి వుందని చదువుకున్నాం. దాని ప్రకారం భూస్వాములు తమ భూములలో పనిచేసేవారు, ఫ్యాక్టరీ యజమానులు తమ కార్మికుల పట్ల ఎంతో దయతో తమ బిడ్డలుగా చూసుకుంటారు, ధర్మకర్తలుగా వుంటారు తప్ప యజమానులు-పనివారలనే భావం వుండదన్నది దాని సారం. ఇటీవలి కాలంలో ప్రపంచంలో ధర్మకర్తృత్వ పెట్టుబడిదారీ విధానం అనే పదం వినిపిస్తున్నది. అంటే పెట్టుబడిదారులు తాము సంపాదించిన దానిలో భారీ మొత్తాలను దాన ధర్మాలకు కేటాయించటం.

కాశీ మజిలీ కధలన్నింటా మనకు అంతర్లీనంగా రంగు రంగుల పూసల్లో దారంలా కన్పించే సందేశం ఏమంటే రాజులందరూ తమ పౌరులను కన్నబిడ్డలుగా చూసుకొనేవారు, కరువు కాటకాలు లేకుండా దేశం సుభిక్షంగా వుండేది. దాని కొనసాగింపుగా రాజులు, రాజరికాలు పోయినా వాటి స్దానంలో జమిందార్లు, భూస్వాములు, దొరలు వచ్చినా, వారు పెట్టుబడిదారులుగా మారినా తమ వద్ద పనిచేసేవారిని కన్నబిడ్డలుగా చూసుకుంటారనే సందేశం మాత్రం ఏదో రూపంలో వస్తూనే వుంది. అదే సమయంలో అంతరాలు గతం కంటే తీవ్రంగా పెరుగుతున్నాయి. డిజిటల్‌ యుగంలో కూడా దాతృత్వాన్ని చూపి దోపిడీని మరుగుపరచాలని చూసే యత్నంలో భాగంగానే ఇప్పుడు కూడా బలంగా ధర్మకర్తృత్వ పెట్టుబడిదారీ సిద్ధాంతాన్ని కొత్త పద్దతుల్లో ముందుకు తెస్తున్నారు. వద్దంటే డబ్బు అన్నట్లుగా అది కూడా వారికి లాభాలనుె తెచ్చి పెట్టే విధంగా రూపొందించారంటే నిజమా అని ముక్కున వేలేసుకోవాల్సిందే.

మార్క్‌ జుకెరబెర్క్‌ దంపతులు ఫేస్‌బుక్‌ కంపెనీలోని తమ వాటాలలో 99శాతం ధర్మానికి ఇచ్చివేసినా కంపెనీలో వారి పెత్తనానికి ఢోకా వుండదట. అదే అసలు మతలబు. ఇదేం పితలాటకం అనుకోకండి.ప్రపంచంలో 2015లో బిలియనీర్లు 1826 మంది వున్నారని, వారిలో 290 మంది కొత్తగా ఈ ఏడాది చేరినట్లు ధనవంతుల సంపదల గురించి రాసే పత్రిక ఫోర్బ్స్‌ పేర్కొన్నది. అంటే ఇన్ని సంవత్సరాల కాలంలో బిలియనీర్లుగా ఎదిగింది కేవలం 1536 మందే అయితే ఏడాదిలో 290 మంది పెరిగారంటే కొద్ది మంది దగ్గర నడమంత్రపు సంపదలు ఎంత వేగంగా చేరుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. సామాన్య రైతులు ఎంత మట్టి పిసికితే అంత అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవటం తప్ప బిలియనీర్‌ సంగతి దేవుడెరుగు మిలియనీరు కూడా కాలేడు.

ధర్మకర్తృత్వ పెట్టుబడిదారులలో ఇంతకు ముందు వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌, ఫోర్డ్‌, బ్లూమ్‌బెర్గ్‌ వంటివారు నెలకొల్పిన రికార్డులన్నింటినీ జుకర్‌బెర్గ్‌ బద్దలు కొట్టాడని, వారంతా పెద్దవారైన తరువాత ధర్మబుద్ది పొందితే ఇతగాడు 31 సంవత్సరాలకే దాన్ని పొందాడని కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యంత క్లిష్టమైన సామాజిక సమస్యలకు కొత్త పద్దతుల్లో పరిష్కారం చూపేందుకు ధనికులు తమ సంపదలను,సామర్ద్యాన్ని ఒక దగ్గరకు చేరుస్తున్నారని కొంత మంది వ్యాఖ్యానించటం కూడా ప్రారంభించారు.వీటిని చూస్తుంటే ప్రపంచ ధనికులందరూ తమ ఆస్తులను ధాన ధర్మాలకు ఇచ్చి జనాన్ని ఈతిబాధల నుంచి రక్షించి సోషలిజం సాధిస్తారని, ఇంక కమ్యూనిస్టులతో పని లేదని ఎవరైనా చెప్పినా ఆశ్చర్యం లేదు. (ఇంకా వుంది. అంతం కాది ఆరంభం)

Share this:

  • Tweet
  • More
Like Loading...

Escalating calls to put a price on carbon

03 Thursday Dec 2015

Posted by raomk in Current Affairs, Economics, Environment, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

Carbon Pricing, climate talks in Paris, COP21, CPLC

  • Image

In a remarkable show of unity on the first day of the climate talks in Paris, heads of state from France, Germany, Mexico, Chile, Ethiopia and Canada joined World Bank President Jim Yong Kim to urge other nations and companies to put a price on carbon pollution.

 Max Thabiso Edkins/World Bank

STORY HIGHLIGHTS
  • Heads of state from France, Germany, Mexico, Chile, Ethiopia and Canada joined World Bank President Jim Yong Kim to urge other nations and companies to put a price on carbon pollution.
  • The call by heads of state and government was echoed by ministers and CEOs from around the world at the official launch of the Carbon Pricing Leadership Coalition (CPLC).
  • Ahead of COP21 more than 90 developed and developing countries, have indicated plans to use international, regional, or domestic carbon pricing schemes for mitigation action.

In an extraordinary move on the first day of the climate conference in Paris, the leaders of six countries stood on stage with the head of the World Bank Group urged other nations and companies to put a price on carbon pollution.

The leaders from France, Germany, Mexico, Chile, Ethiopia and Canada joined Bank President Kim as well as the Secretary General of the OECD Angel Gurria in calling for carbon pricing as a means of driving investment for a cleaner future.

French President, François Hollande joined Angela Merkel, Chancellor of the Federal Republic of Germany, Enrique Peña Nieto, President of Mexico, Justin Trudeau, Prime Minister of Canada Hailemariam Dessalegn, Prime Minister of the Federal Republic of Ethiopia and Michelle Bachelet President of Chile.

Speaking before more than 500 people in the main media conference room at the climate talks in Paris, President Kim said the talks were taking place in the shadow of an undeniable truth:

” We simply cannot afford to continue polluting the planet at the current pace, this was the right time to set the right price on the true cost of carbon on our planet “
Image

Jim Yong Kim

World Bank Group president

President Hollande said putting a price on carbon pollution would help encourage better behavior, and he pointed to the number of national plans developed by countries ahead of the Paris talks which referenced carbon pricing.

Chilean President Bachelet reminded people of the toll of carbon pollution. “Cheap and dirty energy is not cheap for our people’s health,” she said.

“Mexico regards carbon pricing is an effective means of reducing greenhouse gas emissions and promoting the use of cleaner fuels,“ said the President Enrique Peña Nieto.

Canadian Prime Minister said “it was no longer a choice” between what’s good for the economy and what’s good for the environment.  And he spoke about how British Columbia’s carbon pricing system was revenue neutral.

“We have a number of reasons to see climate change is addressed,” said the Ethiopian Prime Minister. “And there is already ample evidence carbon pricing can be cost effective,” he said.

The call by heads of state and government was echoed by ministers and CEOs from around the world at another event today in Paris to officially launch the Carbon Pricing Leadership Coalition (CPLC). The Coalition brings together key governments such as Mexico, Germany, France, Chile and California, along with nearly 90 global businesses and NGOs.

Ahead of the Paris talks more than 90 developed and developing countries, including the European Union, have indicated plans to use international, regional, or domestic carbon pricing schemes for mitigation action.

About 40 nations and 23 cities, states and regions have implemented or are putting a price on carbon with programs and mechanisms covering about 12 percent of global greenhouse gas emissions. The coverage is expected to grow given China’s recent announcement to bring in a national emissions trading system in 2017.

A recent World Bank report, State and Trends of Carbon Pricing 2015, shows the number of implemented or planned carbon pricing schemes around the world has almost doubled since 2012 and are now worth about $50 billion.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Growth in World Cotton Consumption Slows:ICAC

02 Wednesday Dec 2015

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

ICAC, World Cotton

 

World cotton consumption has been revised downward from initial projections to 24.4 million tons, up less than 1% from 2014/15. In its October 2015 report, the International Monetary Fund lowered its forecast for world economic growth in 2015 to 3.1%. Despite optimism from the narrowing gap between polyester prices and cotton prices at the start of 2014/15 and falling domestic cotton prices, cotton consumption in China remained unchanged from 2013/14 at 7.5 million tons. With the latest revision, mill use in China is now forecast at 7.3 million tons in 2015/16. As China’s spinning sector continues to decline, mill use in Asia has grown. India, the world’s second largest consumer of cotton lint may see mill use rise by 3% to reach 5.5 million tons in 2015/16. However, Pakistan, which had in previous years benefited from the growing demand for cotton yarn in China, is expected to see mill use decrease this season by 10% to 2.2 million tons. In addition to reduced demand from China, an ongoing energy crisis, high energy costs, and high taxes that greatly add to the cost of production have caused many mills to reduce operations, and in some cases to shut down entirely. Turkey’s consumption is projected to increase by 5% to 1.4 million tons, due in part to expanding private consumption in the EU and political after its most recent elections. Lower production costs and favorable government policies for the textile sectors in Bangladesh and Vietnam will encourage consumption growth in these countries. Mill use in Bangladesh is forecast to rise by 10% to just over 1 million tons while in Vietnam, by 20% to 1.1 million tons. With consumption slowing, world cotton imports are forecast to decline by 3% to 7.4 million tons in 2015/16, which would constitute the fourth consecutive season in which import volume declined after peaking at 9.8 million tons in 2011/12. China’s imports are expected to shrink by 33% to 1.2 million tons. Imports by Vietnam during the first two months of 2015/16 are up 63% from the same period last season and may reach 1.1 million tons by the end of the season. World cotton production is forecast to fall by 12% to 23.1 million tons, which is 1.3 million tons lower than projected demand in 2015/16. Decreases are expected in all five top producing countries. India’s production may decrease by 4% to 6.3 million tons due to reduced plantings and pest problems. China is in its fourth consecutive season of declining production, and its volume in 2015/16 is projected down 19% to 5.3 million tons. In the United States, a 13% reduction in harvested area and lower yields are expected to cause production to fall by 18% to 2.9 million tons. Production in Pakistan is forecast to reach around 1.9 million tons in 2015/16 while in Brazil, it is projected to decease by 6% to 1.5 million tons. World ending stocks are expected to fall by 6% to 20.7 million tons, which represents about 85% of the volume needed for world mill use in 2015/16. Stocks in China are projected to be just under 12 million tons at the end of 2015/16, while stocks outside of China are forecast down by 4% to 8.7 million tons. WORLD COTTON SUPPLY AND DISTRIBUTION

2013/14 2014/15 2015/16      2013/14 2014/15 2015/16

Million Tons            Million Tons    Changes from previous month

Production     26.27  26.18  23.11           -0.01 0.02 -0.81

Consumption 23.88  24.24  24.37          0.25 -0.24 -0.67

Imports            8.67   7.60    7.35           0.00 0.00 -0.12

Exports             8.99    7.71   7.35            0.00 0.00 -0.12

Ending Stocks  20.08 21.92 20.65           -0.21 0.06 -0.08

Cotlook A Index 91 71 70* *

The price projection for 2015/16 is based on the ending stocks/consumption ratio in the world-less-China in 2013/14 (estimate), in 2014/15 (estimate) and in 2015/16 (projection), on the ratio of Chinese net imports to world imports in 2014/15 (estimate) and 2015/16 (projection). The price projection is the mid-point of the 95% confidence interval: 61 cts/lb to 82 cts/lb

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతాంగానికి తగ్గుతున్న, పారిశ్రామికవేత్తలకు పెరుగుతున్న సబ్సిడీలు

01 Tuesday Dec 2015

Posted by raomk in Economics, Farmers, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Farmers, Fertilizers, subsidies

ఎం కోటేశ్వరరావు

మన దేశంలో ఏటే రైతాంగానికి సబ్సిడీలు తగ్గుతుండగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఏటేటా సబ్సిడీలు పెరుగుతున్నాయి. రైతాంగానికి సబ్సిడీలను తగ్గించాలని, ఇతరులకు ఇంకా పెంచాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ మనవంటి దేశాలపై వత్తిడి తెస్తోంది. గత పదమూడు సంవత్సరాలలో రైతాంగానికి ఇస్తున్న ఎరువుల సబ్సిడీల తీరుతెన్నులు ఇలా వున్నాయి.

ఏడాది వుత్పత్తి సబ్సిడీ (రు.కోట్లలో )

2002-2003దేశీయ యూరియా 7790

2002-2003 దిగుమతి యూరియా 1.16

2002-2003 దేశీయ కాంప్లెక్స్‌ 2487.94

2002-2003 దిగుమతి కాంప్లెక్స్‌ 736.58

11,015.68

2003-2004దేశీయ యూరియా 8521

2003-2004దిగుమతి యూరియా 0.82

2003-2004 దేశీయ కాంప్లెక్స్‌ 2606

2003-2004 దిగుమతి కాంప్లెక్స్‌ 720

11,847.82

2004-2005 దేశీయ యూరియా 10243.15

2004-2005 దిగుమతి యూరియా 742.37

2004-2005 దేశీయ కాంప్లెక్స్‌ 3977

2004-2005 దిగుమతి కాంప్లెక్స్‌ 1165.18

16127.70

2005-2006 దేశీయ యూరియా 10652.57

2005-2006దిగుమతి యూరియా 2140.88

2005-2006దేశీయ కాంప్లెక్స్‌ 4499.2

2005-2006దిగుమతి కాంప్లెక్స్‌ 2096.99

19,389.61

2006-2007దేశీయ యూరియా 12650.37

2006-2007 దిగుమతి యూరియా 5071.06

2006-2007 దేశీయ కాంప్లెక్స్‌ 6648.17

2006-2007 దిగుమతి కాంప్లెక్స్‌ 3649.95

28,019.55

2007-2008 దేశీయ యూరియా 16450.37

2007-2008 దిగుమతి యూరియా 9934.99

2007-2008 దేశీయ కాంప్లెక్స్‌ 10333.8

2007-2008 దిగుమతి కాంప్లెక్స్‌ 6600

43,319.16

2008-2009 దేశీయ యూరియా 20968.74

2008-2009 దిగుమతి యూరియా 12971.18

2008-2009 దేశీయ కాంప్లెక్స్‌ 32957.1

2008-2009దిగుమతి కాంప్లెక్స్‌ 32597.69

99,494.71

2009-2010 దేశీయ యూరియా 17580.25

2009-2010 దిగుమతి యూరియా 6999.98

2009-2010 దేశీయ కాంప్లెక్స్‌ 16000

2009-2010దిగుమతి కాంప్లెక్స్‌ 23452.06

64,032.29

2010-2011 దేశీయ యూరియా 15080.73

2010-2011 దిగుమతి యూరియా 9255.95

2010-2011దేశీయ కాంప్లెక్స్‌ 20650

2010-2011 దిగుమతి కాంప్లెక్స్‌ 20850

65,836.68

2011-2012 దేశీయ యూరియా 20285.46

2011-2012దిగుమతి యూరియా 17475

2011-2012 దేశీయ కాంప్లెక్స్‌ 20237.49

2011-2012దిగుమతి కాంప్లెక్స్‌ 16571.92

74,569.87

2012-2013 దేశీయ యూరియా 20000

2012-2013దిగుమతి యూరియా 20016

2012-2013దేశీయ కాంప్లెక్స్‌ 16000

2012-2013దిగుమతి కాంప్లెక్స్‌ 14576.1

80,592.1

2013-2014 దేశీయ యూరియా 26500

2013-2014 దిగుమతి యూరియా 15324.36

2013-2014 దేశీయ కాంప్లెక్స్‌ 15500

2013-2014 దిగుమతి కాంప్లెక్స్‌ 13926.86

71,251.22

2014-2015దేశీయ యూరియా 38200.01

2014-2015దిగుమతి యూరియా 16200

2014-2015దేశీయ కాంప్లెక్స్‌ 12000

2014-2015దిగుమతి కాంప్లెక్స్‌ 8667.3

75,067.31

ఈ వివరాలను గమనించినపుడు గత 13 సంవత్సరాలలో అన్ని రకాల ఎరువుల సబ్సిడీ కనిష్టంగా 11వేల కోట్ల నుంచి 2008-09 సంవత్సరంలో గరిష్టంగా 99వేల కోట్లకు చేరింది. 2014-15లో 75వేల కోట్లకు పడిపోయింది. మరొక ముఖ్య విషయం ఏమంటే 2002-03లో దేశీయ ఎరువుల సబ్సిడీ 10,277.94 కోట్లు కాగా విదేశీ దిగుమతుల సబ్సిడీ 737.74 కోట్లు మాత్రమే. గరిష్టంగా వున్న ఏడాదిలో స్వదేశీ సబ్సిడీ రు.53.565.84 విదేశీ సబ్సిడీ రు.36,423 కోట్లు. అదే 2014-15 నాటికి దేశీయ సబ్సిడీ 50,200 కోట్లు కాగా విదేశీ సబ్సిడీ 24,867 కోట్లకు తగ్గిపోయింది. పదమూడు సంవత్సరాలలో ఇచ్చిన మొత్తం 6,60,563.7కోట్లు అంటే సగటున ఏడాదికి 50,812 కోట్లు మాత్రమే. దేశంలో పది నుంచి పన్నెండు కోట్ల మంది రైతులున్నారని అంచనా. ఈ లెక్కన ఒకొక్కరికి ఏడాదికి 4,234 నుంచి 5,081 రూపాయలు ఇస్తున్నట్లు చెప్పవచ్చు.అదే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు వివిధ పథకాల పేరుతో ఇచ్చిన పన్ను, ఇతర రాయితీల మొత్తం 2013-14లో ఐదులక్షల యాభైవేల కోట్ల రూపాయలు కాగా 2014-15లో 5.89లక్షల కోట్ల వరకు వుండవచ్చని అంచనా వేశారు. ఈ మొత్తం ఏటేటా పెరుగుతోంది. ఇదే సమయంలో రైతులకు ఇస్తున్న సబ్సిడీ తగ్గిపోతోంది. వ్యవసాయం గిట్టుబాటుగాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే వార్తలు వస్తుంటాయి. జనం సొమ్ము, జనానికి దక్కాల్సిన సొమ్ము నుంచి రాయితీలు పొందుతున్న వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు గిట్టుబాటుగాక వారికి రుణాలు ఇచ్చిన బ్యాంకులు దివాలా తీస్తున్నాయి లేదా నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు ఎక్కడా వినపడదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

COUNTERVIEW: “Worrying” signs: Private sector capex plans decline 11%, corporate profits down 0.05%: Reliance think-tank expert

29 Sunday Nov 2015

Posted by raomk in Current Affairs, Economics, NATIONAL NEWS

≈ Leave a comment

Key sectors such as infrastructure, energy, metals, cement, automobiles, pharmaceuticals, and textiles, showed 4 per cent decline in capital expenditure for 2015-16

Source: COUNTERVIEW: “Worrying” signs: Private sector capex plans decline 11%, corporate profits down 0.05%: Reliance think-tank expert

Share this:

  • Tweet
  • More
Like Loading...

A Hard Look at a Soft Global Economy by Michael Spence – Project Syndicate

29 Sunday Nov 2015

Posted by raomk in Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

The global economy is settling into a slow-growth rut, steered there by policymakers’ inability or unwillingness to address major impediments at a global level. The question is whether an honest assessment of the impediments to economic performance worldwide will spur policymakers into action.

Source: A Hard Look at a Soft Global Economy by Michael Spence – Project Syndicate

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా ముందు చేయి చాచిన బ్రిటన్‌

29 Sunday Nov 2015

Posted by raomk in CHINA, Economics, INTERNATIONAL NEWS, UK

≈ Leave a comment

Tags

China, investments, UK

ఎం కోటేశ్వరరావు

రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యం ఒక నాడు, నేడు తన దేశంలో అవసరమైన మౌలిక సదుపాయాల కోసం కమ్యూనిస్టు చైనా ముందు చేయి చాచాల్సిన స్ధితిలో వుంది. గతవారంలో బ్రిటన్‌ పార్లమెంటులో చర్చ సందర్బంగా ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి చెందిన జాన్‌మెక్‌డొనెల్‌ తన దగ్గర వున్న మావో రెడ్‌ బుక్‌ను బ్రిటన్‌ విత్త మంత్రి జార్జి ఒబోర్నెకు ముందుకు నెట్టటం బ్రిటన్‌లో సంచలనం కలిగించింది. బ్రిటన్‌ ఆస్తులను చైనాకు విక్రయించటం గురించి జోక్‌ చేస్తూ తానా పనిచేసినట్లు మెక్‌డొనెల్‌ పరిస్దితిని విషమించకుండా చూశారు. చైనా సాంస్కృతిక విప్లవ కాలంలో ఈ పుస్తకాన్ని చైనా కమ్యూనిస్టుపార్టీ తయారు చేసింది. దానిలో చైర్మన్‌ మావో చెప్పిన అంశాలు వున్నాయి. కమ్యూనిస్టులకు మార్గదర్శకంగా వుండే విధంగా దానిని రూపొందించారు.తరువాత కాలంలో దానిని నిలిపి వేశారు. ఇంతకూ బ్రిటన్‌ తన ఆస్తులను ఒక కమ్యూనిస్టు దేశానికి అమ్ముకోవాల్సిన పరిస్ధితి ఎందుకు వచ్చింది. తన అవసరాలకు చైనాతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న బ్రిటన్‌ మన ప్రధాని నరేంద్రమోడీతో కుదుర్చుకున్న ఒప్పందాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తుంది ?

న్యూ ఎకనమిక్స్‌ అనే ఒక నెట్‌ పత్రిక చైనా పట్ల బ్రిటన్‌ ఆసక్తి ఎందుకు అనే పేరుతో ఒక విశ్లేషణ చేసింది. దానిలోని అంశాల సారాంశం ఇలా వుంది. చైనాతో బ్రిటన్‌ 40 బిలియన్‌ పౌండ్ల మేరకు ఒప్పందాలు చేసుకుంది. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధకు ప్రత్యామ్నాయంగా అమెరికా పలుకుబడిని తగ్గించేందుకు చైనా ఏర్పాటు చేసినట్లు భావించబడుతున్న ఆసియన్‌ మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు(ఏఐఐబి)తో స్వయంగా అమెరికా ఒప్పందం చేసుకోవటాన్ని ఈ ఏడాది ప్రారంభంలో బ్రిటన్‌ తప్పు పట్టింది. అలాంటి బ్రిటన్‌ ఇప్పుడు తాను కూడా అదే బాటలో నడిచింది.కీలకమైన అణు విద్యుత్‌ కేంద్ర నిర్మాణానికి 6బిలియన్‌ పౌండ్ల చైనా సాయం కోరింది.ఈ కేంద్రం నుంచి తయారయ్యే విద్యుత్‌ రేట్లపై ఆస్ట్రియా ప్రభుత్వం బ్రిటన్‌ను ఐరోపా కోర్టుకు లాగాలని నిర్ణయించింది. వెంటనే ఈ విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోతే బ్రిటన్‌లో విద్యుత్‌ కోతలు విధించాల్సి వుంటుంది.జిడిపిలో 3.5శాతం మౌలిక వసతులకోసం పెట్టుబడులు పెట్టనట్లయితే జీవన ప్రమాణాలు దిగజారతాయని ఓయిసిడి పేర్కొన్నది. బ్రిటన్‌ ప్రయివేటు రంగం నుంచి పెట్టుబడులను ఆకర్షించటంలో బ్రిటన్‌ ప్రభుత్వం విఫలమైంది. పెన్షన్‌ నిధుల నుంచి 20 బిలియన్‌ పౌండ్లు వస్తాయనుకుంటే కేవలం ఒక బిలియన్‌ మాత్రమే వస్తాయని తేలింది. పెట్టుబడులకు సైతం అప్పు చేసేది లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే వడ్డీ రేట్లు రికార్డు స్దాయిలో తక్కువగా వున్నాయి. అందువలన విదేశీ పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.అవి రావాలంటే వాటికి ప్రతిఫలం గురించి ప్రభుత్వం హామీలు ఇవ్వాల్సి వుంది. పెట్టుబడులకు చైనా అనువైనదిగా ప్రభుత్వం గుర్తించింది.చైనా మార్కెట్‌లోకి బ్రిటన్‌ ఆర్దిక సేవల వుత్పత్తులు ప్రవేశించాలంటే ఈ ఒప్పందాలు చేసుకోవాల్సి వుంది. ఇప్పటికే బ్రిటన్‌ విదేశాలతో భారీ వాణిజ్య లోటుతో వుంది. దీన్ని అధిగమించాలంటే ప్రపంచంలో నుంచి సంపాదించిన దానికంటే ఎక్కువగా అంతర్గతంగా ఖర్చు చేయాల్సి వుంది. దీని కోసం బ్రిటన్‌ ఆస్తులు అమ్ముకోవటం లేదా అప్పులు చేయాల్సి వుంది. బయటి నుంచి అప్పులు లేదా పెట్టుబడులను ఆకర్షించాలంటే బ్రిటన్‌ అనువైన ప్రదేశం అని స్పష్టం చేయాల్సి వుంటుంది. చైనా కూడా విచిత్రమైన పరిస్దితిని ఎదుర్కొంటోంది. తన కంపెనీలలో దశాబ్దాల తరబడి భారీగా పెట్టుబడులు పెట్టిన కారణంగా తమ వస్తువులకు మార్కెట్‌లను కనుగొనాల్సి వుంది.బ్రిటన్‌లో టాటా తన వుక్కు కర్మాగారాలను మూసివేస్తున్నాడు. నిరుద్యోగులను ఆదుకోవటం ఒక సమస్య అయితే ఇదే సమయంలో చైనా, ఫ్రెంచి కార్పొరేషన్లకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇవ్వాల్సి వస్తోందని విత్తమంత్రి చెబుతున్నారని న్యూఎకనమిక్స్‌ పేర్కొన్నది.

పోర్చుగీసు దారి ఎటు ?

సోషలిస్టు, కమ్యూనిస్టు, వామపక్ష కూటమి సంకీర్ణ ప్రభుత్వం పోర్చుగీసులో గద్దె నెక్కింది. ఇప్పుడు ప్రపంచ ముఖ్యంగా ఐరోపా కళ్లన్నీ దానిపైనే వున్నాయి. గ్రీసు సిరిజా మాదిరి చేసిన వాగ్దానాలకు భిన్నంగా ప్రజలపై భారాలు మోపటం తప్ప మరొక మార్గం లేదని కొందరు పరిశీలకులు చెబుతున్నారు.సిరిజా అనుభవం చూసిన తరువాతే పోర్చుగీసు వామపక్షాల మధ్య ఏకీభావం కుదిరిందని అందువలన గ్రీసు పరిణామాలు పునరావృతం అవుతాయా అని కొందరు వేచి చూసే ధోరణితో వున్నారు. తాజాగా జరిగిన పోర్చుగీసు ఎన్నికలు అనేక విధాలుగా ప్రాధాన్యత కలిగి వున్నాయి.

ఐరోపా యూనియన్‌ ఏర్పాటును వ్యతిరేకించేశక్తుల మద్దతుతో ఒక ప్రభుత్వం ఏర్పడటం పోర్చుగీసులో గత నాలుగు ద శాబ్దాలలో ఇదే ప్రధమం. ఐరోపా యూనియన్‌ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేస్తే అది మొత్తం ఐరోపాపై దాని ప్రభావం పడుతుంది. ఈ కారణంగానే మితవాది అయిన అధ్యక్షుడు సిల్వా వామపక్షాలను ఆహ్వానించే ముందు ఐరోపా యూనియన్‌ బ్యాంకర్లతో ఒకటికి రెండుసార్లు చర్చలు జరిపాడు.మరోవైపు వామపక్షాలకు ఆహ్వానం పంపటంలో జాగు చేస్తే నిరసన ప్రదర్శ నలు జరుపుతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. మైనారిటీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు చూపిన ఆతృత ఆ ప్రభుత్వం కూలిపోయిన తరువాత ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు చూపకపోవటం విమర్శ లకు దారి తీసింది.

అక్టోబరు నాలుగున జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఓటర్ల మొగ్గు వామపక్షాల వైపే వుంది.కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష కూటమి నుంచి ఎదురౌతున్న సవాళ్లను తట్టుకొనేందుకు సోషలిస్టు పార్టీ గతంలో అమలు జరిపిన అనేక ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పింది. పోర్చుగీసులో జనం కమ్యూనిస్టుల వైపు మొగ్గకుండా చూసేందుకు జర్మన్లు అక్కడ 1974లో ఫాసిస్టు ప్రభుత్వం కూలిపోయిన తరువాత సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేసింది. కమ్యూనిస్టు వుద్యమంలో తలెత్తిన సైద్దాంతిక చీలికల కారణంగా కమ్యూనిస్టుపార్టీ నుంచి విడిపోయిన ట్రాట్క్సీయిస్టులు,మావోయిస్టులు ఇతరులు కలసి 1999లో వామపక్ష కూటమిని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలలో సోషలిస్టు పార్టీ తరువాత పదిశాతం ఓట్లు 44 సీట్లు తెచ్చుకున్నారు, కమ్యూనిస్టులతో కూడిన మరో కూటమికి ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి.

ఎన్నికలకు ముందు వామపక్ష ఐక్యత గురించి చర్చ జరిగింది. సోషలిస్టులతో కలసి తాము ప్రభుత్వంలో పాల్గొనాలంటే సోషలిస్టులు మూడు అంశాలను అంగకరించాలని వామపక్ష కూటమి స్పష్టం చేసింది. ఒకటి పెన్షన్ల స్థంభన ఎత్తివేత, కార్మికుల హక్కుల పరిరక్షణకు అవసరమైన మార్పులు, సంక్షేమ చర్యలకు అంగీకరించాలని కోరింది. ఎన్నికల ప్రచారంలో వీటికి అనుగుణంగా సోషలిస్టు పార్టీ తన ప్రచారాన్ని కేంద్రీకరించినప్పటికీ ఎన్నికల తరువాత ఒక స్పష్టమైన వైఖరిని తీసుకోవటంలో జాగు చేసిన కారణంగా వెంటనే వామపక్ష ఐక్యత సాధ్యం కాలేదు. ఈ లోగా మైనారిటీ మితవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత ప్రజల వాంఛకు అనుగుణంగా ఒప్పందం కుదరటం, విశ్వాస పరీక్షలో పదిరోజులకే మితవాద ప్రభుత్వాన్ని కూల్చివేయటం వరుసగా జరిగిపోయాయి. ఈ ఐక్యకార్యాచరణకు కుదిరిన ప్రాతిపదికకు భిన్నంగా సోషలిస్టు ప్రభుత్వం ప్రయత్నిస్తే భాగస్వామ్య కమ్యూనిస్టులు, వామపక్ష కూటమి దానిని ఎలా ఎదుర్కొంటాయన్నది చూడాల్సి వుంది.

సిగ్గు ఎగ్గూ లేని వారు

యుద్దం, ప్రాణ, విత్త, మాన భంగములందు ఆడితప్ప వచ్చు, అబద్దాలు చెప్పవచ్చు అన్నారు గాని ఎన్నికల సందర్బంగా అవాస్తవాలుచెప్పవచ్చు అనలేదు. అమెరికాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో అలాంటి అబద్దాలను ఆడటంలో అభ్యర్దులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డోనాల్డ్‌ ట్రంప్‌ అనే నేత న్యూయార్క్‌లో ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని కూల్చివేసిన సమయంలో న్యూజెర్సీలోని అరబ్బులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం తాను కళ్లారా చూశానని, సిరియన్‌ శరణార్ధులు అమెరికాకు ముప్పుగా పరిణమించారని చెప్పి 1950 దశకంలో కమ్యూనిస్టు వ్యతిరేక జో మెకార్ధీని మించిపోయినట్లు రుజువు చేసుకున్నాడు.అమెరికా అధికార యంత్రాంగంలో కమ్యూనిస్టులు ప్రతి చోటా చొచ్చుకుపోయారని ఆనాడు రిపబ్లికన్‌ పార్టీ ఎంపీగా వున్న మెకార్ధీ పెద్ద అబద్దం చెప్పాడు. ఒక అవాస్తవాన్ని వందసార్లు గట్టిగా చెపితే దానికి తిరుగుండదన్న హిట్లర్‌ సూత్రీకరణను పుణికి పుచ్చుకున్నాడు. విదేశాంగశాఖలో 205 మంది సిబ్బంది కమ్యూనిస్టులని, వారి జాబితా నా దగ్గర వుందంటూ జేబులోని కాగితాలను చూపేవాడు. తరువాత క్రమంగా ఆ సంఖ్యను పదికి తగ్గించాడు. చివరికి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరని విచారణలో తేలింది.అలాగే ట్రంప్‌ చెప్పిన దానికి ఒక్క ఆధారం కూడా లేదని తేలింది.ఇప్పుడు కమ్యూనిస్టు భయం గురించి చెబితే నడవదు కనుక ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు కూడా హిట్లర్‌,జాన్‌మెకార్ది, ఇప్పుడు డోనాల్ట్‌ ట్రంపును ఆదర్శంగా తీసుకొని ముస్లిం వ్యతిరేకత, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d