• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Readers News Service

నిన్న నోట్ల రద్దు, నేడు బ్యాంకు డిపాజిట్లకు ఎసరు, రేపేమిటి మోడీగారూ !

18 Thursday Jan 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Bank deposits, Demonetisation, FRDI bill, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

త్వరలో ప్రధాని నరేంద్రమోడీ తన అధికార నాలుగోవార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. ఈ కాలంలో ఆయన వ్యతిరేకులకు, మద్దతుదార్లకు ఒక విషయంపై ఏకాభిప్రాయం వుంది. అదేమంటే ఆయన చెప్పేదొకటి చేసేదొకటి, పదవిలోకి వచ్చినప్పటి నుంచి దేశం గిడసబారిపోయింది తప్ప ఎదుగుల లేదు. ఏ దివాలాకోరు విధానాలనైతే కాంగ్రెసు అనుసరించిందో వాటినే మరింత వేగంగా అమలు జరుపుతున్నారు తప్ప కొత్తవి, సరైనవి లేనందున నరేంద్రమోడీ విఫలం కావటం అనివార్యమని ఆయన విధానాలను వ్యతిరేకించే వారు మొదటి నుంచీ బహిరంగంగా చెబుతున్నారు. మద్ధతుదార్లకు ఇప్పటికీ సమాధానం అంతుబట్టటం లేదు. ఆయన అనేక మంచి చర్యలను చేపట్టినప్పటికీ దేశం ఎందుకు గిడసబారిపోయింది, తీసుకున్న చర్యలు వ్యతిరేక ఫలితాలు ఎందుకు ఇస్తున్నాయి అనే ప్రశ్నలకు వారు అంతర్గతంగా తమలో తాము సతమతం అవుతున్నారు తప్ప బయట పడేందుకు సిద్ధం కావటం లేదు. పెద్ద నోట్ల రద్దుపేరుతో జనం దగ్గరున్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయించిన మోడీ ఇప్పుడు ఆ డిపాజిట్లను కొల్లగొట్టేందుకు పూనుకున్నారని అదే జనం గగ్గోలు పెడుతున్నారు. అనేక మంది బ్యాంకుల్లో వున్న డిపాజిట్లను వెనక్కు తీసుకోవాలా వద్దా తీసుకుంటే ఎక్కడ దాచుకోవాలి, తీసుకోకపోతే ఆ డిపాజిట్లను ఏదో ఒకసాకుతో స్వాహా చేస్తే ఎలా అనే గుంజాటనలో వున్నారు.

నల్లధనం వెలికితీత, వుగ్రవాదులకు నిధులు అందకుండా చేసేందుకో మరొక లోకకల్యాణం కోసమో పెద్ద నోట్లను రద్దుచేశామని చెబితే దేశ జనులందరూ నెలల తరబడి బ్యాంకుల ముందు క్యూలు కట్టి తమ వద్ద వున్న నోట్లను డిపాజిట్‌ చేయటం కొత్త నోట్లను తీసుకున్నారు. దానినొక దేశభక్తి కర్తవ్యంగా భావించారు. ఏడాది గడచిపోయినా ఇంకా నోట్ల రద్దుకు ముందున్న పరిస్ధితి పునరుద్ధరణ కాలేదు. ఏటిఎంలలో నో క్యాష్‌ బోర్డులు కనిపిస్తూనే వున్నాయి. రద్దయిన నోట్లెన్ని, నల్లధనం ఎంత బయటికి వచ్చిందో నోట్ల రద్దు వలన కలిగిన లాభమెంత, నష్టమెంత అని చెప్పేవారే లేరు. నోట్ల రద్దును ఎంతో ఘనంగా ప్రకటించిన మోడీ దాని లాభనష్టాల గురించి కనీసం మన్‌కీబాత్‌లో అయినా ఎందుకు చెప్పటం లేదు. రద్దయిన పాతనోట్లతో బ్యాంకుల గదులన్నీ నిండిపోయినందున నాణాలు పెట్టేందుకు స్ధలం లేనందున వాటి ముద్రణ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వుద్యోగుల ఆందోళనతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.పనికిరాని పాతనోట్లను ఇంకా ఎంతకాలం దాస్తారు, దాచి ఏం చేస్తారు? మరి నాణాలకు స్ధలం అంతలోనే ఎలా దొరికింది? ఏదో ఒకసాకుతో నాణాల ముద్రణ నిలిపివేసి టంకశాలలను మూసివేయటం లేదా నాణాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొనేందుకు వేసిన ఎత్తుగడ తప్ప నాణాలకు స్ధలం లేదంటే ఎవరైనా నమ్ముతారా? కేంద్ర ప్ర భుత్వం చెబుతున్న మాటలకు విశ్వసనీయత లేకుండా పోతోంది. నోట్ల రద్దు తాత్కాలికంగా ఆర్ధిక వ్యవస్ధకు చేటు తెచ్చినప్పటికీ అభివృద్ధి కొద్ది నెలల్లోనే తిరిగి పట్టాలెక్కుతుందని ఆర్ధికవేత్తలనేక మంది ప్రభుత్వానికి మద్దతు పలికారు.2017 ఏప్రిల్‌ నుంచి జూన్‌ మాసానికి అభివృద్ధి 6.5-7శాతం వరకు వుంటుందని అనేకమంది అంచనాలు వేశారు. తీరా అది 5.7శాతమని ప్రభుత్వమే ప్రకటించటంతో ఆర్ధికవేత్తల నోళ్లు మూతబడ్డాయి. రోగి తట్టుకోగలిగినపుడే ఆపరేషన్‌ చెయ్యాలి, అందుకే ఇప్పుడు నోట్లు రద్దు చేశామని చెప్పిన నరేంద్రమోడీ చర్యతో వున్న ఆరోగ్యం కాస్తా మరింత దిగజారింది.

నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు మనం దిగుమతి చేసుకున్న పీపా ముడి చమురు ధర 109 డాలర్లయితే ఇప్పుడు 56 డాలర్లకు అటూ ఇటూ వుంది. మోడీ తొలి మూడు సంవత్సరాలలో ఇంకా తక్కువ వుంది. ఖజానాకు ఎంతో కలసి వచ్చింది. కానీ వినియోగదారుడికి ఏం ఒరిగింది. తిరిగి పెట్రోలు మూడేండ్ల గరిష్టానికి చేరింది. డీజిల్‌పై సబ్సిడీ పూర్తిగా ఎత్తివేశారు, గ్యాస్‌, కిరోసిన్‌పై నొప్పి తగుల కుండా ప్రతినెలా కొంత చొప్పున కోత పెడుతున్నారు. చిల్లర ద్రవ్యోల్బణం అదుపులో వుందని, ధరల పెరుగుదల తక్కువగా వుందని సంతోషిస్తున్నవారికి అది కూడా పెరగటం ప్రారంభమై 5.13శాతానికి చేరినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. నోట్ల రద్దు ప్రయోజనం ఏమైనట్లు, జిఎస్‌టి విప్లవ ఫలితాలేమిటి? వుత్పత్తి పడిపోయింది, ఎగుమతులు తగ్గిపోయాయి, దిగుమతులు పెరుగుతున్నాయి. దేశాన్ని ఎటు తీసుకుపోతున్నట్లు ? వాస్తవ పరిస్ధితిని దాచి తిమ్మినిబమ్మిని చేసేందుకు, అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకు కొత్త సమస్యలను ముందు తెచ్చి ఇంతకాలం ప్రయత్నించారన్న అనుమానం కలుగుతోంది. ఏదైనా అసలు ప్రధాని నోరు విప్పి వాస్తవాలు చెబితే కదా !

ఇక బ్యాంకుల్లో వున్న జనం డిపాజిట్లను ప్రభుత్వం తీసుకుంటుందటగా అనే జన ఆందోళన గురించి చూద్ధాం. ఇది ఆధారం లేని లేదా నరేంద్రమోడీని వ్యతిరేకించే ప్రతిపక్షాలు చేసే ఆరోపణ కాదు. స్వయంగా నరేంద్రమోడీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఫైనాన్సియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌(ఎఫ్‌ఆర్‌డిఐ) బిల్లులోనే వుంది. తాజాగా ముగిసిన శీతాకాల సమావేశాల చివరి రోజున పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లును సెలెక్టు కమిటీకి పంపారు. అది తరువాత ఏమౌతుందో చూడాల్సి వుంది. వున్నది వున్నట్లుగా బిల్లును ఆమోదించినట్లయితే జరిగేదేమిటో చూద్దాం. బ్యాంకుల పరిస్ధితి ప్రాణాంతకంగా అంటే తీవ్రపరిస్ధితి ఏర్పడినపుడు పరిష్కరించేందుకు వ్యవస్ధ ‘రిజల్యూషన్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటు ఈ బిల్లులో వుంది. దీనిలో ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ అధికారులే సభ్యులుగా వుంటారు. బ్యాంకుల పరిస్థితి సంక్లిష్టంగా మారినపుడు డిపాజిట్లతో సహా డబ్బుదాచుకున్నవారి సొమ్మును బ్యాంకులు దివాలా ఎత్తకుండా వినియోగించేందుకు పరిశీలించే అవకాశం ఈ కార్పొరేషన్‌కు దఖలు పడుతుంది. ఇప్పటి వరకు అటువ ంటి పరిస్ధితులు ఏర్పడితే అంటే విజయమాల్య వంటి వారు తీసుకున్న వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయినా, స్వదేశంలోనే వుండి కాళ్లు బార్లా చాపినా దివాలా తీసిన లేదా అంతదగ్గరగా వెళ్లిన ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వమే బడ్జెట్‌ ద్వారా నిధులు ఇచ్చి వాటిని నిలబెడుతోంది. దీన్నే బెయిల్‌ అవుట్‌ అంటున్నారు.ఇప్పుడు పార్లమెంటులో ప్రవే శపెట్టిన బిల్లులో బెయిల్‌ ఇన్‌ అనే కొత్త పద్దతిని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం తాను ఆదుకొనే బాధ్యతను వదిలించుకొని అవసరమైతే డిపాజిటర్ల సొమ్ముతోనే బ్యాంకులను నిలబెడతారు. అప్పుడేమవుతుంది. ఏమైనా జరగవచ్చు. బ్యాంకులు దివాలా తీస్తే బ్యాంకులలో డిపాజిట్లు చేసుకున్నవారిలో లక్షలోపు వున్నవారికి బీమాను వర్తింప చేసి వారికి చెల్లించటం జరుగుతోంది. దీనికి గాను రిజర్వుబ్యాంకుకు అనుబంధంగా వుండే డిపాజిట్‌ ఇన్సూరెన్సు అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ద్వారా సొమ్ము చెల్లిస్తారు. కొత్త బిల్లు ప్రకారం దాన్ని మూసివేస్తారు, దాని స్ధానంలో కొత్త వ్యవస్ధ గురించి ప్రస్తావన లేదు. నిజానికి ఆ సంస్ధకంటే ఇప్పటి వరకు ప్రభుత్వ బ్యాంకుల మీద జనంలో వున్న నమ్మకం ముఖ్యమైనది. గతంలో ప్రయివేటు బ్యాంకుల అనుభవాలను చూసిన జనం బ్యాంకులకు బదులు ఇండ్లలోనే డబ్బుదాచుకొనేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. తరువాత బ్యాంకుల జాతీయకరణతో వడ్డీ తక్కువ ఇచ్చినప్పటికీ ఆ నమ్మకం ఎంతోపెరిగింది. ఇప్పుడు దానికి ముప్పు వచ్చింది. నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు, మరోసారి పెద్ద నోట్ల రద్దు అనే ప్రచారాల నడుమ ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లుతో బ్యాంకు డిపాజిట్లు కూడా సురక్షితం కాదనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ఈ భావం మరింత పెరిగితే బ్యాంకులకు డిపాజిట్లు తగ్గిపోతాయి. బంగారం, ఇండ్ల స్ధలాలు, భూముల రూపంలో దాచుకొనేందుకు జనం చూస్తారు. ఇది ఆర్ధిక కోణంలో చూస్తే తిరోగమనమే.

ప్రతిదానిని తమ ఘనతగా చూపేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయద్రవ్య సంస్ధలు, విదేశీ కార్పొరేట్‌ కంపెనీల వత్తిడి మేరకు దేశమంతటా ఏకరూప పన్ను విధానం వుండాలని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ప్రతిపాదించింది. అప్పుడు ప్రతిపక్షంలో వున్న బిజెపి దానిని వ్యతిరేకించింది. తీరా తాను అధికారానికి వచ్చిన తరువాత తన ఘనతగా చెప్పుకొంటోంది. ఇప్పుడు ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు ద్వారా డిపాజిటర్లకు మరింత రక్షణ కల్పిస్తామని, రుణాలు ఎగవేసినవారిపై మరింత కఠినచర్యలు తీ సుకొనేందుకే ఈ బిల్లును తెస్తున్నట్లు చెబుతోంది. పది సంవత్సరాల కితం అమెరికాలోని బడా బ్యాంకులు దివాలా తీసిన తీరు చూసిన బ్యాంకులను ఆదుకొనేందుకు డిపాజిటర్ల సొమ్మును వాడుకోవటంతో సహా వివిధ చర్యలను చేపట్టేందుకు విధంగా ఒక వ్యవస్ధను ఏర్పాటు చేయాలని భారత్‌ భాగస్వామిగా వున్న జి20 దేశాల కూటమి నిర్ణయించింది. దాని పర్యవసానమే ఈ బిల్లు.

ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అమెరికా, ఐరోపా వంటి ధనిక దేశాలలో బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్దలన్నీ ప్రయివేటు రంగంలో వున్నాయి. అటువంటివి దివాలా తీసినపుడు ప్రభుత్వ సొమ్ముతో ఆదుకోవటానికి, ప్రభుత్వరంగంలోని బ్యాంకులు దివాలా తీసినపుడు వాటిని ఆదుకొనేందుకు ప్రజల సొమ్మును వినియోగించటానికి తేడా వుంది. ప్రభుత్వరంగంలోని బ్యాంకులు పాలకపార్టీల నేతలతో కుమ్మక్కయ్యే పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు లక్షల కోట్ల రూపాయలు రుణాలిస్తున్నాయి. వాటిని పక్కదారి పట్టించి, కాగితాల మీద దివాలా చూపించి రుణాలు ఎగవేస్తున్నవారే ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి కుమ్మక్కు, కావాలని ఎగవేసే వారిని నియంత్రించటం, వసూలు చేయటం ఒక అంశం. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ పధకాలు, సామాజిక అవసరాలను కూడా తీరుస్తున్నందున అవి ఇబ్బందులలో పడినపుడు వాటిని ఆదుకోవటానికి ప్రభుత్వ నిధులు కేటాయించటంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు ప్ర భుత్వం ఆ బాధ్యతను కూడా విస్మరించి డిపాజిటర్ల సొమ్ముతోనే ఆపని చేసేందుకు పూనుకుంది. అంటే కుమ్మక్కు, కావాలని ఎగవేసే రుణాలు ఇంకా పెరిగేందుకు అవకా శం వుంటుంది. ఇప్పటి వరకు మన దేశ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అటువంటి పారుబాకీల సమస్య వున్నప్పటికీ మొత్తం మీద అవి నిర్వహిస్తున్న పాత్రతో పోల్చితే వుద్యోగ సంఘాలు సూచిస్తున్న విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటే అధిగమించరాని పెద్ద సమస్య కాదు.

ప్రపంచ ద్రవ్యపెట్టుబడిదారులు బ్యాంకులలో ప్రభుత్వ పాత్ర తగ్గాలని డిమాండ్‌ చేస్తున్నారు. పశ్చిమ దేశాల బ్యాంకింగ్‌ వ్యవస్దకు మనకు చాలా తేడా వుంది. దాని రోగం వేరు. బాసల్‌ పేరుతో పశ్చిమ దేశాల బ్యాంకుల రోగానికి సూచిస్తున్న చికిత్సను మన జాతీయ బ్యాంకులకు చేయటం అర్దంలేని పని. బాసల్‌ పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వం తన వాటాను తగ్గించుకొని బ్యాంకులలో తగిన మేర నిధులు వుంచే పేరుతో ప్రయివేటీకరణకు బాటలు వేస్తున్నది. ఇప్పుడు డిపాజిటర్ల సొమ్ముతో ప్రభుత్వ బ్యాంకుల దివాలాను నిరోధించటమంటే అది మరింత వేగం కావటానికి దారి తీస్తుంది. బ్యాంకులు దివాలా తీసినపుడు డిపాజిట్లలో కొంత మొత్తాన్ని బ్యాంకుల వాటా ధనంగా మార్చుతారు. అది మరోసారి దివాలా తీస్తే గీస్తే వాటాల ధర మరింతగా పతనం అవుతుంది. సొమ్ము అవసరమైన వారు ఆ వాటాలను అయినకాడికి, లేదా అవసరం అయినపుడు ప్రయివేటు వారికి అమ్ముకోవటం తప్ప మరొక మార్గం వుండదు. తన వాటాలనే విక్రయిస్తున్న ప్రభుత్వం సామాన్యడిపాజిటర్ల వాటాను కొనుగోలు చేస్తుందని ఎలా భావించగలం? ప్రభుత్వం ఒక వైపున బ్యాంకులకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు 2.11లక్షల కోట్లను ప్రభుత్వ రంగబ్యాంకులకు సమకూర్చనున్నట్లు ప్రకటించింది. అలాంటపుడు బిల్లు ద్వారా డిపాజిటర్ల సొమ్ము వినియోగానికి అవకాశ ం కల్పించటం ఎందుకు అనే ప్ర శ్న వుత్పన్నం అవుతోంది. ఈ బిల్లును యధాతధంగా ఆమోదిస్తే రానున్న రోజుల్లో డిపాజిట్లకు భద్రత సమస్యకు నాందిపలికినట్లే. లేదు కొంత మంది చెబుతున్నట్లుగా బిల్లు ఆమోదం పొందటం కోసం ప్రభుత్వరంగ బ్యాంకు డిపాజిట్లకు తాత్కాలిక మినహాయింపు ఇచ్చినా తరువాత దొడ్డిదారిన దానిని అమలు జరపరన్న గ్యారంటీ ఏముంది? పాలకుల మాటలు నీటి మీది రాతలు, అందునా అవసరమైనపుడు హడావుడి చేసి ఆనన నోరు మెదపని నరేంద్రమోడీ వంటి వారి చేతలు మరింత ప్రమాదకరం. ఆలోచించండి ! నిన్న జనానికి ప్రయోజనం లేని, దేశానికి నష్టం కలిగించిన పెద్ద నోట్ల రద్దు, నేడు సామాన్య డిపాజిటర్ల సొమ్ము కొల్లగొట్టేందుకు ఎఫ్‌ఆర్‌డిఐ, రేపు ఏ ముప్పు తేనున్నారు మోడీ గారూ అని అడగాల్సిన తరుణం రాలేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రేటింగ్స్‌ మోజులో మోడీ ఆశాభంగం ?

26 Sunday Nov 2017

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

india ratings, moody’s india ratings, Narendra Modi, rating fancy, s&p india rating

ఎం కోటేశ్వరరావు

అధికారాంతమందు చూడవలె ఆ ఆయ్య సౌభాగ్యముల్‌ అన్నట్లు ఒక్కొక్కటీ ఎదురుతన్నుతుండటంతో గతంలో మాదిరి రొమ్ము విరుచుకొనే పరిస్థితులు లేవు. ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు అన్నట్లుగా రేటింగ్స్‌ మోజు నరేంద్రమోడీ పైకి చెప్పుకోలేని చోట మరో దెబ్బతగిలేట్లు చేసింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. పద్నాలుగు సంవత్సరాలుగా రేటింగ్‌తో నిమిత్తం లేకుండా తెచ్చుకుంటున్న అప్పులు, వస్తున్నాయని చెబుతున్న పెట్టుబడులతో ముందుకు పోకుండా అత్యాశకు పోనేల, ఇలా ఇబ్బందులను కొని తెచ్చుకోవటం ఎందుకు అని మోడీ మంత్రాంగం, యంత్రాంగం ఇప్పుడు తలలు పట్టుకోవటం గురించి చెప్పనవసరం లేదు. మూడు వన్‌డే మాచ్‌ల సీరీస్‌లో ఒకటి అటు ఇటు అయితే మూడవది ఇరు జట్లపై ఎంతో వత్తిడి, అభిమానులలో వుత్కంఠను పెంచినట్లుగా ఇప్పుడు అగ్రశ్రేణి రేటింగ్‌ కంపెనీలో మూడవదైన ‘ఫిచ్‌’ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. కారణాలు పైకి ఏం చెప్పినా మూడీస్‌ మన సార్వభౌమ రేటింగ్‌ను చెత్తకు దగ్గరగా వున్న స్ధానాన్ని ఒక మెట్టు పైకి పెంచింది. స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌(ఎస్‌ అండ్‌ పి) మాత్రం గతంలో ఏ స్ధానంలో వుంచిందో దానిని మార్చాల్సినంత సీనేమీ లేదని శుక్రవారం నాడు స్పష్టం చేసింది.ఈ రెండు కంపెనీలు అమెరికావి, మూడవది బ్రిటన్‌ది.

సులభతర వాణిజ్య ర్యాంకును 130 నుంచి 100కు ప్రపంచబ్యాంకు పెంచింది. అలాగే అమెరికాకు చెందిన పూ పరిశోధనా సంస్ధ ఫిబ్రవరిలో చేసిన సర్వే ఫలితాలను నవంబరులో విడుదల చేసి నరేంద్రమోడీకి ఆదరణేమీ తగ్గలేదని, తిరుగులేని నేతని చెప్పింది.విశ్వసనీయ ప్రభుత్వంగా ప్రపంచంలో మోడీ సర్కార్‌ మూడో దేశంగా వుందని 2016లో చేసిన సర్వేలో ఓయిసిడి మరో రాంకు ఇచ్చింది. మూడీస్‌ సంస్ధ చెత్త పక్కన వున్న రాంకును కాస్త ఎగువకు జరిపింది. వాటిని మోడీ భజంత్రీలు ఆయన ఖాతాలో వేసి వీరుడు, శూరుడు అని పొగుడుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలను కలిగి వున్న దేశాలు తీవ్ర సంక్షోభం, వాటి పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయి. మన దేశానికి ఆ సంక్షోభ సెగ తగలటం ప్రారంభమయ్యే సమయంలో నరేంద్రమోడీ అల్లావుద్దీన్‌ అద్బుతదీపం మాదిరి మాజిక్‌ చేస్తానని జనాన్ని నమ్మించి సీట్ల రీత్యా తిరుగులేని మెజారిటీ సాధించారు. అలాంటి స్ధితిలో ఎస్‌ అండ్‌ పి వున్న ర్యాంకును కొనసాగించటం తప్ప పెంచే అవకాశం లేదని చెప్పి గాలితీసిందంటే అది దేశద్రోహం అన్నట్లుగా విరుచుకుపడుతున్నారు.

ఇప్పుడున్న స్ధితిలో ఎవరెన్ని ర్యాంకులు ఇచ్చినా, తెచ్చుకున్నా, రాబోయే రోజుల్లో మార్కెట్లో ఇంకా మరికొన్నింటిని జనం ముందు ప్రదర్శించినా స్ధాయి పెంచిన మూడీస్‌గానీ, యథాతధంగా వుంచిన ఎస్‌ అండ్‌పి గానీ లేవనెత్తున్న అంశాలేమిటి? మోడీ భక్తులు దాని గురించి మాట్లాడటం లేదెందుని? దేశంలో నేడున్న పరిస్ధితులలో అనేక కారణాల రీత్యా ప్రజాకర్షణలో నరేంద్రమోడీ మిగతా పార్టీల నేతల కంటే ఎంతో ముందున్న మాట నిజం. చరిత్రలో అనేక మంది నేతలు ఇలాగే ప్రజాకర్షణలో తారాజువ్వల మాదిరి దూసుకుపోయి అంతే వేగంతో పడిపోయిన వారు కూడా లేకపోలేదు. గత మూడున్నర సంవత్సరాలుగా ఇంతగా జనం విశ్వసిస్తున్న దేశ ప్రధానిని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్ధలు ఎందుకు నమ్మటం లేదు అని మోడీ భక్తులు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సంస్ధలకు చట్టబద్దత లేకపోయినా, లొసుగులున్నా, ఎవరు అవునన్నా కాదన్నా ఏ దేశానికైనా రుణం ఇవ్వాలన్నా,పెట్టుబడులు పెట్టాలన్నా ఈ సంస్ధల సిఫార్సులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అందుకే కదా నరేంద్రమోడీ సర్కార్‌ తమ రేటింగ్‌ పెంచమని పైరవీలు కూడా జరిపింది. మరోవైపు అందని ద్రాక్ష పండ్లు పుల్లన అన్నట్లు ఫోజు పెడుతున్నారు.

మీ గురించి కావాలంటే ఎన్ని మెచ్చుకోలు మాటలైనా చెబుతాం గాని ఆ ఒక్కటీ అడగవద్దు అన్నట్లుగా రేటింగ్‌ సంస్ధలు మన దేశం పట్ల వ్యవహరిస్తున్నాయి. గత 14 సంవత్సరాలుగా రేటింగ్‌ను పెంచకపోయినా మేం అప్పులు తెచ్చుకోగలిగాం, అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, గతం కంటే ఇప్పుడు మా రుణభార శాతం తక్కువగా వుంది. మాకంటే ఎక్కువ రుణభారం వారికి మెరుగైన రేటింగ్‌ ఇచ్చారు, అలాంటపుడు మా రేటింగ్‌ ఎందుకు పెంచరు అని నరేంద్రమోడీ సర్కార్‌ గతేడాది మూడీస్‌ సంస్ధను నిలదీసింది. దీనిలో పాక్షిక సత్యం లేకపోలేదు.1991 నుంచి 2016 వరకు మన దేశ జిడిపి-రుణ నిష్పత్తి సగటున 73.42 శాతం వుంది. అంటే మన ఆదాయం 100 అయితే 73.42 అప్పు తీసుకుంటున్నాం. గతేడాది 2016లో ఇది 69.50 శాతం, గత పాతిక సంవత్సరాలలో కనిష్టంగా 1996లో 66, గరిష్టంగా 2003లో 84.20 శాతం నమోదైంది. రెండవ ఘనత బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయికి దక్కింది. ఆయన పాలనలోనే రుణభారం విపరీతంగా పెరిగింది. అంతకు ముందున్న కనిష్ట స్ధాయికి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు నరేంద్రమోడీ హయాంలో అంతకు ముందున్నదాని కంటే ఒక శాతం పెరిగింది. రేటింగ్‌ లేకపోయినా అప్పులు తెచ్చుకుంటున్నాం అంటున్నారు. అది కూడా తిరుగులేని సత్యమే. ముందు అప్పు ఇవ్వండి వడ్డీ మీ ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోండి అంటున్నాం. ముందే చెప్పినట్లు మన అప్పు నూటికి నూరుశాతం స్ధాయికి పెరగలేదు.మిగతా దేశాలకు ఇస్తే వడ్డీ కంటే రెట్టింపునకు పైగా భారత్‌లో వస్తోంది. అందువలన రేటింగ్‌ను పక్కన పెట్టి ఇచ్చినా ఫరవాలేదు, కొంత వడ్డీ పోయినా ఇబ్బంది లేదు అని విదేశీ సంస్ధలు అనుకుంటున్నాయి. రోజువారీ అధిక వడ్డీలకు ఇచ్చే వారు తీసుకొనే వాడి జుట్టు చేతిలో పెట్టుకుంటున్నట్లే అలాంటి రుణాలకు మనం తప్పించుకోలేని షరతులను రుద్దుతాయి.https://tradingeconomics.com/india/government-bond-yield మన దేశం తీసుకొనే రుణాలకు చెల్లించే వడ్డీ (దాన్నే బాండ్‌ రేటు అంటున్నారు) పది సంవత్సరాల బాండ్‌కు దాదాపు 7 శాతం కాగా అదే చైనా 4.04, అమెరికా 2.33, బ్రిటన్‌ 1.25,ఫ్రాన్సు 0.68, జపాన్‌ 0.03 వుండగా మన కంటే ఎక్కువ వడ్డీలు చెల్లించి రుణాలు పొందే దేశాలు బ్రెజిల్‌ 10.09, మెక్సికో 7.26 వున్నాయి. అందువలన అప్పు తీసుకోవటం గొప్ప కాదు, దానిని ఎలా తీరుస్తామనేదే సమస్య.ష్https://thelogicalindian.com/story-feed/opinion/indias-debt-trap-25-of-the-budget-is-spent-on-paying-of-debts/ మనం తీసుకొనే అప్పులకు బడ్జెట్‌లో 25శాతం మొత్తం చెల్లిస్తున్నాము, అదే అమెరికా కేవలం ఆరుశాతమే. మన పాలకులు అప్పులు తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పేది ఒట్టిమాట, పాత అప్పులు, వాటి వడ్డీలు కట్టేందుకే మనం కొత్త అప్పులు తీసుకుంటున్నాం.

రేటింగ్‌ సంస్ధలు దీని గురించే పట్టుబడుతున్నాయి. అనధికారికంగా అధిక వడ్డీలకు ఆశపడి ఎవరైనా అప్పులు ఇచ్చి రిస్కుతీసుకుంటే అది వారి సమస్య, తమ రేటింగ్‌ను బట్టి అప్పు ఇచ్చేవారిని నట్టేట ముంచేందుకు సిద్ధంగా లేమంటున్నాయి ఆ సంస్ధలు. ఎందుకంటే అన్ని దేశాల పరిస్ధితులను అధ్యయనం చేసి తగు సలహాలనిచ్చేందుకు ఆ సంస్ధలు పెద్ద మొత్తంలో మదుపుదార్లనుంచి ఫీజులు వసూలు చేస్తాయి. మన దేశ తలసరి ఆదాయం కనిష్ట స్ధాయిలో వుండటం, రుణభారం పెరుగుతుండటం మదుపుదార్లకు ఆందోళన కలిగించే అంశమే. మూడు సంవత్సరాలలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశానని మోడీ చేసుకుంటున్నది ప్రచారం తప్ప వాస్తవం కాదని చెప్పటమే గత రేటింగ్‌ను యథాతధంగా వుంచటానికి అర్ధం. అంటే మోడీ అభివృద్ధి, సంస్కరణల గాలితీసినట్లే.

గతేడాది చేసిన నోట్ల రద్దు ద్వారా సాధించిన ఫలితాలేమిటో ఏడాది పూర్తయిన సందర్భంగా అయినా మోడీ నోరు విప్పుతారేమోనని ఆశించిన దేశభక్తులను నిరాశపరిచారు. జిఎస్‌టి గురించి ఎలాంటి కసరత్తు, పర్యవసానాల గురించి ఆలోచించకుండా బలవంతంగా అమలు జరపటంతో జరిగిందేమిటో చూస్తున్నాం. ఒక పన్ను పద్దతిని రద్దు చేసి మరొక పన్ను విధానాన్ని ప్రవేశపెట్టటం అంటే తెల్లచొక్కా తీసి వేసి కాషాయ చొక్కా తొడుక్కున్నంత సులభం అన్నట్లుగా చెప్పిన కబుర్లు ఏమయ్యాయి. గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికలు, గుజరాత్‌ వ్యాపారులు తీవ్ర నిరసనల కారణంగా జిఎస్‌టిలో మార్పులు చేశారని అందరూ ఎరిగిందే. ఆ పని పూర్తయిన తరువాత తిరిగి రేట్లు పెంచరన్న హామీ ఏముంది. భారత్‌లో పన్ను ఆదాయం తక్కువగా వుందని, దాన్ని పెంచకుండా, తగినంత ఆదాయం లేకుండా అప్పులు ఎలా తీరుస్తారని గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ మన ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నాయి. అందువలన నరేంద్రమోడీ మరింతగా మూసుకోవటం తప్ప నోరు తెరిచే అవకాశం లేదు. నిజానికి మోడీకి వాస్తవాలు తెలియక కాదు, జర్నలిస్టులలో చెప్పింది రాసుకొనే స్టెనోగ్రాఫర్లే కాదు, ఏమిటి, ఎందుకు, ఎలా,ఎవరు, ఎక్కడ అని ప్రశ్నలడిగే నోరున్న వారు కూడా వున్నారు గనుక ప్రధాని పదవి స్వీకరించిన తరువాత మోడీ ఇంతవరకు పత్రికా గోష్టి పెట్టలేదు. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం మనది, అందులోనూ ప్రధాని విధిగా పత్రికా గోష్టి పెట్టాలని ఎక్కడా రాసిలేదు మరి. ఈ విషయంలో గిన్నిస్‌బుక్‌ రికార్డులకు ఎక్కుతారనేది జనాభిప్రాయం.

యధారాజా తధా ప్రజ సామెతలో ప్రజ బదులు సలహాదారులు అని మార్పు చేసుకోవాల్సిన అగత్యం కనపడుతోంది. ఈ మధ్య కాలంలో ప్రధాని, ముఖ్యమంత్రులు పుష్పకవిమానాలను నింపినట్లు తమ కార్యాలయాలను సలహాదారులతో నింపివేస్తున్నారు. వారు తమ ప్రావీణ్యత వున్న రంగాలలో గతంలో ఏం చేశారో తెలియదు గానీ సలహాదారులుగా మారిన తరువాత యజమాని మనసెరిగి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాదంటే వారి వుద్యోగాలుండవు మరి. మహాభారతంలో శకుని మామ గురించి తెలిసినదే. ప్రధాని నరేంద్రమోడీకి బయటి ప్రత్యర్ధులెవరో అందరికీ తెలిసిందే. సమస్య అంతర్గత శక్తులతోనే. అందుకని ఎవరే పాత్ర పోషిస్తున్నప్పటికీ అది ఆ పెద్ద మనిషి స్వయంకృతం. ‘చివరాఖరికి ‘ చెప్పొచ్చేదేమంటే నరేంద్రమోడీ అంతకంటే ఆయనను అనుసరించే గుడ్డి భక్తకోటి రోజు రోజుకూ ఇరకాటంలో కూరుకుపోతున్నారు. దానివలన ఎవరికీ నష్టం లేదు సమస్యల్లా సామాన్య జనం, దేశం అధోగతి పాలు కావటం గురించే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రేటింగ్స్‌ కోసం మోడీ సర్కార్‌ పైరవీలు జరిపిందా ?

18 Saturday Nov 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, BJP’s trolling army, India economy, india ratings, moody’s india ratings, Narendra Modi, narendra modi bhakts

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి నేతలు జరిపిన విదేశీయాత్రలు, అందుకు అయిన విమానఖర్చుల మేరకు కూడా వారు విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులను సమీకరించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మోడీ విదేశీ పర్యటనలు తగ్గాయని భావిస్తున్న తరుణంలో విమర్శకుల నోరు మూయించేందుకు వారికి ఒక అస్త్రం దొరికింది. గత పదమూడు సంవత్సరాలుగా మన స్ధానాన్ని చెత్త రేటింగ్‌ ఎగువన, పెట్టుబడి రేటింగ్‌కు దిగువున వుంచిన మూడీస్‌ అనే అమెరికా సంస్ధ దేశ ఆర్ధిక రేటింగ్‌ను ఒక మెట్టు పైకి పెంచింది. కొద్ది రోజుల క్రితం అదే అమెరికాకు చెందిన ప్యూ అనే సంస్ధ విడుదల చేసిన సర్వేలో కాస్త పలుకుబడి తగ్గినప్పటికీ ఇప్పటికీ నరేంద్రమోడీయే తిరుగులేని నాయకుడిగా వున్నాడని తేలిందని పేర్కొన్నారు.(ఆ సర్వే తొమ్మిదినెలల క్రితం చేసింది, ఇప్పుడు ఎందుకు విడుదల చేశారన్నది ఒక ప్రశ్న) వాణిజ్య సులభతర సూచికలో గతేడాది కంటే ఏకంగా 30పాయింట్లు తగ్గి ఎగువకు చేరింది. ఇప్పుడు మూడీస్‌ బూస్ట్‌ ఈజ్‌ద సీక్రెట్‌ ఆఫ్‌ అవర్‌ ఎనర్జీ అన్నట్లు దేశవ్యాపితంగా బిజెపి శ్రేణులు,నేతలు గంతులు వేస్తున్నాయి. దానికి వచ్చే నెలలో జరగనున్న గుజరాత్‌ ఎన్నికలలో ప్రచారానికి వీటిని వుపయోగించుకొని బయటపడగలమనే సంతోషమే కారణం. అయితే వీటి ప్రభావం ఎంత మేరకు వుంటుందన్నది ప్రశ్నార్ధకమే. ఒక వేళ మోడీ-అమిత్‌ షా రేటింగ్‌ను ఓట్ల కోసం వాడితే మిగతా రెండు సంస్ధల మాటేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా వూరుకుంటాయా? తెనాలి రామకృష్ణ సినిమాలో ఒక చక్కటి డైలాగ్‌ వుంది. నేను నియోగిని ఎలా కావాలంటే అలా వినియోగపడతాను అంటాడు రామకృష్ణ(నిజానికి ఆ కవి అలాంటి వాడో కాదో తెలియదు) భజన మీడియా మాత్రం అలాంటిదే. కనుక దాని చిత్రణ చూసి గంతులేస్తే గోతిలో పడతారు. ఇప్పటికీ కాస్త విమర్శనాత్మకంగా చూసే విశ్లేషకులు ఒంటి మీద బట్టలున్నాయో లేదో కూడా చూసుకోకుండా గంతులేయాల్సినంతగా తాజా రేటింగ్‌లో ఏముందంటున్నారు.

మూడీస్‌ సంస్ధ రేటింగ్‌ చరిత్రలోకి వెళితే బిజెపి భజన బృందాలకు కాస్త ఇబ్బందేమరి. ఎందుకంటే తమ నేత వాజ్‌పేయి కాలంలో దేశం వెలిగిపోయిందని చెప్పుకున్న కాలంలో కూడా మన రేటింగ్‌ అధ్వాన్నంగానే వుంది మరి. పెట్టుబడిదారులు, భూస్వాములకు లబ్ది చేకూర్చేందుకు మన పాలకులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ వళ్లు వంచి ఎంతో కష్టపడుతున్నారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధలతో బంధం ముడిపడిన తరువాత చేపట్టిన చర్యలకు సంస్కరణలు అని పేరు పెట్టారు. ప్రధానులుగా పని చేసిన వారిలో నూతన ఆర్ధిక విధానాలకు శ్రీకారం చుట్టిన ఖ్యాతి తెచ్చుకున్న రాజీవ్‌ గాంధీ పాలనలో మూడీస్‌ సంస్ధ మన దేశానికి పెట్టుబడిలో ఆరవ ర్యాంకు(1988) ఇచ్చింది. విపిసింగ్‌ ఎనిమిది(1990) చంద్రశేఖర్‌ పది(1991) పివి నరసింహారావు పాలనలో పెట్టుబడేతర చెత్త రాంకులు పదకొండులో రెండోది(1991), ఆయన పాలనలోనే 1994లో పెట్టుబడిలో పదవరాంకు తరువాత దేవెగౌడ పాలనలో 1998లో కూడా దాన్నే కొనసాగించింది. అదే ఏడాది వాజ్‌పేయి అధికారానికి వచ్చిన తరువాత తిరిగి రెండవ చెత్త రాంకులోకి దిగజారింది. తరువాత ఒకటవ చెత్త రాంకులోకి, తరువాత 2004లో పెట్టుబడిపదవ రాంకులోకి పెంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పదేండ్ల పాలనలో అదే కొనసాగి ఇప్పుడు నరేంద్రమోడీ మూడున్నర ఏండ్ల తరువాత పదినుంచి తొమ్మిదవ రాంకులోకి పెంచింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే వాజ్‌పేయి హయాంలో చెత్తకు అటూ ఇటూగా వున్నందుకే తమ పాలనలో దేశం వెలిగిపోయిందంటూ బిజెపి వారు పెద్ద ఎత్తున వందల కోట్లతో ప్రచారానికి తెరతీసి జనం ముందుకు వచ్చి బక్కబోర్లా పడిన విషయాన్ని మరచి పోకూడదు. అందువలన ఈ మాత్రానికే మోడీ పరివారం పండగ చేసుకోవాలా అని కొందరు అంటున్నారు.

పిల్లి ఏ రంగుదని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా సంస్కరణలు ఏ ప్రధాని ఎలా అమలు జరిపారన్నది కాదు, దాని వలన జనానికి ఒరిగిందేమిటి అన్నదే గీటురాయి. రేటింగ్‌లో మార్పు కోసం నరేంద్రమోడీ సర్కార్‌ తెగతాపత్రయ పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లుగా చివరకు పైరవీలకు ప్రయత్నించి విఫలమైందని రాయిటర్స్‌ సంస్ధhttps://in.reuters.com/article/india-ratings-moody-s/exclusive-how-india-lobbied-moodys-for-ratings-upgrade-but-failed-idINKBN14E09A   గతేడాది డిసెంబరు 25న ఒక వార్తను ప్రచురించింది. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ కూడా అదే పని చేసి భంగపడిందని వార్తలు వెలువడ్డాయి.

రాయిటర్స్‌ కథన సారాంశం ఇలా వుంది. మూడీస్‌ రేటింగ్‌ పద్దతులను భారత్‌ విమర్శించింది. రేటింగ్‌ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని సంబంధిత పత్రాలలో రాయిటర్స్‌ గమనించింది, అయితే దుర్బలంగా వున్న బ్యాంకుల తీరుతెన్నులను ఎత్తి చూపుతూ వత్తిడికి లంగేందుకు అమెరికా సంస్ధ తిరస్కరించింది. అధికారానికి వచ్చిన నాటి నుంచి పెట్టుబడులను పెంచేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు, ద్రవ్య,కరెంట్‌ ఖాతాలోటు తేడాను తగ్గించేందుకు నరేంద్రమోడీ చర్యలు తీసుకున్నారు.అయితే ఇంకా చర్యలు తీసుకోవాలని మూడు రేటింగ్‌ సంస్దలు కోరాయి. ఆర్ధిక మంత్రిత్వశాఖ-మూడీస్‌ మధ్య నడిచిన వుత్తర ప్రత్యుత్తరాలలో రుణభారం,136బిలియన్‌ డాలర్ల విలువగల బ్యాంకుల పారుబాకీల గురించి రేటింగ్‌ సంస్ధలకు భరోసా ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్లు వెల్లడైంది. అక్టోబరులో రాసిన లేఖలు, ఇమెయిల్స్‌లో మూడీస్‌ సంస్ధ లెక్కలు కట్టే విధానాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్నంతా ఆశావహంగా రుణభార సమస్య లేదని, బ్యాంకుల తీరు ఆందోళన కలిగిస్తోందని మూడీస్‌ అ వాదనలను తిరస్కరించింది. రేటింగ్‌ సంస్ధలతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అసాధారణంగా వుందని, రేటింగ్‌ ఏజన్సీలపై వత్తిడి చేయలేమని ఆర్ధికశాఖ మాజీ అధికారి అరవింద్‌ మాయారామ్‌ చెప్పారు. బిఏఏ రేటింగ్‌ వున్న దేశాల జీడిపిలో ఆదాయం 21.7శాతం మీడియన్‌(మధ్యరేఖ) కాగా భారత్‌లో 21శాతమే వుందని అందువలన మూడీస్‌ సంస్ధ పెట్టుబడులలో కనిష్ట రేటింగ్‌ ఇచ్చింది. రేటింగ్‌ ఎక్కువ వున్న దేశంలో రుణాలు పొందటానికి అయ్యే వ్యయం తక్కువగా వుంటుంది కనుక పెట్టుబడులు పెట్టేవారు ముందుకు వస్తారు. దేశంలో వచ్చే ఆదాయంలో ఐదోవంతుకు పైగా అప్పులపై వడ్డీ చెల్లింపులకే పోతోంది.

అక్టోబరు నెలలో మూడీస్‌ ప్రతినిధికి పంపిన ఇమెయిల్‌లో సంస్ధ రేటింగ్‌ పద్దతిని మోడీ ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జపాన్‌, పోర్చుగల్‌ వంటి దేశాలు వాటి ఆర్ధిక వ్యవస్ధల కంటే రెట్టింపు రుణభారం కలిగి వున్నప్పటికీ మెరుగైన రేటింగ్‌ ఇచ్చారని పేర్కొన్నది.2004 తరువాత భారత రుణభారం గణనీయంగా తగ్గినప్పటికీ రేటింగ్స్‌లో అది ప్రతిబింబించలేదని, విదేశీమారక ద్రవ్య నిల్వలు మెరుగ్గా వుండటం, ఆర్ధిక పురోగతిని కూడా పరిగణనలోకి తీసుకోవటం లేదని అభ్యంతరం తెలిపింది. దానికి మూడీస్‌ ప్రతినిధి వెంటనే సమాధానమిస్తూ భారత్‌తో సమాన రేటింగ్‌ వున్న దేశాలతో పోల్చితే రుణభారం ఎక్కువగా వుందని, అదే సమయంలో రుణాన్ని భరించగల స్ధితి కూడా తక్కువగా వుందని పేర్కొన్నారు.బ్యాంకుల పారుబాకీల సమస్య సమీప భవిష్యత్‌లో పరిష్కారమయ్యే అవకాశాలు కూడా కనిపించటం లేదని పేర్కొన్నారు. సానుకూల వైఖరి కనిపిస్తున్నప్పటికీ గతంలో ఇచ్చిన బిఏఏఏ3 రేటింగ్‌ను మార్చే అవకాశం లేదని గ్రేడ్‌ పెంచే పరిస్ధితులు లేవని నవంబరు 16న మూడీస్‌ తెలిపింది.’

1980దశకం నాటి స్ధాయిలో లేకపోయినప్పటికీ ఇప్పుడు రేటింగ్‌ పెంచిన కారణంగా తక్కువ వ్యయ్యంతో విదేశాలలో భారత్‌ నిధులు తెచ్చుకొనే అవకాశాలు పెరుగుతాయని పరిశీలకులు వ్యాఖ్యానించారు. అయితే మిగతా రెండు ప్రధాన రేటింగ్‌ సంస్ధలైన్‌ ఎస్‌అండ్‌పి, ఫిచ్‌కూడా రేటింగ్‌ పెంచితేనే అది సాధ్యం అవుతుంది. అవి కూడా వెంటనే ఆ పని చేయకపోతే మూడీస్‌ చర్యను అంతర్జాతీయ పెట్టుబడిదారులు అనుమానించే అవకాశం వుంది. అదే జరిగితే రేటింగ్‌ను తగ్గించినా ఆశ్చర్యపోనవసరం లేదు. రెండవది ఈ రేటింగ్‌ను నిలుపుకొనే విధంగా ప్రభుత్వ చర్యల్లేకపోయినా తిరిగి తగ్గించే అవకాశాలు లేకపోలేదు. రేటింగ్‌ మెరుగ్గా లేకపోయినప్పటికీ దానితో నిమిత్తం లేకుండానే గత పద మూడు సంవత్సరాలుగా విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులు కొంత మేరకు పెరిగాయి. దానికి తమ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలే అని మన్మోహన్‌సింగ్‌, నరేంద్రమోడీ ఎవరికి వారు చెప్పుకోవటం సహజం. అయితే ఇప్పుడు ఈ రేటింగ్‌తో అదనంగా వచ్చేదేమిటి అన్నది ఒక ప్రశ్న. రేటింగ్‌ మెరుగైన కారణంగా ఇంకా విదేశీ నిధులు వచ్చిపడితే జరిగేదేమిటి? ఒకటి నిధులు, రుణాల వ్యయం తగ్గటం ఒక సానుకూల అంశం. ధనిక దేశాల బ్యాంకులలో మన కంటే వడ్డీరేట్లు మరీ తక్కువగా వున్నాయి. వాటితోపోల్చితే మన దగ్గర ఎక్కువ. అందువలన మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన హామీ వుంటే విదేశీ సంస్ధలు ముందుకు వస్తాయి.

అదే సమయంలో విదేశీ నిధుల ప్రవాహం మన రూపాయి విలువపై ప్రభావం చూపటం అనివార్యం. ఇప్పటికే రూపాయి విలువ పెరిగిన కారణంగా ఎగుమతిదార్లు పోటీని ఎదుర్కోలేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రూపాయి విలువ ఇంకా పెరిగితే ఎగుమతులు మరింతగా పడిపోతాయి. వాణిజ్యలోటు పెరుగుతుంది. ఆ ప్రభావం మన కార్మికులు, రైతులు,వ్యవసాయ కార్మికులపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. రేటింగ్‌ వార్త వెలువడిన శుక్రవారం నాడు 30పైసల మేరకు విలువ పెరిగింది. అయితే రూపాయి విలువ ఎంత పెరిగితే ఆ మేరకు చమురు ధరలు తగ్గుతాయి. ఇతర ప్రయోజనాలు, ప్రభావాల గురించి అనేక అభిప్రాయాలు వెలువడుతున్నప్పటికీ రేటింగ్‌తో నిమిత్తం లేకుండానే విదేశీ నిధులు ఇప్పటికే వచ్చినందున రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం వుంటుందో చూడాల్సి వుంది.

ఒకటి మాత్రం స్పష్టం. ఏదో ఒక పేరుతో ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టారు. పెట్రోలు, డీజిల్‌పై పూర్తిగా సబ్సిడి ఎత్తివేశారు. గ్యాస్‌, కిరోసిన్‌పై ఎత్తివేత క్రమంగా అమలు జరుగుతోంది. ఇలాంటి చర్యలు ద్రవ్యలోటును ఎంత మేరకు పూడ్చగలవనేది చూడాల్సి వుంది. నోట్ల రద్దు ద్వారా మూడు లక్షల కోట్ల మేరకు లబ్ది చేకూరుతుందన్న అంచనాలు పోయి నష్టాలు మిగిలాయి. దీనికి తోడు బ్యాంకులకు పెట్టుబడులు సమకూర్చేందుకు ప్రభుత్వం 2.11లక్షల కోట్లను కేటాయించాల్సి వుంది. అన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వాన్ని పాలక ఎన్‌డిఏ కూటమి, దానితో జతకట్టాలని వుబలాటపడుతున్నవారికి ఆందోళన కలిగించే అంశం పెరుగుతున్న చమురు ధరలు. ఇప్పటికే 60డాలర్లున్న పీపా ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందనే జోస్యాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే రేటింగ్‌ ప్రయోజనాలన్నీ ఒక్క దెబ్బతో ఎగిరిపోతాయి. చమురు ధరల పెరుగుదల పర్యవసానాలను మోడీ సర్కార్‌ ఎలా పరిష్కరిస్తుందన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్న. భారం మొత్తాన్ని జనంపై మోపితే ధరలు విపరీతంగా పెరుగుతాయి. దానితో సంబంధం వున్న వేతనాలు,భత్యాల వంటివి పెరగాల్సి వుంది.

దేశాల రేటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలలో ఆ దేశాల రుణభారం ఒకటి. మన పొరుగునే వున్న చైనా జిడిపి వంద రూపాయలనుకుంటే దాని అప్పులు 43, అదే మన దేశానికి వస్తే 68 రూపాయలుగా వుంది. మన వంటి రేటింగ్‌ వున్న దేశాల మీడియన్‌ 44 మాత్రమే. అమెరికా, బ్రిటన్‌లకు 70శాతం వుంది. ఆ దేశాలకు అంత అప్పు వున్నప్పటికీ వాటికి తీర్చే సత్తా కూడా వుంది. మన పరిస్ధితి అది కాదు.ఎస్‌ అండ్‌ పూర్‌ రేటింగ్‌ సంస్ధ మన దేశ అప్పు దామాషా 60లోపుగా వుండాలని షరతు లాంటి వత్తిడి చేస్తోంది. రేటింగ్‌ పెంపుదల కోసం మూడీస్‌ సంస్ధతో మోడీ సర్కార్‌ లాబీయింగ్‌(పైరవీ) చేసిందని చెప్పిన రాయిటర్స్‌ మరో అమెరికన్‌ సంస్ధ ఎస్‌ అండ్‌ పి, బ్రిటన్‌ కంపెనీ ఫిచ్‌ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు మూడీస్‌ చేసిన సవరణను మిగతా రెండు సంస్ధలు కూడా అనుసరిస్తాయా? అది తేలేంత వరకు మోడీ భక్తులకు బిపి పెరగటం ఖాయం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నూటఅరవై కోట్ల మందిని బలితీసుకున్న పెట్టుబడిదారీ విధానం !

07 Tuesday Nov 2017

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Anti communist, Bolshevik Revolution, CAPITALISM, communist, mass murdering evil of capitalism, Nazism, revolution

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-3

ఎం కోటేశ్వరరావు

అక్టోబరు విప్లవానికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన జాతీయ, ప్రాంతీయ మీడియాతో పోల్చితే పశ్చిమదేశాల మీడియాలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. తరువాత కూడా అది ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. ధనిక దేశాలలో పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో, ఎప్పుడు పరిష్కారం అవుతుందో పెట్టుబడిదారీ పండితులకు అంతుబట్టటం లేదు. దాదాపు ప్రతి దేశంలోనూ ఒకసారి ఎన్నికైన పార్టీ వెంటనే రెండోసారి అధికారంలో కొనసాగే పరిస్థితి లేదు. పాలకపార్టీల పేర్లు, కొన్ని అంశాలపై భిన్న వైఖరులు కలిగి వుండటం తప్ప అనుసరిస్తున్న విధానాలన్నీ ఒకే విధంగా వుంటున్నాయి. పళ్లూడగొట్టించుకొనేందుకు ఏ రాయి అయితేనేం అన్నట్లుగా జనం మీద భారాలు మోపటానికి, సంక్షేమ పధకాలకు కోత పెట్టటంలో ఏ పార్టీ అయినా ఒకే విధంగా వ్యవహరించటమే దీనికి కారణం.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, దానికి వెన్నుదన్నుగా నిలిచిన కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో పెల్లుబికిన కమ్యూనిస్టు వుద్యమంపై మొదటి, రెండవ సాదారణ ఎన్నికల సందర్భంగా నాటి మీడియా ఎంత తప్పుడు ప్రచారం చేసిందో పాత తరాలకు, చరిత్ర కారులకు తెలిసిందే.అయితే పశ్చిమ దేశాలలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి ఇప్పటివరకు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా సాగుతూనే వుంది. దాని కొనసాగింపుగానే వందేండ్ల బోల్షివిక్‌ విప్లవం గురించి ఇప్పుడు కూడా చెడరాసిపారేస్తున్నారు. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల మానస పుత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక నవంబరు ఆరున వంద సంవత్సరాల కమ్యూనిజంలో వందమిలియన్ల మంది హత్య అంటూ ఒక శీర్షికతో ఒక వార్త, అంతకు మూడు రోజుల ముందు కమ్యూనిజపు రక్త శతాబ్దం పేరుతో మరొక వార్తను ప్రచురించింది. ఇంకా అనేక పత్రికలు గతంలో కూడా ఆ సమాచారాన్నే అటూ ఇటూ మార్చి గత కొద్ది సంవత్సరాలుగా పాఠకుల మీద రుద్దుతున్నాయి. వాటిని జనం పూర్తిగా నమ్మటం లేదని అక్టోబరులో అమెరికాకు చెందిన కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ విడుదల చేసిన ఒక సర్వేలో పేర్కొన్న విషయం తెలిసిందే.(అమెరికాలో అక్కడి ప్రభుత్వం కమ్యూనిస్టులను వేటాడి వేధించింది తప్ప కమ్యూనిస్టుల బాధితులు లేకపోయినా ఆ పేరుతో ఒక సంస్ధ ఏర్పాటు చేయటమే విడ్డూరం) ఈ ప్రచారం ఎంత హాస్యాస్పదం అంటే రష్యా, చైనాలలో సంభవించిన కరువుల వంటి ప్రకృతి వైపరీత్యాలలో మరణించిన వారిని కూడా కమ్యూనిస్టులే చంపివేశారని చెబుతారు. అంతకంటే అత్యంత దుర్మార్గమైన ప్రచారం ఏమంటే ఫాసిస్టులు-నాజీలు, వారి పీచమణిచి ప్రపంచాన్ని రక్షించిన కమ్యూనిస్టులను ఒకేగాట కట్టి జనాన్ని చంపటంలో కమ్యూనిస్టులకు, ఫాసిస్టులకు తేడా లేదు. ఇద్దరూ మారణహోమానికి పాల్పడ్డారంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియా మొత్తంగా సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, వారికి వూడిగం చేసే వారి చేతుల్లో వుంది కనుక గోబెల్స్‌ మాదిరి పదే పదే ప్రచారం చేసి అనేక మంది బుర్రలను కలుషితం చేస్తున్నారు.

నరహంతకులు ధరాధిపతులైనారన్నట్లు లాభాల కోసం పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ప్రపంచంలో మానవాళిపై జరిపినన్ని దుర్మార్గాలు మరొకరు జరపలేదు. మానవత్వాన్నే పరిహసించారు. వారు హరించిన మానవ హక్కులకు అంతేలేదు. పెట్టుబడిదారీ విధానం, దానిని పరిరక్షించేందుకు కంకణం కట్టుకున్న పాలకులు జరిపిన దాడులు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో జనాన్ని గాలికి వదలి వేయటం వంటి బాధ్యతా రాహిత్యం వంటి సకల అనర్ధాలు వలన పెట్టుబడిదారీ విధానం నూట అరవై కోట్ల మందికిపైగా జనాల మరణాలకు కారణమైందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.https://prolecenter.wordpress.com/2017/08/21/1-6-billion-killed-by-capitalism/ కమ్యూనిస్టుల పాలనలో కరువులలో మరణించినా అందుకు వారే బాధ్యులంటున్న వారు ఆ ప్రాతిపదికను మిగతావారికి ఎందుకు వర్తింప చేయరు?

బ్రిటీష్‌ వారి ఆక్రమణ సమయంలో మన దేశంలో సంభవించిన బెంగాల్‌ కరవులో కోటి మంది, అంతకు ముందు సంభవించిన వాటిలో మూడు కోట్ల మంది మరణించారు. మన దేశాన్ని బ్రిటీష్‌ వారు ఆక్రమించే క్రమంలో జరిగిన యుద్ధాలు, దాడులు, ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరో రెండు కోట్లు. ఇక ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు ఐరోపా ధనిక దేశాలు ఐరోపా ఖండంలో, ఇతర ఖండాలలో జరిపిన యుద్ధాలు, వాటిలో చిందిన రక్తం, పోయిన ప్రాణాలకు బాధ్యత ఎవరిది? రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వియత్నాం, కంపూచియా, లావోస్‌లతో కూడిన ఇండో చైనా ప్రాంతాన్ని ఆక్రమించుకొనేందుకు జపాన్‌,ఫ్రాన్స్‌, అమెరికా జరిపిన దాడుల్లో మరణించిన లేదా గాయపడిన వారు దాదాపు కోటి మంది వున్నారు. మారణాయుధాల గుట్టలను వెలికితీసే పేరుతో ఇరాక్‌పై అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు జరిపిన దాడులు, ఆంక్షల కారణంగా మరణించిన లక్షల మంది గురించి తెలిసిందే. ఇక రెండు ప్రపంచ యుద్ధాలకు కారకులు ప్రజాస్వామిక దేశాలుగా చెప్పుకొనే అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఫాసిస్టు, నాజీలు, నియంతలుగా పేరు పడిన జర్మనీ, జపాన్‌,ఇటలీ వారితో చేతులు కలిపిన వారు తప్ప కమ్యూనిస్టులు కాదే. ఆ యుద్ధాలలో జరిగిన ప్రాణ నష్టాలను ఎవరి ఖాతాలో వేయాలి? వియత్నాం యుద్ధంలో అమెరికన్లు ప్రయోగించిన రసాయనిక ఆయుధాల వలన యుద్ధం ముగిసిన నాలుగు దశాబ్దాల తరువాత కూడా అనేక ప్రాంతాలలో పంటలు పండకపోవటం, జనం రోగాల బారిన పడటం చూస్తున్నదే. జపాన్‌పై అమెరికా ప్రయోగించిన అణ్వాయుధ ప్రభావం డెబ్బయి సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అనుభవిస్తున్నారు. మ్యూనిజాన్ని అరికట్టేపేరుతో ఇండోనేషియాలో నియంత సుహార్తోను ప్రోత్సహించి దాదాపు పది లక్షల మంది మ్యూనిస్టులు,అభిమానులను హత్య చేయించటంలో అమెరికన్లకు పాత్ర వుందని ఇటీవలే బయటపడిన విషయం తెలిసిందే. పెట్టుబడిదారీ విధానంలో భాగంగా సంభవించిన ఆర్ధిక సంక్షోభాలలో చితికిపోయిన కుటుంబాలు, మరణాలకు బాధ్యత ఎవరిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘోరాలు, దారుణాలకు పాల్పడిన దేశాలు, వారిని నడిపించిన పెట్టుబడిదారీ విధానం, ప్రజాస్వామ్యం మాటేమిటి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు ‘విదేశీ’ ముస్లిం మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ బాటలో నేడు ‘స్వదేశీ’ హిందూ బిజెపి నరేంద్రమోడీ !

02 Thursday Nov 2017

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Doing business India rank, Doing business rankings, mughal king jahangir, Narendra Modi, red carpet to foreign investors

సూరత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు అనుమతి కోరుతూ 1615లో మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ వద్దకు ఇంగ్లండ్‌ రాజు ఒకటవ జేమ్సు ప్రతినిధిగా వచ్చిన సర్‌ థామస్‌ రో

ఎం కోటేశ్వరరావు

దారీతెన్నూ తెలియని అడవిలో తచ్చట్లాడుతున్నవారికి తెల్లవారు ఝామున వేగు చుక్క కనపడినట్లు నరేంద్రమోడీ సర్కార్‌కు ప్రపంచబ్యాంకు వెల్లడించిన తాజా సులభవాణిజ్య సూచిక దొరికింది. మునిగిపోయే వారికి గడ్డిపరక దొరికినా దానిని పట్టుకొని బయటపడాలని చూసినట్లుగా బిజెపి నాయకత్వ ఆత్రం కనిపిస్తోంది. ప్రపంచబ్యాంకు నివేదిక వార్తలతో పాటే ప్రజల సొమ్ముతో పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు జారీ చేయించి పండగ చేసుకుంది. భక్తులు పరమానంద భరితులౌతున్నారు. విమర్శించిన వారి మీద ఎదురుదాడులకు దిగుతున్నారు. ఎందుకటా! ఇప్పటి వరకు 190 దేశాలలో 130వ స్ధానంలో వున్న మనం ఒక్క ఏడాదిలో ఏకంగా100వ స్ధానంలోకి ఎగబాకినందుకట. దానికిగాను తమ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, చర్యలు ఇవీ అంటూ కేంద్ర ప్రభుత్వం పూర్తి పేజీని నింపి జనం మీదకు వదిలింది. నిజానికి అవేవీ కొత్తవి కాదు, మోడీ సర్కార్‌ గద్దె నెక్కిన దగ్గర నుంచీ వూదరగొడుతున్నవి, కొద్ది మంది కార్పొరేట్లకు తప్ప సామాన్య జన సంక్షేమానికి సంబంధం లేనివి, ఒక పట్టాన అర్ధం కానివి.

Bill Bragg illustration on Europe and India and Greece

మోడీ సర్కారు పూర్తి పేజీ ప్రకటనలో లేనిదీ ప్రపంచబ్యాంకు నివేదిక అట్ట మీద వున్నదానిని జనం గమనించాలి. ‘డూయింగ్‌ బిజినెస్‌ 2018, రిఫార్మింగ్‌ టు క్రియేట్‌ జాబ్స్‌’ అన్నది నివేదికకు పెట్టిన నామం. మన ప్రధాని పూర్తి పేజీ ప్రచారంలో జాబ్స్‌ అదే వుపాధి ప్రస్తావనకు ఎగనామం పెట్టారు. నివేదిక పేరును తెలుగులో అనువదించుకుంటే ‘2018లో వ్యాపారం, వుపాధి సృష్టికి సంస్కరణ’ అని అర్ధం. ప్రచార ప్రకటనలో వందవ ర్యాంకు సాధన గురించి పేర్కొని సంస్కరణలు దీనిని సాధ్యం చేశాయి అంటూ పన్నుల చెల్లింపు, అల్పసంఖ్యాక పెట్టుబడిదారులకు రక్షణ, కాట్రాక్ట్‌ సేవకరణ, వ్యాపార ప్రారంభం, సరిహద్దులలో వ్యాపారం, రిసాల్వింగ్‌ ఇన్సాల్వెన్సీ(దివాలా పరిష్కారం) రుణం పొందటం, విద్యుత్‌ పొందుట, అనుమతులు రూపకల్పన విషయాలలో తీసుకున్న చర్యలను క్లుప్తంగా పేర్కొన్నారు. వాటి ఫలితంగా సంభవించాల్సిన వుపాధి కల్పన గురించి ఎక్కడైనా వుందా అని దుర్భిణీవేసి వెతికినా కనిపించలేదు. అందుకే పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడాలన్నట్లుగా ఇంతకాలంగా నరేంద్రమోడీ చేపట్టిన సంస్కరణలు ఇచ్చిన ఫలితాలేమిటన్నది గీటురాయి. సంస్కరణలనే పిల్లికి మన్మోహన్‌ సింగ్‌ పాలుపోసినా లేక నరేంద్రమోడీ మోడీ అంతకంటే మంచి ఆహారం అందించినా అది ఎలుకలను పట్టకపోతే ఎందుకు చేరదీసినట్లు ? వుపాధిని పెంచని, వుద్యోగాలను వూడగొట్టే, సంక్షేమ చర్యలకు మంగళం పాడే సంస్కరణలెందుకు? నరేంద్రమోడీ సంస్కరణలలో ప్రపంచబ్యాంకు సూచికను తయారు చేసే వారిని ప్రధానంగా ఆకర్షించింది కంపెనీల దివాలా పరిష్కారాన్ని సులభతరం చేయటం. అనేక మంది పెద్దలు పరిశ్రమలు, వ్యాపారాల పేరుతో వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవటం, వాటిని వేరే మళ్లించి చివరకు దివాళా, ఐపి పెట్టటం అందరికీ బాగా తెలిసింది. ఈ ప్రక్రియ ఇప్పటివరకు కాస్త కఠినంగా వుంది. అయినప్పటికీ ఎందరో మహానుభావులు లక్షల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టారు.

2014 జూన్‌ నాటికి అంటే నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించే నాటికి 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్థులుగా వర్గీకరించిన మొత్తం రు.2.34లక్షల కోట్లు కాగా 2016 డిసెంబరు నాటికే ఆ మొత్తం రు.6.46లక్షల కోట్లకు చేరింది. అయితే రద్దు చేసినవి, పునర్‌వ్యవస్థీకరించినవి, పారుబాకీలుగా తేల్చిన మొత్తాన్ని లెక్కకడితే అది 20లక్షల కోట్ల రూపాయల వరకు వుంటుందని రిజర్వుబ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్‌ కెసి చక్రవర్తి చెప్పారు. కంపెనీల నుంచి గోళ్లూడగొట్టి ఎగవేసిన రుణాలను వసూలు చేయాల్సిన సర్కార్‌ పధకం ప్రకారం దివాలా ప్రకటించిన వారిని సులభంగా బయటపడవేయించేందుకు మోడీ సర్కార్‌ ప్రకటించిన దివాలా సంస్కరణలు ప్రపంచ వాణిజ్యవేత్తలను, వారికి ప్రతినిధిగా వున్న ప్రపంచబ్యాంకుకు సంతోషం కలిగించకుండా ఎలా వుంటాయి. నూతన దివాలా చట్టం నిధులను పక్కదారి పట్టించి కొల్లగొట్టేందుకు అనుమతిస్తుందని, అందువలన ఈ వుదంతంలో వాణిజ్యాన్ని సులభతరం గావిస్తుందా సొమ్ము లూటీని సులభతరం చేస్తుందా అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ వ్యాఖ్యానించారు. వాణిజ్యం చేయటాన్ని సులభతరం చేసేందుకు చేపట్టిన సంస్కరణల లక్ష్యం కొత్త వుద్యోగాల సృష్టి అన్నది ప్రపంచబ్యాంకు చెబుతున్నమాటే. మరి వాటి సంగతిని మోడీ సర్కార్‌ ఎక్కడా చెప్పదేం? భక్తులైనా నోరు విప్పరేం?

ప్రతి ఏటా కోటి కొత్త వుద్యోగాలను సృష్టిస్తానని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మోడీ మంత్రదండంతో నిజంగానే వుద్యోగాలస్తాయనే గట్టి నమ్మకంతో ఆంధ్రప్రదేశ నలో మా బాబస్తే మీ జాబచ్చినట్లే అని తెలుగు దేశం పార్టీ ప్రచారం చేసింది. ఇక కెసిఆర్‌ బంగారు తెలంగాణా గురించి చెప్పాల్సిన పని లేదు. మూడు సంవత్సరాల మోడీ సర్కార్‌ తీరుతెన్నులను చూస్తే పదేండ్ల కనిష్టానికి కొత్త వుపాధి సృష్టి పడిపోయిందని అధికారిక సమాచారమే వెల్లడించింది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ 2009లో పదిలక్షల వుద్యోగాలను సృష్టిస్తే మోడీ హయాంలో 2015లో 1.55లక్షలు, 2016లో 2.31లక్షలు మాత్రమే వచ్చాయి. నాటి కోటి వాగ్దానానికి, నేటి ఆచరణకు పొంతన ఎక్కడ? మోడీ విదేశీ పర్యటనలు చేసి విమనాల్లో జీవించే ప్రధాని అని చెడ్డ పేరు తెచ్చుకోవటం తప్ప సాధించిందేమిటి? మేకిన్‌ ఇండియా జాడలెక్కడ? మరోవైపు కొంత తగ్గినప్పటికీ ఏడుశాతం వరకు అభివృద్ధి జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నారు, సంస్కరణలు సరేసరి, ఇన్ని చేసినా వుద్యోగాలెందుకు రావటం లేదు. అలాంటపుడు అభివృద్ధి అంటే ఏమిటి, అది ఎవరికోసం? వుపాధి లేని యువత దేశానికి వరమా? శాపమా ? ఐటి రంగంలో దిగ్గజ సంస్ధలు ఈ ఏడాది 56వేల మందిని ఇంటికి పంపేందుకు పధకాలు వేశాయని ఒకవైపు వార్తలు, మరోవైపు రానున్న మూడు సంవత్సరాలలో ఐటి రంగంలో ఇప్పుడున్న వారిలో సగం మంది అవసరం లేని మిగులుగా తేలుతారని మెకెన్సీ కంపెనీ అంచనా వేసింది.

ఎందుకీ పరిస్ధితి? నిరుద్యోగం, దారిద్య్ర భూతాల వంటివి మోడీని వ్యతిరేకించే వారినే పట్టి పీడిస్తాయి, అభిమానించేవారి జోలికి రావని ఎవరైనా అనుకుంటే జాలిపడటం తప్ప చేసేదేమీ లేదు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి ఎవరినీ వదల్లేదని ఇప్పటికే రుజువైంది కదా ! పెట్టుబడిదారులకు కావాల్సింది లాభాలు తప్ప మరొకటి కాదు. ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువైనా కార్మికులు తక్కువగా వుండే పరిశ్రమలు, వ్యాపార సంస్ధల కోసం మన దేశంలో తీవ్రవెతుకులాట ప్రారంభమైంది. పశ్చిమ దేశాలలో ఇప్పటికే వుపాధి రహిత అభివృద్ధి దశలో వున్నాయి. మనం కూడా అదేబాట పట్టాము. మరోవైపు చైనాలో వేతనాలు పెరుగుతున్నాయి కనుక మా దేశంలో చౌక శ్రమశక్తితో పని చేయించుకోవచ్చు రండహో అని మోడీ, చంద్రబాబు, కెసిఆర్‌ లేకపోతే వారి తనయులు ప్రపంచమంతా తిరిగి చెప్పినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. మేకిన్‌ ఇండియా అంటే అదొక ప్రహసనంగా తయారైంది. సింఫనీ టెక్నాలజీ గ్రూపు కంపెనీల అధిపతి రమేష్‌ వాధ్వానీ ఒక పత్రికలో రాసిన దాని ప్రకారం ‘ 2005-12 మధ్య భారత జిడిపి 54శాతం పెరగ్గా నిఖర వుద్యోగ పెరుగుదల మూడుశాతం మాత్రమే. కేవలం కోటీ యాభైలక్షల కొత్త వుద్యోగాలు మాత్రమే వచ్చాయి.ఈ అంతరం రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. వార్షిక వృద్ధి రేటు 7-8శాతం మధ్య వుంటుందనే అంచనా ప్రకారం 2025నాటికి దేశ జిడిపి రెట్టింపు అవుతుంది. కొత్తగా వుద్యోగాలు కావాల్సిన వారు ఎనిమిది కోట్ల మంది వుంటారు, అయితే ఇప్పుడున్న రేటులో కేవలం మూడు కోట్ల కొత్త వుద్యోగాలు మాత్రమే, అవీ ఎక్కువగా అసంఘటితరంగం, తక్కువ వేతనాలున్నవి మాత్రమే సృష్టి అవుతాయి.’ ఇప్పుడున్న పరిస్ధితి ప్రకారం 2020 నాటికి దేశ జనాభా సగటు వయస్సు 29 వుంటుంది, ప్రతి ఏటా వుద్యోగాలవేటలో చేరేవారి సంఖ్య కోటీ ఇరవై నుంచి కోటిన్నర వరకు వుండవచ్చు. వారిని సంతృప్తి పరచపోతే సామాజిక అశాంతి ఏ రూపంలో బద్దలు అవుతుందో చెప్పలేము. నిరుద్యోగం పెరగటం లేదా కొత్త వుద్యోగాల సృష్టి లేకపోవటానికి దారితీసే కారణాలలో పెట్టుబడి సమీకరణ(ఆస్థుల సమీకరణ అని కూడా అంటారు) పురోగతి నెమ్మదించటం ఒకటని నిపుణులు చెబుతారు. ఆ మేరకు 2016 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2017లో పెరుగుదల కేవలం రెండుశాతమే వుంది.జర్మన్‌ డచ్‌ బ్యాంకు నివేదిక ప్రకారం నెమ్మదిగా సాగే పెట్టుబడి సమీకరణ జిడిపి పురోగతిపై పరిమితులు విధించటం, వుపాధి కల్పనను నిరోధిస్తుంది.’

వాణిజ్య సులభతరం సూచనలో 130న నుంచి 100కు 30 పాయింట్ల పురోగతి సాధించామని బిజెపి తనకు తానే కితాబునిచ్చుకుంటున్నది. సంస్కరణలతో పాటు అవినీతి నిరోధం గురించి కూడా నరేంద్రమోడీ అంతే గట్టిగా చెప్పారు. అవినీతిని అరికట్టి వాణిజ్యాన్సి సులభతరం గావించామని ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ కాంగ్రెస్‌ నేతలకు ఒక ట్వీట్‌లో చురకలంటించారు. అయితే అవినీతి నిరోధక సూచికలో మోడీ సర్కార్‌ 176 దేశాలలో 2016లో తన సూచికను 76 నుంచి 79కి మూడు పాయింట్లు మాత్రమే మెరుగుపరచుకుంది. అంటే మోడీ సర్కార్‌కు కార్పొరేట్లకు వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు తీసుకొనే చర్యల పట్ల వున్న శ్రద్ద అవినీతి నిరోధకంలో లేదని ఈ సూచిక స్పష్టం చేయటం లేదూ !

పదహారవ శతాబ్ది ప్రారంభంలో నాటి మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ మన దేశంలో సులభంగా వాణిజ్యం చేసుకొనేందుకు ఎర్రతివాచీ పరిచాడు. పద్దెనిమిదవ శతాబ్ది చివరికి ఆ కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటీష్‌ వారు చివరకు మన దేశాన్ని ఆక్రమించుకొని వలస దేశంగా చేసుకున్నారు. ఇప్పుడు 130 నుంచి 100వ స్ధానానికి ఎగబాకించటం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ మరో జహంగీర్‌గా చరిత్రకు ఎక్కారు. దీని పర్యవసానాలు ఎలా వుంటాయో చెప్పనక్కరలేదు. నాడు బ్రిటీష్‌ వారు ప్రత్యక్ష పాలకులుగా మారితే అంతర్జాతీయ కార్పొరేట్లు పరోక్షంగా చక్రం తిప్పి ప్రతి జీవన రంగాన్ని శాసించేందుకు మోడీ ద్వారాలు బార్లా తెరిచినట్లుగా వేరే చెప్పనవసరం లేదు. అసలు ద్వారాలే లేకుండా చేసే ప్రయత్నాల్లో వున్నారు.

అవథ్‌ నవాబు రాజ్యాన్ని తిరిగి అప్పగించినందుకు బహుమానంగా నాటి బెంగాల్‌ ప్రాంతం(బెంగాల్‌,బీహార్‌,ఒడిషా)లో పన్నులు వసూలు చేసుకొనే అధికారాన్ని నాటి బ్రిటీష్‌ రాజ్య ప్రతినిధి రాబర్టు క్లైవ్‌కు 1765 అగస్టు పన్నెండున అప్పగిస్తున్న మొఘల్‌ రాజు రెండవ రెండవ షా ఆలమ్‌.

ఇప్పటికే వాణిజ్యాన్ని సులభతరం చేసే పేరుతో మన సంపదలను విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టటాన్ని కాంగ్రెస్‌ పాలకులు ప్రారంభించారు. సంస్కరణల పేరుతో 1990 దశకంలో ప్రారంభించిన చర్యలతో సులభవాణిజ్యంలో మన దేశాన్ని 130వ స్ధానానికి తెచ్చారు. కాంగ్రెస్‌ వారు మూడు దశాబ్దాలలో చేయలేని దానిని స్వదేశీ నరేంద్రమోడీ అత్యంత వేగంతో విదేశీయులకు విందు చేసేందుకు మూడు సంవత్సరాలలో 100కు తెచ్చారు. విశాఖలోని గంగవరం రేవును ప్రయివేటు రంగానికి కట్టబెట్టారు. ఒక పత్రికలో వచ్చిన వార్త ప్రకారం ఈ రేవులో అమెరికా సంస్ధ వార్‌బర్గ్‌ పింకస్‌ తనకున్న 31.5శాతం వాటాను దుబాయ్‌ కంపెనీకి విక్రయించాలని చూస్తోందని, పదేండ్ల క్రితం 150 కోట్లు పెట్టుబడి పెట్టిన అది ఇప్పుడు తన వాటాను రు.2560 కోట్ల రూపాయలకు విక్రయించాలని చూస్తోందన్నది వార్త సారాంశం. వ్యాపార సులభతరంలో భాగమే ఇది. అంటే అంత మొత్తం మన దేశం నుంచి సంపద అమెరికాకు తరలిపోయినట్లే. మన స్ధానం వంద నుంచి ఒకటికి తెచ్చేందుకు మోడీ సర్కార్‌ కృషి చేయవచ్చు, దాని వలన అంత మొత్తానికి వాటా కొనుగోలు చేసిన దుబాయ్‌ అదిగాక పోతే మరొక విదేశీ సంస్ధ మరో పదేండ్ల తరువాత అదే దామాషాలో సంపదను తరలించుకుపోతే మన జనానికి ఒరిగేదేమిటి ? మూడు సంవత్సరాల నుంచి తీసుకున్న చర్యలతో విదేశీ కంపెనీల పని సులభం అయిందిగానీ మన బతుకులు దుర్భరం అయ్యాయని మోడీ ప్రభుత్వ విధానాలు స్పష్టం చేయటం లేదా? అందువలన సంఘపరివార్‌ అదే, బిజెపి మాతృసంస్ధ భాషలో చెప్పాలంటే ‘విదేశీ ‘ ముస్లిం మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ మన దేశం బ్రిటీషు వారి పాలనలోకి పోవటానికి ఆద్యుడైతే నేడు ‘స్వదేశీ ‘ హిందూ నరేంద్రమోడీ విదేశీ కార్పొరేట్ల చేతుల్లోకి దేశాన్ని అప్పనంగా అప్పగించేందుకు పూనుకున్న వారిలో నెంబర్‌ ఒన్‌ రాంక్‌ పొందినట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వివాదాస్పద విదేశీ ఆర్ధికవేత్త విఫల స్వదేశీ నరేంద్రమోడీని గట్టెక్కిస్తారా ?

20 Friday Oct 2017

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

behavioural economics, Consumer Affairs, economist richard thaler, Narendra Modi, Nobel economics prize, swadesi

కొండూరి వీరయ్య

అర్థశాస్త్రంలో 2017 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ బహుమతి రిచర్డ్‌ థేలర్‌ను వరించింది. దానివల్ల అర్థశాస్త్ర పరిశోధనా రంగంలో ఉన్న మేధావులు ఎంతైనా చర్చించుకోవచ్చు. కానీ థేలర్‌కు నోబెల్‌ బహుమతి రావటం పట్ల దేశంలో బిజెపి సంబరాలు చేసుకోవటమే ఈ వ్యాసానికి నేపథ్యం. థేలర్‌ను ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించిన వెంటనే బిజెపి ఐటి సెల్‌ ( దేశవ్యాప్తంగా బిజెపి, ప్రధాని పేరు మీద ప్రచారమవుతున్న అవాకులు, చవాకులు, అర్థ సత్యాలు, అసత్యాలు, నిరాధారమైన అభిప్రాయాల పోగు పోసే కేంద్రం – సంక్షిప్తీకరణ కోసం బిజెపి గోబెల్స్‌ విభాగం అని పిలుద్దాం) సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన వెలువడించింది. మోడీ అమలు చేసిన నోట్ల రద్దు పథకాన్ని థేలర్‌ సమర్ధించాడు అన్నది ఈ ప్రకటన సారాంశం. నోబెల్‌ విజేత పేరు ప్రకటించగానే బిజెపి ఐటి సెల్‌ అధ్యక్షుడు అమిత్‌ మాలవీయ తన ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. యథా ప్రకారం ఈ ప్రకటనను సుక్షితులైన బిజెపి ఐటి కరసేవకులు దేశమంతా వ్యాపింపచేశారు. థేలర్‌ నోబెల్‌ విజేత కావటానికి, మోడీ నోట్ల రద్దు నిర్ణయానికి ఏమిటి సంబంధం ?

బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ గురించిన చర్చను భారతదేశంలో నోట్ల రద్దు అనుభవాలతో పోల్చవచ్చు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తొలి దఫా సమర్ధకులు ముందుకు తెచ్చిన వాదన ఇలా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నగదు వినియోగం వల్లనే ఆర్థిక వ్యవస్థ పలు సమస్యలు ఎదుర్కొంటోంది. నగదు పట్ల ప్రజల మక్కువ తగ్గించాలంటే నగదు పనికిరాని కాగితం కింద మార్చటం ద్వారా ఆర్థిక లావాదేవీల్లో వారి ప్రవర్తన, కొనుగోళ్ల పద్దతి, ప్రాధాన్యతలనను నగదురహిత ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లించటానికి నోట్లు రద్దు నిర్ణయం ఉపయోగపడుతుంది అన్నది ఈ విశ్లేషణల సారాంశం. ఈ సందర్భంగానే తొలిసారిగా పామర చర్చల్లో సైతం ఆర్థిక లావాదేవీలు- ప్రవర్తనాశీలత (బిహేవియరల్‌ ఎకనమిక్స్‌) గురించిన చర్చ సార్వత్రికమైంది. నగదు రహిత లావాదేవీల ప్రయోజనాల గురించి బిజెపి గోబెల్స్‌ విభాగం కంప్యూటర్లెక్కి కూయటమే కాదు. మన జేబుల్లో ఉన్న సెల్‌ఫోన్లల్లో కూడా అర్థరహిత సమాచారాన్ని నింపేసింది. ఇదే నిజమని నమ్మిన పలువురు మేధావులు, ఆర్థిక వేత్తలు, ఆరెస్సెస్‌-బిజెపి కంప్యూటర్‌ కరసైనికులతో గొంతు కలిపి నోట్ల రద్దు విమర్శకుల నోళ్లు మూయించటానికి విశ్వ ప్రయత్నం చేశారు.

విదియ నాడు కనపడకపోతే తదియ నాడు కనపడుతుంది అని తెలంగాణలో ఒక సామెత ఉంది. అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరి వంటి వాళ్ల మొదలు నోట్ల రద్దుకు సిపార్సు చేసిన గురుమూర్తి వంటి వారంతా ఆర్థిక వ్యవస్థ పట్ల నిర్వేదం వ్యక్తం చేస్తూ వరుసగా నోళ్లు తెరిచారు. గత ఆర్నెల్లుగా ఈ ప్రమాదాన్ని వామపక్ష ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తూనే వచ్చారు. నిద్రపోయే వాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్లు నటించేవాడిని లేపలేము కదా… ఈ విమర్శల పట్ల ప్రభుత్వ స్పందన ఈ సామెతనే గుర్తు తెస్తోంది. రెండ్నెల్ల క్రితం స్వయంగా రిజర్వు బ్యాంకు విడుదల చేసిన వార్షిక నివేదికలో నోట్ల రద్దు నిర్ణయంతో ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు అని నిర్దారించింది. ఆగస్టు చివరి వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడిన ఆర్థిక సర్వేలో నోట్ల రద్దు, జిఎస్టీ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్త కుంగిపోయింది అన్న అంచనాను వెల్లడించింది. బిజెపి గోబెల్స్‌ విభాగం మోడీ నిర్ణయాన్ని సమర్ధించుకోవటానికి థేలర్‌ను అరువు తెచ్చుకొంటోంది. నిజంగా నోట్ల రద్దు మీద థేలర్‌ అభిప్రాయం ఏమైనా ఈ రకమైన అరువుతెచ్చుకున్న మద్దతు ద్వారా కుదేలైన ఆర్థిక వ్యవస్థ బతికి వస్తుందా అన్న ప్రశ్నకు బిజెపి కంప్యూటర్‌ కరసేవకులు, వారిని పనికి పురామాయించిన పెద్ద తలకాయలు సమాధానం ఇవ్వాలి.

బిహేవియరల్‌ ఎకనమిక్స్‌కు పునాదులు ఆధునిక వినిమయ వాదంలో ఉన్నాయి. సరళీకరణ విధానాల ఆరంభానికి ముందు ఆర్థిక నిర్ణయాలు ప్రధానంగా వ్యవస్థాగతంగా ఉండేవి. అంటే ఆయా దేశాల రాజకీయ ఆర్థిక వ్యవస్థల ప్రయోజనాలు, పురోగతి నేపథ్యంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకునే పద్ధతి. ఈ క్రమంలో జాతీయ వనరులు అర్థవంతమైన వినియోగంతో పాటు పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభాల రేటుపై నియంత్రణలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారీ వ్యవస్థను బతికించటానికి కీన్స్‌ ముందుకు తెచ్చిన సంక్షేమ ఆర్థిక విధానాలు, వాటి ద్వారా సాధారన ప్రజానికి కలిగే కొద్దిపాటి వెసుబాట్లు కూడా దిగమింగటం పెట్టుబడిదారీ వ్యవస్థకు సాధ్యం కాలేదు. దాంతో సంక్షేమ ఆర్థిక విధానాలపై మొదలైన మితవాద ఆర్థికవేత్తల దాడిలో ఒక కోణమే బిహేవియరల్‌ ఎకనమిక్స్‌. ఈ ధోరణి ప్రకారం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రతి వ్యక్తీ వినియోగదారుడే. వినియోగపు అస్థిత్వమే వ్యక్తి అస్థిత్వంగా మారుతుంది. ప్రపంచీకరణ విధానాలు పుంజుకున్న తర్వాత ఈ ధోరణి మరింత ముదిరి నిర్ణీత మోతాదులో వినియోగం చేయలేని వాళ్ల గురించి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఆలోచించాల్సిన అవసరం లేదు అనేంత వరకు వెళ్లింది. ఆధునిక మాల్స్‌లో ఖరీదైన వస్తువుల అమరిక ఆరోహణ క్రమంలో అమర్చటాన్ని మనం రోజూ గమనిస్తూనే ఉంటాం. కొనుగోలు చేసే వస్తువుల ఖరీదును బట్టి కొనుగోలుదారుడికి అందే సమపర్యలుంటాయి.

వాణిజ్య ప్రకటనల కోలాహలం బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ పునాదిగా పెరిగిన ధోరణే. ఈ వాణిజ్య ప్రకటనల వెనక ఉన్న ఉద్దేశ్యం కేవలం ఉత్పత్తుల గురించిన సమాచారాన్ని వినియోగదారుల వద్దకు చేర్చటమే కాదు. తమ ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని వారిని ప్రభోదించటం, ప్రభావితం చేయటం కూడా. సూత్ర రీత్యా బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ చెప్పేది విస్తృతమైన ప్రత్యామ్నాయాలు (ఒకే సరుకు వివిధ బ్రాండ్లలో) అందుబాటులో ఉంటే నచ్చింది ఎంచుకునే స్వేఛ్చ వినియోగదారుడికి ఉంటుంది. ఈ ఆర్థిక సూత్రీకరణలో ప్రధాన లోపం ఉంది. అది వినియోగదారుల ఆర్థిక సామాజిక స్థాయి, కొనుగోలు శక్తి, అవసరాలుతో నిమిత్తం లేకుండా మూసపోసిన కొనుగోలుదారుల మందను తయారు చేయటమే ఈ లోపం.

ఈ ధోరణి మరో చర్చను కూడా ముందుకు తెస్తుంది. ఇది మరింత ప్రమాదకరమైనది. డేటా మోడలింగ్‌తో ముడిపడిన అంశం ఇది. దీన్ని పరిశీలించటానికి ఆర్థిక రంగం కంటే రాజకీయ రంగం మరింత అర్థవంతంగా ఉంటుంది. 2013 మొదలు 2017 సెప్టెంబరు వరకు బిజెపి, మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానం ఇది. ప్రజలను నిర్దిష్ట ఆలోచనలు, అవసరాలు, అవగాహనలు, అస్థిత్వాలు ఉన్న వ్యక్తులుగా కాక తమ సమాచార సరఫరాకు క్షేత్రంగా మాత్రమే చూసే ధోరణి. ఒక సారి వ్యక్తులు తమ సామాజిక అస్థిత్వం కోల్పోయిన ప్రయోగశాలలో పరిశీలనావస్తువులుగా మారిన తర్వాత వారి నిర్ణయాలను ప్రభావితం చేయటంలో డేటా మోడలింగ్‌ ద్వారా చూపించే ప్రొజెక్షన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. 2014 ఎన్నికల్లో మోడీ అనుసరించిన ప్రచార వ్యూహం ఇది. ఆ తర్వాత కూడా వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ విధంగా ఓటర్లు, ప్రజల రాజకీయ అభిప్రాయాలు ప్రభావితం చేయటం ద్వారా ఓటింగ్‌ విషయంలోనూ లేదా ప్రభుత్వ నిర్ణయాలను అంచనా వేసే విషయంలోనూ తప్పు దారి పట్టించటం ద్వారా తమ ప్రభుత్వం తమ పబ్బం గడుపుకుంటున్న తీరును గమనిస్తూనే ఉన్నాము. ఇదే ధోరణి బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ ద్వారా వస్తూత్పత్తుల వినియోగం విషయంలో కొనుగోలు దారుల బ్రెయిన్‌ వాష్‌ చేసే టెక్నిక్కులు విపరీతంగా రూపొందించబడతాయి. ఇదే ధోరణిని తాజాగా హిందూత్మ మతోన్మాద శక్తులు వంటబట్టించుకున్నాయి.

కీన్స్‌ విధానాలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సామాజిక అవసరాలు తీర్చటానికి ఉపయోగపడే సమీకృత, పరస్పరాధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తెస్తే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలతో సమాంతరంగా పుట్టుకొచ్చిన బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ వికేంద్రీకృత ఆర్థిక విధాన నిర్ణయ వ్యవస్థను ముందుకు తెస్తుంది. ఈ ధోరణిలో ఆర్థిక వ్యవస్థలోని ఏ రంగానికి ఆ రంగం పూర్తి స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఆయా రంగాల లాభాల రేటును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటం జరుగుతుంది. దాంతో స్థూల ఆర్థిక వ్యవస్థలో ఉండాల్సిన సమతౌల్యం దెబ్బతింటోంది. ప్రణాళికా రంగం రద్దు చేసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు దీనికి సరైన ఉదాహరణ.

అమెరికాలో ఒబామా ప్రభుత్వం గానీ ఇంగ్లాండ్‌లో టోనీ బ్లెయిర్‌ ప్రభుత్వంగానీ తమ కార్యాలయాల్లోనే ప్రత్యేకంగా సామాజిక ప్రవర్తనా శాస్త్రవేత్తల బృందాలను నియమించి పాలకవర్గం అవసరాల నేపథ్యంలో ప్రజల మనోభావాలు ప్రభావితం చేయటానికి తద్వారా ఓటర్ల నిర్ణాయక సామర్ధ్యాన్ని ప్రభావితం చేయటానికి అవసరమైన ప్రయోగాత్మక విధానాలు రూపొందించాయి. ఆయా దేశాల నుండి పాఠాలు నేర్చుకున్న మోడీ ప్రభుత్వం అవే ప్రయోగాత్మక విధానాలు భారతదేశంలో అమలు చేయటం ద్వారా ఓటర్ల నిర్ణాయక సామర్ద్యాన్ని అన్ని వేళలా ప్రభావితం చేయాలనుకొంటోంది.చేయగలననుకొంటోంది. ఏదైనా కీలక సందర్భం, సమస్య ముందుకొచ్చినపుడు ప్రజల దృష్టిని మళ్లించటానికి అవరమైన అప్రాధాన్య విషయాలను, అర్థసత్యాలను, అసత్యాలను, నిరాధారమైన విషయాలను ప్రజల ముందు కుప్పలు పోయటానికి బిజెపి కంప్యూటర్‌ కరసేవకులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. బిహేవియరల్‌ ఎకనమిక్స్‌లో సరైన నిర్ణయం అంటే కంపెనీల లాభాలు పెంచేందుకు దోహదం చేసేది. బిహేవియరల్‌ పాలిటిక్స్‌లో సరైన నిర్ణయం అంటే పాలకవర్గాల ప్రయోజనాలు ముందుకు తీసుకెళ్లేంది. ప్రజలు గొర్రెల మంద కాదు. ఈ రెండు రకాల ప్రమాదాల నుండి సగటు మనిషి తన సామాజిక రాజకీయ జంతువుగా (అరిస్టాటిల్‌ అన్నట్లు) తన అస్థిత్వాన్ని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నమే ఇటువంటి కుహనా సిద్ధాంతాలపై సాగించే పోరాటంలో అంతర్భాగమవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిల్లర రాజకీయాలు వద్దు, చిన్న పిల్లలను కాపాడండి యోగి మహాశయా !

20 Sunday Aug 2017

Posted by raomk in BJP, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Amitshaw, BJP, BJP’s trolling army, BRD Medical College and Hospital, Dr Kafeel Ahmad Khan, Gorakhpur deaths, petty politics, save the children, UP CM, Yogi Adityanath

ఎం కోటేశ్వరరావు

గత కొద్ది రోజులుగా వుత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన వార్తలు ఇంతవరకు కొన్ని అంశాలను నిర్ధారించాయి. నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా బిజెపి తరఫున రాబోయే రోజులలో కాబోయే ప్రధానిగా ప్రచారంలో వున్న యోగి ఆదిత్యనాధ్‌ పాలనకు ఇతరులకు పెద్ద తేడా లేదు. వైఫల్యాలను కప్పి పుచ్చుకోవటం, ఇతరుల మీద నెట్టటంలో ఎవరికీ తీసిపోరు. ప్రజల పట్ల జవాబుదారీ తనం లేదు. కొద్ది రోజుల క్రితం ఆదిత్యనాధ్‌ సోదరి సామాన్యుల మాదిరే ఒక టీ దుకాణం నడుపుకొంటోందని ఈ వుదంతం యోగికి బంధుప్రీతి లేదని చెప్పేందుకు పక్కా నిదర్శనం అని ప్రచారం జరిగింది. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు స్వయం సేవకుడిగా వున్నపుడు పారిశుధ్య పని చేసిన నిగర్వి అంటూ ఒక ఫొటోను ఆయన భక్తులు సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున తిప్పారు. గతంలో ఏ కాంగ్రెస్‌ లేదా ఇతర పార్టీల నాయకులకు లేని వ్యక్తిత్వాన్ని, గతాన్ని సృష్టించేందుకు ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఒక వేళ అలాంటివి వుంటే కాషాయ తాలిబాన్లు, మరుగుజ్జుయోధులు(ట్రోల్స్‌) బయట పెడితే లోకానికి మేలు చేసిన వారవుతారు. కాషాయ పరివారం వీరుడు, శూరుడు అని పొగిడే విడి సావర్కర్‌ చరిత్రను చూస్తే ఆయన బ్రిటీష్‌ వారికి విధేయుడిగా వుంటానని ప్రేమ లేఖలు రాసిన విషయం తెలిసిందే. అంతే కాదు, బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక హీరోగా, వీరుడిగా వర్ణించటానికి తగిన వ్యక్తి సావర్కర్‌ అన్నట్లుగా తనకు తానే చిత్రగుప్తుడనే మారుపేరుతో రాసిన పుస్తకంలో రాసుకున్న ఘనుడు. అందువలన ఆయన పరంపరలో ముందుకు వస్తున్నవారికి లేని గొప్పలను ఆపాదించటంలో విశేషం ఏముంది. మహా అయితే ఎవరన్నా ‘దేశద్రోహులు’ ఈ విషయాన్ని ప్రస్తావిస్తే అది మా విశ్వాసం, మా మనోభావాలను దెబ్బతీశారంటూ దాడులకు దిగుతారు.https://thewire.in/140172/veer-savarkar-the-staunchest-advocate-of-loyalty-to-the-english-government/

అందువలన యోగి గారి సోదరి కథను నమ్మటమా లేదా అన్నది పక్కన పెడదాం. ఆయన మఠానికి దగ్గరలో వున్న గోరఖ్‌పూర్‌ బిఆర్‌డి ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో పిల్లలు మరణిస్తున్నారనేది ఎవరూ కాదనలేని నిజం. అక్కడ చనిపోవటం కొత్తగా జరుగుతున్నదేమీ కాదని సాక్షాత్తూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా మహాశయుడే నిర్ధారించారు. అలాంటి దాని గురించి సామాజిక, సాంప్రదాయక మీడియాలో పెద్ద చర్చ, ఆరోపణలు, ప్రత్యాపరోపణలు ఇప్పటికీ వస్తుంటే భవ బంధాలు, రాగ ద్వేషాలు వుండకూడని, నిజం తప్ప అబద్దాలు చెప్పకూడని ఒక యోగి చిల్లర రాజకీయాలు తప్ప నిజాయితీతో కూడిన ఒక ప్రకటన చేసి దానికి స్వస్తి వాక్యం పలకలేదేం ? ఇదేమి జవాబుదారీతనం. లేదూ విచారణకు ఆదేశించాం అప్పటి వరకు మాట్లాడకూడదు అంటే విచారణ నివేదికలు నిర్ధారించేంత వరకు ఆగకుండా కొందరు వైద్యులపై చర్యలెందుకు తీసుకున్నట్లు ?

గత కొద్ది రోజులుగా మీడియాలో రాసిన వార్తలు, రాయించిన వార్తలను చదివిన వారికి, టీవీలలో చూసిన వారికి ‘మెదడు వాపు ‘ వ్యాధి వచ్చేట్లుగా వుంది. గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో మెదడువాపు వ్యాధి విభాగపు అధిపతిగా పని చేస్తున్న డాక్టర్‌ కఫీల్‌ అహమ్మద్‌ సదరు ఆసుపత్రికి అనుబంధంగా వున్న మెడికల్‌ కాలేజీలో పిల్లల వైద్య సహాయ ఫ్రొఫెసర్‌గా బోధన కూడా చేస్తున్నారు.అందువలన ఆయన ఆక్సిజన్‌ కొరత గురించి తెలుసుకొని ఇతర స్నేహితుల నుంచి అరువుగా లేదా కొనుగోలు చేసి సిలిండర్లను తెచ్చి ఎందరో పిల్లలను కాపాడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.ఆయన ఆక్సిజన్‌ తెప్పించిన విషయాన్ని అభినందించకపోతే పోయే వాటి గురించి తన ప్రతిష్టను పెంచుకొనేందుకు మీడియాలో ఆయన అలా రాయించుకున్నాడని కొంత మంది చెబుతున్నారు.ఆ వార్తలు వచ్చిన వెంటనే బహుశా వాటిని రాయటంలో వెనుకబడిన కొన్ని మీడియా సంస్ధలు చద్ది వార్తలే ఇస్తే తమకు ‘లాభం’ ఏముంటుంది అనుకున్నాయోమో ఆయన తాను పని చేస్తున్న ఆసుపత్రి నుంచి సిలిండర్లను దొంగతనం చేశాడని, అలా తస్కరించిన వాటిని తన, ఇతర ఆసుపత్రుల నుంచి తిరిగి తెప్పించాడు తప్ప అందరూ అనుకున్నట్లు ప్రాణదాతేమీ కాదని మరుసటి రోజునే ప్రచురించాయి. ఒక బిజెపి మహిళా నాయకురాలు ఆయన అత్యాచారాలు చేశాడన్న ప్రచారం మొదలెట్టింది. విద్యార్ధిగా వుండగా ఒకరి బదులు మరొకరికి పరీక్ష రాసిన కేసులో అరెస్టయ్యాడని మరొక వార్త.ఆయనపై క్రిమినల్‌ కేసు వున్న కారణంగా మణిపాల్‌ విశ్వవిశ్వవిద్యాలయం ఆయనను సస్పెండ్‌ చేసిందని మరొక వార్త. ఇలా ఇంకా రాబోయే రోజుల్లో ఏమేమి ఆపాదిస్తారో తెలియదు.సదరు వైద్యుడు ఎందరినో కాపాడారని రాసిన వార్తలను సహించలేక ఆయనపై ఇన్ని ఆరోపణలు లేదా పాత విషయాలను( ఎంతవరకు నిజమో తెలియదు) తవ్వి సామాజిక మాధ్యమంలోపరువు తీయటం అవసరమా ? వారికి దురుద్ధేశ్యం తప్ప మరొకటి కనపడటం లేదు.

సదరు డాక్టర్‌పై తీసుకున్న చర్య గురించి కూడా మీడియాలో వార్తలు తప్పుదారి పట్టించేవిగా వున్నాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమ నోడల్‌ అధికార బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. మెదడువాపు వ్యాధి నివారణకు సదరు సంస్ధ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని పని చేస్తున్నది. రెండు సంవత్సరాల క్రితం ఆయనపై నమోదు చేసిన అత్యాచార ఆరోపణలో వాస్తవం లేదని ఆ కేసును పోలీసులు మూసివేశారు. అయినా ఆయనొక రేపిస్టు అని నేను విన్నా అని బిజెపి నాయకురాలు ట్వీట్‌ చేసింది. సినిమా నటుడైన బిజెపి ఎంపీ పరేష్‌ రావల్‌ దానిని సమర్ధిస్తూ చెద పురుగుల తెగ దృష్టిలో హీరో అని పేర్కొన్నాడు. డాక్టర్‌ ఖాన్‌ను బలిపశువును చేశారని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఒక ప్రకటనలో విమర్శించింది. ప్రజారోగ్యాన్ని యోగి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నది.వైద్య విద్య డైరెక్టర్‌ జనరల్‌ చేసిన మౌలిక ఆరోపణ ప్రకారం ఆక్సిజస్‌ సిలిండర్లను తన ఆసుపత్రి నుంచి సేకరించటం అని న్యూస్‌18 వార్త పేర్కొంటే ప్రయివేటు ప్రాక్టీస్‌ చేయటం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా చర్య తీసుకున్నట్లు హిందుస్తాన్‌ టైమ్స్‌ పేర్కొన్నది. గతేడాది సెప్టెంబరు ఎనిమిది నుంచి డాక్టర్‌ ఖాన్‌ ప్రయివేటు ప్రాక్టీస్‌ చేయటం లేదని చెబుతున్నారు.

నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌తో వున్న మన దేశ సరిహద్దులను కాపాడే సహస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బి) ప్రజాసంబంధాల అధికారి ఓపి సాహు ఇలా చెప్పారు.’ ఆగస్టు పదిన బిఆర్‌డి మెడికల్‌ కాలేజీలో అసాధారణ సంక్షోభ పరిస్ధితి ఏర్పడింది. డాక్టర్‌ కఫిల్‌ ఖాన్‌ ఎస్‌ఎస్‌బి డిఐజి వద్దకు వచ్చి వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లను సేకరించి మెడికల్‌ కాలేజీకి తరలించేందుకు ఒక ట్రక్కు కావాలని అడిగారు.బిఆర్‌డి మెడికల్‌ కాలేజీ సిబ్బందికి సహకరించేందుకు డిఐజి పదకొండు మంది జవాన్లను కూడా ట్రక్కుతో పాటు పంపారు. మా క్క్రు కొద్దిగంటల్లోనే వివిధ ప్రాంతాల నుంచి ఖలీలాబాద్‌లోని ఒక గోడౌన్‌ నుంచి కూడా సిలిండర్లను సేకరించి తీవ్ర సంక్షోభం వున్న మెడికల్‌ కాలేజికి తరలించారు.’

పిల్లల మరణాల వార్తలు వెలువడగానే ఆక్సిజన్‌ సరఫరా లేక మరణించారనటాన్ని యోగి సర్కార్‌ తోసి పుచ్చింది. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ రౌటెల ఒక ప్రకటన చేసి ఇతర కారణాలతో మరణించినట్లు చెప్పిన దాన్ని ఆరోగ్య మంత్రి కూడా చిలుక పలుకుల్లా వల్లించాడు. తొమ్మిదవ తేదీన ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి నాలుగవ తేదీ వరకు ఆక్సిజన్‌ కొరత గురించి తన కార్యాలయానికి తెలియదని, అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకుంటానని దానికి ప్రిన్సిపల్‌, ఇతరులే కారణమని ఆరోపించారు.

మార్చి 22నే ప్రిన్సిపల్‌ రాజీవ్‌ మిశ్రా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌కు ఆక్సిజన్‌ సరఫరాదారు పుష్పా సేల్స్‌ వారి లేఖను కూడా జతపరచి చెల్లింపుల గురించి తెలిపారు. తిరిగి ఏప్రిల్‌ మూడున అదనపు ఛీఫ్‌ సెక్రటరీకి పుష్సా సేల్స్‌ తాజా లేఖను జతపరచి మరోసారి రాశారు. రెండు లేఖలకూ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.ఆగస్టు ఒకటిన మరోసారి అదనపు చీఫ్‌ సెక్రటరీకి రాసి దాని కాపీని మంత్రికి పంపారు. తొమ్మిదవ తేదీన ఆసుపత్రిలో సమీక్ష సందర్భంగా ఆరోజు వుదయం బిల్లుల చెల్లింపు గురించి ఆరోగ్యశాఖ మంత్రికి స్వయంగా తాము లేఖను అంద చేశామని, ఆరోజు సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తేగా ఏమిటి అన్నట్లు ప్రశ్నార్ధకంగా యోగి మంత్రివైపు చూసి తరువాత మౌనంగా వుండిపోయినట్లు తమకు తెలిసిందని పుష్పా సేల్స్‌ ప్రతినిధులు టెలిగ్రాఫ్‌ పత్రికతో చెప్పారు. యోగి కాలేజీ నుంచి వెళ్లిపోయిన తరువాత ఆ సాయంత్రమే సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. అంటే ఒక చిన్న వ్యాపార సంస్ధ కూడా యోగి పని తీరు మీద విశ్వాసం కోల్పోయిందన్నది స్పష్టం.

మరణాలకు బాధ్యత వహిస్తూ ఆగస్టు 12న రాజీనామా చేసిన మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజీవ్‌ మిశ్రా మరుసటి రోజు చేసిన ఓ ప్రకటనలో ఆక్సిజన్‌ సరఫరాదారుకు డబ్బు చెల్లించటంలో బ్యూరాక్రటిక్‌ పద్దతులు, ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ పర్యటనే కారణమని విమర్శించారు. ఆక్సిజన్‌ సరఫరాదారుకు చెల్లించేందుకు తాము ఐదవ తేదీనే నిధులు విడుదల చేశామని, సకాలంలో ప్రిన్సిపల్‌ చెల్లించలేదని వైద్య విద్య శాఖ మంత్రి అశుతోష్‌ టాండన్‌ చెప్పారు. రెండు కోట్ల రూపాయలు విడుదల చేయాలని జూలై నెలలోనే మూడు నాలుగు లేఖలు రాశానని ఐదవ తేదీన నిధులు విడుదల చేశారని డాక్టర్‌ మిశ్రా చెప్పారు. ఆగస్టు ఐదవ తేదీ శనివారం, నిధుల విడుదల ఆదేశాలు మాకు ఏడవ తేదీన అందాయి. బిల్లు ఓచర్‌ను ఏడవ తేదీన ట్రెజరీకి పంపాము, వారు ఎనిమిదవ తేదీన టోకెన్‌ విడుదల చేశారు.తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ ఆసుపత్రి సందర్శనకు వచ్చిన కారణంగా ఆసుపత్రి యంత్రాంగమంతా తీరికలేకుండా వుంది.పదవ తేదీన మాత్రమే 52లక్షల రూపాయలను ఆక్సిజన్‌ సరఫరాదారు ఖాతాకు బదిలీ చేయాల్సిందిగా కోరుతూ బ్యాంకుకు పంపగలిగాము.మెడికల్‌ కాలేజీ, ఆక్సిజన్‌ సరఫరాదారు బ్యాంకు ఖాతాలు వేర్వేరు చోట్ల వున్నందున బ్యాంకు బదిలీ చేసే అవకా శం లేదు, రెండు బ్యాంకుల మధ్య నగదు బదిలీకి ఒక రోజు వ్యవధి పడుతుంది. అని మిశ్రా చెప్పారు. పదవ తేదీ మధ్యాహ్నం ఆక్సిజన్‌ సరఫరాదారు నుంచి ఫోన్‌ వచ్చింది, తదుపరి ట్రక్కు సిలిండర్లను పంపే అవకా శం లేదని వారు చెప్పారు. నిధులు విడుదల చేశామని బ్యాంకులో ఆలశ్యం అవుతున్నదని, మీ ఖాతాకు నిధులు అందుతాయని చెప్పానని, అయితే సిలిండర్ల సరఫరా నిలిపివేస్తారని తాను ఊహించలేదని డాక్టర్‌ మిశ్రా అన్నారు.

యోగులు మఠాలకే పరిమితం అయితే ఒక తీరు, అలాగాక ప్రజాజీవనంలోకి వచ్చి, అధికారపదవులు కూడా స్వీకరించిన తరువాత వారినేమీ ప్రశ్నించకూడదు అంటే కుదరదు. పెద్ద సంఖ్యలో పిల్లలు మరణించటం వాస్తవం. ఆ సంబంధిత వార్తలతో పాటు ఆసుపత్రి, దాని పరిసరాలు, అసలు మొత్తంగా గోరఖ్‌పూర్‌ పరిసరాలన్నీ ఆశుభ్రత నిలయాలుగా వున్నాయని కూడా వార్తలు వచ్చాయి. మెదడు వాపు వ్యాధి కారణంగా ఆ ప్రాంతంలో పిల్లలు, ఇతరులు మరణించటం కూడా ఎక్కువగానే వుందని వెల్లడైంది. సరే ఎవరైనా మూడు నెలల్లోనో, ఆరునెలల్లోనే అద్భుతాలు చేయగలరని ఎవరూ అనుకోరు. యోగులైనా అంతే.మరణించిన పిల్లల తలిదండ్రులను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గోరఖ్‌ పూర్‌ వెళతానని ప్రకటించటంతో యోగికి పూనకం వచ్చింది. ఆగ్రహంతో వూగిపోయారు. గోరఖ్‌పూర్‌ను ఒక విహార కేంద్రంగా మార్చవద్దని ఎదురుదాడి ప్రారంభించారు.(కేరళలో వ్యక్తిగత కక్షలు లేదా కారణాలతో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురైతే కేంద్ర మంత్రి పరామర్శకు వెళ్లటం సరైనదే అయితే 70 మందికి పైగా పిల్లలు మరణించిన వుదంతంలో రాహుల్‌ గాంధీ పరామర్శించటం తప్పెలా అవుతుందో మరి) స్వచ్చ వుత్తర ప్రదేశ్‌ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరే షరా మామూలుగా గత ప్రభుత్వాలు కనీస సదుపాయలు కల్పించలేదని చెప్పారనుకోండి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మన యోగి గారు పాతికేండ్లుగా, అంతకు ముందు ఆయన సీనియర్‌ యోగి గోరఖపూర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతినిధిగా వున్నారు. ప్రతి ఏటా తమ కనుసన్నలలో వుండే బిఆర్‌డి ఆసుపత్రిలో పిల్లలు చని పోతుంటే, ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా తయారైతే, మెదడు వాపు వ్యాధి ప్రబలంగా వుంటే ఎంపీగా ఆయన లేదా స్ధానిక బిజెపి ఎంఎల్‌ఏలు ఏం చేస్తున్నారు. ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నారు. మూడు సంవత్సరాలుగా నరేంద్రమోడీ స్వచ్చ భారత్‌ కార్యక్రమంలో కనీసం ఆసుపత్రి పరిసరాలను అయినా బాగు చేసేందుకు తీసుకున్న చర్యలేమిటి?ఎంపీగా ఏం పట్టించుకున్నట్లు ? తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి కేరళ ఆసుపత్రులలో చేర్చుకోని కారణంగా మరణించాడు. ఆ ఘటన మీద కేరళ ముఖ్యమంత్రి విచారం వెలిబుచ్చారు. రాగ ద్వేషాలకు అతీతంగా వుండే, వుండాల్సిన యోగి బిఆర్‌డి ఆసుపత్రికి నిధులు సకాలంలో విడుదల కాలేదన్న విమర్శలు తలెత్తినపుడు వాస్తవాలను వెల్లడించి భవిష్యత్‌లో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా చూస్తామని చెబితే ఆయన గౌరవం మరింత పెరిగి వుండేది. ఇంత రాద్దాంతం జరిగేది కాదు.కానీ చేసిందీ, జరిగిందేమిటి? ముందసలు తనకు తెలియదన్నారు ముఖ్యమంత్రి. ఇలాంటివి కొత్తగా జరగటం లేదని తేల్చిపారేశారు అమిత్‌ షా. యోగి ప్రభుత్వం, బిజెపి మరుగుజ్జు యోధులు, బిజెపి మెప్పుపొందేందుకు తహతహలాడిన మీడియా చౌకబారు రాజకీయాలకు పాల్పడింది. విమర్శకులపై ఎదురుదాడికి దిగింది. యోగి సర్కార్‌ పని తీరును బజారుకు ఈడ్చింది.

యోగి ఆదిత్యనాధ్‌ ఒక పర్యటన సందర్భంగా దళితులు శుభ్రంగా లేరని వారికి సబ్బులు, షాంపూలు ఇచ్చి స్నానాలు చేయించి, వారెక్కడ యోగిని ముట్టుకుంటారో అని లేవకుండా చేసేందుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇపుడు ప్రజల ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్న సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న అధికార యంత్రంగాన్ని మొత్తంగా శుద్ధి చేయటానికి ఎన్ని సబ్బులు వాడాలో తెలియదు. మొత్తం మీద ఈ వుదంతం బిజెపి, యోగి సర్కార్‌, యోగికి వ్యక్తిగతంగా చెప్పుకోలేని చోట దెబ్బ కొట్టిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కావాల్సింది చిల్లర రాజకీయాలు కాదు, చిన్న పిల్లల ప్రాణాలు కాపాడండి యోగి మహాశయా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జిందా తిలిస్మాత్‌ స్ధానంలో ఆవు పేడ, మూత్రం !

22 Saturday Jul 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Science, Uncategorized

≈ Leave a comment

Tags

cow, cow dung, cow sciences, Gujarat model, Narendra Modi, narendra modi bhakts, Science, Vedic sciences

ఎం కోటేశ్వరరావు

ఎందరో యువత, మధ్యతరగతి మేథావులు బిజెపి అంటే ఇష్టం లేకపోయినా కాంగ్రెస్‌ మీద కోపంతో నరేంద్రమోడీ గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయనను చూసి చెప్పినవారికల్లా ఓటు వేశారు. ఆ బలహీన క్షణంలో అలా జరిగింది అన్నట్లుగా ఓటింగ్‌ రోజు జరిగిందేదో జరిగిపోయింది. తరువాత ఆ ప్రభుత్వం ఏమి చేస్తుందో, ఆ పార్టీ వారు, వారికి వెన్నుదన్నుగా వున్న సంస్ధలకు చెందిన వారు ఏమి చేస్తున్నారో అని ఒక్క క్షణమైనా వెనుదిరిగి చూశామా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మూడు సంవత్సరాలు గడిచాయి. ఎన్నో విజయాలు సాధించామని ఇప్పటికే వూదరగొడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎన్నికల ప్రణాళిక, ప్రచారంలో చెప్పినవి మినహా ఇతర అనేక వివాదాస్పద, రెచ్చగొట్టే, సమాజాన్ని చీల్చే అంశాలను బిజెపి, దాని చుట్టూ వుండే శక్తులు ముందుకు తెస్తున్నాయి. ఆ గోమాత సాక్షిగా మూడు సంవత్సరాలకు ముందున్నదాని కంటే దేశం ఏ రంగంలో ముందుకు పోయిందో ఆధార సహితంగా ఎవరైనా చెబితే సంతోషం. అంతరిక్షంలోకి అత్యధిక వుపగ్రహాలను పంపి విజయం సాధించిన శాస్త్రవేత్తలు ఒకవైపు మరోవైపు ఆవు పేడ, మూత్రంలో ఏముందో తెలుసుకొనేందుకు కాలం వృధా చేసే శాస్త్రవేత్తలు. మొదటి వారిని చూసి గర్వపడాలా రెండో వారిని చూసి సిగ్గుతో తలవంచుకోవాలా? యధారాజా తధా శాస్త్రవేత్త !

వాట్సాప్‌ గ్రూపులలో ఆ మధ్య గుజరాత్‌లోని రాజ్‌కోటలో అంతర్జాతీయ విమానాశ్రయం స్ధాయిలో ఒక బస్టాండ్‌ నిర్మించారంటూ ఏప్రిల్‌ నెలలో ఫొటోలతో సహా సమాచారం తిరిగింది. బాబూలాల్‌ సుప్రియ అనే కేంద్ర మంత్రి ఆ బస్టాండ్‌ను ప్రారంభించారంటూ ట్వీట్‌ చేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటి ? ఇప్పటి వరకు ఆ బస్టాండ్‌ నిర్మాణమే జరగలేదు. ప్రతిపాదిత కట్టడటం గురించి తయారు చేసిన నమూనా ఫొటో అది. పోనీ అది దేశంలో పెద్ద బస్టాండా అంటే కానే కాదు. దానికంటే మూడు నాలుగు రెట్లు పెద్దవి మన హైదరాబాదు, విజయవాడ, గుంటూరుల్లో ఇప్పటికే నిర్మితమై వున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వ అభివృద్ధి గురించి కూడా ఇలాంటివే అనేకం ప్రచారంలో వున్నాయని తెలుసుకోవాలి.

గోరక్షణ, గోమాంసం తింటున్నారనే పేరుతో మైనారిటీలు, దళితులను మూకుమ్మడిగా హత్యలు చేయటం వెనుక తమ ప్రభుత్వ అభివృద్ధి అజెండాను పక్కదారి పట్టించే కుట్ర వుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మరత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ బుధవారం నాడు రాజ్యసభలో చెప్పారు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్న జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ ఆయనను ఆవహించినట్లుగా కనిపిస్తోంది. గో రక్షకుల ముసుగులో సంఘవ్యతిరేకశక్తులు దుకాణాలు తెరిచారనో, వారి చర్యలను సహించరాదనో, కఠిన చర్యలు తీసుకుంటామనో కోహినూరు వజ్రం వంటి మాటలతో మౌనబాబా ప్రధాని నరేంద్రమోడీ వుత్తరాయణానికో దక్షిణాయానానికో సెలవిస్తుంటారు. ఆయన శిష్యులు మరోవైపు ఇలా నోరు పారవేసుకుంటారు. అసలు అభివృద్దే బూటకం అయితే దానిని అడ్డుకొనేందుకు గోరక్షకుల పేరుతో ఎవరో దాడులు చేస్తున్నారని చెప్పటం అంతకంటే దారుణం. ఆ దాడులు ఎక్కడైతే జరిగాయో, జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలన్నింటా అధికారంలో వున్నది బిజెపి ప్రభుత్వమే. తమ ప్రభుత్వ అభివృద్దిని అడ్డుకొనే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. దాదాపు అన్ని వుదంతాలలో బాధితులు, వారి కుటుంబాలపైనే తప్పుడు కేసులు బనాయించిన ఘనుల ప్రతినిధి అయిన కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో అలా మాట్లాడారంటే గుండెలు తీసిన బంట్లకే సాధ్యం అని స్పష్టం కావటం లేదూ ?

ముఖ్యమంత్రిగా తాను అభివృద్ధి చేసిన గుజరాత్‌ నమూనాను దేశమంతటికీ విస్తరిస్తానని నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు ఊరూ వాడా ప్రచారం చేశారు. తరువాత విలేకర్లు ప్రశ్నించటానికి వీలులేకుండా ఇంతవరకు ప్రధాని హోదాలో ఒక్కటంటే ఒక్క పత్రికా గోష్టి కూడా నిర్వహించకుండా ఒక రికార్డు సృష్టించారు. అసలా గుజరాత్‌ అభివృద్ధి అనేదే పెద్ద బూటకం. అందుకే చివరికి మన్‌కీ బాత్‌లో కూడా దాని ప్రస్తావన తేవటం లేదు.2003 నుంచి అంటే గుజరాత్‌లో నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల నుంచి గుజరాత్‌ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం అది కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాల సంఖ్య 51,378, అమలు జరిగినవీ, అమలులో వున్న పధకాల పెట్టుబడుల విలువ రు. 84లక్షల కోట్లని చెప్పారు. ప్రస్తుతం మన దేశ మొత్తం స్ధూలాదాయం రు.170లక్షల కోట్లరూపాయలని అంచనా. అంటే ఒక్క గుజరాత్‌కు వచ్చిన పెట్టుబడులే 84లక్షల కోట్లంటే మొత్తం జిడిపిలో గుజరాత్‌ విలువ ఎంతో లెక్కవేసుకోవాల్సింది.ఇవన్నీ చెప్పింది మూడు సంవత్సరాల క్రితం వరకు నరేంద్రమోడీ, తరువాత ఆయన వారసులు అని తెలిసిందే. కానీ అసలు వాస్తవం ఏమంటే 1983 నుంచీ అంటే మోడీ కంటే రెండు దశాబ్దాల ముందునుంచీ 2016 సెప్టెంబరు వరకు గుజరాత్‌లో అమలయిన పధకాలు 6,251 వచ్చిన పెట్టుబడుల విలువ రు.2.76లక్షల కోట్లు, కల్పించిన వుపాధి 10.67లక్షల మందికి, ఇవిగాక మరో 4033 పధకాలు మధ్యలో వున్నాయి, వాటి మొత్తం పెట్టుబడి రు.9.52లక్షల కోట్లని, మరో 9.3లక్షల మందికి వుపాధి కల్పించబడుతుందని సాక్షాత్తూ గుజరాత్‌ అధికారిక సమాచారమే వెల్లడించింది. మోడీ భక్తులు నిజాలను తట్టుకొనే ధైర్యం వుంటే దిగువ లింక్‌లోని వివరాలు చదివి, వాస్తవం కాదని గోమాత సాక్షిగా నిరూపిస్తే సంతోషం.http://www.moneylife.in/article/the-gujarat-model-ndash-some-facts/51106.html ఈ వివరాలు సేకరించింది కమ్యూనిస్టులు కాదు, సీతారాం ఏచూరి అంతకంటే కాదు.

గోవాలో గొడ్డు మాంసానికి కొరత లేదని, అటువంటి పరిస్ధితే వస్తే పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి దిగుమతికి ఏర్పాట్లు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మనోహర్‌ పారికర్‌ ఏకంగా అసెంబ్లీలోనే చెప్పారు. ఇలా మాట్లాడిన ముఖ్యమంత్రి బిజెపి పరువు తీశారని, రాజీనామా చేయాలని, బిజెపి అంటే బీఫ్‌ జాయ్‌ పార్టీ అని విశ్వహిందూ పరిషత్‌ నేత డాక్టర్‌ సురేంద్ర జైన్‌ ఎద్దేవా చేశారు.

గోరక్షకులకు ఆయుధాలు, శిక్షణ ఇస్తామని విశ్వహిందూపరిషత్‌ నేతలు ప్రకటించారు. కాబోయే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రచారంలో వున్న ఆ సంస్ధ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా గోరక్షకులను సాయుధులను చేస్తామని అలీఘర్‌లో చెప్పారు. తాము ఇప్పటికే తమ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చామని, గుంపులతో ప్రతికూల పరిస్ధితులు ఎదురైతే ఎలా వ్యవహరించాలో కూడా దానిలో నేర్పించామని ఒక నేత చెప్పినట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక రాసింది.

ఆవుల దొంగ రవాణాను అరికట్టేందుకు, లవ్‌ జీహాద్‌ నిరోధానికి ఒక్క ఆలీఘర్‌ జిల్లాలోనే ఐదువేల మంది ‘మత సైనికుల’ ను తయారు చేయాలని అలీఘర్‌లో ఈనెల 14-16 తేదీలలో అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు విశ్వహిందూ పరిషత్‌ ప్రకటించింది.భజరంగదళ్‌ కార్యకర్తలు మాత్రమే ఈ సైనికుల్లో చేరటానికి అర్హులట. ఈ సైనికులు ఆవుల దొంగరవాణాతో పాటు లవ్‌ జీహాద్‌ నిరోధం, హిందూ యువకులు, యువతులు, మఠాలు, దేవాలయాలు, సంత్‌ సమాజం, దేశాన్ని కూడా రక్షిస్తారట.

గత పది సంవత్సరాలలో 50 మందికి పైగా పోలీసులు, గోరక్షకులను గోహంతకులు చంపివేశారని విహెచ్‌పి అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్‌ చెప్పారు. గోరక్షకులు బాధితులు తప్ప ప్రజా పీడకులు కాదని, గో రక్షకులకు కూడా ఆత్మరక్షణ హక్కుందని కూడా అన్నారు.

వేదాల్లోనే అన్నీ వున్నాయని చెప్పే మనువాదులు, వాటిని సమర్ధించే వారు గాని వాటి నుంచి పెట్రోలు, పైలట్లతో పనిలేని, ఎంత మంది ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే పుష్పక విమాన, కార్ల, ఎన్ని ప్రయోగించినా తరగతని అస్త్రాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర వాటిని గానీ ఇంతవరకు బయటకు తీయలేదంటే వారి దేశ భక్తిని అనుమానించాల్సి వస్తోంది. మనమే వాటిని తయారు చేసి ఎగుమతి చేసి ప్రపంచంలో మన దేశాన్ని మొదటి స్ధానంలో నిలబెట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకొనేందుకు బడా కార్పొరేట్ల కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారా అన్నది సందేహం. మరోవైపు కౌపతి లేదా గో వేదం. లాభాల వేటలోని కార్పొరేట్‌ సంస్ధలు ఇప్పటికే ఆవు పేడ, మూత్రంతో వ్యాపారం చేస్తున్నాయి. వాటి మార్కెట్‌ను మరింత పెంచేందుకు మోడీ సర్కార్‌ చర్యలు తీసుకుంది. బహుశా అది మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగం కావచ్చు.

ప్రస్తుతం మన దేశ జిడిపిలో 0.8శాతం సైన్సు కోసం ఖర్చు చేస్తున్నారు. దానిని మూడుశాతానికి పెంచాలన్నది మన శాస్త్రవేత్తల చిరకాల డిమాండ్‌. సైన్సు పరిశోధనల మీద ఖర్చు పెట్టని, యువత నైపుణ్యాన్ని పెంచని ఏదేశమైనా పరాధీనంగా వుంటుంది తప్ప పురోగమించలేదు. సైన్సుకోసం భారత్‌ పురోగతి పేరుతో ఆగస్టు తొమ్మిదిన దేశ వ్యాప్తంగా నిరసన,డిమాండ్లతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మరోవైపున కేంద్ర ప్రభుత్వం ఏ చేయబోతోంది.

పంచగవ్యం(ఆవు పేడ, మూత్రం, పాలు, పాలనుంచి వచ్చే పెరుగు, వెన్న లేదా నెయ్యి)లోని సుగుణాలను నిర్ధారించేందుకు అవసరమైన పరిశోధనలు చేయాలంటూ పందొమ్మిది మంది ప్రముఖులతో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ఇప్పటికే అరకొరగా వున్న నిధులను వీటికోసం మళ్లించనుంది అన్నది వేరే చెప్పనవసరం లేదు. సంస్కృత గ్రంధాలలో వున్న విజ్ఞానాన్ని దాన్ని వెలికి తీసేందుకు ఆ భాష తెలిసిన పండితులుండగా వాటిపై పరిశోధనలు చేసేందుకు మరొక కమిటీ, శాస్త్రవేత్తలు ఎందుకు ? ఇప్పటికే మార్కెట్లో సర్వరోగనివారిణి పేరుతో జిందాతిలిస్మాత్‌ను విక్రయిస్తున్నారు. దానికి పోటీ లేదా దాని స్ధానంలో కొత్తదానిని తయారు చేస్తే ఎలా వుంటుందన్నట్లుగా పంచగవ్యాలకు బెల్లం, అరటి పండ్లు, లేత కొబ్బరినీరు, చెరకు రసాలను తగు మోతాదులో కలిపి ఆరోగ్యం నుంచి పంటల సాగుకు అవసరమైన ఎరువుల వరకు ఒకే మాత్రలో వుండే విధంగా ఆ పరిశోధనలు చేస్తారట. ఇలాంటి చర్యలతో దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెబుతుంటే చెవుల్లో పూలు పెట్టుకొని తలాడిస్తే అంతకంటే దేశద్రోహం, నగుబాట్ల వ్యవహారం మరొకటి వుండదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టు వ్యతిరేక పెద్దలను వణికిస్తున్న ‘పిల్లల కోసం కమ్యూనిజం’

17 Monday Apr 2017

Posted by raomk in Current Affairs, Economics, Education, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Bini Adamczak, CAPITALISM, communism, Communism for Kids

Image result for Bini Adamczak

ఎం కోటేశ్వరరావు

యాభై సంవత్సరాల తరువాత ఇటీవల జపాన్‌లోని కొయోటో పట్టణంలో ఒక ప్రాంతాన్ని సందర్శించిన ఒక అమెరికన్‌ అక్కడి కమ్యూనిస్టులను చూసి రాసిన ఒక వ్యాఖ్యను ఇలా ముగించాడు.’ కమ్యూనిజం చావటానికి తిరస్కరించే ఒక వైరస్‌ వంటిది- చివరికది దారిద్య్రం నుంచి సంపదలవైపు పయనించిన దేశంలో కూడా వుందంటే మార్కెట్ల శక్తికి కృతజ్ఞతలు ‘ అన్నాడు. అంటే ప్రపంచంలో ఇటీవలి వరకు అమెరికా తరువాత అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వున్న జపాన్‌లో కూడా మ్యూనిస్టులు వుండటాన్ని జీర్ణించుకోలేక వెల్లడించిన వుక్రోషం అనుకోవాలి. వదిలేద్దాం ! గోడకు బంతిని ఎంత వేగంతో అంతే వేగంతో తిరిగి వస్తుందని తెలియని ఎందరో కమ్యూనిస్టు వ్యతిరేక మహానుభావులు. ప్రతి తరంలో పుట్టి కమ్యూనిజాన్ని నిలబెడుతున్నందుకు వారందరికీ వందనాలు. ఒక సారి పుట్టిన వ్యక్తి మరోసారి తల్లి గర్భంలోకి ప్రవేశించాలని కోరుకోవటమే ప్రకృతి విరుద్దం. అలాంటి కోరికలు వున్నవారికి అది ఎలా సాధ్యం కాదో కాలగతిని, చరిత్రను వెనక్కు తిప్పాలని చూసే వారికి కూడా అదే జరుగుతుంది. ప్రపంచంలో కమ్యూనిస్టు వ్యతిరేకులు అలాంటి కోవకు చెందిన వారే. హిరణ్యకశ్యపుడి కడుపులో ప్రహ్లాదుడు వుట్టినట్లే ప్రపంచవ్యాపితంగా సోషలిజాన్ని నాశనం చేశామని చెప్పుకున్న అమెరికా సామ్రాజ్యవాదులు తమ ఏలుబడిలో సోషలిజాన్ని అభిమానించేవారు పెరుగుతున్నట్లు గ్రహించలేకపోయారు.

గతేడాది నిర్వహించిన ఒక సర్వేలో 18-29 సంవత్సరాల మధ్య వయస్సు యువకులు 51శాతం మంది పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పగా 42శాతం అనుకూలతను వ్యక్తం చేశారు, 33శాతం సోషలిజానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. బ్రిటన్‌లో వీరిశాతం 36వరకు వుండగా సోషలిజాన్ని వ్యతిరేకించే వారు 32శాతం వున్నారని, కాపిటలిజాన్ని వ్యతిరేకించే వారు 39శాతం కాగా అనుకూలించే వారు 33 శాతమే వున్నారు. దీనంతటికీ కారణం పెట్టుబడిదారీ వైఫల్యాలను గ్రహిస్తున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరగటమే. ఒకసారి పెట్టుబడిదారీ విధానం పనికిరాదనుకున్న తరువాత దానికి ప్రత్యామ్నాయం వైపు చూడటం అవసరం. కమ్యూనిస్టులు గతంలో ఏవైనా పొరపాటు చేశారని భావిస్తే అలాంటివి జరగకుండా నూతన తరాలు జాగ్రత్తపడతాయని వేరే చెప్పనవసరం లేదు. లేదూ పెట్టుబడిదారీ విధానాన్ని నాశనం చేసి సమ సమాజాన్ని స్ధాపింపచేసే మరొక ప్రత్యామ్నాయం ఏదైనా వుంటే దాని వైపు మొగ్గుతారు తప్ప తిరిగి వెనక్కు పోరు.గత రెండువందల సంవత్సరాలలో పెట్టుబడిదారీ విధానం అనేక విజయాలు సాధించటంతో పాటు ఇంతకాలం తరువాత సమాజంలో అంతులేని అసమానతలను కూడా అదే తెచ్చిందన్న వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ప్రతివారూ దానిని సరిచేస్తామని చెప్పటమే తప్ప కమ్యూనిస్టులు తప్ప ఇతర పార్టీలేవీ చిత్తశుద్ధిని ప్రదర్శించటం లేదు.

చరిత్రలో పెట్టుబడిదారీ విధానానికి అనేక తీవ్ర ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ విధానాన్ని అవలంభిస్తున్న వారి మధ్య దోపిడీలో వాటాలు కుదరకనే ఇప్పటికీ రెండు ప్రపంచ యుద్ధాలు తెచ్చారు. వియత్నాం నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ వరకు ప్రపంచ అగ్రరాజ్యాలన్నీ ఏకమై దాడులు, దురాక్రమణలకు పాల్పడినా అవి చావు దెబ్బలు తిని తోకముడుస్తున్నాయి తప్ప మరొకటి కాదు. పెట్టుబడిదారీ విధానం పాఠాలు నేర్చుకున్నట్లే దాని కంటే వయసులో చిన్నది, అనుభవం కూడా పరిమితమే అయిన సోషలిస్టు వ్యవస్ధ, కమ్యూనిస్టు పార్టీలు కూడా పాఠాలు నేర్చుకొని దోపిడీ వ్యవస్ధను నిర్మూలించి సమసమాజాన్ని స్ధాపించేందుకు ముందుకు పోవటం అనివార్యం.

Image result for Bini Adamczak

బినీ ఆదామ్‌ జెక్‌

తన రాజ్యంలో హరి నామ స్మరణ వినిపించరాదని ప్రహ్లాదుడిని తండ్రి ఆజ్ఞాపించినట్లే తమ దేశంలో కమ్యూనిజం, సోషలిజం అనే పదాలకు తావు లేదని అమెరికా హిరణ్యకశ్యపులు చెబుతున్నారు. అలాంటి చోట బాలలకు సోషలిజం, కమ్యూనిజం పాఠాలు చెబుతుంటే కమ్యూనిస్టు వ్యతిరేకులు మిన్నకుంటారా ? కొద్ది వారాల క్రితం అమెరికాలోని ‘మిట్‌ ప్రెస్‌’ అనే ఒక ప్రముఖ ప్రచురణ సంస్ధ ‘కమ్యూనిజం ఫర్‌ కిడ్స్‌ ‘ పిల్లలకోసం కమ్యూనిజం అనే పుస్తకాన్ని ప్రచురించి మార్కెట్లో పెట్టింది. ఒకసారి ఏమైందంటే పెట్టుబడిదారీ విధాన దురవస్ధల నుంచి బయపడాలని జనం కోరుకున్నారు. మరి దాన్ని ఎలాసాధించారో తెలుసుకోవాలనుందా పిల్లలూ అన్నట్లుగా ఆ పుస్తకం మొదలౌతుంది. పిడుగులు మరి పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి అని అడుగుతారు కదా ! రాజకుమారి వంటి సోషలిజాన్ని సాధించటానికి ప్రయత్నించిన రాజకుమారుడిని దుష్ట పెట్టుబడిదారులు ఎన్నో కష్టాలు పెట్టటం, చివరికి ఎలా విజయం సాధించిందీ దానిలో వివరించిన తరువాత పిల్లలు ఆకర్షితులు కాకుండా వుంటారా ? వారికి అర్ధమయ్యే రీతిలో, భాషలో జర్మన్‌ భాషలో బినీ ఆదామ్‌ జెక్‌ అనే సామాజిక సిద్ధాంతవేత్త, చిత్రకారిణి కార్టూన్లతో సహా వివరిస్తూ రాసిన పుస్తకాన్ని అమెరికా సంస్ధ అనువాదం చేసి ఆంగ్లంలో ప్రచురించింది. దానిని అమెజాన్‌ సంస్ధ ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు గుండెలు బాదుకుంటూ పిల్లలకు కమ్యూనిజం పాఠాలు బోధించటమా అంటూ నానా యాగీ చేస్తున్నారు.

పెట్టుబడిదారీ విధానం మీద అసంతృప్తిని పెంచుకుంటున్న యువత సోషలిజం పట్ల సానుకూలత పెంచుకుంటూ చివరికి ఏ దారి పడుతుందో అని ఆందోళన పడుతున్న పాలకవర్గ శక్తులకు, కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఇటువంటి పుస్తకాలు ఎక్కడ మండాలో అక్కడ మండేట్లు చేస్తాయని వేరే చెప్పనవసరం లేదు. కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు కమ్యూనిస్టు ప్రణాళికను రచించేంత వరకు విజేతలే చరిత్రను రచించారు, వ్యాఖ్యానించారన్నది ఒక వాస్తవం. ఆ తరువాత చరిత్రను ప్రజాస్వామ్యీకరించటం, శాస్త్రీయ వ్యాఖ్యానం చేయటం ప్రారంభమైంది. ఇది పాలకవర్గానికి మింగుడు పడని వ్యవహారం. పెట్టుబడిదారీ విధాన సమర్ధకులు ఒక వ్యక్తి పెద్ద పెట్టుబడిదారు, గుత్త పెట్టుబడిదారుగా మారే క్రమంలో ఎన్నికష్టాలు పడిందీ చివరికి ఎంత పెద్ద ఆర్ధిక సామ్రాజ్యాన్ని స్ధాపించిందీ లొట్టలు వేసుకుంటూ చదివే విధంగా అనేక విజయ గాధలు రచించిన విషయం తెలిసిందే. కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడిదానా బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు అన్నట్లుగా పెట్టుబడిదారు విజయ గాధ వెనుక వున్న ఎందరివో కష్ట గాధలను ఈ పుస్తకంలో వివరించారని సమీక్షలను బట్టి వెల్లడైంది.

ఈ పుస్తక సమీక్షలలో ఒకదానికి పెట్టిన పెట్టిన పేరు ‘బ్రెయిన్‌ వాషింగ్‌ షాకర్‌’ అంటే బుద్ధి శుద్ధి చేసే ఘాతము అని అర్ధం. ఎవరైతే గతాన్ని గుర్తు పెట్టుకోలేరో అది పునరావృతం కావటానికి వారు దండనార్హులు అన్న అమెరికన్‌ రచయిత జార్జి శాంతాయన మాటల మాదిరి గత పొరపాట్లను ఎవరైతే ప్రేమిస్తారో అవి పునరావృతం కావటానికి వారు దండనార్హులు అని ఆ సమీక్షకుడు వ్యాఖ్యానించారు. మరొక సమీక్షకుడు ‘ఈ పిల్లల పుస్తక సిద్ధాంతమైన కమ్యూనిజం ఏదైతే వుందో అది అంత కఠినమైనది కాదు, కాకపోతే దానిని సరైన దారిలో అమలు జరపలేదు ‘ అని ఈ పుస్తకం చెబుతుంది. వావ్‌ ఇలాంటి మాటలను నేను గతంలో వినలేదు, అంటే మీరు చెప్పిన దానికర్ధం ఏమంటే వేడిగా వున్న స్టౌను నేను మరోసారి ముట్టుకుంటే నా చేతిని కాల్చకపోవచ్చు అనే కదా ? అని వుక్రోషం వెలిబుచ్చాడు. మరొక సమీక్షకుడు ఈ పుస్తకం ఆలోచనను నాశనం చేస్తుంది. ఇదొక కథల పుస్తకం దీనిలో మరోసారి ఈర్షాపరులైన రాజకుమార్తెలు, కత్తులు, భూముల నుంచి గెంటివేతకు గురైన రైతులు, దుష్ట యజమానులు, అలసిపోయిన కార్మికులు, వారి గురించి మాట్లాడే ఒక కుర్చీ, కుండ అనే రాజ్యం అన్నీ వున్నాయిందులో. పెట్టుబడిదారుల గురించి చెప్పాల్సి వస్తే లాభాల కోసం కార్యకలాపాలు నిర్వహించే సంస్ధ మిట్‌ ప్రెస్‌ దీనిని ప్రచురించింది.పోనీ ఈ పుస్తకాన్నేమైనా తక్కువ ధరకు అందించారా అంటే అదీ లేదు, అది మామూలుగా వసూలు చేసే 12.95 డాలర్ల కంటే తక్కువేమీ కాదు. ఇలా సాగుతూ తన పాండిత్యాన్ని ప్రదర్శించారనుకోండి. పుస్తకాన్ని ప్రచురించిన మిట్‌ ప్రెస్‌కు వుచిత సలహా కూడా ఇచ్చారు. పిల్లలకోసం కమ్యూనిజం అన్న పుస్తకం ప్రచురించి సొమ్ము చేసుకుంటున్న మీరు పిల్లల కోసం నాజీజం, 9-12 సంవత్సరాల వయస్సు వారిని సులభంగా వూచకోయట ఎలా ? వంటి పుస్తకాలనుకూడా ప్రచురించి సొమ్ము చేసుకోవచ్చు అని దెప్పిపొడిచారు. మరొక వ్యాఖ్యాత ఏమన్నాడో చూడండి. ‘కమ్యూనిస్టు మూల సూత్రాల గురించి ఏదైనా ఒక సినిమాలో ప్రస్తావించటంగానీ లేదా పాఠశాల సిలబస్‌లో చేర్చటంగానీ మనం ఎన్నడైనా చూశామా ఈ సైద్ధాంతిక పోరులో విజేతలం మనమే అని నిజంగా చెప్పుకోగలమా’ అంటూ మితవాదులకు ప్రశ్న వేశాడు. ఒక పుస్తకాన్ని కమ్యూనిస్టు వ్యతిరేకులు తిడుతున్నారంటే అది తప్పకుండా చదవాల్సిన పుస్తకమే అని అర్ధం చేసుకోవాలి. మరొక వ్యాఖ్యాత పుస్తక ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు అది అమెజాన్‌ కంపెనీ అగ్రశ్రేణి వంద పుస్తకాలలో స్ధానం సంపాదించటంలో విఫలమైంది అన్నాడు. కమ్యూనిజం మరియు సోషలిజం గురించి వెలువడిన నూతన పుస్తకాల విభాగంలో అదే అమెజాన్‌ కంపెనీలో ఈ పుస్తకం ప్రధమ స్ధానంలో వుంది. ఈ పుస్తక సమీక్ష పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేక పండితులు మరోసారి పాతపడిప పాచిపాటలనే పాడి బోరు కొట్టించారు తప్ప తాము సమర్ధించే పెట్టుబడిదారీ విధానం ఎలా గొప్పదో, ప్రస్తుతం అది ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి అదెప్పుడు బయటపడుతుందో ఒక్క ముక్కా చెప్పలేదు. మెరుగైన ప్రపంచం కోసం ఇప్పటికీ మనల్ని ముందుకు నడిపించేది వర్గపోరాటమే అనే సందేశంతో ఈ పుస్తకం ముగుస్తుంది.

ప్రపంచం నాశనమౌతున్న వర్తమానంలో ఆశించటానికి మరొక నూతన ప్రపంచమేదీ కనిపించని, నమ్మకంలేని స్ధితిలో ఈ పుస్తకం ఎంతో ప్రయోజనకారి, అవసరం అని మరికొన్ని సమీక్షలు వెలువడ్డాయి. రెండు వందల సంవత్సరాల పెట్టుబడిదారీ విధానం మనకు స్వేచ్చను తెచ్చిందా లేక భూమిపై మానవులు ఎన్నడూ ఎరగని అసమానతలను తెచ్చిందా అని కషనర్‌ అనే సమీక్షకుడు అమెరికా సమాజాన్ని ప్రశ్నించారు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ మానవుల విధిరాత కాదు, ఆడమ్‌చెక్‌ సాయంతో దానికి మించి ఆలోచించేందుకు ఈ పుస్తకం వుపకరిస్తుంది.స్వేచ్చకోసం మొదటి అడుగు వేసేందుకు ప్రాధమికంగా తోడ్పడుతుంది. కనీసం ఇతర ప్రపంచాల గురించి వూహించుకొనే స్వేచ్చ వైపు అడుగువేయిస్తుంది అని కూడా కషనర్‌ చెప్పారు. డ్యూక్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఫ్రెడరిక్‌ ఆర్‌ జేమ్సన్‌ తన సమీక్షలో ఈ పుస్తకాన్ని ఎంతగానో పొగిడారు. ‘మనోజ్ఞమైన ఈ చిన్ని పుస్తకం ఇప్పుడు మనం అనుభవిస్తున్న దాని కంటే జీవితం,జీవనంలో ఇతర పద్దతులు వున్నాయని చిన్నారులకు చూపటంలో తోడ్పడుతుంది. కొంత మంది పెద్దవారూ దీన్నుంచి నేర్చు కోవచ్చు. మన యువతరం కేవలం అసంతృప్తి చెందటమే కాదు, తమవైన నూతన ఆలోచనలతో నిజంగా పనిచేసే మంచి ప్రత్యామ్నాయం, రాజకీయ విద్య కోసం చురుకుగా అన్ని వైపులా చూస్తున్న తరుణమిది. ఈ పుస్తకం ద్వారా నూతన మార్గాలను తిరిగి కనుగొనవచ్చు.’ అన్నారు. నూటొక్క పేజీలున్న ఈ పుస్తకంలో పిల్లలకు అర్ధమయ్యే భాషలో కమ్యూనిజం అంటే ఏమిటి ? పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి ? పెట్టుబడిదారీ విధానం ఎలా వునికిలోకి వచ్చింది? పని అంటే ఏమిటి ? మార్కెట్‌ అంటే ఏమిటి ? సంక్షోభం అంటే ఏమిటి? ఏం చేయాలి అనే శీర్షికల కింద వివరణలు ఇచ్చారు. ఎరుపంటే భయం వున్న వారు ఈ పిల్లల పుస్తకం చదివైనా దానిని పొగొట్టుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Consumer price Index numbers for the month of February 2017

14 Tuesday Mar 2017

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

All India CPI, All India Inflation rates, All-India Consumer Price Index, Consumer price Index numbers of February 2017

 

The Central Statistics Office (CSO), Ministry of Statistics and Programme Implementation has revised the Base Year of the Consumer Price Index (CPI) from 2010=100 to 2012=100 with effect from the release of indices for the month of January 2015.

  1. In this press note, the CPI (Rural, Urban, Combined) on Base 2012=100 is being released for the month of February 2017. In addition to this, Consumer Food Price Index (CFPI) for all India Rural, Urban and Combined are also being released for February 2017. All India Inflation rates (on point to point basis i.e. current month over same month of last year, i.e., February 2017 over February 2016), based on General Indices and CFPIs are given as follows:

 

All India Inflation rates (%) based on CPI (General) and CFPI

Indices February 2017 (Prov.) January 2017 (Final) February 2016 (Final)
Rural Urban Combd. Rural Urban Combd. Rural Urban Combd.
CPI (General) 3.67 3.55 3.65 3.36 2.90 3.17 6.05 4.30 5.26
CFPI 2.08 1.87 2.01 1.14 -0.31 0.61 5.96 4.23 5.30

 

Notes: Prov.  – Provisional, Combd. – Combined

  1. 3.         Monthly changes in the General Indices and CFPIs are given below:

Monthly changes (%) in All India CPI (General) and CFPI: Feb. 2017 over Jan. 2017

Indices Rural Urban Combined
Index Value % Change Index Value % Change Index Value % Change
Feb.17 Jan.17 Feb.17 Jan.17 Feb.17 Jan.17
CPI (General) 132.6 132.4 0.15 128.2 127.8 0.31 130.6 130.3 0.23
CFPI 132.5 132.6 -0.08 130.6 130.6 0.00 131.8 131.9 -0.08

 

Note: Figures of February 2017 are provisional.

  1. 4.         Provisional indices for the month of February 2017 and also the final indices for January 2017 are being released with this note for all-India and for State/UTs. All-India provisional General (all-groups), Group and Sub-group level CPI and CFPI numbers for February 2017 for Rural, Urban and Combined are given in Annexure I. The inflation rates of important categories of items are given in Annexure II. State/UT wise provisional General CPI numbers for Rural, Urban and Combined are given in Annexure III. Inflation rates of major States, having population more than 50 lakhs as per population Census 2011, are given in Annexure IV. State/UT–wise Group CPIs are available on the Ministry’s website (mospi.gov.in).
  2. Price data are collected from selected towns by the Field Operations Division of NSSO and from selected villages by the Department of Posts. Price data are received through web portals, maintained by the National Informatics Centre.

Next date of release:  12th April 2017 (Wednesday) for March 2017.                    

Annexure I

All India Consumer Price Indices

(Base: 2012=100)

Group Code Sub-group Code Description Rural Urban Combined
Weights Jan. 17 Index
(Final)
Feb. 17 Index
(Prov.)
Weights Jan. 17 Index
(Final)
Feb. 17 Index
(Prov.)
Weights Jan. 17 Index
(Final)
Feb. 17 Index
(Prov.)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11) (12)
1.1.01 Cereals and products 12.35 133.1 133.3 6.59 132.2 132.8 9.67 132.8 133.1
1.1.02 Meat and fish 4.38 137.8 138.4 2.73 138.9 139.8 3.61 138.2 138.9
1.1.03 Egg 0.49 131.9 129.4 0.36 132.6 129.3 0.43 132.2 129.4
1.1.04 Milk and products 7.72 136.7 137.2 5.33 133.1 133.5 6.61 135.4 135.8
1.1.05 Oils and fats 4.21 122.0 122.1 2.81 114.0 114.3 3.56 119.1 119.2
1.1.06 Fruits 2.88 136.0 138.8 2.90 129.6 131.4 2.89 133.0 135.3
1.1.07 Vegetables 7.46 119.8 119.1 4.41 118.7 120.2 6.04 119.4 119.5
1.1.08 Pulses and products 2.95 161.7 157.0 1.73 155.1 143.1 2.38 159.5 152.3
1.1.09 Sugar and Confectionery 1.70 114.8 116.3 0.97 117.3 119.5 1.36 115.6 117.4
1.1.10 Spices 3.11 136.9 136.0 1.79 144.9 144.0 2.50 139.6 138.7
1.2.11 Non-alcoholic beverages 1.37 129.0 129.4 1.13 123.2 123.4 1.26 126.6 126.9
1.1.12 Prepared meals, snacks, sweets etc. 5.56 143.9 144.4 5.54 141.6 141.9 5.55 142.8 143.2
1   Food and beverages 54.18 133.7 133.7 36.29 132.0 132.1 45.86 133.1 133.1
2   Pan, tobacco and intoxicants 3.26 143.1 143.6 1.36 145.6 146.3 2.38 143.8 144.3
3.1.01 Clothing 6.32 140.7 140.9 4.72 130.2 130.5 5.58 136.6 136.8
3.1.02 Footwear 1.04 135.8 135.8 0.85 122.3 122.5 0.95 130.2 130.3
3   Clothing and footwear 7.36 140.0 140.2 5.57 129.0 129.3 6.53 135.6 135.9
4   Housing – – – 21.67 129.6 130.5 10.07 129.6 130.5
5   Fuel and light 7.94 132.1 133.2 5.58 118.0 119.2 6.84 126.8 127.9
6.1.01 Household goods and services 3.75 133.2 133.6 3.87 125.1 125.3 3.80 129.4 129.7
6.1.02 Health 6.83 129.9 130.1 4.81 122.6 122.9 5.89 127.1 127.4
6.1.03 Transport and communication 7.60 119.1 119.5 9.73 115.2 115.6 8.59 117.0 117.4
6.1.04 Recreation and amusement 1.37 127.0 127.7 2.04 122.0 122.2 1.68 124.2 124.6
6.1.05 Education 3.46 134.6 134.9 5.62 132.4 132.4 4.46 133.3 133.4
6.1.06 Personal care and effects 4.25 122.3 123.2 3.47 120.9 121.7 3.89 121.7 122.6
6   Miscellaneous 27.26 126.6 127.0 29.53 122.1 122.4 28.32 124.4 124.8
General Index (All Groups) 100.00 132.4 132.6 100.00 127.8 128.2 100.00 130.3 130.6
Consumer Food Price Index 47.25 132.6 132.5 29.62 130.6 130.6 39.06 131.9 131.8

 

Notes:

  1. Prov.        : Provisional.
  2. –               : CPI (Rural) for housing is not compiled.
  3. The weights are indicative to show relative importance of groups and sub-groups. However, all India indices have been compiled as weighted average of State indices.

Annexure II

All India annual inflation rates (%) for February 2017 (Provisional)

(Base: 2012=100)

Group Code Sub-group Code Description Rural Urban Combined
Feb. 16 Index
(Final)
Feb. 17

Index
(Prov.)

Inflation Rate
(%)
Feb. 16 Index
(Final)
Feb. 17

Index
(Prov.)

Inflation Rate
(%)
Feb. 16 Index
(Final)
Feb. 17

Index
(Prov.)

Inflation Rate
(%)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11) (12)
1.1.01 Cereals and products 127.1 133.3 4.88 124.8 132.8 6.41 126.4 133.1 5.30
1.1.02 Meat and fish 133.7 138.4 3.52 135.1 139.8 3.48 134.2 138.9 3.50
1.1.03 Egg 127.7 129.4 1.33 130.3 129.3 -0.77 128.7 129.4 0.54
1.1.04 Milk and products 130.7 137.2 4.97 129.6 133.5 3.01 130.3 135.8 4.22
1.1.05 Oils and fats 118.5 122.1 3.04 108.4 114.3 5.44 114.8 119.2 3.83
1.1.06 Fruits 130.4 138.8 6.44 118.6 131.4 10.79 124.9 135.3 8.33
1.1.07 Vegetables 130.9 119.1 -9.01 129.2 120.2 -6.97 130.3 119.5 -8.29
1.1.08 Pulses and products 162.8 157.0 -3.56 176.4 143.1 -18.88 167.4 152.3 -9.02
1.1.09 Sugar and Confectionery 98.7 116.3 17.83 99.1 119.5 20.59 98.8 117.4 18.83
1.1.10 Spices 130.6 136.0 4.13 139.7 144.0 3.08 133.6 138.7 3.82
1.2.11 Non-alcoholic beverages 124.8 129.4 3.69 120.6 123.4 2.32 123.0 126.9 3.17
1.1.12 Prepared meals, snacks, sweets etc. 136.4 144.4 5.87 135.2 141.9 4.96 135.8 143.2 5.45
1 Food and beverages 130.3 133.7 2.61 129.1 132.1 2.32 129.9 133.1 2.46
2 Pan, tobacco and intoxicants 134.4 143.6 6.85 140.0 146.3 4.50 135.9 144.3 6.18
3.1.01 Clothing 133.9 140.9 5.23 126.2 130.5 3.41 130.9 136.8 4.51
3.1.02 Footwear 129.8 135.8 4.62 120.1 122.5 2.00 125.8 130.3 3.58
3 Clothing and footwear 133.4 140.2 5.10 125.3 129.3 3.19 130.2 135.9 4.38
4 Housing – – – 124.4 130.5 4.90 124.4 130.5 4.90
5 Fuel and light 127.5 133.2 4.47 116.0 119.2 2.76 123.1 127.9 3.90
6.1.01 Household goods and services 127.1 133.6 5.11 121.8 125.3 2.87 124.6 129.7 4.09
6.1.02 Health 124.3 130.1 4.67 119.5 122.9 2.85 122.5 127.4 4.00
6.1.03 Transport and communication 113.9 119.5 4.92 109.1 115.6 5.96 111.4 117.4 5.39
6.1.04 Recreation and amusement 122.3 127.7 4.42 118.8 122.2 2.86 120.3 124.6 3.57
6.1.05 Education 127.1 134.9 6.14 126.3 132.4 4.83 126.6 133.4 5.37
6.1.06 Personal care and effects 116.8 123.2 5.48 116.2 121.7 4.73 116.6 122.6 5.15
6 Miscellaneous 120.9 127.0 5.05 117.2 122.4 4.44 119.1 124.8 4.79
General Index (All Groups) 127.9 132.6 3.67 123.8 128.2 3.55 126.0 130.6 3.65
Consumer Food Price Index 129.8 132.5 2.08 128.2 130.6 1.87 129.2 131.8 2.01                

 

Notes:

  1. Prov.       : Provisional.
  2. –               : CPI (Rural) for housing is not compiled.

 

 

Annexure III

State/UT wise General Consumer Price Indices

(Base: 2012=100)

State/UT Code Name of the State/UT Rural Urban Combined
Weights Jan. 17 Index
(Final)
Feb. 17 Index
(Prov.)
Weights Jan. 17 Index
(Final)
Feb. 17 Index
(Prov.)
Weights Jan. 17 Index
(Final)
Feb. 17 Index
(Prov.)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11)
01 Jammu & Kashmir 1.14 137.2 137.9 0.72 125.3 125.7 0.94 133.0 133.6
02 Himachal Pradesh 1.03 134.2 134.4 0.26 124.2 124.5 0.67 132.4 132.6
03 Punjab 3.31 128.4 129.0 3.09 125.7 126.0 3.21 127.2 127.7
04 Chandigarh 0.02 138.1 138.2 0.34 124.1 124.3 0.17 124.9 125.1
05 Uttarakhand 1.06 127.4 127.3 0.73 119.7 119.9 0.91 124.5 124.5
06 Haryana 3.30 130.6 131.3 3.35 123.8 124.2 3.32 127.4 128.0
07 Delhi 0.28 130.0 130.2 5.64 131.4 132.1 2.77 131.3 132.0
08 Rajasthan 6.63 134.4 135.1 4.23 129.8 129.8 5.51 132.8 133.2
09 Uttar Pradesh 14.83 129.3 128.8 9.54 127.8 127.9 12.37 128.8 128.5
10 Bihar 8.21 133.7 133.4 1.62 126.6 126.4 5.14 132.7 132.4
11 Sikkim 0.06 139.5 139.1 0.03 132.5 132.4 0.05 137.2 136.9
12 Arunachal Pradesh 0.14 138.4 139.4 0.06 — — 0.10 — —
13 Nagaland 0.14 142.5 142.0 0.12 129.1 129.3 0.13 136.8 136.6
14 Manipur 0.23 143.3 143.4 0.12 127.7 128.5 0.18 138.4 138.7
15 Mizoram 0.07 134.2 134.2 0.13 124.0 124.0 0.10 128.0 128.0
16 Tripura 0.35 138.6 139.2 0.14 132.7 132.7 0.25 137.1 137.5
17 Meghalaya 0.28 134.9 134.7 0.15 125.4 125.6 0.22 132.0 131.9
18 Assam 2.63 127.1 126.5 0.79 126.5 124.9 1.77 127.0 126.2
19 West Bengal 6.99 131.1 130.9 7.20 127.2 127.7 7.09 129.3 129.4
20 Jharkhand 1.96 135.6 134.8 1.39 125.4 124.4 1.69 131.7 130.8
21 Odisha 2.93 134.9 134.6 1.31 125.9 126.1 2.18 132.4 132.2
22 Chhattisgarh 1.68 135.5 135.0 1.22 125.5 125.4 1.46 131.6 131.3
23 Madhya Pradesh 4.93 128.5 128.3 3.97 126.9 126.7 4.48 127.8 127.6
24 Gujarat 4.54 134.1 135.1 6.82 123.5 123.6 5.60 128.1 128.6
25 Daman & Diu 0.02 151.8 153.9 0.02 127.3 128.4 0.02 141.5 143.2
26 Dadra & Nagar Haveli 0.02 132.2 133.5 0.04 125.0 125.2 0.03 127.4 128.0
27 Maharashtra 8.25 133.6 134.1 18.86 124.3 124.7 13.18 127.4 127.8
28 Andhra Pradesh 5.40 135.9 136.6 3.64 130.5 131.3 4.58 133.9 134.6
29 Karnataka 5.09 134.7 135.2 6.81 134.9 135.6 5.89 134.8 135.4
30 Goa 0.14 142.9 141.6 0.25 126.5 126.4 0.19 132.8 132.3
31 Lakshadweep 0.01 131.0 129.9 0.01 111.1 113.1 0.01 120.8 121.3
32 Kerala 5.50 132.0 133.8 3.46 132.3 133.3 4.55 132.1 133.6
33 Tamil Nadu 5.55 131.8 132.6 9.20 131.6 132.4 7.25 131.7 132.5
34 Puducherry 0.08 136.8 136.9 0.27 129.5 130.3 0.17 131.4 132.0
35 Andaman & Nicobar Islands 0.05 139.6 140.3 0.07 127.2 126.4 0.06 133.3 133.2
36 Telangana 3.16 135.7 135.6 4.41 129.9 130.7 3.74 132.5 132.9
99 All India 100.00 132.4 132.6 100.00 127.8 128.2 100.00 130.3 130.6

 

Notes:

  1. Prov.       :  Provisional.
  2. —             :  indicates the receipt of price schedules is less than 80% of allocated schedules and therefore indices are not compiled.

 

Annexure IV

Major State/UT wise annual inflation rates (%) for February 2017 (Provisional)

(Base: 2012=100)

State/UT Code Name of the State/UT Rural Urban Combined
Feb. 16 Index
(Final)
Feb. 17

Index
(Prov.)

Inflation Rate
(%)
Feb. 16 Index
(Final)
Feb. 17

Index
(Prov.)

Inflation Rate
(%)
Feb. 16 Index
(Final)
Feb. 17

Index
(Prov.)

Inflation Rate
(%)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11)
01 Jammu & Kashmir 126.6 137.9 8.93 121.1 125.7 3.80 124.7 133.6 7.14
02 Himachal Pradesh 126.5 134.4 6.25 117.8 124.5 5.69 124.9 132.6 6.16
03 Punjab 122.2 129.0 5.56 121.1 126.0 4.05 121.7 127.7 4.93
05 Uttarakhand 121.6 127.3 4.69 116.9 119.9 2.57 119.8 124.5 3.92
06 Haryana 123.9 131.3 5.97 120.2 124.2 3.33 122.2 128.0 4.75
07 Delhi 121.3 130.2 7.34 124.6 132.1 6.02 124.4 132.0 6.11
08 Rajasthan 128.9 135.1 4.81 124.1 129.8 4.59 127.2 133.2 4.72
09 Uttar Pradesh 126.0 128.8 2.22 123.5 127.9 3.56 125.1 128.5 2.72
10 Bihar 130.1 133.4 2.54 122.9 126.4 2.85 129.0 132.4 2.64
18 Assam 125.0 126.5 1.20 122.9 124.9 1.63 124.6 126.2 1.28
19 West Bengal 126.2 130.9 3.72 123.9 127.7 3.07 125.1 129.4 3.44
20 Jharkhand 129.5 134.8 4.09 121.5 124.4 2.39 126.4 130.8 3.48
21 Odisha 133.1 134.6 1.13 122.5 126.1 2.94 130.1 132.2 1.61
22 Chhattisgarh 135.8 135.0 -0.59 122.1 125.4 2.70 130.5 131.3 0.61
23 Madhya Pradesh 126.0 128.3 1.83 123.0 126.7 3.01 124.8 127.6 2.24
24 Gujarat 128.6 135.1 5.05 120.8 123.6 2.32 124.2 128.6 3.54
27 Maharashtra 127.2 134.1 5.42 120.7 124.7 3.31 122.9 127.8 3.99
28 Andhra Pradesh 132.4 136.6 3.17 127.3 131.3 3.14 130.5 134.6 3.14
29 Karnataka 132.1 135.2 2.35 130.3 135.6 4.07 131.1 135.4 3.28
32 Kerala 126.8 133.8 5.52 128.1 133.3 4.06 127.3 133.6 4.95
33 Tamil Nadu 128.5 132.6 3.19 127.4 132.4 3.92 127.9 132.5 3.60
36 Telangana 126.5 135.6 7.19 125.5 130.7 4.14 126.0 132.9 5.48
99 All India 127.9 132.6 3.67 123.8 128.2 3.55 126.0 130.6 3.65

 

Notes:  Prov.          :  Provisional.

 

 

 

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d