Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఆరఎసఎస్‌లో ఉన్నవారందరినీ దొంగలనటం లేదుగానీ దానిలో కూడా దొంగలు, నేరగాండ్లను కాపాడేవారు ఉన్నారని అయోధ్య రామాలయంలో హుండీ సొమ్ము, బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల దొంగతనం కేసులో వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.దేశం కోసంధర్మం కోసం కట్టుకున్న భార్యలను వదలివేయమని కూడా ఆరఎసఎస్ ఎక్కడా చెప్పలేదు, కానీ వివాహాన్ని దాచి, భార్యలను గాలికివదలివేసిన వారిని మాత్రం అది సమర్ధిస్తోంది, అందలాలెక్కిస్తోంది. ఆ సంస్థలో పనిచేసే వారి uండారం బయటపడుతుంటే గుడ్డిగా దాన్ని నమ్మినవారు గుండెలు బాదుకుంటున్నారు.ఎవరి లోగుట్టు అయినా ఇంతే, బయటపడటానికి సమయం రావాలి. అయోధ్య ఆలయకానుకల కుంభకోణం ఆ గుంపులో తలెత్తిన కుమ్ములాటల కారణంగానే బయటపడుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల నేపధ్యంలోఈ కుంభకోణాన్ని సాధ్యమైన మేరకు మÖసిపెట్టేందుకు, మరిన్ని వివరాలు వెల్లడిగాకుండా చూసేందుకు “పెద్దలు ” రంగంలోకి దిగారు. ఉదాహరణకు అయోధ్య ఆందోళనలో పేరుమోసిన వారిలో ఒకరైన మాజీ ఎంపీ వినయ్ కతియార్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన తరువాత సదరు పెద్దమనిషి నోరు కట్టేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అసలు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్ రామాలయ ఉద్యమంలో భాగస్వామి కాదని కతియార్ చెప్పారు.సిట్ ప్రాధమిక నివేదిక వెల్లడి కాగానే చంపక్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా “ నైతిక ” కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రామాలయ నిధులపై విమర్శలు వచ్చినపుడు అలాంటిదేమీ లేదని దబాయించి మాట్లాడిన పెద్దలు తీరా అనివార్యమైన సిట్ దర్యాప్తు తరువాత నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారు. నిజానికి ఆ నిబద్దత, నైతిక విలువలే ఉంటే సిట్ ఏర్పాటుకు ముందే రాజీనామా చేస్తే అదోతీరు ! హవాలా కేసులో ఆరోపణలు రాగానే అద్వానీ రాజీనామా చేశారు కదా ! మరింత ముదిరి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రంగా మారకుండా చూసుకొనేందుకు తప్పనిసరై రాముడి కానుకల స్వాహా మీద యోగి ఆదిత్యనాధ్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. జూన్ 14న అది రంగంలోకి దిగి 25వ తేదీ నాటికి ఎనిమిది మందిపై అభియోగం మోపి అరెస్టులు కూడా చేసింది. ఎంత వేగంగా పని చేసిందో చంద్రబాబు నాయుడు అండ్‌కో అర్ధం చేసుకోవాలి.


నిందితులంతా ఎవరంటే అందరూ రకరకాల పేర్లతో ఉన్న కాషాయ గుంపులో వారే. క్లుప్తంగా ఎవరేమిటో చూద్దాం. రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, ఇతగాడు ఒక సాధారణ టెంపో డ్రైవర్, రామాలయ నిర్మాణ ప్రారంభంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్ కారు డ్రైవర్‌గా చేరాడు, తరువాత ట్రస్ట్ ఉద్యోగిగా, కీలకమైన బాధ్యతలో ఉన్నాడు. ఇతగాడి మేనల్లుడు మనీష్ యాదవ్, ఇతడి దగ్గర డబ్బు దొరికిందని పోలీసులు చెప్పారు. అనుకల్ప మిశ్రా, ట్రస్టు విరాళాల లెక్కలు, నిర్వహణలో కీలక పాత్రధారి, ఇతని బావమరిది లవకుశ్ మిశ్రా, కానుకలు, విలువైన వస్తురూప కానుకల పర్యవేక్షకుడు.అవినాష్ శుక్లా హుండీ లెక్కింపులో భాగస్వామి, మరోముగ్గురు హుండీ లెక్కింపులో భాగస్వాములు.కానుకల అపహరణ ఆరోపణలు వచ్చినపుడు అబ్బే అలాంటిదేమీ లేదంటూ అనేక మంది మÖసిపెట్టేందుకు చూశారు.ఇప్పుడు అరెస్టయిన నిందితుల వెనుక ఉన్న అసలైన పెద్దలు బయటకు వచ్చే అవకాశం లేదని సిట్ దర్యాప్తుకు ముందే అనుమానాలు వ్యక్తం చేశారు. అదే జరిగింది.


అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణ అంశంలో బిజెపిని లక్ష్యంగా చేసుకొని సమాజవాది పార్టీ, కాంగ్రెస్ 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ప్రయోజనాలకోసం వినియోగించుకొనేందుకు చూస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) అంతర్జాతీయ అధ్యక్షుడు, బిజెపి నేత, ఢిల్లీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అలోక్ కుమార్ ఆరోపించారు. ఆరఎసఎస్ ఏర్పాటు చేసిన అనేక సంస్థలలో విహెచ్‌పి ఒకటి.నిజానికి జూన్ ఏడవ తేదీన సమాజవాది పార్టీకి చెందిన మాజీ మంత్రి పవన్ పాండే ఐదు నుంచి ఏడున్నర కోట్ల రూపాయల మేర రామాలయ నిధులను అపహరించినట్లు ఆరోపించారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉందని, న్యాయ విచారణ జరిపించాలని సమాజవాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ స్పందించారు.రామ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అక్రమాలకు పాల్పడలేదని, దొంగతనం జరిగినట్లు ఎలాంటి అధారాలు లేవని అలోక్ కుమార్‌తోసిపుచ్చారు. చంపత్ రాయ్ విహెచ్‌పి ఉపాధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నందున ఇంతకు మించి ఆ సంస్థ నేతల నుంచి వేరుగా ఊహించలేము. ఈ అంశంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ బిజెపి నేత డాక్టర్ రజనీష్ సింగ్ జూన్ 9న ప్రధాన మంత్రికి ఒక లేఖ రాశారు. ఒక నివేదిక సమర్పించాలని ప్రధాని కార్యాలయం సదరు ట్రస్ట్‌ను కోరింది.తప్పనిసరి పరిస్థితిలో జూన14న యోగి ఆదిత్యనాధ్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఆరు రోజుల విచారణ తరువాత దాదాపు 150 మంది అనుమానితులను గుర్తించినట్లు , వారిలో 25 మంది మీద చర్యలుంటాయని మీడియాకు సమాచారం అందింది.అనుమానితులుగా ఉన్నవారెవరూ అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని సిట్ ఆదేశాలు జారీ చేసింది.కొందరు కనిపించకుండా తప్పుకున్నారని వార్తలు. భక్తులు ఇచ్చిన కానుకలు, భూమికొనుగోలు లావాదేవీలు, బ్యాంకు ఖాతాలలో కనుగొన్న అంశాల గురించి ముఖ్యమంత్రికి ప్రాధమిక నివేదికను అందచేశారు. హుండీ విరాళాలను లెక్కించే ఐదుగురు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు రెండు కోట్ల రూపాయలను, కొంత బంగారాన్ని సిట్ స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.ఒక సారి కాదు హుండీల నుంచి పదే పదే సొమ్ముకొట్టేసినట్లు విచారణలో తేలింది. అయినా ట్రస్ట్ పెద్దలు మౌనంగా ఉన్నారంటే వారి పాత్ర లేకపోతే అలా జరుగుతుందా !


సిట్ ఏర్పాటకు ముందు జరిగిన పరిణామాలను చూద్దాం. రాముడి నిధులను అపహరించటమేగాక ఆ విషయాన్ని మÖసిపెట్టేందుకు చూశారని కర్నీ సేన జాతీయ అధ్యక్షుడు సూరజ్ పాల్ అమ్ము చెప్పారు. ట్రస్ట్ ప్రముఖులు గోపాల్ రాయ్,అనిల్ మిశ్రా, టిను యాదవ్, లవకుష్ మిశ్రా పేర్లు బయటకు వచ్చినప్పటికీ ఎవరి మీద కేసు దాఖలు చేయలేదన్నారు.ఒక సాధారణ వ్యక్తి పర్సును దొంగిలిస్తే పోలీసులు వెంటనే పేదలను నిర్బంధించి ప్రశ్నిస్తారని, అంతర్జాతీయంగా ఖ్యాతి ఉన్న రామాలయం విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోకపోవటం కొత్త ప్రశ్నలను ముందుకు తెస్తోందన్నారు. ఎవరి మీదా కేసు దాఖలు చేయకుండా దర్యాప్తు ఎలా చేస్తారని జ్యోతిష్ పీఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. ఆ చర్యకు చట్టబద్దత ఎలా ఉంటుందన్నారు.నిజాలను వెలికి తీసేందుకు గాక మÖసిపెట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. రామాలయ ట్రస్ట్ ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఇంతవరకు ఏ ఒక్కటి రుజువు కాలేదని కొందరు విహెచ్‌పినేతలు వాదిస్తున్నారు. తొలిసారిగా ప్రధాని కార్యాలయం ఎందుకు స్పందించాల్సి వచ్చిందో వారు మాట్లడరు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నిజానిజాలను బయటపెడుతుందా ? తిమింగలాలను వదలి పిత్తపరిగలను పట్టుకొని గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా మÖసివేస్తుందా ? నిజాయితీతో నిజానిజాలు బయటపెట్టినా, పెట్టకున్నా వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం ఒక ప్రచార అస్త్రంగా మారటం ఖాయం. రామజన్మ భూమి తీర్దక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఆరఎసఎస్ ప్రచారక్, విశ్వహిందూపరిషత్‌తో సంబంధాలు కలిగిన చంపత్ రాయ్ ఉన్నారు. అతగాడి వ్యవహారశైలి గురించి ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. రామాలయం కోసం ఆందోళన చేసిన వారిలో అనేక మందిని ఆలయ నిర్మాణం, ట్రస్ట్ వ్యవహారాల్లో పక్కన పెట్టారన్నది ప్రధాన విమర్శ. ట్రస్ట్ అధ్యక్షుడిగా మహంత్ నిత్యగోపాల్ దాస్ ఉన్నప్పటికీ వృద్దాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నందున రాయ్ పెత్తనమే నడుస్తున్నదని చెబుతారు. మిగిలిన సభ్యులు రాయ్ పలుకుబడి కారణంగా నామమాత్రంగా ఉండిపోతున్నారన్నది విమర్శకుల మాట.


రామాలయ ఆందోళన ప్రముఖుల్లో వినయ్ కతియార్ ఒకరు.సంతోష్ దూబే, మహంత్ కమల్ నయన్ దాస్ వంటి వారు ఇప్పుడు ట్రస్ట్ వ్యవహారాలను ప్రశ్నిస్తున్నారు.అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తరువాత గొంతు విప్పారు. అయితే పెద్దలు జోక్యం చేసుకొని వినయ్ కతియార్ నోరు మÖయించారు.పరువు కాపాడుకొనేందుకు సిట్ విచారణ తతంగంలో ఎలాంటి పొరపాట్లు లేవని లేదా ఏవైనా దొరికితే ఇతరులను ఇరికించి నేతలుగా ఉన్నవారికి సంబంధం లేదని నివేదికలు వెలువడవచ్చని, తరువాత వారిని ట్రస్ట్ నుంచి తొలగిస్తారని వార్తలు వచ్చాయి. కేవలం నీళ్ల నుంచి పాలను వేరు చేయాలని కాదు, బంగారాన్నుంచి పసిడిని, వెండి నుంచి వెండిని ఎలా వేరు చేశారో తేల్చాలని జనం కోరుతున్నారని సమాజవాదీ నేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.కానుకల చోరీ ఆరోపణలు హిందువుల విశ్వాసలకే దెబ్బ అని అయోధ్యలోని రాసిక్ పీఠాధీశ్వర్ మహంత్ జనమేజయ శరణ్ మహరాజ్ వర్ణించారు. ఊహించటానికే సాధ్యం కావటం లేదన్నారు. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా సందర్భంగా 66 రోజుల పాటు ఐదు కోట్ల మంది భక్తులు అయోధ్య రామాýయాన్ని సందర్శించారని ఆ సందర్భంగా వచ్చిన విరాళాల మొత్తం కేవలం వంద కోట్ల రూపాయýకు లోపే హుండీల్లో ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదని భావిస్తున్నారు.దేవాలయాల నిర్వహణ ప్రభుత్వం నుంచి వేరు చేసి మత సంస్థలకు అప్పగించాలని హిందూత్వశక్తులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయోధ్య రామాలయ నిర్వహణలో అధికారులకు ప్రమేయం లేదు, కేవలం ట్రస్టు మాత్రమే అన్ని వ్యహరారాలను చూస్తున్నది. కానుకల అపహరణ అంశం వెలుగులోకి వచ్చిన తరువాత ఈ ఆలయానికి ఒక అధికారిని సిఇఓగా నియమించాలని యోగి సర్కార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దేవాలయాల నిర్వహణలో ట్రస్టులు, మత సంస్థలకు తప్ప అధికారగణం, ప్రభుత్వ ప్రమేయం ఉండరాదని సనాతన, హిందూత్వశక్తులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ పాలనలో అధికార యంత్రాంగానికి అప్పగిస్తే పాపం వారేం అవుతారో తెలియదు.


రామాలయానికి బంగారం, వెండి, రత్నాలు,ఇతర విలువైన రాళ్లతో తయారు చేసి భక్తులు బహుకరించిన 1,250 పవిత్ర ఇటుకలు కనిపించటం లేదని ధర్మసేన సంస్థ స్థాపకుడు సంతోష్ దూబే చెప్పారు. పట్టణాలు, గ్రామాలలో వాటిని పూజించి 1989లో అయోధ్యకు చేర్చారని అన్నారు.అవి 2002వరకు కరసేవ పురంలో ఉన్నాయని, ఇప్పుడు కనిపించటం లేదని, వాటిని రక్షించాల్సిన బాధ్యత రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్‌దేనని దూబే చెప్పారు. చిత్రం ఏమిటంటే ఒకవైపు చంపత్ రాయ్‌ను సమర్ధిస్తూనే రామాలయం పేరుతో విరాళాలు వసూలు చేసిన రామాలయ ట్రస్ట్, రామజన్మభూమి మందిర్ పునర్‌నిర్మాణ ట్రస్టులు చేసిన విరాళాలు, బంగారం సేకరణ వ్యవహారాలపై కూడా దర్యాప్తు జరపాలని హరిద్వార్‌లో రెండు రోజుల పాటు సమావేశమైన విశ్వహిందూపరిషత్ కేంద్ర సలహామండలి సమావేశం డిమాండ్ చేdంది.నాటి ప్రధాని పివి నరసింహారావు మార్గదర్శనలో 1995లో రామాలయ ట్రస్ట్ ఏర్పాటైంది. తరువాత బిజెపి నేతలతో మరో ట్రస్ట్ ఏర్పడింది.బాబరీ మసీదు వివాదాస్పదం కావటానికి కారకుడు ధరమ్‌దాస్, 1949లో రాముడి విగ్రహాన్ని మసీదులో పెట్టి వివాదాన్ని కొత్త మలుపు తిప్పాడని చెబుతారు. ఇప్పుడు ఆ పెద్దమనిషి రామాలయంలో జరిగిన చోరీతో సాధువులందరూ దిగ్భ్రాంతి చెందారని అన్నారు.దాస్ లక్ష్యం నరేంద్రమోడీ సర్కార్ 2020లో ఏర్పాటు చేసిన ట్రస్ట్ పాలకవర్గం మీదనే. ట్రస్ట్ అంటే విశ్వాసం, ఇప్పుడు అది లేదు, అక్కడ ఉన్నవారందరూ దొంగతనంలో భాగస్వాములే కనుక ట్రస్ట్‌ను రద్దు చేయాలన్నారు. అన్ని దేవాలయాలను కబ్జా చేసేందుకు విశ్వహిందూపరిషత్ చూస్తోందని కూడా అన్నారు. ట్రస్ట్ సభ్యుడైన గోపాల్‌రావు ఆరఎసఎస్ నేత, అతగాడిని ఉద్దేశించి దొంగలు ట్రస్ట్ వ్యవహారాలను తమ చేతుల్లోకి తీసుకున్నారని విమర్శించిన వినయ్ కతియార్‌తో మోడీ మాట్లాడిన తరువాత స్వరాన్ని తగ్గించి ట్రస్ట్‌లో ఉన్నవారు పర్యవసానాలను భరిస్తారంటూ మాట్లాడారు. ఫైజాబాద్ జిల్లా(అయోధ్య అక్కడే ఉంది) విహెచ్‌పి మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ చంపత్ రాయ్ మోసగాడు కాదు గానీ తన అనుచరులుగా పెద్ద మోసగాండ్లనే ఎల్లవేళలా ఎంచుకుంటారని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.కాషాయ గుంపు కుమ్ములాటలకు అతీతం కాదు. ఒక నాడు విశ్వహిందూపరిషత్ అగ్రనేతగా ఉన్న ప్రవీణ్ తొగాడియా ప్రధాని నరేంద్రమోడీ విమర్శకులలో ప్రముఖుడు,ఆ కారణంగానే ఏకంగా 2018లో ఆ సంస్థ నుంచి పంపివేశారు. రామాలయ ఆందోళనలో భాగస్వాములైన అనేక మందిని మసీదు కూల్చివేసిన తరువాత పక్కకు పెట్టి ఆరఎసఎస్ ప్రముఖులు రంగంలోకి వచ్చినట్లు అనేక విమర్శలు ఉన్నాయి. నరేంద్రమోడీ జీవిత చరిత్రను రాసిన మధు పూర్ణిమా కిష్వర్, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మోడీ ఏలుబడిలో కొందరు మహిళలకు మంత్రిపదవులు, ఎంపీలు ఎలా అయ్యారో వెల్లడిస్తున్నారు. వారికి పదవులు రాని కారణంగా ఆరోపణలు చేస్తున్నట్లు బిజెపి నేతలు కొట్టి పారవేస్తారు.ఏ పార్టీలో జరిగేదైనా అదే, అధికార పంపకాల్లో తేడాలు వస్తేనే కదా నిజాలు వెల్లడయ్యేది,గతంలో కాంగ్రెస్‌లో, ఇతర కొన్ని ప్రాంతీయ పార్టీల్లో జరిగిందే ఇప్పుడు బిజెపిలో, దాని మాతృసంస్థ సంఘపరివార్‌లో మొదలైంది, కాదంటారా !